pss book:9 books draft as linst cloud ocr


List:సమాధి
పునర్జన్మ రహస్యం
963
ఖుర్ఆన్-హదీసు
కలియుగము
స్వర్గము నరకము
మాదిలోచనం నీది ఆలోచన
దైవ గ్రంథంలో సత్య అసత్య విచక్షణ
ప్రతిమ విగ్రహ



Page 1
Imo
సమాధి
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
కాల
కర్మ
గుణ
ఇందూ
- బ్రహ్మనాడి
జ్ఞాని
చక్రం
చక్రం
చక్రం
చక్రం
వేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞాన వేదిక (Regd.No. : 168/2004)
ప్రథమ ముద్రణ : సం॥ 2011
1

Page 2
సమాధి
సమాధి అను పదము చాలా కాలమునుండి ప్రచారములో ఉండినా, ఆ పదము కాలగమనములో రూపాంతము
పొందినదని తెలియుచున్నది. నేడు సమాధి అని పలకబడు పదము మొదట సమాదిగా ఉండేది. మొదట సమాది
చివరకు కాలగమనములో సమాధిగా మారి పోయినా, సమాదికి మరియు సమాధికి వేరు అర్థములున్నా, ప్రజలందరికీ
తెలిసిన అర్థము ఒకటి గలదు. అది ఏమనగా, మనిషి చనిపోయిన తర్వాత మృతదేహమును భూమిలో పూడ్చిపెట్టడమును
సమాధి అంటున్నారు. ఈ భావమును అనుసరించి కొన్ని మతములలో, చనిపోయిన మనుషులను ప్రళయ కాలములో
దేవుడు తిరిగి సమాధులనుండి లేపుతాడనీ, అప్పుడు వారు చేసుకొన్న పాపపుణ్యములను విచారించి పాపమునకు
తగినట్లు నరకమునకు, పుణ్యమునకు తగినట్లు స్వర్గమునకు పంపుననీ చెప్పుకోవడము జరుగుచున్నది. హిందూమతములో
కూడా స్వర్గనరకములున్నవని చెప్పినా, మనిషి చనిపోయిన వెంటనే స్వర్గ నరకములకు పోవుననీ, తర్వాత అవి
అయిపోయిన వెంటనే తిరిగి పుట్టుననీ చెప్పుకోవడము జరుగుచున్నది. మొత్తానికి అన్ని మతములవారూ స్వర్గ నరక
లోకములున్నవని నమ్ము చున్నారు. చనిపోయిన శరీరమును సమాధి చేయడము అనునది అన్ని మతములలోనూ
గలదు. స్వర్గ నరకములు మనిషియొక్క నమ్మకమేగానీ చూచివచ్చి చెప్పిన వాడు ఎవడూ లేడు. కానీ సమాధి అనునది
చనిపోయిన మనిషిని పూడ్చిపెట్టు జాగా అని ప్రత్యక్షముగా అందరికీ తెలుసు. స్వర్గ నరకములు కేవలము నమ్మకము
మాత్రమేకాగా, సమాధి మాత్రము ప్రత్యక్ష సత్యము.
ప్రజల మనోభావములో సమాధి ఒక పవిత్ర భావముతోనే ఉన్నది. ఒక గొప్ప వ్యక్తి మృత దేహమును
కాల్చినా, కాల్చిన బూడిదను సముద్రములో కలిపినా, కాల్చిన చోట ఆ వ్యక్తియొక్క జ్ఞాపకార్థము ఒక సమాధిని
నిర్మించి, ఇది ఫలానా వ్యక్తి సమాధి అని చెప్పుకోవడము జరుగు చున్నది. ఇస్లామ్ మతములో ఒక తెగవారు
దైవమార్గములో నడచిన గొప్ప వ్యక్తుల సమాధులకు దర్గాలని పేరు పెట్టి గౌరవముగా ఆరాధించడము జరుగుచున్నది.
అలాగే హిందూమతములో కూడా కొందరి సమాధులను గొప్పగా భావించి పూజించడమూ జరుగుచున్నది. కొందరైతే
తమ కుటుంబములోని వ్యక్తుల సమాధులను సంవత్సరమునకొకమారు పూజించడము జరగుచున్నది. ఈ విధముగా
మనుషులలో సమాధి అనునది గొప్ప భావముతోనే ఉన్నదని చెప్పవచ్చును. కొన్ని చోట్లయితే సమాధి మనుషుల
లెక్కలో పుణ్యక్షేత్రముగా, పూజ్య స్థలముగా మారిపోయినవి గలవు. సమాధులు మనుషుల లెక్కలో గొప్ప భావముతో
ఉండిన విషయమును దృష్టిలో పెట్టుకొని, కొందరు రాజులు వారి మృతదేహములకు సమాధులు కట్టునట్లు చనిపోకముందే
ఏర్పాటు చేసుకొని సమాధి కట్టించుకొనినా, అవి గుర్తింపులేకుండా మిగిలిపోయినవి ఎన్నో గలవు. కొన్ని గుర్తింపుగా
మిగిలిపోయినవీ గలవు. తాజ్మహల్ గుర్తింపు పొందిన సమాధిగా మిగిలి పోయిన విషయము అందరికీ తెలుసు. ఈ
విధముగా ప్రజల మనో భావముల మీద ఎంతో గట్టి ముద్రవేసుకొన్న సమాధి యొక్క సమాచారమును పూర్తి విప్పి
చూస్తే ఇలా గలదు.
సమాధి అనగా అందరికీ సమముగా వర్తించునది అని అర్థము. ఈ అర్థము కొత్తగా కనిపించినా ఇదియే
వాస్తవమైన అర్థము. కొందరు సమాధి అను దానికి అర్థము ఇలా చెప్పారు. ధీ అనగా బుద్ధియనీ, సమ+ధి = సమాధి
యని, బుద్ధికి సమానముగా ఉన్నదని చెప్పారు. ఇది చెప్పుకోవడానికి బాగుంది. కానీ ఆ అర్థము ఏ విషయములో
వర్తిస్తుందో, బుద్ధికి సమానముగా ఉన్నది ఏదో, అది బ్రతికి ఉన్నపుడా? చచ్చి పోయినపుడా? అను ప్రశ్నలు రాగలవు.
చచ్చిపోయిన వానికి బుద్ధి ఎటూ ఉండదు. బ్రతికి ఉన్నవానికి సమాధితో పనిలేదు, వాడు దానిని పొందడు. సమాధి
చనిపోయిన వానికే అవసరమైనపుడు, వాని బుద్ధిని గురించి చెప్పుకోవలసిన అవసరమూ లేదు. ఎందుకనగా చనిపోయిన
2

Page 3
వానికి బుద్ధి ఉండదు. ఈ విధముగా యోచిస్తే సమమైన బుద్ధి అను అర్థము తప్పు అని తెలియుచున్నది. ఎవరు ఏ
అర్థమును చెప్పినా అది ఆధ్యాత్మిక విద్యకు సరిపోదు. అందువలన అందరికీ సమముగా అమలు జరుగునది లేక
అందరికీ సమానముగా వర్తించునను అర్థము ఆధ్యాత్మికమునకూ, ప్రత్యక్ష అనుభవమునకూ సరిపోవును. నేడు సమాధి
అను పలుకబడు పదము పూర్వము సమ+ఆది, సమాది గా ఉండేది. ది కి క్రింద పొక్కిలి లేదు. ఆది అనగా
మొదటిలో లేక సృష్ఠి మొదటిలో అని అర్థము. సమ అనగా అందరికి తెలిసిన అర్థమే, సమాది అనగా సృష్ఠి మొదటినుండి
అందరికి సమముగా ఉన్నదని లేక వర్తించుచున్నదని అర్థము. ఇక్కడ విశేషమేమనగా సృష్టి ఆదినుండి అనుటలో సృష్ఠి
ప్రారంభముమైన తర్వాత అందరికి మొదటి నుండి సమాది ఉన్నదని తెలియుచున్నది. ఆదినుండి సమముగా ఉన్నది
కావున, ఈ సమాది మొదటినుండి మొదలైనదని తెలియుచున్నది. జీవుని మొదటి పునర్జన్మలోనే సమాది కలదు.
మనిషి చనిపోయిన తర్వాత ఏర్పడునది సమాది కాదు. మనిషి చనిపోయినపుడు సమాది అనునది అందరికీ సమముగా
వర్తించదు. ఈ మాటలు వినే మీకు ఇదంతా క్రొత్తగానే కనిపించును. కొందరు మా మాటలను ఏమాత్రము నమ్మరు.
కొందరు అన్వేషకులుగా ఉన్నవారు పరిశోధనా బుద్ధితో యోచించుదురు. అట్లు యోచించువారికి తప్పకుండా సత్యము
తెలియును. ఒక మనిషి చనిపోయినపుడు అతని శరీరమును భూమిలో పూడ్చిపెట్టినా, దానిని అర్థము ప్రకారము
సమాధి అనిగానీ, సమాది అనిగానీ అనుటకు వీలులేదు. ఈ అర్థములు పూడ్చబడిన గుంతలకుగానీ, కట్టబడిన
గోరీలకుగానీ వర్తించవు.
అన్ని మతములలోను సమాధి అను పదముండినా, ప్రవక్తలందరూ ఎంతో గొప్ప భావముతో చెప్పినా, దానిని
ఏ మతస్థులూ సరిగా అర్థము చేసుకోలేదని చెప్పుచున్నాము. మాకందరికి అర్థము కానీదీ, మాకంటే మించిన
జ్ఞానపండితులకందరికీ అర్థము కానిదీ, నీకొక్కనికే అర్థమైనదా అని ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చును. దానికి మా
సమాధానము ఏమనగా? ఏది నిజమైన జ్ఞానము, ఎవరిది నిజమైన జ్ఞానము అను ప్రశ్నకు జవాబుగా, ఎక్కడైతే ప్రశ్న
మిగిలిపోయి జవాబు లేకుండా పోవుచున్నదో అది నిజమైన జ్ఞానము కాదు. ఎక్కడైతే ప్రశ్న మిగలకుండా సర్వత్రా
జవాబు ఉన్నదో, ఎక్కడైతే ఎవరూ ఎదురు ప్రశ్నించని జ్ఞానమున్నదో, అదియే నిజమైన దేవుని జ్ఞానమని చెప్పవచ్చును.
నేను చెప్పిన సమాధి విషయములో గానీ, ప్రవక్తలు చెప్పిన సమాది వివరములోగానీ ఎక్కడా ప్రశ్నలు మిగలవు.
అందువలన ఇక్కడ మేము చెప్పు జ్ఞానము నిజమైన దైవజ్ఞానమనీ, అదియే నిజమైన ధర్మమనీ తెలుపుచున్నాము.
ఇతరులు చెప్పు సమాధి విషయములో చివరకు ప్రశ్నలు మిగిలి సమాధానము లేకుండా పోవుచున్నది. అందువలన
అది సూత్రము ప్రకారము నిజమైన దైవజ్ఞానము కాదని చెప్పవచ్చును. అన్ని మతముల గ్రంథములలో కూడా మేము
చెప్పిన విషయమునే నూటికి నూరుపాళ్ళు ప్రవక్తలందరూ చెప్పారు.
అయితే ఒకేవొక్క పొరపాటు జరిగినది, మనిషి మాయ వశమైపోయి దేవుడు చెప్పిన దానిని తప్పుగా అర్థము
చేసుకొన్నాడు. అదియే మనిషి చేసిన పెద్దపొరపాటు. ఆ పొరపాటుతోనే దేవుని ధర్మము మనుషుల మధ్యలో అధర్మముగా
మారిపోయి ప్రచారమైనది. ఊరంతా ఉత్తరమంటే ఒక్కడు మాత్రము దక్షిణమన్నట్లు మనుషులైన అందరూ మరణము
జరిగినపుడు సమాధి అంటే, మేము మాత్రము అది సత్యమే కాదు, మనిషి జన్మించినపుడే సమాది అంటున్నాము.
ఎవరూ చెప్పని దానిని దేవుడు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారనుచూ, నీవు ఒక్కనివే విరుద్ధముగా ఎందుకు మాట్లాడుచున్నావు?
అని నన్ను ఎవరైనా ప్రశ్నించివచ్చును. దానికి ధైర్యముగా మేము ఒకే జవాబును చెప్పుచున్నాము. ఏది సత్యమో
3

Page 4
దానినే మేము చెప్పుచున్నాము. అసత్యమును లోకములో ఉండిన వారందరూ సత్యమే అనినా అది సత్యముకాదు.
దానిని నేను ఒప్పుకోను. అంతేకాక దేవుడు చెప్పిన ప్రత్యక్ష సత్యమును గ్రహించక, అసత్య విషయమును మీరెట్లు
సమర్థిస్తున్నారని మేము కూడా ప్రశ్నించుచున్నాము. కానీ మా మాట చాలామందికి మొండివాదనగా కనిపించుచుండును.
బాగా యోచించు కొందరికి మా మాట సత్యమని తెలియ గలదు. ఇంతవరకు అందరికీ సమాధి అను పదము
సాధారణముగా కనిపించినప్పటికీ, ఇప్పుడు మేము చెప్పు భావముతో సమాది అను శబ్దము సామాన్యమైనది కాదనీ,
ఇదేదో గొప్ప అర్థముతో కూడుకొన్నదేకాక, ధర్మాధర్మ విషయములతో ముడిపడి వున్నదని కూడా అర్థమగుచున్నది.
మనుషులందరు మభ్యపడిపోయిన సమాధి (సమాది) ఏమిటో? ఎలా ప్రత్యక్ష ప్రమాణమో వివరించుకొని చూస్తాము.
గర్భము అనుమాట అందరము వినివుంటాము. తల్లిగర్భము, భూగర్భము అనుమాటలను విని వుంటాము.
గర్భము అను పదమునకు అర్థము కనిపించకుండా కప్పివుంచునదని తెలియుచున్నది. తల్లిగర్భము శిశు శరీరమును
కప్పివుంచినది. అలాగే భూగర్భము మృత శరీరమును కనిపించకుండా కప్పివుంచినది. దీనినిబట్టి గర్భములు రెండు
రకములనీ ఒకటి పుట్టే క్రొత్త శరీరమును దాచివుంచునది, రెండు చనిపోయిన పాతశరీరమును దాచివుంచునదని
తెలియుచున్నది. భూగర్భమును అందరూ సమాధి అని అనడము జరుగుచున్నది. భూగర్భమును సమాధి అనడము
చాలా పెద్ద పొరపాటు. ఎందుకనగా! భూగర్భములోని శరీరము మృతి చెందినది. ఆ శరీరములో జీవుడు లేడు
మరియు ఆత్మ లేదు. జీవుడుగానీ, ఆత్మగానీ ఉన్నపుడయితే జీవునికి సమముగా వర్తించునదని చెప్పవచ్చును. జీవుడే
లేనపుడు జడమైన శరీరమునకు సమముగా వర్తించునదని చెప్పుటకు వీలులేదు. జీవుడు లేని శరీరము గుర్తింపులేనిది,
కావున మృత శరీరమునకు సమాధి (సమాది) అనుమాట వర్తించదు. అట్లే తల్లి గర్భములోని శిశుశరీరములో కూడా
జీవుడూ లేడు, ఆత్మయూలేదు. కావున తల్లి గర్భమును కూడా సమాది అనుటకు వీలులేదు. తల్లిగర్భముగానీ,
భూగర్భముగానీ, ఒకటి పుట్టబోయే శిశు శరీరమునూ, మరొకటి చనిపోయిన మృత శరీరమును దాచివుంచునవే తప్ప
అవి సమాదులు కావు. గర్భము అనగా మర్మముగా ఉంచునది లేక రహస్యముగా దాచినదని అర్థము.
భూగర్భమునకు గానీ, తల్లి గర్భమునకుగానీ సమాధి (సమాది) అను పేరు వర్తించనపుడు బ్రహ్మవిద్యా శాస్త్రము
ప్రకారము ఆధ్యాత్మిక విద్యను అనుసరించి సమాది అనునది ఎక్కడున్నది? దేనిని సమాధి అనవచ్చును అని ప్రశ్న
రాగలదు. దానికి మా జవాబు ఏమనగా! ఒక మనిషిని ప్రకృతి భాగమనీ, ఆత్మ భాగమనీ రెండు భాగములుగా
విభజించి చూడవచ్చును. ప్రకృతి భాగములో మొత్తము శరీరముండును. ఆత్మ భాగములో జీవాత్మ, ఆత్మ ఉండును.
అంతేకాక పరమాత్మ కూడా ఉండును. కానీ పరమాత్మ శరీరము బయట, శరీరము లోపల ఉండు దానివలన ఆత్మ
భాగములుగా జీవాత్మ, ఆత్మను మాత్రము పరిగనలోనికి తీసుకొన్నాము. జీవాత్మ, ఆత్మ లేని 24 భాగముల శరీరమును
ఒక భాగముగా, జీవాత్మ ఆత్మను మాత్రము ఒక భాగముగా గుర్తించితే ప్రకృతి భాగమైన శరీరమునకు సమాది లేదని
తెలియుచున్నది. జగతిలో ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మములు ప్రచారమైనపుడు సమాది అను ధర్మము అధర్మముగా
మారిపోయి, వాస్తవమైన సమాది తెలియకుండా పోయి, అసత్యమైన సమాది తెలియుచున్నది. దానివలన ప్రజలు
భూగర్భమును సమాది అనుకోవడము జరుగుచున్నది. భూగర్భమును సమాధి అనుకోవడము అధర్మము అని ఎవరికీ
తెలియకుండా పోయినది.
ప్రకృతి భాగమైన శరీరమునకు కాకుండా జీవాత్మకూ, ఆత్మకూ మాత్రమే సమాది ఉన్నదనీ, ఆత్మ భాగములైన
జీవాత్మ, ఆత్మలకున్న సమాదియే నిజమైన సమాది అనీ, అదియే దైవధర్మమని తెలియవలెను. జీవునికి జన్మ (పునర్జన్మ)
4

Page 5
మొదటినుండి ఉన్నదానివలన “ఆది” అని చెప్పడమే కాక, జీవులందరికి ఒకే విధముగా వర్తించునది కావున “సమ”
అని చెప్పడము జరిగినది. దానినే పూర్తిగా సమాది అని అన్నారు. మేము చెప్పునది అందరికీ క్రొత్తమార్గముగా
కనిపించినా, ఇది ఇంతవరకు అణగారి పోయిన ధర్మమని తెలియవలెను. ప్రవక్తలందరూ ఇదే ధర్మమును తెలియ
జేసినప్పటికీ, ప్రజలు దానిని అందుకోలేక పోయారని చెప్పవచ్చును. ప్రవక్తలు చెప్పిన సమాది ధర్మమును విశదముగా
తెలుసుకోగలిగితే, మనిషి చనిపోయినపుడు శరీరమును వదలి జీవాత్మ, ఆత్మలు బయటికి పోవును. ఆ విధముగా
మరణములో జీవాత్మ, ఆత్మలు వదలిన శరీరమును భూగర్భములో (భూమిలో) పూడ్చిపెట్టితే అది సమాది కాదు.
సమ+ఆది = సమాది అను అర్థము భూగర్భమునకు వర్తించదు. అలాగే తల్లి గర్భము లోని జీవాత్మ, ఆత్మలేని శిశు
శరీరమునకు కూడా సమాది పదము వర్తించదు. జీవాత్మ, ఆత్మ ఎక్కడ నిక్షిప్తమై పోవుచున్నారో దానినే సమాధి లేక
సమాది అనవచ్చును. జీవుడు జన్మించు సమయమును “ఆది” అనవచ్చును. జీవుడు శరీరమును ధరిస్తే దానిని జన్మ
లేక పునర్జన్మ అంటున్నాము. అలా శరీరమును ధరించు మొదటి సమయమును “ఆది” అనడమేకాక, అది జీవులందరికి
సమముగా వర్తించునది కావున సమాది అనడము జరిగినది. ఒక జీవుడు శరీరములో ప్రవేశించి, ఆ శరీరములో
నిక్షిప్తమై (దాచబడి) ఎవరికీ కనిపించకుండా ఉండడమును వాస్తవముగా సమాది అనవచ్చును.
ఆత్మ, జీవాత్మలు రెండూ జోడు ఆత్మలు, ఒకదానిని వదలి ఒకటి ఉండుటకు వీలులేదు. జీవుడు జన్మలకు
పోకుండా మోక్షమును పొందినపుడే ఆత్మ జీవాత్మ ఒకదానిని ఒకటి కలిసిపోవడము జరుగుతుంది. అంతవరకు ఎన్ని
యుగములు గడచినా, ఎన్ని కల్పములు అయిపోయినా జీవాత్మ ఆత్మలు విడిపోవు. శరీరము మరణించినపుడు శరీరమును
వదలి పోయిన జీవాత్మలు ఆత్మలు కర్మ ప్రకారము నిర్ణయింపబడివున్న వేరొక శరీరమును చేరును.
అలా వేరొక
శరీరమును చేరడమును జన్మ లేక పునర్జన్మ అనవచ్చును. శరీరమును వదలి పోవడమును మరణమనీ, క్రొత్త శరీరమును
చేరడమును జననమనీ, అందరికీ తెలిసినా మరణములో ఏమి జరుగుచున్నదీ, జననములో ఏమి జరుగుచున్నదీ
వాస్తవముగా ఎవరికీ తెలియదు. జనన మరణములు బ్రహ్మవిద్యా శాస్త్రములో సిద్ధాంతములే అయినప్పటికీ అవి
ఎవరికీ తెలియవు కావున రహస్యములుగా మిగిలి పోయాయి. మేము గతములో వీటి వివరము అందరికి అర్థమగులాగున
“జనన మరణ సిద్ధాంతము”, “మరణ రహస్యము”, “పునర్జన్మ రహస్యము” అను గ్రంథము లను వ్రాయడము జరిగినది.
ఇప్పుడు సమాది అను పేరుతో ఈ చిన్న గ్రంథము వ్రాయడము జరుగుచున్నది.
మరణములో జీవుడు శరీరమును పూర్తిగా వదలి పునర్జన్మకు పోవడము జరుగుచున్నది. పాత శరీరమును
వదలిన క్షణమే ఆలస్యము లేకుండా ఆత్మతో సహా జీవాత్మ క్రొత్త శరీరములోనికి చేరిపోవుచున్నది. పాత శరీరము
అనగా మృతి చెందినదని అందరికీ తెలుసు. కానీ క్రొత్త శరీరము యొక్క విషయములోనే మనిషి పొరపాటుపడుచున్నాడు.
జీవుడు ధరించు శిశు శరీరము క్రొత్త శరీరమని అందరికి తెలిసినప్పటికీ, దానిని జీవుడు ఎప్పుడు ధరిస్తున్నాడని సరిగా
తెలియలేక పోయారు. ఏ దశలో క్రొత్త శరీరమవుతుంది? జీవుడు ఎప్పుడు దానిలోనికి ప్రవేశిస్తున్నాడు? ఎలా
ప్రవేశిస్తున్నాడు? అను విషయములే ఎవరికీ తెలియకుండా పోయాయి. ఎవరికి తెలిసినా తెలియకుండా పోయినా,
తల్లి గర్భములో పూర్తి తయారైన శిశుశరీరము ప్రసవింపబడిన తర్వాత జీవుడు చేరుటకు యోగ్యముగా ఉండును.
కాబట్టి తల్లిగర్భమునుండి పుట్టిన శిశు శరీరము క్రొత్త శరీరము అగుచున్నది. ప్రసవింపబడి జీవము లేకుండా
ఖాళీగానున్న శిశు శరీరములోనికి జీవాత్మ ఆత్మ చేరిపోవుచున్నవి. అలా జీవుడు శిశు శరీరములోనికి చేరిపోవడమును
పునర్జన్మ అనుచున్నాము. పునర్జన్మ విషయమే మనుషులకు అర్థము కాకుండా పోయింది. పునర్జన్మలో ప్రసవింపబడిన
5

Page 6
శిశుశరీరము క్రొత్త శరీరమను మాట తెలియకుండా పోయినది. తల్లిగర్భములోని అసంపూర్ణ శిశు శరీరములోనికే
జీవుడు చేరుచున్నాడని అందరూ అనుకోవడమేకాక, విజ్ఞానులనువారు కూడా అనుకోవడము జరుగుచున్నది. ముఖ్యముగా
ఇక్కడే అందరూ పొరపడిపోయారు. సైన్సు అని చెప్పుకొను వారు సైన్సులోని నిజమును తెలియకుండానే, సైన్సు అను
పేరు చెప్పు కొంటూనే మూఢనమ్మకములో పడిపోయారు. విజ్ఞానము (సైన్సు) ప్రకారము గర్భములోని శిశువులోనికి
ఇంతవరకూ ఏ జీవుడూ చేరలేదు. అట్లు చేరినట్లు ఎవ్వరూ నిరూపించలేరు. ఈ మాట విన్నటువంటి కొందరు
గైనకాలజిస్టు డాక్టర్లు నవ్వుకోవడము జరిగినది. వీర్యకణములోనే జీవమున్నదని వారి నమ్మకము. అందువలన వారు
అలా నవ్వడము జరిగినది. సైన్సు ప్రకారము ఇంకా పరిశోధన జరుగవలసివున్నదనీ, ఇంతవరకు తమకు తెలిసినది
సత్యముకాదనీ వారికి తెలియదు.
ఈ విధముగా భౌతిక శాస్త్రవేత్తలకు కూడా పునర్జన్మ విషయములో జీవుడు ఎప్పుడు క్రొత్త శరీరములో
ప్రవేశిస్తున్నాడో, ఏది క్రొత్త శరీరమో తెలియకుండా పోయినది. పునర్జన్మ విషయమే తెలియనపుడు, దానికి
అనుబంధముగానున్న సమాది కూడా ఎవరికీ తెలియకుండా పోయినది. జన్మ తర్వాతనే సమాదివుంటుంది. జన్మను
అనుసరించి సమాదివుంటుంది. కావున జన్మ వివరము తెలియనిదే సమాది విషయము తెలియుటకు వీలు పడదు.
ఇంతవరకు భూమిమీద జన్మ విషయమే రహస్యముగా తెలియకుండా పోయినప్పుడు జన్మను అనుసరించిన సమాది
ఎలా తెలియును? జన్మ (పునర్జన్మ) విషయము తెలియనిది సమాది తెలియదు. కావున భూమిమీద సమాది యొక్క
అర్థముగానీ, సమాది యొక్క నిజ స్థితిగానీ ఎవరికీ తెలికుండా పోయినది. తల్లిగర్భములోని శిశువుకు ప్రాణము లేదనీ,
జీవుడు దానిలోనికి ప్రవేశించుటకు వీలులేదనీ, అది అసంపూర్ణ శరీరమేగానీ, సంపూర్ణమైన క్రొత్త శరీరముకాదనీ,
ప్రసవించబడిన శరీరమునే క్రొత్త శరీరమనవచ్చుననీ, ప్రసవించబడిన శరీరములోనికి జీవుడు చేరుచున్నాడని “జనన
మరణ సిద్ధాంతము” అను గ్రంథములో 1980 సంవత్సరమే మేము వ్రాయడము జరిగినది. వ్రాసి 30 సంవత్సరములైతే
దానికంటే పది సంవత్సరముల ముందునుండి ఈ విషయమును చెప్పడము జరిగినది. ఇప్పటికి 40 సంవత్సరములప్పుడే
గర్భస్థ శిశువుకు ప్రాణములేదని మేము చెప్పడము జరిగినది. మేము చెప్పిన విషయము ఎవరూ నమ్మరనీ, ఆ
విధముగా వారిలో అంధత్వము పేరుకపోయినదనీ తెలిసినప్పటికీ, మేము సత్యమును చెప్పాలను ఉద్దేశ్యముతో శాస్త్రబద్దముగా
చెప్పడము జరిగినది. భౌతిక శాస్త్రవేత్తలమని పేరుపెట్టుకొన్నవారు కూడా అశాస్త్రీయపద్ధతిలో గర్భములోనే జీవుడున్నాడని
చెప్పుచున్నారు. మేము చెప్పుమాట ఋజువు కాగలదు, కానీ గర్భములో ప్రాణమున్నదనుట ఋజువుకాదు. గర్భములో
శిశువు సంగీతమును వింటున్నదనీ, గర్భములోని శిశువు బయట మాటలను గ్రహించుచున్నదనీ కొందరు చెప్పిన
మాటలు నూటికి నూరుపాళ్ళు అసత్యము. మాకు వాస్తవము తెలుసు కావున ధైర్యముగా వారి మాటను అసత్యమని
చెప్పుచున్నాము.
మేము చెప్పు వాస్తవము ఏమిటో 40 సంవత్సరములనుండి చెప్పు చున్నాము. 30 సంవత్సరములప్పుడే
గ్రంథ రూపములో వ్రాశాము. మేము చెప్పిన దానిని బట్టి, జీవుడు పునర్జన్మలో శరీరమును ధరించినప్పుడే సమాది
ఏర్పడుచున్నది. ఎలా అనగా! జీవుడు ప్రసవింపబడిన క్రొత్త శరీరములో చేరినపుడు జీవుడు శరీరములోపల ఉన్నాడు.
ఆ విధముగా జన్మ మొదటి లోనే జీవుడు శరీరమందు నిక్షిప్తమైవుండడమును సమాధి అంటున్నాము. అలా సమాదిలోనున్న
జీవున్ని అతనితో పాటువున్న ఆత్మ స్వయముగా బయట ప్రపంచముతో సంబంధము ఏర్పరచుచున్నది. ఆ సమయములో
శరీరములోని బుద్ధిగానీ, మనస్సుగానీ బయటి విషయములను గ్రహించ లేని స్థితిలో ఉండును. జీవుడు శరీరమును
6

Page 7
ధరించిన మొదట మనస్సు యొక్క పనినిగానీ, బుద్ధియొక్క పనిని స్వయముగా ఆత్మే చేయును. బయటి సంబంధము
లేకుండా శరీరములో పూడ్చబడివున్న జీవుని స్థితిని సమాది అనవచ్చును. ఆ స్థితి శిశువుగా జన్మించిన ప్రతి జీవరాసికి
ఉన్నదే. కావున అది అందరికి సమానమైనది, అందువలన దానినే సమాదిగా ప్రవక్తలందరూ చెప్పారు. సమాదిలో
ప్రపంచ విషయములు ఏవీ తెలియని ఆది కాలములో ఆత్మే స్వయముగా సమాదినుండి ప్రపంచముతో సంబంధము
ఏర్పరుచున్నది. కావున అంత్యదినమున సమాదినుండి ఇదే శరీరముతో లేపుదునని చెప్పబడినది. అంత్యకాలము లేక
ప్రళయ దినమున అనగా శరీరము నశించి మరణము ఏర్పడిన దినమున అని అర్ధము. శరీరము నశించి పూర్తి
మరణము పొందిన క్షణమే, క్రొత్త శరీరములోనుండి జీవున్ని బయటి ప్రపంచములోనికి లేపడము జరుగుచున్నది. ఆ
విధముగా పునర్జన్మ పొందిన దినము అందరికీ జరుగుచున్నది. ఆ విధముగా అందరికీ సమానముగా జరిగిన దినమున,
సమాదినుండి (శరీరమునుండి) లేపబడిన దినమున ఎవని శరీరము మీదకూడా గుడ్డలు లేవు. గుడ్డలు లేకుండా
శరీరము ప్రసవింపబడుచున్నదని మరువకూడదు. ఆ విధముగా శరీర సమాదినుండి దేవుడు ఆత్మ చేత లేపిన
దినమున మనిషికి (జీవునికి) ఏ గుణములూ లేవు. అప్పుడు ఏ గుణములూ పని చేయడము లేదు. జీవుడు బయటి
ప్రపంచములోనికి శరీరముతో లేపబడిన రోజు, ఏ గుణము లేని దానివలన శరీరము మీద గుడ్డలు లేవని సిగ్గుపడడము
కూడా ఉండదు. ఆ దినము అంతఃకరణములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము ఏవీ పని చేయవు. అలాగే
గుణములూ పని చేయవు. అవి అప్పుడు పని చేయలేని స్థితిలో ఉన్నవి. ఈ విషయము అందరికీ ప్రత్యక్ష ప్రమాణముగా
తెలుసు. అయితే తల్లి గర్భమునుండి పుట్టిన శిశుశరీరమే సమాది అనిగానీ, ఆ శరీరమునుండే మొట్టమొదట ప్రపంచము
ధ్యాసలోనికి వస్తున్నామనిగానీ, ప్రళయ దినమున సమాదినుండి ప్రతి ఒక్కరిని లేపుదునని, ఇతర మతములలో దేవుడు
చెప్పిన వాక్కు సత్యమైనదనీ తెలియవలెను. ఇది నిత్యము! కనిపించు సత్యము! అంతేకాక ప్రవక్తలు చెప్పిన ప్రతి
పదము నెరవేర్చబడుచుండుట అందరికీ తెలియుచున్నది. ఎదురుగా జరుగుచున్ననూ గుర్తించలేని వారు ఎప్పుడో
జరుగుతుందని అనుకొని పొరబడుచున్నారు.
జనన మరణములు సృష్ఠి ఆదినుండి ఉండినప్పటికీ, అప్పటినుండి వున్న హిందూమతములో గతములోనున్న
గొప్ప గొప్ప మహర్షులుగానీ, నేడు ఎంతో గొప్ప స్వామీజీలుగా పేరుగాంచిన వారుగానీ, జనన విషయమునే సరిగా
అర్థము చేసుకోలేక పోయి, గర్భములోని ఐదవ నెల శిశువుకే ప్రాణమున్నదనీ, గర్భములోనే అన్ని జ్ఞాపకములున్నవనీ,
బయటి విషయములను కూడా వినగలుగుచున్నాడనీ, ప్రహ్లాదుడు నారదమహర్షి చెప్పిన నారాయణ మంత్రమును
వినగలిగాడనీ, అట్లే అర్జునుడు, అతని భార్య సుభధ్ర మాట్లాడుచుండగా, గర్భములోని అభిమన్యుడు యుద్ధ తంత్రములను
వినగలిగాడనీ చెప్పడము తెలిసిన విషయమే. ఈ విధముగా ముందే ప్రజలలో జనన మరణములను గురించిన
ధర్మము అధర్మముగా ప్రచారమైపోయినది. అధర్మముగానున్న ధర్మము తిరిగి ధర్మముగా ప్రచార మగుటకు చాలా
కష్టమైన పనియగును. అధర్మమైతే ప్రజలకు సులభముగా అర్థముకాగలదు. దానినే ధర్మముగా చెప్పవలసినపుడు వినే
వారిలోని మాయ అనవసర ప్రశ్నలనూ, అనుమానములనూ సృష్ఠించును. చెప్పబడు విషయము సత్యమైనా, అది
అసత్యముగా అగుపించునట్లు చేయును. జనన విషయములో ప్రసవింపబడిన శిశువు యొక్క శరీరములోనికి జీవుడు
చేరుననుట సత్యమూ, ధర్మమూ, ప్రత్యక్ష ప్రమాణము అయినా, అది అన్ని విధముల శాస్త్రబద్ధముగా ఉండినా, దానిని
మనిషి నమ్మశక్యము కానిదిగా భావించుకొనును. దానిని గురించి ఏమాత్రము విచక్షణా జ్ఞానమును ఉపయోగించడు.
అదే విషయమును అధర్మముగా చెప్పితే, అది ఏమాత్రము సత్యముకాకున్నా, ప్రత్యక్ష ప్రమాణము కాకున్నా దానిని
7

Page 8
సులభముగా నమ్మడము జరుగుచున్నది. కర్ణుడు చెవిలో పుట్టాడనినా, ద్రోణుడు కుండలో పుట్టాడనినా దానిని సులభముగా
నమ్మేస్తారు. అవి ధర్మవిరుద్ధమైన మాటలని ఎవరూ అనుకోరు. ఆ విషయములో ఎటువంటి అనుమానములూ రావు.
అదే జన్మ విషయమును ధర్మయుక్తముగా శిశువు తల్లిగర్భమునుండి బయటపడిన తర్వాత జీవునికి జన్మ కలుగుచున్నదని
చెప్పితే, అది నూరు పాళ్ళు సత్యముగా ఉండినా, మనిషి విజ్ఞానవంతుడైనా నమ్మలేక పోవుచున్నాడు. అనవసరమైన
అనుమానములతో సత్యమునకు దూరమై పోవుచున్నారు. పూర్తి విచక్షణా దృష్ఠితో చూడకుండానే ఒక నిర్ణయానికి
వచ్చి సత్యమును అసత్యమనుకొనుచున్నారు. ఇది హిందూమతములోని అధర్మముకాగా, ఇతర మతములలో కూడా
మాయ లేక సాతాన్ (సైతాన్) అనునది ప్రవక్తలు చెప్పిన దేవుని ధర్మములను ప్రజలకు అధర్మములుగా అర్థమగునట్లు
చేసింది. దేవుని జ్ఞానమును పూర్తిగా అర్థము కాకుండ చేసి అజ్ఞానులుగా ఉండునట్లు చేసింది.
ఒక్క హిందూమతములోనే కాకుండా ఇతర మతములలోని మనుషులను కూడా దేవునివైపు పోకుండా, దేవుని
జ్ఞానము అర్థము కాకుండా చేయడములో అహర్నిశలు మాయ పని చేస్తూనేవున్నదని చెప్పుటకు ఎన్నో తార్కాణములు
గలవు. పవిత్ర ఖురాన్ గ్రంథములో మక్కాలో అవతరించిన “అబస” అను సూరాయందు (ఆధ్యాయమందు) 37
ఆయత్లో (వాక్యములో) ఇలా గలదు. “ఆ రోజు ఆసన్నమైనపుడు ప్రతి ఒక్కరికీ తన మీద సృహతప్ప ఎవరిమీద సృహ
ఉండదు.” ఈ వాక్యమును అనుసరించి హదీసుల్లో విభిన్న క్రమాల ద్వారా, ప్రమాణముల ద్వారా అందిన ఒక ఉల్లేఖనం
కానవస్తుంది. అందులో ప్రవక్త మహానీయులు (స) “ప్రళయదినాన అందరు ఒక్క నూలు పోగైనా గుడ్డలు లేకుండా
నగ్నముగా లేపబడతారు.” అని చెప్పినపుడు ఆయన సతీమణులలో ఒకరు బహుశ నాల్గవ భార్య అయిన హజ్రత్
అయిషా ఖంగారుగా “దైవ ప్రవక్తా! ఆనాడు మా గోపనీయ అవయవాలు అందరిముందు బయటపడతాయా?” అని
ప్రశ్నించారు. అప్పుడు దైవ సందేశహరులు (స) ఈ 37వ ఆయత్నే పఠించి “ఆ రోజున ఎవరికీ మరొకవైపు చూచే
సృహ ఉండదు" అని పలికారు. దైవసందేశాన్ని తెలిపిన మహమ్మద్ ప్రవక్తగారు చెప్పిన పై వాక్యమును విడదీసి
చూచుకొనిన ఈ విధముగా అర్థము కాగలదు. ప్రళయ దినము అనుటలో ప్ర అనగా పుట్టినది అని అర్థము. అలాగే
ళయము అనగా నాశనము అని అర్థము. మొత్తానికి ప్రళయము అనగా పుట్టినది నాశనమగుట అని తెలియుచున్నది.
పుట్టినది నాశనమగుట అని తెలిసినపుడు పుట్టినది ఏది అని ప్రశ్న రాగలదు.
ఆ ప్రశ్నకు రెండు జవాబులు కలవు. ఒకటి సృష్టి ఆదిలో సృష్టికర్త అయిన దేవుడు పంచభూతములైన
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు ప్రకృతి భాగములను సృష్టించాడు. రెండవది, జీవముతో కూడు కొనిన
శరీరమును ధరించిన జీవరాసులను కూడా సృష్టించాడు ఒకటి మార్పు చెందని ప్రకృతియనీ రెండవది మార్పు చెందు
ప్రకృతి అని చెప్పబడుచున్నది. వీటినే చరాచర ప్రకృతి అని కూడా అనుచున్నారు. పంచ భూతములు మార్పుచెందని
ప్రకృతియనీ, జీవరాసులు మార్పుచెందు ప్రకృతియనీ కూడా చెప్పడము జరిగినది. దీనినిబట్టి దైవసృష్ఠి రెండు రకములనీ,
ఒకటి జీవరాసులు లేని ప్రపంచమనీ, రెండవది జీవములున్న శరీరములనీ తెలియుచున్నది. సృష్ఠించబడినవి జీవమున్న
మరియు జీవములేని రెండు రకముల ప్రకృతులైతే, అవి నాశనము చెందడము కూడా (వాటి ప్రళయములు కూడా)
రెండు రకములుగా కలవు. రెండు రకముల ప్రళయములను తెలుసుకొనే ముందు రెండు రకముల ప్రభవములను
(పుట్టుకలను) కూడా వివరముగా తెలిసివుండాలి.
కనిపించే విశ్వమును రెండుగా విభజించవచ్చును. అవియే చరా చర ప్రకృతులని చెప్పబడుచున్నవి. ఒకటి
జీవములేని ప్రకృతి భాగములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. రెండవది ఈ ఐదు మూల పదార్థము లతో
8

Page 9
తయారైన జీవమున్న శరీరములు. జీవములేని ప్రకృతి మరియు జీవమున్న ప్రకృతి రెండూ ఆదిలోనే దేవుని చేత
సృష్ఠింపబడినవి. ఈ రెండిటికీ సృష్ఠికర్త దేవుడే. ఇందులో జీవములేని ప్రకృతి ఒక్కమారే సృష్ఠింప బడుచున్నది.
ఒకేమారు ప్రళయము పొందుచున్నది. రెండవదైన జీవమున్న ప్రకృతి క్రమబద్దముగా కర్మననుసరించి ఎన్నోమార్లు
పుట్టింపబడుచున్నది. మరియు ఎన్నోమార్లు ప్రళయము పొందుచున్నది. కనిపించే విశ్వములో ప్రత్యక్షముగా జీవమున్న
ప్రకృతి అనేకమార్లు నాశనము (ప్రళయమును) చెందుచున్నది, అలాగే అనేకమార్లు సృష్ఠించబడుచున్నది. జీవములేని
ప్రకృతి మాత్రము సృష్ట్యాదిలో ఒకేమారు సృష్ఠింపబడి, వేయి యుగముల అనంతరము ఒకేమారు ప్రళయమును
పొందుచున్నది. అయితే జీవమున్న ప్రకృతి నిత్యము సృష్ఠింపబడుచున్నది. నిత్యము నాశనమును (ప్రళయమును)
పొందుట జరుగుచున్నది. దీనినిబట్టి సృష్ఠి రెండు రకములనీ, ప్రళయములు కూడా రెండు రకములనీ, అన్నిటికీ
అదికర్త దేవుడొక్కడేనని తెలియుచున్నది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. దైవ సందేశహరులైన హజ్రత్
మహమ్మద్ ప్రవక్త (స) గారు దివ్యఖురాన్లో అబస అను 80 సూరాయందు 37 ఆయతో తెలిపిన వాక్యములో
“ప్రళయ దినాన అందరూ” అనుట వలన మనుషులందరికీ అని అర్థమగుచున్నది. మనుషులందరూ జీవమున్న
ప్రకృతిలోని భాగము కనుక అబస సురాలో 37 ఆయత్లో చెప్పినది మనుషులకు సంబంధించిన ప్రళయమును
గురించి మాత్రమేనని తెలియుచున్నది.
దేవుని చేత సృష్ఠింపబడిన ప్రకృతి రెండు రకములని తెలియక పోతే అందరికి వేలయుగముల తర్వాత జరుగు
విశ్వప్రళయము మాత్రమే తెలియును. మనిషి జీవితము యొక్క అంత్యకాలములో జరుగు మరణమను ప్రళయము
తెలియకుండా పోవును. మనిషికి కొన్ని పదుల సంవత్సరముల కొకమారు జరుగు శరీర మరణము అనునది కూడా
చరా ప్రకృతికి సంభవించు ప్రళయమనీ, అటువంటి ప్రళయములను మనుషులు వారివారి జీవితములలో అనేకమార్లు
పొందుచున్నారని చెప్పవచ్చును. మనిషి చనిపోయిన ప్రతిసారీ అతను సమాధి పొందుచున్నాడనీ, తిరిగి సమాధి నుండి
లేపపడుచున్నాడనీ, మాక్కాలో పుట్టిన “అల్ ఇన్ఫితార్” అనే 82వ సురాలో 4వ ఆయత్లో “సమాదుల్ని తెరిచివేసినపుడు”
అని వ్రాయబడిన వాక్యముకు వివరము ఖురాన్ అవగాహన గ్రంథములో ఇలా వ్రాయబడివున్నది. సమాధులు
తెరుచుకోవడము అంటే మనుషులు తిరిగి బ్రతకడము అని అర్థము. ఇస్లామ్ పండితులు వ్రాసిన వాక్యములను బట్టి
పవిత్ర ఖురాన్లో హజ్రత్ మహమ్మద్ (స) ప్రవక్త చెప్పిన దానినిబట్టి ప్రళయము అనగా విశ్వమంతటికీ సంభవించు
ప్రళయముకాదనీ, మనుషులకు సంభవించు జీవిత అంత్య కాలమైన మరణమనీ తెలియుచున్నది. దేవుని చేత
సృష్ఠింపబడిన చరా ప్రకృతీ, అచరా ప్రకృతీ అను రెండు ప్రకృతులలో కేవలము చరా ప్రకృతి అయిన మనుషులకు
సంబంధించిన ప్రళయమును గురించే దేవుడు చెప్పాడనీ, అలా మనుషులకు సంబంధించిన ప్రళయమును పొందిన
తర్వాతనే మనిషి సమాధిని పొందుచున్నాడని అర్థమగుచున్నది.
చరా ప్రకృతి అయిన మనుషుల మరణానికి సంబంధించిన ప్రళయమనుకోకుండా, విశ్వ అంత్యములో జరుగు
అచరా ప్రకృతికి సంబంధించిన ప్రళయముగా అర్థము చేసుకొంటే, ఆ ప్రళయము తర్వాత సమాదులుగానీ, వాటినుండి
లేవడముగానీ ఉండదు. ఎందుకనగా! అచరా ప్రకృతికి సంభవించు ప్రళయము విశ్వప్రళయమగును. విశ్వ ప్రళయము
తర్వాత మొత్తము ప్రపంచమే ఉండదు. విశ్వప్రళయము తర్వాత ఇప్పుడున్నది ఏదీ ఉండదు. అచరా ప్రకృతి అయిన
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి లేకుండా పోయినపుడు, సర్వసృష్టి అంత్యమై పోయినపుడు, దేవుడు తప్ప ఏదీ
మిగలనపుడు జీవరాసుల ఉనికిగానీ, వాటి సమాదులుగానీ, తిరిగి వారు బ్రతుకుటగానీ, స్వర్గముగానీ, నరకముగానీ
9

Page 10
ఉండదు. అందువలన మూల గ్రంథమైన ఖురాన్లో చెప్పినది మనుషులకు సంబంధించిన ప్రళయముగా
గ్రహించుకోవలెను. మనుషుల అంత్య కాలమునకు సంబంధించిన ప్రళయముగా అర్థము చేసుకోవలెనుగానీ, పంచ
భూతములకు సంబంధించిన ప్రళయమని అర్థము చేసుకోకూడదు. మనుషులకు సంబంధించిన ప్రళయములో,
జీవుడు శిశు శరీరమును సమాధిగా పొందవచ్చును. ఆ సమాధినుండి లేపబడవచ్చును. కానీ విశ్వప్రళయములో
దేవుడు తప్ప ఏదీ మిగలనప్పుడు, జీవుని ఉనికి తెలియకుండా పొయి, శరీరములుగానీ (సమాదులుగానీ) జీవుడుగానీ
లేనప్పుడు అటువంటి ప్రళయమును గురించి ప్రస్తావించనవసరమే లేదు. అందువలన పెద్దలు చెప్పినది మనుషులకు
సంబంధించిన ప్రళయమని గ్రహించవలెను. ఇప్పుడు ఖురాన్ గ్రంథములో 80 అధ్యాయమున అబస సురాలో 37వ
ఆయత్లో చెప్పినట్లు ప్రళయ దినము అర్థమై పోయిందను కుంటాను. ఇక 82 సురా అయిన ఆల్ ఇన్ఫితార్లో 4వ
ఆయత్లో “సమాధులు తెరచి వేసినప్పుడు" అనగా మనుషులు తిరిగి బ్రతకడము అని ఖురాన్ అవగాహన గ్రంథములో
చెప్పబడినది. వాస్తవముగా సమాది తెరవబడినపుడే మనిషి తిరిగి బ్రతుకుచున్నాడనీ లేక సమాది నుండి బయటికి
వచ్చినపుడే మనిషి తిరిగి పుట్టగలుగుచున్నాడని మేము కూడా చెప్పుచున్నాము.
ఇక్కడ మనము బాగా అర్థము చేసుకోవలసినది ఏమనగా! ఇదే సురాలో నాల్గవ ఆయత్ చెప్పకముందు
ఒకటి, రెండు, మూడు ఆయత్లు ఇలా గలవు. 1) ఆకాశము చీలిపోయినప్పుడు 2) నక్షత్రాలు చెదరిపోయి నప్పుడు
3) సముద్రాలు చీల్చివేసినప్పుడు అని మూడు వాక్యములు గలవు. ఈ మూడు ఆయత్లలో (వాక్యములలో) చెప్పినది
ప్రళయమును గురించియే అయినా అది పంచభూతములకు సంబంధించిన ప్రళయముకాదు. కేవలము పంచభూతముల
వలన పుట్టిన జీవరాసుల శరీరములకు సంబంధించిన ప్రళయమని తెలిసిపోవుచున్నది. అది పంచభూతములకు
సంబంధించిన ప్రళయమే అయివుంటే ఆకాశమే లేకుండా పోయేది. ఆకాశమే లేకుండా పోయినపుడు నక్షత్రము
చెదిరిపోవడమంటూ ఉండదు. చివరి ప్రళయములో ఆకాశమూ ఉండదు, నక్షత్రములూ ఉండవు. పంచభూతములకు
ప్రళయమైతే, పంచభూతములలో ఒకటి అయిన సముద్రము యొక్క ఉనికే లేకుండా పోతుంది, కానీ సముద్రము
చీలిపోదు. సముద్రము చీలిపోయింది అంటే కొన్ని ఖండములుగా చేయబడింది అనియేగా అర్థము. అప్పటికీ సముద్రము
ఉన్నట్లే కదా! అదే విధముగా ఆకాశము కూడా చీలిపోయింది కానీ మొత్తానికి లేకుండా పోలేదు కదా! దీనినిబట్టి
అక్కడ చెప్పిన ప్రళయము పంచభూతములైన ప్రపంచమునకు కాదనీ, అది పంచ భూతముల వలన పుట్టిన శరీరములు
నాశనమగుటకు ఏర్పడిన ప్రళయమని చెప్పవచ్చును. ఇకపోతే ఇదే వాక్యములనే హదీసు పండితులు వివరించుతూ
ఖురాన్ అవగాహన అను గ్రంథములో ఇలా వ్రాశారు.
“81వ ఆతక్విర్ సురాలో ఆరవ ఆయత్లో మంటలు చెలరేగు తాయని వుంది. ఇక్కడేమో సముద్రాలు
చీలిపోతాయని వచ్చింది. రెండు ఆయత్లను సమన్వయపరిస్తే, ఖురాన్ ప్రకారము ప్రళయ దినాన అత్యంత తీవ్రమైన
భూకంపము వస్తుందనీ, అది ఒక ప్రాంతానికి పరిమితమై ఉండదనీ, భూమి యావత్తు కుదుపులకు గురువుతుందని
అనుకుంటే, సముద్రాలు చీలి వాటిలో మంటలు ఎలా ఏర్పడగలవో మనకు బోధపడ గలదు. మొదటి ఆ మహా
భూకంపము వలన సముద్రాల అడుగు చీలిపోయి సముద్రాల నీరు దాని అంతర్భాగానికి దిగజారి పోతుంది. లోన
సతతం అత్యంత వేడిలో లావా సలసల కాగుతూవుంటుంది. ఆ లావా సమీపానికి నీరు చేరగానే దాని మూల
పదార్థములుగా విడిపోతుంది. వాటిలో ఒకటి మండించే ఆక్సిజన్, రెండవది మండే హైడ్రోజన్. ఇలా నీరు విడిపోవడము
జ్వాలలు రేగడము అన్నది నిరంతర చర్య ప్రతి చర్యగా మొదలవుతుంది. ఫలితంగా సముద్రాలన్నిటిలో మంటలు
10

Page 11
చెలరేగుతాయి. ఇది మా ఊహ మాత్రమే. నిజ జ్ఞానమైతే అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇక్కడ స్పష్టముగా
ప్రళయము ఇదేనని చెప్పకుండా, ఈ విషయములు దేవునికి తెలుసు అనడము చాలా మంచిమాట. ఈ మాటను బట్టి
చూస్తే గొప్ప జ్ఞానులైన వారుకూడా ప్రళయమును గురించి ఖచ్చితముగా చెప్పలేక పోయారని తెలియుచున్నది. వాస్తవముగా
ఒక్క మనుషులకే కాకుండా సమస్త ప్రపంచమునకు, సహస్ర యుగములకు ప్రళయము సంభవించుననీ తర్వాత
సహస్ర (వేయి) యుగముల అనంతరము తిరిగి సృష్టినంతటిని తయారు చేయుదుననీ దేవుని అంశ అయిన భగవంతుడు
బ్రహ్మవిద్యా శాస్త్రములో తెలియజేశాడు. వాస్తవానికి జీవ శరీరములైన ప్రళయమును గురించియే మేము విశదీకరించి
చెప్పాము. కానీ ప్రపంచ ప్రళయమును గురించి అది ఎట్లుండునో మేము కూడా చెప్పడము లేదు. చివరి యుగ
ప్రళయము ఎట్లుండునో దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. చివరి ప్రళయములో మాత్రము సృష్టించబడిన సమస్తమూ
లేకుండా పోవునని మాత్రము దేవుడే తన శాస్త్రములో తెలియజేశాడు.
ཀུན་
పవిత్ర ఖురాన్ గ్రంథములో 81వ అత్ తక్వీర్ సురాలో 7వ ఆయత్ నందు “ఆత్మలు శరీరాలతో ఏకమౌతాయి”
అని చెప్పబడివుంది. దానికి వివరము కూడా ఇలా వ్రాయబడివున్నది. "మానవులు మరణానికి ముందు ప్రపంచములో
ఏ ఆత్మ శరీరాలతో పాటు సజీవముగా ఉండేవారో, అదే విధముగా సరిక్రొత్తగా బ్రతికించబడుదురు.” ఈ ఆయత్లో
పునర్జన్మ విషయమును పూర్తిగా చెప్పినా, అది దేవుడు మనిషిని తిరిగి పుట్టించు చున్నాడని తెలిసినా, ఆ పుట్టుక ఏదో?
ఎప్పుడు జరుగుచున్నదో? ఎలా జరుగుచున్నదో మనుషులకు తెలియకుండా పోయినది. దేవుడు అంత వివరముగా
చెప్పినప్పటికీ, దేవుడు చెప్పిన విషయము అర్థము కాకుండా పోయి, వేరు విధముగా అర్థమగుటకు కారణము మాయ
ప్రభావమని తెలియుచున్నది. మనిషిని దేవునివైపు పోకుండా, దేవుని జ్ఞానము అర్థము కాకుండా చేయడమే మాయ
(సాతాన్) యొక్క ముఖ్యమైన పని. కావున మాయ, మనిషిని తన ఆధీనమందుంచుకొని దేవుని జ్ఞానము తెలియకుండా
చేయుచున్నది. అందులోని భాగముగా పునర్జన్మ విషయమును అర్థము కాకుండా అపార్థము చేసి పెట్టింది. మాయ
యొక్క అపార్థమును వదిలి, దేవుని యొక్క అర్థమును తెలుసుకొనుటకు పవిత్ర ఖురాన్ గ్రంథములో చెప్పబడిన ఆయత్లలోని
జ్ఞానమును జ్ఞానదృష్ఠితో వివరించుకొని చూస్తాము.
దేవుని శాసనము ప్రకారము మనిషిగానీ లేక ఏ జీవరాసిగానీ మొదట పుట్టిన తర్వాత అతని జీవితములో
బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము గడచిపోవును. తర్వాత శరీరమును ఆ జీవుడు మరణములో వదలి
వేయడము జరుగుచున్నది. బాగా వివరించుకొని చూస్తే ఒక సజీవమైన మనిషిలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు,
భూమి అను ఐదు ధాతువులతో కూడివున్న ప్రకృతి సంబంధమైన శరీరము ఒక భాగముగా, అలాగే ఆత్మ సంబంధమైన
జీవాత్మ ఒక భాగముగా మొత్తము రెండు భాగములుగా ఉన్నది. ఈ రెండు భాగములలో ఆత్మ సంబంధమైన జీవుడు,
ప్రకృతి సంబంధమైన శరీరములో కొంతకాలము నివసించి, ఆ శరీరములో జీవితమును గడిపి చివరకు మరణమును
పొందుచున్నాడు. మరణములో జీవాత్మ నివసించిన శరీరము మాత్రము నాశనమై పోవుచున్నది. జీవుడు లేక జీవాత్మ,
మరణములో శరీరముతో పాటు నాశనము కావడము లేదు. మరణము అనునది శరీరములోనున్న పంచభూతములకు
ప్రళయమును కల్గించుచున్నదనీ, శరీరములో నివసించిన జీవాత్మకు కాదనీ తెలియుచున్నది. శరీర రూపములోనున్న
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ప్రళయము పొందినపుడు అది మరణమగును. మరణము శరీరములో జరుగు
ప్రళయమును మాత్రమే తెల్పుచున్నది. శరీరములోనున్న సముద్రము సముద్రముగా ఉండక అది చీలిపోయినపుడు,
11

Page 12
శరీరములోని అగ్ని సాధారణముగా ఉండక అది సముద్రమును కూడా మండించినపుడు, శరీరములోని భూమి శాంతముగా
ఉండక కంపించినపుడు, అలాగే శరీరములోనున్న ఆకాశము ప్రశాంతముగా ఉండక రెండుగా చీలి పోయినపుడు,
శరీరములోని గాలి సాధారణము ఉండకుండా చెలరేగి పోయి విపరీతమైన శబ్దమును పుట్టించినపుడు, నక్షత్రములు
గాలికి కొట్టుకు పోయినపుడు, జీవుడు అటువంటి ప్రళయము పొందిన శరీరములో ఉండక బయటికి వచ్చును, అదియే
మరణము. ఇటువంటి ప్రళయమునే అల్లాహ్ (దేవుడు లేక పరమాత్మ) అల్ ఇన్ ఫితార్ 82వ సురాలో 1,2,3
ఆయత్లలోనూ, 81వ సురా అయిన అత్ తక్విర్లో 1,2,3 ఆయత్లలోనూ, 80 నంబర్ సురా అయిన అబస సురాలో
37 ఆయత్లోనూ హజ్రత్ మహమ్మద్ (స) ప్రవక్త ద్వారా పవిత్ర ఖురాన్లో చెప్పించారు.
80వ అబస సురాలో 21వ ఆయత్నందు "తరువాత మృత్యువు నిచ్చాడు, సమాధికి చేర్చాడు." అని కూడా
ఉంది. అలా ఎందుకు చెప్పారు అనగా మనిషి జీవితము కొంతకాలము సాగిన తర్వాత శరీరము నాశనమై మృత్యువు
ఏర్పడుచున్న విషయము ప్రత్యక్ష సత్యము. దేవుడు చెప్పినట్లు ప్రత్యక్షముగా అందరికీ తెలియునట్లు మరణము సంభవించిన
తర్వాత శరీరమును వదలిన జీవుడు (జీవాత్మ) ఏమౌతున్నాడు? అను ప్రశ్నకు జవాబుగా మృత్యువునిచ్చిన దేవుడే,
సమాధికి కూడా చేర్చాడు అను విషయము అబస సురాలో 21 ఆయత్లో చెప్పడము జరిగినది. ఇక్కడ వివరించుకొని
చెప్పుకొంటే, ఒక మనిషి యొక్క మరణము అందరికీ తెలియుచున్నది. తర్వాత విషయమే ఎవరికీ తెలియదు. అయితే
మాకు తెలిసినదేమనగా! మనిషి మరణించిన తర్వాత మరణించిన శరీరములోని జీవాత్మ వెంటనే క్రొత్తగా తయారై,
తల్లిగర్భమునుండి ప్రసవింపబడిన శిశుశరీరములోనికి చేరుచున్నది. అన్ని రకములా గ్రుడ్డివాడైన జీవుడు స్వయముగా
ఒక్కనిగా శిశు శరీరములో చేరడము లేదు. సృష్టి ఆదినుండి తనతో కూడా శరీరములో ఉన్న ఆత్మతో కలిసి, జోడుగా
పోయి క్రొత్త శిశు శరీరమును చేరుచున్నాడు. క్రొత్త శరీరమును చేరడములో జీవాత్మతో పాటునున్న ఆత్మ
మార్గదర్శకమవుచున్నది. అలా మృత్యువు తర్వాత ఒక్క సెకండు కూడా ఆలస్యము లేకుండా జీవాత్మ క్రొత్త శరీరమును
చేరడమునే అబస సురాలో 21వ ఆయత్నందు “మృత్యువు నిచ్చాడు, సమాధికి చేర్చాడు" అని ఉన్నది. జీవుడు ఆత్మతో
పాటు క్రొత్త శిశుశరీరమును చేరినపుడు, ఆ జీవుడు సమాధికి చేరినట్లు చెప్పబడినది. దీనినిబట్టి సమాధి అనగా! తల్లి
గర్భమునుండి పుట్టిన శిశు శరీరమని తెలియుచున్నది. ఒకమారు మరణించిన జీవుడు అనగా శరీరమును వదలిన
జీవుడు రెండవమారు సమాధినుండి లేపబడుచున్నాడు. శిశుశరీరమే సమాధి అని చెప్పుకొన్నాము కదా! జీవుడు
మరియు జీవునితో కూడాయున్న ఆత్మ రెండూ శరీరములో నిక్షిప్తమైవుండడమును సమాది చేయబడిన జీవునిగా
చెప్పుకొన్నాము. సృష్ఠి ఆదినుండి జీవరాసులు పుట్టుక విషయములో సమానముగా అందరికీ వర్తించునది, కావున
దీనిని సమాధి లేక సమాది అని చెప్పుకొన్నాము. ఒక మనిషియొక్క జీవిత ప్రారంభములో శిశుశరీరము లేక క్రొత్త
శరీరమను సమాధినుండి మనిషి లేపబడుచున్నాడు.
ఇక్కడ సమాధినుండి లేపబడడము అనగా! శిశుశరీరములోనికి చేరి నిక్షిప్తమైయున్న జీవున్ని, తిరిగి ప్రపంచ
మెలుకువలోనికి తేవడమేనని అర్థము. ప్రతిదినము మనము నిద్రపోవువానిని లేపుచున్నాము కదా! అట్లే మొదట శిశు
శరీరములోనున్న జీవున్ని బయట ధ్యాసలోనికి తేవడమును సమాధినుండి లేపడము అని చెప్పవచ్చును. ప్రతి దినము
మనిషి నిద్రలోనికి పోయి శరీరమందు నిక్షిప్తమై పోవుచున్నాడు. అలాంటి మనిషిని శరీరము నుండి మరియొక మనిషి
లేపవచ్చును. అయితే జీవితము ప్రారంభములో అనగా మొట్టమొదట లేపువాడు దేవుడేనని జ్ఞాపకముంచకోవలెను.
12

Page 13
ఆదిలో లేపడమునే సమాధి అనుచున్నాము. తర్వాత జీవితములో ఎప్పుడు లేచినా నిద్రనుండి లేవడమే జరుగుచున్నది.
నిద్ర కూడా అందరికీ సమమే అయినా నిద్రనుండి లేవడము కూడా అందరిలో సమానముగానే ఉండినా, అది ఆదిలో
జరిగే పనికాదు. కావున సమాదినుండి లేవడము అని అనలేము. జీవితములో మొదట లేపబడిన తర్వాత ఎప్పుడు
లేచినా, ఎవ్వరు లేపినా అది నిద్రనుండి లేవడమేగానీ, సమాధినుండి లేచినట్లు కాదు. జీవితము మొదటి భాగములో
శిశు శరీరమే సమాధి, ఆదిలో లేపబడడమే సమాధినుండి లేపబడడము అని చెప్పవచ్చును. అంతేకాక జీవితములో
నిద్రనుండి ఎవరైనా లేపవచ్చును. కానీ ఆదిలో శిశుశరీరమునుండి ఎవరినీ ఎవరూ లేపలేరు. అది ఒక్క దేవునికి
మాత్రమే సాధ్యము.
ఒక మనిషిని దేవుడు సృష్టించాడు, అతనికి జీవితాన్నిచ్చాడు, మృత్యువునూ ఇచ్చాడు, తర్వాత సమాధికి చేర్చాడు.
తిరిగి సమాధినుండి లేపాడు. దీనిని ఏ మనిషీ కాదనలేడు. దీనినే భగవద్గీతలో పుట్టినవాడు చావక తప్పదు,
చచ్చినవాడు పుట్టక తప్పదని దేవుడు చెప్పడమేకాక మనిషికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము తర్వాత
మరణము తప్పదని కూడా చెప్పాడు. ఇదే విషయమునే పవిత్ర ఖురాన్ గ్రంథములో కూడా అబస సురాలో 19,20,21,22
ఆయత్లలో “అల్లాహ్ అతనిని పుట్టించాడు, అతని భాగ్యాన్ని (కర్మను) నిర్ణయించాడు. తర్వాత అతని జీవన మార్గాన్ని
సుగమం చేశాడు. తర్వాత మృత్యువునిచ్చాడు, సమాధికి చేర్చాడు. తిరిగి ఆయన (దేవుడు) మనిషిని సమాధినుండి
లేపి నిలబెడతాడు.” ఈ విషయమును దేవుడు పూర్తిగా బహిర్గతము చేసి చెప్పినప్పటికీ, అందరికీ ప్రత్యక్ష ప్రమాణముగా
కనిపిస్తున్నప్పటికీ, మాయ ప్రభావము చేత ఇదే విషయము అత్యంత రహస్యముగా మారిపోయినది. అంతేకాకుండా
వక్రమార్గములో అర్థమైనది. సమాధి అంటే చనిపోయిన మనిషిని పూడ్చి పెట్టునది లేక కప్పిపెట్టునది అని అనుకొంటున్నారు.
మనిషి మృత దేహమును పూడ్చిపెట్టునది గోరీ అనబడును, కానీ సమాధి అనబడదు. శరీరమును కప్పివుంచునది
గోరీ, జీవున్ని కప్పివుంచునది సమాధి అని తెలియవలెను.
మృత్యువు నిచ్చాడు, సమాధికి చేర్చాడు అను ఆయత్ల ప్రకారము మనిషి మరణించిన తర్వాత క్రొత్త శిశు
శరీరానికి చేర్చబడుతాడని అర్థమగుచున్నది. అలా సమాదికి చేర్చబడినవాడు ఆ శరీర సమాధినుండి లేపబడు
చున్నాడు. సమాధినుండి లేపడము ఎవరిని అని ప్రశ్నించుకొంటే, చైతన్య ఆత్మ సంబంధమైన జీవాత్మనని తెలియుచున్నది.
శిశు శరీరము లోతులలో చేరిన జీవున్ని బయట ధ్యాసలలోనికి లేపడమే, జీవున్ని సమాదినుండి లేపడమని తెలియవలెను.
అంతేకాక అలా లేపబడిన జీవుని శరీరము ఎలా ఉండుననగా అత్ తక్విర్ సురాలో 7వ ఆయత్లో చెప్పినట్లు
ప్రళయము తర్వాత “ఆత్మలు (శరీరములో) ఏకమైనపుడు అనగా మానవుల మరణానికి ముందు ప్రపంచములో ఏ
ఆత్మ శరీరాలతో సజీవంగా ఉండేవాడో అదే విధముగా సరికొత్తగా వారు బ్రతికించబడతారు. అని హదీసు పండితులు
చెప్పినట్లు, మనిషి చనిపోకముందు ఎటువంటి శరీరముతో ఉండేవాడో అటువంటి ఎముకలు, రక్తము మాంసమున్న
శరీరములోనే బ్రతికించబడుతాడు. కొందరు క్రొత్తగా బ్రతికించబడు శరీరమును గురించి కూడా పొరపాటుపడ్డారని,
అటువంటి వారు మనిషి చనిపోయిన తర్వాత పాత శరీరమునే జీవుడు తిరిగి పొందుచున్నాడని అనుకొనుచున్నారు,
అది పొరపాటు. ఎందుకనగా! మనిషి మరణించిన తర్వాత మృతదేహము శిథిలమై పూర్తి కనిపించకుండా పోవుచున్నది.
అది పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమితో కలిపోవుచున్నది. తిరిగి క్రొత్త శరీరమును సమాధిగా
జీవుడు పొందిన, అది పంచభూతములతో తయారైనదై ఉండును. మరియు మొదటి శరీరములోనున్న రక్తమున్నట్లే
రక్తముండును. అట్లే పాత శరీరములో ఉన్నట్లే ఎముకలు, కండలు ఉండును. కానీ అవి క్రొత్తవిగా ఉండును. పాతవన్ని
13

Page 14
ప్రళయములో (మరణములో) పోయి తిరిగి క్రొత్తవి, జన్మలో కలుగుచున్నవి. ప్రవక్తగారు అదే శరీరముతో లేపబడుదురు
అన్నపుడు, ఆ శరీరము పాత దానివలె అన్నీ ఉండునదని అర్ధము. కానీ కుళ్ళిపోయి నాశనము చెందిన శరీరము
కాదని తెలియవలెను. దేవుడు ఎన్ని శరీరములనైనా నాశనము చేయగలడు. అట్లే ఎన్ని క్రొత్త శరీములనైన సృష్టించనూ
గలడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఏదైనా చేయగలడు. క్రొత్త శరీరములను సృష్టించు స్థోమతగల దేవుడు
నాశనమైన శరీరముల జోలికి పోడు. క్రొత్తది సృష్టించగల దేవుడు పాతదానిని తిరిగి సరిచేయవలసిన (రిపేరు
చేయవలసిన) అవసరము లేదు. అందువలన పాత శరీరములవలెనున్న క్రొత్త శరీరములలో తిరిగి మనిషిని
లేపగలుగుచున్నాడు. క్రొత్త శరీరమే సమాధి. జీవితములో మనిషికి మొదటి జ్ఞప్తియే సమాధినుండి లేవడము. మనిషి
శరీరము నశించడమూ, చనిపోవడమూ, తిరిగి క్రొత్త శరీరముతో పుట్టడమూ జగతిలో ప్రత్యక్షముగా జరుగుచున్న
సత్యము. దేవుడు సత్య స్వరూపుడు. కావున దేవుని మాట ప్రత్యక్ష ప్రమాణము, అందువలన దేవుడు చెప్పినది
ఏదైతేవుందో అది జరుగుచున్నది. జరుగుచున్న విషయమును విశదీకరించుకొని చూచినప్పుడు అందులో దేవుడు
చెప్పిన సత్యము తెలియుచున్నది. భూమిమీద ఎందరో పుట్టి తమ గతజన్మలోని సంగతులను చెప్పగలుగుచున్నారు.
దానినిబట్టి మనిషికి ప్రత్యక్షముగా పునర్జన్మలున్నవని తెలియుచున్నది. పునర్జన్మలో ప్రత్యక్షముగా దేవుడు చెప్పినట్లు,
శరీర సమాదినుండి మనిషి లేవడము కూడా జరుగుచున్నది. మళ్ళీ పుట్టినపుడు మనిషికి క్రొత్త శరీరము కూడా
వచ్చినట్లు అందరికీ తెలియుచున్నది. మన ఎదుటే జరుగుచున్న, దేవుడు చెప్పిన సత్యమును గ్రహించుకోలేక, ఇప్పుడు
కాదు ఎప్పుడో జరుగుతుందనుకోవడము పొరపాటు. ఎప్పుడో జరుగునని చెప్పడము వలన దేవుని మాటను మభ్యపరచడమే
అగును. దానివలన అది సత్యమో అసత్యమో అను అనుమానము కూడా రాగలదు. జరుగుచున్న సత్యమును గమనించని
వాడు నిజముగా కళ్ళున్న గ్రుడ్డివాడగును. జ్ఞాననేత్రము లేనివాడగును.
పవిత్ర ఖురాన్ గ్రంథములోగానీ, పరిశుద్ధ బైబిలు గ్రంథములోగానీ, పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీతలోగానీ
ప్రవక్తలు చెప్పిన మాటలు దేవుని వాక్యములే అయినా, ఆ వాక్యములు మనిషికి సరిగా అర్థము కాకుండా పోయాయి.
అందువలన చెప్పినది ఒకటయితే మనిషి అర్థము చేసుకొన్నది మరొకటగుచున్నది. అలా అర్థము చేసుకోవడము వలన
దేవుని సందేశము మూల గ్రంథముల రూపములో మనముందే ఉండినప్పటికీ, అందులోని సత్యము మనము పూర్తిగా
అర్థము చేసుకోలేక పోయాము. దేవుడు చెప్పిన కొన్ని విషయములే మనిషికి అర్థమైవుండవచ్చును. కానీ అన్ని
వాక్యములు అర్థము కాలేదని చెప్పవచ్చును. అలా ఎందుకు జరుగుచున్నది? దేవుడు చెప్పినా మనిషి ఆ విషయములను
పూర్తిగా ఎందుకు గ్రహించుకోలేక పోతున్నాడు అని యోచిస్తే తెలియునది ఏమనగా! దేవుడు మనిషిని పుట్టించకముందే
ప్రకృతిని పుట్టించాడు. తర్వాత మనిషినీ, జీవరాసులనూ పుట్టించాడు. పరమాత్మ (దేవుడు) వలన పుట్టిన ప్రకృతి ఐదు
భాగములుగా విభజింపబడినది. ఆ ఐదు భాగముల ద్వారా మనిషి శరీరము తయారైనది. మనిషి శరీరములో
పరమాత్మకు సంబంధించిన ఆత్మ, జీవాత్మ అను రెండు ఆత్మలు నివసిస్తున్నవి. పరమాత్మతో కూడా అయితే మనిషి
శరీరములో మూడు ఆత్మలు నివసించినట్లగును. దీనిప్రకారము ఒక సజీవ మనిషి శరీరములో మూడు ఆత్మలు, ఐదు
ప్రకృతి భాగములు నివసిస్తున్నవి. కానీ మూడు ఆత్మలలో దేవుడైన పరమాత్మను లెక్కించుకోకుండ చెప్పుకోవడము
ధర్మము. కావున ఒక శరీరములో జీవాత్మ, ఆత్మలను మాత్రమే చెప్పుకోవలసి వస్తున్నది. ప్రకృతి చేత పుట్టినది
శరీరములో ముఖ్యమైనది మరొకటున్నది అదియే మాయ (సాతాన్) లేక సైతాన్ అని పిలువబడుచున్నది. మరణములో
శరీరము నశించినా, జీవాత్మ ఆత్మలు నశించక తిరిగి ఎలా జన్మిస్తున్నవో, అలాగే మాయ కూడా శరీరము ప్రళయములో
నాశనము చెందక, జీవునితో పాటు ప్రయాణించి క్రొత్త శరీరమును చేరుచున్నది.
14

Page 15
ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! పరమాత్మ తన సృష్టిని సృష్టించినపుడు మొట్టమొదట
ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతి ద్వారా జీవరాసుల శరీరములను సృష్టించాడు. ప్రకృతి ద్వారా తయారైన శరీరములు
మరణములో నాశనమును పొందినా, ప్రకృతి మాత్రము నాశనము కాకుండా మిగిలివున్నది. సృష్ఠి ఆదినుండి
సముద్రములు, భూమి, ఆకాశము, అగ్ని, గాలి ఎట్లున్నవో సృష్టి అంత్యము వరకు అట్లే వుండును. సృష్టి అంత్యమైన
మహా ప్రళయములో ప్రకృతి నశించిపోవును. మహా ప్రళయములో కూడా నాశనముకాని వాడు దేవుడు ఒక్కడే. ఇటు
ప్రపంచమున్నపుడుగానీ, అటు ప్రపంచము లేనపుడుగానీ ఏకస్థాయిగా ఉన్నవాడు దేవుడు ఒక్కడే. ప్రపంచము సృష్ఠింపబడిన
తర్వాత శరీరములు ఎన్నిమార్లు నాశనమైనాగానీ, జీవుడు ఎన్నిమార్లు తిరిగి పుట్టినా గానీ ప్రకృతి నాశనముకానట్లే,
ప్రకృతి జనితమైన మాయకూడా నాశనము కాకుండ ఉన్నది. ప్రకృతిని విభజించి చూస్తే ఐదు భాగములుగా
ఉన్నట్లు, మాయను విభజించి చూస్తే మూడు భాగములుగా ఉన్నది. మహా ప్రళయము వరకు నాశనము కాకుండా
ఐదు భాగముల ప్రకృతి ఎలా ఉన్నదో, అలాగే మహాప్రళయము వరకు మూడు భాగముల మాయ నాశనము కాకుండా
ఉంటుంది.
తనకు ప్రత్యర్థిగా ఉండుటకు దేవుడే స్వయముగా మాయను సృష్టించాడు. దేవునికి వ్యతిరేఖముగా నడుచునట్లు
దేవుడే మాయను అజ్ఞాపించాడు. దేవునిచేత సృష్ఠింపబడిన మాయ దేవునికి సర్వకాలములందు విధేయత, వినమ్రత
కల్గినదై దేవుని ఆజ్ఞను తప్పనిసరిగా పాటిస్తూవున్నది. దేవుడు పురుషుడుకాగా ప్రకృతి స్త్రీగావున్నది. స్త్రీలింగమైన
ప్రకృతి చేత దేవుడు పుట్టించిన మాయ కూడా స్త్రీతత్త్వముగానే చెప్పబడుచున్నది. దేవుని ఆజ్ఞచేత ప్రకృతికి పుట్టిన
మాయ సృష్ట్యాదినుండి దేవుని ఆజ్ఞ ప్రకారము దేవునికి వ్యతిరేఖముగా నడుస్తూ ప్రజలను నడిపిస్తున్నది. మాయ
ప్రజలను ఎలా నడిపిస్తున్నదనగా! మాయ అనునది మూడు భాగములైన గుణములుగా మనిషి తలలో తిష్టవేసుకొని
ఉన్నది. తన గుణములయందే జీవున్ని నివసించునట్లు చేసుకొన్నది. సాత్త్విక, రాజస, తామస గుణ భాగములైన
మాయ మానవున్ని దేవునివైపు పోకుండా చేయుటకు తన పని తాను చేయుచున్నది. దేవుడు తన ప్రవక్తల ద్వారా తన
జ్ఞానమును మహా గ్రంథములనుండి చెప్పించితే, మాయ మాత్రము తన గుణముల ద్వారా తన భావమును మనుషులకు
అంటగట్టుచున్నది. ఒక ప్రవక్త ద్వారా ఒక దేవుని ధర్మమును చెప్పించితే, అది మాయ ప్రభావము వలన వేరు
విధముగా అర్థమైపోవుచున్నది. అందువలన దేవుని జ్ఞానము పూర్తిగా ఎవరికీ అర్థము కాకుండా పోయినది. దేవుడు
ఒక భావముతో చెప్పితే దానినే మాయ మరొక భావముతో అర్థమగునట్లు చేయుచున్నది. అందువలన భగవద్గీత
హిందువులకు (ఇందువులకు), బైబిలు క్రైస్తవులకూ, ఖురాన్ ముస్లీమ్లకూ పూర్తిగా దేవుడు చెప్పిన భావము ప్రకారము
అర్థము కాలేదని చెప్పవచ్చును.
భూమిమీద ఏ మతస్థునికైనా గానీ తలవుంటుంది. ఆ తలలో త్రిగుణ రూపములో మాయ వుంటుంది. ఏ
మతస్థుడైనా గానీ సాతాన్ లేక సైతాన్ అనబడు మాయను దాటి దేవుని వైపు పోవాలంటే చాలా దుస్సాధ్యము. ఈ
మాట నేను చెప్పునది కాదు. భగవద్గీతలోని వాక్యమే ఇలా ఉన్నది. "గుణమయీ మమ మాయా దురత్యయా”
గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది అని చెప్పబడినది. మూల గ్రంథములోనే మాయ దుస్సాధ్యమైనదని
చెప్పినపుడు దానిని జయించుట సులభము కాదు. మాయ మనిషిలో ఉండి ఎవరిచేతా గుర్తింపబడకుండా మసలుకొంటూ,
నీవు దేవుని మార్గములోనే ఉన్నావు అనునట్లు నమ్మించి అందరిని తన మార్గములో నడుపుకొనుచున్నది. మేము పెద్ద
జ్ఞానులము అనుకొను వారు కూడా మాయ భావములో పడి, దానినే దేవుని భావముగా తలచుట వలన, దేవుని
15

Page 16
భావము తెలియకుండా పోయినది. మనము ఇంతవరకు చెప్పుకొన్న పునర్జన్మ విషయములోగానీ, సమాధి విషయములో
గానీ మాయ ప్రభావము చేత దేవుని భావము కప్పబడి పోయినందు వలన సమాధి మృత శరీరమునకనీ, పునర్జన్మలు
లేవనీ, ప్రళయము అనేక యుగముల అంత్యములోనని తప్పుగా అర్థము చేసుకొన్నారు. మాయ మిమ్ములను మభ్యపెట్టినదని
మేము (నేను+నా ఆత్మ) చెప్పినా, మాయ వారికి మమ్ములను తప్పుగా చూపించి, మా మాటను ఏమాత్రము వినకుండా
చేయుచున్నది. ఎవనికి వాడు స్వచ్ఛమైన దైవమార్గములో ఉన్నట్లు, మాయ భ్రమింప చేయుట వలన ధర్మములు,
అధర్మములుగానే మిగిలి పోవుచున్నవి. అధర్మములను నాశనము చేసి తిరిగి ధర్మములుగా మార్చు పనిని దేవుడే
చేయవలెను, కానీ మనుషులైన మాబోటి వారితో కాదు.
మాయ దేవుని గొప్పతనమును తగ్గించు భావములను దైవమార్గము లో గొప్ప జ్ఞానులమనుకొన్న వారిచేతనే
చెప్పించగలుగుచున్నది. దేవుని మీద పూర్తి విశ్వాసముతో దేవునికి ఎల్లప్పుడు విధేయులుగా ఉన్నామనుకొను వారిచేత
వారికి తెలియకుండానే దేవుని మీదనే అనుమానము వచ్చునట్లు, దేవుని గొప్ప తనమును తగ్గించునట్లు చెప్పించుచున్నది.
ఒకచోట దేవుడు చెప్పిన మాట విలువను తగ్గించునట్లు దానికి వ్యతిరేఖమైన మాటను దైవజ్ఞానుల మనువారిచేతనే
చెప్పించుచున్నది. ఈ విధముగా ఎందరో జ్ఞానులు మాయ ప్రభావములో ఉంటూ వెనుక ముందు ఆలోచించకుండా
దేవుని జ్ఞానమును గురించి చెప్పుచున్నారు. అలా చెప్పుట వలన వారు చెప్పినమాట దేవుడు ముందు చెప్పిన వాక్యమునకు
విభిన్నముగా ఉండును. అలాగే వెనక జరుగు ప్రత్యక్ష సంఘటనకు కూడా భిన్నముగా ఉండును. అయితే అటువంటి
ధ్యాసలేకుండా మాయ, మనిషి చేత తన భావమునే చెప్పించుచున్నది. దేవుని భావము, తన భావము ఒక్కటేనని
అందరినీ భ్రమింపజేయుచున్నది. ఈ విషయము మీకు బాగా అర్థము కావాలంటే ఒక దైవజ్ఞాని దైవత్వమును
బోధించునపుడు ఇది దేవుని జ్ఞానమేనని అతనిని నమ్మించి ఎలా చెప్పించుచున్నదో ఉదాహరణకు చూడండి.
ఈ విషయమును చెప్పేదానికంటే ముందు మేము ఈ దినము (18.09.2011) నేషనల్ జియోగ్రఫి టీవీ
ఛానల్లో ఒక ప్రోగ్రామ్ను చూచాము. అది “టెన్ ఇయర్స్ ఆఫ్ ఒసామాస్ టెర్రర్" (Ten Years Of Osama's Terror)
అను ప్రోగ్రామ్లో ఇరాక్ టెర్రరిస్టులు ఐదుమంది ఒకచోట నిలబడి ఉన్నారు. ఐదుమంది ఉగ్రవాదులు నల్లని దుస్తులు
ధరించి ముఖానికి ముసుగులు కూడా ధరించియున్నారు. ఆ ఐదుమందికి ముందర రోజ్ కలర్ దుస్తులు ధరించిన
వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఐదుమంది నిలబడియున్న ఉగ్రవాదులు ఇరాక్ దేశమువారు కాగా, వారిముందర కూర్చునివున్న
వ్యక్తి అమెరికా దేశస్థుడు. యాత్రికునిగా వచ్చిన అమెరికా పౌరున్ని ఇరాక్ ఉగ్రవాదులు బంధించి తమవద్ద పెట్టుకొన్నారని
అర్థమైనది. అక్కడ ఇరాక్ ఉగ్రవాదులు తమకు అమెరికా దేశము శత్రుదేశమనీ, ఆ దేశము మీద ఉన్న వ్యతిరేఖతతో
ఈ అమెరికా పౌరున్ని శిక్షించుచున్నామని, దానితో తమ ఉగ్రవాదము యొక్క బలమేమిటో అమెరికాకు తెలుస్తుందని
చెప్పి, ఒకమారుగా తమ ముందు కూర్చున్న అమెరికా పౌరున్ని ప్రక్కకు త్రోచి అతనికి శిరచ్ఛేదము చేశారు.
దృశ్యమును వారు వీడియో తీసి అమెరికాకు పంపారు. అదే దృశ్యమునే టీవీలో చూపడము జరిగినది. ఆ దృశ్యమును
నేను ఒక్కడినే కాకుండా ఆ సమయములో నా గదిలోనున్న మరికొందరు కూడా చూచారు. నాతోపాటు ఆ దృశ్యమును
చూచిన వారికి ఆ సంఘటన చాలా కూౄరమైన పనిగా కనిపించినది. అప్పుడు వారు “ఇది ఎంత దుర్మార్గమైన పని,
అమెరికా ప్రభుత్వము ఉగ్రవాదులకు చెడు చేసివుంటే ఆ ప్రభుత్వము మీద కోపముండవచ్చును. వారు అమెరికా
ప్రభుత్వము మీద కక్షను తీర్చుకోవచ్చును. ప్రభుత్వములో ఉండి తమకు చెడు చేసిన నాయకుల మీద శత్రుత్వమును
పెంచుకోవచ్చును. దానికి తగినట్లు చెడు చేసిన వారిని హింసించవచ్చునూ, చంపవచ్చునూ, తమ కోపమును తీర్చు
ఆ
16

