లూకా సువార్త,, 21వ అధ్యాయము, 17వ వచనము. (17) నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషించు బడుదురు. భగవంతుడు లేక దేవుని కుమారుడు తెల్పిన జ్ఞానము సాతాను అవహించి ఉన్న ప్రజలందరికీ వ్యతిరేఖముగా ఉండును. సాధారణ ప్రజలకు అర్థముగాక చెప్పెడి జ్ఞానము అపార్థమగు అవకాశము గలదు. అంతో ఇంతో జ్ఞానులయి బోధకులుగానున్న గురువులవలె చలామణి అగువారికి పూర్తి వ్యతిరేఖతగా కనిపించును. దేవుని నామమును బోధించువారి యొక్క వాక్యములు దేశములోని పండితులకు, బోధకులగు గురువులకు సరిపడవు. వారికి దేవుని వాక్యములన్నీ వ్యతిరేఖముగా కనిపించుట వలన వారును, వారిని అనుసరించు మనుషులును దైవమార్గమును బోధించు వారిని ద్వేషించుటకు మొదలు పెట్టుదురు. అందువలననే పై వాక్యములో దేవుడు “నా నామము నిమిత్తము మనుషుల చేత ద్వేషింపబడుదురన్నాడు.” -------------------- మార్కు సువార్త, 8వ అధ్యాయము, 38వ వచనము. (38) నన్ను గూర్చియు, నా మాటను గూర్చియు సిగ్గపడు వాడెవడో వానిని గూర్చి మెనుష్య కుమారుడు తని తండ్రి మహిమగలవాడై ఏచ్చెనప్పుడు సిగ్గుపడును. కొందరు నమాజములో జ్ఞానమును తెలుసుకొనుచూ తాను అలా తెలుసుకోవడము ఎవరికీ తెలియకూడదనుకుంటారు. జ్ఞానము తెలుసు కోవడము ఏదో తప్...