Page 17
కోవచ్చును. అయితే ఇక్కడ యోచిస్తే ప్రభుత్వము వేరు ప్రజలు వేరుకదా! ప్రభుత్వము పాలించునది, ప్రజలు
పాలించబడువారు కదా! ప్రజలు తమ బ్రతుకు తాము బ్రతుకుచున్నారు కానీ, ఇతర దేశస్థులకు వారు శత్రువులు కారు
కదా! ఏ శత్రుత్వము లేని ప్రజల మీద ఉగ్రవాదులు తమ కక్షను తీర్చుకోవడము కూరత్వమూ, దుర్మార్గము తప్ప
ఏమీకాదనీ, ఇది మనుషులు చేయదగిన పనికాదనీ, అమానుషమనీ ఉగ్రవాదులైనంతమాత్రమున ఎవరి మీద కోపముతో
ఎవరిని శిక్షిస్తున్నామను యోచనగానీ, ఆలోచనగానీ వారికి ఉండదా? శత్రువుమీద దాడి చేయడమూ, చంపడము
యుద్ధనీతి అవుతుంది. కానీ శత్రువుకాని వానిమీద దాడి చేయడమూ, చంపడమూ యుద్ధనీతి అనిపించుకోదు. ఇది
మనిషి చేసే రాక్షసత్వము అనిపించు కొంటుంది. దీనికి మీరేమంటారు.” అని నన్ను అడిగారు.
అప్పుడు నేను ఇలా చెప్పడము జరిగింది. మీకుగానీ నాకుగానీ ఇరాక్ ఉగ్రవాదులు చేసినది తప్పుగా కనిపించినా,
వారికి అది ఒప్పుగానే కనిపించియుండును. మనము ఆ పనిని కూౄరమైన పనిగా చెప్పినా, అది వారికి వీరులు చేసే
సాహస పనిగా కనిపించియుండవచ్చును. ఒక మనిషి ఎదుటి వారి దృష్టిలో తప్పు చేసినా, అది ఆ మనిషికి సమర్థనీయమైన
పనిగా ఉండవచ్చును. ఇప్పుడు మీరు నన్ను అడిగినట్లు ఈ మధ్య కాలములో ముంబాయినగరమందు జరిగిన ఉ
గ్రవాదుల దాడిని గురించి, ఉగ్రవాదమును సమర్థించు ఉగ్రవాద సానుభూతిపరున్ని ఇలా ప్రశ్నించాను. “ముంబాయి
నగరములో తమతో ఏ శత్రుత్వములేని అమాయక ప్రజలను ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్చి చంపడము న్యాయమేనా?
దేవుడు ఈ చర్యను ఒప్పుకుంటాడా? అని అడిగాను. దానికతను చెప్పిన సమాధానము నాకు ఆశ్చర్యమును కల్గించినది.
ఒక దేశ నాయకునికి కనువిప్పు కల్గించుట కొరకు ఆ దేశములోని ప్రజలను హింసించినా ఫరవాలేదు. ఆ దేశాధిపతిని
మార్చుటకు లేక పరీక్షించుటకు అతని రాజ్యములోని వానిని బాధపెట్టినా లేక చంపినా తప్పేమీ కాదు. అలాగే
అమెరికా దేశాధిపతిలో మార్పును తెచ్చుటకు ఆ దేశ పౌరున్ని చంపినా తప్పేమీ కాదన్నాడు. దానికి నేను బదులుగా
“ఇదేమి న్యాయము? ఎవడో నీకు శత్రువైతే వానిమీద దాడి చేయక నీతో ఏ శత్రుత్వమూలేని, నీతో ఏ సంబంధమూలేని
వానిమీద దాడి చేయడము పాపకార్యమగును. దేవుడు ఇటువంటి కార్యము ఏమాత్రము ఒప్పుకోడు. ఒక ఇంటి
యాజమని ప్రక్క ఇంటి వారిని నష్టపరిస్తే, నష్ట పోయిన వ్యక్తి నష్టము చేసిన వ్యక్తి ఇంటిలోని బాలున్ని బజారులో
దొరికాడని చంపితే, సమాజము ఒప్పుకుంటుందా? ఏ పాపమూ తెలియని పిల్లవానిని చంపడము అన్యాయమూ,
అక్రమము అంటుంది కదా! అదే విధముగా అమెరికా అను ఇంటి యజమాని అయిన జార్జిబుష్ మీద కోపముతో ఏ
పాపము తెలియని ఆ దేశ (ఇంటి) ప్రజలను హింసించి చంపడము కూడా అన్యాయము, అక్రమమూ అమానుషము
అగును కదా! ఇటువంటి పనిని చేసిన వారు దేవుని దృష్ఠిలో శిక్షార్హుడగును” అని అన్నాను.
నా మాటను వినిన వ్యక్తి చిన్నగ నవ్వి దేవుని లెక్కలో మేము శిక్షార్హులమా? నీకు తెలుసో తెలియదో దేవుడు
ఇదే విషయమును మా గ్రంథములో సురా అన్పాల్ (8.28)లో 28 ఆయత్నందు ఇలా చెప్పాడు. “వాస్తవానికి మీ
ఆస్తిపాస్తులూ, మీ సంతానమూ మిమ్మల్ని పరీక్షించే సాధనములని, నిశ్చయముగా దేవునివద్ద గొప్ప ప్రతిఫలమ్ ఉన్నదని
తెలుసుకోండి” అని వ్రాయబడివుంది. దీనికి మా హదీసు పండితులు చెప్పు వివరము ఇలా ఉన్నది. ఈ జీవితము
తర్వాత జీవితము కొరకు నీ ఇంటిలో ఏ పరీక్ష అయినా జరుగవచ్చును. నీ భార్య రోగగ్రస్తురాలు కావచ్చును, నీ ఆస్తి
పోవచ్చును. అలాగే నీ సంతతి అయిన చిన్న పిల్లలు కూడా ప్రమాదము వలన చనిపోవచ్చును. లేక అంగవైకల్యముగా
పుట్టవచ్చును. ఇలా కలుగు బాధలన్నీ దేవుడు నిన్ను పరీక్షించుటకు విధించునవని చెప్పవచ్చును. రెండేళ్ళ వయస్సున్న
నీ కొడుక్కు భయంకరమైన జబ్బువచ్చి అది ఎక్కడా నయము కాకుండ ఆ బాలుడు నిత్యము బాధపడడము దేవుడు
నీ
17

Page 18
నీకు పెట్టిన పరీక్ష. నిన్ను పరీక్షించుటకు నీ చుట్టువున్న వ్యక్తులను గానీ, ఆస్తులనుగానీ, సౌకర్యములనుగానీ దేవుడు
వాడుకొనును. అంత పెద్ద దేవుడే ఒక మనిషిని పరీక్షించుటకు అమాయకుడైన వాని కొడుకును రోగగ్రస్థునిగనో,
అంగహీనునిగానో చేయునపుడు, అది సమంజస కార్యమే అయినపుడు, మేము అమెరికా వానిని పరీక్షించుటకు లేక
మార్చుటకు అమాయకుడైన ఆ దేశ పౌరున్ని చంపడములో తప్పేమి లేదు కదా!” అని వివరముగా చెప్పాడు.
అతను గొప్ప గ్రంథములోని వాక్యమును తీసుకొని ఉదాహరణతో సహా వివరించినపుడు అతని మాటకు
బదులుగా ఏమీ చెప్పలేకపోయాను. కానీ దేవుడు ఈ విధముగా చెప్పియుండునా అను అనుమానము వచ్చుట వలన
16-05-2010వ దినమున నాకు పరిచయమున్న ఇస్లామ్ మత పెద్దలైన, దేవున్ని గురించి ఎంతో పెద్ద ఉపన్యాసములిచ్చు
పండితులైన ఇద్దరు వ్యక్తుల దగ్గరకు పోయి, “ఒక వ్యక్తి పవిత్ర ఖురాన్లోని వాక్యము ఇలా ఉన్నదని వివరముగా
చెప్పాడు. అయినా ఈ వాక్యములో నాకు కొంత సంశయమున్నది. దానిని గురించి మీరు వివరించి చెప్పండి” అని
అడిగాను. అప్పుడు వారు ఇలా అడిగారు.
హదీసు జ్ఞానులు :- దివ్య ఖురాన్లో ఏ సురాలోని వాక్యము?
నేను :- సురా అన్ఫాల్, ఆయత్ 28
హదీసు జ్ఞానులు
:- అందులో దేవుడు మనిషిని ఏ విధముగానైన పరీక్షించ వచ్చునని తెలియబడినది. దీనిలో నీకు
ఏమి అర్థము కాలేదు?
నేను :- దేవుడు చెప్పిన వాక్యములో నాకు ఎటువంటి సంశయమూ లేదు. ఎందుకనగా ఖురాన్ గ్రంథములో
చెప్పబడిన దేవుని సందేశము, దేవుడు పంపిన మాట సత్యమైనది. వచ్చిన అనుమానమంతా ఆ వాక్యమును సరిగా
అర్థము చేసుకొన్నామా లేదా అనియే, నేను ఖురాన్ దైవగ్రంథమను విశ్వాసముతో అంతా కాకున్నా కొంతవరకైనా
చదివాను. అందులో నాకు అర్థమైనదానికీ, వారు చెప్పిన దానికీ కొంత వ్యత్యాసమున్నది. ఇదే విషయమును గురించి
నేను చదివిన 29వ సురా అన్కబూత్లో 2వ ఆయత్ నందు ఇలా ఉన్నది. "మేము దైవాన్ని విశ్వసించాము అని
ప్రజలు అన్నంత మాత్రమున తాము విడిచిపెట్టబడతారనీ, తాము పరీక్షింపబడరనీ భావిస్తున్నారా” అని కలదు. ఇక్కడ
"పరీక్ష" అను పదము వచ్చినా అది ఏ అర్థముతో కూడుకొన్నదో కొంత తెలియబడినది. దైవము మీద విశ్వాసము లేని
చోట పరీక్షింపబడుట వేరు అర్థమునియ్యవచ్చును. కానీ దైవము మీద విశ్వాసమున్న చోట పరీక్షింపబడుట విశేషార్థముతో
కూడుకొని ఉన్నది. ఇదే విషయమునకు సంబంధించినది భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగములో 22వ
శ్లోకము చెప్పినపుడు మొత్తము హిందువులు దానిని అర్థము చేసుకోలేక అపార్థము చేసుకొన్నారు. ఆ శ్లోకమునకు
భావమును వ్రాసిన స్వామీజీలు మొత్తము దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేఖ భావమును వ్రాశారు. వారు వ్రాసినది
నూటికి నూరుపాళ్ళు అసత్యమైనా, దానిని వారు ఏమాత్రము యోచించకుండా సత్యమే అనుకొన్నారు. భగవద్గీతలో
ఒక్క శ్లోకమునే కాకుండా వివరించి చూపితే అనేక శ్లోకములకు భావదోషము ఏర్పడినది. చెప్పిన ఆధ్యాత్మికవేత్తలందరూ
పప్పులో కాలు వేయడమేకాక, తాము పొరపాటు పడినామనీ గుర్తించుటకు కూడా వీలు లేకుండా మాయ చేసినది.
అలాగే కొంత బైబిలులోనూ, కొంత ఖురాన్లోనూ ప్రవక్త చెప్పినది ప్రజలు సరిగా అర్థము చేసుకోలేక పోయారనుకుంటాను.
18

Page 19
ప్రవక్తలు చెప్పిన భావమును అందరూ సరిగా అర్థము చేసుకోలేద నుటకు ఉదాహరణగా ఒక విషయమును
గమనిద్దాము. "ఆదర్శ మహిళ హజ్రత్ ఆయిషా" అను పుస్తకములో ఒకచోట 141 పేజీలో ఇలా వ్రాయబడి ఉన్నది.
“హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ ప్రాణాలు పోతుండగా క్రొత్త బట్టలు తెప్పించుకొని తొడుక్కొన్నాడు. కారణము అడగ్గా
“ముస్లీమ్ ఏ దుస్తుల్లో మరణిస్తే ఆ దుస్తులతోనే లేపబడుతాడు" అని చెప్పారాయన. హజ్రత్ ఆయిషాకు ఈ సంగతి
తెలిసింది. “ఓ ప్రభూ! అబూ సయీద్ పై దయదలచు. దుస్తులు దైవప్రవక్త దృష్టిలో కర్మలు (ఆచరణలు) అని భావము.
ప్రజలు ఖియామత్ నాడు నగ్న శరీరముతో, తలనుండి కాళ్ళ వరకు అనిచ్చాదీన శరీరాలతో లేపబడతారని దైవ ప్రవక్త
స్పష్టముగా చెప్పి యున్నారు.” అని మహమ్మద్ ప్రవక్తగారి నాల్గవ భార్య హజ్రత్ ఆయిషాగారు చెప్పడము జరిగినది.
ఈ సమాచారమును బట్టి మహాప్రవక్త గారి భావము ఒకటైతే ప్రవక్తయున్న కాలములోనే దానిని వేరు విధముగా
అర్థము చేసుకొన్నవారున్నపుడు, ఇప్పుడు ఆ విధముగానే కొన్ని వాక్యములను అర్థము చేసుకోవడములో కొందరు
పొరపాటు పడివుండవచ్చును కదా!
హదీసు జ్ఞానులు :- ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉండవచ్చును. కానీ పూర్తి భావము మారిపోవునంత పొరపాటు ఎక్కడా
కనిపించడము లేదు. ఏదైనా సందర్భానుసారము చూచుకొంటే అర్థము సరిపోతుంది. సందర్భమును చూడకపోతే
కొంత భావము మారవచ్చును. ఏదైనా అనుమానము వస్తే అడిగి సంశయమును నివృత్తి చేసుకోవచ్చును. చర్చల
వలన దైవజ్ఞానమును బాగా అర్థము చేసుకోవచ్చును.
నేను :- చర్చల వలన దైవజ్ఞానము అనుమానము లేకుండా అర్థము కాగలదని నేను అనుకోవడము వలన దైవ
సందేశములను బాగా తెలిసిన మిమ్ములను కలిసి అడుగుచున్నాను. మీరు నా సంశయములకు విసుగుకోక సమాధానము
చెప్పుదురని కోరుచున్నాను. మొదటి ప్రశ్న ఏమనగా! మనిషి ఒకమారే పుట్టుచున్నాడా? లేక అనేకమార్లు పుట్టుచున్నాడా?
హదీసు జ్ఞానులు :- ఒక మనిషి ఒకేమారు పుట్టును, ఒకేమారు మరణించును. అనేక మార్లు పుట్టడములేదు, అట్లే
మరణించడము లేదు.
నేను :- ఇది దేవుడు చెప్పినదా లేక మనిషి చెప్పినదా?
హదీసు జ్ఞానులు :- ఇది దివ్య ఖురాన్ గ్రంథములో దైవసందేశముగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్తగారు చెప్పినది.
నేను :-
:- ప్రవక్తగారు చెప్పిన వాక్యము సత్యమైనదని పూర్తిగా విశ్వసిస్తున్నాను. అయితే ప్రవక్తగారు చెప్పినది దైవసందేశము.
దైవసందేశము ఎప్పటికైనా శాసనముగా నిలిచివుంటుంది. శాసనము జరిగితీరుతుంది. అయితే జరిగిన ప్రత్యక్ష
సంఘటనలను బట్టి చూస్తే ప్రవక్త చెప్పిన వాక్యమును తప్పుగా మనము అర్థము చేసుకొన్నామేమో అని తెలియుచున్నది.
మనిషి ఒకేమారు జన్మిస్తాడు అంటే అనేక ప్రశ్నలు వస్తాయి, చివరకు జవాబులేని ప్రశ్న మిగులుతుంది. ఒకవేళ
ప్రయత్నము చేసి జవాబులను చెప్పినా, ఆ జవాబులు శాస్త్రబద్దత లేనివై ఉండును. శాస్త్రబద్ధత లేని జవాబు సత్యము
కాదు. అందువలన ప్రవక్తగారు, ప్రళయములో తిరిగి శరీరముతోనే మనిషి లేపబడుతాడు అన్నమాట సత్యమేగానీ,
అది ఒకేమారా, అనేకమార్లా అని అర్థము చేసుకోవడములో మనము పొరపడ్డామేమోనని అనుమానము వస్తున్నది.
దానిని అలా వదలి మనిషి ఒకేమారు పుట్టుచున్నాడు అని అర్థము చేసుకొంటే వెంటనే ఒక ప్రశ్న వస్తున్నది. అదేమనగా!
మనిషి ఒకేమారు పుట్టి ప్రళయములో ఒకేమారు లేపబడితే, అలా లేపబడిన తర్వాత ఆ జీవితమును ఏమనాలి?
ఎందుకు మనిషి ప్రళయములో లేపబడతాడు?
19

Page 20
హదీసు జ్ఞానులు :- మనిషి తన జీవితములో చేసుకొన్న మంచి పనులను, చెడు పనులను ప్రళయ దినమున సమాధినుండి
లేపినపుడు దేవుడు లెక్కించి అతను చేసిన పనులనుబట్టి స్వర్గ నరకములకు పంపును. దానిని మరణము తర్వాత
మనిషి చేసుకొన్న కర్మ లిఖితమును బట్టి స్వర్గ నరకములను మనిషి అనుభవించే దానికి
జీవితము అంటాము.
లేపబడుతాడు.
నేను :- ఒక మనిషి తాను జీవితములో చేసుకొన్న పనులనుబట్టి (కర్మను బట్టి) పాపపుణ్యములను బట్టి రెండవ
జీవితములో లేక మరణానంతరము స్వర్గ నరకములను (సుఖదుఃఖములను) అనుభవించే దానికి పుట్టింపబడు చున్నాడు.
లేక తిరిగి సమాధినుండి లేపబడుచున్నాడు. ఇదంతా సత్యమే. ఆ మరణము తర్వాత ఆ జీవితము ఎక్కడ జరుగుచున్నది
అని ప్రశ్నిస్తే స్వర్గములో, నరకములో అని జవాబు కలదు. ఆ స్వర్గ నరకములు భూమి మీద ఉన్నాయా లేక ఎక్కడైనా
ఉన్నాయా అని ప్రశ్నిస్తే దీనికి సరియైన జవాబుగానీ, శాస్త్రబద్ధతతో కూడుకొన్న జవాబుగానీ ఏదీలేదు. ఎవరూ వాటిని
ఎక్కడో చూచారు అను ఆధారములు కూడా లేవు. అట్లని స్వర్గ నరకములు సత్యము కావా అంటే స్వర్గ నరకములను
మాటలు దేవుని చేత చెప్పబడినవి. అందువలన అవి పూర్తి సత్యమైనవే. కానీ వాటిని గురించి మనము సంపూర్ణముగా
అర్థము చేసుకోలేదని చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన స్వర్గ నరకములు మనిషి తప్పక అనుభవిస్తున్నా అవి ఎక్కడో
ఉన్నాయని చెప్పుకోవడము పొరపాటు. మనిషికి ప్రళయము తర్వాత వాడు సమాధినుండి లేపబడి మరణానంతర
జీవితమును స్వర్గ నరక రూపములలో (సుఖదుఃఖ రూపములో) భూమిమీదనే అనుభవిస్తున్నాడను సత్యమును మనిషి
తెలుసుకోలేకపోయాడు. అని మేము అనుకొంటున్నాము. ఈ విధముగా అయితే భవిష్యత్తులో ప్రశ్నలు రావు.
అంతేకాకుండ దేవుని మాట భంగము కాకుండా నెరవేర్చబడుతుందని అనుకొంటాను.
హదీసు పండితులు :- అట్లుకాదు. స్వర్గ నరక లోకములు ఉన్నాయి. భూమిమీదలేవు. మనిషి చేసుకొన్న దాని
ఫలితముగా అతను స్వర్గానికి, నరకానికి పంపబడతాడు. ఆ విధముగా ప్రళయములో దేవుడు మనిషి తప్పులన్నిటిని
లెక్కించి దానినిబట్టి తీర్పు తీర్చి స్వర్గనరకములకు పంపును. అంతవరకు చనిపోయినవాడు సమాధిలో ఉండవలసిందే.
నేను :- మీరు చెప్పినట్లు ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రళయము వరకు సమాధిలో ఉండి ప్రళయములో దేవునిచేత
సమాధి నుండి శరీరము తోనే లేపబడి స్వర్గ నరకములకు పంపబడుతాడు అని అనుకొంటే, అది పూర్తి జీవితమును
గడిపి చనిపోయిన వ్యక్తికి మీరు చెప్పిన భావము ప్రకారము జరుగవచ్చును. అట్లు కాకుండ పుట్టిన వ్యక్తి పూర్తి
జీవితమును గడపకముందే నాలుగు సంవత్సరములకే చనిపోవడము కూడా జరుగుచున్నది. అంతే కాకుండా ఒక
నెల దినములకే చనిపోవు పసి పిల్లలున్నారు. అట్లే యుక్త వయస్సు రాకనే, వివాహము కాకనే చనిపోవు వారున్నారు.
ఒక సంవత్సరములో చనిపోయిన పిల్లలుగానీ, ఒక నెలకే చనిపోయిన పిల్లలకు గానీ లెక్కించుటకు ఎటువంటి
పాపపుణ్యములుండవు. అప్పుడు ప్రళయ కాలములో సమాధినుండి లేపబడి స్వర్గానికి పంపబడతారా? నరకానికి
పంపబడతారా? బహుశా ఈ ప్రశ్నలకు జవాబు ఉండదు. అంతేకాకుండా మరణము తర్వాత స్వర్గ నరకముల కథ
అటుంచితే ప్రస్తుత జీవితములో ఒక సంవత్సరము వయస్సున్న చిన్న బాలునికి భయంకరమైన రోగము వచ్చి
బాధపడుచున్నాడు. ఎక్కడో ఉన్నదను నరకము ఎట్లున్నదో మనము చూడలేదు కానీ, సంవత్సరము వయస్సున్న
బాలుడు రోగముతో అనుభవించు బాధ ప్రత్యక్ష నరకముగా కనిపిస్తున్నది. దీనిని చూచిన తర్వాత అది నరకము కాదా
అనిపిస్తున్నది. ఎవరికైనా శిక్ష ఉంది అంటే అది తప్పు (పాపము) చేసివుంటేనే అని అర్థమగుచున్నది. ఇప్పుడు
సంవత్సరము బాలుడు రెండు సంవత్సరములు రోగముతో బాధను అనుభవించి దీనముగా చనిపోయాడు. అతని
20

Page 21
జీవితములో మంచి పనులూ చేయలేదు, మరియు చెడు పనులూ చేయలేదు. అటువంటి వానిని ప్రళయములో
సమాధినుండి లేపి దేవుడు అతనిని ఏమని విచారించును? అతనిని స్వర్గానికి పంపునా? నరకానికి పంపునా? బహుశా
దీనికి కూడా సమాధానముండదు. అంతేకాకుండా అంత చిన్న పిల్లవానికి భయంకర రోగమువచ్చి ఆ బాలుడు నన్ను
రక్షించువారు లేరా అన్నట్లు దీనంగా చూస్తూ ఏడుస్తుంటే, ప్రక్కన చూచే వారికి హృదయ విదారకముగా ఉంటూ, ఈ
పిల్లవాడు ఏమి తప్పు చేశాడని ఈ రోగము వచ్చింది. దేవున్ని అనంత కరుణామయుడు అంటారే, పుట్టినప్పటినుండి
ఏ పాపము చేయని పసి పిల్లవానికి రోగము వచ్చి బాధపడుచుంటే, తల్లితండ్రులు దేవున్ని తమ కొడుకు బాగుపడాలని
ఎంతగా వేడుకొనినా దేవుడు ఆ పిల్లవానిమీద తన అనంతమైన కరుణలోనుండి కొంత కరుణనైనా చూపవచ్చును
కదా! ఎంతోమంది దుర్మార్గులు విచ్చల విడిగా చెడుపనులు చేయుచూ హాయిగానున్న వారిని ఏమాత్రము శిక్షించక
పోయినా ఫరవాలేదు. కానీ చిన్న పిల్లవానిని రక్షించవచ్చును కదా! అని ప్రజలంటారు ఈ విషయములో తెలిసిన
పెద్దలు మీరేమంటారు.
హదీసు జ్ఞానులు :- అది దేవుడు ఆ బాలుని తల్లితండ్రులను దేవుని మార్గములో ఎంతగా ఉన్నారోనని పరీక్షించుటకు
చేసిన పరీక్ష అని చెప్పవచ్చును. అన్ఫాల్ సురాలో 28వ ఆయత్లో చెప్పినట్లు "వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ
సంతానమూ మిమ్మల్ని పరీక్షించే సాధనాలనీ, నిశ్చయముగా అల్లావద్ద గొప్ప ప్రతిఫలమ్ ఉన్నదని తెలుసుకోండి.” అని
ఉన్నదానిని బట్టి దేవుడు తల్లితండ్రులను పరీక్షించు నిమిత్తము పిల్లలకు రోగమును కలిగించవచ్చును. దానివలన తల్లి
తండ్రుల స్పందన దేవుని ఎడల ఎట్లుంటుందో తెలియును. పిల్లవానికి రోగము రావడము తల్లి తండ్రుల పరీక్ష
కొరకేగానీ వేరుకాదు.
నేను :- పరీక్ష అను పదము అన్ఫాల్ సురాలోనే కాకుండా అల్బఖరా సురాలో 155 ఆయత్లో కూడా ఇలా ఉన్నది.
"నిశ్చయముగా మిమ్మల్ని భయ ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఆదాయాల నష్టములకు గురిచేసి పరీక్షిస్తాము”
అనికూడా ఉన్నది. ఇక్కడ చెప్పినవన్నీ వాస్తవమే. ఎప్పుడు దేనికి పరీక్షిస్తాడను విషయమును అర్థము చేసుకోవడములో
పొరపడినామని నేను చెప్పుచున్నాను. దివ్య ఖురాన్లోని దైవ సందేశమైన వాక్యములు శాసనములు, జరిగి తీరునవి.
కావున ఖురాన్ దేవుని శాస్త్రము అవుతుంది. అది ముమ్మాటికీ నిజమే. నా ఆవేదనంతా దైవ సందేశములను
మానవులు సరిగా అర్థము చేసుకోకుండా పోయారనియే. ఇదంతా మేము చెప్పడానికి ముఖ్య ఉద్దేశ్యము దేవుని
వాక్కును సక్రమముగా అర్థము చేసుకోవాలని తప్ప వేరు ఏమీ లేదు. సాటి వ్యక్తి దేవునికి సమీపము కావాలని,
మాయకు దూరము కావాలని చేయు ప్రయత్నమే ఈ రచన సారాంశము.
ఇప్పుడు మేము చెప్పు భావమును జాగ్రత్తగా విని అర్థము చేసుకో గలరని అనుకుంటున్నాను. దేవుడు సమస్తమును
సర్వులను సృష్టించిన సృష్టికర్త. ఆయనకు తెలియునది సర్వజగత్తులో ఏది లేదు. దేవుడు అంతటా వ్యాపించివుండి
అన్నిటిని అందరినీ చూడగల్గుచున్నాడు. ప్రతి మనిషిలోపల ఏ గుణమున్నదీ, వానికి బయట ఏ ధనమున్నదీ అన్నీ
ఆయనకు (దేవునికి) తెలుసు. మనిషి పుట్టబోయేముందు వాడు ఇలా పుట్టి, ఇలా పెరిగి, ఇలా తిరిగి, ఇలా అనుభవించి,
ఇలా ముసలివాడై, ఇలా చనిపోవాలను నిర్ణయించి వ్రాసిపెట్టబడిన కర్మను దేవుడే మనిషి వెంట పంపుచున్నాడు. కర్మ
ఆచరణ పత్రములేనిది ఎవడూ పుట్టుటకు వీలులేదు. దానినే తలవ్రాత అనికూడా అంటాము. దీనిని గురించి పవిత్ర
ఖురాన్ గ్రంథములో అన్ఇన్ఫెతార్ అను 82 సురాలో 5 నంబర్ ఆయత్లో "ప్రతి వ్యక్తి తాను ముందు వెనుక చేసిన
నిర్వాకమేమిటో తెలిసిపోతుంది.” అని ఉన్నది. అంతేకాక ఇదే విషయమునే 83 సురా అయిన అల్ ముత ఫ్ఫిపీన్
21

Page 22
సురాలో 7,8 ఆయత్లలో “నిస్సందేహముగా దుష్టుల ఆచరణ అంతా కారాగారం చిట్టాలో నమోదయి వుంది. కారాగారం
చిట్టా అంటే నీకేమైనా తెలుసా? అదొక వ్రాసిన పుస్తకము" అని ఉన్నది. మరియు 84 సురా అయిన అల్ ఇన్షికాక్లో
10వ ఆయత్నందు “ఎవరి ఆచరణ పత్రమ్ (కర్మపత్రమ్) అతని వీపు వెనుక ఇవ్వబడుతుందో" అనికూడా కలదు.
ఆచరణ పత్రము అనగా పనుల నిర్ణయపట్టిక అని అర్థము. ఆచరణ పత్రము అనగా పాపముల నిర్ణయపట్టిక లేక
పాపముల నమోదు పట్టిక అని చెప్పవచ్చును. ఆచరణ అనగా పని అని అందరికీ తెలుసు. మనిషి యొక్క ఆచరణ
పత్రము మనిషి పుట్టకముందే ఉన్నదనుటకు 80వ అబస సురాలో 20,21,22 ఆయత్లో “దేవుడు అతనిని వీర్య
బిందువుతో పుట్టించాడు అతని భాగ్యాన్ని నిర్ణయించాడు, తర్వాత అతని జీవిత మార్గమును సుగమము చేశాడు.
తర్వాత మృత్యువు నిచ్చాడు, సమాధికి చేర్చాడు" అని ఉన్నది. మనిషికి మృత్యువు రాకముందే, అతను సమాధికి
చేరకముందే దేవుడు అతని జీవిత విధానమును నిర్ణయించాడని తెలియుచున్నది. అటువంటి దేవునికి మనిషియొక్క
ప్రతి ఆచరణా తెలుసు. ప్రపంచములో మనిషి ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేయ బోతున్నాడు అను
విషయము ఆయనకు (దేవునికి) తెలుసు. కానీ ఆయన విషయము మాత్రము ఎవరికీ తెలియదు. ఇదే విషయమును
భగవద్గీతలో విజ్ఞానయోగమునందు 26వ శ్లోకమున ఇలా వున్నది.
వే దాహం సమతీతాని వర్తమానాని చార్జునా,
భవిష్యాణిచ భూతాని మాంతు వేద న కశ్చన |
భావము :- “సమస్త జీవరాసులకు జరుగుచున్న విషయములు, మరియు జరుగబోవు విషయములు, జరిగిన విషయములు
అన్నీ నాకు తెలుసు కానీ ఇటువంటి నన్ను మాత్రము ఎవ్వరూ తెలియరు.” ఈ విధముగా దేవునికి
తెలియనిది
ఏదీ లేదు. ఒక మనిషి పుట్టినప్పటినుండి చనిపోవు వరకు ప్రపంచములో ఏమి చేయుచున్నాడో, ఏమి చేయబోతాడో
ముందే దేవునికి తెలిసివున్నపుడు అతనిని పరీక్షించవలసిన అవసరముండదు. ఒక విద్యార్థి ఎంతవరకు చదువును
అర్థము చేసుకొన్నాడో తెలియదు, కావున పరీక్షపెట్టి వ్రాసిన వ్రాతనుబట్టి వచ్చిన మార్కులనుబట్టి ఇంతవరకు నేర్చుకొన్నాడని
తెలియుచున్నారు. పాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని తెలియనపుడు ఒక పరికరముతో పరీక్షించి పాలశాతమును, నీటి
శాతమును తెలుసుకొంటున్నాము. దేనినైనా తెలియనపుడు పరీక్ష అవసరముగానీ తెలిసినపుడు అవసరములేదు కదా!
ఒక మనిషి యొక్క విధానమూ, వాని మనో భావమూ, గుణ భావమూ తెలిసినపుడు వానిని పరీక్షించనవసరము
లేకుండానే వీడు ఇటువంటివాడని చెప్పవచ్చును. అట్లే ఒక మనిషియొక్క కర్మ లిఖితమూ, కార్య ఆచరణ, గుణ
స్వభావమును పూర్తిగా తెలిసిన దేవుడు మనిషిని పరీక్షించవలసిన అవసరమూ లేదు.
అయితే ఖురాన్లో సురా బఖరా, సురా అన్ఫాల్లో పరీక్షింపబడును అని వ్రాయబడివుంది కదా అని ఎవరైనా
అడగవచ్చును. దానికి సమాధానము ఏమనగా! మనిషి యొక్క జీవితములో ప్రతీదీ ముందే కర్మ లిఖితములో
ఉండునని చెప్పుకొన్నాము కదా! అవి అన్నీ దేవునికి తెలుసు అని కూడా చెప్పుకొన్నాము. అందువలన వాటిని
పరీక్షించనవసరము లేదని కూడా చెప్పాము. అయితే మనిషి జీవితములో కర్మపత్రములో లిఖించని విషయమొకటున్నది.
అది కర్మపత్రముకంటే అతీతమైన దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము మనిషియొక్క శ్రద్ధనుబట్టి, తెలుసుకోవాలను
ఆతృతను బట్టి లభించుచుండును. అది జీవితములో ముందు నిర్ణయింపబడదు. జ్ఞానమును సంపూర్ణముగా
సంపాదించుకొని ఆచరించిన వానికి మోక్షము లభించును. మోక్షము అనగా స్వర్గము కాదు, సర్వ నరకములకు
అతీతమైన దేవుని సన్నిధానమును మోక్షము అంటాము. ఇదే మోక్షమును గురించి ఖురాన్లో 87 సురా అయిన అల్
22

Page 23
ఆ
ఆలాలో 17,18 ఆయత్లలో "పరలోకము ఉత్తమమైనది మరియు శాశ్వితమైనది. ఈ మాటే పూర్వ గ్రంథాలలో కూడా
వ్రాయబడివున్నది.” స్వర్గ నరకములు శాశ్వితమైనవికావు. అవి పాపపుణ్యములను బట్టి వచ్చి పోవుచుండును.
పరలోక మొక్కటే అన్నిటికంటే ఉత్తమమైనదీ, శాశ్వితమైనది. ఈ దైవ సాన్నిధ్యమైన పరలోకము (మోక్షము) మనిషికి
లభించాలంటే అతను జ్ఞాన మార్గములో ఒక స్థాయివరకు ఎదగాలి. స్థాయికి ఎదిగిన వాడు పర లోకమునకు
పోతాడు. ఎదగని వాడు స్వర్గ నరకములకు పోతూవుంటాడు. జ్ఞానమార్గములో స్థాయిని మనిషే సంపాదించుకోవాలి.
ప్రపంచ విషయములవలె జ్ఞానము నిర్ణయించబడి ఉండదు. మనిషి ఎంత జ్ఞానమును సంపాదించుకొంటే మోక్షము
పొందును అను విషయము సాటి మనిషికి తెలియాలి అంటే మనిషిని జ్ఞాన విషయలందు పరీక్షించవలసిందే. పరీక్ష
అనునది జ్ఞాన విషయములో అవసరమనీ, అది సాటి మనిషికి మోక్షమునకు ఎంత జ్ఞాన స్థాయి అవసరము అని
తెలియుటకు, ఒక మనిషి పరీక్షింపబడుతాడనీ, ఈ పరీక్షలనే ఖురాన్ గ్రంథములో కూడా వ్రాయడము జరిగినదనీ
తెలియవలెను.
ముఖ్యముగ గమనించవలసినది ఏమంటే! దేవుని జ్ఞానమునకు మాయ పనులు (కర్మలోనున్న ఆచరణలు)
అన్నీ ఆటంకమును కలుగ జేయునవిగా మరియు వ్యతిరేఖమైనవిగా ఉండును. దైవజ్ఞానములో పోవాలనుకొన్న వానికి
జీవితములోని కర్మ పనులన్నీ ఆటంకముగా ఉంటూ జ్ఞానమార్గమునకు అవరోధమును కల్గించుచుండును.
అవరోధములను (ఆటంకములను) దాటిపోవడమే జ్ఞానమార్గములోనున్న వానికి పరీక్షలాంటిది. దేవున్ని
విశ్వసించినంతమాత్రమున, దైవజ్ఞానము మీద ధ్యాస కలిగినంతమాత్రమున ఎవడూ కర్మాచరణనుండి బయట పడలేడు.
అటువంటి వానికే కర్మ పనులన్నీ పరీక్షలుగా ఉండునని తెలియ వలెను. ఇదే విషయమును పవిత్ర ఖురాన్ గ్రంథములో
29 సురా అయిన అన్ కబూత్ లో 2వ ఆయత్నందు ప్రజలు “మేము దైవాన్ని విశ్వసించాము అని అన్నంతమాత్రమున
తాము విడిచిపెట్టబడతారనీ, తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా” అని చెప్పబడినది. దీనినిబట్టి అల్లాను (దైవాన్ని)
విశ్వసించిన వారికి, వారి కర్మలే పరీక్షలుగా నిలబడునని తెలియుచున్నది. కర్మలు లేక కర్మాచరణలు మనిషి
జీవితములోనికిరాకముందే నిర్ణయింప బడి ఉన్నాయని ఖురాన్లోని వాక్యముల ద్వారా తెలుసుకొన్నాము. ఒక మనిషికి,
ఆ మనిషి యొక్క సమస్యలుగానీ, అతని భార్యయొక్క బాధలు (సమస్యలు) గానీ, లేక అతని కుమారుల సమస్యలు గానీ,
ఆస్తికి సంబంధించినవి గానీ మొత్తము జీవితములోని అన్ని సమస్యలు దేవుని మార్గమునకు ఆటంకమగుచుండును.
వాటిని అతిక్రమించడమే మనిషికి పరీక్ష. అతిక్రమించలేనివాడు జ్ఞానపరీక్షలో ఓడిపోయినట్లగును. వాటిని అతిక్రమించిన
వాడు జ్ఞానపరీక్షలో నెగ్గినవాడగును (గెలిచినవాడగును.) అలా నెగ్గిన వారు మోక్షమును పొందును. అదియే అల్లాహ్వద్ద
(దేవుని వద్ద) పొందు గొప్ప ప్రతిఫలము. దీనినే అన్ఫాల్ సురాలో 28వ ఆయత్లో “వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ
సంతానము మిమ్మల్ని పరీక్షించే సాధనాలని నిశ్చయముగా చెప్పుచున్నాము. అల్లాహ్ వద్ద గొప్ప ప్రతి ఫలము
ఉన్నదని తెలుసుకోండి". అని ఉన్నది.
ఒక మనిషి చుట్టూ ఉండు సమస్యలన్నీ పరీక్షలనబడును. ఆ సమస్యలన్నీ కర్మల మూలముగా వచ్చినవే.
ఇంటిలో భార్యకు రోగమొస్తే అది భార్యకర్మను బట్టి వచ్చివుండును తప్ప భర్తను పరీక్షించుటకు భార్యను దేవుడు
బాధపెట్టలేదని తెలియాలి. అట్లే ఇంటిలో కుమారునికి భయంకరమైన నయముగాని రోగము వచ్చినదంటే, అది ఆ
బాలుని కర్మ లిఖితము ప్రకారము వచ్చియుండును. కానీ తండ్రిని పరీక్షించుటకు అతని కుమారునికి రోగము
వచ్చినదనుకోకూడదు. అట్లే అన్ని సమస్యలు వారివారి కర్మలనుబట్టి వచ్చునవే. అవియే దైవమార్గములో శోధనలుగా
23

Page 24
మారుచున్నవను సత్యమును గ్రహించవలెను. అట్లుకాకుండా తండ్రిని పరీక్షించుటకు దేవుడు కుమారున్ని బాధపెట్టినా,
భర్తను శోధించుటకు భార్యను ప్రమాదమునకు గురిచేసి బాధపడునట్లు చేసినా, అది దుర్మార్గము పని అగును. తీవ్రవాదులు
అమెరికా మీద పగతో అమెరికా పౌరున్ని చంపినట్లగును. ప్రక్క ఇంటివాడు విరోధి అయితే అమాయకుడైన వాని
కొడుకును చంపినట్లగును. మొత్తానికి అన్యాయమూ, అమానుష పనులగును. ఇట్లు అన్యాయము, అక్రమము అయిన
పనిని దేవుడు చేయుననడము తప్పగును. వానివాని కర్మలు వానికి పరీక్షయగుచున్నవి గానీ, దేవుడు ఎవరినీ ప్రత్యేకముగా
పరీక్షించడము లేదు. ఒకనిని పరీక్షించుటకు వాని కొడుకును గానీ, భార్యనుగానీ హింసలకు, రోగములకు, ప్రమాదములకు
గురి చేయలేదు. దేవుడు అటువంటి పనులు ఎప్పటికీ చేయడు. అటువంటి అవసరము ఆయనకు లేదు. కర్మప్రకారము
వచ్చు కష్టములకు ఓర్చుకొని ఓపికతో దైవమార్గములో ప్రయాణించు వానికి ఆత్యంత ఉన్నతమమైన, అతి ఉత్తమమైన,
శాశ్వితమైన పరలోకము (ముక్తి) లభించును.
దేవుని మార్గములోనున్న వారికి, దైవము మీద తప్ప ఇతర దేవతల మీద ధ్యాసలేని వారికి దేవుడు ప్రపంచములోని
సమస్యలనుగానీ, అనారోగ్య ములనుగానీ తొలగించడు. అయితే దైవమార్గము నుండి త్రప్పి పోకుండునట్లు చేయును.
ఇదే విషయమును, “దైవమును విశ్వసించిన వారికి పరీక్షలు లేవనుకోకూడదు" అని అన్ కబూత్ సురాలో చెప్పగా,
భగవద్గీతలో “రాజ విద్యా రాజగుహ్య యోగము” అను అధ్యాయములో 22 శ్లోకమునందు ఇలా వున్నది.
"అనన్యాశ్చిన్త యన్తోమాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్”
భావము :- “అన్యదేవతా చింత లేకుండా ఎల్లవేళల నన్ను ఉపాసించుచు నిత్యము నా ధ్యాసలోనున్న వారి యోగము
యొక్క క్షేమమును నేనే చూచుచుందును.” అన్నాడు. దీనినిబట్టి పరమాత్మను (దేవున్ని) మించిన వాడు ఎవరూ లేరనీ,
ఏ దేవతాభక్తీ లేకుండా ఎల్లప్పుడు దేవున్ని ఆరాధించు వానికి, అతని సమస్యలనుండి దేవుడు అతనిని కాపాడడనీ,
అతను సమస్యలలో ఓడిపోయి దైవమార్గములోనుండి తప్పిపోకుండా అతని విశ్వాసమునకు (యోగమునకు) బలమునిచ్చి
కాపాడుచుండునని తెలయుచున్నది. ఖురాన్లో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా దేవునిది ఒక్కటే మాటగా ఉన్నదని
గ్రహించవచ్చును. దేవుని మీద విశ్వాసము, జ్ఞానము, యోగము ఉన్నంత మాత్రమున సమస్యలు ఆటంకములు
(పరీక్షలు) ఉండవని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ అన్ఫాల్ సురాలో అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలమున్నదని చెప్పినట్లు,
గీతలో కూడా దేవుడు ప్రతి ఫలముగా వాని యోగము యొక్క క్షేమమును వహించునని తెలిపాడు.
దేవుడు భూమిమీద మానవులను సృష్టించి జీవితమును ఇచ్చి దానిలో స్వర్గ నరకములను కూడా ఇచ్చాడు.
మనిషి స్వర్గ నరకముల మధ్యలో జీవితము గడుపునట్లు, స్వర్గ నరకములు కర్మల వలన (పాప పుణ్యముల వలన)
వచ్చునట్లు ఏర్పాటు చేశాడు. సృష్టి ఆదిలోనే మనిషి మనుగడ ఎలా సాగాలో నిర్ణయించి, మహా ప్రళయము వరకు
అదే పద్ధతి సాగునట్లు యంత్రాంగమును అమర్చాడు. మనిషి మహా ప్రళయము వరకు జీవితమును సాగించునట్లు
చేసిన దేవుడు, మనిషి ధరించిన శరీరము మరణములో నశించునట్లు చేసి, తిరిగి క్రొత్త శరీరమనుదానిని (సమాధి అను
దానిని) అందరికీ సమానముగా ఆదినుండి లభించునట్లు చేసి, ఆ క్రొత్త శరీరముతో మరణానంతర జీవితము గడుపుటకు
ఆ శరీరమునుండి (ఆ సమాధి నుండి) దేవుడు జీవున్ని లేపుచున్నాడు. అలా మొదటి సమాధి నుండి లేపబడినవాడు
జీవితములో స్వర్గ నరకములను అనుభవిస్తూ పోయి కొంతకాలమునకు శరీరమార్పు కొరకు మరణించడము జరుగుచున్నది.
24

Page 25
అలా మరణించిన వాడు తిరిగి క్రొత్త శరీరములో లేపబడడము సర్వ సాధారణముగా జరుగుచున్నది. శరీరమార్పు
కొరకు చనిపోయిన వ్యక్తి తిరిగి నగ్నముగా తయారైన, ఏ గుణ ధ్యాసలు లేని క్రొత్త శరీరములో పుట్టుచున్నాడు. ( ఈ
విషయము ఇంకా పూర్తిగా అర్థము కావాలంటే మా రచనలలోని "జనన మరణ సిద్ధాంతము" అను గ్రంథమును
చదవండి) క్రొత్తగా తయారైన శరీరమును సమాధి అంటున్నాము. జీవుడు తల్లిగర్భము నుండి పుట్టునని అందరూ
అనుకొనుచుందురు. కానీ తల్లిగర్భమునుండి ఏ వ్యక్తీ ఇంతవరకూ పుట్టలేదు. తల్లిగర్భములో పూర్తి తయారైన
శరీరము ప్రసవింపబడిన తర్వాత అందులోనికి జీవుడు ప్రవేశించి పుట్టడము జరుగు చున్నది. తల్లిగర్భము నుండి శిశు
శరీరము పుట్టినది గానీ, జీవాత్మ పుట్టలేదు. జీవాత్మ, ప్రసవింపబడిన క్రొత్త శరీరమును చేరినపుడే అ శరీరమును
సమాధి అనవచ్చును. శిశుశరీరములోనికి జీవాత్మ ప్రవేశించనంత వరకు ఆ శరీరము సమాధి అనబడదు. మొదటి
శ్వాసతో జీవుడు చేరడము జరుగుచున్నది. అలా చేరిన జీవుడు మొట్టమొదట అ శరీరమునుండి లేపబడుచున్నాడు.
జీవుడు మరణించిన క్షణమే ఆ జీవుని పాపపుణ్యములను అనుసరించి మరణానంతర జీవితమూ, అందులో
అనుభవించవలసిన స్వర్గ నరకములూ నిర్ణయించ బడడము జరిగిపోవును. క్షణ కాలములోనే జీవుడు ప్రసవింపబడిన
క్రొత్త శరీరమును చేరుచున్నాడు. అందులోనుండి తన శరీరము మీద ధ్యాస లేకుండా లేపబడుచున్నాడు. మరణించినపుడు
జీవాత్మ పాతశరీరమును వదలి క్రొత్త శరీరమును చేరడము, మరణాంతర జీవితమునకు తగిన కర్మ (ప్రారబ్ధకర్మ)
నిర్ణయింపబడడమూ, క్రొత్త శరీరము నుండి (సమాధినుండి) లేపబడడమూ అంతయు క్షణకాలములో జరిగి పోవును.
ఇది ఇంతవరకు ఎవరకీ తెలియని రహస్యము. సర్వాధికారియైన దేవుని చేత మనకు తెలియబడినదని భావించవలెను.
అంతేకాక ఈ విషయమును సత్యాన్వేషణ బుద్ధితో చూడవలెను. ఇది సత్యమే కావున చివరికి ఎవరైనా గ్రహించవచ్చును.
ఇదంతా చెప్పుటకు కారణము సమాధియొక్క అసలు రూపము అర్థమగుటకేనని తెలియవలెను. సమాధి
యొక్క అసలు రూపము అర్థమై నపుడు దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకాశవంతమై పోగలదు. అది ఎదురాడని జ్ఞానమై
పోగలదు. ఆయన మాటముందర ఏ ప్రశ్నారాదు. ప్రశ్న లేనిదే దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము సంపూర్ణముగా
తెలిసి దాని ప్రకారము ఆచరిస్తూ ప్రపంచ సమస్యలకు భయపడని వాడు దేవుని సాన్నిధ్యమైన పరలోకము (మోక్షమును)
చేరును. అటువంటి వానికి జీవితము అవసరము లేదు, సమాధి అవసరములేదు. వానికి మరణాంతర జీవితముండదు.
ఏ జీవుడైనా పరలోకమును చేరనంతవరకు జీవితము చివరిలో మరణము పొందిన తర్వాత రెండవమారు శరీరమును
ధరించడము జరుగుచుండును. అనగా మరణాంతర జీవితమును పొందుచుండును. అట్టివారు పూర్తి మరణమును
పొందక, అట్లే పూర్తి పుట్టుకను పొందక రెండిటి మధ్యలో జీవితములలోనే ఉండును. జీవితములో ఎప్పుడూ
సుఖదుఃఖములు తప్ప ఏమీ ఉండవు. అందువలన జీవితమును నరకాగ్ని అని చెప్పుచున్నారు. నరకాగ్నియను దానిని
(జీవితము అను దానిని) పొందిన వాడు పరలోకమును పొందక ఏదో ఒక శరీరముతో, ఏదో ఒక జీవితమును
గడుపుచుండవలెను. అతను చావకుండా ఉండలేడు, అట్లే పుట్టకుండా ఉండలేడు. అంటే అతను చస్తూ ఉండవలసిందే,
అట్లే తిరిగి పుట్టుతూ ఉండవలసిందే. ఇదే విషయమును 87వ సురా అయిన అల్లా లో 12వ ఆయత్నందు
“అతను మహాగ్నిలోనికి పోతాడు. అందులో అతను చావనూలేడు, బ్రతకనూ లేడు” అని చెప్పియున్నారు. అటువంటి
వానికి శరీరములు మారుచున్నప్పటికీ వాడు నిత్యము నరకములో ఉన్నట్లే అగును. పరలోకములో కాకుండా ఇహ
లోకములో ఉండువానికి ప్రతి క్రొత్త శరీరము సమాధియగును. అతడు శరీర ప్రళయమును పొందినప్పుడంతా శరీర
సమాధినుండి లేపబడుతాడు.
25

Page 26
ఇదంతయు ఇప్పటికాలములో చదివే వారికీ, వినేవారికీ క్రొత్తగ కనిపించినా ఇది ముమ్మాటికి సత్యము. ఇది
సత్యమైనా శరీరమను సమాధినుండి మనిషి మరణము తర్వాత లేచినపుడు, శరీరములోనున్న జీవునికి ఏ ధ్యాసలు లేని
దానివలన, ఇప్పుడు మేము చెప్పుచున్న విషయము సత్యమా అసత్యమా అని యోచించవలసి వచ్చును. ఈ విషయములో
మాయ (సాతాన్ లేక సైతాన్) ముందే తప్పుదారి పట్టించిన దానివలన మా మాటను నమ్ముటకు అందరూ వెనుకాడవచ్చును.
మా మాటలకు బలమును చేకూర్చుటకూ, అందరూ యోచించుటకు అవకాశముగా దేవుడు సమాధినుండి మనిషిని
ప్రతి దినము బయటికి వచ్చునట్లు చేశాడు. దీనివలన ప్రజలు సత్యమును గ్రహించుటకు, దేవుని మాట శాసనమని
అర్థమగుటకు వీలుకల్గుచున్నది. అదెలా అనగా! మనిషి మరణమును పొందుట అందరూ చూస్తున్న ప్రత్యక్ష సత్యము,
అలాగే పుట్టుట కూడా ప్రత్యక్షముగా జరుగునదే, మరణము, జననము రెండూ ప్రత్యక్ష ప్రమాణములే అయినా, మరణములో
ఏమి జరుగుచున్నదో అట్లే జననములో ఏమి జరుగుచున్నదో ఎవరికీ వాటి అనుభవము మాత్రము తెలియదు. ఈ
విషయము సామాన్య ప్రజలకే కాకుండా భౌతిక విషయములు, శరీర భాగములు, రోగములు తెలిసిన డాక్టర్లకు సహితము
తెలియదనియే చెప్పవచ్చును. అందరికీ ఎలా తెలియదో అప్పుడు జరుగుచున్నదేమిటో ఇప్పుడు వివరముగా చెప్పాలంటే
వీలుపడదు. ఈ విషయములన్నీ “జనన మరణ సిద్ధాంతము” అను గ్రంథమున వ్రాసియుంచాము. ఇటు చావులో
గానీ, అటు పుట్టుకలోగానీ మనిషికి ఏ ధ్యాస లేని దానివలన, తర్వాత చెప్పుటకు ఆ సమయములోని జ్ఞాపకము లేని
దానివలన, అందరికీ ఆ రెండు విషయములూ అగమ్య గోచరములే. అయితే దేవుడు ఈ రెండు విషయములను మనిషి
ఆలోచించి తెలుసుకొనుటకు అన్ని ధ్యాసలున్న సమయములో వాటి నమూనాను మనిషికి అమర్చాడు. మరణమునకు
జననమునకు నమూనాగా ఉన్నవే, ప్రతి నిత్యమూ సంఘటనలుగా సంభవించుచున్న నిద్ర మెలుకువలు.
తెలివున్న వానికీ, తెలివి లేనివానికీ, మేధావులకూ, మూర్ఖులకూ అందరికీ ప్రతి దినము నిద్రవస్తున్నా అది
మనిషి యొక్క ఆధీనములో లేదు. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, వచ్చే సమయములో అనుభవము ఏమిటో
ఎవరికీ తెలియదు. మరణము కూడా ఇలాంటిదే! ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, వచ్చిన సమయములో అనుభవము
ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఇకపోతే మనిషియొక్క పుట్టుకలో ఏమి జరుగుచున్నదో, జీవుడు శరీరములోనికి ఎప్పుడు
ప్రవేశిస్తున్నాడో, ఎలా ప్రవేశిస్తున్నాడో, ఎలా లేపబడుచున్నాడో, ఎవరి చేత లేపబడుచున్నాడో ఎవరికీ తెలియదు.
అలాగే ప్రతి దినము నిద్రనుండి లేవడము కూడా మనిషికి పూర్తి తెలియదు. నిద్రలో శరీరమునందు అణిగియున్న
జీవుడు ప్రపంచ ధ్యాసలోనికి ఎలా లేవ(రా) గల్గుచున్నాడు? ఎవరు లేపుచున్నారు? అను విషయము కూడా పూర్తిగా
ఎవరికీ తెలియదు. వాస్తవానికి చావు పుట్టుకల నమూనాలుగా నిద్ర మెలుకువలను దేవుడుంచాడు. చావు పుట్టుకలు
ఎవరికీ అర్థముకాని అత్యంత రహస్యమైనవి. అటువంటివి మానవునికి తెలియాలి అంటే వాటి నమూనాను చూచి
తెలియవలసిందే. అందువలన చావు పుట్టుకల రహస్యములు తెలియుటకు దేవుడు నిద్ర మెలకువలను ప్రత్యక్ష
ప్రమాణము లుగా ఉంచాడు. ఈ విధానములో ఒక మరణము ఒక నిద్రలాంటిది, ఒక పుట్టుక ఒక మెలుకువలాంటిది.
మొదట నిద్రను గురించి వివరించుకొని చూస్తాము. నిద్ర అనునది అందరికి సుపరిచయమైనదే. అయినా
ఎవడుగానీ అది ఎప్పుడు వస్తున్నదో ఆ సమయమును చెప్పలేడు. నిత్యము మనిషికి నిద్ర వస్తున్నా అది ఖచ్చితముగా
వచ్చిన సమయమును ఏ మేధావి కూడా చెప్పలేడు. ఎవరు పరిశోధించినా, ఎంత పెద్ద పరిశోధకులైనా, నిద్రవస్తుందని
తెలుసుకొని, అది ఏ సమయములో వచ్చిందని మాత్రము చెప్పలేరు. నిద్ర వచ్చు సమయములో శరీరమందు మొదట
ఏమి జరిగినదీ, తర్వాత ఏమి జరిగినదీ ఎవరికీ తెలియదు. శరీరమునందు నిద్ర సమయములో ఏ మార్పులు
26

Page 27
జరుగుతూ పోయి చివరకు మనిషి ఎలా నిద్రను పొందుచున్నాడో తెలియ గలిగితే, మనిషి మరణించు సమయములో
శరీరమందు ఏమి జరుగు చున్నదో, ఏమి జరిగిన తర్వాత మనిషి మరణమును పొందుచున్నాడో తెలియవచ్చును.
అలాగే నిద్రనుండి లేచు మనిషిలో ఏమి జరుగుచున్నదో, అతను ఎలా లేవగలుగుచున్నాడో తెలియగలిగితే దాని
నమూనాలోనే జననము కల్గుచున్నదని తెలియవచ్చును. కొందరు నిద్ర మెలకువల విషయమును తెలుసుకోవడము
సులభము కదా! అని అనుకోవచ్చును. వాటిని సులభముగా తెలుసుకొనుటకు ఎవరికీ సాధ్యపడదనియే చెప్ప
వచ్చును. అందువలన వేమన యోగి కూడా 'నిద్రలోని మర్మము తెలిసిన వాడు నిజయోగి' అన్నాడు. కొందరైతే నేనే
నిద్రపోవుచున్నాను, నేనే మేల్కొనుచున్నాను అంటున్నారు. అలా ఎవరైనా భ్రమపడవచ్చును. కానీ నిద్ర మెలకువలలో
ఎవరికీ స్వతంత్రత లేదు. ఇంతవరకు చావు పుట్టుకలకు నమూనా అయిన నిద్ర మెలకువల విషయమే అత్యంత
రహస్యమై ఉండగా, దానికంటే పెద్ద రహస్యమైన చావుపుట్టుకల విషయము ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును.
ఎవరికీ తెలియదని చెప్పుచున్న నీకెలా తెలిసిందని నన్ను మీరు ప్రశ్నించవచ్చును. నాకు తెలిసిందని నేనింతవరకు
ఎక్కడా చెప్పలేదు. అత్యంత గొప్ప రహస్యమైన జనన మరణములు నాకు తెలియదు. కానీ నాకు తోడుగా ఉన్నవానికి
అన్నీ తెలుసునని చాలామార్లు చెప్పాను. ప్రతి దినము మనిషిని నిద్రలోనికి పంపువాడు మరియు మెలకువలోనికి
లేపువాడు నా శరీరములో ఉన్నాడు. అతనికి తెలియని రహస్యము ఏదీలేదు. అతనితో నేను స్నేహము చేయుట
వలన అతను తెలిపినది నేను మీకు తెలుపు చున్నాను. అందువలన ఏ బోధను చెప్పునప్పుడు గానీ, ఏ జ్ఞానమును
వ్రాయునప్పుడుగానీ “మేము చెప్పునది ఏమనగా అనీ, మరియు మేము వ్రాయునది ఏమనగా” అనీ, వ్రాయుచుందుము.
నాకే కాదు మీకు తోడుగానున్న వాడు, మీ శరీరములకు అధిపతిగా ఉన్నవాడు అందరి శరీరములలోనూ ఉన్నాడు.
అయితే అతను ఒకడున్నాడనిగానీ, అతనే శరీరమునకు అధిపతి అనిగానీ, అతను చేయిస్తేనే అన్నీ జరుగుచున్నవనిగానీ
తెలియక శరీరములోనే ఉన్నానని అనుకోవడము వలన నీలోని వాడు నీకు ఏమీ చెప్పడము లేదు. నీకు ఏమీ
తెలియడము లేదు. మీకూ నాకు అంతే తేడా తప్ప ఏమీలేదు. ఆ తేడా వలన కొన్ని రహస్యములను నేను
చెప్పగలుగుచున్నాను, మీరు చెప్పలేకున్నారు.
గలుగుచున్నామో
నిద్రనుండి ఎలా లేవగలుగుచున్నామో తెలియగలిగితే, సమాధి నుండి ఎలా లేవగలుగుచున్నామో తెలియగలదు.
నిద్రపోయినవాడు శరీరమునుండి స్వయముగా లేవలేడు. అలాగే చనిపోయినవాడు స్వయముగా (సమాధినుండి)
లేవలేడు. నిద్రపోయిన వాడు పడుకొనియున్న శరీరమునుండి లేపబడుచున్నాడు. అలాగే చనిపోయిన వాడు తల్లిగర్భము
నుండి బయట పడిపోయిన శరీరమునుండి లేపబడుచున్నాడు. నిద్రపోయిన వాడూ, చనిపోయిన వాడూ ఎవ్వరికీ
తెలియకుండా శరీరములోనే ఉన్న వానిచేత లేపబడుచున్నాడు. నిద్రపోయిన వానికి తాను నివసించు పాత శరీరమే
సమాధి కాగా, చనిపోయిన వానికి తాను నివసించబోవు క్రొత్త శరీరమే సమాధి అగుచున్నది. శరీరములో నిద్రపోయిన
వానిని ఆ శరీరములో జీవాత్మకు తోడుగానున్న ఆత్మే శరీరము నుండి లేపుచున్నది. చనిపోయిన వానిని వాడు (ఆత్మ,
జీవాత్మ) చేరిన క్రొత్త శరీరము నుండి ఆత్మే జీవాత్మను లేపుచున్నది. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును.
అదేమనగా! క్రొత్తగా పుట్టినప్పటి విషయము మాకు తెలియదు. కానీ నిద్రపోయిన వానిని మేము ఎప్పుడు లేపితే
అప్పుడు వాడు నిద్రనుండి లేస్తున్నాడు. అటువంటపుడు నిద్రపోయిన మనిషిని మెలకువలోనున్న మరొక మనిషి
లేపుచున్నపుడు, ఇది అందరికీ తెలిసిన విషయమైనపుడు మీరేమో నిద్రపోయిన వానిని, వాని శరీరములోని ఆత్మే
లేపుచున్నదని చెప్పుచున్నారు. మీ మాట పచ్చి అబద్ధము కాదా! అని అడుగవచ్చును. నామాట అబద్ధమైతే మీరు ఈ
27

Page 28
ప్రశ్నను అడిగినా దానికి జవాబు చెప్పకుండా దానిని దాటవేసి పోయేవాడిని. నా మాట అబద్ధము కాదు. కాబట్టి
మీరు అడుగకున్నా ఆ ప్రశ్నను నేనే రెకెత్తించి ఎవరైనా ఇట్లు అడుగవచ్చునని ప్రశ్నించాను. దానికి జవాబును కూడా
చెప్పుచున్నాను. ఇక్కడ ప్రశ్న జవాబు రెండు నావే అయినా, ప్రశ్న మీ ప్రక్కదీ, జవాబు నా ప్రక్కది.
నిద్రపోయిన వానిని మరొకడు లేపినప్పుడు నిద్రపోయిన వాడు లేచినా, పైకి వీడు లేపితే వాడు లేచినట్లు
కనిపించినా, శరీరములోపల లేపినవాడు మాత్రము ఆ శరీరములోని ఆత్మే. ఆత్మ తన ఉనికిని బయట మనిషి
గ్రహించనట్లు, బయటివాడు పిలిచినపుడు లోపలి ఆత్మ ఆ శరీరము లోని జీవున్ని మేల్కొలుపుచున్నది. నిద్రలోనున్న
జీవునికి బయట శబ్దముగానీ, బయట స్పర్శగానీ తెలియదు. వినికిడే లేనివానిని పిలిస్తే ఆ మాట వానికి వినిపించదు,
అలాగే తట్టినా, ఆ స్పర్శ వానికి (జీవునికి) తెలియదు. అటువంటపుడు నిద్రపోవువానిని బయటివాడు పిలిచినా, తట్టినా
వాడు లేచుటకు అవకాశము లేదు. అయితే నిద్ర పోయిన వానిని బయటివాడు పిలిచినపుడు, ఆత్మజ్ఞానము తెలియని
వానికి ఆత్మ తెలియబడడము ధర్మ విరుద్ధమగును, కావున ఆత్మ ఒకటున్నదని తెలియనట్లు, ఆత్మే నిద్రపోయిన వానిని
లేపి, బయటివాడు నేను లేపితే లేచాడు అను భ్రమలోపడునట్లు చేయుచున్నది. ఒక్కొక్కమారు ఎవరు పిలిచినా
నిద్రనుండి లేవని వారిని కూడా చూడవచ్చును. అలాగే తట్టినా లేవని వానిని కూడా చూడవచ్చును. శరీరమునకు
అధిపతి, ఆ శరీరములోని ఆత్మే కావున ఆత్మ ప్రమేయము లేకుండా ఏమీ జరుగదు. ఆత్మ శరీరములో ఉంటూ
మనిషికి ఇష్టమొచ్చినట్లు శరీరమును కొన్ని కార్యములందు నడిపించుచూ, శరీరమునకు నేనే అధిపతినని అనుకొన్నట్లు
శరీరములోనున్న జీవున్ని భ్రమింపజేస్తున్నది. అటువంటి పనులు కొన్నిటిని జీవుని ఇష్టముననుసరించి ఆత్మ
చేయుచుండుట వలన, మనిషి నా శరీరము నా ఇష్టము అంటున్నాడు. తనకు శరీరము మీద ఏ అధికారము లేకున్నా
మనిషి ఇచ్ఛకు ఆధీనములో వుండి జరుగు ఇచ్ఛాధీన కార్యములను చూచి మనిషి నా ఇష్టము అంటున్నాడు. మనిషిని
భ్రమింపజేయు ఇచ్చాధీన కార్యములే కాకుండా, శరీరములో మనిషి ప్రమేయము లేకుండా, మనిషి ఇచ్చ లేకుండా,
మనిషికి తెలియకుండా జరుగు పనులు ఎన్నో గలవు. అయితే మనిషి తన అజ్ఞానము చేత వాటిని గురించి ఎవరు
చేస్తున్నారని యోచించడము లేదు. మన శరీరములలో అనిచ్ఛాధీనముగా జరుగు కార్యములు ఎన్నో కలవు. చేయిని,
కాలును మనిషి ఇష్టము ప్రకారము ఆత్మ పని చేయుంచుట వలన, ఆ పని తన ఇష్టము ప్రకారము జరుగుచున్నదనీ,
తానే చేయుచున్నాననీ మనిషి అజ్ఞానము చేత అనుకొంటున్నాడు. ఒక్కొక్కప్పుడు మనిషి యొక్క కాలుగానీ, చేయిగానీ
మనిషి ఇష్టము ప్రకారము పని చేయకుండా పోవును. అప్పుడు చేయిని, కాలును మనిషి కొద్దిమాత్రము కూడా
కదిలించలేడు. అన్నీ బాగుండీ కాలు పని చేయనప్పుడు దానికి రోగము వచ్చిందని అనుకొంటున్నాడు తప్ప, దీనికి
మూల కారణమేమని అప్పుడు కూడా యోచించడము లేదు. శరీరములో ఎంతో రహస్యము దాగి ఉన్నదనీ,
ఆధ్యాత్మికమంతా (ఆత్మ ఆధ్యయనమంతా) శరీరములోనే ఉన్నదనీ మనిషికి తెలియకుండా పోయిన దానివలన ప్రవక్తలు
చెప్పిన జ్ఞానమును శరీరములో చూచుకోక బయట ప్రపంచములో చూస్తున్నారు. అందువలన ప్రవక్తలు చెప్పిన
జ్ఞానము అర్థము కాకుండా పోయినదని చెప్పవచ్చును.
భగవద్గీతలోని జ్ఞానముగానీ, బైబిలులోని వాక్యములను గానీ, ఖురాన్లోని ఆయత్లను గానీ, కొన్నిటిని
అంతరంగములోనే చూచుకోవలసిన అవసరమున్నది. బయట జీవన విధానములు పెద్దలు చెప్పి యుంటే వాటిని
బయటి ప్రపంచములోనే అర్థము చేసుకొని ఆచరించాలి. అవి అన్నియు నీతి న్యాయములకు సంబంధించిన విషయములుగా
ఉండును. శరీరములోపలి జీవుని విధానమును చెప్పియుంటే వాటిని శరీరములోపలి విషయములుగా అర్థము
28

Page 29
చేసుకొని అచరించవలెను.
అంతరంగమందు అర్థము చేసుకొని ఆచరించునవి అన్నియు జ్ఞానము, ధర్మములుగా
ఉండును. ప్రపంచ సంబంధ నీతి న్యాయములకంటే పరమాత్మ సంబంధ జ్ఞాన ధర్మములు ఎన్నో రెట్లు గొప్పవి.
అందువలన దైవ జ్ఞానమునూ, దైవధర్మములను అంతరంగములో అవగాహన చేసుకొంటే జీవునికి సమాధి శరీరములో
ఉన్నదనీ, శరీరమునకు సమాధి (గోరీ) బయట ప్రపంచములో ఉన్నదనీ తెలియుచున్నది. ప్రవక్తలు చెప్పిన జ్ఞానమంతయు
చైతన్యవంతమైన జీవాత్మను గురించియే గానీ, చైతన్యములేని జడమైన శరీరమును గురించి కాదు. అందువలన
జీవాత్మవున్న శరీరమును (సమాధిని) గురించియే చెప్పుకోవలెను. జీవాత్మ లేని శరీరమును (శవమును) గురించి
చెప్పుకోకూడదు.
ఇంతవరకు ప్రవక్తలు చెప్పిన సమాధి విషయములనే వివరించి చెప్పాము. ఇంకనూ వారు చెప్పకుండా
వదలివేసిన విషయములు ఎన్నో ఉన్నవి. వాటన్నిటిని వారు చెప్పకుండా వదలివేశారు. ప్రవక్తలు చెప్పినవి కాకుండా
ఇంకా కొన్ని జ్ఞాన విషయములున్నవని తెలియునట్లు పరిశుద్ధ బైబిలు గ్రంథములో యోహాను సువార్తలో 16వ
అధ్యాయమునందు 12వ వచనము ఇలా గలదు. “నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు గలవు. కానీ
ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు.” అని ఏసు చెప్పినట్లు కలదు. అంతేకాక అదే బైబిలు గ్రంథమందు, అదే
యోహాను సువార్త 14వ ఆధ్యాయమున 26వ వాక్యము ఇలా గలదు. “ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు
పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” అని ప్రవక్త
అయిన ఏసు చెప్పాడు. ఈ వాక్యములనుబట్టి తెలియునదేమనగా! ప్రవక్త కొన్ని జ్ఞాన విషయములే చెప్పాడనీ,
చెప్పవలసినవి ఇంకా ఉన్నవనీ, అన్ని విషయములు చెప్పబడినప్పుడే సమస్తమును బోధించినట్లగునని తెలియుచున్నది.
ఎందరో ప్రవక్తలు ఇంత వరకు వచ్చిపోయినా, ఇంకా ప్రస్తావనకు రాని జ్ఞాన విషయములు ఎన్నో ఉన్నవనుటకు
ఆధారములున్నవి. నేను ప్రవక్తను కాకపోయినా నాకు తెలిసినంతవరకు, ఇంతవరకు ప్రస్తావనకు రానివి, ప్రవక్తలు
చెప్పని విషయములలో ఒకదానినైనా లేక కొన్నిటినైనా నాలోని ఆత్మ అందించిన వాటిని మీకు తెలియజేయాలని
అనుకొంటున్నాము.
ఇంతవరకు సమాధి విషయములో ప్రవక్తలు చెప్పిన దానినే వివరించి చెప్పినాము. అయితే అది ఒక వింతగా,
నమ్మలేని వివరముగా కనిపించియుండవచ్చును. అయినా హేతుబద్దముగా యోచిస్తే ఎవరికైనా మేము చెప్పినదే
సత్యమని అర్థము కాలగలదు. నాకు నచ్చింది అని ఒక మనిషి అంటే అది ద్వంధ భావములకు దారి తీయగలదు.
అతడు నాకు ఇష్టమైంది అని చెప్పి ఉండవచ్చును, లేక నాకు బాధ కల్గినది అని చెప్పి యుండవచ్చును. ఒకే వాక్యము
రెండు అర్థములను ఇచ్చునది అయినపుడు సందర్భమును బట్టి అక్కడ ఏ అర్థము సరియైనదో గుర్తించవచ్చును. అక్కడ
సందర్భమును గానీ, జరుగుచున్న సమయమును గానీ గుర్తించకుండా నచ్చింది అను పదమును మాత్రము చూస్తే అది
బాధకలిగింది అని మాత్రమే అర్థమై ఉండవచ్చును. అట్లుకాకుండా సమయ సందర్భములను బట్టి చూస్తే ఒక వ్యక్తి
పెళ్ళి చూపులకు పోయిన సందర్భములో పెళ్ళి కూతురును అందరి సమక్షములో చూచిన సమయములో నచ్చింది అను
మాటవస్తే, ఆ మాటకు బాధకలిగింది అని అర్థము చేసుకొంటే అది అసందర్భ అర్థమగును. నచ్చింది అనుమాటకు
బాధ కలిగిందను అర్థము ఉండినా, ఆ సమయములో ఆ అర్థము పనికిరాదు. అలాగే మూల గ్రంథములయందు
ప్రవక్తలు, ప్రళయములో అని అన్నప్పుడు, అది ఏ ప్రళయమో సరిగా అర్థము చేసుకోకపోతే అక్కడున్న భావమంతా
చెడిపోవును. ప్రకృతి చర అచర అను రెండు ప్రకృతులుగా ఉన్నపుడు, రెండు ప్రకృతులకు ప్రళయమున్నపుడు అక్కడ
29

Page 30
ఏ ప్రకృతిని గురించి చెప్పారు? ఏ ప్రళయమును గురించి చెప్పారు అని యోచించకపోతే తప్పు భావము లోనికి పోవు
అవకాశమున్నది. దివ్య ఖురాన్ గ్రంథములో హజ్రత్ మహమ్మద్ ప్రవక్త చెప్పిన జ్ఞాన విషయమును మొదట కొందరు
తప్పు భావముతో అర్థము చేసుకొనుట వలన, వారి ద్వారా అదే అర్థము అంతటా ప్రాకి పోవడము వలన, ప్రవక్త ఏ
ఉద్దేశ్యముతో చెప్పాడో ఆ ఉద్దేశ్యము లేక ఆ భావము ఎవరికీ తెలియకుండా పోయినది. దైవ సందేశములోని అసలైన
సారాంశము, తర్వాతవచ్చు ప్రజలు గ్రహించుకొనుటకు వీలు లేకుండా పోయినది.
ఆ
బైబిలు గ్రంథములో యోహాన్ సువార్తలో 16వ ఆధ్యాయము 12వ వచనము ప్రకారము దేవుని వాక్యములు
ఇంకా అనేకములను ప్రవక్తలు చెప్పవలసియున్నా, వాటిని చెప్పలేదని తెలిసినది. కారణమును చూస్తే అదే వాక్యములో
"ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు” అనివుంది. అలా చెప్పుట వలన ప్రజలు ముందే తప్పు భావములో మునిగి
పోయారనీ, నిజమును చెప్పినా ఆ విషయములను అర్థము చేసుకోలేరను భావముతో చెప్పకుండా పోయారనీ
తెలియుచున్నది. అలా చెప్పకుండా వదలివేసిన అనేక జ్ఞాన సంగతులను మేము మా గ్రంథములలో కొన్నిటిని
వివరించాము. ఇప్పుడు ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక జ్ఞాన విషయమును తీసుకొని వివరించుకొందాము. జ్ఞాన
విషయము క్రొత్తదైన దానివలన, తెలిసిన సత్యము కొందరికి ఆనందమునిస్తే, కొందరికి ఆసూయనిచ్చి వినిన విషయము
ఏసుప్రభువు చెప్పినట్లుగా, సహించకుండా పోవచ్చును. అసూయ అను గుణమును ప్రక్కనపెట్టి చూస్తే మేము చెప్పిన
జ్ఞాన విషయము ఎన్నో ప్రశ్నలకు జవాబునిచ్చునదై క్రొత్త ఆనందమును కల్గించునదై ఉండును. దైవమునకు సంబంధించిన
సమస్త విషయములను పరిశీలించి చూస్తే కాకిగూటిలో కోకిల గ్రుడ్డుపెట్టినట్లు, మాయ (సాతాన్) దేవుని ధర్మములలో
తన ధర్మములను కలిపి ఉంచినది. కాకిగూటిలోని కోకిల గుడ్డును ఎవరూ గుర్తించలేనట్లుండుట వలన ఇది కాకి
గ్రుడ్డని, ఇది కోకిల గ్రుడ్డని ఎవరూ చెప్పలేక కాకిగూటిలోనివన్నీ కాకిగ్రుడ్లే అనుచున్నారు. అదే విధముగా మాయ తన
ధర్మములను ఎవరూ గుర్తించనట్లు దేవుని ధర్మములతో కలిపి ఉంచుట వలన ప్రజలు తమకు తెలిసిన ధర్మములలో ఏది
దైవధర్మము, ఏది మాయ ధర్మము అని గుర్తించలేక తనకు తెలిసినవన్నీ దేవుని ధర్మములనుకొనుచున్నాడు. కొందరికేమో
దేవుని ధర్మములు మాయ ధర్మములుగా, మాయ ధర్మములు దేవుని ధర్మములుగా కనిపిస్తున్నవి. కొందరిలోనేమో
మాయ ధర్మములు బాగా ప్రచారమై పోయినవి. అటువంటి వారికి మేము చెప్పు దైవధర్మములు క్రొత్తగా కనిపించడమే
కాకుండా అసూయను కల్గించి సహింపనట్లు చేస్తున్నవి.
ఏది ఎట్లున్నా, ఎవరు ఏ విధముగా అర్థము చేసుకొన్నా మేము (నేను + నా ఆత్మ) మాత్రము తప్పనిసరిగా
సత్యమునే బోధించుచుందుము. ఏ మతములోనైనా దేవుని వాక్కులకు భావ లోపములు ఏర్పడినపుడు వాటిని సవరించి
అసలైన భావమిది అని చెప్పడము మా కర్తవ్యము. అందువలన మేము హిందూ (ఇందూ) మతములోనే కాకుండా
క్రైస్తవము, ఇస్లామ్ మతములలోని దైవసందేశములకు భావ లోపము ఏర్పడకూడదనీ, అట్లు ఏర్పడివుంటే వాటికి నిజ
భావమును తెలిపేదానికి ప్రయత్నిస్తాము. అటువంటి ప్రయత్నములోనిదే సమాధి యొక్క వివరమును చెప్పడము
జరిగినది. ప్రకృతితో కూడిన శరీరముతో పరమాత్మ భాగమైన ఆత్మ, జీవాత్మ కలసిన సజీవ శరీరమును సమాధి అని
అనవచ్చునని కూడా చెప్పుకొన్నాము. ప్రపంచములో పుట్టిన జీవరాసులందరికీ శరీరమునిచ్చిన ప్రకృతి తల్లి వంటిదనీ,
శరీరములో చైతన్యమునిచ్చిన పరమాత్మ తండ్రివంటి వాడని కూడా చెప్పుకొన్నాము. మీకు మొదట అర్థమయ్యే దానికి
ప్రకృతి తల్లి వంటిదని, పరమాత్మ తండ్రివంటివాడని మొదట చెప్పినా జన్మజన్మలకు నిజమైన తల్లి తండ్రి ప్రకృతి
పరమాత్మయే. ఇదే విషయమునే భగవద్గీత గుణత్రయ యోగము అను ఆధ్యాయములో 3,4 శ్లోకములందు
30

Page 31
:
శ్లో ॥3. మమయోని ర్మహద్భహ్మ తస్మిన్ గర్భమ్ దధామ్యహమ్,
సంభవ స్సర్వ భూతానామ్ తతో భరతి భారత ॥
శ్లో ॥4. సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా ||
భావము : అచేతన ప్రకృతి నాకు భార్యలాంటిది. దానికి నేను భర్తగా, బీజదాతగా ఉన్నాను. అందువలన మా ఇద్దరికి
సమస్త జీవరాసులు పుట్టుచుండును. బయటి ప్రపంచములో ఏ యోనినుండి ఏ గర్భమునుండి) ఏ ఆకారముతో
పుట్టినా, సకల జీవరాసులకు శరీరమునిచ్చిన తల్లి ప్రకృతికాగా, దానికి బీజదాతనైన నేను (పరమాత్మ) తండ్రియని
తెలియవలెను.
ఒకర
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. ప్రకృతివలన శరీరము తయారగుచున్నది. పరమాత్మ ప్రకృతికి
బీజమును ఇస్తున్నాడు. అందువలన తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అని తెలిసినది. ఇది మనుషులు చెప్పినది కాదు,
దేవుని సందేశము. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మనకు రావచ్చును. అదేమనగా! ఈ మధ్య సంవత్సరము క్రిందట
క్రొత్తగా పెళ్లయిన జంటకు క్రొత్తగా కొడుకు పుట్టాడు. ఆ బాలుని తండ్రి 'నా కొడుకు నామకరణమునకు అందరూ
హాజరై దీవించి పోవలసినదిగా' ఆహ్వాన పత్రికను అచ్చువేయించి పంచాడు. అతనేమో నాకొడుక్కు పేరు
పెట్టుచున్నామంటున్నాడు. ఇక్కడేమో భగవద్గీతలో ఎవని కొడుకైనా వాడు నా కొడుకే అని దేవుడు చెప్పడము జరిగినది.
ఏది నిజము అని యోచిస్తే, మనము చూస్తున్నట్లే పెళ్ళి చేసుకొని భార్యతో భర్త కాపురము చేసి కొడుకును కన్న తండ్రి
తల్లులు వీరే. వీరు పెళ్ళి చేసుకొన్నదీ, దాంపత్య జీవితము గడిపినదీ, సంతానమును పొందినదీ వీరేనని ప్రత్యక్షముగా
మనకు తెలుసు. అయితే ఏ భార్యకు ఎవడు మొగుడైతే నాకేమి, పుట్టినవాడు నా కొడుకే అనడము దేవునికి న్యాయమా?
అని ఎవరైనా అడగవచ్చును. దానికి ఇపుడు జవాబు చెప్పవలసినది మేమేగా! చెప్పుతాము వినండి.
ఎవరితోనైనా మాట్లాడునపుడు 'ఆ నా కొడుకు, ఈ నాకొడుకు' అని ఎవరినైనా అనుచుందురు. వాడు చేసిన మోసము
పెద్దది అనబోయి, ఆ నాకొడుకు చేసిన మోసము పెద్దది అనుచుందురు. ఎవరినైనా దూషించేటప్పుడు నా కొడకా అని
అనుచుందురు. కొందరు తెలియకుండానే ఇతర వ్యక్తిని నాకొడకా అని అనడము జరుగుచున్నది. వాస్తవానికి
దూషించే వ్యక్తికి ఎదుట వ్యక్తి కొడుకు కాకున్నా ఆ మాట అనడము న్యాయమా అని అడిగితే న్యాయము కాదనియే,
అట్లనడము సరియైన పద్ధతికాదనియే చెప్పవచ్చును. బయట వ్యక్తి మరొక వ్యక్తిని నా కొడకా అని అంటే అది
అన్యాయము అయినపుడు, అంత పెద్ద దేవుడు, భార్యభర్తలకు అన్ని ఆధారములతో పుట్టిన శిశువును నా కొడుకు
అనడము పెద్ద అన్యాయమగును అని ఎవరైన అనవచ్చును. అయితే దైవ ధర్మముల ప్రకారము చూస్తే న్యాయము
అన్యాయమూ, నీతి అవినీతి ప్రపంచములో జీవనము సాగించువారికి మాత్రమే వర్తించును. దేవునికి నీతి న్యాయములు
వర్తించవు. ఆయనకు వర్తించునవి జ్ఞానము ధర్మములు మాత్రమే. అందువలన ఇతరులకు పుట్టిన వానిని దేవుడు నా
కొడుకు అనడము జ్ఞానమా? ధర్మమా? అని అడగవచ్చును. కానీ నీతియా న్యాయమా అని అడగకూడదు. సరే
భగవద్గీతలో దేవుడు అందరికీ తల్లి ప్రకృతి, తండ్రిని నేను అని అనినపుడు ఇది ధర్మమా? అని అడగవచ్చును.
భూమిమీద ఎవరు ఎవరికి పుట్టినా వానికి తండ్రిని నేనే అని చెప్పడము, చూచే దానికి అధర్మముగా కనిపించినా
వాస్తవానికి ఆయన చెప్పిన మాట ధర్మమేనని చెప్పవచ్చును. దేవుని మాట ధర్మమని చెప్పుట వలన ఇతను అసత్యవాదియని
31

Page 32
నన్ను మీరనుకొనినా ఫరవాలేదు. కానీ ధర్మబద్ధముగా దేవుడు ప్రతి మనిషికీ, ప్రతి జీవరాసికి తండ్రి అనియే చెప్పవచ్చును.
ఇదే విషయమునే బైబిలులో మత్తయి సువార్త 9వ వాక్యములో ఇలా ఉన్నది. "భూమిమీద ఎవనినైననూ తండ్రి అని
పేరుపెట్టి పిలువవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు.” ఈ మాటను ఏసు స్వయముగా చెప్పాడు.
బైబిలులో ఏసుప్రవక్త చెప్పినది, భగవద్గీతలో అందరికి బీజదాతనైన నేనే తండ్రినని చెప్పిన దానికి సరిపోయింది.
కనిపించే తల్లి తండ్రుల విషయమునకువస్తే సామాజిక జీవితములో కనిపించే తల్లి తండ్రి ఉన్నా ఆధ్యాత్మిక విధానములో
ప్రతి జన్మకు తల్లి తండ్రి కనిపించకుండా ఉన్నారు. కనిపించే తల్లి తండ్రి ప్రస్తుత జన్మకే తల్లితండ్రులు కాగా, ప్రకృతి
పరమాత్మలు అన్ని జన్మలకూ, అందరికీ తల్లి తండ్రులుగా ఉన్నారు. ప్రకృతి పరమాత్మలను వారు నిజమైన తల్లితండ్రులుగా
ఉన్నారనుమాట కొందరు వినినా వారిలో ఏమాత్రము స్పందనగానీ, క్రొత్త విషయము తెలిసినందుకు ఆశ్చర్యముగానీ
కలుగక చెప్పిన వానివైపు దీనముగా చూచెదరు. చెప్పేవారు మతిస్థిమితము లేనివానిగా కనిపించుట వలన వారు
విన్న విషయమును గురించి పట్టించుకోరు. ఎందుకనగా! ఆ మాట అసత్యమనీ, చెప్పేవానికి మతిపోయిందనీ జాలిగా
చూస్తారు. ఇంకా కొందరు ప్రకృతి పరమాత్మ అనువారు కూడా మనుషులే అని అనుకొని, వారు కని, వీరికి ఇచ్చారేమో
ప్రస్తుతమున్న వారు పెంచిన తల్లి తండ్రులేమో అని అనుకోవడము జరుగుచున్నది. కొందరు విజ్ఞానులైతే సైన్సు
పరిశోధన ప్రకారము తండ్రి వీర్యకణము వలన, తల్లి అండము వలన మనిషి పుట్టివుంటే, కణముగానీ, అండముగానీ
లేని వారిపేరు చెప్పడము ఏమిటియని హాస్యాస్పదముగా మాట్లాడుదురు. ఈ విధముగా మూల గ్రంథములలో దేవుడు
చెప్పిన మాటను చెప్పినా ప్రజలు వినే స్థితిలో లేరు. చెప్పిన వానిని మూఢనమ్మ కస్తునిగనో, బుద్ది హీనునిగనో అనుకోవడము
జరుగుచున్నది.
ఎవరు ఏమనుకొనినా, ఎన్ని విధముల చూచినా నిజానికి ప్రకృతి వలన శరీరమూ, పరమాత్మ వలన కదలిక
శక్తి, జీవుడు ఏర్పడడము వలన ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రియగుట వాస్తవమైన మాటయేకాక శాస్త్ర సమ్మతమైనదనీ,
ధర్మయుక్తమైనదీ అనికూడా తెలియుచున్నది. కల్పించుకొని మాట్లాడడము వేరు, శాస్త్రబద్దముగా మాట్లాడడము వేరు.
ఉదాహరణకు చెప్పుకొంటే అష్టాదశ (18) పురాణములు కల్పించుకొని చెప్పినవి. అవి శాస్త్రములుకావు, కొన్ని
అబద్దములనూ, కొన్ని నిజములను అల్లి చెప్పినవి పురాణములు. శాస్త్రములు అటువంటివికావు, శాస్త్రము సత్య
స్వరూపముతో కూడివుండును. శాస్త్రము శాశ్వితము. ఎప్పటికీ మారునది కాదు. భూమిమీద ఆరు శాస్త్రములే ఉన్నవి.
అందులో అన్నిటికంటే గొప్పదీ, అన్నిటికంటే ముందు పుట్టినదీ బ్రహ్మవిద్యా శాస్త్రము. అయితే మొదటినుండి వరుస
క్రమములో చివరిలో చెప్పబడుచున్నది. మిగత ఐదు శాస్త్రములు తర్వాత పుట్టినవైనప్పటికీ వరుస క్రమములో
ముందు చెప్పబడుచున్నవి. శాస్త్రములు ఆరు ఇలా వరుసగా గలవు. 1) గణిత శాస్త్రము 2) ఖగోళ శాస్త్రము
3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము 5) జ్యోతిష్య శాస్త్రము 6) బ్రహ్మవిద్యా శాస్త్రము. ఆరవ శాస్త్రమైన
బ్రహ్మవిద్యా శాస్త్రమును యోగశాస్త్రము అనికూడా అనవచ్చును. మనిషి యొక్క జనన మరణములూ, కర్మ విధానములూ,
ఆత్మ అధ్యయనములూ, జీవాత్మ అనుభూతులూ అన్నియు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించి ఉండును. అందువలన
ఆధ్యాత్మికములో ఉన్నవన్నియు శాస్త్రబద్ధమైనవే ఉండును. ఒకవేళ ఎవరైనా ఆధ్యాత్మికము కాని విషయములను ఆధ్యాత్మికమే
అని చెప్పినా అవి సత్యము కావు, శాస్త్రబద్ధము కానివిగా ఉంటాయి. కొన్ని చోట్ల దైవజ్ఞాన విషయము లలో మాయ
జ్ఞానము కూడ కలిసిపోయి ఎవరూ గుర్తించలేనట్లుండినా బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలిసినవారు, శాస్త్రబద్దముగాని
మాయ జ్ఞానములను వెంటనే గుర్తుపట్టవచ్చును. ఈ విధానముతోనే దైవ సందేశములైన మూల గ్రంథములలో
32

Page 33
కాకిగూటిలో కోకిలగుడ్లు కలిసిపోయినట్లు, దొంగగా కలిసి పోయిన మాయ జ్ఞానమును కూడా కనిపెట్టి వాటిని
తీసివేయవచ్చును. మేము వ్రాసిన "త్రైతసిద్ధాంత భగవద్గీత" లో మాయాజ్ఞాన శ్లోకములను తీసివేసి వ్రాయడము
జరిగినది.
బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము ఒక జీవునికి తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అనుమాట శాసనము మరియు
వాస్తవము. అయితే మనము చూస్తున్నట్లు అందరూ, కనిపించే తల్లి తండ్రులకే పుట్టినట్లు తెలియుచున్నది. కానీ
ప్రకృతి పరమాత్మలకు పుట్టునట్లు ఎక్కడా ప్రత్యక్షముగా తెలియడము లేదే అని అడగవచ్చును. ఈ ప్రశ్నకు మా సమాధానము
చెప్పుటకు ముందు ఒక ఉదాహరణను చెప్పుకొందాము. మేము 1980వ సంవత్సరము "జనన మరణ సిద్ధాంతము”
అను ఒక సంచలనాత్మక గ్రంథమును వ్రాయడము జరిగినది. అది అన్ని గ్రంథములవలె సాధారణమైన గ్రంథము
కాదు. ఎవరికీ తెలియని చావు పుట్టుకల విషయములను సిద్ధాంతముగా వ్రాసిన గ్రంథమది. ఆ ఒక్క గ్రంథమును
వ్రాయుటకు 45 రోజులు పట్టింది. ఆ గ్రంథమును వ్రాయుటకు ఎంతో యోచన చేయవలసి వచ్చినది. అట్లే ఎన్నో
ఆధారములను సేకరించి వ్రాయవలసి వచ్చినది. అలా 45 రోజులు కష్టపడితే ఒక ప్రతిని తయారు చేయగలిగాము.
అప్పుడు అది “జనన మరణ సిద్ధాంతము” అను ఒక గ్రంథముగా పూర్తి తయారైనది. తర్వాత అటువంటి గ్రంథములను
కొన్ని వేల సంఖ్యలో తయారు చేయుటకు, మొదట రచయిత చేత వ్రాయబడిన గ్రంథమునకు నమూనాను తయారు
చేసి దానివలెనున్న ఎన్ని జనన మరణ సిద్ధాంత గ్రంథములనైనా తయారు చేయవచ్చును. ఒకమారు వ్రాసిన తర్వాత
అట్లే శ్రమపడి మిగతా అటువంటి గ్రంథములను వ్రాయవలసిన అవసరములేదు. మొదటి గ్రంథము యొక్క నమూనాను
తయారు చేసుకొని, ఆ నమూనా ప్రకారము 45 రోజుల్లో 45 వేల గ్రంథములనైనా తయారు చేయవచ్చును. అయితే
ఇక్కడ మొదట వ్రాయబడినది వ్రాసిన గ్రంథముకాగా, తర్వాత అదే నమూనాతో తయారైన గ్రంథములన్నీ చేసిన
గ్రంథములైనాయి. వ్రాసిన గ్రంథములలోని విషయమే చేసిన గ్రంథములలో ఉండినప్పటికీ మొదట వ్రాసిన గ్రంథము
మూల గ్రంథముకాగా, తర్వాత దాని ప్రకారము దానివలె తయారైనవి ఎన్ని అయినా, అవి అన్నియూ దాని నమూనాతో
తయారైనవేగానీ మూల గ్రంథములు కానేరవు. తర్వాత వేల సంఖ్యలో తయారైన “జనన మరణ సిద్ధాంతము” అను
గ్రంథములకు రచయిత మొదట వ్రాసిన వ్యక్తిగా మా పేరే ఉన్నది. అయినా నేను మొదట ఒక గ్రంథమునే వ్రాశాను.
మిగతా అటువంటి గ్రంథములను మొదటి గ్రంథమునకు శ్రమపడి వ్రాసినట్లు వ్రాయలేదు. అప్పుడు 45 రోజులకు
ఒక గ్రంథమును మాత్రమే వ్రాయగా, ఇప్పుడు 45 రోజుల్లో 45 వేల గ్రంథాలు తయారైనవి. తర్వాత తయారైన
అన్నిటినీ వ్రాయకున్నా మేము వ్రాసిన నమూనాతోనే తయారైన గ్రంథములగుట వలన వాటికి రచయితగా నాపేరే
ఉండడము జరిగినది. దీనినిబట్టి మొదట రచయిత ఒక గ్రంథమును వ్రాస్తే, తర్వాత వ్రాయకుండినా అదే నమూనాతో
తయారైన గ్రంథములన్నిటికి అదే పేరు ఉండును. అదే రచయిత ఉండును. మొదట వ్రాసిన పుస్తకమును తర్వాత
ఎన్నో పుస్తకములుగా చేయుచున్నాము. దానివలన మొదట పుస్తకమును వ్రాసిన పుస్తకమనగా తరువాత తయారైన
పుస్తకములను చేసిన పుస్తకములు అంటున్నాము. మొదట వ్రాసిన దానిలోను, తర్వాత వ్రాసిన దానిలోనూ ఒకే
సమాచారముండును, ఒకే రచయిత పేరుండును. అవి ఒకటే అయినా మొదటిది వ్రాసినది తర్వాతది తయారైనది. ఈ
విషయమంతయు చెప్పబోవు విషయము అర్థమగుటకు ఉదాహరణగా చెప్పినదే.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. ఏ జీవరాసి అయినా లేక ఏ మనిషి అయినా జన్మ ఒకేమారు
పొందుతాడు. ఈ విషయమును “పునర్జన్మ రహస్యము” అను గ్రంథములోనే చెప్పాము. ప్రతి మనిషి యొక్క జన్మ సృష్ఠి
33

Page 34
ఆదిలోనే జరిగింది. సృష్ట్యాదిలో ఒకమారు జన్మించిన తర్వాత మళ్ళీ ఎవడూ జన్మించడు. కానీ శరీర మార్పిడి కొరకు
పునర్జన్మను ప్రతి మనిషి కొన్ని సంవత్సరములకొకమారు పొందుచున్నాడు. దాని ప్రకారము ఇప్పుడు మనము పునర్జన్మ
ఎత్తాము అని చెప్పవచ్చును. మనజన్మ సృష్ఠి ఆదిలోనే జరిగినది. సృష్ట్యాదిలో నీవు పుట్టినట్లు జ్ఞాపకము లేదు. కావున
అసలైన జన్మను మరచిపోయాము. పునర్జన్మకు కనిపించే తల్లి తండ్రులు అవసరము. కానీ జన్మను పొందినపుడు
అనగా సృష్ట్యాదిలో కనిపించే తల్లి తండ్రులు లేరు. నీవుగానీ ఇపుడు నీకు తల్లి తండ్రులుగా ఉన్నవారుగానీ అందరూ
సృష్ట్యాదిలో దేవుని చేత సృష్ఠింపబడినారు. సృష్ట్యాదిలో ప్రకృతినే గర్భముగా చేసుకొన్న పరమాత్మ మనిషిని తయారు
చేయుటకు తల్లి అండముతో, తండ్రి వీర్యముతో పని లేకుండా పుట్టించాడు. దేవుడు మొదట సృష్ఠి లేనపుడు తన
సృష్ఠిని రచించాడు. మొదట తన సృష్ఠి ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకొని, అలాగే ఒక రచయిత గ్రంథమును
వ్రాసినట్లు దేవుడు తన సృష్టిని రచించాడు (తయారు చేశాడు). మొదటి పుస్తకము తయారగుటకు ప్రింటింగ్ ప్రెస్
అవసరము లేనట్లు, మొదట మానవులను సృష్ఠించుటకు మానవ సంబంధ అండమూ, కణమూ అవసరములేదు.
మొదట వ్రాయబడిన పుస్తకము యొక్క నమూనాను (ప్లేట్ను) అనుసరించి ఎన్ని పుస్తకములైనా, ఎన్ని మార్లయినా
తయారు చేయవచ్చును. అలాగే దేవుడు స్వయముగా తయారుచేసిన మానవుని నమూనాను అనుసరించి తల్లి, తండ్రి
అను సంయుక్త యంత్రముల ద్వారా ఎంతోమంది మానవులను అనేకమార్లు పుట్టించుచున్నాడు. సృష్ట్యాదిలో ప్రకృతి
పురుషుల చేత సృష్ఠింపబడిన మనిషిది జన్మకాగా, తర్వాత ప్రకృతి పురుషుల స్థానములో స్త్రీ పురుషుడు తల్లి తండ్రిగా
ఉండగా క్రొత్త శరీరములతో పుట్టునది పునర్జన్మ అగుచున్నది. ఇటువంటి పునర్జన్మలు శరీర మార్పిడి కొరకు ఎన్నో
జరుగుచున్నవి. పునర్జన్మలు ఎన్ని జరిగినా ఆ సమయములో క్రొత్త శరీరములలో జీవుడు చేరడము జరుగుచున్నది.
కానీ జీవుడు మాత్రము సృష్ట్యాదినుండి ఒకేలా ఉన్నాడు. ఒక పేరుగల పుస్తకము ఎన్నిమార్లు క్రొత్తగా తయారైనా
దానికి పేరు మారదు, దానిలోని విషయములూ మారవు. కానీ కాగితము మాత్రము మారిపోయివుండును. పాత
కాగితముల స్థానములో క్రొత్త కాగితములుండును. అలాగే మనిషి ఎన్నిమార్లు పుట్టినా, ఆ మనిషి శరీరము క్రొత్తదగును.
కానీ మనిషిలోని జీవుడు సృష్ట్యాదినుండి ఉండేవాడే ఉండును. వానికున్న గుణములే ఉండును. పుస్తకము ఎన్నిమార్లు
క్రొత్తగా అచ్చువేయబడినా, దాని రచయిత మొదట వ్రాసినవాడే అయినట్లు, మనిషి ఎన్నిమార్లు పునర్జన్మ ఎత్తినా,
మొదట సృష్ఠించినవాడే వానికి సృష్టికర్త అగును. పుస్తకము పుట్టి ఎంతకాలమైనా దాని రచయిత మారనట్లు మనిషి
ఎన్నిమార్లు శరీరము మారి పుట్టినా, సృష్ఠి జరిగి ఎంతకాలమైనా, అతనిని మొదట పుట్టించిన తండ్రి మాత్రము మారడు.
అందువలన సృష్ట్యాదిలో నిన్ను పుట్టించిన వానినే నిజమైన తండ్రిగా చెప్పవలసి వచ్చినది.
ప్రస్తుత కాలములో తల్లి, తండ్రి కనిపించినా వీరు జిరాక్స్ మిషన్ (అచ్చుయంత్రము) లాంటి వారేననీ, సృష్ఠికర్తలు
కారనీ తెలియవలెను. ఒక పుస్తకము పాతదైనప్పుడు జిరాక్స్ మిషన్ లో జిరాక్స్ చేయిస్తే ఆ మిషన్ దానిని సృష్టించలేదు
కదా! ఉన్న పుస్తకములోని విషయమునే లేక వ్రాతనే క్రొత్త పేపరు మీద ముద్రించి పంపినది కదా! అలాగే ఒక
శరీరము పాతదైనపుడు తల్లి, తండ్రియను యంత్రములాంటి వారిచేత తిరిగి పుడితే గతములోని జీవుడే క్రొత్త శరీరముతో
పుట్టుచున్నాడు తప్ప, ప్రస్తుత కనిపించు తల్లి తండ్రులు మాత్రము అతనిని సృష్టించలేదు. పుస్తకమును జిరాక్స్
చేసినపుడు రచయిత పేరు స్థానములో జిరాక్స్ మిషన్ పేరును చెప్పకుండా మొదట రచించిన వాని పేరే చెప్పినట్లు,
మనిషి కనిపించు తల్లి తండ్రులకు పుట్టినా అది జన్మకాదు పునర్జన్మే. కావున మొదట జన్మనిచ్చిన దేవుని పేరే తండ్రిస్థానములో
చెప్పవలసి వచ్చినది. ఈ విధముగా సృష్ట్యాదిలో అందరికి జన్మనిచ్చిన బీజదాత అయిన దేవుడే తండ్రియగును.
అందువలన బైబిలులో మత్తయి సువార్త 23వ అధ్యాయములో 9వ వాక్యమునందు “తండ్రి అని పేరుపెట్టి ఎవరినీ
34

Page 35
పిలువవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోక మందున్నాడు.” అని చెప్పడము పూర్తి సత్యమైనమాట. అలాగే
భగవద్గీత గుణత్రయ విభాగయోగము అను అధ్యాయములో 3,4 శ్లోకములలో సర్వ జీవులకు బీజదాతనైన నేను
తండ్రిని అని చెప్పడము కూడా పూర్తి సత్యమైనది. తండ్రి పరమాత్మ, తల్లి ప్రకృతి అని తెలిసిపోయినది. సృష్ట్యాదిలో
పుట్టించిన ప్రకృతి పరమాత్మే నిజమైన తల్లి తండ్రులు. తర్వాత పునర్జన్మలో కనిపించు తల్లి తండ్రులు ఆ జన్మకు
తల్లితండ్రులైనా వారు అచ్చు యంత్రములాంటి వారేగానీ నిజమైన సృష్టి వారివలన జరుగలేదు. అందువలన బైబిలులో
తండ్రి అని పేరు పెట్టి ఎవరినీ పిలువవద్దని చెప్పడము అతిశయోక్తి కాదు.
మనిషికి జన్మ ఒక్కమారే, అయితే పునర్జన్మలు ఎన్నో చెప్పలేము. మనిషికి తండ్రి ఒక్కడే, అయితే తండ్రిలాంటి
వారు ఎందరో చెప్పలేము. సృష్టి ఆదిలో జన్మించిన మనిషి సృష్ఠి అంత్యము వరకు ఉండవలసిందే, మధ్యలో వచ్చునవి
శరీర మరణములేగానీ జీవుని నాశనములు కావు. జీవుని నాశనము మోక్షముతో వచ్చును. జీవుడు మోక్షము
పొందనంత వరకు జన్మలు కానటువంటి పునర్జన్మలు పొందవలసిందే. అట్లే తల్లి తండ్రులు కానటువంటి తల్లి
తండ్రులలాంటి వారిని చూడవలసిందే. మనిషి పుట్టి ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల సంవత్సరములైనదో చెప్పలేము. కానీ
ఇంతవరకు మనిషికి తన తల్లితండ్రులెవరో తెలియదంటే సిగ్గుచేటు కాదా! తనకు నిజమైన తల్లితండ్రులు ఉన్నారను
విషయము కూడా తెలియదంటే ఆశ్చర్యము కాదా! బయటి ప్రపంచములో ఎంతో మేధావిగా, ఎంతో హెూదాగా,
ఎంతో విజ్ఞానిగా, ఎంతో బలవంతునిగా ప్రవర్తించు మనిషికి తన స్వంత తల్లి తండ్రుల మీద ధ్యాసే లేదంటే, అతడు
చచ్చినా ఒక్కటే బ్రతికినా ఒక్కటేనని వేమనయోగి “తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని
చెదలు పుట్టదా గిట్టదా” అని అన్నాడు. వేమన చెప్పినట్లు ప్రకృతి పురుషులు ఉన్నారనీ, వారు తన తల్లి తండ్రులనీ
తెలియని వారు పుట్టలోని చెదలతో సమానము. అవి పుట్టినా గిట్టినా వాటిని గురించి ఎవడూ అనుకోడు. అటువంటివాడు
పుట్టినా ఒక్కటే, పుట్టకున్నా ఒక్కటేనని వేమన భావము.
సృష్ట్యాదిలో పరమాత్మ తన ప్రకృతి చేత శరీరమును తయారు చేయించి, ఐదు ధాతువులతో కూడిన శరీరములో
తన అంశ అయిన జీవాత్మను చేర్చి, సజీవ శరీరములను తయారు చేశాడు. అలా మొదట తయారు చేయబడిన
జీవరాసులవి జన్మలని తెలుసుకొన్నాము. అప్పుడు ప్రారంభమైన జన్మ ఇప్పటి వరకూ ఉన్నది. తర్వాత కూడా
ఉంటుంది. మనిషి సృష్ట్యాదిలో జన్మ తీసుకొన్నపుడు సమాదినుండి లేపబడలేదు. పునర్జన్మలలో మాత్రమే సమాధి
అను శరీరమునుండి లేపబడుచున్నాడు. పునర్జన్మలో తల్లిగర్భమునుండి బయటపడిన శరీరములోనికి, గత జన్మలోని
శరీరమునుండి బయటపడిన జీవుడు చేరినపుడు సమాధి అగుచున్నది. సృష్ట్యాదిలో తల్లి గర్భమునుండి శరీరము
బయటపడడములేదు. జీవుడు వేరుశరీరమునుండి రావడమూ లేదు. అందువలన సృష్ఠి మొదటిలో జన్మించినపుడు
ఎవరికీ సమాధిలేదు. సమాధి అనునది పునర్జన్మలు గల వారికి మాత్రమే ఉన్నదని తెలియవలెను. పునర్జన్మలో
మాత్రమే మనిషి (జీవుడు) సమాధినుండి లేపబడుతాడు అని మూల గ్రంథములలో ఉన్నమాట వాస్తవమవుతున్నది.
మూల గ్రంథములలో దేవుడు సమాధినుండి లేపునని వ్రాయబడివున్నది. ఇక్కడ ఈ మాటలో మనిషికి కొంత సందిగ్ధత
ఏర్పడ వచ్చును. అది ప్రశ్నరూపము కావచ్చును. దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడని మీరే చెప్పారు కదా!
అటువంటపుడు దేవుడు మనిషిని సమాధి నుండి లేపే పని చేయునా అని ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా!
దేవుడు సృష్ఠి పూర్వము పనిచేసి మానవున్ని పుట్టించివుండవచ్చును. కానీ సృష్ఠి తర్వాత ఆయనకు పనిలేదు, రూపములేదు,
పేరూలేదు. అయితే ఆయన ఏర్పరచిన విధానమును అనుసరించి, ఆయన నియమించిన వారు, ఆయన పనిని
35

Page 36
చేయడము వలన, ఆ పనిని ఆయన చేసినట్లు చెప్పుచున్నారు. కానీ ఆయన నియమించిన భూతములు, మహాభూతములు,
గ్రహములు, ఉపగ్రహములు అను ఎన్నో ఆయన పనిని నెరవేర్చుచున్నవి. దేవుడు ఏ పనినీ స్వయముగా చేయలేదు.
పునర్జన్మలో క్రొత్తగా పుట్టిన శిశుశరీరము వరకు జీవున్ని తీసుకువచ్చి అందులో చేర్చి, తిరిగి దానినుండి
లేపడము దేవుని పని అని చెప్పబడినా, ఆ పని జరుగుటకు మూలకారకుడు దేవుడే అయినా, ఆ పనిని మొత్తము
దేవుడు చేయడము లేదు. ఆ పనిని చేయుటకు మరియు జీవున్ని జీవితాంతము నడిపించుటకూ, కర్మలను
అనుభవింపజేయుటకు తగినట్లు శరీరములో తన పనిగా చేయునట్లు దేవుడు, ఆత్మ అను దానిని తన అంశతో ఏర్పరచి
పెట్టాడు. పరమాత్మ (దేవుడు) ఏర్పరచిన ఆత్మ తన పాత్రను సృష్ఠి ఆదినుండి జీవునితోపాటు శరీరములో ఉండి
నెరవేర్చుచున్నది. ఈ ఆత్మను ఎవరైతే తెలియగలుగుతారో, తర్వాత వారు పరమాత్మను సులభముగా తెలియుటకు
వీలుగును. సృష్ట్యాదిలోనే తన పరిపాలన కొరకు దేవుడు ఎందరినో తన సేవకులను ఏర్పరచినా వారు ఎవరో మనకు
తెలియదు. దేవుడు ఏర్పరచిన పనులు చేయుటకు, ప్రకృతి సంబంధమైన భూతములను గ్రహములను దేవుడు
మనిషితోపాటు సృష్టించినా, అన్నిటికంటే గొప్పది అత్యంత శక్తివంతమైన ఆత్మను కూడా మనిషితోపాటే సృష్ట్యాదిలోనే
దేవుడు సృష్ఠించాడు. శరీరమునకు అధిపతిగా ఆత్మను నియమించి జీవున్ని కర్మ అనుభవించునట్లు చేశాడు. సృష్ఠిలో
ఆత్మపాత్ర చాలా గొప్పది. పరమాత్మ తర్వాత ఆత్మే గొప్పదని చెప్పవచ్చును. దేవుడు ప్రకృతిని తనకు తోడుగా
సృష్ఠించిన తర్వాత ప్రకృతిని ఐదు భాగములు చేశాడు. అలాగే పరమాత్మ అయిన తనను మూడు భాగములుగా
విభజించాడు. ప్రకృతి ప్రకృతిగానే ఉంటూ దానినుండి ఐదు భాగములను బయటికి వచ్చునట్లు చేశాడు. అలాగే
పరమాత్మ పరమాత్మగానే ఉంటూ తననుండి రెండు భాగములను బయటికి వచ్చునట్లు చేశాడు. ప్రకృతి నుండి వచ్చిన
ఐదు భాగములు శరీరము కాగా, పరమాత్మనుండి బయటికి వచ్చిన ఆత్మ, జీవాత్మ అను రెండూ శరీరములో చేరిపోయినవి.
దీనినిబట్టి ఒక సజీవ శరీరములో ప్రకృతి యొక్క ఐదు భాగములు మరియు పరమాత్మయొక్క రెండు భాగములు
ఉన్నవని తెలియుచున్నది.
ఇది శాస్త్రబద్ధమైన విషయము. అందువలన ఈ విషయములు పూర్తి సత్యమైనవి. ఈ మాటను మేము
చెప్పినా మా విలువ తెలియని వారు నమ్మకపోవచ్చును. శాస్త్రబద్ధమైనపుడు బయటికి నిరూపణకు రావలెను కదా!
అని అడుగవచ్చును. ఇటువంటి ప్రశ్న కొందరికి రావచ్చునని పరమాత్మ ముందే ఈ జ్ఞానము నిరూపణగా తెలియునట్లు
మన శరీరము మీద ఒక రకమైన గుర్తునుంచాడు. శరీరము మీద సృష్ట్యాదిలోనే దేవుడు పెట్టిన గుర్తు ప్రపంచ
విధానములో ఏ అర్థము లేనిదైనా, పరమాత్మ విధానములో విశేషమైన అర్థముకలదిగా ఉన్నది. ఆ గుర్తు యొక్క
వివరమును తెలుసుకొనే ముందు కొంత సమాచారమును తెలుసు కొందాము. సృష్ఠి మొదటిలోనే ప్రకృతి సంబంధమైన
శరీరములో పరమాత్మ సంబంధమైన జీవాత్మ ఆత్మలను దేవుడు అమర్చడము జరిగినది. సృష్టికంటే ముందు కేవలము
పరమాత్మ (దేవుడు) మాత్రము ఉండేవాడు. నేడు కనిపించు ప్రకృతిగానీ, కనిపించని జీవాత్మ, ఆత్మలుగానీ ఏవీ లేవు.
ప్రకృతిలోనున్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఏవీ లేవు. ఆకాశము అనగా శూన్యము కూడాలేని స్థితి ఎట్లుంటుందో
ఏ విధముగా ఊహించు కొనుటకు కూడా సాధ్యపడదు. ఆ స్థితి దేవునికి తప్ప ఎవరికీ తెలియదు.
ఏ
స్థితినుండి అచర ప్రకృతి తయారైనది. తర్వాత చర ప్రకృతి తయారైనది. వెంటనే జీవాత్మ ఆత్మలు తయారైనవి.
సృష్ట్యాదిలో రెండు ప్రకృతులు, రెండు ఆత్మలు తయారగుటకు క్షణకాలమే పట్టింది. ఒకే క్షణంలో దైవసంకల్పము చేత
ప్రకృతీ, ప్రకృతి సంబంధమైన శరీరములు తయారు కాగా, అప్పుడే పరమాత్మ సంబంధమైన ఆత్మ జీవాత్మలు తయారైనవి.
అటువంటి
36

Page 37
మొదట ప్రకృతి సంబంధమైనవి తయారుకాగా ఆ క్షణమే పరమాత్మ సంబంధమైనవి తయారైనవనీ, ఇది
సృష్ట్యాదిలోనే జరిగిన పని అని తెలియుటకు, అప్పుడే మొదట పుట్టిన శరీరము మీద ప్రకృతి, పరమాత్మ సంబంధమైన
అర్థమునిచ్చు గుర్తును దేవుడు ముద్రించాడు. ప్రపంచములో ఏ అర్థమూనివ్వని ఆ ముద్రలు, దైవజ్ఞానములో ఎంతో
అర్థమునిచ్చునవై ఉండినప్పటికీ వాటిని గురించి ఎవరూ యోచించనూ లేదు. అవి ఎవరికీ తెలియబడనూలేదు.
ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని ఆ ముద్రలు ప్రతి శరీరము మీద కుడి ఎడమ ప్రక్కల ఒక్కొక్క భాగమున
ఒక్కొక్కటి అందరికి కనిపించునట్లు ఉన్నవి. ఆ గుర్తులు అమెరికాలో తెల్లగ పుట్టిన వానికిగానీ, ఆఫ్రికాలో నల్లగ పుట్టిన
వానికిగానీ ఎక్కడ పుట్టినా అందరి శరీరముల మీద ముద్రించినట్లు ఉన్నవి. బాగా కాగపెట్టిన ఇనుప ముక్కతో కాల్చితే
చర్మము ఎలా మాడిపోయి సాధారణ చర్మముకంటే వేరుగా తయారైపోవునో అలాగే చర్మము మీద కాలినట్లుండుట
వలన దానిని దేవుడు ముద్రించిన ముద్ర అంటున్నాము. ఈ ముద్ర విషయము ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, కావున
మేము మీకు చెప్పి, అప్పుడు ప్రవక్తలు వదలివేసిన వాటిలో ఒకదానిని ఈ గ్రంథములో పూరించుచున్నాము. దేవుని
సమస్త జ్ఞానములలో ఇది సరిక్రొత్త జ్ఞానముగా గుర్తించవలెను. ప్రకృతి ప్రకృతిగానే ఉంటూ చరాచర అను రెండు
భాగములుగా చీలిపోయినదని చెప్పుకొన్నాము కదా! ప్రకృతి రెండు భాగములుగా ఉండుట వలన ప్రకృతితో తయారైన
శరీరము ప్రత్యక్షముగా కుడి ఎడమ అను రెండు భాగములుగా తయారైనది. కుడి ఎడమ భాగములుగా శరీరము
తయారై, ప్రకృతి రెండు భాగములుగా ఉన్నదని తెలియునట్లు చేసినది. ప్రకృతి రెండు భాగములుగా ఉండుట వలన
ప్రకృతి వలన తయారైన గుణములు కూడా మంచి చెడు గుణములు అను రెండు భాగములుగా తయారైనవి. గుణములు
రెండు భాగములు కాగా వాటి వలన వచ్చు కర్మలు పాప, పుణ్య అను రెండు రక కర్మలుగా తయారైనవి. కర్మలు
రెండు రకములు కాగా, వాటిని బట్టి మనిషి (జీవాత్మ) అనుభవములు కూడా సుఖ దుఃఖ అను రెండు భాగములుగా
చీలిపోయినవి. ఈ విధముగా స్థూలశరీరము, కుడి ఎడమ అను రెండు భాగములు కనిపించునట్లున్నది. ఈ విధముగా
కుడి ఎడమగా కనిపించు శరీరము మీద విశాలముగా ఖాళీగానున్న వక్షస్థలము మీద దేవుడు కాల్చిపెట్టిన ముద్రలవలె
రెండు ముద్రలను ఉంచాడు. వాటినే ఎదమీద ముద్ర అంటున్నాము.
ఈ ఎదమీద ముద్ర దేవుడు పెట్టినది. కావున అందరి శరీరముల మీద ఉన్నది. నేడు నేను ఫలానా మతము
వాడిననీ, ఫలానా దేశము వాడిననీ, ఫలానా కులము వాడిననీ చెప్పుకొను వారందరికీ ఒకే రకముగా ముద్ర అందరి
శరీరముల మీద ఉన్నది. ఎదమీద ముద్ర ఆకారమును తర్వాత పేజీ పటములో చూడవచ్చును. చర్మము కాలినచోట
వెంట్రుకలు మొలచనట్లు
ఎదమీద ముద్ర
37

Page 38
ఎదమీద ఉన్న ముద్రలో చర్మము కాలినట్లుండి, ఆ చర్మము మీద వెంట్రుకలు కూడా మొలచకుండా ఉండును. అలాంటి
గుండ్రని చర్మము ప్రత్యేకముగా కనిపిస్తూ చర్మమునకు వేరుగా కనిపించుచుండును. అట్లు వేరుగా కనిపించు గుండ్రని
చర్మము మీద మధ్య భాగములో కందిగింజ పరిమాణముతో ఎత్తుగా ఒక గుర్తు కనిపించుచుండును. ఎదురుగా
చూచేవారికి పాణి మట్టములో శివలింగమును పైనుండి చూచినట్లు కనిపించును. కాలినట్లు గుండ్రముగా అర్థ
అంగుళమునకు పైగానున్న ఆకారము ప్రకృతికి గుర్తుకాగా, ఆ ఆకారములో మధ్యన ఎత్తుగా కందిగింజంత వున్న
ఆకారము పరమాత్మ గుర్తుగా ఉన్నది. ప్రకృతి, పరమాత్మ గుర్తుండునట్లు, ప్రకృతి పరమాత్మల వలననే నీవు పుట్టావు,
నీ శరీరము పుట్టినదని తెలియునట్లు, ఈ గుర్తులో నున్న రెండు చిహ్నములు నీకు తల్లి తండ్రి గుర్తులుగా లెక్కించబడుచున్నవి.
ప్రతి మనిషి తల్లి అయిన ప్రకృతి వలన, తండ్రి అయిన పరమాత్మ వలననే పుట్టాడను అర్థమును ఎదమీద ముద్రలు
గుర్తు చేయుచున్నవి. ప్రకృతి భాగముగా గుర్తించుచున్న అర అంగుళము వెడల్పు వృత్తాకారము మధ్యలో ఎత్తుగా ఒక
ఆకారము ఉండుట వలన ప్రకృతికి ఇరుసులాగ, అధ్యక్షునిగా పరమాత్మ ఉన్నాడని తెలియుచున్నది. ఈ విధముగా
ఎదమీద దేవుడుంచిన ముద్ర ఎంతో ఆధ్యాత్మిక అర్థము నిచ్చునదై ఉండినా,
దానిని గురించి ఏ ఆధ్యాత్మికవేత్తా
పట్టించుకోలేదు. ఇప్పుడిది మనము చెప్పుకోవడము వలన దేవునికి ఉన్న సమస్త జ్ఞానములలో ఒక జ్ఞానమును
మనము తెలుసు కొన్నట్లయినది. ఈ ముద్రను గురించి ప్రతి ముస్లీమ్, ప్రతి క్రైస్తవుడూ, ప్రతి హిందువూ (ఇందువూ)
యోచించమని తెలియజేయుచున్నాము.
దేవుడు ప్రపంచమునూ, దానిలోని జీవరాసులనూ సృష్టించి జీవరాసులు బ్రతుకుటకు విధి విధానమును
కూడా కల్పించాడు. సృష్ఠి ప్రారంభములోనే జీవులను, వాటికి కర్మను సృష్టించిన దేవుడు, ఆ కర్మనుండి బయటపడి
దేవున్ని చేరుకొనే మార్గమును కూడా తెలియజేశాడు. తనను (దేవున్ని) చేరుకొనే మార్గమునే జ్ఞానమార్గము అంటున్నాము.
దేవునికి సంబంధించిన ధర్మములను తెలుసుకోవడమే జ్ఞానమగును. మనిషిని తయారు చేసి, అతను ప్రపంచములో
ఏమి చేయాలనుటకు తగిన కర్మను నిర్మించినపుడు దానికి అనుబంధముగానున్నవన్నీ తయారైనవి. కర్మ రెండు
రకములుకాగా, దానితో గుణములు కూడా రెండు రకములు ఏర్పడినవి. గుణములు రెండు భాగములుకాగా వాటికి
సంబంధించిన ఆచరణలు రెండు రకములుగా ఏర్పడినవి. అట్లే అనుభవములు కూడా రెండు రకములు ఏర్పడినవి.
వీటిలో గుణములు ఏవైతే మనిషి శరీరములో ఉన్నవో అవి ప్రకృతి జనితములు. శరీరము ప్రకృతి వలన పుట్టినట్లే
గుణములు కూడా ప్రకృతి వలన పుట్టినవే. ప్రకృతి వలన పుట్టిన శరీరములో ముఖ్యపాత్రను గుణములే పోషించుచున్నవి.
గుణములు కార్యాచరణకు సూత్రములైనా గుణములన్నియు కలిసి మాయ అను ఒక ప్రత్యేకశక్తిగా శరీరములో తయారు
చేయబడినది. దేవునిచేత తయారు చేయబడిన మాయ అను శక్తికి దేవుడు ప్రత్యేకమైన బాధ్యతను అప్పచెప్పాడు. ఆ
బాధ్యత ఏమనగా! దేవుడు మనిషిని కర్మనుండి బయటపడుటకు తన ధర్మములను జ్ఞానరూపముగా చెప్పాడు కదా!
మనిషిని తన ధర్మములవైపు రాకుండ చేయడమే మాయకు అప్పచెప్పిన పని. తనకు నచ్చిన వానిని మాత్రము
ఆటంకపరచకుండా వదలివేసి, తనకు నచ్చని వానిని తనవైపు రాకుండ చేయవలెనని మాయను దేవుడు ఆజ్ఞాపించాడు.
ఈ విషయము ఎవరికీ తెలియదు. దేవుడు మాయకు అప్పచెప్పిన బాధ్యత అత్యంత గోప్యమైనది. అందువలన అది
రహస్యముగానే ఎవరికీ తెలియకుండా ఉండిపోయినది. అన్ని మతములలోను మాయ వేరు వేరు పేర్లతో పిలువబడుచున్నది.
హిందూ (ఇందూ) మతములో మాయ అని పిలువబడగా, ఇస్లామ్లో సైతాన్ అనియు, క్రైస్తవములో సాతాన్ అను
పేరుతో పిలువబడుచున్నది. మాయ అనునది దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖమైనదనీ, దైవమార్గములో ఆటంకములను
కలుగజేయుననీ అందరికి తెలుసు.
38

Page 39
మాయ అనునది దైవమునకు వ్యతిరేఖమైనదనీ, అది ఎంతో బలమైనదనీ, దాని ముందర ఎంతటి వాడైనా
జ్ఞానమార్గమును వదలి అజ్ఞాన మార్గమున పోవలసిందేననీ, దానిని జయించుట దుస్సాధ్యమనీ కొందరు చెప్పుచుందురు.
భగవద్గీతలో కూడా "మమ మాయా దురత్యయా” నా మాయను జయించుట దుస్సాధ్యమని చెప్పబడినది. మాయను
జయించుట సాధ్యముకాదని కొందరనుచుండినా, మాయకు అంతబలమెట్లు వచ్చిందని ఎవరూ ఆలోచించలేదు.
భగవద్గీతలో దేవుడే స్వయముగా మమ మాయా అని అన్నాడు. మమ మాయా అనగా నా మాయ అని అర్థము.
ఆయన (దేవుని) మాయ ఆయన మార్గమునకే ఆటంకమును కలుగజేయుచున్నది కదా! దేవుని జ్ఞానమువైపు పోవాలనుకొన్న
వారిని అనేక ఇబ్బందుల పాలు చేసి చివరకు ఆ మార్గమును వదలి అజ్ఞాన మార్గములో పోవునట్లు చేయుచున్నది కదా!
అలాంటపుడు అది దేవునికి ప్రతి పక్షముగా ఉన్నట్లే కదా! అటువంటి దానిన దేవుడు నా మాయ అనడమేమిటి? అని
ఎవరైనా అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! దేవుడే మాయను తయారు చేసి, మాయకు ఒక పనిని అప్పజెప్పాడు.
అప్పటినుండి ఇప్పటివరకు మాయ దేవుడు చెప్పిన పనిని శ్రద్ధగా, భక్తిగా చేయుచున్నది. కొన్ని సమయములలో మాత్రము
దేవుని మీద భక్తి ఉన్నట్లు నటించి తర్వాత ప్రపంచ విషయముల మీదే శ్రద్ధగలవారు దేవునికి ఇష్టులు కారు. దేవునికి
ఇష్టులు కానివారిని గ్రహించి మాయ వారిని అదే పనిగా దేవునికి దూరమవునట్లు చేయుచున్నది. ఎవరైతే దేవునికి
నచ్చునట్లు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తారో, ఎవరైతే అన్యదేవతల మీద ధ్యాసలేకుండా అందరికంటే గొప్పవాడు దేవుడని
తెలిసి ప్రవర్తిస్తారో, అటువంటి వారికి మాయ ఎటువంటి ఆటంకమూ కలుగజేయదు. కొద్దిసేపు దేవుడు గొప్పవాడనీ,
దైవజ్ఞానము గొప్పదనీ పొగడి తర్వాత ఎవరికీ తెలియకుండా ఇతర దేవతలను కూడ ఆరాధించు వారిని మాయ
దేవునికి ఏదో ఒక విధముగా దూరముచేయును.
మనిషి పైకి ఎట్లు కనిపించినా, నిజమైన దైవజ్ఞానిగా నటించినా, అంతరంగమందు వానిలో ఏమున్నదో గ్రహించు
మాయ, దేవుని మీద శ్రద్ధలేని వానిని ఏరివేసినట్లు, దేవుని జ్ఞానమునకు వానిని దూరముగా పోవునట్లు చేయుచున్నది.
ఇదే విషయమునే వేమనయోగి కూడా తన పద్యములో ఇలా అన్నాడు.
పతియెప్పిన సతి యొప్పును
పతి సతులొకటైన పరమ పావనమందున్
పతి సతి న్యాయమే మోక్షం
బతులిత పరమాత్మ నైక్యమగురా వేమా.
భావము :- పతి అనగ భర్త, సతి అనగ భార్య అని అందరికీ తెలుసు. పెళ్ళి అయితేనే పతి సతులౌతారను విషయము
కూడా తెలుసు. పతి, సతులకు పిల్లలు పుడుతారని కూడా తెలుసు. ఈ విధానమంతా జ్ఞానులకు, అజ్ఞానులకు
అందరికీ తెలిసినప్పటికీ చాలామందికి ఈ విషయము దైవిక మైనదని, ఆ దైవిక విషయమే ప్రపంచములో ఇలా
ప్రతిబింబించి ఉన్నదనీ, ప్రపంచములో ప్రత్యక్షముగనున్న పతి, సతుల విధానమును ఆధారము చేసుకొని పరోక్షముగనున్న
దైవ విధానమును అర్థము చేసుకోగలరని దేవుడే ఇలా ఉంచాడు. దైవికమైన పతి, సతి విధానమేదో ఇప్పుడు వివరించి
చూచుకొందాము.
భగవద్గీత గుణత్రయ విభాగయోగమను అధ్యాయములో మొదటనే పరమాత్మను పతిగ, ప్రకృతిని సతిగ చెప్పారు.
శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారము జగతి మొత్తమునకు ప్రకృతి, పురుషులు సతి పతులుగ ఉంటూ ప్రతి జీవరాసికి
39

Page 40
వారే తల్లితండ్రులైనారు. ప్రపంచములోని మనుష జాతికే కాక క్రిమి, కీటక, పశు, పక్షి, వృక్షలతాదులకన్నిటికీ తల్లి
ప్రకృతి, తండ్రి పరమాత్మ అని తెలుపబడి ఉన్నది. జగతి మొత్తమునకు తల్లి తండ్రులుగ ఉంటూ, పతి సతులుగ
యొప్పు పరమాత్మ ప్రకృతి ప్రపంచములో విభిన్నముగ ప్రవర్తించుచున్నారు. పతియైన పరమాత్మకు సతియైన ప్రకృతి
విధేయురాలై నప్పటికి, పరమాత్మ ఆదేశానుసారము జగతిపట్ల పరమాత్మ మార్గమైన దైవమార్గమునకు ప్రకృతియైన
మాయ ఎంతో వ్యతిరేఖముగనున్నది. దైవమార్గమును అనుసరించవలెననుకొను వానిని ఆ ప్రయత్నమును భంగముచేసి
విరమించుకొనునట్లు చేయుచున్నది. అంతయు దేవునికి తెలిసే జరుగుచున్నది. దేవుని గూర్చిన ప్రయత్నములో మాయ
ప్రభావమునకు తట్టుకొనలేక అందరూ వెనుదిరుగుచున్నారు. అయినప్పటికి ఎన్నో లక్షల మందిలో ఏ ఒక్కడో మాయను
వ్యతిరేకించి అన్ని కష్టములకు ఓర్చుకొని దేవుని చేరుకోవాలని ప్రయత్నించుచున్నారు. అటువంటి వానిని దేవుడు, వాని
మార్గమును సుగమము చేసి మాయ ఆటంకమును తొలగించి, తనయందు కలుపుకొనును. బలమైన మాయ కల్పించు
పరిస్థితులన్నిటినీ అనుభవిస్తూ, పట్టువదలక దేవునికొరకు ప్రయత్నించు వానిని దేవుడు ఒప్పుకొనును. దేవుడు
ఒప్పుకొన్నపుడు మాయ వానిని ఆటంకపరచదు అటువంటి వాని యోగము యొక్క క్షేమమును దేవుడే పరిక్షించును.
అపుడు వాడు దేవునియందైక్యమై పోవును.
ప్రపంచములో మాయ కలుగజేయు అనేక కష్టములను అతిక్రమించి దేవుని మార్గమును వదలని వానిని,
దేవుడు తన మనిషిగ అంగీకరించును. అపుడు వెంటనే ప్రకృతియైన మాయ తాను కూడ వానిని ఒప్పుకొన్నదై వానికి
ఆటంకము కలుగజేయదు. కావున పై పద్యమందు పతియెప్పిన సతి యొప్పునన్నారు. ఆ విధముగ పరమాత్మ,
ప్రకృతి ఇద్దరూ వానిపట్ల ఒకటై నడుచుకొన్నపుడు వాడు మోక్షము పొందును. దానినే పద్యమందు వ్యక్తపరుస్తూ
పతిసతులొకటైన పరమ పావనమందున్ అన్నారు. పతి, సతి ఇద్దరూ ఒక మార్గమును నడుచుకోవడము న్యాయమగును.
పతికి సతి విరుద్ధముగ నడుచుకోవడము అన్యాయమగును. ప్రకృతి, పరమాత్మ భక్తుని పట్ల న్యాయమార్గమును
చరించిన మోక్షము లభించును. కావున పై పద్యమందు పతి సతి న్యాయమే మోక్షము అన్నారు. పతి, సతి న్యాయముగ
చరించినపుడు భక్తుడు వెంటనే జన్మరాహిత్యము పొందును. కనుక బతులిత పరమాత్మ నైక్యమగురా అన్నారు.
ప్రపంచములో ఒక భక్తునిపట్ల భార్యాభర్తలైన ప్రకృతి, పరమాత్మలు మొదట అన్యాయముగ ప్రవర్తించుదురని
ఈ పద్యము ద్వార వేమన మనకు తెలియజేశాడు. పతి ఒప్పినపుడే సతియు ఒప్పుకొని ఇద్దరూ న్యాయముగ ప్రవర్తించుదురు.
వారిద్దరు ఒకటై న్యాయముగ ప్రవర్తించినపుడే భక్తునికి మోక్షము లభించును. మాయ ఆటంకములను ఓర్చుకోలేక
నేనెంత భక్తిగ ఉన్నా, నాకే కష్టాలొస్తున్నవనీ, దేవునివద్ద న్యాయమే లేదనుకొన్నవాడు దేవుని మార్గములో భ్రష్టుడగును.
దేవుని గూర్చి ఏమీ అనుకోక అన్నిటికి ఓర్చు కొన్నవాడు, మొదట పరమాత్మ చేత ఒప్పుదల పొంది ప్రకృతి, పరమాత్మలు
న్యాయముగ ప్రవర్తించగ వాడు మోక్షము పొందును.
పతి సతుల విధానము ప్రపంచములో ప్రతిబింబించి ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. పతికి సతి వ్యతిరిక్తముగ
నడుచుకొనుట, పతిని తన మాటవినునట్లు చేసుకొనుటైన అన్యాయ విధానము భూమిమీద కలదు. అట్లే పతికి, సతి
అనుకూలముగ నడుచుకొనుట, పతి మాటయే తన మాటగ పతి చెప్పినట్లు సతి నడుచుకొను న్యాయమార్గమూ భూమిమీద
గలదు. మీ అనుభవములో న్యాయ అన్యాయ, పతిసతులను గూర్చి తెలిసినట్లయితే ఎవరైన సంపూర్ణ జ్ఞానులు కాగలరు.
దేవుని మార్గములో నడుచు వారికి ఆటంకములేర్పడిన, దేవుని దగ్గర న్యాయముందా? అని సహనము కోల్పోయి
మాట్లాడరు. ఎన్ని కష్టములొచ్చిన ఇది తల్లియైన మాయ పని అని ఎరుకగల్గి నడుచుకొందురు.
40

Page 41
పైన వేమనయోగి చెప్పినట్లు, భగవద్గీతయందు విజ్ఞానయోగమను అధ్యాయములో 14వ శ్లోకమున ఇలా
ఉన్నది.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మా మేవ యే ప్రపద్యన్తో మాయా మేతాం తరన్తితే ॥
భావము :- దేవుడైన నేను సృష్టించిన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవడైతే నన్నే ఆరాధిస్తాడో
అట్టివాడు నా మాయను సులభముగా దాటిపోగలడు.
చూచారా! భగవద్గీతలో దేవుని వాక్యము! దేవుడే తన మాయను దుస్సాధ్యమైనదనీ, దానిని దాటి ఎవరూ
పోలేరని చెప్పాడు. అలాంటపుడు మాయ ఎంత బలమైనదో చెప్పనవసరములేదు. నేను జ్ఞానిని, యోగిని, స్వామిని,
విశ్వాసిని అని ఎవరైనా అనుకొన్నంత మాత్రమున అతనిని మాయ పరీక్షించనిదే వదలిపెట్టదు. మాయ శోధనలో
అతడు దేవునికి ఇష్టమైన వాడైతే వానిని దేవుని మార్గములో ఆటంకపరచదు. ఒకవేళ పైకి జ్ఞానిగా కనిపించినా,
లోపల దేవున్ని పూర్తిగా విశ్వసించని వానిని మాత్రము మాయ వదలిపెట్టక, ఆ మార్గములో అందరికీ తెలియునట్లు
భ్రష్టున్ని చేయును. ఇదే విషయమునే “మూడు కాల్వలు దాటలేరన్నా" అని పోతులూరి వీరబ్రహ్మముగారు కూడా
చెప్పడము జరిగినది. మూడు కాల్వలు అనగా మూడు గుణములని అర్థము. సాత్విక, రాజస, తామస గుణ భాగములను
మూడు కాల్వలన్నారు. మూడు గుణములనే కలిపి మాయ అనుట జరుగు చున్నది. దీనినిబట్టి మన శరీరములో
మాయ తలలోనే తిష్టవేసుకొని ఉన్నదనీ, దానికి తెలియనిది ఏదీ జరగదనీ, ఏది జరిగినా గుణముల వలననే జరుగుట
వలన మాయను అతిక్రమించి ఎవడూ పోలేడని చెప్ప వచ్చును. అంత బలమైన మాయను ఎవడు జయించగలడు
అంటే, ఎవడైతే దేవున్ని ఆరాధించి ఆయనకు ఇష్టము గలవాడైతాడో, వాడే గుణ సమ్మేళనమైన మాయను జయించి
దాటిపోగలడు. ఇదే విషయమునే గీతలో “యే మామేవ ప్రపద్యన్తో" ఎవడైతే నన్నే ఆరాధిస్తాడో "మాయా మేతాం
తరన్తితే” వాడు మాయను దాటిపోగలడు అని భగవంతుడు అన్నాడు.
దేవున్ని ఆరాధించడము అంటే ఆయన గొప్పతనమంతా తెలిసి వుండాలి. ఆయన గొప్పతనమంతా తెలియాలి
అంటే ఆయన ధర్మములన్నీ శాస్త్రబద్దముగా తెలిసివుండాలి. ఆయన ధర్మములన్నీ తెలియాలి అంటే ఆయన యొక్క
సమస్త సమాచారము (సమస్తజ్ఞానము) తెలిసివుండాలి. అయన యొక్క సమస్త జ్ఞానము తెలియాలంటే దేవుని చేత
చెప్పబడిన మూల గ్రంథములలోని జ్ఞానమంతా తెలియాలి. అలా తెలిసినప్పుడే దేవుని విషయములో ఏ ప్రశ్నవచ్చినా
దానికి మనిషివద్ద సమాధానముండగలదు. దేవుని విషయమునకు సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానమున్నపుడు
అతను దేవుని యెడల పూర్తి శాస్త్రబద్ధమైన విశ్వాసికాగలడు. అట్లు కాకపోతే ఏ ఒక్క ప్రశ్నకైనా సరియైన, శాస్త్రబద్ధమైన
జవాబు లేకపోతే, ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోవును. జవాబులేని ఆ ప్రశ్నవల్లే దేవుని మార్గములో సంశయము
వచ్చుటకు అవకాశము ఏర్పడును. దేవుని మార్గములో ఒక్క ప్రశ్న మిగిలినా దానితో మాయ శోధించి, అనుమానము
రేకెత్తించి, ఆ అనుమానమును పెద్ద ఆటంకముగా మార్చి, దేవుని మార్గమునుండి తప్పించును. మనిషి అందరికంటే
నేనే సరియైన మార్గములో ఉన్నానని అనుకొనుచుండినా, నా మతమే సరియైనదని అనుకొనుచుండినా, మా మతములోని
దేవుడే నిజమైన దేవుడనుకొనుచుండినా ఫరవాలేదు. కానీ దేవునికి సంబంధించిన సమస్త జ్ఞానము తనకు తెలిసిందో
లేదో చూచుకోవలెను. దేవునికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా తనవద్ద శాస్త్రబద్ధమైన సమాధానము ఉందో లేదో
చూచుకోవలెను. దేవునికి సంబంధించిన సమస్త జ్ఞానమూ తెలిసినపుడు, అన్ని ప్రశ్నలకూ శాస్త్రబద్ధమైన జవాబు
41

Page 42
ఉండును. అట్లు సమస్త జ్ఞానమును తెలిసిన వానిని మాయ ఏమీ చేయలేదు. ఎందుకనగా మాయ పతియైన దేవుడు
వానిని ఒప్పియుండును.
ఇప్పుడు ఎవరైనా నన్ను “మీ దృష్టిలో సమస్త జ్ఞానము అంటే ఏది” అని అడుగవచ్చును. దానికి మా జవాబు
ఏమనగా! మాకు తెలిసినంతవరకు ఇప్పటికి పరమ భగవద్గీత, పవిత్ర ఖురాన్, పరిశుద్ధ బైబిలు గ్రంథములలో
చెప్పబడినదేకాక, ఇంకొకమారు చెప్పునదంతయు సమస్త జ్ఞానమని చెప్పవచ్చును. అట్లని ఒక భగవద్గీతను చదివి
నాకు సమస్త జ్ఞానము తెలిసినదని అంటే సరిపోదు. అట్లే బైబిలును చదివి సమస్త జ్ఞానము తెలిసిందంటే కూడా
సరిపోదు. మూల గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖురాన్ మూడింటిని చదివిన తర్వాత ఇంకా ఏదైనా మిగిలి ఉంటే
దానితో సహా సమస్త జ్ఞానమగును. ఒకవేళ మూడు గ్రంథములలో ఇంకా మిగలకుండా అంతా చెప్పబడివుంటే అదియే
సమస్త జ్ఞానమగును. అయితే ఏ మతము వారు ఆ మత గ్రంథమును గొప్పగా చెప్పుకొందురు. దానిలో సమస్త
జ్ఞానముకలదని చెప్పుచుందురు. ఆ మాట నిజమా? అబద్దమా? అని చెప్పుటకు ఒక అవకాశము గలదు. బైబిలు
గ్రంథములో యోహాను సువార్తనందు 16 ఆధ్యాయము 12,13,14 వచనములో “నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ
అనేక సంగతులు కలవు. కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపియైన ఆత్మ
వచ్చినపుడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధించక, వేటిని వినునో
వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను (జ్ఞానమును) మీకు తెలియ జేయును. ఆయన నా వాటిలోనివి
తీసుకొని మీకు తెలియజేయును." ఈ మాటను బట్టి మూల గ్రంథములలో ప్రవక్తలు చెప్పిన జ్ఞానమే కాక ఇంకనూ
జ్ఞానము మిగిలివున్నదని చెప్పవచ్చును. ఇంతేకాక అదే బైబిలు, అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 26వ
వాక్యములో “ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో
చెప్పిన సంగతులన్నిటిని (జ్ఞానములన్నిటిని) మీకు జ్ఞాపకము చేయును.” అని వున్నది. దానినిబట్టి చూస్తే ఆదరణకర్తగా
వచ్చు వ్యక్తి ప్రవక్తలు చెప్పని సమస్త జ్ఞానమును బోధించడమేకాక, చెప్పిన వాటిని కూడా విశదీకరించి అర్థమగునట్లు
చేయునని తెలియుచున్నది.
మరికొందరు కృష్ణుడు, ఏసు ప్రవక్తలు చెప్పిపోయిన తర్వాత వచ్చిన ప్రవక్త అయిన హజ్రత్ మహమ్మద్
ప్రవక్తగారు ఖురాన్లో సమస్త జ్ఞానము చెప్పియుండవచ్చును కదా అని వారి ఉద్దేశమును వ్యక్తపరచవచ్చును. ఇది
సమంజసమైన మాటే! ఆఖరి ప్రవక్త అని చెప్పబడిన మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు అనుటకు వచ్చువాడు ఆదరణకర్త
అని చెప్పబడినది. ఆదరణకర్తవేరు, ప్రవక్తవేరు. ప్రవక్త సమస్త ప్రపంచమునకు తెలియబడు వాడు. కానీ ఆదరణకర్త
బ్రతికియుండగా ఎవరికీ తెలియబడడు. ఈ విషయమై బైబిలు గ్రంథములో యోహాను సువార్తయందు 14వ అధ్యాయము,
17వ వాక్యము "లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను
ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును" అని ఉన్నది. దీనినిబట్టి ఆదరణకర్తగా వచ్చువాడు
ప్రవక్త కాదని తెలిసిపోయినది. ఆదరణకర్తగా వచ్చిన వాడు ప్రపంచములోని ప్రజలకు తెలియడని తెలిసిపోయినది.
ప్రవక్త గుర్తింపు పొందినవాడు, ఆదరణకర్త గుర్తింపులేనివాడు. అయితే ప్రభువు వున్న కాలములో ప్రభువు ఎవరితో
అయితే ఈ మాటలు ఆ రోజు చెప్పాడో, వారు మాత్రము ఆదరణకర్తను గుర్తించుదురు. వారి మధ్యనే ఆయన
జీవించును. ప్రభువు తన పదకొండు మంది శిష్యులకు ఈ మాటను చెప్పాడు. కావున ఆదరణకర్తగా వచ్చువాడు
పది, పదకొండుమందికి తప్ప ఎవరికీ తెలియడని అర్థమగుచున్నది. అందువలన ఆదరణకర్త ప్రవక్త కాదని చెప్పవచ్చును.
42

Page 43
లోకము చేత గుర్తింపబడని, ప్రవక్తకానటువంటి వ్యక్తి చేత ప్రవక్తలు వదలి వేసిన జ్ఞానము కూడా చెప్పబడును
మరియు ప్రవక్తలు చెప్పిన జ్ఞానము కూడా ఆయన విశదీకరించి చెప్పునని తెలియుచున్నది.
మాయను జయించి దేవున్ని చేరుకోవాలంటే, ముందు మూల గ్రంథములైన మూడు మత గ్రంథములను
చదవాలి. మూడు మత గ్రంథములలో కొద్ది తేడాలో ఒకే జ్ఞానము, ఒకే దేవున్ని గురించి చెప్పబడి ఉండినప్పటికీ,
గ్రంథములలోని జ్ఞానమే చాలామందికి అర్థముకాక మా జ్ఞానమువేరు, మా దేవుడు వేరు అను స్థితిలో ఉన్నారు.
ముగ్గురు ప్రవక్తలు చెప్పిన జ్ఞానమే అర్థముకానప్పుడు, వారు మాయను ఎట్లు జయించగలరు? ఒక గ్రంథమును
మాత్రము చూచి మిగత రెండు గ్రంథములను చూడని వారు తన జ్ఞానమే గొప్పదనుకొనుచుందురు. తన ప్రవక్త
చెప్పినదితప్ప మిగత ప్రవక్తలు చెప్పిన దానిని గుర్తించనివాడు, ప్రవక్త కూడా కాని ఆదరణకర్త చెప్పు జ్ఞానమును
గుర్తించునా? తన మతములోని జ్ఞానమే గొప్పదనుకొని, మిగత మతములో ఏమి చెప్పారో చూడనివాడు తనకు
తెలిసిన జ్ఞానమే గొప్పదని, గోడను కట్టుకొని దానిని దాటి రాకుండును. అటువంటపుడు ఇంకనూ తెలియవలసిన
జ్ఞానమును ఎలా తెలియును? ఏసు చెప్పినట్లు ఆదరణకర్త వచ్చి సమస్త జ్ఞానము తెలియజేయును అన్నపుడు, ఆ
విషయమే ఇటు హిందువులకు, అటు ముస్లీమ్లకు తెలియనపుడు, ఇక మేము తెలుసుకోవలసిన జ్ఞానమే లేదనుకొని
హద్దు ఏర్పరచుకొందురు. అటువంటపుడు తమ మతములో అర్థము కాని లేక అపార్థమైన (వేరు అర్థము చేసుకొన్న)
వాటిని ఆదరణకర్త చెప్పినా తెలుసుకోలేరు. తమ గ్రంథములో చెప్పిన జ్ఞానమునకే సరిగా వివరము తెలియజేసినపుడు
తెలియనివాడు, ఇంకనూ తెలియవలసిన జ్ఞానమును గురించి తెలుసు కొనుటకు ప్రయత్నము చేయడు. అటువంటి
వానికి స్వర్గమునకు పరలోకము నకు కూడా తేడా తెలియదు. నేడు గురువులుగా బోధకులుగా చలామణి అగువారు,
తమ జ్ఞానమును తప్ప ఇతర ప్రవక్తలు చెప్పిన జ్ఞానమును ఒప్పుకోవడములేదు. ఇతర మతమును ద్వేషించు వారు ఆ
మతములోని జ్ఞానమే తెలియనపుడు, ఆదరణకర్త తెలియజేయు జ్ఞానమును ఏమాత్రము లెక్కించరు. ఆదరణకర్త సమస్త
జ్ఞానమును తెలియజేయునప్పటికీ, ఆయనను కనీసము జ్ఞానిగా కూడా గుర్తించరు. అటువంటపుడు ఏ మతస్థుడుగానీ
సమస్త జ్ఞానమును తెలియుటకు వీలులేదు. అటువంటివాడు సంపూర్ణ జ్ఞానికాలేడు. అతడు మాయను దాటి దేవునివద్దకు
పోలేడు. మాయ మతముమీద ఇష్టమును కల్గించి, మతములలోనే పుట్టునట్లు చేయుచుండును. జ్ఞాన పథములో
పయనించనీయదు.
ప్రస్తుత కాలములో మాయ మనుషుల మీద మరియొక అస్త్రమును ప్రయోగించి సమస్త జ్ఞానమును తెలియుటకు
వీలు లేకుండా చేసింది. క్రైస్తవము, ఇస్లామ్కంటే ఎన్నో వేల, లక్షల సంవత్సరములనుండి ఉన్న హిందూమతములో
దేవుడు చెప్పిన జ్ఞానమును కప్పిపుచ్చుటకు, మనిషి తన ప్రభావమునుండి బయటపడకుండుటకు, ఇదే నిజమైన జ్ఞానమని
మనిషికి చూపిస్తూ, వేదములను మనిషి గొప్పగ పరిగణించునట్లు మాయ చేసినది. సృష్ట్యాదిలోనే దేవుడు సూర్యుని
ద్వారా భూమిమీదికి ప్రవేశపెట్టిన దైవజ్ఞానమును, మధ్యలో వచ్చిన వేదములు కప్పిపుచ్చినవి. వేదములు దేవుడు
చెప్పిన జ్ఞానముకంటే గొప్పవిగా మనుషులకు కనపడునట్లు మాయ చేసినది. దానితో వేదముల వలలో పడిన
హిందువులందరూ దైవ జ్ఞానమును మరచిపోయి, వేదములే గొప్ప జ్ఞానముగా లెక్కించుకొన్నారు. వేదముల వలన
మనిషి దేవునికి దూరమై పోయాడు. సృష్ట్యాదిలో దేవుడు తన జ్ఞానమును చెప్పితే, మాయ తన వేదములను నిజమైన
జ్ఞానముగా ప్రచారము చేసి, మనుషులను దానిలో చిక్కుకొన్నట్లు చేసినది. అప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా
వేరువేరు దేశములలో తన జ్ఞానమును చెప్పించాడు. అలా ప్రవక్తలు చెప్పిన జ్ఞానము హిందువులకు భగవద్గీతగా,
43

Page 44
క్రైస్తవులకు బైబిలుగా, ముస్లీమ్లకు ఖురాన్ ఉన్నది. అయితే భగవద్గీత కంటే ముందే వేదములుండుట వలన
హిందువులు వేదములకంటే భగవద్గీతను ముఖ్య జ్ఞానముగా లెక్కించక, వేదములనే గొప్ప జ్ఞానముగా పెట్టుకొన్నారు.
భగవద్గీతలో దేవుడు వేదముల వలన నేను తెలియబడనని విశ్వరూపసందర్శన యోగములో 48వ శ్లోకములోను, 53వ
శ్లోకములోను చెప్పినా, ఆయన మాటను హిందువులు వినడములేదు. భగవద్గీతలో "త్రైగుణ్యా విషయావేదా” అని
సాంఖ్యయోగములో 45వ శ్లోకములో చెప్పాడు. దాని అర్థము “మూడు గుణముల విషయములే వేదములు” అని
కలదు. అదే భగవద్గీతయందు విజ్ఞానయోగములో 14వ శ్లోకములో "గుణమయీ మమ మాయా” అన్నాడు. గుణములే
మాయ అని కూడా చెప్పాడు. దీనినిబట్టి వేదములే మాయ అని అర్థమైపోవుచున్నది. వేద రూపములోనున్న మాయను
గురించి గీతలో చెప్పినా, హిందువులు భగవద్గీతను లెక్కించక, మాయ అయిన వేదములే చెప్పుకొనుచూ, ఇదే నిజమైన
జ్ఞానమని అనుకొంటున్నారు. ఈ విధముగా గీతలో దేవుడు హెచ్చరించినా, బయటపడలేని హిందువులుండగా,
వేదముల రూపములోనున్న మాయ క్రొత్తగా ఇతర మతములకు కూడా వ్యాపించినది. క్రైస్తవులు తమ ప్రభువును
గురించి వేదములు కూడా గొప్పగా చెప్పాయని చెప్పుచున్నారు. ప్రభువు రక్తము వలన పాపము పరిహారమగునను
శ్లోకమును, మరికొన్ని శ్లోకములను చెప్పుచూ వారు కూడా తమ తలలో వేదములను చొప్పించుకొన్నారు.
అంతటిలో ఆగకుండా ప్రస్తుత కాలములో కొందరు ఇస్లామ్ బోధకులు కూడా వేదములను కంఠస్థము చేసుకొని,
వేదములలోని సంస్కృత శ్లోకములను చెప్పుచూ, తమ ఇస్లామ్కు సంబంధించిన సమాచారము ఎంతో వేదములలో
ఉన్నదని చెప్పుచున్నారు. ప్రత్యేకించి ఋగ్వేదమును ఎక్కువగా చెప్పుచున్నారు. ఇదంతా చూస్తే వేదములు ఒక్క
హిందువులనేకాక మిగత క్రైస్తవ, ఇస్లామ్ మతముల వారిని కూడా ఆకర్షించినవని తెలియుచున్నది. మూడు గుణముల
విషయములే వేదములనీ, గుణములే నా మాయ అనీ దేవుడే గీతలో చెప్పడము వలన వేదములే మాయయని తెలిసి
పోయింది. ఇప్పుడు మూడు మతముల వారు కనిపించు వేదములను ఆశ్రయిస్తూ, కనిపించని మాయలో చిక్కుకొన్నారు.
మాయలో చిక్కుకొన్న వారిని దేవునికి ఇష్టములేనివారిగా మాయ గుర్తించి, దేవుని మార్గము నుండి దూరము చేయగలదు.
మాయ తన జ్ఞానమే గొప్పదని చూపిస్తూ, అందులో కూడా దేవుని విషయములున్నట్లు అక్కడక్కడ దేవుని గురించే
చెప్పినట్లు కనిపిస్తూ, దేవునికి దూరము చేయును. అటువంటపుడు మనిషి దేవుని సమస్త జ్ఞానమును తెలియలేడు.
అందువలన మనిషి మాయనుండి బయటపడుటకు మూడు మతముల గ్రంథాలు చదవాలి. ముగ్గురు ప్రవక్తలు చెప్పిన
దానిని సరిగా అర్థము చేసుకోవాలి. తర్వాత తెలియని వ్యక్తి (ఆదరణకర్త) చెప్పు సమస్త జ్ఞానమునూ అసూయ
లేకుండా తెలియాలి. అప్పుడే మనిషికి జ్ఞానము అర్థముకాగలదు. సమాదిలోనికి చేరక దేవునిలోనికి చేరగలడు.
ఇట్లు
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
44
------------------------
Page 1
పునర్జన్మ రహస్యము
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
సేవా
ప్రబోద్య
సమితి
చక్రం
చక్రం
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞాన వేదిక (Regd.No. : 168/2004)
ప్రథమ ముద్రణ : సం॥ 2011
1

Page 2
పునర్జన్మ రహస్యము
తన జన్మ ఎలా జరిగిందో తెలియనివాడు, పునర్జన్మ విషయమును గూర్చి చెప్పాలంటే కష్టము. మొదటి జన్మ
వివరము తెలిసినపుడు తర్వాత పునర్జన్మ విషయమును తెలియవచ్చును. జీవుడు జన్మించు సమయములో ఏ అనుభూతిని
పొందుచున్నాడో తెలిసినవాడు, పునర్జన్మ అనుభవమును గూర్చి చెప్పగలడు. కానీ మనిషికి జన్మ వివరమే తెలియనపుడు,
అది వానికి రహస్యమగును. తెలియకుండా గోప్యముగా ఉండునది ఏదైనా రహస్యమే. ఏ మనిషి అయినా తాను
జన్మించునపుడు తనకు జ్ఞప్తి ఉన్నదా అని ఆలోచించుకుంటే తనకే తెలిసిపోతుంది. జన్మించిన తర్వాత కొన్ని నెలల
కాలము గడిచిన తర్వాత అయినా జ్ఞాపకము ఉందా అని చూస్తే, అలా ఒక సంవత్సరము గడచిన తర్వాత కూడా
తనకు జ్ఞాపకము లేనట్లే అర్థమగుచున్నది. భూమిమీద మనిషిగా పుట్టిన ఎవరికిగానీ, ఒక సంవత్సరము లోపల
జ్ఞాపకము ఉన్నదని చెప్పుటకు వీలులేదు. ఒక సంవత్సరమే కాదు మరొక సంవత్సరమును కలిపి రెండు సంవత్సరముల
వరకు చూచినా జ్ఞాపకమున్న ఆధారములు కనిపించలేదు. చిన్న వయస్సులో నీ విషయములు నీకే జ్ఞాపకములేనపుడు,
పోయిన జన్మను గురించి చెప్పాలంటే సాధ్యమగునా అని ప్రశ్నించుకొని చూస్తే, సాధ్యము కాదనియే చెప్పవచ్చును.
ఈ మధ్యన ఒక టీ.వీ. ఛానల్లో ఉన్నతమైన చదువు చదివిన ఒక యం.డి. డాక్టరు ఎదుటి మనిషితో ఆ మనిషి యొక్క
గత జన్మ అనుభవములను చెప్పించడము చూచాను. దానిని చూచిన చాలామంది మేధావులు కూడా ఆ విషయములను
సులభముగా నమ్మడము చూచాను. అప్పుడు మాలో పునర్జన్మ రహస్యమును గురించి తొందరగా వ్రాయాలను
సంకల్పము కల్గినది. ముందునుండి వాస్తవముగా పునర్జన్మ రహస్యమును గురించి వ్రాయాలను సంకల్పముండినా,
పనిని చేయుటలో ఆలస్యము ఏర్పడినది. అయితే టీ.వి. ఛానల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పునర్జన్మ జ్ఞాపకాలను
చెప్పించడము చూచిన తర్వాత మా సంకల్పము కార్య రూపమగుటకు ప్రారంభించినదని చెప్పవచ్చును.
మనిషి ఒకమారు మరణిస్తే, మరొకమారు జన్మించుటకు అవకాశము కలదు. అందువలన మొదట మరణమూ,
తర్వాత మళ్ళీ జననము ఉండును. మొదట మరణమును పొందిన తర్వాత తిరిగి పుట్టడము జరుగుచుండును. ఈ
విధానము ఒక్క ఇందూమతములో తప్ప ఇస్లామ్లో గానీ, క్రైస్తవములోగానీ ఒప్పుకోబడడములేదు. ప్రధానమైన
క్రైస్తవ, ఇస్లామ్ మతములలో మళ్ళీ పుట్టడము లేదనీ, ఒక్కమారు జన్మించి, ఒక్కమారు చనిపోవుదురనీ చెప్పుచుండుట
చూచాము. ఆ రెండు మతాల మూల గ్రంథాలలో కూడా మనిషి చనిపోయిన తర్వాత అతడు తిరిగి జన్మిస్తాడని
మత ప్రవక్తలు చెప్పియుండగా, ఆ విషయము వారికి అర్థము కాకుండా పోవడము వలన, మనిషికి పునర్జన్మ లేదు
అని అంటున్నారు. వాస్తవముగా క్రైస్తవ, ఇస్లామ్ మతగ్రంథములలో కూడా పునర్జన్మలున్నవనియే చెప్పబడినది. ఆ
గ్రంథాలలో పునర్జన్మకు సంబంధించిన విషయములను సందర్భము వచ్చినపుడు ప్రస్తావించి చెప్పగలము. ఇందూ
(హిందూ) మతములోని ముఖ్యగ్రంథమైన భగవద్గీతలో పునర్జన్మ ఉన్నదని శాస్త్రబద్దముగా చెప్పబడి ఉన్నది. ముఖ్యమైన
అన్ని మతాలలోను ప్రవక్తలు మనిషికి మళ్ళీ జన్మ ఉన్నదని చెప్పుట వలన, వారి మాటలనుబట్టి పునర్జన్మగలదని
విశ్వసిస్తున్నాము. ఇక్కడ మత గ్రంథములు చెప్పిన దానినిబట్టి విశ్వాసము ఉన్నదేగానీ, అనుభవములేదని చెప్పుచున్నాము.
విశ్వాసము వాస్తవమూ కావచ్చు లేక అవాస్తవమూ కావచ్చును. ముఖ్యమైన మూడు మత గ్రంథాలలో చెప్పిన పునర్జన్మ
విశ్వసనీయమే అయినా, అది నిజమో, అబద్దమో అని తేల్చి చెప్పుకొనుటకు ముందు, మరణమును గురించి తెలుసుకోవాలి.
మరణమును గురించిన వివరమును తెలుసుకో గల్గితే తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందో లేదోననీ, ఉంటే ఎలా
సంభవించునోననీ తెలుసుకొనుటకు అవకాశమున్నది. అందువలన ముందుగా మరణమును గురించి చెప్పుకొందాము.
2

Page 3
మనిషికి మరణము మూడు రకములు కలదు. మనిషికిగల మూడు మరణములను గురించి విపులముగా
“మరణ రహస్యము” అను చిన్న గ్రంథములలో వ్రాయబడినది. ఒక మనిషి చనిపోయినపుడు మూడు మరణములలో
దేనినైనా పొందివుండవచ్చును. కాలమరణము, అకాల మరణము, తాత్కాలికమరణము అనబడు మూడు మరణములలో
మనిషి కాలమరణమును పొందినపుడు మాత్రమే వెంటనే పునర్జన్మకు పోవును. ఒకవేళ మనిషి అకాలమరణము
పొందినా, తాత్కాలిక మరణమును పొందినా తిరిగి కాలమరణము సంభవించు వరకు, మళ్ళీ జన్మకు (పునర్జన్మకు)
పోవుటకు అవకాశము లేదు. మూడు మరణములలో ఒక మనిషి ఒక మరణమునైనా పొందవచ్చును, లేక రెండు
మరణములనైనా పొందవచ్చును. లేక మూడు మరణములనైనా పొందవచ్చును. వివరముగా చెప్పితే ఒక మనిషి
అకాల మరణమును పొంది తర్వాత కొంత కాలమునకు కాలమరణమును పొంది మరుజన్మకు పోవుచున్నాడు. అలాగే
ఒక మనిషి తాత్కాలిక మరణమును పొంది, తర్వాత కాలమరణమును పొంది రెండవ జన్మకు పోవుచున్నాడు. అదే
విధముగా ఒక మనిషి ఒకప్పుడు తాత్కాలిక మరణమును పొంది, తర్వాత అకాలమరణమును పొంది, చివరకు కాల
మరణమును పొందగలిగి పునర్జన్మకు పోవుచున్నాడు. దీనినిబట్టి మనిషి అకాల మరణమును పొందినా, లేక తాత్కాలిక
మరణమును పొందినా, చివరకు కాలమరణమును పొందవలసిందేనని తెలియుచున్నది. ఇంకొక వివరము ఏమనగా!
మనిషి ముందు రెండు మరణములను పొందకుండా ఒకేమారు చివరిదైన కాలమరణమును పొందవచ్చును. వారివారి
కర్మనుబట్టి మరణములు ఎన్ని పొందాలి? ఎప్పుడు పొందాలి? అని ముందే నిర్ణయించ బడి ఉండును. మరుజన్మ
(పునర్జన్మ) రావాలి అంటే ముందు కాలమరణము రావాలి. కాలమరణమే మనిషికి అసలైన మరణము. కాలమరణము
తర్వాతే మనిషికి తిరిగి జన్మ ఉండును. మనిషి ఏ మతములో పుట్టివుండినా, వానికి మూడే మరణములుండును.
అందులో ఒకటి కాలమరణము తప్పకుండా సంభవించి తీరును. మిగతా రెండు మరణములు జరుగవచ్చు లేక
జరుగకపోవచ్చును.
కాలమరణము అనగా పూర్తి ఆయుస్సు అయిపోయిన తర్వాత సంభవించునదని అర్థము. కాలమరణమును
సంపూర్ణ మరణము అని అనవచ్చును. మిగతా రెండు మరణములైన అకాల మరణము, తాత్కాలిక మరణములను
అసంపూర్ణ మరణములని అనవచ్చును. ఎందుకనగా! ఈ రెండు మరణముల వలన వెంటనే రెండవ జన్మరాదు.
అందువలన వీటిని అసంపూర్ణ మరణములని అనవచ్చును. పునర్జన్మ సంపూర్ణ మరణమును పొందిన వానికే కలుగును.
కావున ఇప్పుడు మనము అసలైన మరణమును గురించి తెలుసుకొందాము. ఈ మరణము గురించి "జనన మరణ
సిద్ధాంతము” లోనూ, అట్లే “మరణ రహస్యము” లోనూ చెప్పబడి నప్పటికీ ఇప్పుడు కూడా సందర్భానుసారము కొంత
వివరమును చెప్పు కొందాము. ఒక మనిషి సజీవ శరీరము కొన్ని భాగముల చేత కూర్చబడి ఉన్నది. ఒక భాగము
అనగా ఎంత అనిగానీ, ఒక భాగముగా ఎట్లు చెప్ప గలగుచున్నారనిగానీ, ఎవరైనా ప్రశ్నించగలిగితే వారికి జవాబును
ఈ విధముగా చెప్పవచ్చును. ఒకే ముద్దగా కనిపించు శరీరములో భాగములను గుర్తించుటకు ఒక సూత్రముగలదు.
అదేమనగా! ఒక శరీరములో ప్రత్యేకించి ఒక పనిని చేయు దానిని ఒక భాగముగా గుర్తించవచ్చును. ఆ విధముగా
మన శరీరములో మొత్తము 26 రకముల పనులు చేయు భాగములు కలవు. అందులో పనినిబట్టి కనిపించునవి,
కనిపించనివి అను రెండు రకములు కూడా గలవు. ఇక్కడ ముఖ్యముగా గమనించ వలసిన విషయమేమనగా! ఒక
శరీరములో ఒక భాగము ఒకే పనిని చేయును అను మాటలోని అంతరార్థమేమనగా! శరీరములో ఒక భాగము చేయు
పనులను ఇంకొకటి ఏదీ చేయనపుడు దానిని ఒక భాగముగా లెక్కించవచ్చును. దీనినిబట్టి మనకు అర్థమగునది
3

Page 4
ఏమనగా! ఒక పనిగానీ లేక రెండు పనులుగానీ, అంతకంటే ఎక్కువ పనులుగానీ, శరీరములో నియమిత పేరుగలది
ఒక్కటే చేయునప్పుడు, దానిని ఒక భాగముగా లెక్కించవచ్చును. ఈ విధముగా శరీరములో నియమిత పనులను
చేయు నియమిత పేరుగల భాగములు మొత్తము 26 గలవని చెప్పుకొన్నాము. పని చేయని పరమాత్మ కూడ కలదు.
దానితో అయితే 27 భాగములగును. అది పని చేయనిది కావున దానిని భాగముగా తీసుకోవడము లేదు.
ఒక సజీవ శరీరమును 26 భాగముల కూటమి అని చెప్పినపుడు, అందులో కనిపించు మరియు కనిపించని
రెండు రకముల భాగములు ఉన్నవని చెప్పవచ్చును. కనిపించు భాగములను స్థూల శరీరమనీ, కనిపించని భాగములను
సూక్ష్మశరీరమనీ శరీరమును రెండు భాగములుగా విభజించి చెప్పవచ్చును. కనిపించే స్థూల శరీరము పది భాగములుగా
ఉండగా, కనిపించని సూక్ష్మశరీరము పదహారు భాగములుగా ఉన్నది. ఒక శరీరమును స్థూల, సూక్ష్మ రెండు భాగములుగా
విభజించడమేకాక శరీరమును ప్రకృతి భాగములనీ, ఆత్మ భాగములనీ రెండు భాగములుగా విభజించవచ్చును.
శరీరములోని సూక్ష్మ భాగము స్థూలభాగములు రెండు కలిసి 26 కాగా, అందులో 24 ప్రకృతి భాగములుండగా,
కేవలము రెండు మాత్రము ఆత్మ భాగములున్నవి. వాటిని మొత్తము క్రింద వివరముగా చూస్తాము.
1)
కన్ను
2)
చెవి
3)
ముక్కు
4)
నాలుక
5)
చర్మము
6)
చేతులు
7)
కాళ్ళు
8)
నోరు
9)
గుదము
10)
గుహ్యము
G
11)
వ్యాన వాయువు
12)
ఉదాన వాయువు
13)
సమాన వాయువు
14)
ప్రాణ వాయువు
15)
అపాన వాయువు
16)
చూపు
17)
వినికిడి
18)
వాసన
19)
రుచి
20)
స్పర్శ
21)
మనస్సు
22)
బుద్ధి
23)
చిత్తము
24) అహము
25)
జీవుడు
26)
ఆత్మ
27) పరమాత్మ
స్థూల శరీరములో ముఖ్యమైనది కన్ను. "జ్ఞానేంద్రియానామ్ నయనమ్ ప్రధానమ్" అను వాక్యము ప్రకారము
జ్ఞానేంద్రియములలో కన్ను ముఖ్యమైనది. స్థూలశరీరములో ఐదు జ్ఞానేంద్రియములూ, ఐదు కర్మేంద్రియములు గలవు.
4

Page 5
స్థూల శరీరము పది భాగములు కాగా, అందులో ఐదు జ్ఞానేంద్రి యములు మరియు ఐదు కర్మేంద్రియములు గలవు.
జ్ఞానేంద్రియములలో కన్ను దృశ్యమును చూపిస్తున్నది. మొత్తము శరీరములో కన్ను బయటి దృశ్యములను మాత్రము
చూపుచున్నది. శరీరములో దృశ్యమును చూపించు పరికరము ఒకేఒక కన్ను మాత్రమే కలదు. శరీరములో కన్ను
చేయు పనిని ఏదీ చేయలేదు. ప్రత్యేకమైన పనిని చేయునది, ప్రత్యేకమైన భాగముగా ఉన్నదను సూత్రము ప్రకారము,
దేహములో కన్ను ఒక భాగముగా లెక్కించ బడుచున్నది. ఈ విధముగా శరీరములో మొత్తము 28 కార్యములు 26
భాగములచేత జరుగుచున్నవి. దేహములోని 26 భాగములలో మనస్సు, ఆత్మ అను రెండు ప్రత్యేకించి ఒక్కొక్కటి
రెండేసి పనులు చేయుచున్నవి. శరీరములోని 24 భాగములు ఒక్కొక్క పనిని చేయగా, మనస్సు రెండు పనులనూ, ఆత్మ
రెండు పనులనూ చేస్తున్నవి. అలా మనస్సు, ఆత్మ ఒక పనిని అధికముగా చేయుట వలన శరీరములో మొత్తము
పనులు 28గా గుర్తించబడినవి. మానవ జీవితమంతా మానవుని శరీరములో కేవలము 28 పనులు మాత్రమే
జరుగుచున్నవి. అయితే ఒక మనిషి బయట వేల వ్యాపారములు, వేల వ్యవహారములను నెరవేర్చు మేధావి అయినా
కూడా తన శరీరములో జరుగు 28 పనులను గుర్తించలేక పోవుచున్నారు. బయట వేల వ్యాపారములను చేసి, వేల
కోట్లు డబ్బును సంపాదించినా, ఎన్నో వ్యవహారములను నడిపి దేశానికి ప్రధానమంత్రి అయినా, ఎవడు ఎంతటి
వాడైనా వాని శరీరములో జరుగునవి 28 పనులు మాత్రమే. కానీ ఆ 28 పనులు తన శరీరములో పుట్టినప్పటినుండి
జరుగుచున్ననూ, ఆ 28 పనులు ఏమిటో, వాటిని ఏ భాగములు చేయుచున్నవో, ఖచ్చితముగా మనిషి చెప్పలేని స్థితిలో
ఉన్నాడు.
నేను యం.డి డాక్టరును. శరీరములో ప్రతి భాగము నాకు తెలుసు, అలాగే శరీరములో ప్రతి భాగము చేయు
పని కూడా నాకు తెలుసు అని ఎవరైనా అనవచ్చును. అంతేకాకుండా వారికి శరీరములో 26 భాగములేకాక వందల
భాగములు కనిపించును. కానీ సూక్ష్మశరీరములోని పదిహేను భాగములు కనిపించవు. అవి ఏ పరికరములకుగానీ,
ఏ స్కానింగులకుగానీ తెలియునవి కావు. ఉదాహరణకు మనస్సు అనునది శరీరములో భాగమే అయినా అది కనిపించదు.
దానిని ఏ పరికరము, ఏ స్కానింగులు, ఏక్స్లు గుర్తించలేవు, చూడలేవు, చూపలేవు. అందువలన వైద్య వృత్తిలో
యం.డి డాక్టర్లకు కూడా తెలియని భాగములున్నవని చెప్పవచ్చును. ఆధ్యాత్మికవిద్యను అభ్యసించి, బ్రహ్మవిద్యాశాస్త్రమును
తెలిసిన వారికి మాత్రమే శరీరములో కనిపించని భాగములు కూడా తెలియగలవు. అట్లే అవి చేయు పనులు కూడా
తెలియగలవు. ఒక డాక్టరు శరీరములోని స్థూల భాగములను గురించి చెప్పగలడు, సూక్ష్మ భాగములను గురించి
చెప్పలేడు. శరీరములో స్థూలముగా జరుగు పనినిబట్టి ఇతడు బ్రతికాడు లేక చనిపోయాడు అని చెప్పగలడు. కానీ
దానికి కారణమైన కనిపించని కర్మను గురించి చెప్పలేడు. ఒక డాక్టరుకు తెలియని ఎన్నో సూక్ష్మ విషయములు ఒక
ఆధ్యాత్మికవేత్తకు తెలియును. అలాగే ఒక ఆధ్యాత్మికవేత్తకు తెలియని ఎన్నో స్థూల విషయములు డాక్టరుకు తెలియును.
ఆత్మల విషయములో, దైవజ్ఞానములో, ఆధ్యాత్మిక రంగములో స్థూలముకంటే సూక్ష్మమునకే ఎక్కువ ప్రాధాన్యత గలదు.
కావున డాక్టరుకు తెలియని రహస్యములు ఆధ్యాత్మికవేత్తలకే ఎక్కువ తెలియునని చెప్పవచ్చును.
ఒక మనిషిని పరీక్షించి చనిపోయాడని చెప్పిన డాక్టరుకు, ఆ మనిషి శరీరము లోపల ఆఖరు నిమిషములో ఏమి
జరిగినదీ, మనస్సు ఏ పని చేయుచున్నదీ, బుద్ధి ఎలా పని చేయుచున్నదీ తెలియదు. భౌతిక శాస్త్రవేత్త లకు స్థూల
అవయవముల పని మాత్రమే తెలియును, కానీ సూక్ష్మమైన జీవాత్మ విషయము తెలియదు. అందువలన శరీరములో
జీవుడున్నప్పటికీ, శ్వాస ఆడనంతమాత్రమున చనిపోయాడని చెప్పిన సంఘటనలు కలవు. అలా చనిపోయాడని చెప్పిన
5

Page 6
తర్వాత కొన్ని గంటలకు, కొన్ని దినములకు లేచి వచ్చినవారు కలరు. అలాగే మనిషి పుట్టుకలో శిశువు శరీరము
లోనికి జీవుడు రాకనే ఆ శరీరము కదలనంత మాత్రమున, శ్వాస ఆడనంత మాత్రమున ముందే చనిపోయాడనీ,
గర్భములోనే చనిపోయాడని డాక్టర్లు చెప్పడము చాలాచోట్ల జరిగినది. అటువంటి శిశువులు కొన్ని గంటల తర్వాత
ప్రాణము వచ్చి బ్రతికినవారు కూడా చాలామంది కలరు. ఇవన్నిటిని పరిశీలించి చూస్తే ఒక డాక్టరుకు స్థూల
శరీరమును గురించి సంపూర్ణముగా తెలియును, కానీ సూక్ష్మశరీరమును గురించి తెలియదనియే చెప్పవచ్చును. అట్లే
ఆధ్యాత్మిక విద్యను తెలిసిన వారికి సూక్ష్మశరీరమును గురించి తెలియునుగానీ, స్థూల శరీరమును గురించి సరిగా
తెలియదని చెప్పవచ్చును. ఇకపోతే బ్రహ్మవిద్యలో ఆరితేరిన ఆధ్యాత్మికవేత్తలు కొందరు స్థూలమును గురించి గానీ,
సూక్ష్మమును గురించిగానీ బాగా తెలిసివుందురు. స్థూల, సూక్ష్మములను తెలిసిన బ్రహ్మవిద్యావేత్తలు భూమిమీద అరుదుగా
ఉందురు. అటువంటి వారు మాత్రమే జనన విషయములనుగానీ, మరణ విషయము లనుగానీ తేల్చి చెప్పగలరు.
జనన మరణ రహస్యములను పూర్తిగా తెలిసి వుందురు. వారు తెలియజేస్తేనే ఇతర మనుషులకు ఆ రహస్యములు
తెలియగలవు. అటువంటి బ్రహ్మవిద్యాశాస్త్రవేత్తలు తప్ప భౌతిక శరీర శాస్త్రవేత్తలుగానీ, వైద్యులుగానీ జనన మరణముల
వివరములను తెలియ లేరు. ఒకవేళ తెలిసినట్లు చెప్పినా, వారు చెప్పిన విషయములు సత్యములు కావు, నిరూపణకురావు.
పునర్జన్మ రావాలంటే దానికి ముందు మరణము ఉండితీరాలి. ముందు మరణించకుండా పుట్టువారు ఎవడూ
ఉండడు. సృష్ఠి జరిగినప్పుడు దేవుడే స్వయముగా జీవరాసులను సృష్టించినపుడు మాత్రము అందరి జన్మలు మరణము
లేకుండా జన్మతోనే మొదలగుచున్నవి. తర్వాత పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయిన వాడు తిరిగి పుట్టుక
తప్పదు. దీనినిబట్టి సృష్టి తర్వాత భగవద్గీతలో సాంఖ్యయోగము 27వ శ్లోకమున చెప్పినట్లు “జాతస్య హి ధ్రువో
మృత్యో ధ్రువం జన్మ మృతస్యచ" పుట్టినవాడు చావక తప్పదు. చచ్చినవాడు పుట్టక తప్పదు అని కలదు. గీతలో
భగవంతుడు మొదట చెప్పిన పదము “జాతస్య” అనుటలో మొదట పుట్టినవాడు అని అర్థమగుచున్నది. భగవద్గీతలో
భగవంతుడు ఆచి తూచి ఏ మాట ముందు చెప్పాలో ఏ మాటను వెనుక చెప్పాలో అలాగే చెప్పాడు. అందువలన
పుట్టినవాడు చనిపోవుట ధృవీకరించివుంది అని చెప్పాడు. తర్వాత చనిపోయినవాడు జన్మించునట్లు నిర్ణయము
చేయబడినదని చెప్పాడు. ఆ శ్లోకములో మొదటి వాక్యము సృష్టించబడిన తర్వాత జరుగునదనీ, అందులో మొదట
పుట్టుకను గురించి జాతస్య అని చెప్పడము జరిగినది. అలాగే మరణించిన తర్వాత జన్మ జరుగునదనీ రెండవ
వాక్యములో చెప్పబడినది. అందువలన సృష్టించబడిన ప్రతి జీవి చావక తప్పదు, చనిపోయిన ప్రతిజీవి పుట్టుక
తప్పదని చెప్పడమైనది. ఒకడు భూమిమీద మనము చూచునట్లు పుట్టాడు అంటే అతడు ఒక్కక్షణము పుట్టకముందు
చనిపోయివుండవలెను. ఉదాహరణకు ఒకని జననము సాయంకాలము ఐదుగంటల మూడు నిమిషములకైతే, వాని
మరణము కూడా సాయంకాలము ఐదుగంటలా రెండు నిమిషములా యాభై తొమ్మిది సెకండ్లకు జరిగినదని అర్థము.
ఒకడు పుట్టాడు అంటే అంతకంటే ఒక సెకండు ముందు వాడు చనిపోయివుంటాడు. అందువలన చచ్చినవాడు పుట్టక
తప్పదు అని “ధ్రువమ్ జన్మ మృతస్యచ" అని అన్నారు.
ఈ విధముగా బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చావు పుట్టుకలు గలవు, ఆ విషయము మనకు తెలియదు.
అందువలన కొందరు తమ పుట్టిన రోజు పండుగను చేసుకొనుచున్నారు. కానీ అది వారి చచ్చినరోజని వారికి
ఏమాత్రము తెలియదు. గతములో నా పుట్టిన రోజున చెప్పిన ఉపన్యాసములో “ఇది నాకు పుట్టినరోజే అయినా,
దానికంటే ముందు ఇది నా చచ్చినరోజు, తర్వాత పుట్టినరోజు. అందువలన నేను పుట్టిన దినమున తప్పక చచ్చిన
6

Page 7
రోజును కూడా జ్ఞాపకము చేసుకొంటాను.” అని చెప్పాను. కానీ చాలామందికి తమ పుట్టిన దినమే చచ్చిన దినమని
తెలియదు. భూమిమీద ఎవనికైనా పునర్జన్మ ఉన్నది కానీ జన్మ లేదు. జన్మ అనగా మొదట పుట్టినది, పునర్జన్మ అనగా
మళ్ళీ మళ్ళీ పుట్టునది. మనము సృష్ఠి ఆదిలో సృష్టికర్త ద్వారా జన్మను పొందాము. తర్వాత ప్రకృతి ద్వారా
పునర్జన్మించుచున్నాము. కానీ పునర్జన్మ కానటువంటి జన్మను ఎవడూ పొందడములేదు. మొదట సృష్ఠి తయారైనపుడు
జన్మించిన మనము తర్వాత పునర్జన్మించుచున్నాము. దీనినిబట్టి ప్రస్తుత కాలములో భూమిమీద జీవించు ప్రతి ఒక్కరిదీ
పునర్జన్మేనని చెప్పవచ్చును. పునర్జన్మ పొందిన ప్రతి మనిషికీ గత జన్మ విషయము తెలియదు. గత జన్మలో జీవించి
తర్వాత పునర్జన్మ పొందినప్పటికీ, గత జన్మలో ఎన్నో కష్టములు అనుభవించినప్పటికీ, వెనుకటి జన్మ ఎవరికీ జ్ఞాపకము
ఉండదు. అలా జ్ఞాపకము లేకుండా పోవడానికి కారణము వెనుకటి జన్మలోనున్న శరీరము పునర్జన్మలో లేదు. గతజన్మలోని
శరీరము గానీ, శరీర భాగములుగానీ ఏవీ ఈ జన్మలో ఉండవు. జీవుడు మరణించి క్రొత్త జన్మ పొందినపుడు, ఆత్మ
సంబంధమైన భాగములు మాత్రము జీవుని వెంట ఉండగా, ప్రకృతి సంబంధమైన భాగములన్నీ నశించుచున్నవి.
పునర్జన్మలో జీవుని వెంట ఆత్మ పరమాత్మలు రెండూ ఉన్నవి. కానీ ప్రకృతి సంబంధమైన 24 భాగములు పూర్తి నశించి
పోవుచున్నవి. అందులో జ్ఞాపకము అను పనిని చేయు మనస్సు కూడా లేకుండా నశించుచున్నది. జ్ఞప్తిని అందించు
మనస్సు గతజన్మలోని మరణముతో పోవుచున్నది. కనుక గత జన్మ జ్ఞాపకాలు రెండవ జన్మలో లేకుండా పోయినవి.
అలాగే గతజన్మలో మంచి తెలివైనవాడు రెండవ జన్మలో కూడా అట్లే తెలివిగా ఉండుననుటకు వీలులేదు. ఎందుకనగా
ఒక మనిషి తెలివిగా ప్రవర్తించుట, అతని శరీరములోని బుద్ధి యొక్క పనితనమునుబట్టి వుండును. ఒకనికి పదునైన
బుద్ధి (బుద్ధి పొర పలుచగా) ఉంటే, వాని తెలివి గొప్పగా ఉండును. అటువంటి తెలివి గతజన్మలో ఉన్నవానికి ఆ జన్మ
చివరిలో వచ్చిన మరణములో అతని బుద్ధి నశించి పోవుచున్నది. కావున పునర్జన్మలో అతనికి అదే తెలివి ఉంటుందని
చెప్పలేము. పోయిన జన్మలోని శరీర భాగముల పనితనమునుబట్టి గతజన్మ జీవితము జరిగి ఉండును. ప్రస్తుతము
ఉన్న రెండవ జన్మలో (పునర్జన్మలో) క్రొత్త శరీరమూ, క్రొత్త భాగములు వచ్చి వుండుట వలన తెలివిగానీ, జ్ఞాపకశక్తిగానీ
అన్ని తేడాగానే కనిపించు చుండును. గత జన్మలోని శరీరముగానీ, శరీర భాగములుగానీ జీవుని వెంట రెండవ
జన్మలోనికి రావు. కావున రెండవ జన్మలో మొదటి జన్మ జ్ఞాపకములుగానీ, తెలివిగానీ మొదలగునవి లేకుండా పోయి
అన్ని పనులు బేధముగానే ఉండును. మరణములో శరీరములోని 24 ప్రకృతి భాగములకు మాత్రమే నాశనము
కలదు. జీవుడు మరణములో నశించడు. అలాగే ఆత్మ నశించదు. మరణములో ప్రకృతి భాగములైన మొత్తము 24
భాగములు జీవున్నీ, ఆత్మను వదలిపోవుచున్నవి. ఆత్మ భాగములు లేక పురుష భాగములైన జీవాత్మ, ఆత్మ రెండూ
నశించక రెండవ జన్మకు వచ్చుచున్నవి. ప్రకృతి లేక స్త్రీ భాగములైన 24 శరీర భాగములకు పునర్జన్మ ఉండదు. అవి
ఒకేమారు పుట్టి, ఒకేమారు నశించి పోవుచున్నవి. వాటిని ప్రకృతియే తయారు చేయుచున్నది. అందువలన వాటిని
ప్రకృతి భాగములని, స్త్రీ భాగములని అంటున్నాము.
ప్రకృతి భాగములైన శరీరములోని 24 భాగములు ఒక యంత్రము లోని పరికరములవలె పని చేయుచున్నవి.
అందువలన వాటికి పాప పుణ్యములు లేవు, అవి తిరిగి పుట్టవు. తిరిగి పుట్టేది జీవుడు మరియు ఆత్మ. ఆత్మ
శరీరములో రెండురకముల పనిని చేయుచున్నప్పటికీ, ఆత్మకు కూడా పాపపుణ్యములు అంటవు. ఉదాహరణకు
దేశములోని పౌరుడు ఎవడైనాగానీ తన శత్రువును చంపితే, వానికి చట్టములోని 302 సెక్షన్ వర్తించుచున్నది. అలాగే
పూర్తి చంపకుండా కొంత గాయపరచి వదలివేసినా, అతనికి హత్యా ప్రయత్న నేరము క్రింద 307 సెక్షన్ వర్తించుచున్నది.
7

Page 8
ఆ సెక్షన్ల ప్రకారము వానికి న్యాయస్థానములో శిక్ష పడుచున్నది. ఇది దేశములోని ఒక పౌరునికి సంబంధించిన
విషయముకాగా, దేశము యొక్క భద్రత కొరకు దేశ సరిహద్దులో పని చేయు సైనికుడు పదిమంది శత్రువులను
చంపినా, అతనికి 302 సెక్షన్ వర్తించదు. ఒకవేళ అతను శత్రువును గాయపరిచినా, అతనికి 307 సెక్షన్ కూడా
వర్తించదు. ఎందుకనగా అతను ప్రభుత్వము కొరకు, ప్రభుత్వ ఆధీనములో పని చేయుచున్నాడు కనుక అతనికి
ప్రభుత్వ చట్టము గానీ, చట్టములోని సెక్షన్లుగానీ వర్తించవు. అలాగే శరీరములో దేవుని ఆధీనములో ఉండి దేవుని
యంత్రాంగములో పనిచేయుచున్న ప్రకృతి శరీర భాగములకు దేవుని చట్టము వర్తించదు. దేవుని చట్టము (ధర్మము)
ప్రకారము వచ్చు పాపపుణ్యములు శరీర భాగములకు అంటవు. వాటికి కర్మాలేదూ, వాటికి అనుభవమూ లేదు.
అందువలన ఒక జన్మలో జీవునితో పాటు శరీరములో ఉండు మనస్సు ఆ జన్మతోనే అంతరించి పోవుచున్నది. జీవుడు
మాత్రము శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించి పునర్జన్మను పొందుచున్నాడు. జీవుడు రెండవ జన్మలో,
రెండవ శరీరములో ఉండినప్పుడు అంతకుముందు జన్మలోని మనస్సుగానీ, బుద్ధిగానీ ఉండవు. రెండవ జన్మలో
జీవునితోపాటు క్రొత్త మనస్సు, క్రొత్త బుద్ధి నివసించుచున్నవి. జీవితములో శరీరమందు జ్ఞాపకాల పనిని మనస్సు
మాత్రమే చేయుచున్నది. గత జన్మలోని జ్ఞాపకాలన్నీ ఆ మనస్సు పోయినపుడే దానివెంటనే పోయివుండును. అందువలన
గత జన్మ జ్ఞాపకాలు ఎవరికీ ఉండవు. మనము గత జన్మనుండి ప్రస్తుతమున్న జన్మలోనికి వచ్చాము. మనకు కూడా
గతజన్మ జ్ఞాపకములేదు. దానికి కారణము గత జన్మలో మన శరీరములో మన వెంటవున్న మనస్సు ఇప్పుడు లేదు.
కనుక గతజన్మలోని జ్ఞాపకాలు ఈ జన్మలో లేకుండా పోయాయి.
ఒక మనిషికి ప్రస్తుత కాలములో ఉన్నది పునర్జన్మ అయినా, గతములో ఇటువంటి పునర్జన్మలు మనిషికి ఎన్ని
కలిగాయి అని ప్రశ్నించుకొని చూస్తే, సృష్ఠి మొదలైనప్పటినుండి ఎన్నో జన్మలు కలిగాయి అని చెప్పవచ్చును. కానీ
ఖచ్చితముగా ఇన్ని జరిగాయి అని చెప్పుటకు వీలులేదు. సృష్టి ఆదినుండి జన్మలు ఉండినప్పటికీ, గతజన్మ జ్ఞాపకాలు
మనిషికి లేనందు వలన ఎన్నిమార్లు జన్మించినదీ చెప్పలేము. అందువలన భగవద్గీతలో జ్ఞాన యోగమునందు ఐదవ
శ్లోకము “బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జునా, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప” అని భగవంతుడు
అన్నాడు. దీనిభావము ఏమనగా! "అర్జునా! ఇంతవరకు నాకు ఎన్నియో జన్మలు కలిగాయి, అట్లే నీకు కూడా ఎన్నో
జన్మలు కలిగాయి. అయితే వానిని వరుసగా నేను తెలిసియున్నాను. కానీ నీవు నీ గత జన్మములను ఏమాత్రము
చెప్పలేవు. అవి నీకు జ్ఞాపకము లేవు". అని భగవాన్ శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పాడు. ఆనాడు అర్జునునికే
తెలియవని చెప్పినట్లు, ఇపుడు మనకు కూడా తెలియవు. మనము సృష్టి మొదలైనప్పటి నుండి ఈ భూమిమీదనే చస్తూ
పుట్టుచున్నాము. ఇప్పటికి ఎన్నో జన్మలు మారి పోయాయి. అయితే నాకుగానీ, నీకుగానీ, మరెవ్వరికైనాగానీ వెనుకటి
జన్మ జ్ఞాపకాలు లేవు. ఉండుటకు అవకాశమే లేదు.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! కృష్ణుడు కూడా మనిషే కదా! ఆయనే స్వయముగా
నాకు ఎన్నో జన్మలు కలిగాయి అన్నాడు. అట్లే అర్జునునికి కూడా ఎన్నో జన్మలు కలిగాయి అన్నాడు. అలాంటపుడు
వారి శరీరములలోని మనస్సు ఏ జన్మకున్నది ఆ జన్మలోనే అంతరించి పోయివుండును కదా! అర్జునునికి గతములోని
మనస్సులేదు, కాబట్టి అతనికి ఎన్ని జన్మలు గడచినది చెప్పలేడు. కానీ కృష్ణుడు తనకు ఎన్ని జన్మలు కలిగాయో వాటిని
వరుసగా చెప్పగలను అన్నాడు, కృష్ణుని మనస్సు కూడా గత జన్మలలో మరణముతో లేకుండా పోయినప్పుడు, కృష్ణుడు
తన గతజన్మలను ఎలా చెప్పగలడు? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! అక్కడ కృష్ణుడు చెప్పిన
8

Page 9
మాట వాస్తవమే. అయితే ఆయన మాట వాస్తవము అనుటకు ముందు మనస్సును గురించి కొంత విషయమును
తెలుసుకోవలసి ఉన్నది. మన శరీరములో ప్రకృతి భాగములైన వాటిలో సూక్ష్మశరీరమందు మనస్సు అన్ని భాగములకంటే
విభిన్నముగా ప్రత్యేకించి రెండు పనులను చేయుచున్నది. శరీరములో బాహ్యేంద్రియములు, అంతరేంద్రియములని
రెండు భాగములుగలవు. బాహ్యేంద్రియములన్నీ బయటికి కనిపించు స్థూలశరీరముగా ఉన్నవి.
అంతరేంద్రియములన్నియూ కనిపించని సూక్ష్మశరీరముగా ఉన్నవి. బయటి విషయమును సేకరించునవి స్థూలశరీరములోని
ఐదు జ్ఞానేంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఐదు జ్ఞానేంద్రియములు బయట సేకరించిన
సమాచారమును, శరీరమంతా వ్యాపించివున్న మనస్సు తీసుకొని పోయి లోపలనున్న బుద్ధికి తెలియజేయును. తర్వాత
బుద్ధి చెప్పిన నిర్ణయమును లేక పనిని మనస్సు బయటి కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము
అను బయటి ఇంద్రియములకు తెలియజేయును. ఇది మనస్సు చేయు మొదటి పని. తర్వాత మనస్సు చేయు రెండవ
పనిని గురించి చెప్పుకొందాము.
మనస్సు అను పేరు రావడానికి కూడా ఒక కారణముకలదు. మననము చేయునది మనస్సని పెద్దలు చెప్పుచున్నారు.
మననము అనగా జ్ఞాపకము అని అర్ధము. మానవ జీవితములో క్షణక్షణము ఎన్నో కార్యములు, ఎన్నో సంఘటనలు
జరుగుచుండును. వాటన్నిటిని మనస్సు తనయందు దాచుకొని, తిరిగి అవసరము వచ్చినపుడు వాటిని జ్ఞాపకాలరూపములో
బయటికి తెచ్చును. ఇది మనస్సు యొక్క రెండవ పని అయినా ఇదియే మనస్సుకు ముఖ్యమైన పని. మనస్సును
జ్ఞాపకాల పుట్ట అని కూడా కొందరు చెప్పడము జరిగినది. ఏ జ్ఞాపకమైనా మనస్సునుండే రావలయును. కనుక
జ్ఞాపకాల పుట్ట అన్నారు. ఈ విధముగా శరీరములోని ఏ ప్రకృతి భాగమూ చేయని విధముగా రెండు పనులను
మనస్సు చేయుచున్నది. ఒక వ్యక్తి పామును కన్ను ద్వారా చూడగల్గుచున్నాడు. శరీరములోని కన్ను కేవలము
దృశ్యములను చూపు పనిని మాత్రము చేయుచున్నది. దృశ్యమును చూపు పనిని కన్ను తప్ప శరీరములో ఏ ఇతర
భాగము చేయదు. అందువలన ప్రత్యేకమైన పని చేయుదానిని ప్రత్యేక భాగముగా గుర్తించ వచ్చును అను సూత్రము
ప్రకారము శరీరములో దృశ్యములను చూపే పనిని బట్టి కన్నును ఒక భాగముగా గుర్తించగలుగుచున్నాము. అలా
ప్రత్యేకమైన పనిని చేయు కన్ను తన ద్వారా బయటగల పాము దృశ్యమును చూడగలిగింది. అలా చూచిన తర్వాత
కన్ను ద్వారా చూపు అను విషయ జ్ఞానము ఏర్పడినది. అలా కంటివద్ద ఏర్పడిన విషయజ్ఞానమును శరీరములో
అంతటా వ్యాపించి వున్న మనస్సు, కన్ను వరకు కూడా గల మనస్సు ఆ విషయజ్ఞానమును స్వీకరించి, శరీరము లోపల
గల బుద్ధికి ఆ విషయమును అందించును. మనస్సు అందించిన విషయమును బుద్ధి గ్రహించి అక్కడేనున్న జీవునికి
తెల్పగా జీవుడు తెలుసు కోగల్గుచున్నాడు. జీవునికి విషయము చేరిన వెంటనే అక్కడనేనున్న గుణములు ఆ విషయము
నకు స్పందించగా, ఆ స్పందనను అక్కడేనున్న చిత్తము గ్రహించును. చిత్తము ప్రారబ్ధకర్మ ప్రకారము ఆ స్పందనను
విశ్లేషించి చూడగా అక్కడ కర్మ ప్రకారము చిత్తము ఒక నిర్ణయమునకు వచ్చి ఆ నిర్ణయమును బుద్ధికి తెల్పును.
చిత్తము ప్రక్కనేనున్న బుద్ధి దానిని గ్రహించి వార్తాహరుడైన మనస్సుకు తెల్పును. మనస్సు బుద్ధి అందించిన వార్తను
తీసుకొని బయట ఇంద్రియములైన కర్మేంద్రియములకు తెలియజేయును. అప్పుడు మనస్సు చెప్పిన వార్త ప్రకారము
కర్మేంద్రియములు పని చేయును.
పాము యొక్క దృశ్యము కన్ను ద్వారా కనిపించగా, చూపు అను తన్మాత్ర దానిని ఒక బయట సమాచారముగా
తీసుకొని మనస్సుకు అందించగా, మనస్సు లోపలి ఇంద్రియములకు, బయటి ఇంద్రియములకు మధ్యవర్తిగా పనిచేసి,
9

Page 10
బయటి విషయము లోపలి బుద్ధికి, లోపలి బుద్ధి అందించిన సమాచారమును బయటి కర్మేంద్రియములకు తెల్పుచున్నది.
లోపలికి పోయిన పాము విషయమును బుద్ధి జీవునికి తెలుపగా, జీవుని చుట్టూ నివాసమైన గుణములప్పుడు కదలగా,
గుణముల కదలికను చిత్తము కర్మప్రకారము చూచి కర్మ నిర్ణయానికి వచ్చిన దానిని సమాచారముగా మార్చి బుద్ధికి
తెల్పింది. పాము అను విషయము ఈ విధముగా ప్రయాణించి, చివరకు చిత్తము వద్ద పామును చంపివేయమను
సమాచారము తయారై మనస్సుకు అందగా, అదే విషయమును మనస్సు బాహ్య కర్మేంద్రియ ములకు తెల్పింది.
అప్పుడు కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు కదిలి పని చేసి పామును చంపివేశాయి. మన జీవితములో జరుగు ప్రతి
పని ఇదే విధముగా ప్రయాణించి సమాచారముగా బయటికి రాగా, అదే జరుగు చున్నది. ఈ విధముగా ఒక
సమాచారము బయటినుండి లోపలికి పోయి, లోపలనుండి బయటికి వచ్చి పని జరగడములో శరీరములోని మొత్తము
26 భాగములు పని చేయుచున్నవి. కానీ శరీరములో 27వ భాగముగానున్న పరమాత్మ ఏ పనిని చేయకున్నది.
శరీరములో పని చేయు మొత్తము 26 భాగములలో ముఖ్యమైనవీ, ప్రత్యేకత కల్గియున్నవి రెండే రెండు గలవు. అవియే
ఒకటి మనస్సు, రెండు ఆత్మ.
మనస్సు ప్రకృతి భాగముకాగా, ఆత్మ పరమాత్మ భాగముగా ఉన్నది. శరీరములోని జీవునితో సహా 24 భాగములు
శరీరములో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉండగా, ప్రత్యేకించి మనస్సు, ఆత్మ రెండు మాత్రము శరీరమంతా వ్యాపించియున్నవి.
శరీరమంతా వ్యాపించిన మనస్సు శరీరము బయటనున్న జ్ఞానేంద్రియ విషయములన్నిటిని సేకరించగల్గుచున్నది, లోపలికి
తెలుపగల్గుచున్నది. మొత్తము మీద బాహ్యరంగమునకు, అంత రంగమునకు మనస్సు మధ్యవర్తిగా ఉండడమేకాక,
మనస్సు విషయ జ్ఞాపకాల పెట్టెగా లేక పుట్టగా ఉన్నదని చెప్పుకొన్నాము. శరీరములో శరీరమంతటా వ్యాపించిన
మనస్సుయొక్క రెండు పనులను తెలుసుకోగల్గిన మనము, ఇపుడు శరీరమంతా వ్యాపించిన ఆత్మ ఎలా రెండు పనులను
చేయగల్గు చున్నదో తెలుసుకొందాము. శరీరములో పని చేయు ప్రకృతి భాగములు 24 ఉండగా, పరమాత్మ భాగములు
కేవలము రెండే కలవు. పరమాత్మ భాగములైన జీవాత్మ, ఆత్మలలో జీవాత్మ ఒక్కచోట శరీరములో ఉండగా, ఆత్మ
శరీరమంతా వ్యాపించి ఉన్నది. ఇపుడు శరీరమంతా వ్యాపించిన ఆత్మ గురించి పూర్తి వివరముగా తెలుసుకొందాము.
ఆత్మ అనునది శరీరమును ఆవహించి ఉంటుంది. శరీరములలో జీవుడు నివసిస్తు ఉంటాడు. జీవుడు ఎచ్చట
ఉండునో ఆత్మ కూడ అక్కడ ఉండి తీరవలసిందే. ఆత్మలేని చోట జీవాత్మ గానీ, జీవాత్మ లేనిచోట ఆత్మగానీ ఉండుటకు
వీలులేదు. దీనినిబట్టి ఆత్మ, జీవాత్మలు రెండూ జోడు ఆత్మలుగా ఉన్నాయని చెప్పవచ్చును. జీవాత్మ, ఆత్మలేనిచోట
కూడా పరమాత్మ ఉన్నది. కానీ జీవాత్మ, ఆత్మ రెండు ఆత్మలు ఎక్కడున్నా పరమాత్మ అక్కడ కూడా కలదు. జీవాత్మను,
ఆత్మను ఎప్పటికీ వేరువేరుగా ఉన్నట్లు చెప్పుటకు వీలులేదు. ఇవి రెండు అవినాభావ సంబంధముగల ఆత్మలు.
జీవాత్మ ఆత్మ తోడుగా వుంటూ రెండు రకముల శరీరములలో నివసిస్తూ ఉన్నవి. 1) రక్తముండే శరీరములోనూ,
2) రక్తములేని శరీరములలోనూ జీవాత్మ ఆత్మలున్నవి. రక్తప్రసరణ ఉన్న శరీరములు మనుషులు, జంతువులు, పక్షులు
మొదలగు అండజ, పిండజములుగా గలవు. రక్తప్రసరణ లేని శరీరములు ఉద్భిజములైన చెట్లు తీగలు మొదలగునవిగా
గలవు. వృక్ష జాతిలో కూడ జీవుడు, ఆత్మ రెండూ నివసిస్తున్నవి. చెట్టు కూడా జీవుడు నివసించుటకు యోగ్యమైన ఒక
విధమగు శరీరమని చెప్పవచ్చును. రక్తప్రసరణ ఉన్న మనిషి లేక జంతువులోగానీ, రక్తప్రసరణ లేని చెట్టులోగానీ
జీవాత్మ ఒక్కచోట ఉండగా ఆత్మ శరీరమంతా వ్యాపించివున్నది. మనిషి శరీరములో నఖ శిఖ పర్యంతము ఆత్మ
వ్యాపించి ఉన్నట్లు, ఒక చెట్టులో కూడా క్రింది వేరు దగ్గర నుండి పైన కొమ్మ చివరి వరకు ఆత్మ వ్యాపించి ఉన్నది.
10

Page 11
రక్తమున్న మనిషిలో శరీరమంతా వ్యాపించిన శక్తిని ఆత్మ అని అంటున్నాము. చెట్టులో వేరునుండి కొమ్మల వరకు
వ్యాపించిన శక్తిని పూర్వము ఆకు అనెడివారు. ఆకు అను పదమును బట్టి ఆత్మశక్తి చెట్టులో ఉన్నదని అందరికి
తెలియునట్లు చెట్టుయొక్క పత్రములను ఆకులు అన్నారు. ఆకులున్న చెట్టులో ఆత్మశక్తి ఉన్నదనీ అదియే ఔషధశక్తి అని
కూడా కొందరు చెప్పారు. ఆకు అను పదము కాలక్రమములో మారిపోయింది. మనిషి శరీరములోనికి వచ్చేటప్పటికి
నేడు అది ఆత్మ అని పిలువబడు చున్నది. 'ఆకు' అను శబ్దము మారుతూపోయి ఆకు నుండి ఆత్మగా మారిపోయినది.
అను అక్షరము అలాగే నిలిచిపోయి 'కు' అను శబ్దము కొందరిలో 'త్మ' అను శబ్దముగా పలుకబడినది. చివరకది
ఆకు నుండి ఆత్మగా మారి పిలువబడుచున్నది. ఇప్పుడు ఆత్మ శబ్దము స్థిరస్థాయిగా నిలిచిపోయినది. ఆకు అనినా,
ఆత్మ అనినా ఒకే అర్థము గల పదములని తెలుసుకొన్నప్పుడు ఆధ్యాత్మికము బాగా అర్థము కాగలదు.
చెట్టునుండి ఆకుగా మొదలైన శక్తి, మనిషి శరీరములో ఆత్మగా గుర్తింపబడినది. చెట్టులోని ఆకుకు మూలికాశక్తి
ఉన్నట్లు చెప్పుచున్నాము. ఆకుకు మూలికాశక్తి, ఔషధీశక్తి ఉన్నదని అంటున్నాము. ఆకులో ఓషధీ శక్తి ఉన్నట్లు
నిరూపణకు కూడా వచ్చినది. ఆ మాటను అందరూ ఒప్పు కొంటారు. ఔషధీ అను శక్తి చివరకు మనిషిలోని ఓంకార
శక్తిగా మారి పోయినది. దీనినిబట్టి చెట్టులోని ఔషధీ శక్తియే మనిషిలోని ఓంకార శక్తి అని తెలియవలెను. అలాగే
చెట్టులోని మూలికా శక్తియే మనిషిలోని మూలశక్తిగా తెలియవలెను. అట్లే చెట్టులోని ఆకు శక్తియే మనిషిలోని
ఆత్మశక్తిగా అర్థము చేసుకోవలెను. చెట్టులో ఆత్మ లేక ఆకు ఎలా వ్యాపించివున్నదో అలాగే మనిషిలో ఆత్మశక్తి
వ్యాపించివున్నది. చెట్టులోనూ, మనిషిలోనూ ఆత్మ వ్యాపించివుండినా చెట్టు నిర్మాణమునకు, మనిషి శరీర నిర్మాణమునకు
ఎంతో తేడా కలదు. చెట్టుకు జ్ఞానేంద్రియములుగానీ, కర్మేంద్రియములుగానీ మనకున్నట్లు లేవు. చెట్టు శరీర భాగములు
ఇన్ని ఉన్నాయని చెప్పుటకు కూడా లెక్క తెలియదు. అందువలన మనకు అర్థమగుటకు మనిషి శరీరమును తీసుకొని
పరీశీలించి చూస్తాము.
మనిషి శరీరములో ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉండడమేకాక రెండు ముఖ్యమైన పనులు చేయుచున్నది.
శరీరములోనున్న పరమాత్మ భాగములు జీవాత్మ, ఆత్మలు రెండేకాగా, అందులో జీవాత్మ ఒక్కచోటే ఉంటూ, ఒకే పనిని
చేయుచుండగా, ఆత్మ శరీరమంతటా ఉంటూ రెండు పనులు చేయు చున్నది. మనిషి శరీరములోని 24 ప్రకృతి
భాగములను ఆత్మ కదలించి పనిని చేయుటకు శక్తినిచ్చి వాటి ద్వారా శరీర యంత్రాంగమును నడుపు చున్నది. అలా
శరీరమునకు చైతన్యమునిచ్చి శరీర భాగములను పని చేయించి మనిషిని జీవింపచేయుచున్నది. మనిషి మాట్లాడాలంటే
ఆత్మ మాట్లాడించుచున్నది. మనిషి చేయి అల్లాడించాలంటే ఆత్మే తనశక్తి చేత అల్లాడింపజేయుచున్నది. అలాగే
కనురెప్ప మూయాలన్నా, తెరువాలన్నా ఆత్మే పని చేయిస్తున్నది. అదే విధముగా శరీరములోని గుండెకొట్టు కోవాలన్నా,
ఊపిరితిత్తులు కదలాలన్నా దానిని ఆత్మ చైతన్యమే చేయిస్తున్నది. మొత్తము శరీరములోని ప్రతి చిన్న పనిగానీ,
శరీరము బయటి ఇంద్రియముల పనిగానీ, శరీరములోని అవయవముల పనిగానీ ఆత్మ చేతనే జరుగుచున్నది. ఆత్మ
కదలించకపోతే శరీరములో కదలికలు ఆగిపోవును. శరీరములో జీవుడున్నాలన్నా, ప్రాణమున్నాలనినా, తినిన ఆహారము
జీర్ణము కావాలనినా, శరీరములోని ప్రతిది ఆత్మయే చేయించుచున్నది. ఆత్మ వలననే అన్నీ జరుగుచున్నవి. శరీరమును
మొత్తము తన ఆధీనమునందుంచుకొని ఆత్మ శరీరమును కర్మప్రకారము ఆడించుచున్నది. శరీరములోని ఒక్కొక్క
భాగమునకు ఒక్కొక్క పని ఉండగా, 24 ప్రకృతి భాగములను కదిలించి పని చేయించుటే ఆత్మకు పనిగా ఉన్నది.
11

Page 12
ఈ విధముగా ఆత్మ కూడా శరీరములో ఒక పనిని చేయుచున్నది. ఆ విధముగా 24 గంటలు శరీరమును
మొత్తమును నడిపించుటకు ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. మనస్సు కూడా శరీరమంతా వ్యాపించి ఉండినప్పటికీ,
మనస్సు నిద్రలో శరీరమంతా లేకుండా ముడుచుకొని పోయి బ్రహ్మనాడిలో చేరిపోవుచున్నది. మనస్సు మెలకువలో
మాత్రము శరీరమంతా వ్యాపించివుండి నిద్రలో మాత్రము బ్రహ్మనాడియందు ఒకచోట చేరి పోవుచున్నది. కానీ ఆత్మ
మాత్రము నిద్రలోనూ, మెలకువలోనూ పని చేయుచు ఎల్లప్పుడు శరీరమంతా నిండి ఉన్నది. మనస్సు నిద్రలో పని
చేయదు. కానీ ఆత్మ నిద్రలోనూ, మెలకువలోనూ రెండు అవస్థలలో పని చేయుచున్నది. మనిషి పుట్టినప్పటినుండి
ఆత్మ ఎడతెరపిలేకుండా పని చేయుచునే ఉన్నది. ఒక్క క్షణము కూడా ఆత్మ విశ్రాంతి తీసుకోలేదు. ఆత్మకు విశ్రాంతి
అనునది ఎప్పటికీ లేదు. ఇట్లు ఎల్లప్పుడు ఆత్మ పని చేయడము ఆత్మకు ఒక పనిగానే లెక్కింపబడుచున్నది. అంతేకాక
ఆత్మకు రెండవ పనికూడా ఒకటికలదు. అది ఏమనగా! మనిషి మెలకువలో ఉన్నప్పుడు మనస్సు బాహ్యేంద్రియముల
విషయములను అంతరేంద్రియము లకు తెలుపుచుండునని చెప్పుకొన్నాము. మనస్సు శరీరములో బ్రహ్మనాడి యందు
నిద్రావస్థలో ఉండిపోవును అని కూడా చెప్పుకొన్నాము. మనిషి నిద్రపోవునపుడు బాహ్యేంద్రియముల విషయము
లోపలికి తెలియబడదు. నిద్రపోయినంతవరకు బయట ఏమి జరిగినది మనిషికి తెలియదు. నిద్రలో మనస్సు
ఇంద్రియముల వద్దలేదు, కనుక బయటి ఇంద్రియముల విషయ జ్ఞానము లోపలి బుద్ధికిగానీ, జీవునికి గానీ తెలియదు.
ఒక మనిషి నిద్రపోవునపుడు వానిని మరొక మనిషి పిలిచాడను కొనుము. అప్పుడు ఆ శబ్దము నిద్రపోవుచున్న
వాని చెవిలోనికి పోయింది. అక్కడ అది వినికిడిగా మారింది. అయితే ఆ వినికిడి విషయమును సేకరించి లోపలనున్న
బుద్ధికి తెలుపు మధ్యవర్తి అయిన మనస్సు నిద్రలో మునిగిపోయి బ్రహ్మనాడిలో ఉన్నది. కనుక వేరే మనిషి పిలిచిన
విషయము లోపలికి తీసుకొని పోవు మనస్సు లేదు కాబట్టి ఆ పిలుపు ఆ జీవునికిగానీ, అతని బుద్ధికిగానీ తెలియదు.
అటువంటి సందర్భములో నిద్రపోయిన వానిని పిలిచినా వాడు మేల్కొనుటకు అవకాశములేదు. వానికి పిలుపు
చేరలేదు, కనుక వాడు నిద్రనుండి లేవడు. అయితే దానికి విరుద్ధముగా నిద్రపోవు వానిని పిలువగానే వాడు లేస్తున్నాడు.
ఎవడో తనను పిలిచాడను విషయము లోపలి బుద్ధికి, జీవునికి చేరుచున్నది. మధ్యవర్తి అయిన మనస్సు లేనప్పుడు
పిలిచిన వార్తను ఎవరు లోపలికి చేర్చారు? అని యోచిస్తే వాస్తవముగా అది మనస్సు చేయవలసిన పనియే అయినా,
అక్కడ మనస్సుకు ఆ విషయము తెలియదు. మనస్సు అక్కడ లేనేలేదు. మనస్సు లేకపోయినా అత్యవసర సమయములలో
మనస్సు చేయు పనిని ఆత్మే చేయుచున్నది. ఆత్మ శరీరమంతా అన్ని అవయవముల వరకు వ్యాపించి ఉండుట వలన
చెవియొక్క శబ్దమును విని ఆ వినికిడి సమాచారమును మనస్సు చేరవేసినట్లు లోపలి జీవునికీ, బుద్ధికీ చేరవేసినది.
అందువలన మనస్సు లేకున్నా మనిషి మెలుకువలోనికి రాగలుగుచున్నాడు. ఈ విధముగా కొన్ని సమయములలో
మనస్సు తన పనిని చేయనప్పుడు, మనస్సు చేయు పనిని కూడా ఆత్మ చేయుచున్నది. అలా చేయడము ఆత్మయొక్క
రెండవ పనియగుచున్నది. ఇక్కడ ముఖ్యముగా పాఠకులు గ్రహించవలసిన విషయమేమనగా! ఇప్పుడు చెప్పిన ఆత్మ
పని మేము కల్పితము చేసి చెప్పినదని అనుకోవద్దండి. మాయ ప్రభావము వలన అలా అనుకొనుటకు అవకాశము
కలదు. అందువలన జాగ్రత్తగా గ్రహించమని చెప్పుచున్నాము. ఆత్మ రెండవ పని పూర్తి సత్యమైనది మరియు
శాస్త్రబద్ధమైనదని తెలియవలెను.
బయట ఎవరో పిలిచారను విషయమును ఆత్మ గ్రహించి లోపల బుద్ధికీ, జీవాత్మకు తెలుపగా, అప్పుడు మనస్సు
బ్రహ్మనాడిని వదలి శరీరమంతా వ్యాపించుకొనుచున్నది. అలా మనస్సు బయటికి రావడమే మనిషి మెలుకువ లోనికి
12

Page 13
రావడము. శరీరములో మనస్సు యొక్క పనినీ, అలాగే ఆత్మ యొక్క పనినీ గుర్తించగలిగితే సగము ఆధ్యాత్మికము
మనిషికి అర్థమైనట్లే. నిద్రపోవుచున్న మనిషి తనకు తెలియకుండానే ప్రక్కకు తిరిగి పడుకొను చున్నాడు. నిద్రపోవు
మనిషి తనకు తెలియకుండానే లేచి ఒకచోటనుండి పోయి మరొక చోట పడుకొనుచున్నాడు. ఇటువంటి పనులను ఆత్మ
లోపలి బుద్దికి సమాచారమును అందివ్వకుండా చేయుచున్నది. అందువలన నిద్రలో తాను ఏమి చేసినది నిద్రపోయిన
వానికి తెలియదు. మనిషి నిద్రపోవు చున్నప్పుడు బయటి విషయములను ఆత్మయే స్వీకరించి అవసరమైతే లోపలికి
తెలుపుచున్నది. అవసరము లేకపోతే తానే సరి చేయుచున్నది. ఉదాహరణకు నిద్రపోవువానికి చాలాసేపు ఒకేవైపు
పడుకోవడము వలన చేయి నొప్పి వచ్చిందనుకొనుము. అప్పుడు చర్మము తెలియజేయు నొప్పిని ఆత్మ స్వీకరించి
దానిని లోపలికి పంపకుండా తానే ప్రక్కకు తిరిగి పడుకొనునట్లు చేయుచున్నది. ఈ విధముగా నిద్రావస్థలో ఎవరైనా
పిలిస్తే అవసరమును బట్టి ఆ విషయమును లోపలికి పంపుచున్నది, మనస్సును మెలుకువలోనికి వచ్చునట్లు చేయుచున్నది.
ఈ తతంగము అంతయు మానవ శరీరములో జరుగుచున్నది. ఎవరికీ తెలిసినా, తెలియకున్నా మనిషి శరీరములో
నూటికి నూరుపాళ్ళు ఇదే విధముగా జరుగుచున్నది. మనిషి బయట ప్రపంచములో ఏ మతమునకు సంబంధించినవాడైనా,
లోపల జరుగు యంత్రాంగములో ఏమీ తేడా ఉండదు. ఒక ముస్లీమ్లోగానీ, క్రైస్తవునిలో గానీ, హిందువులోగానీ
అందరిలో జీవుడు, ఆత్మ, మనస్సు మొదలగు 26 శరీర భాగములున్నవి. అవి అందరిలో ఒకేలాగ పని చేయుచున్నవి.
ముస్లీమ్ కన్ను చూడగలిగితే, క్రైస్తవుని కన్ను వినే పనిని చేయదు. అన్ని మతములలోని మనుషుల కన్ను ఒకే పనిని
చేయగల్గుచున్నది. అందువలన మనకు మతాల భేదములున్నా ఆత్మకుగానీ, జీవాత్మకుగానీ, మిగత శరీర భాగములకు
గానీ ఏ మత భేదములు లేవు. అందరిలోను అన్నీ ఒకే పద్దతిగా పని చేయుచున్నవి. కర్మనుబట్టి మనిషి అనుభవము
వేరువేరుగా ఉండవచ్చును. కానీ శరీరములో అవయవముల పని మాత్రము ఒకే విధముగా ఉండును. మనిషి బ్రతికి
ఉన్నపుడే కాకుండా మనిషి చనిపోయినపుడుగానీ, అలాగే మనిషి పుట్టినప్పుడుగానీ, ఒక మనిషిలో ఏ తతంగము
జరుగుచున్నదో, సమస్త మతముల మనుషులలోను అదే జరుగుచుండును. కుల మతములను బట్టి గానీ, పేద
ధనికులను బట్టిగానీ ఆత్మ విషయములో తేడాలుండవు.
మనిషి అజ్ఞానము చేత మతములను సృష్టించుకొని, దేవుడు శరీరములో అమర్చిన విధానమును మరచిపోవుట
వలన, చావుపుట్టుకల విషయములో ఒక్కొక్క మతము ఒక్కొక్క విధముగా చెప్పుకొనుచున్నది. అన్ని మతములలో
దేవుడు ఒక్కడే అని పైకి చెప్పుకొనినా, లోపల మాత్రము మా దేవుడువేరనీ, మా దేవుడు చెప్పిన విధానమువేరని
అనుకొనుచుందురు. దేవుడు ఏ మతస్థునికైనా ఒకే జ్ఞానమును తెలిపాడు కానీ ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క
జ్ఞానమును చెప్పలేదు. సృష్టి ఆదిలో పుట్టిన ఇందూ మతము (హిందూమతము)నకు సంబంధించిన భగవద్గీతలో
దేవుడు భగవంతుని ద్వారా “పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు". అన్నాడు. ఆ మాట శరీరమును
ధరించిన మనుషులందరికీ వర్తించును. కొందరికి వర్తించి కొందరికి వర్తించదనుటకు వీలులేదు. శరీరముల పుట్టుక
గానీ, జీవితముగానీ, మరణముగానీ మానవులందరికీ ఒకే విధముగా ఉండును. వేరువేరు విధములుగా ఉండవని
ముందే చెప్పుకొన్నాము. భగవద్గీతలో దేవుడు ఏమి చెప్పాడో, అదే మిగత మత గ్రంథాలలో కూడా చెప్పబడివుంది.
అయితే దేవుడు అన్ని మతములలో చెప్పిన ఒకే జ్ఞానము మాయ ప్రభావము వలన వేరువేరు మతములలో వేరువేరు
బోధగా కనిపించినది. ఇది మాయ ప్రభావమని తెలియని మనిషి, దేవుడు ఎందుకు అలా చెప్పునని ఏమాత్రము
యోచించక మాయ చెప్పినట్లు మాట్లాడుచున్నాడు.
13

Page 14
ఉదాహరణకు మనిషియొక్క జనన మరణ జ్ఞానమును గురించి చూచితే, దేవుడు అన్ని మతములలోను ఒకే
విధముగా చెప్పియున్నాడను విషయమును మనిషి మరచిపోయాడు. ఇందూ (హిందూ) మతములో జన్మలున్నాయని
భగవద్గీతయందు చెప్పియుంటే, ముఖ్యమైన ఇస్లామ్, క్రైస్తవ మతములలో తిరిగి పుట్టడము అన్నది లేనేలేదు అని
చెప్పుచున్నారు. ఎంతో తెలివైన వారు కూడా జన్మల విషయమువద్దకు పోయేటప్పటికి, కొంతైనా యోచించకుండా
గ్రుడ్డిగా మాట్లాడుచున్నారు. ఎంతో ఆత్మజ్ఞానము కల్గిన ప్రవక్తలు చెప్పిన మాటలను అర్థము చేసుకోలేకపోవుచున్నారు.
ప్రవక్తలు చెప్పిన మాటలను బాగా విశధీకరించుకొని అర్థము చేసుకోగల్గితే వారు జన్మలున్నాయనే చెప్పారు గానీ,
జన్మలు లేవని చెప్పలేదు. భూమిమీద పుట్టిన మనుషులందరూ ఒకే జ్ఞానము కల్గియున్నారని చెప్పలేము. కొందరిలో
దైవజ్ఞానమున్నది. కొందరిలో దైవజ్ఞానమను పేరుతో మాయ జ్ఞానమున్నది. ఏది దైవ జ్ఞానమో, ఏది మాయ జ్ఞానమో
మనుషులు గుర్తించలేనప్పుడు, నాది నిజమైన దైవజ్ఞానము అని ఒక మతస్థుడు అంటే, మరియొక మతస్థుడు నీది
మాయజ్ఞానము, నాకు తెలిసినదే నిజమైన దేవుని జ్ఞానము అంటాడు. వారిద్దరి మాటలు వినేవానికి ఎవరిది అసలైన
దైవ జ్ఞానమో అర్థము కాకుండా పోవుచున్నది. ఇటువంటి సందర్భములో అసలైన దైవజ్ఞానమేదో, ఏది సరియైన
జ్ఞానము కాదో అందరికీ దృష్టాంతముగా తెలియునట్లు దేవుడు చేయుచున్నాడు. దానినిబట్టి అసలైన దైవజ్ఞానమును
గుర్తించవచ్చును.
ఇస్లామ్లో పునర్జన్మలు లేవు అని బోధించబడినది. దానిని అందరూ అలాగే చెప్పుకొనుచున్నారు. తిరిగి జన్మలు
లేవు అనుమాట ప్రతి ముస్లీమ్ చెప్పగలుగుచున్నాడు. ప్రతి ముస్లీమ్ తాము విన్నదానిని, లేక తాము తమ మతపెద్దల
ద్వారా తెలుసుకొన్న దానినే పూర్తి విశ్వాసముతో నమ్మి, జన్మలు లేవు అని ధైర్యముగా చెప్పుచున్నారు. తమ మత
పెద్దలు చెప్పిన దానినే వారు చెప్పుచున్నారు. మత పెద్దల మాటమీద విశ్వాసముతో వారి మాటలను నమ్మి చెప్పడము
తప్ప, వారు చూచి చెప్పినది కాదు. ఇక్కడ ఒక సూత్రమును మనము చెప్పుకొంటే ఇలా కలదు. నమ్మకము అనునది
సత్యముకాదు, అట్లని అసత్యమూకాదు. నమ్మకము సత్యమూ కావచ్చును, అసత్యమూ కావచ్చును. మత పెద్దలు
చెప్పిన మాటను ప్రతి ముస్లీమ్ విశ్వసించి జన్మలు లేవు అని చెప్పుచున్నారు. అలా విశ్వసించడములో తప్పులేదు.
ఇస్లామ్ మార్గములో ముఖ్యమైనది విశ్వాసము. దేవున్ని పూర్తి విశ్వసించిన వాడే నిజమైన ముస్లీమ్. అలాగే దేవున్ని
పూర్తి నమ్మినవాడే ఇందువని చెప్పువచ్చును. దేవుడు కనిపించువాడు కాదు. కనుక దేవున్ని చూడకనే నమ్మితీరాలి.
కానీ మనుషులు చెప్పు దైవజ్ఞానమును ఆలోచించి నమ్మాలి. ఆలోచించకుండ నమ్మితే అది మూఢనమ్మకమై,
అసత్యమగుటకు అవకాశము గలదు.
దేవుని మాటను దేవధూత ద్వారా ప్రవక్త విని అదే విషయమును మనుషులకు చెప్పాడు. ప్రవక్త దేవుని మాటను
పూర్తి విశ్వసించి దానిని ఆయన జీర్ణింపచేసుకొని దానినే మనకు చెప్పాడు. ఇస్లామ్ అంటే విశ్వాసము. విశ్వాసము
అంటే ఇస్లామ్ అని చెప్పవచ్చును. దేవుని జ్ఞానమును ధూతద్వారా వినిన ప్రవక్త, దేవుడు తెలిపిన విషయమునే
ప్రజలకు చెప్పాడు. ప్రవక్త చెప్పిన విషయము దేవుడు చెప్పినది కావున నూటికి నూరుపాళ్ళు సత్యము. కానీ ప్రవక్త
చెప్పిన సత్యమును మనిషి అర్థము చేసుకోవడములో పొరపాటుపడినాడు. ప్రవక్త చెప్పిన దేవుని మాటను సైతాన్
(మాయ) మనిషికి వేరు విధముగా అర్థమగునట్లు చేసినది. అంతవరకు సత్యముగానున్న దేవుని వాక్కు అసత్యముగా
ప్రచారమైనది. క్రైస్తవ మతములోనూ సాతాను ప్రభావము వలన ఏసు ప్రవక్త చెప్పిన జ్ఞానమును క్రైస్తవులు సరిగా
అర్థము చేసుకోలేక పోయారు. ఇస్లామ్లోనూ క్రైస్తవములోనూ ప్రవక్తలు చెప్పిన దేవుని వాక్యములను కొన్నింటిని
14

Page 15
మాత్రము అర్థము చేసుకోలేక పోయారు. ఇక హిందూ మతములో చూస్తే కృష్ణుడు చెప్పిన దైవవాక్యములు ఒక్కటి
కూడా మనుషులు అర్థము చేసుకోలేక పోయారు. యజ్ఞములు, వేదాధ్యయనములు, దానములు, తపస్సులు దేవుని
మార్గము కాదని చెప్పినా, బహుదేవతారాధనల వలన సృష్ఠికర్తయిన పరమాత్మను చేరలేరని చెప్పినా, ఆ మాటలను
మనుషులు అర్థము చేసుకోలేక, మాయ మార్గమును అవలంభించుచూ, ఇదే దేవుని మార్గ మంటున్నారు. హిందూమతము
మొత్తముగా మాయలో పడిపోతే ఇస్లామ్, క్రైస్తవములు జన్మల విషయములలో మాత్రము ప్రవక్తలు చెప్పిన సూత్రము
లను అర్థము చేసుకోలేక పోయారు.
ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏసు చెప్పిన మాటను తీసుకొని చూస్తాము. ఆయన చెప్పిన
భావము నేటి క్రైస్తవులకు ఎంతవరకు అర్థమైనదో తెలిసిపోతుంది. మత్తయి సువార్త, 12వ అధ్యాయము, 30,31,32,
వాక్యములను గమనిస్తాము. 30) “నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు
చెదరగొట్టు వాడు, 31) కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా! మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణము వారికి
క్షమించబడును. కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. 32) మనుష్య కుమారునికి విరోధముగా
మాటలాడు వానికి పాపక్షమాపణ కలదుగానీ, పరిశుద్దాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ
రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు.
ప్రవక్త ఏసు ప్రభువు చెప్పిన మాటలలో 32వ వాక్యమున స్పష్టముగా ఒకరకమైన పాపములను అనుభవించుటకు
రెండు యుగముల కాలము పట్టునని చెప్పడమైనది. దానిలో ఒక రక పాపమునకే రెండు యుగముల కాలము మనిషి
బ్రతికి పాపమును అనుభవించవలసి వున్నది. ఒకే శరీరముతో, ఒకే జన్మలో ఏ మనిషి ఒక యుగకాలము కూడా
ఉండలేడు. కొన్ని లక్షల సంవత్సరములు ఒక్కొక్క యుగము ఉండగా, రెండు యుగము లంటే ఎంత కాలమో
అర్థమగుచున్నది. ఒక జన్మలో కనీసము నూరు సంవత్సరములు కూడా బ్రతకలేని మనిషి, ఒకే జన్మలో రెండు
యుగములు ఉండగలడా? ఉండలేడు. అతడు ఎన్నో వేల జన్మలు ఎత్తితేగానీ రెండు యుగములు అయిపోవు. దీనినిబట్టి
దైవసంబంధ పాపమును అనుభవించుటకు మనిషి కొన్ని లక్షల జన్మలుగానీ లేక కొన్ని వేల జన్మలుగానీ పొందవలసి
వున్నదని అర్థమగుచున్నది. అయితే ముఖ్యమైన ఈ మాటలు లేక పై వాక్యములు క్రైస్తవులకుగానీ, క్రైస్తవ బోధకులకుగానీ
సాతాన్ ప్రభావము వలన అర్థము కాలేదని చెప్పవచ్చును. పరిశుద్ధ బైబిలులో ప్రభువు మాటలను బట్టి జన్మలున్నాయనియే
స్పష్టముగా తెలియుచుండగా, జన్మలు లేవని క్రైస్తవులు చెప్పడము ప్రభువు మాటను వక్రీకరించినట్లు కాదా?
స్వర్గ నరకములను మాటలు రెండే మనిషిని మాయమార్గములోనికి తోసివేస్తున్నవి. ప్రతి మతములోను స్వర్గ
నరకములనునవి ఉన్నాయని చెప్పుకొనుచున్నారు. కానీ ఈ రెండిటిని ఎవ్వరూ చూడలేదు. ఏ మతస్థునికీ అవి
ఎక్కడున్నదీ, ఎంత దూరములో ఉన్నదీ తెలియదు. స్వర్గ నరకములను వాటిని అన్ని మతముల ప్రవక్తలు చెప్పినా,
నరకములో బాధలు, స్వర్గములో సుఖములున్నవని చెప్పినా, ఏవి ఎక్కడున్నదీ, నీకు ఎంత దూరములోనున్నదీ చెప్పలేదు.
మనిషి వాటి విషయములో ఇంతగా పొరపాటు పడుతాడని తెలిసియుంటే వారు స్వర్గ నరకములను గురించి ఇంకా
వివరముగా చెప్పెడివారు. స్వర్గ నరకముల మాట నిజమే, అవి ఉన్నాయని చెప్పిన మాట నిజమే, అవి ఉండుట కూడా
నిజమే. కానీ అవి ఎక్కడున్నాయను విషయములో అన్ని మతములు మాయలో పడిపోయినవి. స్వర్గ నరకముల
అవగాహనలో బోధకులు సహితము పొరపాటుపడి పోయారు. వారి మాటలు విను మనుషులు కూడా వారి మార్గమునే
15

Page 16
పొరపడిపోయారు. ప్రవక్తలు చెప్పినది ఒక ఉద్దేశమైతే మనము అర్థము చేసుకొన్నది మరొక ఉద్దేశము అయినది.
ఇట్లు స్వర్గ నరకములనునవి మొత్తము అన్ని మతములలోను అర్థము కాకుండా పోయాయి. ఒక్క విషయములో దారి
తప్పిపోతే, దానితో అనుసంధానమైన జ్ఞాన విషయములన్నీ దారి తప్పిపోవును. అలా జ్ఞాన విషయముల అవగాహనలో
దారి తప్పిపోయిన మనుషులలో అన్నిటికంటే ముందున్నవారు హిందువులు, తర్వాత క్రైస్తవమతములోనివారు. దాని
తర్వాత ఇస్లామ్ మతములోనివారని చెప్పవచ్చును. ఇస్లామ్ మతములో చాలా వరకు ప్రవక్త చెప్పినట్లే అర్థము చేసుకోగల్గినా,
ఒక్క స్వర్గ నరకముల వద్ద మాత్రమే తప్పుదోవ పట్టి పోయారు.
ప్రవక్తలు చెప్పిన మాటలలో స్వర్గ నరకములు భూమిమీదనే ఉన్నాయని, దేవుడు పుణ్యము చేసుకొన్న వారికి
స్వర్గమును, పాపమును చేసుకొన్న వారికి నరకమునూ ఇక్కడే అనుభవించునట్లు ఏర్పాటు చేశాడనీ, దాని ప్రకారము
కర్మ ఫలితములను మనిషి భూమిమీదనే అనుభవిస్తున్నాడను ఒక్క విషయమును తెలుసుకోగల్గితే, ఆధ్యాత్మికరంగములోగల
ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరికిపోవును. లేకపోతే మన జ్ఞానమంతా సంశయాలతో కూడు కొన్నదై, సరియైన జవాబు
లేనిదై ఉండును. అందువలన ఒక్కమారు స్వర్గ నరకములన్నీ ఇక్కడే భూమిమీదనే ఉన్నవనీ, వాటిని మనము నిత్యము
అనుభవిస్తున్నామనీ, కళ్ళ ఎదుటేనున్న స్వర్గ నరకములను అందరము చూడగల్గుచున్నామని గ్రహించగలిగితే, నిజమైన
జ్ఞానము మనిషికి తెలిసి పోవును. అయితే మాయ మాత్రము అలా అర్థము కాకుండ చేయుచూ, ఇప్పుడు మేము
చెప్పుచున్నమాట పూర్తి అసత్యమని నమ్మునట్లు చేయగలదు. స్వర్గ నరక విషయములలో మనుషులను పూర్తి తప్పుదారి
పట్టించిన మాయ కొన్ని మతములలో దైవసన్నిధియైన మోక్షమును లేక దైవమందు ఐక్య మవడమును స్వర్గముగా
భావింపచేసింది. స్వర్గ నరకములు వేరనీ, అవి మానవునికి సుఖదుఃఖములను అందించునవనీ, ముక్తి లేక మోక్షము
అనునది వేరనీ అది సుఖదుఃఖలకు అతీతమైన దైవసాన్నిహిత్యమని తెలియని మనుషులు మోక్షమును కూడా స్వర్గమని
చెప్పుకొంటున్నారు. మనిషిని ఇన్ని తప్పుదారులు పట్టించిన మాయ, చావుపుట్టుకల విషయములో పూర్తిగా మభ్యపెట్టి
పునర్జన్మయే లేనట్లు, ఉన్నది ఒకే జన్మ అన్నట్లు చేసింది. ఇటువంటి రహస్యములు మనిషికి ఏమాత్రము ఎప్పటికీ
తెలియకుండుటకు మనిషి ఆధ్యాత్మిక ధ్యాసనంతా బయట ప్రపంచములోనే లగ్నమగునట్లు చేసింది. శరీర అంతరంగమందు
జీవుడైన తానువేరనీ, ఆత్మ వేరని, అలాగే మనస్సు, బుద్ధి వేరువేరుగా పని చేస్తున్నాయని, అలా అంతరంగమందు
జరుగు విధానము తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికమనీ, అలా తెలుసు కొన్నపుడే దైవముయొక్క జ్ఞానము, దాని
ధర్మములు తెలియుననీ, అలా శరీరాంతర్గతమును తెలుసుకోగల్గితే, అన్ని ప్రశ్నలకు సంపూర్ణమైన జవాబులు దొరుకునని,
మనిషి తెలుసుకోలేక పోవడము వలన మనిషి మతము అను ఉచ్చులో చిక్కుకొని, మాయ అను దానిని గుర్తించలేక
తన్ను తానుగానీ, తాను దైవమునుగానీ గుర్తించలేక పోవుచున్నాడు.
అన్ని మతములలోని ప్రవక్తలు దైవమును గురించి తెలియజేసినా, వారు చెప్పిన జ్ఞానమును అర్థము చేసుకోలేక
ప్రవక్తలకు కూడా మతమును అంటగట్టి మా మతము వేరు అంటున్నారు. ఇంతవరకు ఏ ప్రవక్త చెప్పినా ఆ దైవ
విషయము విశ్వమానవులకు అందరికీ వర్తించునదిగా చెప్పారు గానీ, వారు మతము అని పేరుపెట్టి చెప్పలేదు.
దేవుడు ప్రవక్తల ద్వారా తన జ్ఞానమును చెప్పించితే, మాయ మనుషులను తన పక్షములో ఉంచు కొనుటకు, దైవమువైపు
ఎవరినీ పోకుండా చేయుటకు, వేరువేరు కాలములలో చెప్పిన ప్రవక్తలు, వేరువేరు మతములను బోధించారని అర్థమగునట్లు
చేసినది. మొదట ఈ విధముగా మొదలైన మాయ ప్రభావము మనిషిని జీవితాంతము తన ప్రభావములోనే చిక్కుకొన్నట్లు
చేసినది. అందువలన మనిషి బాహ్యముగా ఎంత మేధావి అయినా, అంతరంగములో దేవుని విషయమునందు పూర్తి
16

Page 17
తెలివి తక్కువవాడై పోయాడు. కొందరు ఆధ్యాత్మిక విద్యలో కూడా మేధావులుగా కనిపించినా, అన్ని మతములలోని
మూల గ్రంథములనూ చదివి ప్రతి పేజీని తమ జ్ఞాపకములో పెట్టుకొనినా, వేదములలోని మంత్రమునూ, గీతలోని
శ్లోకములనూ, పరిశుద్ధ బైబిలులోని వాక్యములనూ, పవిత్ర ఖురాన్లోని ఆయత్లను సులభముగా చెప్పగలిగినా, అటువంటి
వారు కూడా మతముల మాయలో చిక్కుకొన్నారు. కానీ మతాతీతమైన దేవుని జ్ఞానమును గుర్తించలేకున్నారు. శరీర
అంతరంగములో దేవుడు సర్వులకు అమర్చిన విధానమును తెలియలేకున్నారు. తనను గురించి తాను ఎవరు అని
చూచుకోలేక పోవుచున్నారు. నిత్యము మనిషిలో జరుగు తతంగమును నడుపువాడెవరో తెలియలేకున్నారు. శరీరములో
తన పాత్ర స్వల్పమైనదా లేక గొప్పదా అని గుర్తించలేకపోవుచున్నారు. అలా లోపలి విధానము తెలియనపుడు, సృష్ఠి
తర్వాత శరీరములోపల జరుగు చావును గురించి గానీ, సృష్టి ఆదిలో జరిగిన పుట్టుకను గురించిగానీ, తెలియని స్థితిలో
మనిషి ఉండిపోవడము వలన, జగతిలో ఇంతవరకు పునర్జన్మ విషయము రహస్యముగా మిగిలిపోయినది.
ఆ
దేవుడు తన జ్ఞానమును మనిషికి తెలియజేయాలని ఎన్నోమార్లు భూమిమీద తన జ్ఞానమును ఇందూ మతములో
(హిందూ మతములో) భగవంతుని ద్వారా ప్రకటించాడు. అట్లే మిగతా మతములలో ప్రవక్తల ద్వారా తెలియజేశాడు.
అయినా మాయ మానవున్ని ఎప్పటికప్పుడు దేవుని జ్ఞానమునకు దూరము చేస్తూ పోయింది. అందువలన మనిషి
మొదట తన చావు పుట్టుకలను గురించి తెలుసుకోలేకపోయాడు. ప్రవక్తల ద్వారా పునర్జన్మ రహస్యమును చెప్పించినా,
మనిషి గ్రహించుకోలేక పోవడము వలనా, జన్మల విషయము అత్యంత ప్రాముఖ్యమైన దానివలనా, ఎటు తిరిగి
విషయమును మనిషికి తెలియజేయు నిమిత్తము, మనిషి శరీరము లోని ఆత్మ తానే స్వయముగా తెలియజేయాలను
విధానమును ఎన్నుకొన్నది. ఆత్మే స్వయముగా పునర్జన్మల విషయమును జీవాత్మలైన మనుషులకు తెలియబరచుటకు
ఒక కారణము ఉన్నది. పరమాత్మ పని చేయడు, విషయమును తెలుపడు. పరమాత్మ అంశ అయిన భగవంతుడు
చెప్పిన మాటను ప్రకృతి జనితమైన మాయ ఖండించి జన్మలు లేవని బోధిస్తుంది. మిగతా దైవజ్ఞాన విషయములన్నియు
బయట అనుభవరీత్యా తెలియబడుటకు అవకాశము కలదు. వాటినన్నిటిని బ్రహ్మవిద్యా శాస్త్రము నిరూపించగలదు.
ఒక్క జన్మల విషయము ఎవరికీ ప్రత్యక్ష ప్రమాణముగా కనిపించదు. అందువలన ఆత్మే స్వయముగా పునర్జన్మల
విషయమును నిరూపణకు తీసుకరావలసిన అవసరము ఏర్పడినది. ఆత్మ శరీరములో రెండు కార్యములను చేయుచున్నదని
మనము ముందే చెప్పుకొన్నాము. శరీరము లోని అంతర్గత భాగములను వాటి కార్యములను తెలుసుకోగల్గినపుడే
అసలైన ఆధ్యాత్మికమగునని కూడ చెప్పుకొన్నాము. అంతేకాక మనిషిలోని మనస్సు, ఆత్మ ప్రత్యేకించి రెండు పనులను
చేయుచున్నవని కూడా చెప్పుకొన్నాము. శరీరములో మనస్సు, ఆత్మ రెండు పనులు చేయడము శాస్త్రబద్ధమూ, వాస్తవమూ
అయినప్పటికీ మనిషి మస్తకములో ఆత్మమీద ఒక ప్రశ్న వస్తున్నది. అదేమనగా! శరీరములో ప్రకృతి సంబంధమైన
మనస్సు, పరమాత్మ సంబంధమైన ఆత్మ రెండూ రెండు పనులను చేయుచున్నపుడు ప్రకృతి సంబంధ మనస్సు కూడా
ఆత్మతో సమానమైన పని చేసినట్లగుచున్నది కదా! అప్పుడు మనస్సుకంటే ఆత్మ ఎక్కువ పని చేయలేదని, మనస్సు
చేయగలిగినన్ని పనులనే చేయుచున్నదనీ, అందువలన మనస్సుతో సమానముగా ఆత్మ, ఆత్మతో సమానముగా మనస్సు
పని చేసినపుడు మనస్సు కంటే ఆత్మ గొప్పదని చెప్పలేము కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చును.
ఆ ప్రశ్నకు జవాబును మనము ఈ విధముగా చెప్పుకోవచ్చును. ప్రకృతికంటే పరమాత్మ పెద్దది లేక గొప్పదని
చెప్పుకొన్నట్లు, ప్రకృతి సంబంధమైన మనస్సుకంటే పరమాత్మ సంబంధమైన ఆత్మ ఎప్పటికైనా గొప్పదే. మనస్సుకంటే
ఆత్మ గొప్పదని చెప్పుటకు ఒక కారణమున్నది, అదేమనగా! ఒకని జీవితములో మనస్సు, ఆత్మ రెండూ రెండు పనులనే
17

Page 18
చేయుచున్ననూ, ప్రపంచములో ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు, ఎవనిలోనో ఒకనిలో ఆత్మ ప్రత్యేకించి మనస్సుకంటే
ఎక్కువగా మూడవ పనిని కూడా చేయుచున్నది. మనస్సుకంటే ఎక్కువగా మూడవ పనిని కూడా ఆత్మ చేయడము
వలన ఆత్మ మనస్సుతో సమానమైనది కాదనీ, శరీరములో అన్నిటికంటే గొప్పది ఆత్మనీ చెప్పవచ్చును. అందరి
జీవితములో మూడవ పని అవసరములేదు, కావున ఆత్మ మనస్సుతో సమానముగా రెండు పనులనే చేయుచున్ననూ,
అవసరమొచ్చినపుడు మూడవ పనిని చేయు సామర్థ్యమును కల్గియున్న దానివలన ఆత్మ శరీరములో అన్ని భాగములకంటే
గొప్పదేనని చెప్పవచ్చును.
సర్వసాధారణముగా ఆత్మ శరీరములో పని చేయుచున్నదని గానీ, రెండు పనులను చేయుచున్నదనిగానీ తెలియని
మనుషులు కొందరుండగా, జీవాత్మ, పరమాత్మకాక ప్రత్యేకించి ఒక ఆత్మ ఉన్నదని తెలియనివారు ఎందరో ఉన్నారు.
ఆత్మ ఉన్నదను విషయము 95 శాతము ప్రజలకు తెలియదు. అతి కష్టము మీద ఒక ఐదు శాతముమందికి ఆత్మంటూ
ఒకటున్నదని తెలిసివుండినా, అందులో ఎవరికీ ఆత్మ ఎల్లప్పుడూ రెండు పనులను చేయుచున్నదనిగానీ,
అవసరమొచ్చినప్పుడు మూడవ పనిని కూడా చేయగల్గుననిగానీ తెలియదు. అంత లోతుగా తెలుసుకొనుటకు పెద్దలైన
ప్రవక్తలు కూడా ఆత్మ విషయమును అంతలోతుగా ఎక్కడా చెప్పలేదు. ఒక్క భగవద్గీతలో మాత్రమే భగవంతుడు
చెప్పిన జ్ఞానములో ఆత్మ ఎంత గొప్పదో తెలిసిపోవుచున్నది. అయితే గీత ఎవరికీ అర్థము కాకుండాపోయిన దానివలన
ఆత్మ కూడా ఎవరికీ అర్థముకాలేదు. అలాగే శరీరములో దాని కర్తవ్యమేమిటో కూడా తెలియకుండా పోయినది. ఆత్మ
చేయగలుగుచున్న మూడవ పని ఏమిటో ఇపుడు తెలుసుకొందాము.
ఆత్మ చేయగలుగు మూడు పనులలో మొదటి దానిని ఎల్లప్పుడు ఒక్కక్షణము కూడా తీరిక లేకుండా చేయుచున్నది.
ఆత్మ యొక్క మొదటి పని సృష్టి ఆదిలో (ప్రభవములో) మొదలై సృష్టి అంత్యము (ప్రళయములో) వరకు ఒక్క సెకండు
కాలము కూడా ఊరక ఉండక జరుగుచుండును. ఎడతెరపిలేని కార్యమును ఆత్మ ఒక్కటే చేయగల్గుచున్నది. ఈ
విషయము ఎవరికీ తెలియకున్నా ప్రపంచములో జరుగు ప్రతి కార్యము ఆత్మ చేతనే జరుగుచున్నది. ఆత్మ అన్ని
శరీరములలో ఉండి అహర్నిశలు పని చేయు చున్నది. మీకు తెలిసినా తెలియకపోయినా ప్రపంచములో ఏ జీవరాసి
చేయుచున్న పనిగానీ అది ఆత్మ చేయునదే! జీవరాసులు మేము చేయుచున్నా మనుకొను ప్రతి కార్యము ఆత్మ చేయునదేగానీ,
జీవులు చేయడము లేదు. విశ్వములో జరుగు పని ఏదైనా ఆత్మే చేయుచున్నదని తెలియక పోవడమే పెద్ద
అజ్ఞానమగుచున్నది. ఆత్మ చేయు మొదటి పనిని తెలుసుకోగలిగితే మనిషి కర్మయోగి అయిపోగలడు. ఒక మనిషి
కర్మయోగి అగుటకు ఏ సాధన అవసరములేదు. బ్రహ్మయోగమును సాధించుటకు మనిషికి సాధన అవసరముగానీ,
కర్మయోగమును సాధించుటకు సాధన పనికి రాదు. ఎప్పుడైతే మన శరీరములో జీవునితో పాటు ఆత్మ ఒకటున్నదనీ,
అదియే చిన్న, పెద్ద మరియు శరీరము లోపల, శరీరము బయట పనులను చేయు చున్నదని తెలిసి, ఆ విషయము
ఎల్లప్పుడు జ్ఞాపకము ఉంటే, ఏ మనిషి అయినా కర్మయోగి కాగలడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన కర్మయోగ
సూత్రము ఇదియే. కర్మయోగము కొరకు సాధన చేయమనీ, ధ్యానము చేయమనీ గీతలో ఎక్కడా చెప్పబడలేదు.
సాధన చేయవలసినది బ్రహ్మయోగము కొరకు మాత్రమేనని జ్ఞప్తికుంచుకోవలెను. ప్రస్తుతకాలములో ఎందరో ధ్యానము
చేయుచున్ననూ, వారికి యోగములు ఎన్ని విధములో తెలియదు, వారు చేయుచున్న ధ్యానము ఏ యోగమునకు
సంబంధించినదో కూడా తెలియదు. వారు చేయు సాధన విషయమే వారికి సరిగా తెలియదు, ఎవరో చెప్పితే దాని
ప్రకారము చేయుచుందురు. అటువంటి వారికి శరీరము బయట చేయు సాధన విషయమే సరిగా తెలియనపుడు,
18

Page 19
లోపలనున్న మనస్సు విషయముగానీ, దానికంటే మించిన ఆత్మ విషయముగానీ ఏమాత్రము తెలియదు. ఆత్మ విషయము
తెలియనపుడు అది ఎన్ని పనులు చేయుచున్నదో, ఎలా ఉన్నదో, ఎలా తెలియగలరు? అందువలన ఆత్మ వలన
ఎల్లప్పుడూ జరుగు మొదటి పనిగానీ, అప్పుడప్పుడు జరుగు రెండవ పనిగానీ, ఎవరికీ తెలియకుండా పోయినది. ఇక
మూడవ పని ఏమిటో కూడా తెలియదనియే చెప్పవచ్చును.
ఇప్పుడు అవకాశము దొరికింది కాబట్టి మీరు నన్ను వేగముగా ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా!
భూమిమీద ఎవరికీ తెలియని ఆత్మ యొక్క మూడవ పని మీకెట్లు తెలిసినది? ఎవరికీ తెలియదని మీరే చెప్పు చున్నప్పుడు,
దానిని మీరెలా చెప్పగలుగుచున్నారు? అని ప్రశ్నించవచ్చును. దానికి నేను సూటిగా చెప్పు సమాధానము ఏమనగా!
ఎవరికీ తెలియని దానిని నేను చెప్పడము కూడా ఒక పనియే కదా! ఆ చెప్పడము అను పనిని చేయుచున్నది నేనని
మీకు పైకి తెలిసినా, నాకు మాత్రము ప్రతి పనినీ చేయునది ఆత్మయనీ, నేను కాదనీ బాగా జ్ఞాపకమున్నది. నేనున్న
శరీరములో నాకు తోడుగా ఒకడున్నాడనీ, వాడే ఈ శరీరమునకు అధిపతియనీ, అతను చేయనిదే ఏ పనీ శరీరములో
జరగదనీ, వాడే నా పొరుగువాడనీ, వానినే ఆత్మ అంటున్నామనీ చెప్పుచున్నాను. నేను చేయని పనిని నేనే చేశానని
చెప్పడము తప్పుకాదా! అటువంటి తప్పును నేను ఎప్పుడూ చేయను. అలా చెప్పితే నా పొరుగు వానిని నేను మోసము
చేసినట్లు కాదా! ఆత్మ చేసిన పనిని జీవాత్మ నేనని అజ్ఞానము చేత చెప్పడము ఆత్మను అవమానపరిచినట్లగును. దానినే
ఆత్మద్రోహము అంటాము. నేను అలా అందరివలె ఆత్మద్రోహిని కాను. ఎవరికీ తెలియని ఆత్మ రహస్యము ఆత్మకే
తెలుసు. కావున ఆత్మే తన మూడవ పనిని చెప్పుచున్నది, కానీ నేను ఎంతమాత్రము కాదు. శరీరములో జరిగెడి
పనులను బుద్ధి ద్వారా చూస్తూ, వాటిని అనుభవించడమే నా పని. అంతే తప్ప మిగతా పనులన్నీ ఆత్మే చేయుచున్నది.
ఆత్మయొక్క మూడవ పనిని కూడా ఆత్మే నేనున్న శరీరము ద్వారా తెలియజేయుచున్నది.
తెలియజేయుచున్నది.
మనిషి సజీవ శరీరములో ఎల్లకాలము జరుగునది ఆత్మయొక్క మొదటి పనికాగా, అప్పుడప్పుడు జరుగునది
ఆత్మయొక్క రెండవపనికాగా, ఎన్నో జన్మలలో ఒకమారు జరుగునది ఆత్మ యొక్క మూడవ పనిగా చెప్పుకొన్నాము.
జీవునికి పునర్జన్మలున్నాయని తెలియజేయు నిమిత్తము ఆత్మ పని చేయడము మూడవ పని అగుచున్నది. ఆత్మ మూడవ
పని చేయకపోతే పునర్జన్మలు ఉన్నాయని చెప్పుటకు ఆధారము లేకుండా పోతుంది. అందువలన ఉన్న సత్యమును
తెలుపుటకు, "ధృవం జన్మ మృతస్యచ" అను శాస్త్రవచనము నిరూపణగా తెలియుటకు ఆత్మ తన శరీరములో మూడవ
పనిని చేసి చూపించింది. అలా ఆత్మ చేసిన మూడవపనిని విశదీకరించుకొని చూస్తాము. భగవద్గీతలో జ్ఞానయోగము
ఐదవ శ్లోకములో “బహూనిమే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప” “అర్జునా!
నాకు ఎన్నో జన్మలు కలిగాయి, నీకు అట్లే ఎన్నో జన్మలు కలిగాయి. నాకు కలిగిన జన్మలన్నీ నాకు తెలుసు, కానీ నీకు
కల్గిన జన్మలు నీకు తెలియవు" అని కృష్ణుడు అర్జునునకు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ మనుషులే
అయినా, ఇద్దరిలోనూ మనస్సు, ఆత్మ రెండూ ఉండి వాటివాటి పనిని అవి చేస్తూ ఉండినా, అర్జునునకు తెలియని గత
జన్మల విషయములు కృష్ణునికి ఎలా తెలిసాయి అని ప్రశ్న రాకతప్పదు. అలా వచ్చిన ప్రశ్నకు జవాబును తెలుసుకొంటే,
అర్జునుని శరీరములోని ఆత్మ ఆ శరీరములో రెండు పనులనే చేయుచున్నదని తెలియుచున్నది. అందరి శరీరములో
చేయు విధముగనే అర్జునుని శరీరములో కూడా ఆత్మ రెండు పనులను చేయుచుండుట వలన, ఎవరికీ తమ గత జన్మ
విషయములు తెలియనట్లు అర్జునునకు కూడా గడచిపోయిన జన్మల విషయము తెలియలేదు. శ్రీకృష్ణుని శరీరములోని
19

Page 20
ఆత్మ తన మూడవ పనిని కూడా చేయడము వలన కృష్ణునికి తన గత జన్మ విషయములన్నియు తెలిసి పోయినవి.
అందువలన కృష్ణుడు వెనుకటి జన్మలన్నీ నాకు తెలుసు అన్నాడు.
ఒక మనిషి శరీరములో ఆత్మ ఎల్లప్పుడు పని చేస్తూవుండుట వలన, మనిషి జీవితములోని ప్రతి చిన్న విషయముతో
సహా అన్ని విషయములు ఆత్మకు తెలుసు. మనిషి జీవితములో ఎల్లకాలము అన్ని పనులనూ ఆత్మ చేయుట చేత
మనిషి జీవితములో ఆత్మకు తెలియనిది ఏమీ లేదు. అలా అన్ని విషయములను తెలిసిన ఆత్మ, తనకు తెలిసిన వెనుకటి
జన్మ విషయములను మనిషి జీవితములో తానే స్వయముగా జ్ఞప్తివచ్చినట్లు తెలియజేయుచున్నది. అలా వెనుక జన్మల
విషయములను ఎప్పుడో ఒకప్పుడు, ఎవనికో ఒకనికి ఆత్మ తెలియజేయడమే ఆత్మయొక్క మూడవ పని. కృష్ణుని
శరీరములోని ఆత్మ గతజన్మల విషయములన్నిటిని కృష్ణునకు తెలియజేసినది కావున ఆయన నా వెనుకటి జన్మలనన్నిటిని
నేను చెప్పగలను అన్నాడు. శ్రీకృష్ణుడు అలా అనడము వలన ఆత్మ తన మూడవ పనిని కృష్ణుని శరీరములో
నిరూపించుకొన్నదని అర్థమగుచున్నది. ఆ విధముగా శ్రీకృష్ణుని శరీరములోని ఆత్మ, కృష్ణుని యొక్క గడచిపోయిన
జన్మలను గురించి తెలుపడము వలన, మనిషికి పునర్జన్మలున్నాయను విషయము నిరూపించబడినది. అయితే ఇక్కడ
కొందరికి ఒక అనుమానము రావచ్చును. అదేమనగా! కృష్ణుడు ఇందూ (హిందూ) మతమునకు ప్రవక్తలాంటివాడు.
కావున ఆయన స్వయముగా పునర్జన్మల విషయములో అసత్యమును చెప్పివుండవచ్చును కదా! అని ఎవరైనా అడుగవచ్చును.
ఇతర మతములలో పునర్జన్మలు లేవని చెప్పినపుడు, ఒక్క ఇందూ (హిందూ) మతములోనే ఉన్నాయని చెప్పుట వలన
ఈ ప్రశ్న కొందరికి రావచ్చును. ఇటువంటి ప్రశ్నకు మా సమాధానము ఏమనగా!
మానవుడు ఏ మతములో పుట్టినా ఒక మనిషికి శరీరములోని నిర్మాణమెట్లు ఉన్నదో అట్లే మనుషులకందరికీ ఉ
న్నది. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క శరీర నిర్మాణముగానీ, శరీర అంతర్గత యంత్రాంగముగానీ లేవు. మనుషులు
సృష్ఠించుకొన్నవే మతములు, దేవుడు మానవజాతిని సృష్టించాడు గానీ, మతములను సృష్టించలేదు. దేవుని సృష్ఠిలో
మనుషులందరు ఒక్కటే. అందువలన ప్రపంచములోని అన్ని మతముల మనుషులు ఒకే విధముగా సృష్ఠింపబడినారు.
ఒకే విధమైన అనుభూతులు మనుషులకున్నాయి. మనిషి పుట్టిన తర్వాత వచ్చిన మతమునకు సంబంధించిన
అలంకారములనూ ఆచరణలనూ ప్రక్కన పెట్టితే, వీడు పలానా మతమువాడని ఎవరూ చెప్పలేరు. దీనినిబట్టి ఒక
మనిషికి ఏ నిర్మాణమున్నదో అదే నిర్మాణము అందరికి శరీరములోపల, బయట ఉన్నదని చెప్పవచ్చును. అట్లే ఒక
విషయము మనిషికి నిరూపణకు వస్తే అది సమస్త మానవజాతికి వర్తించును. అట్లే దేవుడు ఒక మనిషికి చూపిన
ధర్మమే ప్రతి మనిషికి వర్తించును. చావు పుట్టుకలు ఒక మనిషియొక్క జీవిత ధర్మమైనపుడు అవి అందరికీ వర్తించును.
అట్లే యవ్వనమూ, వృద్ధాప్యము ఒక మనిషి యొక్క శరీర మార్పయినపుడు అవి అన్ని శరీరములకు మార్పుగానే ఉ
ండును. ఈ విధముగా అందరికీ ఒకే ధర్మ విధానముండును గానీ, మతములకు సంబంధించిన విధానము అందరికీ
ఒకే విధముగా ఉండదు. అందువలన మతమును ప్రక్కన పెట్టి చూస్తే, దేవుడు చెప్పిన ధర్మములు మనుషులందరికీ
సమానముగా వర్తిస్తున్న వని తెలియుచున్నది. చావు పుట్టుకల విషయములో దేవుడు అందరికీ ఒకే ధర్మమును చెప్పాడు
గానీ, ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క విధానముగానీ, ఒక్కొక్క ధర్మమునుగానీ చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా మా మతములో
వేరు విధానమున్నదని చెప్పితే, వారు దేవుని ధర్మములను సరిగా అర్థము చేసుకోలేదనీ, వారు మాట్లాడునది మతము
యొక్క మాటయేననీ, దేవుని మాటకాదనీ గట్టిగా చెప్పవచ్చును. అలా ఎందుకు చెప్పుచున్నామనగా! ఒక మనిషికి ఉ
న్న ధర్మమే సమస్త మానవాళికి వర్తించునను సూత్రము ప్రకారము దేవుని ధర్మమైతే అందరికి వర్తించుననీ, మత
20

Page 21
ధర్మమైతే ఆ మతము వారికే పరిమితమని చెప్పుచున్నాము. మత ధర్మము చెప్పు కొనుటకూ, దానిప్రకారము
అనుసరించుటకూ, ఆ మతస్థులకు మాత్రమే పనికి వచ్చును గానీ, సమస్త మానవాళికి జరిగి తీరునది కాదు. దేవుని
ధర్మము సమస్త మతములలోని వారికి కూడా వర్తించుచున్నది.
ఏ
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ధర్మములు సమస్త మతముల వారికి వర్తించును. ఇపుడు కొందరు ఒక ప్రశ్న
అడుగవచ్చును. అదేమనగా! భగవద్గీత హిందూమతమునకు సంబంధించినది కదా! అది కూడా హిందూ మతమునకు
సంబంధించినది అయినప్పుడు దానిలో చెప్పిన ధర్మములు కూడా ఆ మతము వారికే పరిమితి కదా! అని అడుగవచ్చును.
దానికి మా సమాధానము ఏమనగా! హిందూమతము అనునది వాస్తవముగా మతము కాదు. హిందూ అను శబ్దమునకు
ఏ అర్థమూలేదు. అది మధ్యలో వచ్చిన పదము. పూర్వము ద్వాపరయుగములోనూ దానికంటే ముందు యుగములలోనూ
నేడు హిందూగానున్న శబ్దము ఇందూగా ఉండెడిది. ఇందూ అను శబ్దము దైవజ్ఞానమును సూచించు అర్థమునిచ్చునదై
ఉన్నది. జ్యోతిష్యశాస్త్రమును అనుసరించి ఇందూ అను పదమునకు దైవజ్ఞాని అను భావమున్నది. అందువలన
దైవజ్ఞానము తెలిసిన ఎవరైనా ఇందువే అగును. ఏ మతములోని జ్ఞాని అయినా తను ఇందువే అగును. కావున
ఇందూ అనునది మతము కాదు. ప్రస్తుతకాలములో అజ్ఞానము పెరిగి పోయిన దానివలన ఇందూ అను శబ్దము
హిందూగా మారిపోయినది. ఇందూ, హిందూగా మారిపోయినా భగవద్గీతలో చెప్పిన ధర్మములు పూర్తి దైవజ్ఞానమునకు
సంబంధించినవి. కావున మతమునకు సంబంధించినవి కావు. ఇందూ ధర్మములలో మతమునకు సంబంధించిన
నియమముగానీ, ఆచరణలుగానీ ఉండవు. ఏవి ఉన్నా దైవమునకు సంబంధించిన ధర్మములు, వాటి ఆచరణ
ఉండును. భగవద్గీత సంపూర్ణముగా ఇందూ ధర్మములను తెలియజేసినది. అందువలన గీత కూడా మత సంబంధ
గ్రంథముకాదనీ, దైవధర్మములను తెలిపిన గ్రంథమనీ చెప్పవచ్చును. గీతను చెప్పిన కృష్ణుడు తానే స్వయముగా కొన్ని
జన్మలను పొందానని చెప్పడము మత సంబంధముగా చెప్పినది కాదు. విశ్వ వ్యాప్తముగా ఎక్కడైనా అందరికీ జరుగు
పునర్జన్మల విషయమునే నిరూపణముగా చెప్పడమేకాక, తన అనుభవములను ఆధారముగా చెప్పాడు. ఇది ఒక్క
కృష్ణునికేనా జ్ఞప్తికి వచ్చినది? ఎవరికి ఇటువంటి జ్ఞాపకము రాలేదా అని విచారిస్తే, మిగత మనుషులలో కూడా
కొందరు అక్కడక్కడ అప్పుడప్పుడు తన పునర్జన్మ జ్ఞాపకములను గురించి చెప్పారు. అలా చెప్పిన వారిలో ఇందువులున్నారు,
క్రైస్తవులున్నారు ముస్లీమ్లున్నారు మరియు మిగతా మతస్థులు కూడా ఉన్నారు. అందువలన కృష్ణుడు చెప్పినది
విశ్వమానవులందరికీ వర్తించు జ్ఞానమనీ అది అక్కడక్కడా ధర్మముగా నిరూపింపబడుచున్నదని అర్థమగుచున్నది. అందరి
అనుభవమునకు వచ్చునది కావున కృష్ణుడు చెప్పిన జ్ఞానము మతసంబంధము కాదని తెలియుచున్నది.
ఈ
కృష్ణునికి వెనుక జన్మలు తెలిసినట్లు ఇప్పుడు మనకుగానీ, అప్పుడు అర్జునునికిగానీ ఎందుకు తెలియలేదని
కూడా కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా ఉన్నది. ఆత్మ చేయు మూడవ పని వలన
మాత్రమే గతజన్మ జ్ఞాపకములు కల్గునని ముందే చెప్పాము కదా! అట్లే ఆత్మ తన మూడవ పనిని ఏదో ఒక జీవితములో,
ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చేయునని కూడా చెప్పాము. ఆత్మ అందరి జీవితములలో, అన్ని జన్మలలో పని చేయదు.
కావున అందరకీ వెనుక జన్మ విషయములు తెలియుటకు అవకాశములేదు. ఆ రోజు అర్జునుని శరీరములోని ఆత్మ
మూడవ పనిని చేయలేదని తెలిసిన కృష్ణుడు, నీకు వెనుక జన్మల విషయములు తెలియవని అర్జునునితో అన్నాడు.
ప్రపంచములో పునర్జన్మలున్నాయని తెలుపు నిరూపణ నిమిత్తము, ఎవరిలోనో ఒకరిలో ఆత్మ మూడవ పనిని చేసి,
వెనుక జన్మ విషయములను తెలియజేయుచున్నది. ఒక విషయము నిజమా కాదా అని తెలియుటకు ఒకే సాక్షి
21

Page 22
చాలును. అందరి సాక్ష్యము అవసరములేదు. కోర్టులో ఒక్కడు సాక్ష్యము చెప్పినా అది సత్యముగానే లెక్కించబడుతుంది.
ఒక ఊరిలోని హత్యను ఒక్కడు చూచినా వాని సాక్ష్యమునే సత్యముగా లెక్కించగలరు. ఊరిలోని వారందరూ హత్యను
చూడవలసిన పనిలేదు. అందరి సాక్ష్యము అవసరములేదు. అదే విధముగా పునర్జన్మ ఉన్నదని అర్థమగుటకు ఒకనికి
వెనుకటి జన్మ విషయములు జ్ఞప్తికి వచ్చి, అవి నిరూపణకు వచ్చినపుడు, ఆ ఒక్కని సాక్ష్యము తోనే పునర్జన్మ సత్యమని
నిరూపణకు వస్తున్నది. ఆ విధముగా అన్ని దేశములలోనూ ఎన్నో నిరూపణకు వచ్చిన వెనుక జన్మ జ్ఞాపకములున్నవి.
వెనుక జన్మలలో జీవునితో పాటు శరీరములోనున్న ఆత్మ, ప్రస్తుత జన్మలో నేరుగా బుద్ధికి వెనుక జన్మ విషయములు
తెలియజేయడము వలన, బుద్ధి ద్వారా జీవునికి వెనుక జన్మలో జరిగిన విషయములు తెలియుచున్నవి. వెనుక జన్మలో
జీవుడు ఆ విషయములను స్వయముగా అనుభవించినప్పటికీ జ్ఞాపకశక్తి జీవునికి లేని దానివలన, అవి జీవునికి
తెలియకుండా పోయినవి. జీవునికి జ్ఞాపకములేని విషయములను ఆత్మ శరీరములోని మనస్సుకు తెలుపకుండా
నేరుగా బుద్ధికి తెలుపగా, బుద్ధి ద్వారా జీవునికి తెలియు చున్నది. ఈ విధముగా వెనుకటి జన్మ విషయములను
అవసరమొచ్చినపుడు ఆత్మ జీవునికి తెలియునట్లు చేయుచున్నది. అట్లు చేసినపుడు ఆత్మ తెలిపిన విషయములు
మధ్యలో బుద్ధికి తెలిసినా, బుద్ధికి కూడా జ్ఞాపకశక్తి లేని దానివలన తర్వాత బుద్ధి కూడా అన్ని విషయములను మరచి
పోవుచున్నది. శరీరములో ప్రకృతి సంబంధ భాగములలో ఒక్క మనస్సుకు తప్ప జ్ఞాపకశక్తి దేనికీ లేదు. మనస్సుకు
తెలియకుండా ఆత్మయే లోపల జీవునికి తెలియజేసి, ఆత్మయే స్వయముగా కర్మేంద్రియముల ద్వారా
బయటికి చెప్పునట్లు
చేయు చున్నది. బయటి కర్మేంద్రియములకు కూడా ఆత్మే స్వయముగా తెలియ జేయడము వలన, మనస్సుకు
విషయములు ఏమాత్రము తెలియకుండా పోవుచున్నవి. శరీరములో ఆత్మ స్వయముగా గతజన్మ విషయములను
తెలియజేసినంత కాలమే వాటిని మనిషి బయటికి చెప్పగలుగుచున్నాడు. ఎప్పుడైతే ఆత్మ తెలుపడము మానివేసిందో,
అప్పుడు ఆ విషయములు ఆ జీవునికి తెలియకుండా పోవును. ఒక సంవత్సర కాలము వెనుక జన్మ విషయములను
తెలియజేసిన మనిషి తర్వాత ఏమీ చెప్పక పోవుచున్నాడు. ఎవరైనా ఆ విషయములను గుర్తుచేసినా, అవి అతనికి క్రొత్త
విషయములుగా అగుపించును. అందువలన కొంతకాలము వెనుక జన్మ జ్ఞాపకాలను చెప్పినవారు, తర్వాత కాలములో
వాటిని ఏమాత్రము చెప్పలేకపోవుచున్నారు. కొంత కాలమే ఒకనితో గత జన్మ జ్ఞాపకాలను చెప్పించిన ఆత్మ, గతజన్మ
తర్వాత పునర్జన్మలున్నాయని అందరూ గుర్తించుటకు మాత్రమే అలా చేయుచున్నదని తెలియుచున్నది. శరీరములోని
మనస్సుకు తెలియకుండా స్వయముగా ఆత్మే చేసిన పని కావున, మనిషి జ్ఞాపకములో గతజన్మ విషయములు ఎప్పటికీ
ఉండవు.
గత జన్మలున్నాయనీ, గత జన్మల తర్వాత పునర్జన్మలున్నాయనీ గుర్తించు నిమిత్తము ఆత్మ స్వయముగా తెలుపు
విధానమును ఇంతవరకు తెలుసుకొన్నాము. గతజన్మలూ, పునర్జన్మలూ ఉన్నాయని తెలుసుకొనుటకు రెండు
విధానములున్నవి. అందులో స్వయముగా ఆత్మ వ్యక్తి ద్వారా తెలియ జేస్తుందని చెప్పడము ఒక విధానము. రెండవ
విధానములో ఆత్మ చెప్పదు, కానీ మనిషే స్వయముగా తెలుసుకొను నిమిత్తము, శరీరము మీద ఏదో ఒక గుర్తు
ఉండును. ఆ గుర్తు శరీరము పుట్టినపుడే పుట్టుకతోనే వచ్చి యుండును. అటువంటి గుర్తును పుట్టుమచ్చ అంటారు.
పుట్టుకతో వచ్చు మచ్చ కావున దానిని పుట్టుమచ్చ అంటున్నాము. పుట్టుమచ్చ వెనుకటి జన్మ సంబంధమును గుర్తు
చేయుచున్నది. ఉదాహరణకు కృష్ణుడు బాల్యములో పాముకాటుకు గురి అయినాడు, కావున ఆయన తర్వాత జన్మలో
ఆ పాముకాట్లు శరీరము మీద కరిచిన చోట పుట్టుమచ్చగా వచ్చాయి. ఈ విధముగా గత జన్మలను ఒకటి ఆత్మ
22

Page 23
తెలియజేయు విధానము, రెండు జీవాత్మ స్వయముగా గుర్తుల ద్వారా తెలియు విధానమూ రెండు రకములు గలవు.
ఈ రెండు విధానములను ప్రత్యక్ష ప్రమాణముల ద్వారా తెలుసు కొందాము. మొదట ఆత్మ మూడవ పనిగా గత జన్మ
విషయములను తెలియజేసే రెండు మూడు విధానములను తెలుసుకొందాము.
ఇపుడు మొదటి విధానములో ఆత్మ గతజన్మలను తెలియజేసిన యదార్థ సంఘటనలను వివరించుకొందాము.
1930వ సంవత్సరము జూన్ లేక జూలై నెల కాలములో లెబనాన్ దేశములో “హాసన్” అనే పేరుగల స్త్రీ జన్మించింది.
పునర్జన్మలు లేవు అను చెప్పుచున్న ఇస్లామ్మతములో హాసన్ జన్మించడము విశేషము. ఆమెకు 20 సంవత్సరముల
యుక్తవయస్సులో “ఫరూక్" అను వ్యక్తితో వివాహము జరిగింది. ఫరూక్, హాసన్ జంటకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.
హాసన్కు “నభీ” అనే సోదరుడు కూడా ఉండేవాడు. అతడు లెబనాన్ దేశములో లెబనాన్ సమాజములో చాలా పేరు
పొందినవాడు. అయితే నఖీ యుక్తవయస్సులో విమాన ప్రమాదములో మరణించాడు. హాసన్ తన రెండవ కూతురుకు
జన్మనిచ్చినపుడు అనారోగ్యముపాలై గుండె సమస్య వచ్చింది. దానివలన ఇక మీదట పిల్లలను కనకూడదని డాక్టర్లు
సలహా ఇచ్చారు. అయితే హాసన్ ఆ సలహాను ఏమాత్రము పట్టించుకోకుండా 1962లో మూడవ మగబిడ్డకు
జన్మనిచ్చింది. 1963లో తన తమ్ముడు నభీ చనిపోవడముతో ఆమె అరోగ్యము మరీ క్షీణించను మొదలు పెట్టింది.
అప్పుడు ఆమె తాను చనిపోవడము ఖాయమని అనుకున్నది. కొంతకాలమునకు 36 సంవత్సరముల వయస్సున్న
హాసన్ వర్జీనియాలో ఉండే “రిచ్మడ్” అనే డాక్టర్ వద్దకు గుండె ఆపరేషన్ కొరకు వెళ్ళింది. ఆపరేషన్కు ముందు తన
పెద్దకూతురు లైలాకు ఫోన్ చేయ బోయింది, కానీ చేయలేక పోయింది. ఆపరేషన్ తర్వాత ఒకరోజు మాత్రము బ్రతికి
చాలా క్లిష్టపరిస్థితులలో హాసన్ మరణించింది.
హాసన్ మరణించిన పది రోజులకు సుజన్నేగానెమ్ అను బిడ్డ ఒక కుటుంబములో పుట్టింది. సుజన్నేగానెమ్ 16
నెలల వయస్సుగల చిన్న బిడ్డగా ఉండి మాటలు వచ్చీరాని సమయములో ఫోన్ తీసుకొని హలో లైలా అని పదేపదే
అంటూ ఉండేది. ఆ కుటుంబము వారికిగానీ, సుజన్నే తల్లికిగానీ లైలా ఎవరో? అంతచిన్న పాప అలా ఎందుకు
ఫోన్లో పిలుస్తున్నదో అర్థము కాలేదు. తర్వాత ఆరునెలలు గడచిన సుజన్నేకు రెండు సంవత్సరములు వయస్సు పూర్తి
అయింది. అప్పుడు మాటలు కూడా బాగా వచ్చాయి. అప్పుడు ఆమె తల్లి లైలా ఎవరు అని అడిగింది. దానికి
సుజన్నేగానెమ్ నాకు ఇద్దరు కూతుర్లున్నారని, వారిలో ఒక కూతురు పేరు లైలా అని చెప్పింది. అంతేకాక తన పేరు
సుజన్నే కాదనీ, తనపేరు హాసన్ అని, తన భర్త పేరు ఫరూక్ అనీ, తన తల్లిదండ్రుల పేర్లు, తమ్ముళ్ళ పేర్లు, మిగత
కుటుంబ సభ్యుల పేర్లు మొత్తము 13 పేర్లు వరుసగా చెప్పింది. ఇంకా తన ఊరు యొక్క వివరాలు అడిగితే ఇప్పుడు
నా తల చిన్నది ఇంకా కొంత కాలమునకు అన్ని విషయములు చెప్పుతానని చెప్పింది.
ఈ విధముగా సుజన్నే చెప్పిన మాటలను విని ఆమె కుటుంబములోని వారు సుజన్నే ముందు జన్మలో హాసన్గా
ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలను కొన్నారు. ఆ వార్తను పత్రికల ద్వారా బయటికి తెలియజేశారు. అప్పుడు హాసన్
కుటుంబములోని వారూ, హాసన్ భర్త ఫరూక్ సుజన్నేను చూడటానికి వచ్చారు. మొదట ఫరూక్ కుటుంబము
చిన్నపాపగానున్న సుజన్నే చెప్పు మాటలను నమ్మలేకపోయారు. హాసన్ బంధువులను సరిగ్గా వారి పేర్లతో సుజన్నే
పిలువడముతో ఫరూక్ కుటుంబము ఆ పిల్లను నమ్మడము మొదలు పెట్టింది. హాసన్ తన నగలనూ, ఇతర ఆభరణములనూ
వర్జీనియాలోని తన తమ్ముడు హెర్కులేక్కు ఇచ్చింది. ఇది సర్జరీకి ముందు జరిగిన సంగతి. ఆ నగలను హెర్కులేకు
23

Page 24
ఇస్తూ, వాటిని తన కూతుర్లకు అందజేయ వలసిందిగా చెప్పింది. ఈ విషయము హాసన్కు వారి కుటుంబీకులకు తప్ప
ఇంకెవ్వరికీ తెలియదు. ఇవన్నీ విన్న తర్వాత సుజన్నే గతజన్మలో హాసన్గా ఉండేదని ధృవీకరించబడింది.
చదవడానికిగానీ, వ్రాయడానికిగానీ రాకముందే సుజన్నే పేపరు మీద ఏవో నంబర్లు వ్రాసేది. తర్వాత ఆ
నంబర్లు ఫరూక్ ఇంటి ఫోన్ నంబరని తెలిసింది. సుజన్నేకు ఐదు సంవత్సరముల వయస్సున్నపుడే రోజుకు మూడు
సార్లు ఫరూక్కు ఫోన్ చేసేది. ఫరూక్ ని కలిసినపుడు సుజన్నే అతని ఒడిలో కూర్చొని నిద్రించేది. పోలీస్ ఉద్యోగము
చేసే ఫరూక్, మరణించిన తన భార్య హాసన్ సుజన్నేగా జన్మించిందని అంగీకరించాడు. సుజన్నేకు ఏవైనా ఫోటోలు
చూపిస్తే వాటిలోని వ్యక్తుల్ని గుర్తించడమే కాకుండా, హాసను ఆ ఫోటోలోని వారితో సంబంధాన్ని సుజన్నే వివరించేది.
కొన్ని హాసను తప్ప ఎవరికీ తెలియని వివరాలను సుజన్నే వివరించేది. దీనివలన పోయిన జన్మలోని హాసన్ ఈ
జన్మలో సుజన్నేగా పుట్టినదని పూర్తి నిరూపణకు వచ్చినది. ఈ విషయముతో పునర్జన్మ ఉన్నదనీ నిరూపించబడినది.
40 సంవత్సరముల క్రితము జరిగిన ఈ సంఘటనను ఎవరూ కాదనలేరు మరియు ఖండించనూ లేరు.
జీవుడు శరీరమును వదలి పోవడము మరణము అయితే, అదే జీవుడు మరొక శరీరమును ధరించడము జన్మ
అవుతుంది. దానినే లోతుగా విచారిస్తే పునర్జన్మ అవుతుంది. ఒక మనిషి పాతవస్త్రమును వదలి క్రొత్త వస్త్రమును
ధరిస్తే దానిని వస్త్ర మార్పిడి అనవచ్చును. అలాగే ఒక జీవుడు పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరిస్తే
దానిని శరీరమార్పిడి అనవచ్చును. శరీర మార్పిడిలో జీవునికి పునర్జన్మ ఏర్పడుచున్నది. మనిషి పునర్జన్మను పొందినప్పటికీ,
వెనుకటి జన్మ జ్ఞాపకములు అతనికి లేక పోవడము వలన, దానిని జన్మ అనుకోవడము జరుగుచున్నది. కానీ అది
తనకు పునర్జన్మ అని ఎవరికీ తెలియకుండా పోవుచున్నది. అట్లు తెలియక పోవడము వలన జరుగుచున్న సత్యము
సమాధియై పోగలదు. అందువలన జీవునికి జన్మలలో జరుగు సత్యమును తెలుపు నిమిత్తము, జీవునితో పాటు
శరీరములోనున్న ఆత్మ అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట, వెనుకటి జన్మ జ్ఞాపకమును అందించుచున్నది. వెనుకటి జన్మ
జ్ఞాపకముతో పునర్జన్మ నిరూపణకు వస్తున్నది. మనిషి జీవితములోని ఆధ్యాత్మిక విషయములను దేవుడు తన ప్రవక్తల
ద్వారా చెప్పించాడు. అలా చెప్పించిన వాటిలో జన్మ, పునర్జన్మ విషయములు ముఖ్యముగా చెప్పబడినవి. దేవుడు
భూమిమీద మనిషి కొరకు కొన్ని వేల సంవత్సరములకొకమారు వచ్చి తన జ్ఞానమును మళ్ళీమళ్ళీ చెప్పడము జరిగినది.
మనిషి తన జ్ఞానమును మరచి పోకుండుటకు దేవుడు ఎన్నిమార్లు తన జ్ఞానమును మనుషులకు చెప్పితే, అన్నిమార్లు
మనిషి దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేక, ఒక్కొక్కమారు చెప్పిన దానిని ఒక్కొక్క మతముగా, చెప్పిన వానిని మత
ప్రవక్తగా చెప్పుకోవడము జరిగినది. అందువలన దేవుడు చెప్పినది ఒకే జ్ఞానమైనా అది చెప్పిన జాగావేరు, చెప్పిన
కాలమూ వేరు, చెప్పిన మనిషి వేరు. కావున దేవుడు చెప్పినది ఒకే జ్ఞానమని తెలియక మా మతములో చెప్పినది
వేరు, మీ మతములో చెప్పినది వేరని అనుకోవడము జరిగినది. దేవుడు సత్యవంతుడు, సత్యమునే తెలియజేస్తాడు.
మనిషి దేవుడు చెప్పిన సత్యమును అవగాహన చేసుకోలేక, ఒక్కొక్కమారు ఒక్కొక్క రకముగా చెప్పినట్లు అర్థము చేసుకొని,
దేవుని సత్యమునే తనకు తెలియకుండానే అసత్యముగా చేయుచున్నాడు. అలా దేవుడు చెప్పిన మాటను నేను అసత్యము
చేసి మాట్లాడుచున్నానని తెలియకపోవడమేకాక, తనకు తెలిసినదే సత్యమని, నూటికి నూరుపాళ్ళు నమ్మకముతో
ఉన్నాడు. అలాంటి విశ్వాసముతోనే కొందరు పునర్జన్మలు ఉన్నాయని అంటే, కొందరు పునర్జన్మలులేవు అంటున్నారు.
ఈ విధముగా ఉన్నాయని కొన్ని మతములవారూ, లేవని కొన్ని మతముల వారూ అనుచున్నప్పుడు, సామాన్య మనిషి
దేనిని సత్యమని నమ్మాలో, దేనిని నమ్మకూడదో తేల్చుకోలేకపోవును. అటువంటి చిక్కు సమస్య ఏర్పడకుండా, ఏది
24

Page 25
సత్యమో అందరూ తెలియుటకూ, అన్ని మతముల వారు సత్యమును తెలుసుకొనుటకు దేవుడు తన జ్ఞానమును అనుభవరీత్య
అర్థమగునట్లు చేయును. అటువంటి ప్రక్రియలోని భాగమే పైన చెప్పిన హాసన్ పునర్జన్మ సంఘటన.
దేవుడు తాను చెప్పినది సత్యమనీ, ఒకవేళ ఎవరైనా ఆయన మాటను తప్పుగా అర్థము చేసుకొనివుంటే
మించిపోయినది ఏమీలేదనీ, అటువంటి వారు జరిగిన యదార్థమును బట్టి తాము పొరపడిన విషయమును సరిగా
అర్థము చేసుకోవచ్చుననీ, అప్పటికీ వారికి అర్థము కాకపోతే వారివద్ద ఉన్నది మత జ్ఞానమేననీ, దేవునిజ్ఞానము కాదనీ
చెప్పవచ్చును. దేవుడు సర్వమును సృష్టించిన తర్వాత తన ధర్మములను మనిషికి తెలిపాడు. అందులో తిరిగి మనిషి
తనవద్దకు (దేవునివద్దకు) రానంతవరకు భూమిమీద చస్తూ, పుట్టుచూ సుఖదుఃఖములను అనుభవిస్తూ ఉండవలసిందేననీ,
తనవద్దకు వచ్చిన వానికి మాత్రమే జనన మరణముల నుండి ముక్తి లభించుననీ, దానినే మోక్షము అంటామని
చెప్పాడు. అదే విషయమునే అన్ని మతములలోనూ చెప్పాడు. అయితే ఇస్లామ్ మతములో చిన్న అవగాహన లోపము
వలన ప్రవక్త చెప్పిన సత్యమును కొందరు అర్థము చేసుకోలేక పోయారు. దేవుని జ్ఞానము గొప్పది కావున ఎవరైనా
పొరపడుటకు అవకాశము గలదు. ప్రవక్త బ్రతికివున్నపుడే మహమ్మద్ ప్రవక్తగారి నలుగురు భార్యలలో చిన్న భార్యకు
పునర్జన్మల విషయము అర్థముకాక తిరిగి ప్రవక్తను అడిగి తెలుసుకొన్నది. ఈనాడు ప్రవక్తలేడు కనుక అటువంటి
అవకాశము మనకు లేదు. కావున జరిగిన యదార్థమును బట్టి మన పొరపాటును సరిదిద్దుకోవచ్చును. మహమ్మద్
ప్రవక్తగారు తన సతీమణులవద్ద దేవుని ధర్మములను తెలుపుచూ చనిపోయిన మనిషిని ప్రళయ దినాన దేవుడు
సమాధినుండి తిరిగి లేపుననీ, అప్పుడు మనిషి ఇవే ఎముకలు, ఇదే చర్మముతో, ఇదే శరీరముతో తిరిగి సమాధినుండి
వచ్చుననీ, అలా వచ్చిన వాని శరీరము మీద నూలు పోగుకూడా ఉండదని తెలిపాడు. అప్పుడు ప్రవక్తగారి చిన్న భార్య
ఇలా అడిగింది. “మేము స్త్రీలము కదా! దేవుడు మమ్ములను గుడ్డలు లేకుండా నగ్నముగా లేపితే మాకు మర్యాద
పోతుంది కదా! మాకు మానము పోతుంది అవమానము ఏర్పడుతుంది కదా!" అని అడిగింది. అప్పుడు ప్రవక్త ఇలా
చెప్పాడు. “దేవుడు మనిషిని తిరిగి సమాధినుండి లేపినపుడు స్త్రీలకుగానీ, పురుషులకు గానీ ఎటువంటి గుణములుగానీ,
ఎటువంటి ప్రపంచ ధ్యాసగానీ ఉండవు" అన్నాడు. ప్రళయ కాలములో చనిపోయిన వారందరూ సమాధులనుండి
లేపబడుతారని పవిత్ర గ్రంథమైన ఖురాన్లో కూడా అనేక చోట్ల ప్రవక్త చెప్పియున్నాడు. ఈ విషయములో ప్రవక్తకు
దగ్గరగానున్న ఆయన భార్యయే పొరపాటు పడినపుడు ప్రవక్త ఆమెకు ఇంకా కొంత వివరముగా చెప్పాడు.
వివరముతో మనిషికి పునర్జన్మలున్నాయని ఎవరికైనా అర్థము కాగలదు. కానీ కొందరికి ప్రవక్త మాటలు పునర్జన్మలు
లేవనియేనని అర్థమగుటకు కారణములు గలవు. అవి ఏవనగా! సమాధి అంటే ఏమిటో కొందరికి అర్థము కాలేదు.
దేవుడు చనిపోయిన మనిషిని తిరిగి లేపినపుడు ఆ మనిషికి ఎంత వయస్సు? అని అడిగితే సమాధానము లేదు.
మనిషి ఎంతకాలము సమాధిలో ఉంటాడు అని ప్రశ్నిస్తే జవాబులేదు. నీవు అనుకొను సమాధి నీదా లేక నీ శరీరమునదా?
అని అడిగితే దానికి సరిగా ఏమి చెప్పాలో చాలామందికి తెలియదు. నీటిలో మునిగి పోయిన వానికి సమాధి ఉన్నదా?
అగ్నిలో కాలిపోయిన వానికి సమాధి ఎక్కుడున్నది అని అడిగితే సరియైన సమాధానముండదు. ఇన్ని ప్రశ్నలకు సరియైన
జవాబు దొరికినపుడు, దేవుడు చెప్పిన జ్ఞానము మనకు అర్థమైనట్లు, లేకపోతే అర్థము కానట్లేనని తెలుసుకోవలెను.
సృష్ఠికర్త అయిన దేవుడు తన పవిత్రగ్రంథమైన ఖురాన్లోనూ, పరిశుద్ధ బైబిలులోనూ, ఉత్తమమైన భగవద్గీతలోనూ
జనన మరణ విషయములో ఒకే ధర్మమును బోధించాడు. గీతలో చెప్పిన మాటకుగానీ, బైబిల్లో చెప్పిన మాటకుగానీ,
ఖురాన్లో చెప్పిన మాటకుగానీ ఎక్కడా తేడా లేదు. కానీ మనము అర్థము చేసుకోవడములో ఎంతో తేడా వచ్చినది.
25

Page 26
అందువలన మీరు బాగా ఆలోచించుకోమని దేవుడు హెచ్చరిక చేసి చెప్పాడు. అటువంటి మాటను ఖురాన్లో ఒకచోట
చూడగలము. అజ్ జుమత్ (బృందములు) అను 39వ సురాలో 42వ ఆయత్లో ఇలా కలదు. “అల్లాయే ఆత్మలను
(ప్రాణులను) మరణ కాలమున వశపరుచుకొనేవాడు. మరణించిన వాని ఆత్మలకు దేనికైతే మరణము నిర్ణయింపబడుతుందో
దానిని తనవద్దే ఆపుకొని, మిగతావారి ఆత్మలను నిర్ణీత సమయము వరకు తిరిగి పంపుతాడు. ఇందులో ఆలోచించేవారికి
గొప్ప సూచనలున్నాయి.” ఈ ఆయత్ ఎవరినైనా ఎంతో ఆలోచింప చేస్తుంది. మిగతా ప్రాణులను తిరిగి పంపుతాను
అన్నపుడు ఎక్కడినుండి ఎక్కడికి పంపుతాడని ప్రశ్నవేసుకొని చూడవలసిన అవసరమున్నది. అంతేకాక స్వయాన దేవుడే
ఇందులో ఆలోచించేవారికి గొప్ప సూచనలున్నాయని చెప్పినపుడు మనిషి ఎంతో ఆలోచించవలసిన అవసరమున్నదనీ,
మనము ఏదో పొరపాటు పడుచున్నామనీ, దానికే దేవుడు అలా చెప్పాడని అర్థము చేసుకోవచ్చును.
దీనికి అనుసంధానముగా పవిత్ర ఖురాన్లో సృష్టికర్త అయిన దేవుడు మరొక మాటను కూడా చెప్పాడు. 53వ
సురా అన్నల్మ్ (నక్షత్రము) 44,45,46 ఆయత్లలో 44) నిశ్చయముగా ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని
ప్రసాదించేవాడు. 45) నిశ్చయముగా ఆడ, మగ జంటలను సృష్టించినవాడు ఆయనే, 46) ప్రవహింపజేసిన వీర్యబిందువు
నుండి మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే (దేవునికే) చెల్లును. ఈ విధముగా ఖురాన్లో మరికొన్ని
వాక్యములు కనిపించగలవు. వాటిని సరిగా అర్థము చేసుకొన్నపుడు పైన చెప్పుకొన్న హాసన్ 36 సంవత్సరములకు
మరణించి తిరిగి పదిరోజులకే సుజన్నేగా జన్మించిన సత్యము అర్థము కాగలదు. హాసన్ మరణించి తిరిగి పుట్టినది
సత్యమైనపుడు పునర్జన్మలు లేవు అను వారి మాటలు అసత్యమగును. అటువంటి అసత్యములను ప్రవక్తలకు అంటగట్టి,
వారి గొప్పతనమునకు ఆటంకము కలిగించకూడదు. ప్రవక్తల మాటలను తప్పుగా అర్థము చేసుకోవడము వలన,
దేవుని మాటలనే అసత్యము చేసినట్లగును. దేవుని మాటలను అసత్యముగా చూపడము వలన, ఎవరికైనా భయంకరమైన
పాపము సంభవించగలదు. అందువలన దేవుని జ్ఞానమును ఏ మతస్తులైనా సరిగా అర్థము చేసుకోవాలని కోరు
చున్నాను. ఖురాన్ను పరిశోధించిన కొందరు పెద్దలు ఖురాన్లో ఇంకా కొన్ని వాక్యములు పునర్జన్మల గురించి
ఉన్నాయని వ్రాశారు. వాటిని క్రింద పొందుపరుస్తున్నాము చూడండి.
1) మరి ఎప్పుడైతే శరీరము నశిస్తుందో, అపుడు ఆత్మ (జీవాత్మ) ఆ యొక్క పాత కవచాన్ని వదలివేసి, అందుండి
విడుదలై క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. మానవ దేహము ఒక వ్యక్తికి ఒక రుతువులాగ కొంతకాలము ఉంటుంది. ఆత్మకు
ఆ సమయము పూర్తికాగానే దాన్ని విడిచి ఇంకో శరీరాన్ని తీసుకొంటుంది.
2) దైవత్వము ఆత్మలను (జీవులను) ఉద్భవింపజేస్తుంది. ఇక్కడికి తిరిగి తిరిగి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే
ఆత్మ దైవత్వాన్ని తిరిగి చేరుకుంటుందో అపుడా ఆత్మ తిరిగి జన్మించనవసరములేదు.
3) సృష్టికర్తయిన దేవుడు నిన్ను తయారు చేసినా, నీవు చనిపోయినపుడు తిరిగి జన్మింపజేసినా, అలాగే నీవు జన్మించిన
తర్వాత నిన్ను మరణింప జేసినా, ఇలా తనని నీవు చేరే దాకా ఈ జనన మరణ చట్రములో నిన్ను ప్రవేశపెట్టినా
దైవత్వాన్ని, దేవున్ని విస్మరిస్తావు.
4) నిన్ను సృష్టించి నీకొక ఉనికిని తయారు చేసినదీ, నీవు చనిపోతే నిన్ను జన్మింపజేస్తున్నదీ, నీవు జన్మించిన తర్వాత
నిన్ను మరణింపజేస్తున్నదీ ఆ దేవుడు ఒక్కడే.
26

Page 27
5)
రాతినుండి గింజను బద్దలుకొట్టుకొని మొలకెత్తించేది, చనిపోయిన వారిని తిరిగి జన్మింపజేసేది, జీవిస్తున్న వారిని
తిరిగి మరణింపజేసేది ఆ దైవత్వమే.
6) ఇప్పుడు మీకు సత్యాన్ని బోధిస్తున్నాను, ఏ ఆత్మలకైతే ఒకదానిపట్ల (దైవముపట్ల) తీవ్ర ఆసక్తి, ఇష్టము ఉంటే ఆ
ఆత్మలు ఎన్ని శరీరములు ధరించినా, ఎన్ని పేర్లు పొందినా సరే అవి దేవునికి దగ్గరవుతాయి.
ఈ వాక్యములు దైవత్వము యొక్క గొప్పతనమును తెలియజేయడమే కాక, మనిషికి జన్మలున్నవని కూడా
తెలియజేయుచున్నవి. మనిషి తాను చేసుకొన్న పాపపుణ్యములను అనుభవించుటకే పుట్టుచున్నాడనునది సత్యము.
దానినే కర్మసిద్ధాంతము అంటాము. ఆ కర్మ సిద్ధాంతమును తెలియజేయు వాక్యములు కూడా పవిత్ర ఖురాన్ గ్రంథములో
ప్రవక్తగారు అక్కడక్కడ తెలియజేశాడు. వాటిలో కొన్ని ఈ విధముగా ఉన్నవి.
1) దైవత్వము లేక దేవుడు ఏ ఆత్మనూ (ఏ జీవిని) తనశక్తికి మించి చేయమని నిర్దేశించడు. ఆ ఆత్మ ఏమి
సంపాదించుకుందో దానినే పొందుతుంది. మరీ దానికి ఏది లభించునన్నది దాని బాధ్యతే.
2) ప్రతి ఆత్మ తాను చేసిన మంచిని తిరిగి పొందుతుంది. అలాగే తాను చేసిన చెడునూ తిరిగి పొందుతుంది.
3)
మనము మన కర్మల లెక్కలు చూచుకొన్నపుడు మనమే మనల్ని తీర్మానించుకొంటాము. ఏ ఆత్మగానీ, దేనికిగానీ
దోషికాదు. అయితే ఆవగింజంత అయినా సరే ఆ కర్మను అది పాపమైనా, పుణ్యమైనా మనము తిరిగి పొందుతాము.
మన ఆత్మ క్షేత్రము ఆ లెక్క విషయములో చాలా పక్కాగా ఉంటుంది.
4) "మనము ఇతరులకు ఏమి చేశాము, ఇతరులు మనకేమి చేశారు" అను అన్ని విషయములు చాలా లెక్కగా
మనదగ్గరుంటాయి
5) విశ్వ మానవుల గురించి ఖురాన్లో అత్యద్భుతమైన వాక్యాలున్నాయి. కానీ మతముల యొక్క సంకుచిత అవగాహనతో
ఈ సత్యాన్ని మనము మరచి పోయాము. ప్రపంచములోని ఏ మతస్థులైనా సరే, ఎవ్వరైతే దైవాన్ని విశ్వసిస్తారో వారికి
చివరి రోజున భయములేదు మరి వారు దుఃఖింపరు. చూచారా! ఈ వాక్యము ఎంత గొప్పగా ఉందో?
కర్మ సిద్ధాంత వాక్యములనుబట్టి ఖురాన్ చాలా గొప్పది. ప్రపంచము లోని సమస్త మానవాళికి వర్తించు సూత్రములను
చెప్పినదని అర్థమగు చున్నది. ఖురాన్ చెప్పిన కర్మ సిద్ధాంతము ప్రకారము మనిషి చేసుకొన్న కర్మకు మనిషే బాధ్యుడు.
మనిషి చేసుకొన్న దానిని అనుభవింపజేయుటకు మనిషిని దేవుడు తిరిగి పుట్టించవలసి వచ్చినది. ఏ కర్మలేని వాడు
తిరిగి పుట్టనవసరములేదు. అటువంటి వారు దేవుని సన్నిధానములోనే ఉండి పోవును. దేవుడు మొదట కర్మలేని
మనిషిని పుట్టించి తానే అతనిని జీవింపజేయగా, మనిషి తనను పుట్టించిన దేవున్ని మరిచిపోయి, తానే బ్రతుకుచున్నానని
అనుకొని లేని కర్మను సంపాదించుకొని మరల మరల పుట్టింపబడుచున్నాడు. మేము ఇంతగా పునర్జన్మలున్నాయని
చెప్పినా నమ్మనివారు ఉండవచ్చును. అందుకని ముస్లీమ్ కుటుంబములో చనిపోయి తిరిగి ముస్లీమ్ కుటుంబములోనే
పుట్టిన ఒక వ్యక్తి యొక్క వాస్తవ సంఘటనను చూద్దాము. ఇంతకుముందు చెప్పినది ఒక ముస్లీమ్ స్త్రీ అయిన హాసన్
యొక్క పునర్జన్మ. ఇపుడు ఒక ముస్లీమ్ అయిన పురుషుని జన్మను గురించి చెప్పుచున్నాము. ఇది కూడా లెబనాన్
దేశములో జరిగినదే.
27

Page 28
1943లో లెబనాన్ దేశమందు “ఫర్మాట” అనే నగరములో రషీద్ ఖాదీజ్ అను వ్యక్తి జన్మించాడు. అతను
ఆటోమొబైల్ మెకానిక్గా జీవించే వాడు. అతనికి 25 సంవత్సరముల వయస్సులో ఒకనాడు ఇబ్రహీమ్ అనే స్నేహితుడు
రషీద్ ను కారులో షికారుకు తీసుకెళ్ళాడు. ఇబ్రహీమ్ సముద్రప్రాంతములో కారును వేగముగా నడుపుచుండగా,
మిలటరీ బీచ్ అనే స్థలములో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురియైనది. అప్పుడు రషీద్ కారులోనుండి బయటకు
పడిపోయాడు. అలా పడినపుడు తలకు బలమైన గాయము కాగా రషీద్ అక్కడికక్కడే మరణించాడు. రషీద్
మరణించిన తర్వాత ఒక సంవత్సరమునకు “డానియల్దర్దీ" అనునతడు జన్మించాడు. డానియల్ జర్దీకి మాటలు
వచ్చినపుడు పలికిన తొలిమాట ఇబ్రహీమ్. ప్రమాదము జరిగిన దినమున కారునడిపిన తన స్నేహితుని పేరు ఇబ్రహీమ్.
డానియల్ జర్డీ అలా అనడము ఎవరికీ అర్థము కాలేదు. ఇబ్రహీమ్ అని ఎందుకు అన్నాడో తెలియలేదు. తర్వాత
రెండేళ్ళ వయస్సులో డానియల్ జర్దీ, తనతల్లి “లతీషా” తో నేను ఇంటికెళ్ళాలి అని అన్నాడు. తర్వాత ఆరు నెలలకు,
అనగా రెండున్నర సంవత్సరమునకు ఇది నా ఇల్లు కాదు, నువ్వు నా తల్లీకాదు. నాకు నాన్న లేడు, నా తండ్రి
మరణించాడు అని కొన్ని మాటలు మాట్లాడాడు. అప్పటి తన తండ్రి అయిన యూసఫ్్న నాన్న అని పిలువకుండా
యూసఫ్ అని పేరుతో పిలిచేవాడు. అంతేగాక తన తండ్రి “నయీమ్” అని చెప్పేవాడు. నయీమ్ అనేది రషీద్ తండ్రి
యొక్క పేరు.
డానియల్ జర్దీకి రెండున్నర సంవత్సరముల వయస్సులోనే అతని కుటుంబమంతా పిక్నిక్కు వెళ్ళగా వారితోపాటు
జర్దీ కూడా పోయాడు. అప్పుడు వారి బంధువులలో ఒకరు పర్మాట్లా అను పేరును తప్పుగా ఉచ్చరించగా, జర్దీ
సరిచేసి చెప్పాడు. అప్పుడు జర్దీ తండ్రి అయిన యూసఫ్ ఈ పేరు నీకెలా తెలుసు అని అడుగగా! ఈ నగరము పేరు
నాకు బాగా తెలుసు, ఇది నేను నివసించిన నగరమే అని చెప్పాడు. డానియల్ జర్దీ చెప్పిన మాటలు అతని కుటుంబము
వారికి ఏమీ అర్థము కాలేదు. తర్వాత కొంత కాలమునకు డానియల్ జర్దీ, తన తల్లీ కారులో ప్రయాణిస్తుండగా, వారి
కారు మిలటరీ బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రదేశాన్ని చూచిన డానియల్ కళ్ళు మూసుకొని, చేతులతో ముఖాన్ని
దాచుకొని ఏడ్వను మొదలు పెట్టాడు. తర్వాత “నేను మరణించింది ఇక్కడే” అని గట్టిగా అరిచాడు. అంతేకాక
గతజన్మలో తాను కారు మెకానిక్ ననీ, తన స్నేహితుడు ఇబ్రహీమ్ కారు నడుపుతుండగా కారు అదుపు తప్పిందనీ,
అపుడు బయటపడిన తాను తలకు గాయమై మరణించానని చెప్పాడు.
ఆ
స్కూల్లో డానియల్ జర్డీ నర్సరీ చదువుచున్న రోజుల్లో తనపేరు డానియల్ జర్డీ కాదనీ, రషీద్ ఖాదీజ్ అని
చెప్పాడు. అదే స్కూల్లోనే మరొక సందర్భములో యుక్తవయస్సులోనున్న అందమైన లేడీటీచర్ను చిన్నగా గిల్లి నువ్వు
చాలా అందంగా ఉన్నావని చెప్పాడట. ఆ విధముగా మాటలలోనూ, చేతలలోనూ కొన్ని సందర్భములలో విచిత్రముగా
కనిపిస్తున్న డానియల్, చెప్పేది ఎంతమటుకు నిజమోనని తెలుసుకొనుటకు అతని తండ్రి యూసఫ్, పర్మట్టాకు
వెళ్ళి డానియల్ వర్ణించిన విధముగా కారు మెకానిక్ను గురించి, మిలటరీ బీచ్వద్ద ఆక్సిడెంట్ను గురించి విచారించగా
డానియల్ చెప్పినదంతా నిజమని తెలిసింది. ఈ విషయమును తెలుసుకొనిన రషీద్ ఖాదీజ్ యొక్క బంధువులూ,
మిత్రులూ డానియల్ను చూచే దానికి బయలుదేరి పోయారు. అలా పోయిన వారిని చూచిన డానియల్ రషీద్ చెల్లెలు
నజ్లాను వెంటనే గుర్తించి ఆమెను పేరుతోనే పిలిచాడు. మొదట తన బంధువులనందరినీ చూడగానే డానియల్ తన
తల్లి లతీషాతో వారందరికీ అరటి పళ్ళు తెచ్చి ఇమ్మని చెప్పాడు. గత జన్మలో రషీదు అరటి పళ్ళంటే చాలా ఇష్టము.
రషీద్ మరణము తర్వాత రషీద్ గుర్తుకు రాకుండ ఉండడానికి రషీద్ తల్లి అతని చెల్లి ఇద్దరు అరటి పళ్ళు తినడము
28

Page 29
మానేశారు. తర్వాత డానియల్ పర్మటకు వెళ్ళగానే తన స్నేహితుడైన ఇబ్రహీమ్ను మరియొక స్నేహితుడైన బజాజ్ను
గుర్తించి మాట్లాడాడు.
రషీద్ కుటుంబము వారంతా రషీద్ తిరిగి డానియల్ జర్దీగా పుట్టాడని అంగీకరించారు. రషీద్ కుటుంబము
డానియల్ ఫోటోను తమ ఇంటిలో ఉంచుకొన్నారు. రషీద్ తన రెండవ జన్మలో కూడా కారు నడపాలంటే భయపడేవాడు.
ఈ విధముగా కారు నడపాలంటే వచ్చు భయముగానీ, వెనుకటి జన్మ జ్ఞాపకముగానీ డానియల్ తెచ్చుకొంటే వచ్చినవి
కావు. డానియల్కు ఏమాత్రము సంబంధము లేకుండా అతని శరీరములోనున్న ఆత్మ చేసిన మూడవ పనిగా మనము
గుర్తించవచ్చును. మనిషి చనిపోతే మళ్ళీ జన్మిస్తాడని మనుషులకు తెలియజేయుటకు ఆత్మ చేసిన పనిగా మనము
చెప్పుకోవచ్చును. ప్రతి మనిషిలో జీవాత్మకు తోడుగా ఆత్మ నివసిస్తూ ఎక్కడో ఒకచోట ఈ విధమైన జ్ఞాపకమును
తెప్పించిన సంఘటనలే పునర్జన్మ వృత్తాంతములు. పునర్జన్మలు లేవు అను వారి వాదన అబద్ధమనీ, ఉన్నాయనడము
శాస్త్రబద్ధమనీ ఆత్మ తెలిపిన ఇటువంటి సంఘటనల వలన తెలియుచున్నది.
మనిషి ఆధ్యాత్మిక విద్యను అరుదుగా తెలుసుకొనును. కొన్ని లక్షల జనాభాలో ఎవడో ఒక్కడు దైవజ్ఞానము మీద
ఆసక్తి కలిగి దానిని తెలియాలని ప్రయత్నించినా, విషయగ్రాహిత లోపము వలనా, భావములు వేరుగా అర్థము చేసుకోవడము
వలనా, హేతుదృక్పదము లేనిదానివలన ఉన్నదానిని లేనట్లు, లేనిదానిని ఉన్నట్లు అర్థము చేసుకొనుచున్నాడు. అందువలన
దేవుని జ్ఞానము ప్రజలలోనికి సత్యరూపములో కాకుండా అసత్యరూపములో ప్రాకింది. భూమిమీద జరిగిన మరియు
జరుగుచున్న పునర్జన్మ సంఘటనల ముందర పునర్జన్మలు లేవు అనడము, దేవుని జ్ఞానము అసత్యముగా కనిపించునట్లు
చెప్పుకోవడమూ పూర్తి మానవుని తప్పిదమగును. పునర్జన్మలు లేవు అని కొన్ని మతముల వారు చెప్పుచున్ననూ ఆ
మత ప్రవక్తలుగానీ, ప్రవక్తల చేత చెప్పించిన దేవుడుగానీ ఎక్కడా పునర్జన్మలు లేవని మాత్రము చెప్పలేదు. స్వర్గనరకములను
చెప్పుకొను వారు నరకములో కష్టమూ, స్వర్గములో సుఖమూ ఉందని చెప్పుచునే దేవుని సన్నిధానమైన పరలోకమును
లేక పరంధామ మును ప్రత్యేకముగా చెప్పకుండా దానిని కూడా స్వర్గముగానే చెప్పుచున్నారు. స్వర్గమునకు, దేవుని
సన్నిధానమునకు నక్కకూ నాగలోకము నకూ ఉన్నంత వ్యత్యాసముందని తెలియక మాట్లాడుచున్నారు. దేవుని సన్నిధానము,
ఇట్లుందని ఎవరూ చెప్పలేనిది. అక్కడికి పోయిన వానికి మాత్రమే తెలియును గానీ ప్రక్కవారికి ఎవరికీ అది ఏమిటో
తెలియదు. అటువంటపుడు దానిని స్వర్గముగా చెప్పుకోవడము పూర్తి తప్పగును. స్వర్గము సుఖాలనిలయము, నరకము
కష్టాలనిలయము. అంతేకాక అవి ఎక్కడో లేవు, ఆ రెండు భూమిమీదనే మనుషుల మధ్యలోనే ఉన్నవి. స్వర్గ
సుఖములను అనుభవించే వారినీ, నరక బాధలను అనుభవించే వారినీ ఇక్కడే చూడవచ్చును. ఆధ్యాత్మికము అనునది
ప్రత్యేకమైన దేవుని రాజ్యము లాంటిది. మతము అనునది ఒక ప్రత్యేకమైన మాయ రాజ్యములాంటిది. నేను జ్ఞానిని
అను వారంతా మత జ్ఞానములో పడిపోయి దేవుని జ్ఞానమును విస్మరించుచున్నారు. అందువలన ఆధ్యాత్మికము
అర్థము కావాలంటే ఏ మనిషి అయినా, ఏ ప్రవక్త చెప్పిన దానినైనా మతమునకు సంబంధము లేకుండా తెలియగలిగితే
దైవగ్రంథములైన ఖురాన్లోను, బైబిలులోను, గీతలోను అసలైన దైవజ్ఞానమే కనబడుతుంది.
బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము పునర్జన్మలు వాస్తవమే అయినా వాటిని కొందరే ఒప్పుకొంటున్నారు. కొందరు
హేతువాదులు, నాస్తిక వాదులు ఒప్పుకోవడము లేదు. వాస్తవముగా హేతువాదమన్నది సత్య పరిశోధన నిమిత్తమే
ఉండినా, హేతువాదులమనువారు మాత్రము సత్య శోధన చేయడము లేదు. తమను తాము మేధావులుగా వర్ణించుకొను
నేటి హేతువాదులు తమకు తెలియని వాటిని మూఢనమ్మకములనీ, మానసిక రోగములనీ కొట్టివేయుచున్నారు. అందువలన
29

Page 30
హేతువాదులనువారు నేడు నాస్తికులుగా ఉన్నారని చెప్పవచ్చును. ఎక్కడో ఏ దేశములోనో కాకుండా భారతదేశములో
కూడా "ధృవం జన్మ మృతస్యచ" అనుమాట నిరూపణ నిమిత్తము అనేక చోట్ల అనేక పునర్జన్మలు జరిగాయి. ప్రత్యక్ష
నిరూపణకు వస్తూ సాక్ష్యాధారములు దృఢముగా కనిపిస్తున్నా, కొందరు హేతువాదులు అదొక మానసిక రోగమని,
వాస్తవముకాదని చెప్పిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అయినా ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన “ఇయాన్ స్టీవెన్సన్”
అనునతడు ఇటు సైన్సును, అటు విశ్వాసమును అనుసంధానిస్తూ పరిశోధనలు చేసి చివరకు పునర్జన్మలు అనునది
విజ్ఞానపరమై ఒక సిద్ధాంతమని చెప్పాడు. వారు ఎన్నో పరిశోధనలు చేసి 1993లో పునర్జన్మలు సత్యమని చెప్పారు.
అయితే మేము విజ్ఞానముగా ఏ పరిశోధన చేయకుండా, జ్ఞాన పరిశోధన మాత్రము చేసి, 1980 సంవత్సరములోనే
“జనన మరణ సిద్ధాంతము” ను బహిర్గతము చేశాము. తర్వాత ఆ సిద్ధాంతమునకు అను సంధానముగా “మరణ
రహస్యము” ను తెలిపాము ఇప్పుడు "పునర్జన్మ రహస్యము” ను తెలుపుచున్నాము. మా శోధనలో ప్రతి చిన్న ప్రశ్నకు
జవాబునిచ్చాము. అంతేకాక ఇప్పుడు భారతదేశములో ఇక్కడి పరిస్థితిలో కలిగిన పునర్జన్మలను వివరిస్తూ వాటిలోని
ప్రశ్నలకు జవాబును చెప్పదలచుకొన్నాము. ఇతర దేశమైన లెబనాన్లో జరిగిన సంఘటనలు ప్రత్యేకించి ఇస్లామ్
సమాజములో జరిగినవికాగా, ఇక్కడ భారతదేశములో జరిగిన సంఘటనలు ఇందూ (హిందూ) సమాజములో జరిగినవి.
వాటిలో ఒకదానిని క్రింద వివరించుకొని చూస్తాము.
భారతదేశములో ద్వాపరయుగము నుండి పునర్జన్మలను బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీత శాస్త్రీయముగా చెప్పుచూనే
వచ్చింది. అయినప్పటికీ కొందరు దానిని కాలక్షేపమునకు చెప్పుకొనే కథలాగా లెక్కించుకొన్నారు గానీ, అది మానవ
జీవిత చరిత్రలో జరుగుచున్న సత్యమని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కొందరైతే పునర్జన్మ అనునది అసత్యమని
చెప్పిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇటీవల కాలములో భారతదేశానికి సంబంధించిన “విక్రమరాజ్సింగ్ చౌహాన్”
అనే ఫోరెన్సిక్ సైంటిస్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రములోని ఝాన్సీలోనున్న బుందేల్ ఖండ్ యూనివర్శిటీ యందు జరిగిన “నేషనల్
కాన్ఫెరెన్స్ సైంటిస్ట్ ఇన్ ఇండియా” మీటింగ్కు హాజరై, తాను పునర్జన్మలను బలపరుస్తున్నట్లు చెప్పడమే కాకుండ,
పునర్జన్మ జ్ఞాపకాల వివరాలను తెలియజేసే ఒక "కేసుస్టడీ”ని ఆ సమావేశములో సమర్పించాడు. ఆ వివరాలు ఇలా
ఉన్నాయి. తరనిత్సింగ్ అనే ఆరు సంవత్సరముల బాలుడు పంజాబ్ రాష్ట్రములోని “ఆల్నమియానా” అనే గ్రామానికి
చెందినవాడు. అతడు తన తల్లితండ్రులకు తన గత జన్మ వివరాలు చెప్పేవాడు. తాను గతజన్మలో “చక్కేలా” అనే
గ్రామానికి చెందిన నివాసియనీ, తనపేరు సత్లామ్సంగ్లియనీ, తాను 1992 సెప్టంబర్ 10వ తేదిన స్కూల్నుండి తిరిగి
వస్తుండగా ఒక స్కూటర్ తనను వేగముగా తగిలిందనీ, దానివలన తన తలకి గాయమైందనీ, ఆ గాయము కారణముగా
రెండవ రోజు మరణించాననీ, తనను గత జన్మలోని తన బంధువులవద్దకు తీసుకెళ్ళమనీ రోజూ అడిగేవాడు. తరని జిత్ సింగ్
రెండు సంవత్సరముల వయస్సులోనే గత జన్మ జ్ఞాపకాలను గురించి వచ్చీరాని మాటలతో వివరిస్తూ వుండేవాడు.
తరనిత్సింగ్ చిన్న పిల్లవాడైన దానివలన అతని మాటలను ఎవరూ పట్టించుకొనే వారు కాదు. అతనికి ఆరు
సంవత్సరముల వయస్సు వచ్చే టప్పటికీ అతనిలో పూర్వజన్మ జ్ఞాపకాలు ఎక్కువగా వచ్చేవి. దానివలన అతడు తన
తల్లిదండ్రులతో తనను గతజన్మలోని గ్రామానికి తీసుకెళ్ళమని ఏడుస్తూ చెప్పేవాడు. అతని బాధను చూడలేక అతని
తండ్రి రంజిత్ సింగ్ ఆ బాలుడు చెప్పిన చక్కేలా అను గ్రామానికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఆ బాలుడు చెప్పిన
కుటుంబము ఆ ఊరు వదలి పోయిందని తెలిసి అక్కడనుండి ఆ కుటుంబమున్న ఊరుకు పోయారు. అక్కడ తరని జిత్సింగ్
చెప్పిన గతజన్మలోని అతని తల్లి తండ్రులను ఆ బాలుడు గుర్తించాడు. అప్పుడు ప్రస్తుత జన్మ తండ్రి అయిన రంజిత్
30

Page 31
సింగ్ వారికి ఆ బాలుని విషయము అంతా చెప్పినప్పటికీ, ఎప్పుడో చనిపోయిన తన కొడుకు మళ్ళీ జన్మించి తమవద్దకు
వచ్చాడంటే వారికి నమ్మకము కుదర లేదు. ఆ బాలుడు పోయిన జన్మలో తమ కొడుకని ఒప్పుకోకపోవడముతో ఆ
బాలునికి విసుగువచ్చి తాను గత జన్మలో యాక్సిడెంటు గురియైనపుడు తన దగ్గరున్న పుస్తకాలపై రక్తపుమరకలు
పడ్డాయనీ, తను ప్రమాదానికి గురియైనపుడు తన జేబులో 150 రూపాయలు డబ్బు ఉన్నదనీ, ఆ డబ్బు ఫలానా
దుకాణాదారునికి ఇవ్వవలసి ఉన్నదని చెప్పాడు.
ఆ మాటలు వినిన ఆ బాలుని గతజన్మ తల్లి అతను తన కొడుకేనని నమ్మి భోరున ఏడుస్తూ ఎండిపోయిన
రక్తపుమరకలున్న స్కూలు పుస్తకాలను తెచ్చి అతనికి చూపించింది. ఈ విధముగా బయటపడిన తరనిత్సింగ్ అను
బాలుని పూర్వజన్మ వృత్తాంతమంతయూ కొద్ది రోజులలోనే ఉత్తర భారతదేశమంతా వ్యాపించిపోయింది. ఈ విషయమంతా
ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయిన విక్రమిసింగ్ చౌహాన్ దాకా వెళ్ళింది. మొదట ఆయన కూడా ఈ విషయాన్ని నమ్మలేదు.
అయినా నిజానిజాలను ప్రజలకు తెలియజేయు నిమిత్తము వాస్తవమేమిటో తానే స్వయముగా తెలుసుకోవాలని నిర్ణయానికి
వచ్చి తరనిత్సింగ్్న కలుసుకొన్నాడు. ఆ బాలుడు చెప్పిన గతజన్మ తల్లి తండ్రులను కూడా కలిసి మాట్లాడాడు.
ఫోరెన్సిక్ సైన్స్ ఆధారముగా తరన్ జిత్ సింగ్, పూర్వజన్మ వృత్తాంతములోని నిజనిజాలను తెలుసుకోవాలను కొన్నాడు.
ఆ బాలుడు గతజన్మలో స్కూలు విద్యార్థిగా ఉన్నపుడు వ్రాసిన నోట్ పుస్తకాన్ని తీసుకొన్నాడు. ఆ పుస్తకములోని చేతి
వ్రాతతో ఈ జన్మలోని తరనిత్సింగ్ చేతి వ్రాతను పోల్చి చూచాడు. మనుషులందరి చేత వ్రాత ఒకేలాగ ఉండదు.
అంతేకాక ఏ ఇద్దరి వ్యక్తుల చేతి వ్రాత కూడ ఒకే రకముగ ఉండదు. ఆ కారణముగా ఫోరెన్సిక్ సైన్స్ ఫోర్జరీ
సంతకాలను గుర్తించగలుగుతుంది. సహజంగా ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయిన విక్రమరాజ్ తనకున్న శాస్త్రపరిజ్ఞాన ఆధారముగా
తరనిత్సింగ్ గతజన్మ చేతివ్రాత, ఈ జన్మలోని చేతివ్రాత రెండూ అచ్చుగుద్దినట్లుగా ఒకే విధముగా ఉన్నాయని
తెలుసుకొన్నాడు. ఇక్కడ గమనించదగిన విషయమేమంటే! ఈ జన్మలో తరని జిత్సింగ్ ఒక నిరుపేద కుటుంబములో
జన్మించిన దానివలన అతనికి ఏనాడూ స్కూలుకు వెళ్ళి అక్షరాలు నేర్చుకొనే అవకాశమే రాలేదు. ఆ విషయము
విక్రమాజంగ్కు తెలియదు. అతను సాధారణముగా ఆ బాలున్ని కాగితము మీద ఏదైనా వ్రాయమని అడిగినపుడు
ఆ బాలుడు ఇంగ్లీషులోనూ, పంజాబీలోను కొన్ని వాక్యములు వ్రాశాడు. దీనినిబట్టి గతజన్మలో నేర్చుకొన్నదే ఇప్పుడు
కూడా వచ్చిందని అర్థమగుచున్నది.
తరన్సింగ్ అనే బాలుని పునర్జన్మ విషయములో ముఖ్యముగా గమనించదగిన విషయమేమంటే! పూర్వజన్మలు
ప్రతి మనిషికి ఉన్నవి. సృష్టి ఆదిలో దేవుడు మనుషులను సృష్టించాడు. అలా సృష్టించబడినపుడు మనిషి క్రొత్తగా
పుట్టుచున్నాడు. కావున మనిషికి సృష్టి ఆదిలో జన్మ కలిగినదనీ, తర్వాత వచ్చినవన్నీ పునర్జన్మలేనని ముందే చెప్పాము.
ఆ లెక్కప్రకారము మీది, నాది పునర్జన్మయే, కానీ గతజన్మ ఏమిటో మీకు గానీ, నాకు గానీ తెలియదు. తెలియకపోవడానికి
కారణము ఆ జన్మ జ్ఞాపకములు మనకు లేవు కావున తెలియలేదు. పోయిన జన్మ తెలియాలి అంటే దానిని ఆత్మే
తెలియజేయాలి. అలా ఆత్మ తెలుపడమును ఆత్మ యొక్క మూడవ పనిగా చెప్పుకొన్నాము. ఆత్మ సర్వ స్వతంత్రమైనది.
అది ఒకనికి వెనుకటి జన్మ కొన్ని జ్ఞాపకాలను మాత్రము కలుగజేసి వానిది పునర్జన్మ అని తెలియునట్లు చేయుచున్నది.
అంతేకాకుండా ఎవనికో ఒకనికి పూర్వజన్మ జ్ఞాపకాలతో పాటు ఆ జన్మలోని అలవాట్లను కూడా వానికి వచ్చునట్లు
చేయుచున్నది. అలవాట్లనే కాకుండా పోయిన జన్మలోని చదువునూ, వ్రాతను కూడా తరని జిత్
సింగ్కు వచ్చునట్లు
అతని ఆత్మ చేసినది. ఈ విధముగా పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చిన వారందరికి జరుగునా అంటే అలా అన్ని జ్ఞాపకాలను
31

Page 32
ఆత్మ అందిస్తుందని చెప్పలేము. కొందరికైతే పూర్వజన్మ జ్ఞాపకము ఏమాత్రము ఇవ్వకుండా గత జన్మలోని విద్యను
మాత్రము అందివ్వగలదు. అలా చేయడము వలన కొందరు అరుదుగా చిన్న వయస్సులోనే తమ సంగీత ప్రావీణ్యతను
చూపుచున్నారు. అలాగే కొన్ని విద్యలను నేర్వకనే వాటిలోని పాండిత్యము కొందరిలో బయటపడచున్నది. దానికి
పూర్వజన్మ సంస్కారము అని కొందరంటుంటారు. గాయకుడైన బాలసుబ్రమణ్యమునకు సంగీతము నేర్వకుండానే
వచ్చింది, నేర్చినవారికంటే అతను ఎక్కువ ప్రావీణ్యత చూపుచున్నాడు. అయితే దానికి కారణము అతని ఆత్మ అని
ఎవరికీ తెలియదు, అతనికి కూడా తెలియదు. ఈ విధముగా ఆత్మ వెనుకటి జన్మలోని ఏ విషయమునైనా తర్వాత
జన్మకు కలుగజేయుచున్నది.
మానవ శరీరములో మూడు భాగములుగానున్న పరమాత్మ, ఆత్మ, జీవాత్మలలో పరమాత్మ (దేవుడు) ఏ పనినీ
చేయడనీ, రూప, నామ, క్రియలు లేనివాడని చెప్పుకొన్నాము. అలాగే చివరిదైన జీవాత్మ కూడా ఏ పనినీ చేయదుగానీ,
అనుభవించేది మాత్రమున్నది. జీవాత్మ అన్ని విధముల గ్రుడ్డివాడే! వానికి ఏమీ తెలియదు, ఏమీ చేయడు. అయితే
జీవాత్మకు ఆకారమున్నది, అనుభవమూ ఉన్నది. ఇక రెండవదైన ఆత్మ యొక్క విషయానికి వస్తే, ఆత్మ శరీరములో
ఉండినా ఎవరూ దానిని గుర్తించకుండా ఉన్నది. శరీరములోని జీవాత్మ, పరమాత్మలు రెండూ పని చేయకున్ననూ
తాను మాత్రము ఒక్క క్షణము కూడ ఊరక ఉండక పని చేయుచున్నది. కొందరు ఆధ్యాత్మికమార్గములో ప్రయాణించు
వారు ఆత్మ అను శబ్దమును అనేకమార్లు తమ మాటలలో పలుకుచున్ననూ, ఆత్మ ప్రత్యేకమైనదని వారికి తెలియకుండా
పోయినది. ఆత్మను చాలామంది అటు పరమాత్మగానో లేక జీవాత్మగానో పోల్చుకొనుచున్నారు తప్ప, ఆత్మ అంటే
శరీరములో జీవాత్మకు ఎల్లప్పుడూ తోడుగానున్న ప్రత్యేకమైన కార్యాచరణ కలదని ఎవరూ తెలియ జేయలేకపోయారు.
ఆత్మ యొక్క కార్యాచరణములు మొత్తము మూడు రకములని కూడ తెలియలేక పోయారు. ఇప్పుడు మనము ఆత్మ
యొక్క మూడవ కార్యాచరణమును గురించి చెప్పుకొంటున్నాము. ఆత్మయొక్క మూడవ పనిలోనే పునర్జన్మ విషయములు
మనిషినుండి బయటపడుచున్న వని కూడా తెలుసుకొన్నాము. ఆత్మ బయట వ్యక్తులతోగానీ, బయటి ప్రదేశములతోగానీ
గతజన్మలలో ఉండిన సంబంధమును తెలియజేసినప్పుడే మనిషికి పునర్జన్మ ఉన్నదనీ అర్థమగుచున్నది. ఒకవేళ ఆత్మ
తన మూడవ పనిలో గత జన్మలోని వ్యక్తులతోనూ, ప్రదేశములతోనూ గల సంబంధము లను తెలియజేయకుండా,
గతజన్మలోని కేవలము శరీర అంతర్గతములోని విద్యలనుగానీ, అలవాట్లనుగానీ, పాండిత్యమునుగానీ, భాషలనుగానీ
మేధా శక్తినిగానీ తెలియజేసినప్పుడు, అటువంటి విషయముల ఆధారముతో పునర్జన్మలుగలవని తెలుసుకోలేక పోవుచున్నారు.
అంతేకాక శరీరములోని విషయములేగాక శరీరము మీద వచ్చిన గుర్తుల వలన కూడా పూర్వ జన్మలున్నాయనీ, ప్రస్తుతము
తనది పునర్జన్మ అని ఎవరూ తెలియలేక పోవుచున్నారు. గత జన్మలు ఉన్నాయని మనుషులు తెలుసుకొనుటకు ఆత్మ
అప్పుడప్పుడు ఎవరిలోనో ఒకరిలో గతజన్మలోని అంతర్గత జ్ఞాపకములనుగానీ, బహిర్గత జ్ఞాపకములనుగానీ
కలుగజేయుచుండును. అట్లు తెలియజేయడమేకాక కొందరికి శరీరము మీద గత జన్మలోని గుర్తులను కూడా మళ్ళీ
జన్మలో వచ్చునట్లు చేయుచున్నది. అటువంటి సంఘటనను క్రింద వివరించుకొందాము.
ఇంగ్లాండ్లోని “హెక్స్ హేమ్” అను నగరములో నివాసమున్న జాన్ పోల్లాక్ మరియు ఫ్లోరెన్స్ అను దంపతులకు
ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. పెద్దమ్మాయి పేరు జున్నా, రెండవ అమ్మాయి పేరు జాక్విలిన్ పెద్దమ్మాయి జున్నా
వయస్సు 11 సంవత్సరములు, చిన్నమ్మాయి జాక్విలిన్ వయస్సు 6 సంవత్సరములు. ఆనందముగా సాగిపోతున్న
జానోపోల్లాక్ కుటుంబములో ఉన్నట్లుండి ఒక విషాదము జరిగిపోయింది. 1957 సంవత్సరము, మే 5వ తేదీన ఇద్దరు
32

Page 33
అమ్మాయిలూ స్కూలుకు బయలుదేరిపోయారు. అలా పోయిన వారు తిరిగి ఇంటికి రాలేదు. రోడ్డు ప్రమాదములో
జున్నా, జాక్విలిన్ ఇద్దరూ మరణించారు. అప్పటికి పోల్లాక్ కుటుంబములో అది కోలుకోలేని విషాధమైనది. కొన్ని
నెలలు ఆ విషాదము నుండి ఆ కుటుంబము బయటపడలేక పోయింది. తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరమునకు
అనగా 1958, అక్టోబర్ 4వ తేదిన ప్లోరెన్స్కు కవలపిల్లలు జన్మించారు. పుట్టినవారు ఇద్దరూ ఆడపిల్లలు కావడము
విశేషముకాగా, వారిలో మరొక విచిత్రము కనిపించింది. అదేమనగా పుట్టిన ఇద్దరు కవలలలో చిన్నమ్మాయికి నుదిటి
మీద చిన్నగాటు (గాయము మానిన గుర్తు) ఉండడము కనిపించింది. జాన్ రెన్స్ కుటుంబములో చనిపోయిన ఇద్దరు
ఆడపిల్లల్లో చిన్నమ్మాయి జాక్విలిన్కు సరిగ్గా నుదుటి మీద గాయము మానిన గుర్తు ఉండేది. ఒకప్పుడు చిన్నమ్మాయి
జాక్విలిన్ సైకిల్ త్రొక్కుచు క్రిందపడినప్పుడు నుదుటి మీద గాయమైవుండేది. ఇప్పుడు పుట్టిన చిన్నమ్మాయికి కూడా
నుదుటి మీద అదే ప్రాంతములో గాయము యొక్క గాటు రావడము గుర్తింపదగిన విషయము. అలా వచ్చిన గాయము
యొక్క మచ్చ ఆమె గత జన్మలోనిదని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఆ మచ్చలో గతజన్మ సంబంధ మర్మమున్నదని
తెలుసుకోలేక పోయారు.
పుట్టిన కవలపిల్లలకు నాలుగునెలల వయస్సు వచ్చినపుడు పొల్లాక్ కుటుంబము తాము నివసిస్తున్న హెకేహేమ్
నగరమును వదలి అక్కడికి 40 కిలోమీటర్ల దూరములోనున్న “వైటికిబే” అను గ్రామానికి పోయారు. తర్వాత నాలుగు
సంవత్సరములు వారు తిరిగి హెక్సేమ్ నగరమునకు రాలేదు. తర్వాత ఒకరోజు పొల్లాక్ కుటుంబము ఇద్దరు
పిల్లలతో సహా హెక్సా హేమ్ నగరానికి వచ్చారు. అలా వారు వచ్చిన వెంటనే నాలుగు సంవత్సరముల వయస్సున్న
ఇద్దరు పిల్లలు గతజన్మలో తాము నివసించిన ఇంటిని గుర్తుపట్టారు. అందులో తామున్న గదులనూ, తాము ఆడుకున్న
చోటును గుర్తించారు. అంతేకాకుండా వారు చదుకున్న స్కూల్ను కూడా గుర్తించి చెప్పారు. దానితో వారు ఇద్దరూ
గతజన్మలోని తమ బిడ్డలేనని తల్లిదండ్రులు తెలుసుకొన్నారు. ఇక్కడ ఈ సంఘటనలో చిన్నమ్మాయికి గతజన్మలో
తగిలిన గాయము యొక్క గుర్తు రెండవ జన్మలో అదే చిన్నమ్మాయికి రావడమును మనము విశేషముగా గుర్తించవచ్చును.
ఇటువంటి సంఘటననే మరొక దానిని వివరిస్తాము చూడండి.
స్టీవెన్సన్ అను అమెరికా శాస్త్రవేత్త భారతదేశములో ఒక బాలుని పునర్జన్మను గురించి పరిశోధించడము జరిగింది.
ఆయన పరిశీలించిన దానిలో ఒక వ్యక్తి గతజన్మలో సైనికుడుగా పని చేశాడట. ఒక సందర్భములో శత్రువులు అతన్ని
షాటన్తో చాలా దగ్గరనుండి కాల్చారట. అప్పుడు అతని ఛాతినుండి బుల్లెట్ దూసుకపోయి మరణించాడట.
విధముగా చంపబడిన వ్యక్తి తిరిగి మహారామ్ అనే వ్యక్తిగా జన్మించాడు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే తిరిగి
జన్మించిన మహారామ్ అనే బాలుని ఛాతి మధ్య భాగములో షాన్ యొక్క బుల్లెట్ దిగితే ఎలా ఉంటుందో, అలాంటి
ఆకారములో విచిత్రమైన పెద్దపుట్టు మచ్చ ఉన్నది. స్టీవెన్సన్ మహారామ్ అనే బాలుని వృత్తాంతమును లోతుగా
పరిశీలించి మహారామ్ చెప్పిన గతజన్మ విషయములన్ని నిజమేనని అతనిది పునర్జన్మ అని రుజువు చేసుకొన్నాడు.
ఇదే విధముగా స్టీవెన్సన్ థాయ్లాండ్ దేశములో పూర్వ జన్మ జ్ఞాపకములు వచ్చిన ఒక బాలున్ని కలుసుకొని, అతని
వెనుక జన్మ జ్ఞాపకాలను పరిశీలించాడు. ఆ బాలుడు గతజన్మలో తన చిన్నాన్న చేత తల వెనుక భాగములో పిడికత్తితో
పొడువబడి దారుణముగా హత్య చేయ బడ్డాడని తెలుసుకొన్నాడు. అలా అతను చనిపోయిన దానివలన అతను పుట్టిన
రెండవ జన్మలో అతని శరీరము మీద తల వెనుక భాగములో పెద్ద గాయము ఆకారములో పుట్టుమచ్చలాంటి ఆకారము
ఏర్పడి ఉండడము స్టీవెన్సన్ గమనించాడు. ఈ విధముగా పునర్జన్మల పరిశోధకుడైన స్టీవెన్ చాలామందికి గతజన్మలలోని
33

Page 34
ఏదో ఒక గుర్తు రెండవ జన్మలోనికి మచ్చల రూపములో రావడమును చూచాడు. ఒక శరీరములో ఒక కారణము చేత
ఏర్పడిన మత్స ఆ కారణమును సూచించు గుర్తులాగా, తర్వాత వచ్చు జన్మలలో శరీరము మీద కొన్ని జన్మల వరకు
గానీ లేక అనేక జన్మల వరకు గానీ ఏర్పడుచూ వచ్చునట్లు ఆత్మ చేయగలదు. ప్రతి శరీరము నకు పుట్టుకతోనే ఏదో
ఒక మత్స ఉండును. మత్స లేక మచ్చ అనునది ఆత్మ తెలియజేయు జీవుని యొక్క గతజన్మ గుర్తుయేకాక, శరీరము
దేవుని (పరమాత్మ) స్థానమై ఉన్నదని తెలియజేయు గుర్తుగా కూడా ఉన్నది. మత్స అనునది ఒక విధముగా గతజన్మలోని
ప్రకృతి యొక్క శరీరమును గుర్తు చేయునదికాగా, ఒక విధముగా పరమాత్మ యొక్క ఉనికి శరీరములో కూడా ఉన్నదని
తెలుపుచున్నది.
పునర్జన్మలో మరొక ముఖ్యమైన విషయమును పరిశీలించి చూస్తాము. అదేమనగా! ఒకవ్యక్తి చనిపోయిన
తర్వాత కొంత కాలమునకు తిరిగి పుట్టినట్లు కొందరికి వచ్చిన పునర్జన్మ జ్ఞాపకాల వలన తెలిసిపోయింది. అయితే
చనిపోయిన తర్వాత ఎంత కాలమునకు వారు తిరిగి పుట్టారు? అలా కొంతకాలము తర్వాత పుట్టుటకు కారణమేమి?
చనిపోయిన తర్వాత తిరిగి పుట్టిన కాలము అందరికి ఒకేలాగ ఉన్నదా? అని ప్రశ్నించుకొని చూస్తే ఇంకా కొంత
ఆసక్తికరమైన జ్ఞానము తెలియగలదు. ఇంతవరకు మనము తెలుసుకొన్న కొందరి పునర్జన్మల సమాచారములో వారు
తిరిగి పుట్టిన కాలము ఒక పరిమితిగా లేదు. ఒకరు సంవత్సరము తర్వాత పుట్టితే, ఇంకొకరు ఐదు సంవత్సరముల
తర్వాత పుట్టారు. ఇట్లు ఒక కాలపరిమితి అనునది లేకుండా, అనేకమంది అనేక రకముల కాలములలో పుట్టారు.
ఇప్పుడు కాలపరిమితి మీద దృష్టిపెట్టి వేరువేరు కాలములలో తిరిగి జన్మలు తీసుకొన్న వారిని గురించి వివరించుకొని
చూస్తాము.
ప్రఖ్యాత అమెరికన్ పారా సైకాలజిస్ట్ స్టీవెన్ సన్ సహచరుడు అయిన ప్రొఫెసర్ హెచ్.ఎన్. బెనర్జీ భారతదేశములో
తొలి పారా సైకాలజిస్ట్ అని చాలామందికి తెలియదు. అటువంటి హెచ్.ఎన్. బెనర్జీ స్వయముగా పరిశోధించి పూర్వజన్మ
జ్ఞాపకములు వచ్చిన ఒక బాలిక వృత్తాంతమును ప్రపంచమునకు తెలియజేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రములోని ఛత్రాపూర్
పట్టణములో ఒక సాంప్రదాయ మరియు సంపన్న బ్రాహ్మణ కుటుంబము నందు స్వర్ణలత మిశ్రా అనే పేరుగల
అమ్మాయి 1948లో జన్మించింది. ఆమెకు మూడు సంవత్సరముల వయస్సున్నపుడు ఇమె తండ్రి ఆమెను తీసుకొని
అక్కడికి 160 కిలోమీటర్ల దూరములోనున్న వారి స్వంత ఊరైన కాట్నె అను పట్టణమునకు వెళ్ళడము జరిగింది.
అప్పుడు స్వర్ణలత మిశ్రా కాట్నే పట్టణ శివారు ప్రాంతమునుండి ఒకవైపు వెళ్ళే రహదారిని తన తండ్రికి చూపి, ఆ రోడ్డు
వెంట వెళ్ళితే “జురుకుటియా” అనే గ్రామము వస్తుందని చెప్పింది. ఎన్నడూ ఇల్లుదాటి ఎరుగని తన కుమార్తె,
అందులోనూ మూడు సంవత్సరముల వయస్సు కూడా పూర్తికాని పసిపిల్ల తన ఊరికి 160 కిలోమీటర్ల దూరములోనున్న
ఇంకో ఊరికి వెళ్ళే మార్గమును ఎలా తెలుసుకొన్నదని ఆశ్చర్యపోయాడు.
తండ్రి ఏదో మాట్లాడాలని నోరు తెరిచేలోగా స్వర్ణలత తన తండ్రితో తాను గతజన్మలో జురుకుటియా గ్రామములో
జీవించేదాన్ననీ, తన పేరు బియాపాఠక్ అనీ, తనకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, తన భర్తపేరు చింతామణి పాండే
అనీ, తనకు గొంతులో వచ్చిన తీవ్రమైన నొప్పికి జబల్ పూర్ పట్టణములోని ఎస్.సి. భారత్ అనే డాక్టరు వైద్యము
చేశాడనీ, కానీ తనకు రోగము ఎక్కువై 1939లో మరణించాననీ వచ్చీరాని మాటలతో చెప్పింది. ఆమె చెప్పిన
మాటలను చాలా ఆసక్తిగా విన్న ఆమె తండ్రి ఆమె చెప్పిన మాటలలోని నిజనిజాలను తెలుసుకోవాలని జురుకుటియాకు
వెళ్ళాడు. స్వర్ణలత చెప్పినట్లుగానే ఆమె గతజన్మ భర్త అయిన చింతామణి పాండేను కలిసి తన కుమార్తె స్వర్ణలత
34

Page 35
మిశ్రాకు వచ్చిన పూర్వజన్మ జ్ఞాపకాలను ఆయనకు తెలియజేశాడు. అప్పుడు చింతామణి పాండే తన భార్య బియాపాఠక్
1939లోనే చనిపోయిందని స్వర్ణలత తండ్రికి తెలియజేశాడు. అయితే పాండే, 12 సంవత్సరముల క్రిందట చనిపోయిన
తన భార్య మరలా స్వర్ణలతగా జన్మించిందంటే నమ్మలేకపోయాడు. తర్వాత ఈ విషయము మధ్యప్రదేశ్ అంతటా
ప్రాకిపోయింది. చివరకు ప్రఖ్యాత భారతీయ సైకాలజిస్ట్ హెచ్.యన్.బెనర్జీ దాకా వెళ్ళింది. స్వర్ణలత యొక్క పూర్వజన్మ
వృత్తాంతములోని నిజానిజాలను తెలుసుకోవాలనుకొన్న హెచ్.యన్. బెనర్జీ మొదట స్వర్ణలతను కలిసి, ఆమె గత జన్మలోని
పూర్వజన్మ కుటుంబీకుల వివరాలనూ, ఆమె గతజన్మలో జీవించిన ఇల్లు ఎలా ఉంటుంది మొదలగు విషయములనూ
తెలుసుకొని, తర్వాత జురుకుటియా గ్రామానికి వెళ్ళి స్వర్ణలత చెప్పిన వివరాలతో పోల్చి చూచుకొని, స్వర్ణలత చెప్పినవన్నీ
నిజమేననీ, గత జన్మలోని బియాపాఠక్ ఇప్పుడు స్వర్ణలతగా పుట్టినదనీ నిర్ణయానికి వచ్చాడు. కొంతకాలము గడచిపోగా
స్వర్ణలతకు పది సంవత్సరముల వయస్సు వచ్చినది. ఆ వయస్సులో గత జన్మ జ్ఞాపకముల వలన స్వర్ణలతకు మనశ్శాంతి
లేకుండా పోయినది. ఆ సమయములోనే డాక్టర్ స్టీవెన్ సన్ ఇండియాకు రావడము జరిగింది.
ఆ
స్టీవెన్సన్ తన మిత్రుడైన బెనర్జీ ద్వారా స్వర్ణలత పునర్జన్మను గురించి తెలుసుకొని ఎంతో ఉత్తేజితుడయ్యాడు.
విషయము మీద ఆసక్తి కల్గిన స్టీవెన్, స్వర్ణలత గతజన్మ భర్త అయిన చింతామణి పాండేను వెంటబెట్టుకొని స్వర్ణలత ఉ
ంటున్న ఛాత్రాపూర్కు వచ్చి స్వర్ణలతను కలుసుకొన్నాడు. స్వర్ణలత తన గతజన్మ భర్తను చూడగానే గుర్తుపట్టి సిగ్గుతో
తలవంచుకొన్నది. అప్పుడు స్టీవెన్ సన్ పాండేను స్వర్ణలతకు పరిచయము చేశాడు. స్వర్ణలత ఎన్నో గుర్తులను
చెప్పినప్పటికీ, పాండే ఆమెను గతములోని తన భార్యగా అంగీకరించలేదు. దానితో ఆమె అతనిని ఒక విషయమును
అడిగినది. ఆమె పాండేతో "నేను నా బీరువాలో బట్టల అడుగున పెట్టిన 1200 రూపాయలను ఫలానా రోజున మీరు
దొంగిలించలేదా” అని అడిగింది. దానితో పాండే ఖంగుతిన్నాడు. కేవలము తమ దంపతులకు ఇద్దరికీ మాత్రమే
తెలిసిన రహస్యము పది సంవత్సరముల పాపకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. దానితో చిన్నపిల్లగానున్న
స్వర్ణలత గతములోని తన భార్యయేనని చింతామణి పాండే ఒప్పుకొన్నాడు. దానితో స్వర్ణలతది పునర్జన్మ అని డాక్టర్
స్టీవెన్సను రుజువైంది. ఈ విధముగా స్వర్ణలత పునర్జన్మ వృత్తాంతము 1950 నుండి 1960 మధ్యకాలములో
ప్రపంచ వ్యాప్తముగా ఎంతో సంచలనమును సృష్టించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రములో పుట్టిన స్వర్ణలత చావుకు పుట్టుకకూ మధ్య కాలము తొమ్మిది సంవత్సరములు గడిచింది.
బియాపాఠక్ 1939లో చనిపోయిన ఆమె 1948లో స్వర్ణలతగా జన్మించింది. ఒకచోట లేకుండా పోయి మరియొక
చోటికి వచ్చిన ఆమె, తొమ్మిది సంవత్సరముల మధ్య కాలములో ఎక్కడున్నది? అని ప్రశ్నరాక తప్పదు. బియాపాఠక్
చనిపోయి స్వర్ణలతగా పుట్టుటకు పట్టిన కాలమే అందరికీ చావు పుట్టుకల మధ్య ఉన్నదా అని చూస్తే అలాగా కూడా
లేదు. బయటపడిన పునర్జన్మలను పరిశీలిస్తే ఒకరికి రెండు సంవత్సరములు, మరియొకరికి మూడు సంవత్సరములు
కాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలవ్యవధి ఉండడమును మనము గమనించ వచ్చును. ఉదాహరణకు మరియొక పునర్జన్మ
సమాచారమును వివరించుకొని చూస్తాము.
మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు కల్పనాచావ్లా పేరు విననివారుండరు. భారతీయ మహిళా
సాహసానికీ, మేధస్సుకూ చిహ్నముగా నిలిచిపోయిన పంజాబ్ రాష్ట్రమునకు చెందిన కల్పనాచావ్లా, అమెరికా దేశానికి
చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA (నాసా) లో పని చేసేది. అంతరిక్షములోనికి ప్రయోగించిన కొలంబియా
స్పేస్ షిప్ లో ఇతర పాశ్చాత్య అంతరిక్ష యాత్రికులతోపాటు అంతరిక్ష యాత్రలో పరిశోధకు రాలిగా పాల్గొని
35

Page 36
అంతరిక్షములోనికి ప్రయాణించింది. ఆకాశములోనే కొంతకాలము గడిపి పరిశోధన సాగించిన తర్వాత కొలంబియా
స్ఫేర్షిప్ భూమికి తిరుగు ప్రయాణము మొదలుపెట్టింది. 2003వ సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన ఇంకో పదహారు
(16) నిమిషములలో భూమిమీద దిగబోతున్న కొలంబియా స్పేన్షిప్ దురదృష్ట వశాత్తు ఊహించని పరిణామముల
వలన ఆకాశములోనే భూమి వాతావరణము లోనికి ప్రవేశిస్తూనే ప్రేలిపోయింది. దానితోపాటు అందులో ప్రయాణిస్తున్న
అంతరిక్ష యాత్రికులందరూ చిన్నచిన్న ముక్కలై చనిపోయారు. భారతీయ వ్యోమగామి కల్పనాచావ్లా కూడా ఆ ఘోర
ప్రమాదములో ప్రాణాలు కోల్పోవడము జరిగింది. అయితే ఆమె తిరిగి కొద్ది రోజులకే తిరిగి భూమి మీద పుట్టడము
జరిగింది.
కల్పనాచావ్లా తిరిగి పుట్టిన సమాచారమును (ఎస్.బి.యన్ 7) ఛానల్ మరియు ఇండియాటుడే పత్రిక, కల్పనాచావ్లా
మళ్ళీ జన్మించిన కథనాన్ని ప్రసారము చేసి ప్రపంచానికి అందించడము జరిగింది. ఆ వివరాలను చూస్తే, ఉత్తర
భారతదేశములో ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనున్న బుల్లంద్ షహర్ అనే గ్రామములో రాజీకుమార్ అనే సాధారణ వ్యవసాయ
కూలీగా పని చేయుచున్న వ్యక్తి కుటుంబములో అతనికి కుమార్తెగా జన్మించింది. 2003వ సంవత్సరము మార్చి 23వ
తేదీన ఉపాసన అను పేరుతో ఆ కుటుంబమున కల్పనాచావ్లా జన్మించడము జరిగింది. ఉపాసన (కల్పనాచావ్లా)కు
నాలుగు సంవత్సరాల వయస్సులో మాటలు వచ్చాయి. మాట్లాడడమును ప్రారంభించిన ఉపాసన, తాను గతజన్మలో
కల్పనాచావ్లా అను పేరుగల అంతరిక్ష పరిశోధకురాలిననీ, తన తండ్రి పేరు బనార్సీదాస్ యనీ, నాలుగు సంవత్సరముల
క్రితము తాను తోటి అంతరిక్ష పరిశోధకు లతో కలిసి ఒక విమానములో ఆకాశమునుండి దిగివస్తుండగా, తమ
విమానానికి ప్రమాదము జరిగి తామందరము చనిపోయామని చెప్పడము జరిగింది.
గత జన్మ వివరాలను పూసగ్రుచ్చినట్లు చెప్పుచున్న ఉపాసన (కల్పనా చావ్లా) యొక్క పేరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా
క్రమంగా తెలిసి పోయింది. ప్రస్తుతము ఉత్తరప్రదేశ్లోని ఎత్వా జిల్లాలోని “పఠా” అనే గ్రామములో కూలి పని
చేసుకొంటున్న తండ్రి రాజ్కుమార్తో పాటు జీవిస్తున్న ఉపాసన తనను ఇంటర్యూ చేయడానికి వచ్చిన ప్రపంచస్థాయి
మీడియా ప్రతి నిధులతో మాట్లాడుచూ మేము భూమిమీదకు తిరిగి వస్తున్న అంతరిక్షనౌకకు ఆకాశములో సంచరిస్తున్న
ఒక పెద్ద మంచుగోళము గుద్దుకున్నదనీ, దానివలన తమ అంతరిక్షనౌక ప్రేలిపోయి అందులోని తామందరమూ
చనిపోయామనీ చెప్పినది. 2003వ సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన నాసాకేంద్రము వారు అంతరిక్ష నౌకకు బయటప్రక్కన
చుట్టు అమర్చిన ప్లేటు ఊడిపోయిన దానివలన ఆ నౌక భూమి వాతావరణము లోనికి వస్తూనే వాతావరణ రాపిడి
వేడికి ప్రేలిపోయిందని చెప్పారు. నాసావారను కొన్నట్లు అక్కడ జరగలేదనీ, ఆకాశములో భూమికి 70 కిలోమీటర్ల
దూరములోనే మంచుగోళమునకు అంతరిక్షనౌక గుద్దుకోవడము వలన ప్రమాదము జరిగిందని ప్రత్యక్ష సాక్షి అయిన
కల్పనాచావ్లా చెప్పడము వలన తెలిసిపోయింది.
ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా! మనము ముందు చెప్పుకొనిన స్వర్ణలతమిశ్రా యొక్క పునర్జన్మ
సమాచారములో స్వర్ణలత గతజన్మలో 1939 సం॥ లో చనిపోయి తర్వాత 1948 సంవత్సరములో పుట్టినది. దీనినిబట్టి
స్వర్ణలత తిరిగి పుట్టేదానికి తొమ్మిది సంవత్సరములు వ్యవధి కాగా, కల్పనాచావ్లా, ఉపాసనగా పుట్టుటకు కేవలము ఒక
నెల 22 రోజులు మాత్రమే పట్టినది. ఈ విధముగా ఇంతవరకు మనము చెప్పుకొన్న పునర్జన్మ సమాచారములలో
వారు చనిపోయిన కాలమునకు తిరిగి పుట్టిన కాలమునకు మధ్యలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు సమయము
పట్టినది. 29 సంవత్సరముల వయస్సుగల అమెరికన్ నావీఫైటర్ పైలెట్ జేమ్స్ స్టన్ రెండవ ప్రపంచయుద్ధములో
36

Page 37
జపాన్తో పోరాడుతుండగా, 1945 మార్చి 3వ తేదీన పసిఫిక్ సముద్రము మీద ఎగురుతున్న అతని విమానాన్ని జపాన్
అర్సెరీ విభాగమునకు చెందిన వారు కూల్చివేశారు. దానిలో జేమ్స్ హాస్టన్ తను నడుపుచున్న యుద్ధవిమానముతో సహా
ముక్కలు ముక్కలుగా మారిపోయి పసిఫిక్ సముద్రములో కలిసిపోయాడు. తర్వాత 1998లో జేమ్స్ హాస్టన్ తిరిగి
జేమ్స్ లెనింజర్గా జన్మించాడు. హాస్టన్ చనిపోయి లెనింజర్ పుట్టడానికి మధ్య గడచిన కాలము ఏకంగా 53
సంవత్సరములు పట్టినది. కల్పన చావ్లా కేవలము 52 రోజులలో తిరిగి ఉపాసనగా పుట్టగా, స్వర్ణలత 9 సంవత్సరములకు
పుట్టగా, లెనింజర్ కేమో 53 సంవత్సరములు పట్టినది. లెబనాన్ దేశములో హాసన్ మరణించిన తర్వాత 10 రోజులకే
సుజన్నే గానెమ్ పుట్టినదని మొదటి సంఘటనలో చెప్పుకొన్నాము. రెండవ జన్మకు రాకముందు మధ్యకాలములో
వీరు ఏమైనారు? ఎక్కడున్నారు? అని యోచిస్తే దానికి మానుండి వచ్చు సమాధానము ఏమనగా!
మానవ శరీరము రెండు భాగములుగా ఉన్నదనీ, ఆ రెండు భాగములు స్థూలభాగము, సూక్ష్మభాగములుగా
గలవనీ ముందే చెప్పుకొన్నాము. దీనికి సంబంధించిన విషయము "మరణ రహస్యము” “జనన మరణ సిద్ధాంతము”
అను గ్రంథములలో కూడా వ్రాసివున్నాము. వాటిలోని సమాచారము ప్రకారము ఒక మనిషి స్థూలముగా చనిపోయి
నప్పటికీ అతను సూక్ష్మముగా బ్రతికేవుండును. అతడు పూర్తిగా చనిపోలేదని అతను పూర్తిగా చనిపోవుటకు
మరికొంతకాలము పట్టునని తెలిసియున్నము. అంతేకాక ఒక మనిషి చనిపోయినప్పటికీ, అది స్థూలమరణము
అయినప్పటికీ, అది తాత్కాలిక మరణమై ఉండుట వలన అతను తిరిగి స్థూలముగా అదే శరీరముతో బ్రతికే అవకాశము
కలదు. అలా ఎందరో చచ్చిపోయిన తర్వాత మూడు నాలుగు రోజులకు లేచినవారున్నారు. ఒక మనిషి సూక్ష్మశరీరమునూ,
స్థూలశరీరమునూ రెండిటినీ వదిలి పోయినప్పుడే అది పూర్తి మరణము క్రిందికి జమకట్టవచ్చును. పూర్తి మరణము
పొందిన వాడు ఒక్కక్షణము (ఒక్క సెకండు) కూడా ఆలస్యము చేయక తిరిగి వెంటనే పుట్టును. ఈ విధానము
బహుశా చాలామందికి తెలియదు. మరణములు మూడు రకములనీ, అందులో ఒకటి అకాలమరణముకాగా, రెండవది
తాత్కాలిక మరణముకాగా, మూడవది పూర్తిమరణమగును. స్థూల శరీరము చనిపోయి సూక్ష్మశరీరము మిగిలివుంటే
అది అకాలమరణమగును. స్థూల, సూక్ష్మశరీరములు రెండూ పోయినపుడు అది మరణమగును. జీవాత్మ శరీరములో
ఉన్నట్లే శరీరములోని ఆత్మ తన పనిని ఆపివేస్తే ఊపిరి నిలిచి పోవును. కానీ అది కూడా మరణము కాదు. ఆత్మ
అనుకొంటే ఎప్పుడైనా అతను లేచి నడువగలడు.
స్వర్ణలతగానీ, జేమ్స్ లెనింజర్గానీ, కల్పనాచావ్లాగానీ, హాసన్గానీ మొదట చని పోయినప్పుడు వారు పూర్తి
మరణమును పొందలేదు. వారు చనిపోయిన ప్పటికీ స్థూలశరీరము పోయి, సూక్ష్మశరీరము మిగిలిపోవడము వలన
అది అకాలమృత్యువైనది. అందువలన వారికి పూర్తిగా చావు వచ్చుటకు వారివారి కర్మనుబట్టి కొన్ని దినములుగానీ,
కొన్ని నెలలుగానీ, కొన్ని సంవత్సరములు గానీ పట్టవచ్చును. అదే విధముగనే స్వర్ణలత చనిపోయిన తర్వాత 9
సంవత్సరములకూ, లెనింజర్కు 53 సంవత్సరము లకూ, కల్పనాచావ్లాకు 52 దినములకు, హాసన్కు 10 దినము లకు
పూర్తి మరణము వచ్చి, అప్పుడు తిరిగి వెంటనే పుట్టారు. అంతవరకు వారు తమ మొదటి జన్మలో ఉన్నట్లే లెక్కించబడును.
మేము ఆధ్యాత్మికవేత్తలమనువారు కొందరు, మనిషి చనిపోయిన వెంటనే పుట్టడనీ, అతను చేసుకొన్న పాపమును
అనుభవించుటకు నరకమునకు, అలాగే పుణ్యమును అనుభవించుటకు స్వర్గమునకు పోయి అక్కడ అనుభవించిన
తర్వాత బ్రహ్మదేవునివద్దకు పోయి, ఆయనవద్ద క్రొత్త వ్రాత వ్రాయించుకొని పుట్టుచున్నారనీ, అందువలన చనిపోయిన
వెంటనే పుట్టక ఆలస్యముగా పుట్టడము జరుగుచున్నదనీ చెప్పుచున్నారు. వీరు చెప్పిన దానికి వారు ఆలస్యముగా
37

Page 38
పుట్టిన దానికి వినుటకు సరిపోయినా అది సత్యమూ కాదు, శాస్త్రబద్ధమూకాదు. స్వర్గనరకములు మనిషి యొక్క
జీవితములోనే ఉన్నవి, కానీ మనిషి చనిపోయిన తర్వాతలేవు. చాలామంది ఆధ్యాత్మికవేత్తలందరూ పొరపాటుపడునది
ఇక్కడే. ఒక్క ఇందూ (హిందూ) మతములోనే కాకుండా, మిగతా మతములలో కూడా స్వర్గ నరకములవద్ద అందరూ
తప్పుదారి పట్టిపోయారు. ఇక్కడ అందరూ కొంత ఆలోచించ వలసిన అవసరమున్నది. పోయిన జన్మలోని విషయములను
చెప్పు మనుషులున్నారు గానీ, చనిపోయిన తర్వాత స్వర్గానికిగానీ, నరకానికిగానీ పోయివచ్చామని చెప్పువారు ఎవరూ
లేరు. కల్పనాచావ్లాగానీ, స్వర్ణలతగానీ, జేమ్స్ నింజర్గానీ మరణించిన తర్వాత ఒకరికొకరు ఎంతో వ్యత్యాసముతో
పుట్టారు. అయినా వారిలో 53 సంవత్సరములకు పుట్టిన లెనింజర్ గానీ, 9 సంవత్సరములకు పుట్టిన స్వర్ణలతగానీ,
కేవలము ఒక నెల 22 రోజులకు పుట్టిన కల్పనాచావ్లాగానీ, 10 రోజులకే పుట్టిన హాసన్గా గానీ తాము స్వర్గానికి
పోయినట్లు గానీ, నరకానికి పోయినట్లుగానీ ఎక్కడా చెప్పలేదు. ప్రతి విషయమును గ్రుడ్డిగా నమ్మకుండా కొంత
యోచిస్తే సత్యము తెలిసిపోతుంది. మరణము తర్వాత స్వర్గ నరకములు అసత్యము అని చెప్పుటకు ఆధారమున్నది.
అలాగే స్వర్గ నరకములను మనిషి జీవితములోనే అనుభవిస్తున్నాడనుటకు కూడా ఆధారము గలదు.
నాకు పదిలేక పదకొండు సంవత్సరముల చిన్నవయస్సులోని ఒక సంఘటన బాగా జ్ఞాపకమున్నది. అదేమనగా!
ఒక వ్యక్తి మానసికముగా అన్ని రకముల బాగున్నప్పటికీ అమావాస్యకు, పౌర్ణమికి అతనికి మతి స్థిమితముగా
ఉండేది కాదు. ఆ దినము ఇంటిలో లేకుండా పోయి, బజారులో ఊరకనే కేకలు వేస్తూ తిరిగేవాడు. అతని బంధువులు
అతనిని ఇంటిలో బలవంతముగా ఉంచినా, ఆ రెండు దినములలో ఏమాత్రము ఇంటిలో ఉండేవాడు కాదు. అతను
అలా అరుస్తూ తిరిగేటప్పుడు అతని నోటినుండి ఎక్కువ జొళ్ళు కారేది. అతను ఒక దినము అనారోగ్యముతో
అమావాస్య రోజే బజారులో చనిపోవడము జరిగినది. అతను చనిపోయిన సమయానికి అతనున్న వీధిలోనే వేరేవారి
ఇంటిలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడ శిశువుకు అరగంటవరకు ప్రాణము రాలేదు. ఆ బిడ్డ తల్లి గర్భములోనే చని
పోయిందని వారు అనుకొని ఆ శిశువును పూడ్చిపెట్టేదానికి ఇంటి బయటికి తెచ్చారు. అదే సమయానికి మతిస్థిమితములేని
వ్యక్తి చనిపోవడము జరిగింది. అతను చనిపోయిన వెంటనే అంతవరకు కదలికలు లేని శిశువుకు ప్రాణము వచ్చి
ఏడ్వను మొదలుపెట్టింది. అప్పుడు శిశువు బ్రతికిందని వారు ఇంటి లోనికి తెచ్చుకోవడము జరిగింది. ఇదంతా నేను
ప్రత్యక్షముగా చూచిన విషయమే. తర్వాత ఆ శిశువుకు నాలుగు సంవత్సరముల వయస్సులో మాటలు వచ్చినతర్వాత,
తాను గతజన్మలో ఇదే వీధిలో ఉండేవాడిననీ, తాను అప్పుడు మతిస్థిమితములేని మనిషిననీ, తాను బ్రతికివుండగా ఈ
ఇంటి దగ్గరకు కూడా వచ్చేవాడిననీ చెప్పడమేకాక గతములోని తన ఇంటిలోని వారి పేర్లన్ని చెప్పింది. అప్పుడు
ఆడపిల్ల అలా చెప్పడము ఆమె తల్లిదండ్రులకు ఇష్టములేదు. తమ బిడ్డ పలానా అని తెలిస్తే తమకు గానీ, తమ
బిడ్డకుగానీ గౌరవము ఉండదని ఆ విషయమును ప్రక్కన ఎవరికీ తెలియకుండా చేశారు. అదే ఇంటి ప్రక్కన ఉన్న
నాకు మా ఇంటిలోని వారికి ఆ విషయము తెలుసు. ఒక ఐదారు నెలలు గతజన్మ జ్ఞాపకాలు ఆ అమ్మాయికి
అప్పుడప్పుడు వచ్చేవి. అంతేగానీ అన్ని సమయములో ఆ విషయములు జ్ఞప్తికి వచ్చేవికావు. ఆరునెలలు గడచి పోయిన
తర్వాత ఆమెకు గతజన్మ జ్ఞాపకాలు రాకుండా పోయాయి. ఆమె ఇంటిలోని వారు మతిస్థిమితములేని వ్యక్తి చనిపోయి
దయ్యమై తమ పిల్లలో దూరుకొని అలా చెప్పుచున్నాడని అనుకొనేవారు తప్ప, అతను మళ్ళీ తమ ఇంటిలో పుట్టాడని
అనుకొనేవారు కాదు. అప్పుడు నేను కూడా ఆ చిన్నపిల్లకు మతిస్థిమితము లేని వ్యక్తి ఆవహించి చెప్పుచున్నాడని
అనుకొన్నాను. అయితే నాకు కొంత ఆత్మజ్ఞానము కల్గిన తర్వాత ఇప్పుడది దయ్యముకాదనీ, నిజముగా పునర్జన్మయేననీ
38

Page 39
చెప్పుచున్నాను. ఇదంతా చెప్పుటకు కారణమేమనగా! మతిస్థిమితములేని వ్యక్తి చనిపోయిన క్షణములోనే అతను అదే
వీధిలో శిశువుగా జన్మించాడని గుర్తుంచుకోవాలని ఈ విషయమును చెప్పాను. దీనితో, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే
తిరిగి జన్మిస్తున్నాడనీ అర్థమై పోతున్నది.
భగవద్గీతలో భగవంతుడు చినిగిన వస్త్రమును వదలి క్రొత్త వస్త్రమును ధరించునట్లు, ఒక జీవుడు పాత శరీరమును
వదలి క్రొత్త శరీరమును ధరిస్తున్నాడని చెప్పాడు. అక్కడ ఆయన చెప్పిన మాట శాస్త్రబద్ధమైనది మరియు జీవునికి
ధర్మయుక్తమైనది. భగవంతుడు చెప్పినట్లు పునర్జన్మ జ్ఞప్తికి వచ్చిన వారి విషయములలో శరీర ధర్మములు నిరూపణకు
వచ్చినవి. పాతవస్త్రమును వదలి క్రొత్త వస్త్రమును ధరించినట్లు, పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించినట్లు
అని చెప్పడము, నూటికి నూరు పాళ్ళు మనిషికి పునర్జన్మగలదని చెప్పడమే కదా! గీతలోని అక్షర పర బ్రహ్మయోగమునందు
ఐదు, ఆరు శ్లోకములలో “మరణించు చివరి సమయములో ఎవడైతే నన్నే స్మరించుకొంటూ చనిపోవునో వాడు నన్నే
చేరిపోగలడు. మనిషి ఏయే భావమును స్మరించు కుంటూ చనిపోవునో తర్వాత అదే భావమును పొందుచున్నాడు.
దేవున్ని స్మరించుకొంటూ చనిపోయిన వాడు తిరిగి జన్మించక దేవున్నే చేరిపోవును. ప్రకృతి విషయము లను స్మరించుకుంటూ
చనిపోయినవాడు తిరిగి ప్రపంచములో జన్మించును” అని భగవంతుడు చెప్పినట్లు అర్థమగుచున్నది. ఇట్లు భగవద్గీతలో
అనేకచోట్ల మనిషి పునర్జన్మలను గురించి వ్రాసిన విషయములు గలవు. ఈ విధముగా పునర్జన్మలున్నవని తెలియడమే
కాకుండా మనిషి చనిపోయిన వెంటనే పుట్టుచున్నాడను విషయమును కూడా గీతలో అనేకమార్లు భగవంతుడు చెప్పినట్లు
కలదు.
బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీత ప్రకారము ఒక జీవుడు చనిపోయిన తర్వాత ఆ క్షణమే జన్మించుచున్నాడనీ,
అలా జన్మించిన తర్వాత పాప పుణ్యములను కష్టసుఖముల రూపముతో జీవితమునందు అనుభవిస్తున్నాడనీ అర్థమగుచున్నది.
గీతను చెప్పిన భారతదేశములోనూ మరియు బైబిలు, ఖురాన్ చెప్పబడిన దేశములలోనూ, అంతేకాక ప్రపంచము
మొత్తము దేశములలోనూ గీతలో చెప్పినట్లే పునర్జన్మలు జరిగినట్లు తెలియడము జరిగినది. దీనివలన గీతమాట
ప్రపంచము మొత్తమునకు వర్తించుచున్నదని తెలియుచున్నది. జరిగిన ప్రత్యక్ష సత్యమునుబట్టి బైబిలులోనూ, ఖురాన్లోనూ
పునర్జన్మలు లేవని చెప్పలేదనీ, అలా చెప్పియుంటే దేవుని మాటకు విరుద్ధముగా జరుగుటకు వీలులేదనీ, జరిగిన ప్రత్యక్ష
ప్రమాణమునుబట్టి, అన్ని మతగ్రంథములలోను చెప్పించిన వాడు ఒక్కడేననీ, ప్రవక్తలు వేరువేరైనా చెప్పబడిన జ్ఞానము
ఒక్కటేననీ, అందువలన చెప్పినదే జరిగినదనీ, జరిగిన దానినిబట్టి పునర్జన్మలున్నవని తెలిసిపోయినది. అంతేకాక
పునర్జన్మలనునవి ఏ మతము వారికీ వ్యతిరేఖమైనవికావు అనుటకు నిదర్శనముగా, అన్ని మతములలోనూ పునర్జన్మలు
జరిగినట్లు, వారిలో కొందరికి గతజన్మ జ్ఞాపకములు వచ్చినట్లు, అవన్నిటిని విచారించగా సత్యమే అయినట్లు తెలిసి
పోయింది. అంతేకాక ఒక ముస్లీమ్ మరొక ముస్లీమ్ ఇంటిలో పుట్టినట్లు, ఒక క్రిష్టియన్ అదే మతమునకు సంబంధించిన
మరొక క్రిష్టియన్ ఇంటిలో పుట్టినట్లు, ఒక ఇందువు (హిందువు) మరొక ఇందువు ఇంటిలో పుట్టినట్లు నిరూపణకు
వచ్చినది. అంతేకాక ఇందువులు, ముస్లీమ్ మరియు క్రైస్తవుని ఇంటిలో పుట్టినట్లు తెలిసినది. దీనినిబట్టి మతము
అనునది బ్రతికిన మనిషికే గానీ, చనిపోయిన వారి వెంట మతము రావడములేదనీ, ఒక మతస్థుడు చనిపోయిన
తర్వాత ఏ మతమునందైనా పుట్టవచ్చనీ, తాను పుట్టిన కుటుంబము ఏ మతమునకు చెందినదో తాను, ఆ మతస్థునిగా
అనుకోవడము జరుగుచున్నదనీ, మతము మనిషి ఏర్పరచుకొన్నదే గానీ, దేవుడు ఏర్పరచినది కాదనీ తెలియుచున్నది.
పరమత ద్వేషము అనునది ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి ఏ మతములో పుట్టినా తన మతమును గొప్పగా
39

Page 40
చెప్పుకోవడమూ, పరమతమును ద్వేషించడము జరుగుచుండును. ఉదాహరణకు ఒక హిందువు క్రైస్తవ మతమును
ద్వేషించేవాడైతే, అతను పునర్జన్మలో క్రైస్తవునిగా పుట్టితే తన క్రైస్తవమతమును గొప్పగా చెప్పుకొనుచూ, హిందూమతమును
ద్వేషించుచుండును. గతజన్మలో హిందూమతమును గొప్పగా చెప్పుకొని క్రైస్తవమును దూషించినవాడు చనిపోయి,
తిరిగి క్రైస్తవునిగా జన్మించి క్రైస్తవమును పొగడుచు హిందూత్వమును దూషించడము నకు కారణము అతనిలోని పరమత
ద్వేషము అను గుణ ప్రభావమేగానీ వేరుగాదు. దీనినిబట్టి మతములు మనిషి జీవితమునకు హద్దులను ఏర్పరచు
చున్నవిగానీ, మనిషి జన్మలకు హద్దులను ఏర్పరచలేవని తెలియుచున్నది. అందువలన ఒక జీవితమునకే పరిమితమైన
మతమును వదలి, అన్ని జన్మలకు సంబంధమైన దేవున్ని తెలుసుకోమని తెలుపుచున్నాము.
పునర్జన్మను గురించి కొంత వివరమును ఇంతవరకు తెలుసు కొన్నాము. ఎవనికైనా వాని పునర్జన్మ విషయము
తెలియాలంటే వానిలోని ఆత్మ తెలుపవలసిందేగానీ, ఆత్మ తప్ప ఎవరూ తెలుపుటకు వీలులేదు. ఎవనిలోని ఆత్మయినా
వాని మాట వినదు. ఎవనిలోని ఆత్మయినా వాని కర్మనుబట్టి స్వయముగా పని చేయగలదుగానీ, జీవాత్మ చెప్పినట్లుగానీ,
మనస్సు కోరినట్లుగానీ నడుచుకోదు. శరీరములో ఆత్మ స్వతంత్రమైనది. ఆత్మ తన ఇష్టముతో తెలియజేస్తే గతజన్మ
వివరము తెలియగలదు. అట్లుకాక జీవుడు కోరితే ఆత్మ ఏమాత్రము తెలియజేయదు. నీవు నీ శరీరములోని ఆత్మను
పూజించి అడిగినా, నమస్కరించి అడిగినా, ఆత్మ జీవాత్మ యొక్క మాట వినదు, నీ ఆత్మకు నీ వెనుకటి జన్మలు బాగా
తెలిసివుండినా ఏమాత్రము వెనుకటి జన్మను గురించి నీకు తెలియజేయదు. ఆత్మ నీ మాటనే విననప్పుడు, ఎవడో
ప్రక్కనోడు చెప్పితే వాని మాట వింటుందా? నీ ప్రక్కనోడు దేశానికి రాజైనా, ప్రపంచానికి ప్రాముఖ్యుడైనా ఎవని మాటా
వినదు. అందువలన ఎవడుగానీ తమ ఇష్టము ప్రకారముగానీ, ఇతరుల ఇష్టప్రకారముగానీ తమ గతజన్మను గురించి
తెలుసుకొనిన వాడులేడు. అయితే ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ప్రస్తుతకాలములో
కొందరు ఉన్నత చదువులు చదివిన డాక్టర్లు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అను విధానముతో కొందరి గతజన్మ విషయములను
వారి ద్వారానే చెప్పించుచున్నారు కదా! దానిని గురించి మీరు ఏమంటారు అని అడుగవచ్చును. దానికి మా
సమాధానము ఇలా ఉంది. ఈ మధ్య కాలములో "మా" టీవి ఛానల్లో కొంతకాలము, ఎం.డి చదివిన డాక్టరు
ఒకాయన కొందరి చేత వారికి తెలియకుండానే వారిచేత వారియొక్క గత జన్మ విషయములను చెప్పించడమును నేను
కూడా చూచాను. ఆ డాక్టరుగారు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరఫి ద్వారా ఇతరుల పూర్వజన్మల విషయములను వారి ద్వారానే
చెప్పించవచ్చునని చెప్పడము కూడా విన్నాను. ఆయన పెద్ద చదువు చదివిన ఎం.డి. డాక్టరు కనుక ఆయన చెప్పే
మాటను ఎవరైనా సులభముగా నమ్మగలరు. ఒక రోగము యొక్క నివారణకు గల వైద్య విధానమును థెరపి అంటారు.
మనిషికి అనేక రక రోగములున్నవి. అలాగే వాటిని నివారణ చేయుటకు అనేక మెడికల్ థెరపీలు కూడా ఉన్నవి.
గతజన్మ విషయములను మనిషి చేత చెప్పించడము కూడా ఒక విధానము, కావున డాక్టర్లు దానిని థెరపి అనడము
జరిగిందేమో! హైదరాబాద్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పాస్ట్ఫ్ రిగ్రేషన్ థెరపిస్టులుగా ఉన్నారు. అటువంటి బోర్డు
పెట్టుకొన్న ఒక డాక్టరు వద్దకు పోయి వారి థెరపిలోని వివరమేమిటో తెలుసుకోవాలనుకొన్నాము. వెంటనే అతనికి
ఫోన్ చేసి నాకు నిద్రరావడములేదు మీరు మీకు తెలిసిన పద్ధతిలో నాకు నిద్ర వచ్చేటట్లు చేయగలరా అని అడిగాను.
అప్పుడు ఆయన తప్పకుండా చేయగలను, కానీ నా ఫీజు మీకు తెలుసా అని అడిగాడు. మీరు చెప్పితే తెలుస్తుంది అని
చెప్పాము. అప్పుడు 5 వేలు ఇమ్మని చెప్పాడు. మరుసటి దినము ఐదువేలు తీసుకొని పోయి అతనికి ఇచ్చి, అక్కడ
ఆయన ఏ విధానమును ఉపయోగిస్తున్నాడో గమనించాము. సాధారణ వ్యక్తిగా పోయిన నన్ను చూచి మీరు వారము
దినముల వరకు వస్తే మీకున్న నిద్రలేమి పోవునని చెప్పాడు. ఆ దినము అక్కడ ఆయన దగ్గర ఉదయము 11
40

Page 41
గంటలనుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు ఉండడము జరిగింది. అప్పుడు మా సమక్షములో చాలామంది
అనేక సమస్యలతో వచ్చారు. అందులో గతజన్మ విషయములను ఒకరి ద్వారా చెప్పించడము మేము దగ్గరనుండి
చూడడము జరిగింది. అంతేకాక ఆ డాక్టరు గారు ఎలా చెప్పించగలుగుచున్నాడో కూడా చూడగలిగాము.
అప్పుడు మాకు అర్థమైన దానినిబట్టి మేము ఆ డాక్టరుగారిని కొన్ని ప్రశ్నలు అడిగాము. మేము సర్వసాధారణ
జ్ఞాన విషయాలకు సంబంధించిన ప్రశ్నలను మాత్రమే అడిగాము. గతజన్మ విషయములను గురించి అడగ లేదు.
ఆయన చెప్పిన సమాధానములను బట్టి సర్వసాధారణ జ్ఞానము కూడా ఆయనకు తెలియదని మాకు అర్థమైనది.
ఆత్మంటే ఏమిటో, ఆత్మ జ్ఞానమంటే ఏమిటో తెలియని ఆయనగారు వెనుకటి జన్మ సమాచారమును ఇతరుల చేత
చెప్పించడము మాకు ఆశ్చర్యమును కలిగించింది. ఇప్పటికే ఎందరో స్వామీజీల వేషముతో ప్రజలను మోసము చేస్తుండగా,
స్వామీజీగా కాకుండా డాక్టరుగా ఉంటూ సరిక్రొత్తగా పాన్టైప్ రిగ్రేషన్ థెరపి అను పేరుతో ప్రజలను మభ్యపరచడమూ,
తాము గొప్ప అనుపించుకోవడమూ, మాకు వింతగా కనిపించింది. వారికి తాము చేయుచున్నది దైవజ్ఞాన విరుద్ధమైనదనీ,
ప్రజలను మోసగించడమనీ తెలుసో, తెలియదో, కానీ ప్రజలు మాత్రము నూటికి నూరుపాళ్ళు మోసపోవుచున్నారు.
వారు చేయుచున్నది ప్రజలను మభ్యపరచుచున్నారని ఎలా చెప్పుచున్నామనగా! మనుషులలో మనస్సు అనునది
ఒకటున్నదనీ, దానికి రెండు పనులున్నాయనీ తెలుసు కొన్నాము కదా! అటువంటి మనస్సు కొందరిలో బలముగా,
కొందరిలో బలహీనముగా ఉండును. అటువంటి మానసిక బలహీనులను సైకాలజిస్ట్ అయిన డాక్టర్లు గుర్తించగలరు.
వారి మనస్సును తమ ఆధీనములోనికి తెచ్చుకొందురు. తమ ఆధీనములోనికి ఇతరుల మనస్సును తెచ్చుకోవడమునే
నేడు నవీన భాషలో హిప్నటైజ్ చేయడము అంటాము. ఒక మనిషిని హిప్నటైజ్ చేయగల వ్యక్తి ఎదుటి మనిషియొక్క
మనస్సు తమమాటకు పలుకునట్లు, తమ ప్రశ్నలకు జవాబును చెప్పునట్లు చేసుకొందురు. ఇక్కడ ప్రతి ఒక్కరూ
గమనించతగిన విషయమేమనగా! ఏమాటకైనా జవాబు చెప్పు స్థోమత, విజ్ఞత శరీరములో ఒక్క బుద్ధికి మాత్రమే
ఉండును. మనస్సుకు జవాబుచెప్పు స్థోమత లేదు. అటువంటపుడు హిప్నటైజ్ అయినవారు హిప్నటైజ్ చేసిన వ్యక్తులు
అడిగిన ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పగలుచున్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా!
ఇటువంటి ప్రశ్నరావాలనే నేను కూడా అనుకొంటున్నాను. ప్రశ్న వచ్చినపుడే ఆ విషయము శ్రద్ధగా చూడగలరు.
హిప్నటైజ్ అను ఆంగ్లభాషకు తెలుగులో సమ్మోహనము అను అర్ధము రాగలదని అనుకుంటాను. ఒక మనిషి
చేత హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి హిప్నటైజ్ చేసిన వ్యక్తి ఎలా చెప్పితే అలా వినును. ఇక్కడ జీవునికి ఏమాత్రము
సంబంధముండదు. సమ్మోహనము (హిప్నటైజ్) చేయబడిన వాని మనస్సు మాత్రము, హిప్నటైజ్ చేసిన వాడు చెప్పే
మాట ప్రకారము లేక అతను తలచే ఉద్దేశము ప్రకారము ప్రవర్తించగలదు. జీవున్ని ఏమీ తెలియని నిద్రలాంటి
స్థితిలోనికి పంపి, మనస్సును మాత్రము తమ స్వాధీనములోనికి తెచ్చుకోవడమును హిప్నటైజ్ అని విశదీకరించుకొని
చెప్పవచ్చును. శరీరములోని ఒక్క మనస్సు మాత్రమే హిప్నటైజ్ కావడము వలన హిప్నటైజ్లో జరిగేవి ఏవీ జీవునికి
తెలియవు, అలాగే బుద్ధికి కూడా తెలియవు. హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి యొక్క మనస్సు హిప్నటైజ్ చేసిన వ్యక్తి
ఆధీనములో ఉండుట వలన, అతడు బయటికి వినుపించునట్లు చెప్పే మాట ప్రకారముగానీ, లోపల వినిపించకుండా
చెప్పే మాట ప్రకారముగానీ నడుచుకొనును. ఇక్కడ బాగా అర్థము చేసుకొనుటకు ఒక ఉదాహరణను తెలియజేస్తాను
చూడండి. హిప్నటైజ్ చేసిన వ్యక్తి హిప్నటైజ్ అయిన వ్యక్తితో ప్రక్కనున్న వారంతా వినునట్లు పోయిన జన్మలో నీవు
ఎంతకాలము బ్రతికావు అని అడిగాడు. అప్పుడు హిప్నటైజ్ అయిన వ్యక్తి కళ్ళు మూసుకొనివుంటూ, అడిగిన ప్రశ్నకు
41

Page 42
నేను గతజన్మలో 60 సంవత్సరములు బ్రతికాను అని చెప్పాడు. ఎలా చనిపోయావు అని అడిగితే దానికి జవాబుగా
నేను నీటిలో మునిగి చనిపోయానని చెప్పాడు. ఇక్కడ అడిగిన రెండు ప్రశ్నలకు రెండు జవాబులను హిప్నటైజ్ అయిన
వ్యక్తి చెప్పాడు. ప్రక్కనుండి చూచిన వారికి హిప్నటైజ్ చేసిన వ్యక్తి అడిగిన ప్రశ్నలు తెలుసు, హిప్నటైజ్ అయిన వ్యక్తి
చెప్పిన జవాబులు తెలుసు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని రహస్యము ఒకటున్నది. అదేమనగా! మనస్సుకు
జవాబు చెప్పు స్థోమత లేదని ముందే చెప్పాము కదా! దానిప్రకారము హిప్నటైజ్ అయిన వ్యక్తి జవాబును స్వయముగా
చెప్పలేదు. అయితే మనము చూస్తున్నట్లే జవాబు వచ్చింది. అయితే ఎలా జవాబు వచ్చిందనగా ! ఎవరైతే ప్రశ్నించారో
అతనే ఎదుటి మనిషి శరీరములోని మనస్సు ద్వారా జవాబును చెప్పునట్లు చేశాడు. ప్రశ్నించిన వ్యక్తి తన మనస్సులో
ఏ జవాబును అనుకొనుచున్నాడో అదే జవాబు హిప్నటైజ్ అయిన వ్యక్తి ద్వారా వచ్చుచున్నది. ఇదంతా ఎలాగున్నదనగా!
మిమిక్రి చేసే వ్యక్తి, నోరు కదలాడే ఒక బొమ్మను అందరికి కనిపించునట్లు తనవద్దవుంచుకొని, నీవు ఏమి తిన్నావు అని
అందరికి వినిపించేటట్లు బొమ్మను ప్రశ్నించును. అప్పుడు ఆ బొమ్మ తన నోరును మెదిలిస్తూ బ్రెడ్ తిన్నాను అని
జవాబు చెప్పును. అక్కడ చూచేవారికి అతను అడిగిన ప్రశ్నకు బొమ్మ జవాబు చెప్పిందని అనుకొందురు. కానీ
వాస్తవానికి ఎవడైతే ప్రశ్నించాడో, ఆ ప్రశ్నకు జవాబును కూడా అతనే చెప్పాడు. అయితే ఆ విషయము ఎవరికీ
తెలియనట్లు తాను నోరు మూసుకొని జవాబును మనము వినేటట్లు చెప్పుట వలన నోరు కదిలించు బొమ్మే చెప్పిందని
ఎవరైనా అనుకోగలరు. మిమిక్రీ ఆర్టిస్టు వద్ద బొమ్మ మాట్లాడము ఎంత సత్యమో, హిప్నాటిస్ట్వద్ద కళ్ళు మూసుకొన్న
మనిషి మాట్లాడము కూడా అంతే సత్యమగును.
ఇప్పుడు సూత్రము తెలిసిపోయింది. దానిప్రకారము ఎన్ని లెక్కలైనా చేయవచ్చునన్నట్లు మిమిక్రీ ఆర్టిస్టు పనిని
పోలికగా తీసుకొని హిప్నటైజ్ చేయువారు ఇతర మనిషి చేత మాట్లాడించుచున్నారు. మిమిక్రీ కళాకారుడు చేయుపనిలో
ప్రశ్న జవాబు మిమిక్రి చేయువానివే అయివున్నట్లు, హిప్నటైజ్ అయినవారిలో కూడా ప్రశ్న జవాబు హిప్నటైజ్ చేయువానివే
అయివుండును. మిమిక్రి చేయువారివద్ద నోరు మెదిపి మాట్లాడునది గుడ్డబొమ్మకాగా, హిప్నాటిస్ట్ వద్ద మాట్లాడునది
తోలుబొమ్మ. మిమిక్రీ ఆర్టిస్టు తన ప్రశ్నను బహిరంగముగా అడిగి, జవాబును మాత్రము గోప్యముగా చెప్పినట్లు ఒక
హిప్నాటిస్ట్ కూడా తన ప్రశ్నను బహిరంగముగా అడిగి జవాబును మాత్రము గోప్యముగా, కళ్ళుమూసుకొనివున్న వ్యక్తి
చేత చెప్పించుచున్నాడు. ఎదుటి వ్యక్తి కళ్ళుమూసుకొని మాట్లాడుటకు కారణమేమి అని ఎవరూ యోచించడములేదు.
అంతేకాకుండ, ప్రశ్నించు మనిషియొక్క మనో భావమునకు సంబంధించిన జవాబులు ఎదుటి మనిషిలో రావడమును
ఎవరూ గమనించడము లేదు. ప్రశ్నలు అడుగువ్యక్తి గొప్ప డాక్టరు అయిన దానివలనా మరియు వారు చేయు
మోసమునకు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అని పేరు పెట్టివుండడము వలనా అందరూ దానిని నమ్మడము జరుగుచున్నది.
పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి చేయగలమని చెప్పుచున్న డాక్టర్లకు ఏమాత్రము ఆత్మజ్ఞానము లేనిదానివలన, వారి
జవాబులను బట్టి వారి అజ్ఞానము బయటపడిపోవుచున్నది. ఆత్మజ్ఞానములేని వారిని ఎందరినైనా నమ్మించవచ్చునేమోగానీ,
ఆత్మజ్ఞానమున్న ఎవరినీ, వారు తమ థెరపినీ చూపి నమ్మించలేరు. దానికి ఒక ఉదాహరణగా మేము చూచిన
విషయమును చెప్పెదము చూడండి. మాటీవి లో ప్రసారమయ్యే పాస్ట్ఫ్ రిగ్రేషన్ థెరపిని చూచాను. ఒక ఎం.డి
డాక్టరు ఒక మహిళను బల్లమీద పడుకోమని చెప్పి ఆమెను మనము చూస్తున్నట్లే హిప్నటైజ్ చేశాడు. అప్పుడు ఆమె
అపస్మారకస్థితిలోనికి వెళ్ళి పోయింది. కానీ ఆమె మనస్సు మాత్రము ఆమె శరీరమునుండి మాట్లాడగలుగుచున్నది.
అప్పుడు ఆ డాక్టరుగారు ప్రశ్నిస్తుండడము, జవాబు కళ్ళుమూసుకొన్న ఆ మహిళ చెప్పడము టీవిలో కనిపిస్తున్నది.
42

Page 43
ఆమె జవాబులో గతజన్మలో ఆమె ఒక లంబాడీ (సుగాలీ) ఇంటిలో జన్మించినదనీ, పెళ్ళైన తర్వాత భర్త త్రాగుబోతని,
ఆమెను ప్రతి దినము హింసించేవాడనీ, ఒక దినము ఆమె చిన్న శిశువుగానున్న కొడుకు ఏడుస్తుంటే పాలు ఇచ్చే దానికి
పోయినపుడు, పిల్లవానికి పాలు ఇవ్వకుండా ఆమె భర్త కామవాంఛ తీర్చుకొనేదానికి లాక్కెళ్ళాడని, అటువంటి భర్తతో
కాపురము చేయలేక ఇల్లు వదలి పారిపోయిందనీ, అలా పారిపోయినది ఒక మామిడితోటలో తలదాచుకొన్నదనీ చెప్పింది.
డాక్టరుగారు అడిగే ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పుచున్నది. కానీ ఆ కథయంతా డాక్టరుగారు అల్లినదేనని అర్థమైనది.
చిన్న బిడ్డ పాలు త్రాగేదానికి ఐదు నిమిషములు కూడా పట్టదు. ఆ అయిదు నిమిషములు కూడా ఓపికపట్టలేని కసాయి
తండ్రి ఎవరూ ఉండరు. ఇలా ప్రపంచములో జరుగని విషయములను కూడా అల్లి చెప్పడము వలన అది అంతా
కట్టుకథ అని అర్థమై పోయినది. ఆ కథలో చివరికి ఆమె చనిపోవు సమయానికి ఆమె కొడుకు పెళ్ళికాని యువకుడుగా
ఉన్నాడట. తర్వాత ఆమె చనిపోయి ఇక్కడ పుట్టి దాదాపు యాభైసంవత్సరముల వయస్సులో ఉన్నది. ఆమె భర్త కూడా
అక్కడే ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అయితే ఆమె చెప్పిన గతజన్మ కథలో ఆమె చనిపోయినపుడు యువకునిగానున్న
ఆమె కొడుకు ప్రస్తుత జన్మలో ఆమెకు భర్తగా ఉన్నాడని చెప్పడము జరిగింది. ఈ మాట వినేదానికి విడ్డూరముగా
ఉండడమే కాకుండా పూర్తి అసత్యమని కూడా తెలియుచున్నది. ఎందుకనగా! ఆమె చనిపోయినపుడు ఆమె కొడుకు
యువకునిగా, ఆరోగ్యవంతునిగా ఉన్నాడు. ప్రస్తుత జన్మలోనున్న భర్త ఆమెకంటే కొంత పెద్దవయస్సులో ఉన్నాడు.
ఆమె చనిపోయినపుడు బ్రతికేవున్న ఆమె కుమారుడు ఆమెకంటే ముందు చనిపోలేదు కదా! అటువంటపుడు ఆమెకంటే
పెద్దవయస్సు భర్తగా ఆమె కొడుకు ఎలా పుట్టగలడు? ఆమెకంటే ముందు పుట్టేదానికే అవకాశము లేనివాడు, ఆమెకంటే
ఎక్కువ వయస్సు భర్తగా ఎలా ఉండగలడు? అతను చెప్పించిన మాట పూర్తి అసత్యమైనదని చిన్న పిల్లవాడుకూడా
చెప్పగలడు. ఇటువంటి కట్టుకథల వలన పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అనునది పూర్తి అసత్యమని తెలియుచున్నది.
అదే డాక్టరుగారు మరియొక వ్యక్తిచేత అతని గతజన్మ జ్ఞాపకమును చెప్పించినపుడు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి
అను పేరుతో అసత్యమును ప్రచారము చేయుచు తాను గొప్ప విధానమును తెలిసిన వ్యక్తిగా ప్రచారమై పోవుచున్నాడని
అర్థమౌవుచున్నది. అటువంటి సంఘటన ఇంకొకటి ఉన్నది చూడండి. ఒక సినీ నటుని చేత గతజన్మ వివరములను
చెప్పించు సమయములో ప్రశ్నించే డాక్టరు, జవాబు చెప్పే సినీ నటుని కొన్ని ప్రశ్నలను అడుగుచూ చివరకు ఒక ప్రశ్న
అడిగాడు ఆ ప్రశ్న సర్వసాధారణముగా ఉండినా జవాబు మాత్రము పూర్తి అసత్యమైనదని ఎవరికైనా అర్థము కాగలదు.
ఆ జవాబులో ఆ సినీనటుడు గత జన్మలో క్రైస్తవప్రవక్త అయిన ఏసుప్రభువుగా ఉంటినని చెప్పాడు. ఆ మాటను
సాధారణమైన మనుషులు నమ్మవచ్చునేమో గానీ, మాకు మాత్రము అది అసత్యమైన మాట అని ప్రత్యక్షముగా తెలిసి
పోయింది. ఏసుప్రభువు ఒక మతమునకే ప్రవక్తగా ఉండి ఎంతో జ్ఞానమును బోధించాడు. అటువంటివాడు తిరిగి
పుట్టితే అతనిలో పూర్తి జ్ఞానము కనిపించును. కానీ దైవధర్మములు అంటే ఏమిటో తెలియని వ్యక్తి తాను ఏసుప్రభువునని
చెప్పుకోవడము ఎలా ఉందంటే మాంసము తినే పులి నేను గడ్డిని తినే ఆవునని చెప్పుకొన్నట్లున్నది. ప్రభువు అందరి
వలె జన్మకు వచ్చువాడు కాదు. ఒకవేళ వస్తే భూమిమీద జ్ఞానమును బోధించే దానికే వస్తాడుగానీ, బ్రతుకుతెరువు
కొరకు సినిమాలలో నటించే దానికిరాడు. సినిమాలలో నటించే వ్యక్తి చేత ఏసుప్రభువు యొక్క గొప్ప తనము తెలియని
డాక్టరుగారు తాను ఏసుప్రభువునని తనమాటను సినీ నటుని చేత చెప్పించడము పెద్ద పొరపాటు. దానితో అతని
మాట అబద్దమని తెలిసిపోవడమేకాక, అతను ఏమాత్రము దైవసూత్రములు తెలియని వ్యక్తి అని కూడా తెలిసిపోయింది.
43

Page 44
ఇలాంటిదే నాకు తెలిసిన పూర్తి అసత్యము మరొకటి హిప్నటైజ్ చేయు డాక్టరుగారిచేత బయటపడింది. ప్రశ్నించువాడే
జవాబును చెప్పించు చుండును. కావున తనకు తెలిసిన దానినే హిప్నటైజ్ అయిన వ్యక్తిచేత చెప్పించడము జరుగుచున్నది.
అలాంటపుడు చెప్పించువారి నిజస్వరూపము బయటపడగలదు. చెప్పేవాడు చెప్పిన మాటలన్నీ అడిగే వానివే అని
తెలియకపోవడవడము వలన ప్రతి ఒక్కరూ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అను దానిలో మభ్యపడిపోవుచున్నారు. ఇప్పుడు
నాకు అసత్యముగా తోచిన మాట అందరికీ సత్యముగా ఒప్పుకొను విషయమును చూస్తాము. ఇందులో ఆ డాక్టరుగారి
మాట అసత్యముగా కనిపించదు గానీ, నా మాటయే అసత్యముగా కనిపించును. అటువంటిది ఏదనగా! సర్వ
సాధారణముగా ప్రజలందరూ ఒక అసత్యమును సత్యముగా నమ్ముచున్నారు. మేధావులూ, విజ్ఞానులూ, భౌతికశాస్త్రవేత్తలము
అనిపించుకొన్నవారూ అందరూ ఒక జన్మ విషయములో ఉన్న సత్యము గమనించక, లేని అసత్యమును సత్యమను
కోవడము జరుగుచున్నది. మనిషి జన్మించు క్షణములలో ఏమి జరుగు చున్నదో తెలియలేక తప్పుగా అసత్యమును
సత్యముగా నమ్మడము జరుగుచున్నది. జనన సమయ విషయములో మాత్రము ఒక విధముగా అందరూ పప్పులో
కాలు వేశారనే చెప్పవచ్చును. అందరూ గర్భస్థ శిశువుకు ప్రాణమున్నదని అనుకోవడము జరుగుచున్నది. కానీ గర్భస్థ
శిశువుకు ప్రాణము లేదనుమాట సత్యమను విషయము బహుశా ఎవరికీ తెలియదు. ఇదే విషయమునే మేము “జనన
మరణ సిద్ధాంతము” అను గ్రంథములో శాస్త్రబద్ధమైన నిరూపణలతో సిద్ధీకరించి వ్రాయడము జరిగినది.
మనిషి యొక్క జననములో ఏమి జరుగుచున్నదో ప్రత్యక్షముగా తెలిసినా దానిలోని సత్యము కనిపిస్తూవుండినా,
తల్లి గర్భములోనే ఐదవ నెలలో ప్రాణము వస్తున్నదని ఆధ్యాత్మిక వాదులు కొందరనుచుండగా, విజ్ఞానము తెలిసినవారు
కొందరు వీర్య కణములోనే ప్రాణమున్నదనీ, తల్లి గర్భము ధరించినప్పటినుండి శిశువుకు ప్రాణమున్నదని అనుచున్నారు.
ఈ విధముగా విజ్ఞానులూ, జ్ఞానులూ పొరపడిపోవడము వలన మనిషి యొక్క జనన సమయము జగమెరుగని సత్యమనీ,
ఈ విషయములో అందరూ అసత్యమునే సత్యమనుకోవడము జరుగుచున్నదనీ మేము జనన సిద్ధాంతములో తెలియజేశాము.
ఆ విషయములో అందరూ ఎలా పొరపడుచున్నారో విశదముగా తెలియజేశాము. మేము చెప్పుచున్న మాట సరియైన
దని అందరికీ తెలియుటకు శాస్త్రబద్ధమైన నిరూపణలను చూపించాము. ఇదే జనన విషయమును పాస్ట్ లైఫ్ రిగ్రేషన్
థెరపి అను దాని ప్రకారము హిప్నటైజ్ చేయబడిన వ్యక్తిచేత హిప్నటైజ్ చేసిన వ్యక్తి చెప్పించునపుడు చెప్పుమనిషి,
ఉన్న సత్యమును చెప్పక అసత్యమును చెప్పుచున్నాడంటే అది చెప్పించు వ్యక్తి యొక్క లోపమనీ, అతనికి సత్యము
తెలియకపోవడము వలన అలా చెప్పించడము జరిగినదని తెలిసిపోవుచున్నది. పాస్ట్ లైఫ్ (గతజన్మ) లో ఏమి జరిగినది,
ఆ మనిషి యొక్క ఆత్మకు తెలుసుగానీ, ప్రస్తుత జన్మలోనున్న మనస్సుకు తెలియదని చెప్పకొన్నాము. ఆత్మ గత జన్మలో
కూడా జీవుని వెంట ఉన్నది, మనస్సు గతజన్మలో లేదు. కావున గతజన్మ విషయముగానీ, గతజన్మలో చనిపోయిన
సమయములోని విషయముగానీ, అలాగే ప్రస్తుత జన్మలో పుట్టిన సమయములో జరిగిన విషయమునుగానీ, అన్నిటినీ
ఆత్మ చెప్పగలదు. ఆత్మ ఎవరి మాట వినదు, అందువలన ఎవరి మాటకూ జవాబును చెప్పదు. ఎదుటి మనిషియొక్క
ప్రశ్నకు హిప్నటైజ్ అయిన మనిషిలోని మనస్సు మాత్రము జవాబు చెప్పును. ఆ మనస్సుకు గతజన్మ విషయములు
తెలియకుండపోవడము వలనా, అలాగే జనన సమయములో జ్ఞప్తి లేని దానివలనా, ఆ విషయములను మనస్సు
చెప్పలేదు. అటువంటపుడు ఎదుటి మనిషి చెప్పించినట్లు ఏమి చెప్పితే దానినే చెప్పగలదు.
ఒక దినము హిప్నటైజ్ చేసిన వ్యక్తి, హిప్నటైజ్ అయిన వ్యక్తిని కొన్ని ప్రశ్నలడుగుచూ ఒక సమయములో. “నీవు
తల్లి గర్భమునందు ఉన్నప్పుడు ఐదవనెలలో ఏమి చేశావు? ఎలాగుండేది? అని అడిగాడు. అప్పుడు కళ్ళుమూసుకొని
44

Page 45
పడుకొనివున్న వ్యక్తి తాను తల్లిగర్భములో చాలా ఇబ్బంది పడినట్లు, అప్పుడు గతజన్మలోని కొన్ని విషయములు జ్ఞాపకము
వచ్చినట్లు, రాబోవు జన్మలో ఎలా ఉండవలెనో ముందే నిర్ణయించుకొన్నట్లు చెప్పడము జరిగినది. అలా చెప్పడము
మాకు ఒక విధముగా ఆశ్చర్యమైనా అది చెప్పే మనిషి యొక్క మాట కాదనీ, అడిగే మనిషి యొక్క మాటేనని అర్థమైపోయినది.
ఎందుకనగా! చెప్పే మనిషికి గర్భస్థ జీవనము అసలుకు లేదు. లేనిదానిని ఉన్నదని ఆ మనిషి ఎలా చెప్పగలడు?
దానివలన లేనిదానిని చెప్పించడము జరుగుచున్నదనీ, అందులోని అసత్యము, చెప్పించే మనిషిదేనని అర్థమగుచున్నది.
గర్భస్థ జీవన విషయములో అందరూ పొరపడినట్లే హిప్నటైజ్ చేసిన వ్యక్తి కూడా పొరపడివుండడము వలన అతని
ఉద్దేశమునే ఎదుటి మనిషి చేత చెప్పించాడని తెలిసిపోయినది. ఇక్కడ కొందరు ప్రశ్నలు అడుగుటకు అవకాశము
గలదు, అదేమనగా! అలా ఎందుకు చెప్పించుచున్నారు? అలా చెప్పించడము వలన వారికేమి లాభము? అని కొందరు
ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
ఈ విధముగా “పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి" అని వైద్య వృత్తిలోనున్న డాక్టర్లు మాత్రము చేయడము గమనించదగిన
విషయము. అలా చేయడము ప్రస్తుత జన్మలోని రోగమునకు వెనుకటి జన్మలోని ఏదో ఒక కారణమును చెప్పించి,
దానివలన ఈ రోగము వచ్చిందని నమ్మించి, వెనుకటి జన్మలోని కారణమునకు తగినట్లు చికిత్స చేస్తే ఆ రోగము
నయమై పోగలదని చెప్పి, అలా వెనుకటి కారణమును తెలుసుకొని చికిత్స చేయుట అందరి వైద్యుల చేతకాదనీ,
తాముమాత్రము అలా చేయగలమని ప్రచారమగుచున్నారు. అంతేకాక అలా వెనుకటి జన్మలోని కారణములను తెలియక
చికిత్స చేసినా
ఆ రోగములు నయముకావనీ, అవి దీర్ఘకాల రోగములుగా ఉండిపోవుననీ చెప్పుచున్నారు. అట్లు
చెప్పుట వలన చాలామంది ఆ డాక్టరును ప్రత్యేక వైద్యునిగా గుర్తించడమేకాక, ప్రతి ఒక్కరూ తమ వెనుకటి జన్మ
ఎటువంటిదో కొంతైనా తెలుసుకోవలెనని అభిలాష కల్గి, అటువంటి డాక్టరుగారినే ఆశ్రయించడము జరుగుచున్నది.
దానివలన “పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి” అని పేరు పెట్టుకొన్న డాక్టర్లకు విలువ పెరిగి పోవుచున్నది. కొందరు డాక్టర్లు
మాత్రము ఈ విధానమును ప్రచారము చేసుకొనుట మనము గమనించవచ్చును. ఈ విధానము సరియైనదికాదని
కొందరు సైన్సు తెలిసిన విజ్ఞానులు, హేతువాదులు చెప్పడము జరుగుచున్నది. మేము సత్యమును సత్యముగా, అసత్యమును
అసత్యముగా చెప్పుచున్నాము. ఈ విషయములో మేము కూడా హేతువాదులతో ఏకీభవించుచున్నాము. అట్లని
అన్నిటిని ఒకే గుంజకు కట్టివేసి నేటి హేతువాదులతో అన్ని విషయములలోను ఏకీభవించము.
సృష్ఠిలో తయారైన మనిషి అప్పటినుండి చస్తూ పుట్టుచూ శరీరములను మార్చుకొనుచున్నాడు. మరణములో
శరీరము నశించినా జీవుడు మాత్రము నశించక క్రొత్త దేహమును ధరించుచున్నాడు. జీవాత్మ (జీవుడు) సృష్ట్యాది
నుండి శరీరమును ధరిస్తూ పాపపుణ్యములను అనుభవిస్తూ ఇప్పటి వరకు కొనసాగుచున్నాడనీ, ఎప్పుడైతే దైవజ్ఞానమును
తెలుసుకొని కర్మలను లేకుండా చేసుకోగలడో ఆ దినము దైవములోనికి చేరిపోయి తర్వాత పుట్టకుండా పోవునని
బ్రహ్మవిద్యాశాస్త్రము చెప్పుచున్నది. ఆరు శాస్త్రములలో పెద్దదైన దైవశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రతి మనిషికి
వర్తించునదై ఉన్నది. స్వయముగా దేవుడు తెల్పినది బ్రహ్మవిద్యాశాస్త్రమైన దానివలన, అది సర్వమానవులకు వర్తించును.
అది దైవశాస్త్రమైన దానివలన దానికి కులమూ, మతమూ అను వ్యత్యాసములుండవు. మూడు భాగముల కన్ను, ఏడు
భాగముల హస్తము ఉన్న మానవులందరికి వర్తించును. దేవుడు తన జ్ఞానమును తెలుపు నిమిత్తము తన బోధకులను
(ప్రవక్తలను) పంపగా, వారు చెప్పిన జ్ఞానమును మనిషి సరిగా అర్థము చేసుకోలేక ప్రవక్తల బోధలకు మతము అను
పేరును తగిలించుకొన్నారు. వాస్తవానికి ఏ ప్రవక్తా మత బోధలు చెప్పలేదు, వారు సర్వ మానవులకు వర్తించు దైవ
45

Page 46
సూత్రములనే చెప్పారు. ప్రవక్తలు బోధించిన దైవసూత్రములను మనిషి అర్థము చేసుకోలేక మాయ ప్రభావమువలన
మతములను సృష్టించుకొన్నాడు. అంతేకాక శాస్త్రము శాసన రూపమైనదని తెలియక బ్రహ్మ విద్యాశాస్త్రములో చెప్పిన
సూత్రములకు వ్యతిరేఖముగా కొన్ని మాటలను మనిషి సృష్టించుకొన్నాడు. అటువంటి వాటిలో పునర్జన్మలు లేవు అని
చెప్పడము బ్రహ్మవిద్యాశాస్త్రమునకు వ్యతిరేఖమైన మాట. ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రములో ఉన్న ధర్మమునకు
విరుద్ధమైన మాటను చెప్పుకోవడము అజ్ఞానమగును. అంతేకాక దైవధర్మమునకు విరుద్ధమైనది అధర్మమగును.
ఆ
ఇప్పటికి రెండువేల సంవత్సరముల పూర్వము పుట్టిన క్రైస్తవములో ప్రవక్త అయిన ఏసుప్రభువు పునర్జన్మలేదని
చెప్పకున్ననూ, అక్కడక్కడ పునర్జన్మలున్నవని అర్థమగునట్లు చెప్పియున్ననూ అర్థము చేసుకోలేని మనిషి, ప్రభువు
చెప్పిన దానిని ఒక మతముగా ఏర్పరచడమేకాక, పునర్జన్మలు తమ మతములో చెప్పలేవనీ ప్రచారము చేసుకొన్నాడు.
ఆ విధముగా క్రైస్తవమతములో ఏసు మాటను ఆ మతస్థులందరూ వక్రీకరించుకొని చెప్పుకోగా, తర్వాత కొంత కాలమునకు
అనగా దాదాపు 14 వందల సంవత్సరముల పూర్వము మహమ్మద్ ప్రవక్తగారు పుట్టి తనకందిన దైవ సందేశమును
ప్రజలకు తెలిపాడు. ఇస్లామ్ (విశ్వాసము) అను పునాది మీద ప్రవక్త తన బోధను తెలుపగా, దేవునిమీద విశ్వాసము
(ఇస్లామ్) అందరికి అవసరమైనది అయినా చివరకది కూడా ఒక మతముగా మారిపోయినది. సాతాన్ లేక సైతాన్
అనబడు మాయ మనిషిలో ఉంటూ ప్రవక్తలు చెప్పిన దైవసందేశమును కూడా మనిషికి తప్పుగా అర్థమగునట్లు
చేయడము వలన ఇస్లామ్లో కూడా పునర్జన్మలు లేవని చెప్పినట్లు మనిషి ప్రచారము చేసుకొన్నాడు. ఇస్లామ్లో
చెప్పిన దైవసూత్రము అర్థము కాకుండా పోయిన దానివలన చివరకు అందరూ జన్మల విషయములో పొరపాటు పడి
పోయారు. ఇస్లామ్లో పునర్జన్మలు లేవని చెప్పడానికి దానికంటే ముందు పుట్టిన క్రైస్తవమే కారణమనవచ్చును. క్రైస్తవ
మతములోనే పునర్జన్మలు లేవని ప్రచారమగుట వలన దానిలోని సాతాన్, ఇస్లామ్లో సైతాన్గా మారి వారిని కూడా
భ్రమింపచేసింది.
మరణ విషయమును వివరముగా చెప్పుకొంటే ఒక మనిషిని విభజించి చూస్తే మొత్తానికి రెండు భాగములుగా
చెప్పవచ్చును. ఒకటి ప్రకృతి భాగముకాగా, రెండవది పరమాత్మ భాగము. ప్రకృతి భాగములో మొత్తము శరీరముండగా,
పరమాత్మ భాగములో జీవాత్మ, ఆత్మ గలవు. అదే విధముగా రెండు భాగములకు నాశనము కలదు. ప్రకృతి భాగమైన
శరీరము నాశనమగునదే, అట్లే పరమాత్మ భాగమైన జీవాత్మ నాశనమగునదే, జీవునితో పాటువుండు ఆత్మ నాశనము
కానిదని జ్ఞప్తికుంచుకోవలెను. శరీరము నాశనమగుటను మరణము అంటాము. జీవుడు నాశనమగుటను మోక్షము
అంటాము. ఎలాగైతే శరీరమునకు కలుగు మరణమును చావు అంటామో అలాగే జీవునకు కలుగు మోక్షమును ముక్తి
అంటాము. జీవుడు ధరించు శరీరము ఎన్నోమార్లు నాశనమగుచున్నది, ఎన్నోమార్లు జన్మించు చున్నది. కానీ జీవుడు
ఒక్కమారే పుట్టాడు, ఒక్కమారే నశిస్తాడు. దీనిని బట్టి శరీరమునకు ఎన్నో చావుపుట్టుకలున్నవి, కానీ జీవునకు జన్మ
ఒక్కటే, అలాగే ముక్తి ఒక్కటే. శరీరము మారి కొత్త శరీరమును జీవుడు ధరించి నపుడు దానిని పునర్జన్మ అంటున్నాము.
కానీ దానిని జన్మ అనడము లేదు. శరీర విషయములో జన్మ అంటున్నాము. జీవుడు క్రొత్త శరీరము ధరిస్తే దానిని
సందర్భానుసారము జన్మించడము అనినా లేక జన్మ అనినా అది శరీర నిమిత్తము చెప్పబడినదేగానీ జీవుని నిమిత్తము
చెప్పబడినది కాదు. ఈ విధముగా ఒక మనిషి శరీరమునకు జనన మరణములు, మనిషిలోని జీవునికి జన్మ,
మోక్షముగలవని తెలియవలెను. ఇంతకు ముందు చెప్పిన జనన మరణ సిద్ధాంతముగానీ, మరణ రహస్యముగానీ
శరీరమును ఉద్దేశములో పెట్టుకొని చెప్పినవేనని తెలియవలెను.
46

Page 47
ఒక మనిషి భూమిమీద సృష్టి మొదటిలోనే జన్మించాడు. తర్వాత శరీరములు చనిపోగా చనిపోగా క్రొత్త శరీరములను
ధరిస్తూ వస్తున్నాడు. ఏ శరీరములోని జ్ఞప్తి ఆ శరీర మనస్సుకు ఉండును. కావున వెనుకటి శరీరములలోని జ్ఞాపకము
జీవునికి తెలియకుండా పోయినది. ఇప్పటి శరీరములోని జ్ఞాపకము మాత్రము ఇప్పటి శరీరములోని మనస్సు అందించు
చుండును. కావున ప్రస్తుత జన్మ జ్ఞప్తి మాత్రమే మనిషికి తెలియుచున్నది. అందువలన మనిషి తనకు ఎన్ని పునర్జన్మలు
కల్గివున్నవో చెప్పలేడు. అలాగే గతజన్మ విషయమును కూడా చెప్పలేడు. ఇది మనిషి శరీరము యొక్క చావు పుట్టుకల
విధానము. జీవుని యొక్క జన్మ, ముక్తి (మోక్షము) యొక్క విషయానికి వచ్చి చూస్తే జీవుడు జన్మించాడు కానీ అతడు
శరీరములు మారుతూనే ఉన్నాడు తప్ప మోక్షమును పొందలేడు. ఒకమారు భూమిమీద జన్మించిన జీవుడు అనేకమార్లు,
అనేక శరీరములను ధరిస్తూ, అనేక పేర్లతో చలామణి అగుచూ కాలమును ఇంతవరకూ గడుపుచూ వచ్చాడు. అయితే
జ్ఞప్తి లేని దానివలన ఇప్పటి వరకు ఎన్ని శరీరములను ధరించినదీ, ఎన్ని పేర్లతో చలామణి అయినదీ ఎవనికీ
తెలియదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవనికైనా వాని ఆత్మ గతజన్మ విషయమును ఒక్క దానిని తెలియజేస్తే దాని
ఆధారముతో మనిషి తిరిగి పుట్టుచున్నాడని చెప్పుకొనుటకు ఆధారము ఏర్పడుచున్నది. అంతేకాక బ్రహ్మవిద్యాశాస్త్రము
ప్రకారము మనిషికి పునర్జన్మలున్నాయనుటకు సాక్ష్యము దొరుకుచున్నది.
ఒక మనిషి ఎన్నిమార్లు పునర్జన్మించినా ఆ మనిషిలోని జీవుడు జన్మించినది ఒక్కమారేనని, ఆ మనిషి ఎన్నిమార్లు
మరణించినా ఆ మనిషిలోని జీవునికి నిజముగా మరణము (ముక్తి) రాలేదని చెప్పవచ్చును. జీవుడు జన్మించి కొన్ని
లక్షల సంవత్సరములైనా, అతనికి ఇంతవరకు రాని మరణము ఎప్పుడు వస్తుందో చెప్పలేము. జీవుడు మరణించాలంటే
లేక ముక్తి పొందాలంటే దానికి ముందుగా దైవజ్ఞానమును జీవుడు తెలిసి వుండాలి. జీవుడు నివసించు శరీరమునకు
నాశనము (మరణము) జీవునికి తెలియకుండానే జరుగుచున్నది. ఏ జీవుడూ తన శరీరము వదలి పోతామని
అనుకోకముందే, శరీరము తనను వదలి నశించి పోవుచున్నది. జీవుడు సాధారణముగా ఏ ప్రయత్నము చేయకుండానే
తాను ధరించిన శరీరము నశించిపోవుచున్నది. అయితే జీవుడు ఎంతో తీవ్రప్రయత్నము చేస్తేగానీ తనకు నాశనము
ఏర్పడగలదు. జీవుడు తాను నాశనమగుటకు ఎంతో దైవజ్ఞానమును సంపాదించి దాని ప్రకారము నడిచినపుడు తన
ఆరోగ్యము నకు కారణమైన కర్మ లేకుండా పోవును. జీవుడు భూమిమీద జీవించుటకు కర్మ దివ్యమైన ఔషధముగా పని
చేయుచున్నది. జీవున్ని ఎన్నో యుగముల నుండి జీవింపజేయు ఔషధములాంటి కర్మనుమించినది, దానికి విషము
లాంటిది అయిన దైవజ్ఞానమును మనిషి జీర్ణింప చేసుకొంటే అప్పుడు కర్మ నశించిపోయి జీవునికి మరణము (ముక్తి)
ఏర్పడును. ఇదే విషయమునే మరికొందరు వేరు విధముగా చెప్పుకొన్నారు. శరీరముతో వుండి శరీర మరణములను
పొందు జీవున్ని మృత జీవుడనీ, శరీరములను వదలి ముక్తి పొంది ఎప్పటికీ శరీరములలో చిక్కుకోకుండా శరీర
మరణములనుండి తప్పించుకొనిన జీవున్ని అమృత జీవుడని వర్ణించారు. అందువలన భగవద్గీతలో గానీ, బైబిలులోగానీ
మోక్షము (ముక్తి) పొందిన వానిని అమృతుడనీ, ముక్తి పొందని వానిని మృతుడనీ అనడము జరిగినది. దాని అర్థము
ప్రకారమే దైవజ్ఞానము తెలిసిన వానిని అమృతమును స్వీకరించువాడని కూడా చెప్పారు. ఇదే అర్థముతోనే భగవద్గీతలో
రాజవిద్యా రాజ గుహ్య యోగమున "అమృతం చైవ మృత్యుశ్చ" మృత్యువుకు అమృతముగా నున్నాను అని అన్నాడు.
అంతేకాక అదే గీతలోనే గుణత్రయ విభాగ యోగమున చివరిలో 27వ శ్లోకమందు "అమృతస్యా వ్యయస్య” వ్యయము
నకు అనగా శరీర నాశనమునకు లేక శరీర మృత్యువుకు అమృతముగా ఉన్నాను అని కూడా చెప్పాడు.
47

Page 48
ఇది ఇట్లుండగా బైబిలులో ఇదే అర్థముతో రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో ఎఫెసేయులకు వ్రాసిన పత్రిక
రెండవ అధ్యాయములో 11,12,13 వాక్యములలో ఇలా గలదు. "మునుపు శరీర విషయములో అన్యజనులైవుండి,
శరీరమందు చేతితో చేయబడిన సున్నతిగలవారు అనబడినవారిచేత, సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు
ఇజ్రయేలులో సహ పౌరులుకాక, పరదేశులునూ, వాగ్దాన నిబంధనలేని పర జనులనూ, నిరీక్షణ లేనివారునూ, లోకమందు
నిర్దేవులునైవుండి, క్రీస్తుకు దూరస్థులునై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఆయనకు మునుపు దూరస్థులైన
మీరు ఇప్పుడు క్రీస్తు ఏసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు.” బైబిలులో వ్రాయబడిన కొన్ని పదములు
మంచి అర్థముతో కూడుకొన్నవైనప్పటికీ చాలామంది క్రైస్తవ బోధకులకు కూడా వాటి నిజార్థము తెలియకపోవడము
వలన బైబిలులోని భావము సరిగా అర్థము కాకుండా పోయినది. క్రీస్తు రక్తము అనగానే క్రైస్తవులందరికీ శిలువ మీద
శిక్షింప బడిన ఏసుప్రభువు రక్తము గుర్తు వస్తుంది. కానీ ఆ భావము సరియైనది కాదని ఎవరికీ తెలియదు. ఏసురక్తము
వలన మనుషులకు పాపపరిహారమున్నదనీ, క్రైస్తవ మతములోనికి చేరిన వారికి ఏసు కార్చబడిన రక్తము చేత మీ
పాపములు పోవుననీ చెప్పుచున్నారు. వినే వారందరూ వారి మాటలు సత్యమేనని నమ్ముచున్నారు. కానీ క్రీస్తు అంటే
దేవుడు అనీ, క్రీస్తు రక్తము అంటే దేవుని జ్ఞానము అని తెలియలేక పోవుచున్నారు. దైవ జ్ఞానములో ఎక్కువగా అన్ని
పదములు సూక్ష్మ అర్థములతో కూడుకొని వుండును. స్థూలభావములతో జ్ఞానముండదు. ఏసు బ్రతికివున్నప్పుడు
కూడా నా నిబంధన రక్తము అని చెప్పాడు గానీ, శరీరములోవుండే సాధారణ రక్తమని ఎక్కడా చెప్పలేదు.
జ్ఞానులు
పైన చెప్పిన 11,12,13 వాక్యములలోని సారాంశమును నిజ భావముతో చూస్తే “పూర్వము ఇజ్రాయేలు
దేశములో అజ్ఞానులుగాయున్న మీరు దేవునికి దూరస్థులై ఉంటారనీ, దేవునికి దూరముగానున్న మీరు ఇప్పుడు దేవుని
విషయములలో దేవుని జ్ఞానము వలన దేవునికి దగ్గరగా ఉన్నారు.” అని చెప్పడము జరిగినది. ఈ వాక్యముల వలన
మనకు ముఖ్యముగా తెలియునదేమనగా! పూర్వము రెండువేల సంవత్సరముల ముందు ఇజ్రాయేలు దేశములో
అజ్ఞానులుగా, దేవుని జ్ఞానము తెలియని వారుగా, దేవునికి దూరముగానున్న మనుషులు ఇప్పుడు ప్రస్తుత కాలములో
దేవుని జ్ఞానము తెలిసిన దానివలన దేవునికి దగ్గరగా ఉన్నారని తెలియుచున్నది. దీనినిబట్టి అజ్ఞానముగా పూర్వమున్న
కొందరు మనుషులు ఇప్పుడు జ్ఞానులుగా ఉన్నారని తెలియుచున్నది. పూర్వము అజ్ఞానిగా దేవునికి దూరముగా ఉన్న
మనిషి జన్మలు మారుచూ వచ్చి ఇప్పటికి జ్ఞానమును తెలిసినవాడై దేవునికి దగ్గరగా ఉన్నాడనీ, అలా జన్మలు మారుట
వలన ఇంతకాలమునకు దైవజ్ఞానము వలన (క్రీస్తు రక్తము వలన) మనిషి దేవునికి దూరముగానున్నవాడు దగ్గరయ్యాడని
తెలియుచున్నది. ఇందులోని జ్ఞానము వలన మనిషికి పునర్జన్మలున్నాయని బాగా అర్థమగుచున్నది. అదే రెండవ
ఆధ్యాయములో మొదటి వాక్యములోని పదములను చూస్తే చెప్పబడిన జ్ఞానము సూక్ష్మమైన అర్థములతో కూడుకొని
ఉండునని తెలియగలదు. “మీ అపరాధముల చేతనూ, పాపముల చేతనూ మీరు చచ్చినవారై ఉండగా, ఆయన
మిమ్ములను కూడ బ్రతికించెను.” ఈ వాక్యములో ఆయన అనగా దేవుడని సులభముగా అర్థమై పోగలదు. కానీ
చచ్చినవారై ఉండగా అనుమాట అందరినీ తప్పుదోవ పట్టించు అవకాశముగలదు. దూరము వారు దగ్గరయ్యారు అని
చెప్పినట్లు, చచ్చినవారు బ్రతికారు అని చెప్పారు. చచ్చినవారనగా దైవజ్ఞానములేనివారని అర్థము. మనిషి ఎన్నో
పాపములను చేసి ఆ పాపముల మధ్యలోవుండి, దైవత్వము అను చైతన్యము లేకుండడమును జ్ఞానరీత్యా చచ్చినవాడని
చెప్పబడినది. అటువంటి మనిషిని దేవుడు తన ప్రవక్తల ద్వారా తన జ్ఞానమును తెలిపి దైవత్వము (క్రీస్తు) తో
బ్రతికించాడని, జ్ఞానముచేత చైతన్యవంతులను చేశాడని చెప్పవచ్చును.
48

Page 49
6
భగవద్గీతలో జ్ఞానయోగమున 37వ శ్లోకములో చెప్పబడిన “యథై ధాంసి సమిద్దోగ్ని ర్భస్మసా త్కురు తేర్జున,
జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసా త్కురుతే తథా” ఏ విధముగా అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదే విధముగా
జ్ఞానమను అగ్నిలో సర్వకర్మలు (సర్వ పాప పుణ్యములు) కాలి పోవుచున్నవి.” అని భగవంతుడు తెల్పినట్లు, బైబిలులో
కూడా క్రీస్తు రక్తము చేత పాపములు హరించబడును అని చెప్పడము జరిగినది. గీతలో దేవుని జ్ఞానముచేత అని
చెప్పగా, బైబిలులో క్రీస్తురక్తము చేత అని చెప్పడమును గ్రహిస్తే రెండు చోట్ల దేవుని వాక్యము ఒక్కటిగానే ఉన్నదని
తెలియుచున్నది. క్రీస్తు అనగా దేవుడనీ, రక్తము అనగా జ్ఞానము అనీ అర్థము చేసుకోగలి గినపుడే దేవుని వాక్యము
ఎప్పటికీ మారదని అర్థము కాగలదు. అట్లుకాక సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని తెలియక ఒక్కొక్క మతమునకు
ఒక్కొక్క దేవుడున్నాడని అనుకొనుచూ, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అనుకోవడము అజ్ఞానమగును. అన్ని
మతములకు అధిపతి ఒక్కడేనని తెలిసిననాడు ఆయన చెప్పిన జ్ఞానము అంతా ఒక్కటేనని తెలియగలదు.
క్రైస్తవ మతములో పునర్జన్మలు లేవు అనుట విన్నాము. కావున బైబిలులో దేవుడు అలా చెప్పలేదు అనుటకు
మరియొక ఉదాహరణను బైబిలునందే, చూపుచున్నాను చూడండి. బైబిలులో అన్నిటికంటే ఉత్తమ మైనది యోహాను
సువార్త అని చెప్పవచ్చును. దానిలో 15వ ఆధ్యాయము నందు చివరిలోనున్న 26,27 వాక్యములలో “తండ్రియొద్దనుండి
మీవద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రివద్దనుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినపుడు,
ఆయన (ఆదరణకర్త) నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటినుండి నావద్దనున్నవారు గనుక మీరునూ సాక్ష్యమిత్తురు.”
ఈ వాక్యములో ప్రజలు ఏసుప్రభువు ఉన్నప్పుడు ఏసును చూచినవారు, ఆయన బోధలు వినినవారు కొన్ని వేలు,
వందల సంవత్సరములు గడచిన తర్వాత ఆదరణకర్త వచ్చినపుడు కూడా పుట్టి వుందురనీ, ఆదరణకర్త చెప్పిన ఏసు
మాటలను వారు కూడా సులభముగా గుర్తు పట్టగలరని తెలియుచున్నది. మీరు మొదటినుండి ఉన్నవారు అనుట
వలన మనుషులైన మనము సృష్ఠిఆదినుండి పునర్జన్మలు ఎత్తుచూ ఉన్నామని తెలియుచున్నది. పునర్జన్మలను గురించి
బైబిలులో ఇంతకంటే మించిన సాక్ష్యము అవసరము లేదు. ఇటువంటిదే మరియొకచోట మత్తయి సువార్తలో 12వ
ఆధ్యాయమునందు 31,32 వాక్యములలో "ప్రతి పాపమును, దూషణము మనుష్యులకు క్షమించబడునుగానీ, ఆత్మ
విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణగలదు
కానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ, రాబోవు యుగ మందైననూ పాపక్షమాపణ
లేదు" అని ఉన్నది. ఈ వాక్యములో ఈ యుగమందైననూ, రాబోవు యుగమందైననూ అని చెప్పబడుట వలన ఒక
యుగములో ఉన్న మనిషే తర్వాత యుగములో కూడా ఉండునని అర్థము కదా! ఒక యుగము కొన్ని లక్షల సంవత్సరముల
కాలముండును. అలాంటపుడు రెండు యుగముల కాలము పాపమును మనిషి అనుభవించాలంటే, మనిషి ఎన్నోమార్లు
చచ్చి తిరిగి పుట్టవలసి ఉన్నది. ఈ మాట ప్రకారము కూడా పునర్జన్మలున్నట్లు బైబిలు ద్వారా తెలియుచున్నది.
ఈ విధముగా దేవుడు తన ప్రవక్తల ద్వారా అన్నిచోట్ల మనిషికి పునర్జన్మలున్నట్లే చెప్పించాడు. అయితే చెప్పబడిన
జ్ఞానమును సరిగా అర్థము చేసుకోలేని మనిషి పునర్జన్మల విషయములో దేవుని జ్ఞానమును తప్పుగా అర్థము చేసుకొన్నాడని
చెప్పవచ్చును. మేము ఈ విషయమును చెప్పగా కొందరు క్రైస్తవులూ, మరికొందరు హిందువులూ ఈ విధముగా
నన్ను ప్రశ్నించారు. ఇటు భగవద్గీతలోగానీ, అటు బైబిలులోగానీ పునర్జన్మ విషయము చెప్పబడివున్నదని ఒప్పుకోగలము.
కానీ నీవు చెప్పుచున్న మరణ సిద్ధాంతముగానీ, మరణ రహస్యముగానీ ఏ గ్రంథములోనూ లేవు గదా! మూల
గ్రంథములైన బైబిలు, భగవద్గీతలో చెప్పని విషయములు నీవు ఎలా చెప్పుచున్నావు? అని అడిగారు. దానికి మేము
49

Page 50
సమాధానమును ఇలా చెప్పగలిగాము. దేవుడు మూల గ్రంథములైన బైబిలు, భగవద్గీతలో చెప్పిన జ్ఞానమునంతటిని
జ్ఞాపకము చేయుచూ,
ఆ గ్రంథములలో చెప్పని సమస్తమును మీకు తెలియబరచబడునని ముందే చెప్పివున్నాడు.
దేవుడు చెప్పిన మాట ప్రకారము మా నుండి మూల గ్రంథములలో చెప్పని ఎన్నో విషయములు బయటికి వచ్చాయి
అనుకుంటాను. క్రొత్తగా చెప్పబడిన సమస్త జ్ఞానము నేను చెప్పినది ఏమాత్రము కాదు. ఇక్కడ ముఖ్యముగా గమనింపతగిన
విషయమొకటున్నది. ఈ మధ్యన ఒక వ్యక్తినన్ను ఒక ప్రశ్న అడిగాడు. అదేమనగా! మీరు రచించిన గ్రంథము
చదివాను. అందులో చాలాచోట్ల మేము చెప్పునదేమనగా! అని బహువచనములో చెప్పుకొన్నారు. ఒక్కొక్కచోట మీరు
నన్ను అడిగినపుడు అని ఏక వచనమును చెప్పారు. ఏకవచనముగా నన్ను నేను అని అనవచ్చును. కానీ మిమ్ములను
ఎవరైన సంబోధించునపుడు బహువచనముగా సంబోధించవచ్చును. అట్లుకాక మీరంతకు మీరు బహువచనమును
చెప్పుచూ మేము చెప్పున దేమనగా, మా జవాబు ఏమనగా అని వ్రాశారు. అట్లు వ్రాయుటలో మీరు, మీ ఆశ్రమము
వారందరూ కలిసి చెప్పినట్లు అని మాకు అర్థమగు చున్నది. ఆ విధముగా అనేకచోట్ల తమను తాము బహువచనముగా
చెప్పుకొనుచు ఎక్కడో ఒకచోట నేను, నన్ను అని వ్రాయడములో అంత రార్థమేమిటి? ఎదుటి వారు గౌరవ సూచనగా
మీరు అని సంబోధించవచ్చును గానీ, మేము అని మీరు చెప్పుకోవడము నిన్ను నీవు గొప్పగా చెప్పుకొన్నట్లు కాదా!
అలా చెప్పుకోవడము అహమునకు గుర్తుకాదా?” అని అడిగారు.
దానికి జవాబుగా మీకు కనిపించు నేను చెప్పడము ఏమనగా! భగవద్గీత, బైబిలు మొదలగు మూల గ్రంథములలో
చెప్పని సమస్త జ్ఞాన విషయములను మేము వ్రాయడము జరిగినది. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ వచ్చి సమస్తమును
మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేయును అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడివున్నది.
కానీ నా గ్రంథములలో వ్రాయబడిన సమస్త జ్ఞాన విషయములను మేము వ్రాశాము అని చెప్పడము జరిగినది. మీకు
అది అహముగా కనిపించినా నేను మాత్రము ఎరుకలోవుండి జ్ఞానమును జ్ఞప్తిలో పెట్టుకొని, నన్ను నేను మరువకుండా
అట్లే నా ప్రక్కననున్న వానిని జ్ఞప్తిలో పెట్టుకొని వ్రాసినదని తెలుపుచున్నాను. నేనున్న శరీరములో నేను ఏమీ
తెలియనివాడను. నేను ఐదు రకముల అంధుడనే. చూడలేను, వినలేను, అట్లే మిగతావి ఏవీ తెలియవు. అటువంటి
నాకు ఏ జ్ఞానము తెలియదు. కానీ నాతో పాటు శరీరములోనున్న నా స్నేహితుడు మరియు నాకు పొరుగువాడైన
ఆత్మకు సమస్తము తెలియును. అన్నిటిని తెలిసిన నా పొరుగువాడు తెలిపితే నాకు తెలియును తప్ప స్వయముగా నాకు
ఏదీ తెలియదు. నా ఆత్మ నాకు హితుడుగావుండి నా చేత సమస్తమును వ్రాయించుచున్నది. కావున నేను వ్రాసేవాడిని,
నా స్నేహితుడు చెప్పేవాడు. ఒక విషయమును మీ లెక్కలో మీకు కనిపించునట్లు నేను వ్రాసినా, అది నా లెక్కలో నా
ఆత్మ చెప్పినది. నేను ఒక్కనిని చెప్పిన విషయము ఏదీ లేదు. అందువలన ప్రతి ప్రశ్నకు జవాబును వ్రాయునపుడు
మేము చెప్పునది ఏమనగా అని వ్రాస్తాము తప్ప, నేను వ్రాయునది అని ఎప్పటకీ వ్రాయను. కొందరికి అంతర్ ముఖ
జ్ఞానము తెలియని దానివలన, వారికున్న అజ్ఞాన చూపునకు నేను అహంకారిగా కనిపించినా నేను అహముతో ఏ పనీ
చేయలేదు. ఆత్మ చేయిస్తుందని చెప్పుచున్నాను. ఆత్మ, నేను (జీవాత్మ) ఇద్దరమూ కలిసి చేయడము వలన మేము
అంటున్నాము. మేము అంటే నేను, బాహ్యముగా నా చుట్టు ప్రక్కల ఉన్నవారనుకోవడము మీ తప్పే కానీ, నా తప్పు
కాదు.
2-
మీ దృష్ఠిలో నా శరీరము ఒక్కటే కనిపిస్తుంది. కావున మీరు అడుగుచున్నపుడు నన్ను మీరు అడిగినట్లు అని
ఏకవచనముతోనే వ్రాశాము. నేను ఒక్కనినే మీ లెక్కలో ఉండడము వలన కొన్ని సందర్భములలో అక్కడక్కడ ఏకవచనమును
50

Page 51
చెప్పవలసి వచ్చినది. మీరెట్లు అనుకొనినా నాకు తెలిసింది ఏమీ లేదు. కానీ మాకు సమస్తము తెలిసినదని వ్రాయ
గలుగుచున్నాము. ఎంత గొప్ప జ్ఞాన విషయమును చెప్పినా, మూల గ్రంథములలో లేని జ్ఞానమును శాస్త్రబద్దముగా
చెప్పినా, అది నా పనితనము కాదు. దానిని ఆత్మే చెప్పగలిగిందని నాకు బాగా తెలుసు. అదే ఆత్మకు గతజన్మ
విషయము లన్నీ తెలుసు. అందువలన సమస్త జ్ఞాన విషయములను తెలియజేయగలుగు ఆత్మకు వెనుకటి జన్మ
జ్ఞాపకములను కలుగజేయడము ఏమంత గొప్ప పని కాదు. భూమిమీద దైవజ్ఞానము సంపూర్ణముగా నిలబడుటకు
అప్పుడప్పుడు, అక్కడక్కడ పునర్జన్మ జ్ఞాపకములను ఆత్మ తెలియజేయు చుండునను విషయమును మరువకూడదు.
ఆత్మ ఎంత గొప్ప జ్ఞాన విషయమునైన తెలుపగలదు. ఎంత గొప్ప జ్ఞాపకమునైనా చేయగలదు. అలాగే దైవజ్ఞానము
యొక్క నిదర్శనమునకు సాక్ష్యముగా దేనినైనా ఆత్మ చేయించి చూపగలదు. అటువంటి ఆత్మ ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలకు
కూడా తెలియకపోవడము విచిత్రము. ఇంతవరకు మనము చెప్పుకొన్న పునర్జన్మ విషయములను ఆత్మే కొందరిలో
జ్ఞాపకము తెప్పించి నిరూపించిందని గ్రహించగలము. స్వయముగా ఆత్మే తెలియజేసిన విషయము కావున పునర్జన్మ
విషయములను అందరము శాస్త్రబద్దముగా తెలుసుకొందాము. పునర్జన్మలున్నవని ఇతరులకు కూడా తెలుపుదాము.
ఇట్లు
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
9.
51

------
Page 1
mo
0980
దేవుని గుర్తు - 963
భగవద్గీత అ.15-శ్లో॥ 16, 17
మాయ గుర్తు – 6 6 6
భగవద్గీత అ.16-శ్లో॥ 14
అర్ధ శతాధిక గ్రంథకర్త,
ఇందూ (హిందూ) ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
చక్రం
కాల
చక్రం
ఇందూ
చక్రం
చక్రం
-బ్రహ్మనాడి
నవేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞానవేదిక
(Regd.No. : 168/2004)

Page 2
దేవుని గుర్తు - 963
భగవద్గీత అ.15-శ్లో॥ 16,17
మాయ గుర్తు - 666
భగవద్గీత అ.16-శ్లో॥ 14
ఇప్పుడు కనిపించు ఈ విశ్వమంతయు ఒకప్పుడు లేదు. ఈ విశ్వమంతయు లేనపుడు కూడ ఒకటి
మిగిలియున్నది, అదియే దేవుడు. పైన ఆకాశముగానీ, క్రింద భూమిగానీ, మధ్యలో గాలిగానీ, అగ్నిగానీ, నీరుగానీ,
ఏ జీవరాశిగానీ లేనటువంటి సమయములో దేవుడు పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిగల
ప్రపంచమునూ, సకల జీవరాసులుగల జగతిని తయారు చేయాలనుకొన్నాడు. ప్రపంచము+జగతి =విశ్వము.
జీవరాశిలేని ప్రపంచమునూ, జీవరాశిగల జగతిని రెండిటిని కలిపి చెప్పు పదమును విశ్వము అంటాము. విశ్వము
లేని సమయములోనున్న దేవుడు పురుషుడుకాదు, స్త్రీయుకాదు, నపుంసకుడు అంతకూకాదు. రూపముగానీ, పేరుగానీ
లేనివాడు దేవుడు. దేవుడు ఎటువంటి లింగభేదము లేనివాడు. అటువంటి దేవునినుండి విశ్వమును సృష్టించాలను
సంకల్పము వచ్చినపుడు మొదట తననుండి రెండు భాగములను తయారు చేశాడు. ఆ రెండు భాగములను కూడ
రెండుదఫాలుగా సృష్టించాడు. దేవుడు తయారుచేసిన రెండు భాగములను ఒక్కమారు తయారు చేయకుండ, రెండుమార్లు
ఎందుకు తయారు చేశాడనగా? రెండు భాగములలో ఒకటి స్త్రీతత్త్వముకాగా, రెండవది పురుషసంబంధమైనది.
మొదట స్త్రీతత్త్వమైన ప్రకృతిని తననుండి దేవుడు తయారుచేశాడు. ఎపుడైతే స్త్రీతత్త్వమైన ప్రకృతిని తయారుచేశాడో
దానికి ఆదిపత్యము వహించుటకు తాను పురుషుడైనాడు. ప్రకృతి తయారు కాకముందు స్త్రీ, పురుషుడుకాని దేవుడు
ప్రకృతి తయారైన తర్వాత ప్రకృతి స్త్రీస్వభావము కలిగియుండగా, దేవుడు పురుష స్వభావము గలవాడైనాడు. ప్రకృతిని
భరించువాడు దేవుడు, కనుక ఆయనను ప్రకృతికి భర్త అని చెప్పడము జరిగినది. దేవుడు భర్తకాగ దేవుని వలన
భరింపబడు ప్రకృతి భార్య అయినది. దీనిప్రకారము దేవుడూ ప్రకృతీ ఇద్దరూ పతి సతులుగా ఉన్నారని తెలియుచున్నది.
దేవుడు మొదట స్త్రీతత్త్వమైన ప్రకృతిని తయారుచేసి, తర్వాత రెండవమారు పురుషతత్త్వమైన ఆత్మను
తయారుచేశాడు. ఆత్మ తయారైన తర్వాత ఆత్మకంటే వేరైనవాడు దేవుడు కనుక దేవునికి పరమాత్మయని కూడ
గుర్తింపుకల్గినది. దేవుడు మొదట స్త్రీ భావమున్న ప్రకృతిని సృష్టించి తర్వాత పురుష భావమున్న ఆత్మను
సృష్ఠించాడనుకొన్నాము కదా! స్త్రీ పురుషసంబంధమైన ప్రకృతి, ఆత్మలనే కాకుండ రెండిటికి తప్పిన నపుంసకున్ని
తయారు చేయాలనుకొన్నాడు. వెంటనే జీవాత్మను ఆత్మనుండి బయల్పడునట్లు చేశాడు. ఇటు ప్రకృతినీ, అటు
ఆత్మను తయారుచేసిన దేవుడు మధ్యలో జీవాత్మను కూడ చేయడమైనది. వివరముగా చెప్పుకోవాలంటే ఇటు స్త్రీనీ,
అటు పురుషునీ తయారు చేసిన దేవుడు మధ్యలో నపుంసకుని తయారు చేశాడనుకోవాలి. ఆత్మనుండి మరొక
జీవాత్మను సృష్టించినప్పుడు ప్రకృతిని కూడ ఐదుభాగములవునట్లు చేశాడు. ఆ ఐదు భాగములు 1) ఆకాశము
2) గాలి 3) అగ్ని 4) నీరు 5) భూమి అని తెలియుచున్నది. దీనిని ప్రకృతి సంబంధ పంచభూతములను ప్రపంచము
అంటున్నాము. ఈ ప్రపంచములో ఆత్మ జీవాత్మలు రెండిటిని జగతిగ దేవుడు తయారు చేశాడు. ప్రకృతిని భరించువాడు
పరమాత్మ (దేవుడు) కాగ, జీవాత్మను భరించువాడు ఆత్మ. పంచభూతముల వలన మనిషి శరీరము తయారుకాగ
ఆత్మ జీవాత్మలు ఆ శరీరములో నివశిస్తున్నవి. ఇదే విధానము అన్ని జీవరాసులకు వర్తిస్తున్నది.
01

Page 3
పురుషునిగా పరమాత్మ, స్త్రీగా ప్రకృతి ఉన్నదనుకొన్నాము కదా! ప్రకృతి శరీరములో నివశించు సగము
పురుషుడు సగము స్త్రీ అయిన జీవాత్మ అటు ప్రకృతివైపు పోతుందా ఇటు పరమాత్మవైపు పోతుందా అన్నదే ఇక్కడ
ముఖ్యమైన పని. జీవుడు పూర్తి ఆడమగ కాని మధ్యరకము వాడు కనుక పూర్తి తనవైపు లాగుకొనుటకు ప్రకృతి
ప్రయత్నించుచుండును. అలాగే పూర్తి తనవైపు లాగుకొనుటకు ఆత్మ కూడ ప్రయత్నించుచుండును. జీవున్ని తనవైపు
లాగుకొనుటకు ప్రకృతికి గుణములను ఆకర్షణగలదు. గుణములనే మాయ అంటున్నాము. అలాగే జీవున్ని ఆత్మ
తనవైపు లాగుకొనుటకు ఆత్మకు ఆత్మజ్ఞానము అను ఆకర్షణ గలదు. ఇటు మాయకు, అటు ఆత్మజ్ఞానమునకు
మధ్యనున్న జీవాత్మ తను ఎటు పోయేది తన ఇష్టము మీద ఆధారపడియుండును. జీవుడు ఇటు మాయవైపు
పోతాడా! అటు ఆత్మవైపు పోతాడా! అని వినోదము దేవుడు చూస్తున్నాడు. మాయవైపు పోయినవాడు ప్రకృతిలోనికీ,
ఆత్మజ్ఞానమువైపు పోయినవాడు పరమాత్మలోనికి చేరిపోతాడు. మాయవైపు పోవువానికి మాయకు (ప్రకృతికి) గుర్తుగా
ఆరువందల అరువది ఆరు (666) అను సంఖ్యను, ఆత్మవైపు పోవువానికి జ్ఞానమునకు (దేవునికి) గుర్తుగ 963 అను
సంఖ్యను గుర్తించుకొన్నాము. దేవుని గుర్తుగ 963 సంఖ్యను ఎందుకు పెట్టుకొన్నదీ, అలాగే మాయకు గుర్తుగ 666
సంఖ్యను ఎందుకు పెట్టుకొన్నదీ తెలియజేయునదే ఈ చిన్ని గ్రంథము.
సర్వజీవరాసులకు తల్లి ప్రకృతిగ, తండ్రి పరమాత్మగ ఉన్నాడని భగవద్గీతలో కూడ చెప్పబడినది. తండ్రి
భీజదాతకాగ, తల్లి శరీరముధాత అవుచున్నది. ఒక మనిషికి తల్లీతండ్రీ ఇద్దరు సమానమే, అందువలన ప్రకృతికి
సూచించిన 666 గానీ, పరమాత్మకు సూచించిన 963 గానీ కూడితే రెండు సమానమైన 18 సంఖ్యనే వస్తున్నవి.
ఇంతవరకు ప్రకృతిని గురించి, పరమాత్మను గురించి, జీవాత్మ ఆత్మ మాయను గురించి కొంత తెలుసుకొన్నాము.
దేవుని సంబంధసంఖ్య 963 గానే ఎందుకున్నది? అను విషయమునూ, అట్లే మాయ సంబంధ సంఖ్య 666 గానే
ఎందుకున్నదను విషయమునూ పూర్తి వివరముగా తెలుసుకొందాము.
సృష్ఠి అనగా తయారు చేయబడినదని అర్థము. ఇపుడు కనిపించు ఈ విశ్వమంతయు ఒకప్పుడు తయారు
చేయబడినదే. ఒకప్పుడు లేనిది ఏదైన తర్వాత ఉంటే అది సృష్టించబడినదని అర్థము. ఒకప్పుడులేని పాత్రను ఒక
మనిషి తయారు చేయుట అందరికి తెలిసిన విషయమే. లేని పాత్రను తయారు చేసి పెట్టినవానిని సృష్టికర్తని అంటున్నాము.
మొదట లేనిదానిని దేనినైన నిర్మించిన లేక తయారుచేసినవానిని సృష్టికర్త అనుసూత్రము ప్రకారము, మొదటలేని ఈ
విశ్వమునంతటిని తయారు చేసిన వానిని సృష్టికర్త అని అంటున్నాము. ఇపుడు సృష్టికర్తలు రెండు విధములుగా
ఉన్నారని కూడ చెప్పుకోవచ్చును. అదెలా అనగా! ముందు ఏమీలేనప్పుడు ఎవరికీ తెలియని విధానముతో
పంచభూతములైన ప్రపంచమును, జీవశక్తితో కూడుకొన్న శరీరముల జగతిని, ప్రపంచమును జగతిని కలిగిన మొత్తము
విశ్వమును తయారు చేయడము ఒక విధముగ ఉన్నది. ముందే తయారైన పంచభూతములనుండి ప్రత్యేకమైన
యంత్రమునో, వస్తువునో, పదార్థమునో తయారు చేయడము మరొక విధానముగ ఉన్నది. రెండు విధానములలో,
ఏమి లేనపుడు ఏ ఆధారము, ఏ సూత్రము లేకుండ తయారుచేసిన సృష్టికర్త ఒకడుకాగా, అన్ని ఉన్నపుడు వాటినుండి
వాటి ఆధారముతో ఒక సూత్రముననుసరించి తయారు చేసిన సృష్టికర్త రెండవవాడు. ఏ ఆధారము ఏ సూత్రము
లేకుండ జీవరూప ప్రపంచమునే తయారు చేసినవాడు ఎవడో వాని పేరేమిటో మనకు తెలియదనే చెప్పాలి. పదార్థముల
ఆధారముతో సూత్రము ప్రకారము జీవరహిత యంత్రమును తయారు చేసినవాడు మనిషియని అందరు చెప్పగలరు.
ప్రపంచములో ఒక యంత్రమును చేసిన వానిని వెదికి పట్టుకోవచ్చును, వానిపేరు పలానా అని చెప్పవచ్చును. కానీ
02

Page 4
జగత్తు, ప్రపంచము మిళితముగనున్న విశ్వమును తయారు చేసినవానిని వెదకి ఎవరు పట్టుకోలేరు, వాని పేరు
పలానా అని ఎవరు చెప్పనూ లేరు. విశ్వమును సృష్టించిన వానిని తెలుసుకోవాలంటే ఎంత కాలము వెదకినా వాడు
తెలిసేవాడు కాదు. కావున ఆ సృష్టికర్త ఎప్పటికీ వెతుకబడేవాడని, లేక ఎంతకాలమైన దేవులాడబడేవాడని బిరుదుగ
అతనిని “దేవుడు” అన్నారు. దేవుడంటే ఎవరికీ తెలిసేవాడుకాదని అర్థము. అందువలన ఆయనను ఎవరు ఇంతవరకు
చూడలేదనుమాట సత్యము. దేవుడనునది పేరుకాదని ఆయనకున్న బిరుదని జ్ఞప్తికియుంచుకోవలెను. అలాగే
తయారుచేశాడు కాబట్టి సృష్టికర్త అంటున్నాము కానీ అదియు పేరుకాదు. దేవునికి పేరులేదు, అలాగే రూపములేదు.
మనిషికి మాత్రము పేరూ ఉన్నది, రూపమూ ఉన్నది. ఒక యంత్రమును చేసిన సృష్టికర్త మనిషికాగా, మనిషినీ,
ప్రపంచమునూ తయారు చేసిన సృష్టికర్త దేవుడు.
మనిషి చేసినది ఏదైన మరొక మనిషికి అర్థము అవుతుంది. కానీ దేవుడు చేసిన పంచభూతములలో ఏదీ
ఇంతవరకు మనిషికి అర్థము కాలేదు. ఆకాశములో గ్రహాలెన్నో, నక్షత్రములెన్నో కూడ నేటికీ తెలియదు. అట్లే మిగత
గాలి, అగ్ని, నీరు, భూమి యొక్క బలమెంతో కూడా తెలియదు. అంతేకాక మనిషి శరీర నిర్మాణములోని కొన్ని
ఆంతర్యములు ఇంతవరకు ఎవరికీ అర్థముకాలేదు. కొన్ని రోగాలకు మందులే తెలియవు. కొన్ని రోగాలు
ఎందుకొస్తున్నాయో కూడ తెలియదు. ఈ విధముగ దేవుడు చేసిన విశ్వమును గూర్చి పూర్తి తెలియని స్థితిలో
మానవుడున్నాడు. దేవుడు చేసిన విశ్వమే అర్థముకానపుడు దేవుడు ఎవరికి తెలియగలడు? అందువలన ఆయన
ఎవరికీ తెలియనివాడని అర్థమొచ్చునట్లు దేవుడన్నాము.
దేవుని ఆజ్ఞతో మనుషుల చావుపుట్టుకలను
దుస్సాధ్యమైన మాయను తెలియాలంటే దేవుని
దేవుని విషయము ఏ కొంతకూడ మానవునికి తెలియదు, కావున దేవుడే స్వయాన తన అడ్రస్ను మనిషికి
తెలియజేయాలనుకొన్నాడు. ఆకారము పేరులేని దేవుడు మనిషితో మాట్లాడి చెప్పవలసి వచ్చినపుడు మనిషి ఆకారములోనే
వచ్చి మనిషి భాషలోనే చెప్పవలసివచ్చినది. అలా తన విషయమును చెప్పినపుడు తాను తయారు చేసి, తనతో
సమానమైన శక్తినిచ్చి, మనుషులలో మిళితము చేసియుంచిన కంటికి కనిపించని ఒకదానిని గురించి కూడ చెప్పెను.
దేవుని చేత సృష్టించబడి, మనుషుల తలలో గుణముల రూపములో ఇమిడియుండి, మానవలోకమును యంత్రమువలె
నడిపించు దానిని “మాయ” అని అనుచున్నాము. దేవుడు సృష్టించిన విశ్వములో జీవరాసుల శరీరములను చంపునది,
తిరిగి శరీరమును తయారుచేసి జీవులను పుట్టించునది మాయయే!
కల్గించు మాయను తెలుసుకొనుట దుస్సాధ్యమని దేవుడే చెప్పాడు.
జ్ఞానమున్న వారికే సాధ్యమగునని కూడ భగవద్గీతలో దేవుడే చెప్పాడు.
మనుషుల జీవితములను తన గుణములచేత ప్రవర్తింపజేయుచు,
చేయుచుండును. ఒకవేళ ఎవరికైన దేవుని మీద ధ్యాస ఏర్పడి దేవుని విషయమును తెలుసుకోవాలనుకుంటే, వానికి
మాయ తన యొక్క జ్ఞానమునే అందించి, అదియే దేవుని జ్ఞానమని నమ్మునట్లు చేయును. తలలోనే తిష్ఠవేసి గుణములచేత
మానవుని నడిపించు మాయ, తనను ఎవరు ఏమాత్రము గుర్తుపట్టనట్లుండి, మానవున్ని దేవుని మార్గములోనే
ప్రయాణించునట్లు నమ్మించి, దేవునికి దూరమగునట్లు చేయుచుండును. అటువంటి మనిషికి దేవుడే వచ్చి నీవు దేవుని
మార్గములో లేవు, మాయమార్గములో ఉన్నావని చెప్పినప్పటికీ, చెప్పేవాడే మాయ ప్రతినిధి అని అనుకొంటాడు తప్ప
మనిషి తన మార్గమును వదలడు. మనిషికి ఎంతో గొప్ప జ్ఞానమూ విచక్షణాశక్తీయుంటేగాని మాయను గుర్తించలేడు.
అందువలననే మాయను గుర్తించాలంటే ఎంతో జ్ఞానముండాలని ముందే చెప్పాము. జగత్తును సృష్టించిన దేవుడు
మాయ యొక్క ముఖ్యమైన పని ఏమనగా!
దైవము యొక్క ధ్యాస మానవునిలో లేకుండ
03

Page 5
జగత్తును నడిపించు విధానమును మాయకు ఒప్పజెప్పాడని ముందే అనుకొన్నాము కదా! మాయచేత నడుపబడు
మనిషి దేవుడొకడున్నాడను ధ్యాస మరచిపోయాడు. సృష్ఠించిన దేవుడు కనిపించడు, నడిపించు మాయ కనిపించదు.
అలాంటపుడు మనిషికి కనిపించునదంతా తనకు తానే చేసుకొనునట్లు తెలియుచున్నది. అందువలన అన్ని పనులు
నేనే చేస్తున్నానని, నేనే యోచిస్తున్నానని, అంతా నాబలమేనని, అంతా నాతెలివేనని, నేనే పుట్టాను, నా ఇష్టమొచ్చినట్లు
జీవిస్తున్నాను, నేనే చస్తున్నానని అనుకొనుచున్నాడు. అటువంటివాడు పూర్తి మాయవశములో ఉన్నాడని గుర్తుంచుకోవలెను.
మానవుడేమనుకొనినా సర్వసృష్టికీ, మానవునికీ, అందరికీ పెద్ద ఒక్క దేవుడే. దేవుని జ్ఞానమును మించిన
జ్ఞానముగానీ, దేవున్ని మించినదేదిగాని ఎక్కడా లేదు. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగములో 40వ శ్లోకములో
దేవుని యొక్క విశ్వరూపము చూచిన తర్వాత అర్జునుడు ఆశ్చర్యపోయి "ఓ దేవా నీవు అణువణువునా వ్యాపించి
యున్నావు. నీవులేని చోటుగానీ, నీవులేని వస్తువుగానీ లేదు. పైన, క్రింద, ప్రక్కలా నిండియున్నావు. అందువలన
నీకు పైకి మ్రొక్కుచున్నాను, క్రిందికి మ్రొక్కుచున్నాను, ప్రక్కలకు మ్రొక్కుచున్నాను” అన్నాడు. దీనినిబట్టి దేవుడు
సర్వవ్యాపి అని తెలియుచున్నది. అంతేకాక ఆయనను మించినది ఏదీలేదని తెలియుచున్నది. అంతగొప్ప దేవున్ని
మనము అర్థము చేసుకోవడానికి ఎందరో జ్ఞానమును తెలిసిన పెద్దలు ఎన్నో విధముల చెప్పారు. అయినప్పటికి
దేవుడు అంత సులభముగా అర్థమగువాడు కాదు, గనుక మనము ఆయనను ఇంకనూ విశధీకరించుకొని చెప్పుకోవలసిన
అవసరమున్నది. ఆ ప్రయత్నములో నేను చెప్పునదేమనగా!
=
దేవుని చేత సృష్ఠింపబడిన విశ్వమును ప్రపంచమని జగత్తని రెండు భాగాలుగా విభజించుకొన్నాము. ప్రపంచము
అనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. అలాగే జగత్తు అనగా ప్రాణమున్న సమస్త జీవరాసులని చెప్పుకోవచ్చును.
ఇపుడు ప్రపంచము + జగత్తు విశ్వమని సులభముగా చెప్పుకోవచ్చును. సృష్టికర్తయిన దేవుడు విశ్వమంతా
వ్యాపించియున్నాడు. విశ్వమంతా అణువణువునా వ్యాపించిన దేవుడు మూడు విధములుగా వ్యాపించియున్నాడని
చెప్పవచ్చును. ఎట్లనగా! ప్రపంచములో ఒక భాగముగ, జగత్తులో రెండు భాగములుగ వ్యాపించియున్నాడు. కొందరికి
ఈ మాట కొంత విచిత్రముగ కనిపించినప్పటికి ఇది పూర్తి సత్యము మరియు శాస్త్రబద్దము. ఇదే విషయమును ఇంకా
కొంత విశధీకరించుకొని చెప్పుకొంటే, సృష్టికి పూర్వము ఒక్కడే అయిన దేవుడు సృష్ఠి తర్వాత మూడు భాగములుగ
విభజింపబడినాడు. ఆ మూడు భాగముల పేర్లే 1) క్షర 2) అక్షర 3) పురుషోత్తములని గీతయందు పురుషోత్తమప్రాప్తి
యోగములో 16,17 శ్లోకములలో చెప్పబడినవి. ఒకే దేవున్ని ముగ్గురు పురుషులుగా గీతలో చెప్పారు. ఒకరు క్షర
పురుషుడని, రెండవవాడు అక్షరపురుషుడని, మూడవవాడు ముందు గల ఇద్దరి పురుషులకంటే ఉత్తముడని చెప్పుచు
పురుషోత్తముడన్నారు. పురుషోత్తముడన్నది బిరుదు తప్ప పేరుకాదని జ్ఞప్తికి పెట్టుకోవలెను. పురుషోత్తముడు
జగత్తుయందును, జగత్తు బయట ప్రపంచమందును వ్యాపించియున్నాడు. అనగా శరీరములోపల శరీరము బయట
దేవుడు వ్యాపించియున్నాడని అర్ధము. శరీరము బయటలేకుండ శరీరములోపల మాత్రము శరీరమంతా వ్యాపించినవాడు
అక్షరపురుషుడు. శరీరముబయటగానీ, శరీమంతాగానీ లేకుండా శరీరములో ఒక్కచోట రవ్వంత జాగాలో ఉన్నవాడు
క్షర పురుషుడు.
ఈ విధముగ విశ్వమంతనిండిన దైవము క్షరాక్షరములుగా శరీరములందు కూడా ఉన్నాడు. ఈ క్షర, అక్షర,
పురుషోత్తములనే అందరికి తెలిసే విధముగ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని కూడ గీతలోనే అన్నారు. ఇదంతయు
దైవజ్ఞానమును తెలిసిన మనిషికి, భగవద్గీతను అర్థము చేసుకొన్న మనిషికి, సంపూర్ణ జ్ఞాని అయిన వానికి తెలియును.
04

Page 6
భగవద్గీత తెలియని వానికిగానీ, దైవజ్ఞానము తెలియని మనిషికిగానీ మూడు ఆత్మలను గురించి ఏమాత్రము తెలియదు.
జ్ఞానములేని మనిషి దేవున్ని మరచి, తనను మాత్రమే జ్ఞప్తికుంచుకుని, నేనే అన్నీ చేయుచున్నాను అనుకొనుచుండునని
ముందే చెప్పుకొన్నాము. ఈ విధముగ మనుషులలో దేవుని జ్ఞానము తెలిసి దైవమార్గములో ఉన్నవారుగలరు. అట్లే
దైవజ్ఞానమును తెలియక మాయ ప్రభావమును కూడ తెలియక మాయమార్గములో చిక్కుకొన్నవారు కూడ గలరు.
దైవజ్ఞానము తెలిసిన వానికి మాయ విధానము కూడ తెలిసియుండును. అందువలన మాయలో చిక్కుకొనక జాగ్రత్తపడు
చుండును. దైవజ్ఞానము తెలియనివానికి మాయంటే ఏమిటో కూడ తెలియదు, కావున వాడు మాయ మార్గములో
వానికి తెలియకనే ఉండును.
జ్ఞానము తెలిసి దైవమార్గములో ఉన్నవాడు దేవున్ని గొప్పగ భావించుకొనియుండును. జ్ఞానము తెలియక
మాయమార్గములో ఉన్నవాడు దేవుడున్నాడనుమాట మరచి, మనిషికంటే మించిన దేవుడు లేడనుచుండును. జ్ఞాని
లెక్కలో దేవుని గుర్తింపు ఒక రకముగా ఉండగా, అజ్ఞాని లెక్కలో దేవుని గుర్తింపు మరొక విధముగా ఉండును.
ఇంకనూ వివరముగ చెప్పుకొంటే జ్ఞాని లెక్కలో దేవుని కోడ్ ఒక విధముగా ఉంటే, అజ్ఞాని లెక్కలో దేవుని కోడ్ ఇంకొక
విధముగా ఉండును. మనము బాగా అర్థము చేసుకొనుటకు కోడ్ రూపములో చెప్పుకోవలసి వచ్చినది. ముందు జ్ఞాని
లెక్కలో దేవుని కోడ్ ఎట్లుండునో తెలుసుకొందాము. అంకెలలో అన్నిటికంటే పెద్దది “ 9”, చిన్నది “ 0 ”. సున్నానుండి
పైకివస్తే అన్నిటికంటే పెద్దది తొమ్మిదే అగును. తొమ్మిదిని మించిన అంకెలేదు. ఆ విధముగనే సృష్ఠిలో అన్నిటికంటే
పెద్దది పరమాత్మ (దేవుడు). దేవుడు విశ్వములో మూడు అంచెలుగ విభజింపబడి మూడు ఆత్మలుగా ఉన్నాడు.
66
66
పరమాత్మను (దేవున్ని) విభజించితే మూడు అంచెలుగా ఉండాలి. జీవాత్మ ఎంతైతే ఉందో దానంత పెద్దదిగా
ఆత్మ ఉండాలి. జీవాత్మకంటే ఆత్మ ఎంత పెద్దదో అంతే పెద్దదిగా పరమాత్మ ఉన్నట్లు తెలియాలి. చివరికి పరమాత్మది
పెద్ద అంకె అయివుండాలి. దీనినిబట్టి పరమాత్మకంటే మూడంచెలు ఆత్మ చిన్నదనీ, ఆత్మకంటే మూడంచెలు జీవాత్మ
చిన్నదని తెలియాలి. ఈ లెక్క సూత్రబద్ధమైనది. ఎందుకనగా! జీవాత్మ ఆత్మతో కలిస్తే పరమాత్మలో కలిసిపోతుందను
సూత్రము భగవద్గీతలోనే గలదు. జీవాత్మ + ఆత్మ = పరమాత్మ అని అర్థము. అంటే మొదట పరమాత్మ బింబముగా
జీవాత్మ ఆత్మ విభజింపబడి ఉన్నాయని అర్ధము. పరమాత్మ బింబము 9 అయితే దాని ప్రతిబింబమైన ఆత్మ జీవాత్మ
రెండు తొమ్మిదే కావాలి. 1+2=3 అన్నట్లు 3+6=9 అని తేలిపోయింది. అందువలన ఏ జీవుడైన పరమాత్మగా
మారుటకు జీవాత్మ ఆత్మతో కలిస్తేనే సాధ్యమని బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీత చెప్పుచున్నది. జీవుడు మోక్షము
పొందు సమయములో శరీరములో జీవుడు ఆత్మతో కలిస్తే, ఆ ప్రత్యేకమైన ఆత్మ పరమాత్మలో కలిసిపోవునని ఎన్నో
సంవత్సరముల ముందే "జనన మరణ సిద్ధాంతము" అను గ్రంథములో కూడ చెప్పియున్నాము.
ఈ విధముగా సృష్ఠి తర్వాత పరమాత్మ 9 : 6 : 3 నిష్పత్తి సంఖ్యగా ఉన్నాడని చెప్పుచున్నాము. దేవుడు
మూడు ఆత్మలుగా ఉన్నాడా అని ఎవరికైనా అనుమానము కలిగితే భగవద్గీత 15 అధ్యాయములో 16, 17 శ్లోకములను
చూచి వారి సంశయమును తీర్చుకోవచ్చును.
05

Page 7
||
(15) 16:
విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ |
క్షర స్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ॥
(15) 17:
(జీవాత్మ, ఆత్మ)
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః |
యో లోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః ॥
(పరమాత్మ)
పరమాత్మ మూడు ఆత్మలుగా ఉన్నాడని తెలియుటకు, అందరికి జ్ఞాపకముండునట్లు పరమాత్మ గుర్తు 963 అని
చెప్పుచున్నాము. దీనినే అందరు గుర్తుంచుకొనునట్లు సృష్టికర్త కోడ్ 963 అని వ్రాశాము. దీనినే త్రైత సిద్ధాంతముగా
తెల్పుచున్నాము.
అంకెలలో పెద్ద అంకె 9 అని, అలాగే ఆత్మలలో పెద్ద ఆత్మ పరమాత్మ అని తెలియజేశాము. ఇప్పుడు
కొందరికొక అనుమానమొచ్చి సంఖ్యలలో అన్నిటికంటే పెద్దసంఖ్య కోటి కదా! మీరేమో కేవలము తొమ్మిదే అంటున్నారే
అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! బ్రహ్మవిద్యాశాస్త్రానుసారము ఆధ్యాత్మికములో ఏక సంఖ్యనే
లెక్కించుకోవాలి, ద్విసంఖ్యను వేసుకోకూడదు. ఎందుకనగా ఇది దైవమార్గము, ఇందులో ఏకసంఖ్యకే విలువ. దేవుడు
ఒక్కడే అను సూత్రము ప్రకారము ఎక్కడైన దేవుని జ్ఞానములో ఒక్క అంకెనే తీసుకోవాలి. ఇక్కడ మరొక్క సంశయము
మీకు రావచ్చును. "ఇంతవరకు దేవుని గుర్తు 963 అని మూడు సంఖ్యలను మాకు చెప్పారు కదా! ఇపుడేమో
ఏకసంఖ్యకే విలువ అంటున్నారే” అని అడుగవచ్చును దానికి సమాధానమేమనగా! నేను అక్కడ కూడ కలిపి చెప్పలేదు.
మూడు ఆత్మల నిష్పత్తి విడివిడిగానే ఉన్నది. ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క అంకెను సూచించాము అని గుర్తుంచుకోవలెను.
పెద్ద ఆత్మకు “ 9 ” గుర్తు కాగా, మధ్య ఆత్మకు " 6 " గుర్తుకాగా, చిన్న ఆత్మ అయిన జీవాత్మకు " 3 " గుర్తుగా ఉన్నదని
తెలిపాము.
66
"
సృష్టికంతటికి పెద్ద అయిన పరమాత్మను (దేవున్ని) ఎవరు తగ్గించలేరు హెచ్చించలేరు. దేవున్ని విడగొట్టి
చెప్పుకొనినా హెచ్చించి చెప్పుకొనినా ఆయనకు ఏ లోటురాదు, ఆయన విలువ ఏమాత్రము తగ్గిపోదు. అలాగే దేవున్నీ,
పెద్ద అంకెగా భావించిన తొమ్మిదినీ కూడ విడదీసినా, హెచ్చించినా తన ఏక స్థానము విలువ మారదనియే చెప్పుకోవచ్చును.
అదెలా అని కొందరడుగవచ్చును. దాని అనుమానము తీరునట్లు తొమ్మిది అంకెను భాగాలు చేసి చూద్దాము 1, 5,
3, గా తొమ్మిదిని విడదీయగా మూడు అంకెలుగా కనిపిస్తూ ఉన్నది. ఆధ్యాత్మికవిద్యరీత్యా ఏక స్థానమునకే విలువ
కావున మూడు అంకెలను కలిపితే 1+5+3=9 అగును. ఇక్కడ ఏ అంకె అయిన విడదీసినది కలిపితే తిరిగి అదే
అంకెవచ్చును కదా అందులో ప్రత్యేకించి తొమ్మిదినే చెప్పుకోవడమేమిటి అని కూడ కొందరడుగవచ్చును. దానికి మా
సమాధానము ఏమనగా! విడదీసిన ఏ అంకె అయిన తిరిగి కలిపితే అదే అగును, అది వాస్తవమే. కానీ నేను చెప్పినది
ఒక్క విడదీయడమే కాదు, ఒక అంకెను విడదీసినా, హెచ్చించినా దాని ఏక స్థానమును కోల్పోదు అని చెప్పాను.
అదియే తొమ్మిది అని చెప్పాను. తొమ్మిది తప్ప ఏ అంకె అయిన హెచ్చించితే తన ఏక స్థానమును కోల్పోవును.
ఉదాహరణకు ఏడును రెండింతలుగా హెచ్చించి చూస్తాము 7x2=14 ఇక్కడ పదునాలుగైనది. దానిని ఏక సంఖ్య చేసి
చూస్తాము 1+4=5 కలిపి చూస్తే చివరకు ఐదయినది. మొదట ఏడు హెచ్చింపబడి చివరకు ఐదుగా మారిపోయినది
06

Page 8
కదా! ఇలా తొమ్మిది తప్ప మిగతా అంకెలను విభజించినా హెచ్చించినా వాటి ఏక సంఖ్య విలువ మారిపోవును.
ఇప్పుడు ఉదాహరణగా తొమ్మిదినే చూస్తాము.
విభజన
హెచ్చింపు
1+8=9
9x1= 9 - 0+9=9
2+7=9
9x2=18
-
1+8=9
3+6=9
9x3=27 - 2+7=9
4+5=9
9x4=36 - 3+6=9
5+4=9
9x5=45
-
4+5=9
6+3=9
9x6=54
-
5+4=9
7+2=9
9x7=63 - 6+3=9
8+1=9
9x8=72 - 7+2=9
9x9=81
-
8+1=9
విశ్వములో దేవుడు ఏ విధముగా ఎవరు పొగిడినా, ఎవరుతిట్టినా ఒకే విలువ కలిగియున్నాడో, అదే విధముగా
దేవునిగా పోల్చిన తొమ్మిది కూడా ఎవరు హెచ్చించినా, ఎవరు విభజించినా ఒకే విలువ కలిగియున్నది.
ఇక ఆరుగా గుర్తించబడిన ఆత్మ విషయానికి వస్తే చాలామంది మాటలలో ఆత్మ అనుమాట అక్కడక్కడ వినిపిస్తూనే
ఉంటుంది. ప్రతి స్వామి, ప్రతి బోధకుల మాటలలో ఆత్మ అనుమాట పలుకబడుచుండును. ఆత్మహత్య అనీ, ఆత్మ
విశ్వాసమనీ, ఆత్మ ధైర్యమనీ, ఆత్మబలమని, ఆత్మాభిమానమనీ, ఆత్మ ఔన్నత్యమనీ, ఆత్మజ్ఞానమనీ ఎన్నో సందర్భములలో
ఆత్మను ఉచ్ఛరించుచునే ఉందురు. కొందరైతే మేము ఆత్మజ్ఞానులమని ప్రకటించుకొన్న వారుకూడా కలరు. ఎవరు
ఎన్ని విధముల ఆత్మను అనుకొనినా, ఇంతవరకు జగతిలో ఆత్మయొక్క నిజస్వరూపము ఎవరికీ తెలియదనే చెప్పవచ్చును.
ఏకంగా ఆత్మజ్ఞానులున్న ఈ కాలములో మీరేమిటి ఆత్మ ఏమిటో ఎవరికీ తెలియదంటున్నారు అని కొందరు
అడుగవచ్చును? దానికి మా జవాబు ఏమనగా! ఇంతవరకు దేశములో త్రైత సిద్ధాంతము లేదు. అంటే మూడు ఆత్మల
వివరము లేదు. అద్వైతము, ద్వైతము ఉన్నది. కావున ఆత్మ అని ఎవరైనా అనినా దానిని జీవాత్మగానే భావించి
చెప్పుకొనుచున్నారు, కానీ ప్రత్యేకమైన ఆత్మగా ఎవరు చెప్పుకోలేదు. ప్రత్యేకమైన ఆత్మ మాకు తెలుసునంటే త్రైతము
వారికి తెలిసియుండాలి. త్రైతము ఇంతవరకు ఎవరికీ తెలియదు కావున ఇంతకుముందు ఆత్మ అను మాటను ఎవరు
ఎట్లు చెప్పుకొనినా ఆత్మయొక్క నిజస్వరూపమేమిటో ఎవరికి తెలియదనే చెప్పవచ్చును. ఆత్మను గురించి మేము చెప్పు
కొద్దిపాటి వివరమేమంటే ఆత్మ అటు పరమాత్మకు ఇటు జీవాత్మకు మధ్యవర్తిలాంటిది. మధ్యవర్తి అయిన ఆత్మను
చేరనిదే ఏ జీవాత్మ పరమాత్మను చేరలేదు. అంకెల ప్రకారము జీవుడు మూడు అయితే దేవుడు తొమ్మిది అయితే
మధ్యలో ఆత్మ ఆరే అగును కదా! అందువలన ఆత్మను ఆరుగానే లెక్కించుకోవలసివచ్చినది.
07

Page 9
ఇక జీవాత్మను మూడుగానే ఎందుకు లెక్కించుకోవలసివచ్చినదంటే! పరమాత్మనుండి మూడవవాడు జీవాత్మ.
పరమాత్మ సంఖ్య అయిన తొమ్మిది నుండి సమానమైన మూడంచెలను గుర్తిస్తే, రెండవది ఆత్మ ఆరైనపుడు మూడవ
జీవాత్మ మూడే అగును. ఇది పైనున్న పరమాత్మ అంకెనుండి గుర్తిస్తే వచ్చునది. అలాకాకుండా మొదట జీవున్ని
మూడుగా గుర్తించిన తర్వాతే మూడవదైన పరమాత్మను తొమ్మిదిగా గుర్తించవచ్చును కదా అని కూడ కొందరడుగవచ్చును.
ఆ విధముగా క్రిందనున్న జీవాత్మనే మొదట మూడుగా గుర్తించుటకు కూడా కారణము గలదని చెప్పవచ్చును. అదేమనగా!
మనిషి పుట్టినప్పటినుండి వానిలోని జీవుడు మూడుగుణముల మధ్యలోనే చిక్కుకొని నివాసము చేయుచుండును. శరీములో
జీవుని నివాసము చాలామందికి తెలియదు. ప్రతి జీవరాశి తలలోని బ్రహ్మ, కాల, కర్మ, గుణ అను నాల్గుచక్రములలో
చివరిది, క్రిందిది అయిన గుణచక్రములో జీవుడు నివాసముంటున్నాడు. గుణభాగములు సాత్త్విక, రాజస, తామసములని
చాలామందికి తెలుసు. ఈ మూడు గుణ భాగములలో పుట్టింది మొదలు చచ్చేవరకు జీవుడున్నాడు కావున జీవాత్మను
మూడు అని గుర్తించవచ్చును. గీతలో కూడ త్రిగుణ సహితుడు జీవుడని చాలామార్లు చెప్పారు. మూడు గుణములలో
జీవుడు ఇమిడియున్నాడు, కావున అతనిని మూడుగానే గుర్తించి అక్కడినుండి ఆరవవాడు ఆత్మయనీ, తొమ్మిదవవాడు
పరమాత్మయని కూడ చెప్పవచ్చును. అక్కడ పరమాత్మను తొమ్మిదిగా గుర్తించుటకు విశేషత ఎట్లున్నదో అదే విధముగ
ఇక్కడ జీవాత్మను గుర్తించుటకు కూడ మూడు గుణముల విశేషత కలదు.
సృష్ఠికి పూర్వము ఒక్కటిగాయున్న దేవుడు, సృష్ఠిలో మూడు భాగములుగా విభజింపబడి పరమాత్మ, ఆత్మ,
జీవాత్మగ ఉన్నాడు. అందువలన దేవున్ని త్రైతము అన్నాము. దేవున్ని సిద్ధాంతరీత్యా తెలుపు జ్ఞానమును త్రైత సిద్ధాంతము
అన్నాము. ఇదంతయు జ్ఞానము తెలిసినవాడు దేవుని వివరమును గుర్తించగలడు. అటువంటివాడు సృష్ఠికర్త కోడ్
963 గ తెలియగలడు. ఇంతవరకు దేవుని గుర్తును తెలుసుకొన్న ప్రకారము దేవునితో సమాన బలమై మనిషి తలలో
తిష్ఠవేసియున్న మాయను గురించి, దానికిగల గుర్తింపు సంఖ్యను గురించి తెలుసుకొందాము. మాయలో ఇమిడిపోయి,
దాని మార్గములో ప్రవర్తించుచు, దేవుని జ్ఞానమును తెలియనివాడు దేవుడున్నాడనిగానీ, ఆత్మ ఒకటున్నదనిగానీ
తెలియడు. వానికి తెలిసినదంతా తానే అన్నీ చేసుకొనుచున్నాననుకొనుచుండును. తాను అనుకొన్నట్లు చేయుచున్నాననీ,
నేనే ధనమును సంపాదించుకొన్నాననీ, నా తెలివితో నాకు గొప్ప ఉద్యోగము వచ్చినదనీ, నేను చెప్పితేనే కొన్ని పనులు
జరుగుననీ, నేను బలవంతుడుననీ, నేను భోగములను నాయుక్తితో అనుభవిస్తున్నానని, నేను చేస్తేనే జరుగుచున్నది
దేవుడు చేసేది ఏమీలేదనీ, అటువంటపుడు దేవుడు ఉన్నాడనుట అసత్యమని. మనిషే దేవుడని, నాకు నేనే దేవుడననీ,
నన్ను మించిన దేవుడు లేడని అనుకొనుచుండును. అటువంటివానికి అందరనుకొను దేవుడే కనిపించనపుడు, ఎవరికీ
తెలియని ఆత్మ తెలియునా! వానికి తాను (జీవాత్మ, (శరీరము) తప్ప పరమాత్మ, ఆత్మ తెలియదు. అటువంటి వానిని
జ్ఞానమున్న వాడు చూచినపుడు, తనకున్న జ్ఞానముతో తనలోనున్న దేవున్ని (ఆత్మలను) 963గ గుర్తించినవాడు,
అజ్ఞాని శరీరములోని జీవుడు నేనే దేవున్ని అనుకొను భావమున్నపుడు వాడు మాయ ప్రభావములో నిండియున్నాడని
తెలిసి, మాయ ప్రభావములో మునిగియున్నవాని శరీరములో దేవుడు ఏ లెక్కలో ఉన్నాడో, ఏ సంఖ్యలో ఉన్నాడో
తెలియును. అజ్ఞాని, దేవుడు నేను సమానమే అను లెక్కలో ఉన్నాడు. కనుక వాని లెక్కప్రకారము దేవుడు, వాడు
(జీవుడు) సమానమే. అటువంటపుడు జ్ఞానికి తెలియునదేమనగా! మాయ వానిని కప్పియున్నది, కావున వానిలో
మాయయే కనిపిస్తున్నది. అటువంటి మాయ కప్పియున్నవానిలో కూడ దేవుడున్నాడు. వానిలో ఏ నిష్పత్తిలో ఉన్నాడని
చూచినపుడు గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన సూత్రము ఒకటి గలదు. అదేమనగా! దేవుడున్నాడను దైవజ్ఞాని
శరీరములో దేవున్ని గుర్తించ వలసినపుడు పైన దైవము నుండి లెక్కించవలసియున్నది. అనగా పరమాత్మ, ఆత్మ,
08

Page 10
జీవాత్మ అను వరుస క్రమములో లెక్కింతుము. దేవుడు లేడు నేనే దేవున్ని అనుకొను వాని శరీరములో మూడు
భాగములుగ ఉన్న దేవుని సంఖ్యను జీవాత్మనుండి ప్రారంభించి లెక్కించవలసియున్నది. అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ
అను వరుస క్రమముండును. దేవునివైపు నుండి ప్రారంభమవునది దేవుని గుర్తుగ చెప్పుదుము. అలాగే జీవునివైపు
నుండి ప్రారంభమగు సంఖ్యను మాయ గుర్తుగ చెప్పవలసియున్నది. దైవ మార్గములోయున్న జ్ఞాని దేవుని జ్ఞానమునే
చెప్పుచుండును. కావున వానిని దైవ ప్రతినిధిగా లెక్కించవలెను. అలాగే మాయమార్గములోనున్న అజ్ఞాని మాయ
మాటలనే మాట్లాడుచుండును. కావున వానిని మాయ ప్రతినిధిగా లెక్కించవలెను. జ్ఞాని దైవ స్వభావము కల్గినవాడనీ,
అజ్ఞాని మాయ స్వభావము కల్గినవాడనీ చెప్పవచ్చును. అందువలన ఒక మనిషిని చూచినపుడు వాడు జ్ఞాని అయితే
మనకు దేవుడు గుర్తురావలెను. ఒకవేళ అజ్ఞాని అయితే మాయ గుర్తురావలెను. ఈ విధముగా దేవుడుగాని, మాయగానీ
గుర్తువచ్చుటకు సులభమైన ఉపాయముగ జ్ఞానిని చూచినపుడు దేవుని కోడు, అజ్ఞానిని చూచినపుడు మాయకోడు
జ్ఞప్తికి చేసుకోవలెను. అప్పుడు మాయకు దేవునికి వ్యత్యాసము తెలియుచుండును. దానివలన ఎవరూ మాయవైపు
పోకుందురు. ముందు చెప్పిన సూత్రము ప్రకారము జ్ఞానిని చూచినపుడు అజ్ఞానిని చూచినపుడు మూడు ఆత్మలను
తేడాగా చెప్పుకొమ్మన్నాము కదా!
జ్ఞాని
పరమాత్మ,
ఆత్మ, జీవాత్మ
దేవుని కోడ్ వర్తిస్తుంది.
అజ్ఞాని
=
జీవాత్మ,
ఆత్మ, పరమాత్మ →
మాయ కోడ్ వర్తిస్తుంది.
దీనిప్రకారము జ్ఞాని దేవుని పక్షములో ఉన్నాడు. కావున దేవుని కోడ్ అయిన 963 ను గుర్తించుకోవచ్చును.
అలాగే అజ్ఞాని మాయ పక్షములో ఉన్నాడు, కావున మాయకోడ్ను ఏమని గుర్తించుకోవాలని కొందరడుగవచ్చును.
కొందరు పరమాత్మది 9, ఆత్మది 6, జీవాత్మ 3 అయినపుడు దానినే జీవాత్మది మొదటిదిగా, రెండవది ఆత్మగ, మూడవది
పరమాత్మగ పెట్టుకొని 369 అని వ్రాసుకొంటే మాయగుర్తు అగును కదా అని మాయకోడ్ 369 అనుకోవచ్చును.
దేవుని కోడ్ 963 అని మనము వివరముగ శాస్త్రబద్ధముగ చెప్పుకొన్నాము. కానీ జ్ఞానరీత్యా మాయకోడు 369
అనకూడదు. 369 గణితశాస్త్రమునకు సరిపోయినప్పటికి అన్నిటికంటే పెద్దశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సరిపోదు.
అటువంటపుడు దైవజ్ఞానమును అనుసరించి శాస్త్రబద్దముగ మాయకోడు చూడవలసి వచ్చినపుడు దేవుని శాస్త్రమైన,
మరియు బ్రహ్మవిద్యాశాస్త్రమైన, భగవద్గీతలోని 16వ అధ్యాయమున 14వ శ్లోకమును గమనిస్తాము.
అసౌ మయా హత శృత్రుః హనిష్యే చాపరా నపి |
16)శ్లో॥ 14 :
ఈశ్వరోఆహ మహం భోగీ సిద్ధే హం బలవాన్ సుఖీ ॥
ఈ శ్లోకములోని రెండవ వాక్యమును మూడు భాగములుగా విభజింపవచ్చును. ఒకటి ఈశ్వరోహమ్, రెండు
సిద్ధోహమ్, అహం బలవాన్, మూడు భోగీ, సుఖీ. దీని అర్థము “ఒకటి నేనే దేవున్ని, రెండు నేనే బలవంతుడను,
మూడు నేనే భోగములననుభవిస్తు సుఖమును పొందు చున్నాను” ఈ మాటలను మాయ ప్రభావములో ఉన్న మనిషి,
దైవజ్ఞానము తెలియని మనిషి అనుకొనుచుండును. నేను అని అనుకొనుచున్న జీవుడు శరీరములో నిజముగా మూడు
అర్హతలు కలిగియున్నాడా? జీవుడే దేవుడా? జీవునికే స్వయముగా బలమున్నదా? జీవుడు సుఖములను పొందు చున్నాడా?
అని యోచిస్తే వాస్తవము ఈ విధముగా ఉన్నది. ఈ మూడు మాటలలో ముందు రెండు మాటలు నేను దేవున్ని, నేను
బలవంతున్ని అనుట పూర్తి అసత్యము. చివరి మాటైన నేను భోగిని, సుఖిని అనుమాట మాత్రము సత్యము. ఇక్కడ
09

Page 11
జీవుడు అనుకొను రెండుమాటలు పూర్తి అసత్యమైనపుడు, జీవుడు అనుకొన్నట్లు అతను దేవుడుకాదు, బలవంతుడు
కాదని తెలియుచున్నది. దీనినిబట్టి మానవుని శరీరములో దేవుడువేరు జీవుడు వేరనీ, అలాగే బలవంతుడు వేరు,
జీవుడు వేరనీ తెలియుచున్నది. నేనే దేవున్ని, నేనే బలవంతుడను అనుమాటలు అసత్యమనుటకు ఎంతో శాస్త్రబద్ధమైన
ఆధారము గలదు. అదేమనగా!
మనకు తెలిసినా తెలియకుండినా మన శరీరములో మూడు ఆత్మలు గలవు. ఇది ఒక్క మానవుని శరీరములోనేకాక
సమస్త జీవరాసులు శరీరములలోను మూడు ఆత్మలు గలవు. వీటినే జ్ఞానము తెలిసిన వాని దృష్ఠిలో 963 గుర్తుగ
గుర్తించాము. వీనినే పరమాత్మయని, ఆత్మయని, జీవాత్మయని కూడ చెప్పుకొన్నాము. పరమాత్మ లోకత్రయమంతా
వ్యాపించియుండి, అన్నిటిని భరించువాడైయుండి, అందరికి ఈశ్వరుడు (అధిపతి)గయున్నాడని పురుషోత్తమ ప్రాప్తియోగము
17వ శ్లోకములో రెండవ వాక్యమునందు "యోలోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః" అనియుంది. పరమాత్మ
అందరికి దేవుడైయుండి, అందరి శరీరములలోపల బయట అణువణువున వ్యాపించియుండి, అందరిని భరిస్తున్నాడని
భగవంతుని చేత చెప్పబడినది. దీనినిబట్టి మన శరీరములోపల మరియు బయట ప్రతి అణువులోను దేవుడున్నాడని
తెలియుచున్నది. అది పరమాత్మ విధానముకాగా ఇక రెండవ ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. ఆత్మ శరీరములోపల
మాత్రమే గోరు, వెంట్రుకల చివర వరకు వ్యాపించియున్నది. శరీరము బయట ఏ కొద్దిమాత్రము కూడ ఆత్మలేదు.
అలాగే శరీరములో ఆత్మ వ్యాపించని జాగాకూడా లేదు. ఇక మూడవదైన జీవాత్మ విషయానికి వస్తే శరీరములోని తల
భాగములో, నొసలు (పాలభాగము)నకు సమానములో, తల మధ్యభాగములో కంటికి కనిపించని నాల్గుచక్రములైన
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములయందు, క్రిందనున్న గుణచక్రములో, ఆ గుణచక్రములోని మూడు భాగములలో
ఏదో ఒక భాగమున పిండిరవ్వలో ఒక కణమంత పరిమాణములో జీవుడు నివాసముంటున్నాడు. దీనిని బట్టి జీవాత్మ
శరీరములో ఒక్కచోట రవ్వంత జాగాలో మాత్రమున్నదనీ, తలలోని గుణచక్రములో తప్ప శరీరములో మరెక్కడలేదని
తెలియుచున్నది. ఇంతవరకు మూడు ఆత్మల నివాసము తెలుసుకొన్నాము కదా! అదే విధముగ మూడు ఆత్మల
కార్యములను కూడ తెలుసుకొందాము.
పరమాత్మ లేక దేవుడు అనబడేవాడు విశ్వమంతా అణువణువున వ్యాపించియున్నవాడై, అన్నిటికి అధిపతిగయుండి
తాను ఏ కార్యము చేయక మౌనముగా ఉన్నాడు. యజమాని తన సేవకుల చేతనే పని చేయిస్తు తాను చేయక
హోదాగా ఉన్నట్లు దేవుడు కూడా తాను తయారు చేసిన ఆత్మద్వారా అన్ని కార్యములను చేయిస్తూ జీవున్ని కేవలము
అనుభవములను పొందునట్లు నియమించాడు. శరీరములోపల శరీరము బయట వ్యాపించిన పరమాత్మ ఏ కార్యములను
చేయక స్తబ్ధతగా ఉన్నాడు. ఆత్మ శరీరములోని అన్ని కార్యములను చేయుచున్నది. శరీరములోపల జరిగెడు కార్యములేకాక
బయట కార్యములుగానీ, జీవునికి తెలియకుండానే శరీరములోపల జరుగు కార్యములుగానీ ఆత్మ ఎల్లవేళల చేయుచున్నది.
జీవుడు పుట్టింది మొదలు చనిపోవువరకు ఏకధాటిగా, ఏమాత్రము విశ్రాంతిలేకుండ పని చేయునది జగతిలో
ఆత్మయొకటేనని చెప్పవచ్చును. ఇక జీవాత్మ విషయానికి వస్తే, జీవాత్మ కూడ ఏమాత్రము పని చేయువాడు కాదు.
కానీ జీవాత్మ ఆత్మ చేసిన బయటి పనులలోని కష్టసుఖ అనుభవములను అనుభవిస్తూ యుండును. ఒక్క నిద్రావస్థలో
తప్ప మిగత జాగ్రత్త, స్వప్న అవస్థలలో జీవుడు బాధను సంతోషమును అనుభవిస్తూనేయుండును. ఇక్కడ కొందరికొక
అనుమానము వచ్చి ఈ విధముగ ప్రశ్నించవచ్చును. “జీవుడు దృశ్యములను చూస్తున్నాడు, శబ్దములను వింటున్నాడు.
ఆ సందర్భానికి తగిన పనిని చేస్తున్నాడు కదా! అలాంటపుడు జీవుడు ఏ పని చేయలేదనడమేమిటి?" అని
అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
10

Page 12
మన శరీరములో ఎల్లప్పుడు ఎన్నో పనులు జరుగుచున్నవి. అన్నిటిని ఆత్మ శరీరము ద్వారా చేయిస్తూయున్నది.
శరీరములో ఎన్నో అవయవములు గలవు. కొన్ని అవయవములు శరీరము లోపల, కొన్ని అవయవములు శరీరము
బయటగలవు. శరీరములోపల గల అవయవములుగానీ, శరీరము బయటగల అవయవములనుగానీ ఆత్మే స్వయాన
తనశక్తిచేత పనిచేయిస్తున్నది. ఆత్మ చేయిస్తుండగ అన్ని అవయవములు వాటివాటి పనులు చేయుచున్నవి. శరీరములోపలా
బయటా అనేక అవయవములు అన్ని వివిధరకములైన పనులను చేయుచున్నవి. శరీరము లోపల గుండె కదులుచు
రక్తమును ప్రవహింపచేయుచున్నది. అది గుండెయొక్క నిర్ధిష్టమైన పని. అదే విధముగ ఊపిరితిత్తులు కదులుచు
గాలిని ప్రవహింపచేయుచున్నవి. అది ఊపిరితిత్తులయొక్క నిర్ధిష్టమైన పని. ఏ అవయవము పనిచేసినా అది ఆత్మ
చైతన్యము చేతనే పని చేయుచున్నది. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ప్రతి అణువులోని ధాతువులను పని చేయిస్తు
శరీరావయములన్నిటికి శక్తినిచ్చుచున్నది. శరీరము ద్వారా బయట జరుగు కేవలము ఐదు జ్ఞానేంద్రియముల పనులు,
ఐదు కర్మేంద్రియముల పనులు జీవునికి తెలియుచున్నవి. అలాగే శరీరము లోపల మనస్సు, బుద్ధి, చిత్తము చేయుపనులు
కూడ తెలియుచున్నవి. జీవుడు శరీరబాహ్యేంద్రియముల పనిని తాను చేయకున్ననూ, అలాగే శరీరములోపల
అంతరేంద్రియములైన మనో, బుద్ధి, చిత్తముల పనిని తాను చేయకున్ననూ, అవి తనకు తెలిసి జరుగుచుండుట వలన
ఆ పనులను తానే చేసినట్లు, చేయుచున్నట్లు, చేయబోవునట్లు భ్రమిస్తున్నాడు. తన నిజస్వరూపము తెలియని జీవుడు,
తనకు ఏ శక్తీ లేదని తెలియని జీవుడు అవయవముల పనులనుగానీ, బుద్ధియోచనలనుగానీ, చిత్తము చేయు
నిర్ణయములనుగానీ తానే చేయునట్లు భ్రమలోపడ్డాడు. అటువంటి వానినే అజ్ఞానదశలోనున్న జీవుడు అంటాము.
వానినే “మాయ మనిషి" అంటాము.
శరీరములో ఒక్కచోట రవ్వంతగయున్నవాడు, కేవలము కష్ట సుఖములను అనుభవించువాడు, ఏ పని
చేయనివాడు, ఏ శక్తిలేనివాడు, కన్ను, చెవి బుద్ధికి పంపిన సమాచారమును ప్రక్కనుండి తెలుసుకొన్నవాడు,
అజ్ఞానములోయుండి మాయా ప్రభావముచేత అహమును పొంది తాను చేయని పనులను తానే చేసినట్లు జీవుడు
అనుకొనుచున్నాడు. ఆ విధముగ అనుకోవడము వలన జీవునికి తనకంటే పెద్దయిన ఆత్మ శరీరమంతానిండి
చైతన్యశక్తియైయున్నదని తెలియదు. తనకంటే పెద్దదైన ఆత్మ శరీరములో ప్రత్యక్షముగ శక్తియైయున్నప్పటికీ తెలియని
జీవుడు శరీరములోనే ఉలుకు పలుకు లేకుండ స్తబ్దతగయున్న పరమాత్మను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడనియే
చెప్పాలి. అందువలన కొన్నిచోట్ల కొందరు దేవుడులేడనీ, మానవుని అభూతకల్పనయే దేవుడనీ, అన్నీ తానే చేయుచు
దేవుని పేరు చెప్పడమేమిటనీ, ఏ యంత్రమునైన మానవుడే కనుగొన్నాడుగానీ దేవుడు తెచ్చి ఇవ్వలేదనీ,
దేవుడున్నాడనువారిది ఒకరకమైన జబ్బని అనుట చూస్తూనేయున్నాము. అటువంటివారితో ఎంత వాదించిన వారు
వినక పోవడమేకాక ప్రపంచములో మనిషికంటే మించిన దేవుడులేడని చెప్పుచుందురు. అటువంటివారిని మాయపక్షము
వారనీ, పూర్తి అజ్ఞానులని చెప్పవచ్చును.
దైవజ్ఞానము కల్గిన మనిషిలోగానీ, మాయలో మునిగియున్న మనిషిలోగానీ, ఎంతో గొప్ప జ్ఞానముగల
మహర్షిలోగానీ, ఏమాత్రము జ్ఞానములేని బేవర్షిలోగానీ దేవుడు మూడు ఆత్మలుగానేయున్నాడు. ఇంతకు ముందు
జ్ఞాని శరీరములో దేవున్ని 963గ గుర్తించవచ్చునని చెప్పుకొన్నాము. అజ్ఞాని శరీరములో దేవున్ని జీవునివైపునుండి
మాయను మాత్రమే లెక్కించవలెనని కూడ అనుకొన్నాము. అట్లు లెక్కించితే 369 అనుకోవడము కూడ పొరపాటని
అనుకొన్నాము. ఎందుకు మాయ సంఖ్య 369 కాదో, మాయకు జ్ఞానరీత్యా ఏ సంఖ్యను గుర్తించవచ్చునో వివరించుకొని
చూచితే ఈ విధముగ అర్థము కాగలదు.
11

Page 13
ఇపుడు భగవద్గీత 16వ అధ్యాయములోని 14వ శ్లోకముయొక్క రెండవ వాక్యమును చూస్తే మూడు భాగములుగ
ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. అందులో ఒకటి “ఈశ్వరోహమ్” అని ఉంది. దీని అర్థము "నేనే దేవుడను”
మాయమార్గములోనున్నవాడు నేనే దేవున్ని అనుకొనుచున్నప్పటికి వానిలో కూడ దేవుడు, ఆత్మ ఉన్నారు. ఇక్కడ జీవుని
భావములో నేను దేవుడంతటివాడననే భావమే కదా ఉండేది. అందువలన వాని భావము ప్రకారము వాని శరీరములో
దేవున్ని జీవున్ని సమానముగ లెక్కించవలసియున్నది. అపుడు దేవుని అంకెను ఆరుగ మార్చవలసియున్నది. జీవుని
అంకెను కూడ దేవుని అంకెతో సమానముగా ఆరుగానే మార్చవలెను. జ్ఞానము కల్గిన జ్ఞానివైపు నుండి చూచినపుడు
దేవుని అంకె తొమ్మిది, జీవుని అంకె మూడు. దేవుని అంకెను జీవుని అంకెను కలిపితే మొత్తము 9+3=12 వచ్చును.
ఇపుడు అజ్ఞానము కల్గిన మాయ మనిషివైపు నుండి చూస్తే దేవుని అంకె ఆరు జీవుని అంకె కూడ ఆరే. దేవుని
అంకెను జీవుని అంకెను కలిపితే మొత్తము 6+6=12 అగును. మధ్యలోని ఆత్మ ఎవరికీ తెలియకుండ ఉన్నది కావున
దాని అంకె చెడకుండ అలాగే ఆరుగానే ఉండును. కావున జ్ఞానివైపునుండి చూచినపుడు 963 ఉన్న దేవుని సంఖ్య
అజ్ఞానివైపునుండి చూచినపుడు మాయ సంఖ్యగ మారిపోయి 666 గ ఉన్నది. దీనినిబట్టి
దేవునిసంఖ్య 963 వీటిని ఏకసంఖ్యగ మార్చితే 9.6.3=18, 1.8=9
మాయసంఖ్య 666 వీటిని ఏకసంఖ్యగ మార్చితే 6.6.6=18, 1.8=9
జ్ఞానిలోనైన, అజ్ఞానిలోనైన దేవుడున్నాడనుటకు తార్కాణముగ చివరకు పరమాత్మ అంకె తొమ్మిదే వస్తున్నది.
అజ్ఞాని శరీరములో వాని భావమునుబట్టి జీవుడు దేవుడంతటివాడని తెలియునట్లు దేవుని అంకె ఆరు, జీవుని అంకె
ఆరుగ ఉన్నదని గ్రహించవలెను. భగవద్గీత 16వ అధ్యాయము 14వ శ్లోకములోని రెండవ వాక్యములో, రెండవ
భాగములో “అహమ్ బలవాన్" అని ఉన్నది. దీని అర్థము "శరీరములో బలమును నేనే" ఈ మాటను జీవుడు అనుకోవడము
తప్పా ఒప్పా అని పరిశీలించి చూస్తాము. శరీరములో ఒక వస్తువును ఎత్తడానికిగానీ, ఒక పనిని చేయడానికి గానీ
బలము అవసరము. కార్యమునకు కావలసిన బలమును సహజముగా ఆత్మ తన నాడీకేంద్రముల ద్వారా
శరీరమునకిచ్చుచున్నది. వివరముగ చెప్పుకొంటే ఆత్మ తనశక్తితో శరీరమును నడిపిస్తూ అన్ని కార్యములు చేయుచున్నది.
బలవంతుని శరీరములోనున్న ఎక్కువ బలముగానీ, బలహీనుని శరీరములో ఉన్న తక్కువ బలముగానీ వాని శరీరములోని
ఆత్మదేనని తెలియవలయును. శరీరములో ఆత్మ ఎవరికీ తెలియకుండ నివాసము చేయుచున్నది. అందువలన
జీవాత్మ తన శరీరములో కలుగు బలము తనదేననుకొనుచున్నాడు. దీనినిబట్టి శ్లోకములో జీవుడు బలము నాదేనని
అనుకొనుచుండునని భగవంతుడు తెలియజేశాడు. శ్లోకములోని వాక్యముయొక్క మొదటి భాగములో నేనే దేవుడనని
అనుకోవడము, అలాగే రెండవ భాగములో నేనే బలమునని అనుకోవడము జీవుని యొక్క పూర్తి అజ్ఞానము. వాస్తవానికి
జీవుడు దేహములో దేవుడు కాదు, శరీరములో బలముకాదు. శరీరములో రెండవ ఆత్మ యొక్క బలము నేనే అనుకోవడము
వలన జీవుడు ఆత్మతో సమానమైనవాడుగ భావింపబడుచున్నాడు. ఆ లెక్క ప్రకారము శరీరములో ఆత్మయొక్క అంకె
ఆరు కదా! అందువలన జీవుని అంకె కూడ ఆరుగానే లెక్కించవలసి వచ్చినది. జ్ఞానము ప్రకారము జీవుని అంకె
మూడే (3) అయినప్పటికీ, జీవుని అజ్ఞానపు భావము ప్రకారము జీవుని అంకెను ఆత్మతో సమానముగ ఆరుగ (6)
లెక్కించవలసి వచ్చినది. దీనిప్రకారము కూడ అజ్ఞానమువైపు నుండి చూస్తే మాయ సంఖ్య 666 అని మూడు
ఆత్మలను సమానముగ చెప్పవలసివచ్చినది.
12

Page 14
విశ్వములో ఎటు చూచిన దేవున్ని మించినది లేదు. దేవుడు సర్వవ్యాపి, సర్వసృష్టికర్త. అందువలన ఇటు
జ్ఞానిలోగానీ అటు అజ్ఞానిలోగానీ దేవుడున్నాడనుటకు ఏకసంఖ్య తొమ్మిదే రావలయునను సూత్రము ప్రకారము ఇటు
జ్ఞానిలోని దేవుని కోడ్ చివరకు తొమ్మిదే వుండును. అలాగే అజ్ఞానిలోని మాయకోడ్ చివరకు తొమ్మిదేవుండును.
మనిషి జ్ఞాని గానీ, అజ్ఞానిగానీ వానిలోని మూడు ఆత్మలు దేవునిలోని భాగములే. అందువలన దేవుని అంకె అయిన
చివరిది పెద్దదైన తొమ్మిది ఇటు దేవునికోడ్లోను ఉన్నది, అటు మాయకోడ్లోను ఉన్నది. జ్ఞానము ప్రకారము చూస్తే
దేవునికోడ్ ఆత్మకిరుప్రక్కలనున్న పరమాత్మ జీవాత్మ అంకెలు వాస్తవస్థితిలో 9,3 గా ఉన్నవి. అజ్ఞానము ప్రకారము
చూస్తే మాయకోడ్లో ఆత్మకిరుప్రక్కలనున్న పరమాత్మ జీవాత్మల అంకెలు అవాస్తవస్థితిలో 6,6 గా ఉన్నవి.
జ్ఞానము ప్రకారము దేవునికోడ్
అజ్ఞానము ప్రకారము మాయకోడ్
పరమాత్మ
-
ఆత్మ
జీవాత్మ
9
6
3
6
6
6
ఇప్పటికి మాయకోడ్ లేక సాతాన్కోడ్, లేక సైతాన్ కోడ్ 666 అని వివరము తెలిసియుండుననుకొంటాను.
దీనిని గమనిస్తే అజ్ఞాన భావమున్న వానిలోగానీ, జ్ఞాన భావమున్న వానిలోగానీ ఆత్మ సమానముగ పని చేయుచున్నది.
అందువలన ఎటుపోయిన ఆత్మ అంకె ఆరుగానే ఉన్నది. అంతేకాక దేవునికోడల జ్ఞాని శరీరములోగానీ, మాయకోడల
అజ్ఞాని శరీరములోగానీ, దేవుడు అణువణువున వ్యాపించియున్నాడనడానికి కొంత ఆధారము ప్రతి శరీరములోనూ
ఉన్నది. మనిషి శరీరమును విడదీసి చూస్తే ఎన్నో కోట్ల కణములతో కూడుకొన్నదై ఉన్నది. అంటే శరీరములోని
అణువణువున ధాతు కణములున్నవని తెలియుచున్నది. కంటికి కనిపించని కణములు మనిషి శరీరములో ఎన్ని కోట్లు
ఉన్నవో ఖచ్ఛితమైన సంఖ్య చెప్పలేమనియే చెప్పవచ్చును. అయినప్పటికి ఒక చిన్న ఆధారముతో మనిషికి తొమ్మిది
సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికి 108 కోట్ల కణములు అభివృద్ధియై ఉండవచ్చునను అంచనాగలదు.
ప్రాణముతోయున్న శరీరములోని ఒక కణమును తీసుకొని చూచిన అందులో ఒక విధముగ దైవము కనిపిస్తూయున్నది.
అదెలా అనగా! దేవుని సంఖ్యను మూడు ఆత్మల సంఖ్య 963 గ గుర్తించుకొన్నాము కదా! ఈ మూడు అంకెలను
కలిపితే 9+6+3=18 మొదట ద్విసంఖ్య 18 వచ్చుచున్నది. ఆ ద్విసంఖ్యను ఏకసంఖ్యగ చేస్తే 1+8=9 వస్తున్నది.
దీనిని బట్టి మూడు ఆత్మలు కలిసిపోతే చివరకు పరమాత్మగా మారిపోవునని అర్థమగుచున్నది. మొదట సృష్ట్యాదిలో
అద్వైతముగనున్న పరమాత్మ ద్వైతముగ మారిపోయినది. అంటే ఒకటిగ నున్న పరమాత్మనుండి ఆత్మ వెలువడి
రెండుగ మారిపోయినవి. అదే సంఖ్యరూపములో చెప్పుకొంటే తొమ్మిది విడిపోయి రెండుగ తయారైనది 9=1+8.
తర్వాత మూడు అంకెలుగ మారిపోయి 963 గ తయారైనది అదియే త్రైతము. మొదట అద్వైతము, ఆ తర్వాత
ద్వైతము, ఆ తర్వాత త్రైతము తయారైనది. జీవుడు మోక్షము పొందాలంటే త్రైతమునుండి ద్వైతముగ మారిపోవాలి,
తర్వాత అద్వైతముగ మారిపోవాలి. అందువలన మోక్షము పొందిన వానిని పెద్ద అంకె అయిన తొమ్మిదిగా చెప్పవచ్చును.
మోక్షము పొందు సమయములో జీవాత్మ ఆత్మలో కలిసి పోతుందనీ, జీవాత్మతో కలిసిన ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందని
మరణ సిద్ధాంతములో కూడ చెప్పుకొన్నాము.
13

Page 15
ఇదంతా చెప్పడము దేనికంటే శరీరములో అంతటా వ్యాపించి యున్నవి రెండే రెండు ఆత్మలు. అవియే ఒకటి
పరమాత్మ, రెండవది ఆత్మ. రెండు ఆత్మలు శరీరమంతా వ్యాపించియున్నాయనుటకు గుర్తుగ శరీరమంతా నిండియున్న
కోట్ల కణములలో 1:8 పరమాత్మ ఆత్మల నిష్పత్తి కనిపిస్తుయున్నది. వివరించుకొని చూచితే కణములోని బయటి
పొరలో ఒక (1) భాగము సోడియమ్ ఉండగా, కణములోపల ఎనిమిది (8) భాగములు పొటాషియమ్ కలదు. ప్రతి
కణములోను సోడియమ్ పొటాషియమ్ రూపములో ఆత్మ పరమాత్మల భాగములు కలవు. ఇది ఒక మానవుని
శరీరములోనేకాక ఆత్మలుగల సమస్త జీవరాసులలోను ఇదే సంఖ్య భాగములు (1:8) గానే ఉండును. దీనినిబట్టి
సమస్త జీవరాసులలోను దేవుడు సమానముగా ఉన్నాడని తెలియుచున్నది. అలాగే అజ్ఞానులలోను జ్ఞానులలోను
దేవుడు 1, 8 భాగములుగ విభజింపబడి తొమ్మిదిగానే ఉన్నాడని తెలియుచున్నది.
పరమాత్మను ఒక్కడినే చెప్పవలసి వచ్చినపుడు దేవుడు అన్నిటికంటే పెద్దవాడు కనుక అంకెలలో పెద్దదైన
తొమ్మిదినే చెప్పవలెను. జీవుడు శరీరమంతటాలేడు కావున పరమాత్మ ఆత్మలను ఇద్దరినే చెప్పునప్పుడు శరీరమంతా
వ్యాపించియున్న కణజాలములలోని రెండుగనున్న కణ భాగములను చెప్పుకోవలెను. ఒక్కచోటనున్న జీవాత్మను కూడ
కలిపి చెప్పవలసి వచ్చినపుడు మూడు అంచలుగనున్న ఆత్మల సంఖ్యను చెప్పవలెను.
పరమాత్మ
పరమాత్మ, ఆత్మ
9
= 9
=
9
18
= 9 = 9
=
=
963 18 = 9
పరమాత్మ, ఆత్మ, జీవాత్మ
విశ్వమంతా లేకుండ పోయినప్పటికి మిగులునది పరమాత్మే కావున 27--2+7=9
దేవుని అంకె మూడు ఆత్మలుగనున్ననూ, రెండు ఆత్మలుగనున్ననూ, చివరకు ఒక ఆత్మగ మారిపోయిననూ
దాని విలువ మారకుండనే ఉండును. దేవుడు మాయ సంఖ్యగ ఉన్నపుడు కూడా తన విలువ పెద్దదిగానే పెట్టుకొన్నట్లు
తెలియుచున్నది.
మాయ సంఖ్యగ ఉన్నపుడు 666 - 6+6+6=18 - 1+8=9
ఈ విధముగ దేవున్ని మానవ శరీరములోని ఆత్మలుగ లెక్కించినప్పటికైనా, లేక మాయగ లెక్కించినప్పటికైనా
తాను మాత్రము ఎప్పటికీ పెద్దనేనని అర్థమగునట్లు చేశాడు.
14

Page 16
ఇంతవరకు దేవుడు మూడు భాగములుగా విభజింపబడిన విషయమునూ, ఆ మూడు భాగములకు గణితశాస్త్రములో
గుర్తులుగాయున్న 3, 6, 9 అంకెలనూ గుర్తించుకొని తెలుసుకొన్నాము. తెలుసుకొన్నంత వరకు దేవుడు త్రైత సిద్ధాంత
రూపములోయున్నట్లూ, దానికి తగిన విధముగా గణితములో మూడు అంకెలున్నట్లు తెలిసినా, ఆ మూడు అంకెలు
తెలుగు భాషలో మొదట పుట్టినవనీ, తెలుగు భాష సృష్ట్యాదినుండి ఉన్నదనీ, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగాయున్న
భాషయనీ, చాలామందికి ఏమాత్రము తెలియదు. అందువలన తెలుగు భాషయందు మొదట దేవుని గుర్తులైన మూడు,
ఆరు, తొమ్మిది ఎలా పుట్టినదీ, ఆ మూడు గుర్తులు తెలుగు భాషలో ఏ విధముగా అర్థము నిచ్చుచున్నదీ, మరొక
కోణములో కొంత వివరముగా తెలుసుకొందాము.
భగవంతుడు తన భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని మూడు ఆత్మలుగా, మూడు (ముగ్గురు)
పురుషులుగా, మూడు విలువలుగా దేవున్ని విభజించి చెప్పియుండుట వలన, గణితశాస్త్రములో కూడా అంకెలను
బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము తయారు చేయవలసి వచ్చినది. మొదట భారతదేశమంతటా అన్ని ప్రాంతములలో
మొత్తము తెలుగు భాష అమలులో ఉండేది, అందరూ తెలుగులోనే మాట్లాడెడివారు. అందువలన గణితశాస్త్రములోని
అంకెలను కూడా దేవుని భావము చెడకుండా ఉండునట్లు, దేవుని జ్ఞానమునకు దగ్గరగా ఉండి, దేవుని భావమును
బయటికి తెలుపునట్లు, అంకెలను తెలుగు భాషలో తయారు చేయడము జరిగినది. ఆ విధముగా తయారు చేయడము
వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు చాలా దగ్గరగాయున్నదని చెప్పుటకు నేడు తెలుగు అంకెలు సాక్ష్యముగాయున్నవి.
దైవజ్ఞానమునకు తెలుగు భాష దగ్గరగా యున్నదని సాక్ష్యము నిచ్చునట్లు, తెలుగు అంకెలు ఎలా తయారైనవో ఇప్పుడు
కొంత గ్రహించుకొందాము.
దేవుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా మూడు విధములుగా విభజింప బడినాడని అందరికీ తెలియునట్లు,
మూడు గీతలుగాయున్న ఒక అంకెను మన పెద్దలు తయారు చేశారు. ప్రతి మనిషి శరీరములోనూ మూడు ఆత్మలు
సమానముగా యుండుట వలన, ప్రతి జీవునికీ ఆత్మ, పరమాత్మ రెండు సమానముగా ఉండుట వలన, మొదట
తయారు చేసిన అంకెను మూడు అని పేరు పెట్టడమే కాకుండా, అంకెను మూడు సమాన గీతలుగా ఉండునట్లు
తయారు చేశారు. మొదట తయారైన మూడు అంకె జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు ఏ విధముగా గుర్తుగాయున్నదో
క్రింది చిత్రపటములో చూచెదము.
పరమాత్మ
ఆత్మ
జీవాత్మ
3
15

Page 17
మూడు కొమ్ములు ఎడమ ప్రక్కగా గీయబడివున్నవి. మూడు కొమ్ములు లేక గీతలు ఒకే కొలతలో సమాన
దూరములో ఉండుట వలన, ఒక శరీరములో మూడు ఆత్మలు సమానముగా ఉన్నవని తెలియుచున్నది. మూడు
అంకెలో యున్న క్రింది గీత జీవాత్మగా గుర్తింపబడగా, మిగతా పై రెండు గీతలు మధ్యలోనిది ఆత్మగా, పైనగలది
పరమాత్మగా చెప్పబడుచున్నది. అంతేగాక మూడు అంకెను జీవాత్మకు గుర్తుగాయుంచబడి దానిపైన ఆత్మ, పరమాత్మ
అను రెండు ఆత్మలున్నట్లు చూపబడినది. జీవుడు ఎల్లప్పుడూ ప్రకృతివైపే ధ్యాస కల్గియుండును. ప్రకృతి ఆలోచనలలో
మునిగి యుండును. ప్రకృతి జనిత గుణముల మధ్యలో నివశించుచుండును కనుక, ఎడమవైపు అనగా జీవునికి
కుడివైపుగా ప్రకృతి గలదని ప్రకృతివైపే జీవుడుండుట వలన, జీవునికి కుడివైపు మాత్రము మూడు కొనలున్నట్లు మూడు
అంకెలో చూపడము జరిగినది.
ప్రపంచములో అన్నిటికంటే మొదట దైవజ్ఞానమును అనుసరించి జీవాత్మకు గుర్తుగా తెలుగుభాషలోనే మూడు
అంకెను తయారుచేశారు. తర్వాత ఏ భాషలో అంకెలు తయారు చేసినా, తెలుగు భాషలోని మూడు అంకెను
అనుసరించే తయారు చేసుకొన్నారు. అందువలన అన్ని భాషలకు ఆధారమైనది తెలుగు భాషయని చెప్పవచ్చును.
కొందరికి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చును. ఆ ప్రశ్న ప్రకారము మా మాట అసత్యమని అనుకొనుటకు వీలుకలదు.
అందువలన ఆ ప్రశ్ననూ, దానికి జవాబునూ మొదట తెలుసు కొందాము. ప్రశ్న ఏమనగా! ఈ మధ్యకాలములో కొన్ని
వేల సంవత్సరముల పూర్వము గణితశాస్త్రమునూ దాని అంకెలనూ కనుగొన్నారు. మీరు చెప్పునది సృష్టి ఆదిలోనే
మొదటి యుగమైన కృతయుగములోనే తెలుగు భాషయున్నట్లు, అప్పుడే జ్ఞానరీత్యా గణితశాస్త్ర అంకెలను తయారు
చేసినట్లు మీరు చెప్పుచున్నారు. మిగతా అన్ని దేశములలో కూడా పూర్వము అంకెలు లేవనీ, ఈ మధ్య కాలములోనే
గణితశాస్త్ర అంకెలను తయారు చేశారనీ చెప్పగా విన్నాము. అటువంటప్పుడు మీ మాటను మేము ఎలా నమ్మాలి?
అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు.
సృష్ట్యాదిలోనే దైవజ్ఞానము భూమిమీద తెలియబడినది. అలా తెలియబడిన జ్ఞానమును ప్రజలందరూ
తెలుసుకొనునట్లు చేయుటకు కొందరు తెలిసిన జ్ఞానులు, మాటల రూపములో జ్ఞానమును బోధించెడి వారు. జ్ఞానమును
బోధించుట వలన కొందరు తెలుసుకోగా, కొందరు బోధ వినుటకు అవకాశము లేనివారు, బోధించువారి వద్దకు
పోనివారు జ్ఞానమును తెలియుటకు అవకాశము లేక అజ్ఞానులుగా కొందరుండి పోయారు. దానిని గమనించిన
పెద్దలు దేశములోని వారందరూ జ్ఞానులుగా మారుటకు అవకాశము కల్పించవలెనను ఉద్దేశ్యముతోనే కొన్ని ముఖ్యమైన
జ్ఞాన విషయములను దృశ్యరూపముగా ఉండునట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రయత్నములో భాగముగా ప్రతి ఊరులోనూ
బయలు ప్రాంతములో ఒక ఈశ్వరలింగమును ఉంచెడివారు. ఈశ్వరలింగమును చూచి ముక్కు ముఖము ఆకారమును
లేని రాతిగుండును దేనికుంచారని ఎవరైనా అనుకుంటే, దానికి జవాబుగానున్న విషయమును శిలాఫలకము మీద
వ్రాసి అక్కడే కనిపించునట్లు పెద్దలు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా చదువు రానివారుంటే వారికి వివరమును
చెప్పుటకు ఒక బ్రాహ్మణున్ని అక్కడయుంచి బోధించునట్లు ఏర్పాటు చేసి పెట్టారు. అక్కడ బోధించుటకు యున్న
బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణునికి కావలసిన పోషణయంతయు ఆ గ్రామ ప్రజలే చూచుకొనునట్లు ఏర్పాటు చేసి
పెట్టెడివారు. ఆనాడు దృశ్య రూపముగాయున్న ఈశ్వర లింగమును గురించి చెప్పువానిని “యతి” అని అనెడివారు.
యతి అనగా 'యరసినవాడు' అని అర్థము. యరసిన వాడు అనగా 'తెలిసినవాడు' అని భావము. యరసిన అను
పదమునుండి యతి అను శబ్ధము పుట్టినది. యతి అనగా జ్ఞాని అని కూడా అర్థము కలదు.
16

Page 18
పూర్వము ఈశ్వరలింగమువద్ద నియమింపబడిన యతి లేక జ్ఞాని అనునతడు ఈశ్వరలింగమును గురించి
అక్కడకు వచ్చిన వారందరికీ బోధించెడివాడు. ఆనాడు ఈశ్వరలింగము తప్ప ఎటువంటి గుడులూ, గోపురములూ
తయారుకాలేదు, ఏమాత్రమూ లేవు. గుడులులేవు అందులో అర్చకులు, పూజారులు లేరు. మొదట ఈశ్వరలింగము
తప్ప దైవిక జ్ఞానము నకు సంబంధించినది ఏదీలేదు. లింగమువద్దయున్న యతి లింగమును గురించి చెప్పువాడు
మాత్రమేగానీ, పూజారి కాడు. ఆ దినములలో ఈశ్వర లింగమునకు పూజలు చేయలేదు. పూజలు చేయకూడదను
నియమము ఉండెడిది. అంతేకాక ఈశ్వర లింగమును ఎక్కడ ప్రతిష్ఠించినా అది బయలు ప్రాంతములోనే ఉండెడిది.
లింగమునకు గర్భగుడిని కట్టెడి వారు కాదు. గుడి కట్టడముగానీ, పూజలు చేయడముగానీ చేసెడివారు కాదు. అలా
చేస్తే దేవుని జ్ఞానమునకు అర్థమే లేకుండా పోవునని వారికి బాగా తెలుసును. ఈశ్వర లింగమువద్ద నియమింపబడిన
వ్యక్తి ప్రతి దినము లింగమును శుభ్రముగా కడిగి తుడిచి పెట్టెడివాడు. అంతేతప్ప పూజలు గానీ, అభిషేకములుగానీ
చేసెడివారు కాదు. కాలక్రమేపి లింగము వద్ద యుండు యతి (జ్ఞాని) పూజారిగా మారిపోయాడు. పూజారితోపాటు
పూజలు, అభిషేకములు ఈశ్వరలింగమునకు చేయడము జరుగుచున్నది. ఇంకా విచిత్రముగా పూర్వకాల ఆచరణకు
విరుద్ధముగా లింగమునకు గుడికట్టడమూ, గర్భగుడిలో లింగము ప్రక్కన పార్వతీదేవి ప్రతిమను పెట్టడమూ, లింగమునకు
విరుద్ధముగా బయట నందిని పెట్టడము జరిగినది. ఇదంతయు బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము అశాస్త్రీయము,
అధర్మము. అయినా ఎవరూ దానిని పట్టించుకోవడము లేదు. పూర్వము ఈశ్వర లింగమును ప్రతిష్ఠించిన
ఉద్దేశ్యముగానీ, జ్ఞానముగానీ, ఈనాడు ఏమాత్రము లేకుండాపోయినవి. మనము ఆచరించు కార్యములలోనూ మరియు
భావములోనూ ఎంతో మార్పు వచ్చినా లింగములో ఎటువంటి మార్పు రాలేదు. పూర్వము ఎలా తయారు చేసిన
ఆకారము అలాగేయున్నది. లింగము క్రింద పాణిమట్టము మారలేదు, లింగము మీద మూడు రేఖలు మారలేదు.
లింగమును దేవునికి గుర్తుగా పూర్వము ప్రతిష్ఠించి చూపడము జరిగినది. దేవునికి రూపములేదు, పేరులేదు,
కార్యములేదు అను జ్ఞానము మనకు తెలియు నిమిత్తము, ముక్కు ముఖము లేని గుండును దేవునిగా చూపడము
జరిగినది. ముఖము లేదు కావున దేవునికి రూపములేదని యతిగాయున్న వాడు ప్రజలకు తెలిపెడివాడు. అంతేకాక
లింగము కదలక మెదలకయుండుట వలన దేవునికి పనిలేదని తెలిపెడివాడు. దేవునికి పేరులేదు అని తెలియునట్లు
'ఈశ్వర' అని చెప్పడము జరిగినది. ఈశ్వర అనగా అధిపతియని అర్థముగానీ, అది ఒక పేరుకాదు. దానితో దేవుడు
అందరికీ అధిపతియను భావము తెలియుచున్నదిగానీ పేరు తెలియడము లేదు. అందరికీ సర్వసృష్టికీ అధిపతియైన
దేవుడు మూడు భాగములుగా విభజింపబడియున్నాడని తెలుపు నిమిత్తము లింగము మీద మూడు రేఖలను పూర్వపు
జ్ఞానులు పెట్టడము జరిగినది. మూడు తెల్లని విభూతిరేఖలను లింగము మీద చూపడము వలన, దేవుడు భూమిమీద
జీవాత్మ, ఆత్మ, పరమాత్మగాయున్నాడని, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16, 17వ శ్లోకములలో చెప్పిన
భావమునకు సరిపోవునట్లు తెలియుచున్నది. ఒక మనిషి శరీరములో దైవము జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా
విభజింపబడియున్నాడని తెలియునట్లు మూడు రేఖలను లింగము మీద పెట్టి చూపడము జరిగినది. ఆ విధముగా
లింగము మీద చూపబడిన మూడు ఆత్మల గుర్తే గణితశాస్త్రములో మూడు అంకెగా తయారైనది. మూడు అంకె ఎలా
తయారైనదో, దానిలో మూడు ఆత్మల గుర్తు ఎలావున్నదో, కొంత వివరముగా తెలుసుకొందాము. లింగము మీద
మూడు రేఖలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అలా ఉన్న రేఖలలో క్రిందిరేఖ జీవాత్మ గుర్తుయనీ, మధ్యరేఖ ఆత్మకు
17

Page 19
గుర్తనీ, పైన రేఖ పరమాత్మకు గుర్తనీ ఆనాడు లింగమువద్ద యతిగా (జ్ఞానిగా) యున్న వ్యక్తి తెలిపెడివాడు. మూడు
రేఖలు లింగము మీద ఎలా ఉన్నాయో క్రింది చిత్రపటములో చూచెదము.
పరమాత్మ
ఆత్మ
జీవాత్మ
ఈ మూడు రేఖలు మూడు ఆత్మలుగా మన శరీరములోనే ఉన్నవని తెలియుచున్నది. శరీరములో యున్న
మూడు ఆత్మలలో మధ్యలో యున్న ఆత్మ క్రింది జీవాత్మతోనూ, పైన పరమాత్మతోనూ సంబంధము పెట్టుకొనియున్నది.
ఆ సంబంధము మనుషులకు తెలియునట్లు మధ్యలో నున్న ఆత్మ రేఖను క్రింది జీవాత్మ రేఖకు అనుసంధానము
చేయడము జరిగినది. అలాగే మధ్యరేఖ నుండి పైనగల పరమాత్మ రేఖకు కూడా అనుసంధానము చేయడము జరిగినది.
ఎప్పుడైతే మధ్య రేఖనుండి క్రింది రేఖకు, పైరేఖకు అనుసంధానము చేశామో అప్పుడు మూడు అంకె ఆకృతి ఏర్పడుచున్నది.
మూడు అంకె ఎలా ఏర్పడినదో తెలియుటకు బాగా అర్థమగుటకు తర్వాత పేజీలో బొమ్మను చూడండి.
3
3
తెలుగు భాషలో దైవజ్ఞానమునకు పూర్తి దగ్గరగాయున్న మూడు అంకె మూడు ఆత్మలతోనే ఏర్పడినదని
తెలియుచున్నది. మూడు ఆత్మల జ్ఞానమే భగవద్గీతలో చెప్పబడిన విశేష జ్ఞానము. కావున మూడు ఆత్మల సంధానముతో
ఏర్పడిన మూడును గ్రహించగలిగితే, అదే జ్ఞానమును బోధించు మిగతా ఆరు, తొమ్మిది యొక్క విశిష్ఠత కూడా తెలియును.
శరీరములోని జీవాత్మకు గుర్తుగా మూడు అంకెను, మూడు రేఖలను కలిపి చేసినట్లు ఇప్పుడు మనకు బాగా అర్థమైనది.
అదే మూడు రేఖలను జీవాత్మకు కలిపినట్లే కలిపి ఆత్మను సూచించు ఆరుగానూ, పరమాత్మను సూచించు తొమ్మిదిగానూ
తయారు చేశారు. ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! ఇదంతయు ఒక్క తెలుగు భాషలోనే సాధ్యమైనది.
మూడు, ఆరు, తొమ్మిది అంకెలకు మూడు కొమ్ములు లేక మూడు గీతల కొనలు ఒక్క తెలుగు భాషలోని అంకెలకు
మాత్రమే కలవు. మిగతా భాషలలో ఒక్క మూడుకు తప్ప మిగతా అంకెలకు మూడు కొమ్ములు లేవు. తెలుగు
అంకెలనుబట్టి మిగత భాషలలోని అంకెలను తయారు చేసుకొన్నారు. కావున మిగతా భాషలలో కూడా మూడుకు
మాత్రము మూడు కొనలు కనిపిస్తున్నవి.
18

Page 20
ప్రస్తుతము అందరూ గణితశాస్త్రమును తెలిసియున్నా, అంకెలను మాత్రము అందరూ ఆంగ్లభాషలోని అంకెలనే
వ్రాయుచున్నారు. తెలుగు వారు కూడా తెలుగు అంకెలను వ్రాయకుండా ఇంగ్లీషు అక్షరములకే అలవాటుపడిపోయారు.
కొందరు తెలుగువారికి తెలుగు భాష అంకెలే తెలియకుండాపోయినవి. ఇంగ్లీషు భాషలోని అంకెలను ఏ దానికి ఎన్ని
కొమ్ములున్నవో ముందు గమనించితే తర్వాత తెలుగు అంకెల విశిష్ఠత బాగా అర్థమగును. అందువలన ముందు
ఈదినము మనము వ్రాయుచున్న ఇంగ్లీషు అంకెలను గమనిద్దాము. 0 1 2 3 4 5 6 7 8 9 ఈ పది అంకెలకు
కొమ్ములను గమనించితే ఇలా గలవు.
0
మొదటిది సున్న, సున్నాకు ఒక్కకొమ్ము కూడా
ఉండదు. శూణ్యమును తెలుపునది కావున, దీనికి
సున్న అని పేరు వచ్చినది.
1
|
2
సున్న తర్వాతవున్న అంకె ఒకటి. ఒకటికి పైన
ఒకకొన, క్రింద ఒకకొన మొత్తము రెండు కొనలు
లేక రెండు కొమ్ములు గలవు.
3
3
1
$22
3
2
ఒకటి తర్వాత రెండు అంకె గలదు. దీనికి కూడా
ముందర ఒకటి, వెనుక ఒకటి రెండు కొనలు
గలవు.
రెండు తర్వాత మూడు అంకె కలదు. మూడుకు
పది అంకెలలో, లేని మూడు కొనలు కలవు.
మూడు కొనలు లేక మూడు కొమ్ములు మూడు
ఆత్మలకు గుర్తుగా తయారైనవని ముందే చెప్పు
కొన్నాము. ఇది మూడులోని ప్రత్యేకత.
19

Page 21
2
1
4
4
5
6
1
1
మూడు తర్వాతయున్న నాల్గవ అంకెకు నాలుగు
కొనలు గలవు. నాలుగు కొనలు గలది ఏ అక్షరము
2 లేదు. ఒకటికి, రెండుకు రెండు కొనలుండగా,
మూడుకు మూడు, నాలుగుకు నాలుగు ఆంగ్ల
భాషలో గలవు. నాలుగు యోగమునకు గుర్తుగా
యున్నది.
నాలుగు తర్వాత ఐదు అంకెను గమనించితే దానికి
కూడా పైన వెనుకకు ఒక కొన, క్రింద ముందుకు
మరియొక కొన మొత్తము రెండు కొనలు గలవు.
ఐదు తర్వాత ఆరు అంకె గలదు. ఆరు అంకెకు
ఒక కొన మాత్రము గలదు. ఆంగ్లభాషలోని ఆరు
అంకె కూడా తెలుగు భాషలోని ఆరునుబట్టి
తయారు చేసుకొన్నదేనని గుర్తుంచుకోవలెను.
ఆంగ్లభాషలోని మొత్తము పది అంకెలలో ఆరుకు,
తొమ్మిదికి మాత్రము ఒకే కొనగలదు.
7
21
8
ఆరు తర్వాత ఏడు అంకెగలదు.
ఏడును
గమనించితే దీనికి కూడా రెండు కొనలు గలవు.
1,2,5 తర్వాత 7 అంకెకు రెండు కొనలుగలవు.
ఆంగ్లభాషలో రెండు కొనలు గలవి మొత్తము
నాలుగు అంకెలుగలవని తెలియుచున్నది.
ఎనిమిది అంకెకు సున్నవలె కొమ్ములు ఒకటి కూడా
లేవు. రెండు సున్నల ఆకారముతో ఎనిమిది
కనిపించుచుండును. సున్నాకు రెండు కొనలు
కలిసిపోయి ఒకకొన కూడా లేనట్లు, ఎనిమిదికి
కూడ రెండు సున్నాలు ఉండుట వలన కొమ్ములు
లేవు.
L
20
20

Page 22
1
9
ఇది
ఎనిమిది తర్వాత తొమ్మిది అంకెగలదు.
ఆరును పైకి త్రిప్పితే తొమ్మిదివలె కనిపించును.
ఆరు యొక్క కొమ్ము పైకియుంటే, తొమ్మిది యొక్క
కొమ్ము క్రిందికి యుండును. ఆంగ్లభాషలో ఒకే
ఒక కొమ్ముగలవి ఆరు, తొమ్మిది మాత్రము గలవు.
మూడు కొమ్ములుగల మూడువలెగానీ, ఒక
కొమ్ముగల ఆరు తొమ్మిదివలెగానీ ఇతర అంకెలు
లేవు. అందువలన 6, 9 ఇంగ్లీషు భాషలోయున్నా
తెలుగు భాష వాసనతో తయారైన అంకెలు కావున
అక్కడ కూడా తెలుగు భాషలోవలె ప్రత్యేకత 3,
6, 9 అంకెలలో కనిపించుచున్నది. తెలుగులో
ఈ మూడు అంకెలు ఎలాగలవో ఇప్పుడు
గమనిస్తాము.
ఈశ్వరలింగము మీదగల మూడు ఆత్మల గుర్తులైన మూడు విభూతి రేఖలను ఒకదానితో ఒకటి కలిపినప్పుడు
మూడు అంకె తయారైనదని చెప్పుకొన్నాము కదా! మూడు అంకెలో మనము చూస్తే ఎడమ ప్రక్కకు మూడు కొనలుండగా,
కుడిప్రక్కన మూడు కొనలు ఒకదానితో కలిసి పోయినట్లు రెండు అనుసంధానములు గలవు. ఎడమవైపుకు ప్రపంచ
సంబంధమని అట్లే కుడివైపుకు దైవ సంబంధమని చెప్పుచున్నాము. ప్రతి మనిషిలో కుడిప్రక్క ప్రకృతి సంబంధమూ,
ఎడమ ప్రక్క దైవ సంబంధమున్న దని భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగములో జీవుడు మోక్షము వైపుకు పోవాలంటే
కాల, కర్మచక్రములలో ఎడమ ప్రక్కకే పోవాలని చెప్పుకొన్నాము. అందువలన మూడు తయారయిన విధానములో
కూడ మూడు రేఖలు కుడిప్రక్కన తన కొనలను చూపుచూ అది ప్రపంచ సంబంధ జీవుని గుర్తుగా లెక్కించునట్లు
చేశాయి. ఇక్కడ ఎవరూ పొరపాటు పడకూడదని చెప్పడమేమంటే మనము చూచే దానికి ఎడమ ప్రక్క మూడు
కొమ్ములు కనిపించినా, మూడుకు మాత్రము కుడిప్రక్కన గలవని జ్ఞప్తికుంచుకోవలెను. ఒక మనిషిని (జీవున్ని) మూడుగా
లెక్కించితే అతని ధ్యాస అంతయూ ప్రపంచమువైపు ఉండుట వలన, జీవుని గుర్తుగాయున్న మూడు అంకె యొక్క
కొనలు కూడా మూడుకు కుడిప్రక్కనేయుండునట్లు చూపడమైనది. ఎదురుగా చూచు మనకు ఎడమవైపుగాయున్నట్లు
కనిపించినా మూడు రేఖల కొనలు దానికి కుడి ప్రక్కకేయున్నాయి.
మూడు రేఖల కొనలను దానికి ఎడమ ప్రక్కగా చూపితే అప్పుడు జీవుని ధ్యాస దైవ సంబంధముగాయున్నదని
భావము. అందువలన ప్రపంచ సంబంధ ధ్యాసలేని మనిషి ఆత్మ ధ్యాసలోయుండునని తెలుపుటకు మూడు యొక్క
కొనలను త్రిప్పి ఎడమవైపు చూపితే అప్పుడు జీవుని ధ్యాస దైవ సంబంధముగా యున్నదని తెలియును. అయితే ఇక్కడ
దైవ సంబంధము అనగా! జీవునికంటే పెద్దగాయున్న ఆత్మ మీదనా? లేక జీవునికంటే మరియు ఆత్మకంటే పెద్దయిన
పరమాత్మ మీదనా? అని ప్రశ్న రాగలదు. ఆ విషయము పూర్తిగా తెలియుటకు మన పెద్దలు ఆత్మకు ఒక గుర్తు,
పరమాత్మకు ఒక గుర్తును ఉంచారు. ఎలా అయితే జీవాత్మకు గుర్తుగా మూడు రేఖల కొనలను కుడివైపుకు చూపారో,
అలాగే ఆత్మకు గుర్తుగా రేఖలను ఎడమ వైపుకు చూపారు. ఎడమవైపుకు చూపడము వలన దైవ సంబంధము అని
21

Page 23
తెలిసినా, ఇది ఆత్మకు గుర్తుయన్నట్లు ఎడమవైపు చూపు మూడు రేఖల కొనలలో క్రింది కొనను పై రెండు కొనలకంటే
కొంత పొడవు చేసి ప్రత్యేకముగా చూపడము జరిగినది. అలా క్రింది కొన పొడవుగా ఉండుట వలన అది ఆత్మ గుర్తని
అందరికీ తెలిసిపోయినది. జీవునికి గణితశాస్త్రములో మూడు అంకె గుర్తుగాయుండగా, ఆత్మకు గుర్తుగా క్రింది కొన
పొడవుగా యుండు ఆకారమును చూపుచూ, దానికి ఆరు అని పేరు పెట్టడము జరిగినది. దీనితో ఆత్మకు గుర్తు
ఆరుయనీ, జీవునికి గుర్తు మూడుయనీ తెలిసిపోయినది. ఆత్మకు గుర్తయిన ఆరు ఆకారము ఎట్లున్నదో క్రింది చిత్రపటములో
చూస్తాము.
E
జీవాత్మ
ఆత్మకు గుర్తు
ఆరు.
6
జీవాత్మకు కుడిప్రక్కకు మూడుకొనలుండడమే కాక, మూడుకొనలు సమానముగా యున్నట్లు మనము మూడను
అంకెను చూచాము . ఆత్మకు గుర్తయిన ఆరు అంకెలో కూడా మూడు కొనలు మూడు ఆత్మలకు గుర్తుగా యున్నప్పటికీ,
మూడు కొనలు ఎడమ ప్రక్కకు ఉండడమూ, అందులో క్రింది కొన ప్రత్యేకముగా మిగతా రెండు కొనలకంటే పొడవుగా
ఉండడమును గమనించవచ్చును. ఈ విధముగా తెలుగుభాషలో ఆరును తయారు చేయడమైనది. క్రింది కొన జీవాత్మ
రేఖగా చెప్పుకొన్నాము. మూడు కొనలను ఎడమవైపు చూపడములో జీవునికి దైవ ధ్యాస కల్గినదని తెలియవచ్చును.
జీవుని రేఖను పొడవుగా ఉంచడము వలన జీవునికి ఆత్మ ధ్యాస కల్గినదని చెప్పవచ్చును. అందువలన ఎడమవైపు
క్రింద పొడవుగా యున్న రేఖను చూచి దానిని ఆత్మ గుర్తుగా చెప్పవచ్చును. ఆత్మ గుర్తు ఆరుయని కూడ తెలియవచ్చును.
జీవాత్మ గుర్తు మూడుయని, ఆత్మ గుర్తు ఆరుయని తెలియగా, పరమాత్మ గుర్తు ఏదని ప్రశ్న రాగలదు. అందువలన
దానికి జవాబుగా జీవాత్మ ఆత్మ పరమాత్మ గుర్తులనుండే పరమాత్మ గుర్తుగా తొమ్మిదిని తయారు చేశారు. పరమాత్మ
గుర్తయిన తొమ్మిది తయారయిన విధానమును గమనించితే, ఎడమవైపు కొనలను చూపుచూ, క్రిందికొన పొడవుగా
యుంచితే అది ఆత్మకు గుర్తనీ, దానినే ఆరుయనీ చెప్పుకొన్నాము కదా! ఇప్పుడు క్రిందివైపువున్న కొనను పొడవు
చేయకుండా మధ్య కొన ఉన్నట్లే కురుచగాయుంచి, పైనగల పరమాత్మ గుర్తుగాయున్న రేఖను పొడవుగా పెట్టడము
వలన, అది ప్రత్యేకమయిన గుర్తుగా తయారయి పోయినది. అట్లు తయారయిన గుర్తునే పరమాత్మ గుర్తనీ, అదే
తొమ్మిది అంకెగాయున్నదని మన పెద్దలు చెప్పడమైనది. తొమ్మిది యొక్క ఆకారమును ప్రక్కపేజీ చిత్రపటములో
ఎలాయున్నదో గమనిద్దాము.
22
22

Page 24
-పరమాత్మ
పరమాత్మకు గుర్తు
తొమ్మిది.
· ఆత్మ
9
జీవాత్మ
E
తెలుగు భాష దైవ జ్ఞానమునకు పూర్తి దగ్గరగా యున్నదని చెప్పుకొన్నాము. దానిప్రకారమే తెలుగు అంకెలను
కూడా తయారు చేయడ మైనది. మనము ఇప్పుడు ప్రత్యేకించి మూడు, ఆరు, తొమ్మిదిని గురించే చెప్పుకొంటున్నాము.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! కుడివైపు చూపినప్పుడు మూడు కొనలు సమానముగా
యుంచి దానినేమో జీవుని గుర్తని, అట్లే మూడుయని చెప్పారు. ఆరు విషయములో చెప్పినప్పుడు ఎడమవైపు కొనలను
చూపుచూ జీవుని కొనను పొడవు చేసి, ఇది ఆత్మకు గుర్తుయని దానినే ఆరుయని చెప్పారు. పరమాత్మ విషయములో
పై కొమ్మును (కొనను) పొడవు చేసి పరమాత్మ గుర్తుగా చెప్పారు. ఆత్మ విషయములో మధ్య రేఖను పొడవుగా
చూపించవచ్చును కదా! ఆత్మకు గుర్తుగాయున్న మధ్యరేఖను వదలి క్రింది జీవాత్మ రేఖను పొడవు చేసి ఆత్మ గుర్తు ఆరు
అని చెప్పారు అలా ఎందుకు చెప్పారు? మధ్య రేఖను పొడవుచేసి ఎందుకు చూపలేదు? అని అడుగవచ్చును. దానికి
మా సమాధానము ఇలా కలదు.
జగతిలో ప్రతి మనిషిలోనూ మూడు ఆత్మలున్నా చాలామందికి తెలిసినవి జీవుడు, దేవుడు అనబడు జీవాత్మ,
పరమాత్మ మాత్రమే. ఆత్మ అనునది మాటల సందర్భములలో పలుకబడినా అది మాత్రము ఎవరికీ తెలియదు.
అంతేకాక మనిషి పుట్టింది మొదలు చనిపోవువరకు అన్ని కార్యములను ఆత్మే చేయుచున్నది. ఇటు జీవుడైనవాడుగానీ,
దేవుడుగానీ ఏదీ చేయలేదు. ప్రపంచములోని అన్ని కార్యములను అందరిచేత చేయించునది ఆత్మే అయినా ఆత్మ
మాత్రము ఎవరికీ తెలియదు. ఆత్మ అత్యంత గుప్తమైనది. అన్ని పనులను ప్రత్యక్షముగా చేయుచున్నా, ఎవరికీ
తెలియకుండా విచిత్రముగా శరీరములోనే ఉండుట వలన, ఆత్మను చిత్రగుప్తుడు అని అంటున్నాము. ప్రపంచములో
అన్నిటికంటే రహస్యమైనది ఆత్మే అయినందున, రహస్యముగానే శరీరములో ఎవరికీ తెలియకుండా ఉండుట వలన,
దానిని జ్ఞానరీత్యా గుర్తించి చూపలేదు. అది రహస్యమైనదని తెలుపు నిమిత్తమే ఆత్మ యొక్క గుర్తయిన మధ్యరేఖను
పొడవు చేసి చూపలేదు. జీవాత్మ పరమాత్మయను రెండు ఆత్మల మధ్యలో ఆత్మ ఉన్నట్లు విభూతి రేఖలలో గుర్తించినా,
ఆరు సంఖ్యలో జీవాత్మ గుర్తునే పొడవుచేసి చూపి దానిని ఆత్మ గుర్తుగా చెప్పాము. ఆరు గుర్తుగాయున్న అంకెను తిప్పి
పెట్టితే అదే తొమ్మిదిగాయున్నది. తెలుగులో చేసిన ప్రయోగమునే ఇంగ్లీషు భాషలోని ఆరును త్రిప్పి తొమ్మిదిగా
చెప్పుకొంటున్నారు. మూడు కొమ్ములు గల ఒకే ఒక గుర్తే మూడు, ఆరు, తొమ్మిదిగా ఉండునట్లు, అది జ్ఞాన అర్థముతో
కూడుకొనియుండునట్లు, మొదట పెద్దలు తెలుగులో తయారు చేశారని అందరూ తెలియవలెను.
23

Page 25
సృష్టిలేనప్పుడు ఒక్కడే అయిన దేవుడు సృష్ఠిలో జగత్తును తయారు చేశాడు. జగన్నాటకమునకు సూత్రధారి
అయిన దేవుడు తననుండి తాను తయారు చేసిన జగత్తులోని నాటకమునకు తానే హీరో (కథానాయకుడు)గా ఉంటూ
కథనడిచే దానికి లేక ఆటసాగేదానికి ఒక విలను (విరోధిని) తయారు చేశాడు. హీరో పరమాత్మయని పిలువబడగా,
విలను మాయ అని పిలుస్తున్నాము. ఈ జగన్నాటక కథలో విలన్ ఎప్పుడు హీరోను మించి పోవాలనీ, తానే హీరోగా
పేరు తెచ్చుకోవాలనీ ప్రయత్నించు చుండును. జగన్నాటకములోని జీవుళ్ళను హీరో అయిన దేవుని చుట్టూ చేరకుండ
తన చుట్టూ చేరేదానికి, తన నాయకత్వమునే జీవుళ్ళు ఒప్పుకొనే దానికి జీవుళ్ళను మభ్యపెట్టి తానే హీరోననిపించుకొనే
ప్రయత్నము చేయు చుండును. అటువంటి ప్రయత్నములో తాను సులభముగ హీరోవలె చలామణి అవడానికి విలన్
హీరో వేషము వేసుకొని హీరోవలె నటించను మొదలుపెట్టాడు. అంటే మాయ దేవునివలె తన రూపమును మార్చుకొని
తానే దేవుడన్నట్లు జీవుళ్ళను నమ్మించడానికి మొదలుపెట్టింది. అందువలన కథానాయకుడైన (హీరో అయిన) దేవునికి,
విరోధి (విలన్) అయిన మాయ జగతిలో తానే దేవుడనిపించునట్లు దేవుని జ్ఞానమని చెప్పుకొను ప్రతిచోట దేవుని
జ్ఞానమువలె తన జ్ఞానమును చొప్పించింది. ముఖ్యముగ ప్రజలకు బోధించు బోధకులుగనున్న వారి తలలో దూరి
ప్రజలు గుర్తుపట్టనట్లు తన జ్ఞానమును చెప్పించుటకు మొదలు పెట్టినది. పెద్ద పెద్ద స్వామిజీలు, ఇతర మతములలోని
బోధకులు, అనేకరకముల గురువులు చెప్పుచున్నది దేవునికి విరోధి అయిన మాయ బోధలేనని చెప్పవచ్చును. దేవుని
జ్ఞానమేనని నమ్మి మాయా జ్ఞానమును తమ తలలో నింపుకొన్నవారు దేవునికి వ్యతిరేఖమైన పనులనే చేస్తున్నారు,
చేయిస్తున్నారు. చిన్న ఉదాహరణకు చెప్పుకొంటే భగవద్గీతలో దేవుని ప్రతినిధియైన భగవంతుడే విశ్వరూప సందర్శనమను
అధ్యాయములో నన్ను చేరుటకుగానీ, నన్ను తెలుసు కొనుటకుగానీ వేదాధ్యయణములు, యజ్ఞములు,దానములు, తపస్సులు
పనికిరావు అని చెప్పితే, బోధకుల యొక్క మాయ మాటలు విని అదే జ్ఞానమనుకొన్న వారందరూ యజ్ఞములు
చేస్తున్నారు, అందులో వేదపఠనములు చేస్తున్నారు. అలాగే దానములు చేస్తున్నారు, మెడిటేషన్ అని పేరుపెట్టి తపస్సులు
చేస్తున్నారు. ఇది హిందూ సమాజములోని పనికాగ, క్రైస్తవ సమాజములోనికి వెళ్లి చూస్తే పరిశుద్ధ బైబిలులో దేవుని
ప్రతినిధియైన ఏసుప్రభువే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనములో "భూమి మీద ఎవనికైనను తండ్రి
అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు" అని చెప్పియున్నాడు. ప్రభువే చెప్పిన మాటను
మభ్యపెట్టి నేడు సాతాన్ (మాయ) మనుషులలోనే బోధకులను తయారుచేసి వారినే తండ్రి అనీ, ఫాదర్ అనీ మనుషుల
చేతనే పిలిపిస్తున్నది. ఇలా భగవద్గీతలో దేవుడు చెప్పిన వాక్యమునకు వ్యతిరేఖముగ మానవుల చేత యజ్ఞములను
చేయించు మాయ, క్రైస్తవులలో మనుషులనే ఫాదర్ (తండ్రీ) అని పిలుచునట్లు చేసి తనే దేవునివలె చలామణి
అగుచున్నది. ఇలా చెప్పుచూపోతే మాయ దేవుని స్థానములోనే తిష్ఠవేసినది. దానికి తార్కాణముగ ఒక విషయమును
చెప్పుకొందాము. బైబిలునందు చిట్టచివరిలో "పరమార్థ జ్ఞానియగు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము” అను
దానిలో 13వ అధ్యాయములో 18వ వాక్యము "బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక
మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య ఆర్నూట అరువదియారు. ఇందులో జ్ఞానము కలదు" అని ఉన్నది. 13వ అధ్యాయములో
మొత్తము అన్ని వాక్యములు చదివి చూస్తే మాయను లేక సాతాను మృగము అని అన్నట్లు తెలియుచున్నది. ఈ
విషయము యోహాను ప్రకటన గ్రంథము చదివిన ఎవరికైన అర్థముకాగలదు. వాక్యములో ఇది యొక మనుష్యుని
సంఖ్యయే అని ఉన్నది. మనిషి సంఖ్య అనియున్నది కానీ దేవుని సంఖ్య అని అక్కడ లేదు కదా! సాతాను (మాయ)
మనిషిలో సులభముగ చేరుచున్నది. కావున అక్కడ మనిషిలో చేరియున్న సాతాను సంఖ్యగ మనము గుర్తించుకోవాలి.
మేము మాయకోడ్ చెప్పినప్పుడు కూడ అజ్ఞానమనిషిని చూచినపుడు మాయ సంఖ్యను గుర్తించుకోవాలి అని ముందే
24

Page 26
చెప్పియున్నాము. యోహాను ప్రకటన వాక్యములో "బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము” అని
ఉంది కదా! దానిలోని వివరము ప్రకారము బుద్ధిగలవాడు అని ప్రత్యేకముగ చెప్పడములో జ్ఞానముకలవాడని
అర్థమగుచున్నది. జ్ఞానము కల్గినవాడు అజ్ఞానిని చూచినపుడు వానిలోని మాయను 666 గ గుర్తించునని ముందు
పేజీలలోనే చెప్పియున్నాము. తర్వాత అదే వాక్యములో "ఇందులో జ్ఞానము కలదు” అని చెప్పబడియున్నది. దాని
వివరమును చూస్తే జ్ఞానము కల్గినవాడు సాధారణ మనిషిలోని మాయను గుర్తించి, మనిషి భావము ప్రకారము
లోపలగల సాతాను (మాయను) 666 గ గుర్తించడము జ్ఞాన మార్గములో ఉన్నవారికే సాధ్యమగునని, ఇతరులకు
తెలియునట్లు ఇందులో జ్ఞానమున్నదని చెప్పారు. దీనినంతటిని చూస్తే దేవుని జ్ఞానము ప్రకారము జ్ఞానమున్నవాడు
జ్ఞానములేనివాని తలలోపలగల మాయను కనుగొనగలడని ఇతరులకు కూడ అర్థమగుచున్నది. ఎంతో స్పష్టముగ
సాతాను సంఖ్య 666 అని యోహాను వాక్యములో ఉండగ, మనము ఇంతకుముందే విలన్ హీరోగ చలామణి అగునని
చెప్పుకొన్నట్లు, మాయ దేవునిగ ప్రచారము చేసుకొనుచున్నది. అదే విధముగ సాతాన్ మంచిపేరున్న బోధకుని తలలో
దూరి తన సంఖ్యను దేవుని సంఖ్యగ ప్రకటింపచేసినది. చిన్న చిన్న బోధకులనుండి చెప్పించితే దేవుని భక్తులైన వారు
నమ్మరేమోనని, ఎవరి చేత చెప్పించితే బాగుండునో వారిని ఎన్నుకొని చెప్పించడము వలన అంతలేనిదే అంత పెద్దాయన
చెప్పునా అని తప్పక నమ్ముదురని దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, జయశాలి అను బిరుదాంకితములుగల బోధకుని చేత “సృష్టికర్త
కోడ్ 666” అని ఉపన్న్యాసములలో చెప్పించినది, గోడల మీద వ్రాయించినది. దానిని చూచిన చాలామంది దైవభక్తులు
గొప్ప దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని అయినవ్యక్తి వ్రాసిన మాట నిజమే ఉంటుంది, అని పూర్తిగ నమ్మి దేవుని సంఖ్యను 666 గ
గుర్తించుకొని వారు కూడ సాతాను వలలో చిక్కుకొనిపోయారు. ఇది దేవుని సంఖ్యకాదు సాతాను సంఖ్య అని ఎవరూ
ఎదురు చెప్పలేక అది దేవుని సంఖ్యయే అయివుంటుంది, దేవుని సంఖ్య కాకుంటే అంతపెద్ద ఆత్మజ్ఞాని అలా చెప్పునా
అని అనుకొన్నారు.
బైబిలును, భగవద్గీతను రెండింటిని చదివి అందులోని జ్ఞానమును తెలిసిన కొందరు దైవభక్తులు తమ జ్ఞానముచేత
666 అను సంఖ్య ఇటు గీతలో మాయకు గుర్తుగానే కనిపిస్తున్నది, అటు బైబిలులోను మాయ (సాతాన్) యొక్క
గుర్తుగానే తెలియుచున్నది అని తలచినవారై దేవుని కోడ్ 666 అని ఎలా చెప్పగలిగారో వివరము తెలుసుకోవాలను
కొన్నారు. అలా అనుకొన్న వారు దేవునికోడ్ 666 అని వ్రాసిన దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని అయిన వారియొక్క ముఖ్యమైన
శిష్యున్ని దీని వివరము మాకు అర్థముకాలేదు మాకు అర్థమగులాగున వివరించి చెప్పండి అని అడిగినపుడు, మీరు
రండి మేము వివరించి చెప్పుతాము అన్నారు. వివరమును చెప్పించు కొనుటకు ముగ్గురు జ్ఞానులు ఆయనవద్దకు
వెళ్ళారు. పోయిన ముగ్గురు వినయముగ అడగడము, అడిగినదానికి ఎంతో ఓపికగ దైవజ్ఞాని గారి శిష్యుడు అయిన
రాజుగారు వివరముగ జవాబివ్వడము జరిగినది. వారి మధ్య జరిగిన సంభాషణను క్రింద పొందుపరుస్తున్నాము
చూడండి. (గమనించదగిన విషయమేమంటే చెప్పినదానిని వినడమే జరిగినది, కానీ పోయిన ముగ్గురు వ్యక్తులు
ఎదురు ప్రశ్నలు వేసి చేప్పేటతనిని ఇబ్బంది పెట్టలేదు.)
జ్ఞానులు :- నమస్తే, మిమ్ములను కలిసినందుకు సంతోషముగ ఉందండి.
రాజు :- మీపేర్లేమి? మీరు ఏమి చేస్తుంటారు?
25

Page 27
జ్ఞానులు
:
నాపేరు నాయుడు, నేను వ్యాపారము చేస్తుంటాను. నాపేరు చౌదరి నేను ఆర్మినుండి రిటైర్డయినాను.
నాపేరు శశికాంత్ నేను కూడ వ్యాపారమే చేస్తుంటాను.
రాజు :-
-
నాపేరు రాజు. నేను ప్రసంగాలు చేస్తుంటాను. మా గురువుగారు రావుగారు. ఆయన ప్రకటించిన వాక్యమే
సృష్టికర్తకోడ్ 666. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ అంతటా ఆ వాక్యమును నేనే వ్రాయించాను. సభలు కూడ
ఏర్పాటు చేసి ఆ వాక్యమును గురించి ప్రసంగాలు కూడ చేశాము. మీరు దేని వివరము కావాలని వచ్చారు?
-
జ్ఞానులు
మేము ఇందువులమే అయినా మాకు పరమత ద్వేషము లేదు. మేము ఆధ్యాత్మిక ప్రియులము. కావున
భగవద్గీత చదివాము, బైబిలులోని నాలుగు సువార్తలు చదివాము. అందరికి దేవుడొక్కడే అని నిర్ణయముతో ఉన్నాము.
మీరు సృష్ఠికర్త సంఖ్యను వ్రాయడము వలన మాకు కొంత ఆశ్చర్యము, అద్భుతము అనిపించింది. అది బైబిలులోని
వాక్యమని తెలుసుకొని దానిని వెదకి చదివాము. అక్కడ మాకు అర్థము కాకపోవడమేకాక అది సృష్ఠికర్తకోడ్
కాదేమోననిపించింది. మేము బైబిలులోని పదిపైసలు భాగమైన మత్తయి, మార్కు, లూకా, యోహాను అను నాలుగు
సువార్తలను మాత్రమే చదివాము కానీ బైబిలంతా తెలియదు. అందువలన మాకు తెలియని విషయము తమద్వార
తెలుసుకోవాలనుకొన్నాము.
రాజు:- మీరు హిందువులంటున్నారు కాబట్టి నేను ముందుగా అడుగున దేమనగా! మీరు దేవుడొక్కడే అని నమ్ముతారా?
లేక దేవతలందరినీ నమ్ముతారా?
జ్ఞానులు :- మేము మనుషులందరికి దేవుడొక్కడే అని నమ్ముతాము. దేవున్ని తప్ప ఏ ఇతర దేవతలను పూజించము.
హిందువులలో మేము కొంత ప్రత్యేకముగ కనిపిస్తుంటాము.
రాజు :- సృష్టికర్తకోడ్ 666 అను వివరము మీకు అర్థము కావాలంటే దానిని గురించి చెప్పేదానికి చాలా టైమ్పడుతుంది.
అంతసేపు మీరు ఓపికగ వింటారా?
జ్ఞానులు :- ఎంత టైమ్ పట్టిన వింటాము. మేము పనులన్ని వదులుకొని ముప్పైకిలోమీటర్లు దీనికొరకు వచ్చాము.
రాజు :- మనముంటున్న భూగోళములో ఒక భాగము భూమి, మూడు భాగములు సముద్రమున్నది. ఒక భాగము
భూమి విూదనే చిన్నవి పెద్దవి దాదాపు 360 దేశములు కలవు. అందులో ఒక భారతదేశములో ఆంధ్రప్రదేశనందు
మనము నివశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు కలవు. ఒక జిల్లానే ఎంతో విస్తీర్ణము కల్గియున్నది. అందులో
మనమూ మన ప్రదేశము సూక్ష్మాతి సూక్ష్మము. ఒక జిల్లాతోనే పోల్చి చూచితే మనిషి ఎంతో చిన్నవాడు కదా! ఒక
రాష్ట్ర విస్తీర్ణముతో పోల్చితే అంతేలేనంత చిన్నవారమైపోతాము. దేశముతో పోల్చి చూచితే లెక్కకే రాము. ఇటువంటి
ఎన్నో దేశములుగల భూమికంటే సముద్రము మూడింతలు ఎక్కువగా భూగోళము మీద ఉంది అనుకొన్నాము. ఇంత
పెద్ద భూగోళముకంటే ఎన్నో లక్షలరెట్లు పెద్దది సూర్యగోళము. ఇట్లు మనము ఊహించలేనంత గొప్పదైన
సూర్యగోళముకంటే ఎన్నో కోట్లరెట్లు పెద్దవి నక్షత్రములు. అటువంటి ఎన్నో నక్షత్రములు కలిస్తే ఒక పాలపుంత.
ఇటువంటి పాలపుంతలు ఎన్నో లక్షలు కలిస్తే ఒక మండలము. అటువంటి మండలములు కొన్ని వేలు కలిస్తే ఒక
మహామండలము. అటువంటి మహామండలములు ఎన్ని ఉన్నాయో మానవుని బుద్ధికి అందలేదు. దీనినిబట్టి చూస్తే
ఇంత సృష్ఠిని తయారుచేసిన వాడు ఎంత గొప్పవాడో చెప్పలేము. ఈ సృష్ఠిని తయారు చేసినవానిని సృష్టికర్త అంటున్నాము.
26

Page 28
అంత పెద్ద సృష్టికర్తను గురించి బైబిలులో వ్రాయబడి ఉన్నది. ఏ ఇతర గ్రంథములలోలేని విధముగ ఎంతో గొప్పగ
బైబిలులో దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడని ఉన్నది.
జ్ఞానులు :- భూమిని, ఆకాశమును దేవుడే సృష్టించాడని మేము కూడ విశ్వశిస్తున్నాము. అందులో ఏమాత్రము
సంశయములేదు. మాకున్న సంశయము సృష్టికర్తయిన దేవునికి కోడ్ ఉందా? ఉంటే అది ఆర్నూట అరువది ఆరుగానే
(666) ఎందుకున్నది? ఈ విషయమును గురించి ఎవరైన మమ్ములను అడిగితే మేము వారికి ఏమని సమాధానము
చెప్పాలి?
రాజు :- ఎవరైనా అడిగినపుడు ఇలా చెప్పండి. దేవుడు ఈ సృష్టినంతటిని తయారు చేయుటకు ఆరుదినముల
కాలము పట్టినది. ఆరు దినములలో మనిషిని ఆరవరోజు సృష్టించాడు. తర్వాత ఆరురోజులకు సాతాన్ ను తయారు
చేశాడు. అందువలన దేవుని గుర్తును ఆర్నూట అరవై ఆరుగ (666) పెట్టుకొన్నాము. ఈ అర్థముతోనే మేము గోడల
విూద సృష్ఠికర్తకోడ్ 666 అని వ్రాశాము. ఎవరైన అడిగితే ఇదే వివరము చెప్పండి.
జ్ఞానులు :- సృష్ఠిని తయారు చేయుటకు ఆరుదినములు పట్టినదన్నారు కదా! ఈ విషయము బైబిలులో ఉన్నదా?
రాజు :- బైబిలు ఆదికాండమునందు మొదటి అధ్యాయములోనే ఉన్నది. ఇంటికి పోయిన తర్వాత బైబిలులో
పాతనిబంధనలో మొట్టమొదటనే ఉన్న విషయమును చూచుకోండి.
జ్ఞానులు :- మీరు గోడకు వేసిన పోస్టర్స్ మీద సృష్టికర్తకోడ్ 666 అని వ్రాసి, క్రింద యోహాను ప్రకటనల గ్రంథము
13వ అధ్యాయము 18వ వాక్యము అని వ్రాశారు కదా! ఆ వాక్యమును చూచితే బుద్ధిగలవాడు మృగము సంఖ్యను
లెక్కింపనిమ్ము, ఇది యొక మనుష్యుని సంఖ్య అని ఉన్నది. ఇందులో జ్ఞానమున్నది అనికూడ ఉన్నది. 13వ
అధ్యాయములో చివరి వ్యాకమైన 18వ వాక్యమునంతటిని చూచిన తర్వాత, అంతకు ముందు అధ్యాయములోనూ
ముందుగల 17 వాక్యములను గుర్తుచేసుకొంటే సాతానును మృగమని చెప్పినట్లున్నది. సాతానైన మృగము సంఖ్య అని
ఉండుటవలన ఇది సాతాను సంఖ్యయేమోనని అనుమానము వస్తుంది కదా!
రాజు :- వాక్యము చివరిలో ఇందులో జ్ఞానమున్నదని ఉంది కదా! దానివలన అది దేవుని సంఖ్యయే అని చెప్పాలి.
జ్ఞానులు :- ఇక్కడ మాకు కొంత అర్థము కాలేదు. కొద్దిగ అర్థమయ్యేటట్లు వివరముగ చెప్పండి.
రాజు :- మీకు అర్థమయ్యేటట్లు ఒక ఉదాహరణ చెప్పుతాను. కోర్టులో జడ్జి ఉన్నాడనుకో, ఆ జడ్జి ఒక ముద్దాయికి
శిక్ష విధించాడు. శిక్షపడిన వానికి జడ్జియే ఒక నంబర్ ఇస్తాడు. శిక్షపడినవానిని ఖైది అంటాము. వానికి ఇచ్చిన
నంబరును ఖైధీనంబరు అంటాము. ఖైధీకి 112 నంబరు జడ్జియే ఇచ్చాడు కదా! ఖైధీ దగ్గర మొదట నంబరు
లేదుకదా! నంబరును జడ్జియే ఇచ్చాడు కాబట్టి అది జడ్జీనంబరే కదా! అలాగే అపవాది అయిన సాతాన్కు దేవుడే
శిక్షవేసి నంబరు ఇచ్చాడు. అందువలన అది దేవుని నంబరే అవుతుంది. అర్థమైందా?
జ్ఞానులు :- ఇక్కడొక చిన్న సంశయము, 112 నంబరును జడ్జీ ఇచ్చినప్పటికి 112 అని పిలిస్తే ఖైధీయే పలుకుతాడు.
కానీ జడ్జి పలుకడు కదా! అపుడది ఖైధీ నంబరా? జడ్జీనంబరా?
27

Page 29
రాజు :- అది ఖైధీనంబరే కానీ ఖైధీనంబరని చెప్పకూడదు. ఇచ్చినవాడు జడ్జీకాబట్టి జడ్జీనంబరే అని చెప్పాలి. అలాగే
666 నంబరు సాతానుదే, అయినా ఇచ్చినవాడు దేవుడు కావున అది దేవుని నంబరే అని చెప్పాలి. ఒకప్పుడు
సాతానుకు నంబరు లేదు, సాతానుకు దేవుడు శిక్షవేశాడు, నంబరు ఇచ్చాడు.
జ్ఞానులు :- ఈ సాతాను ఎవరు? సాతాను దేవునికి వ్యతిరేఖముగా ఎందుకు పని చేస్తున్నది? అపవాది అయిన
సాతానుకు దేవుడు శిక్ష ఎందుకు వేశాడు?
రాజు :- సాతాను ఒకప్పుడు దేవునికి ముఖ్యమైన ఇంటిమనిషిగా ఉండేవాడు. దేవుని ఇల్లు విశాలమైనది. దేవుని
ఇంటిలో ఎందరో పని మనుషులు ఉండేవారు. అందులో సాతాను ముఖ్యమైన పని మనిషి. అలా ఉన్న సాతాను
దేవున్ని మోసము చేశాడు. దానిని దేవుడు కనుగొని నీవు నన్ను మోసము చేశావు కాబట్టి నిన్ను భూలోకమునకు
పంపుచున్నాను అని భూలోకమునకు నెట్టివేశాడు. ఆ విధముగ దేవుడు సాతానుకు శిక్ష వేశాడు. దేవుని దగ్గర
శిక్షవేయబడి భూలోకమునకు వచ్చిన సాతాను తనకు శిక్షవేసిన దేవుని మీద కోపముకల్గి దేవునికి వ్యతిరేఖముగ
మనుషులను మార్చను మొదలుపెట్టాడు. ఆ విధముగ భూలోకములో సాతాను దేవుని రాజ్యము లేకుండ చేసి, తన
రాజ్యమును తయారు చేసుకోవాలనుకొన్నాడు. అందువలన ప్రతి మనిషిని దేవుని వైపు పోకుండ, దేవుని జ్ఞానము
తెలియకుండ సాతాను చేస్తున్నాడు.
జ్ఞానులు :- దేవుని విశాలమైన ఇంటిలో ఎందరో పని చేయువారున్నప్పుడు, వారు తనను మోసము చేయకుండ
దేవుడు మొదటే జాగ్రత్తపడలేదా?
రాజు :- ఇంటిలో పనివారన్న తర్వాత ఏదో ఒకటి మోసము చేస్తారని జాగ్రత్తపడిన దేవుడు, పని మనుషుల మీద
ఆధారపడకుండ ఉండుటకు తనకు సొంత కొడుకులుంటే బాగుండునని అనుకొన్నాడు. ఆ విధముగ అనుకొన్న తర్వాత
మొదట క్రీస్తును పుట్టించుకొన్నాడు, తర్వాత ఏసును పుట్టించుకొన్నాడు. ఆయన కొడుకులలో క్రీస్తు, ఏసు ఇద్దరు
ముఖ్యమైన వారు. మిగత కొడుకులను దేవునికున్న ఎన్నో నివాసములలో కొన్నిటిలో వారినుంచాడు.
జ్ఞానులు :- క్రీస్తు ఎవరు? క్రీస్తు వేరు ఏసు వేరా?
రాజు :- పరిశుద్ధగ్రంథము బైబిలులో మత్తయి సువార్తనందు 1వ అధ్యాయములో 16వ వాక్యమున “ఆమెయందు
క్రీస్తు అనబడిన ఏసు పుట్టెను" అని ఉంది. ఈ వాక్యమును బాగా అర్థము చేసుకొంటే క్రీస్తు అనబడిన ఏసుపుట్టెను
అన్నప్పుడు ఇంతకు ముందే క్రీస్తు అనునతడు ఉన్నట్లు అతనే ఇపుడు ఏసుగ పుట్టాడని అర్థమగుచున్నది. క్రీస్తు ఏసు
పుట్టకముందే దేవుడైన యెహోవా కుమారుడు. అందువలన క్రీస్తు అనబడిన అని అక్కడ చెప్పారు. క్రీస్తే ఏసుగా
పుట్టాడనీ, క్రీస్తు, ఏసు ఇద్దరు దేవుని కుమారులేనని చెప్పవచ్చును. దీనిప్రకారము ఏసును దేవుని కుమారుడని
చాలామార్లు బైబిలులో చెప్పారు.
జ్ఞానులు :- దేవుని కుమారుడు ఏసు అని ఒప్పుకుంటాము. కానీ మనమంతా దేవుని కుమారులము కాదా! దేవుడు
మనలను పుట్టించలేదా?
28

Page 30
రాజు :- ఏసుప్రభువు ఒక్కడే దేవుని కుమారుడు. మనమంతా సర్ప సంతానమే. కావున దేవుని కుమారులము కాదు.
జ్ఞానులు :- మీరు చెప్పిన మత్తయి సువార్త 23వ అధ్యాయము, 9వ వచనములో "భూమి మీద ఎవనికైనను తండ్రి
అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు." అని వ్రాయబడియున్నది కదా! దీనిప్రకారము
మనమంతా దేవుని కుమారులము కాదా?
రాజు :- ప్రభువు ఒక్కడే దేవుని కుమారుడు, మనమంతా దేవుని కుమారులము కాదు. దీని విషయము కొరకు లూకా
సువార్త, మూడవ (3) అధ్యాయము, ఏడవ (7) వచనములో చూస్తే "అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన
జనసమూహములను చూచి సర్పసంతానమా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు”
అని ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వచ్చిన జనమును చూచి యోహాను జనమును సర్పసంతానమా
అన్నాడు కదా! దానిని బట్టి మనమంతా సర్పసంతానమని తెలియుచున్నది కదా!.
జ్ఞానులు :- మనమేమైనా సాతాను ప్రభావము వలన బైబిలులోని విషయములను తప్పుగా అర్థము చేసుకుంటున్నామేమో!
అలా తప్పుగ అర్థము చేసుకొన్నవారికి తాను చెప్పిన విషయములను తిరిగి జ్ఞాపకము చేయుటకు పరిశుద్ధాత్మే తిరిగి
ఆదరణకర్త రూపములో వస్తానన్నదేమో! యోహాను సువార్త 14వ అధ్యాయము, 26వ వాక్యములో “ఆదరణకర్త
అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని
మీకు జ్ఞాపకము చేయును.” అని ఉన్నది. ఆయన చెప్పిన విషయములన్నిటిని సరియైన అర్థముతో కాకుండ వేరు
విధముగ అర్థము చేసుకొన్నపుడు, తిరిగి ఆయన చెప్పిన సంగతులను జ్ఞాపకము చేయవలసి వచ్చినదేమో
అనుకుంటున్నాము. ఇంతకీ ఆదరణకర్త ఎవరు?
రాజు :- మీకు అర్థమయ్యేదానికి నేనొక ప్రశ్న అడుగుచున్నాను. నీ పేరేమిటి?
జ్ఞాని :- నాపేరు శశి అంటారు.
రాజు :- శశి అన్న పేరును ఎవరికి పెట్టారు?
శశి :- నా శరీరమునకు.
రాజు :- అలా అయితే నీవు చనిపోయిన తర్వాత నీ శరీరము ఉన్నప్పటికి శక్తికాంత్ చనిపోయాడు అంటారు కదా!
కావున శరీరమునకు పేరు పెట్టబడలేదు. శరీరము లోపలి ఆత్మకు పెట్టబడిన పేరు శశికాంత్. ఆత్మ పరిశుద్ధమైనది.
నాపేరు రాజు. రాజు అనబడు పేరు నా శరీరములోని పరిశుద్ధాత్మకు పెట్టబడినదేగానీ నా శరీరముది కాదు. ఇపుడు
రాజు అనే నేను మీతో మాట్లాడుచున్నాను. అంటే నా శరీరములోని పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నదని అర్థము చేసుకోవాలి.
పరిశుద్దాత్మే కదా మీకు తెలియని సంగతులను చెప్పుచున్నది. ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ అంటున్నాము. ఆదరణకర్త
వస్తాడంటే ఎక్కడినుండో వస్తాడని కాదు. మనలోనుండే మాట్లాడునని అర్థము చేసుకోవాలి.
జ్ఞానులు :- పరిశుద్ధాత్మను ఆదరణకర్త అని ఎందుకన్నారు?
29

Page 31
రాజు :- మా ప్రసంగాలు వినండి బాగా అర్థమవుతుంది. మేము 2007 సెప్టెంబరు నెలనుండి డిశంబరువరకు “మా”
టీవీలో ప్రసంగాలను ఉదయము పూట చెప్పాము. అవి మావద్ద సీ.డీల రూపములలో దొరుకును. మీకు పని
ఏమైనా ఉందేమో తర్వాత ఎప్పుడైన కలుస్తాములేండి.
నాయుడు :- మేము అన్ని పనులు వదులుకొని మీ కొరకు 30 కిలోమీటర్ల దూరమునుండి వచ్చాము. మీరు
చాలాసేపుపట్టుతుంది వింటారా అని అడిగారు. మేము ఎంత టైము పట్టినా వింటామన్నాము కదా!
గంటయినా ఉంటాములేండి.
ఇంకా ఒక
రాజు :- లేదులేండి నాకు కూడ కొద్దిగ వేరేపనియుంది. తర్వాత ఎప్పుడైన రాండి, అప్పుడైతే సీడీలు కూడ దొరుకుతాయి.
-
ముగ్గురూ సరే అట్లే కానియ్యండి, తర్వాత కలుస్తాము చివరిగ ఒక చిన్న ప్రశ్న అడుగుచున్నాము. ఏసుప్రభువు
చనిపోయిన తర్వాత ఎక్కడకు పోయాడు?
రాజు :- దేవునికి ఆ లోకములో అనేక నివాసములు గలవు అని బైబిలులోనే ఉన్నది. అలాంటి అనేక నివాసములలో
దేవునివద్దకు పోయిన వారందరికి ఒక్కొక్కరిని ఒక్కొక్క నివాసములో దేవుడుంచును. దేవుని మార్గమును అనుసరించిన
వారందరు దేవుని వద్దకు చేరుదురు. అందమైన దేవుని రాజ్యములో ఎంతో ఆహ్లాదకరమైన నివాసములు గలవు. ఆ
నివాసములలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాసమును ఇచ్చి, దానిలో స్వతంత్రముగ అన్ని సౌఖ్యములను అనుభవిస్తు ఉండునట్లు
దేవుడు చేయును. ఏసుప్రభువు కూడ దేవునివద్దకు చేరి అక్కడ దేవుని నివాసములో ఉన్నాడు. బైబిలులో చెప్పిన
జ్ఞానమును అనుసరిస్తే ఎవడైనా దేవునివద్దకు పోవచ్చును. దేవుని రాజ్యములో నివాసముండవచ్చును. ఏసుప్రభువు
కూడ భూమిమీదకు రాకముందు దేవుని వద్దయుండెడివాడు. ఆయన దేవుని రాజ్యము నుండి వచ్చాడు, కనుక
ప్రజలతో నా రాజ్యము వేరుగ ఉన్నదన్నాడు.
ఈ విధముగ వారి సంభాషణ కొనసాగింది. ఆ విషయములన్నిటిని ఆ ముగ్గురి ద్వారా మేము తెలుసుకోవడము
జరిగినది. ఇదంతయు దేవునికి సంబంధించిన విషయము కావున ప్రతిఒక్కరికి దానిని తెలుసుకొనేదానికి గానీ,
చెప్పేదానికిగానీ హక్కు ఉన్నది. తెలియనప్పుడు ఎవడైన తెలుసు కొంటాడు. కానీ తెలియచెప్పేవాడు తనకు తెలిస్తేనే
చెప్పాలి. లేకపోతే గ్రుడ్డివారు మరో గ్రుడ్డివానికి దారిచూపునట్లుండును. మేము ఈ సంభాషణ అంతా విన్న తర్వాత
మాలో ఎన్నో సంశయములు బయలు దేరినవి. వాటి క్రమమును క్రింద పొందుపరుస్తున్నాము.
దేవుడు సమస్తమును ఆరు రోజులలోపల సృష్టించాడని చెప్పినప్పుడు, అందులోనే ఆరవరోజున మనిషిని
సృష్టించాడని చెప్పినప్పుడు, తర్వాత ఆరు రోజులకు సాతాన్ ను తయారు చేశాడని చెప్పినప్పుడు వినేదానికి బాగానే
ఉన్నది. దానిని మూడు ఆర్లుగ చెప్పడము గాడితప్పిన పనియైనది. దేవుడు భూమి ఆకాశములతో సహా సమస్తమును
మరియు మనిషిని సృష్ఠించుటకు ఆరుదినములు పట్టినది, తర్వాత ఆరుదినములకు సాతాన్ ను తయారు చేశాడు.
ఇక్కడ ఎటుచూచిన రెండు ఆరులే అగుచున్నవి. మూడవ ఆరును ఎక్కడనుండి తేవాలి.
అనగా 666 అని చెప్పుట శాస్త్రబద్దతకానీ, సూత్రబద్ధతకానీ ఏమాత్రములేని విషయము.
చూచినప్పటికీ, ముందునుండి వెనుకకు చూచినప్పటికి ఆర్నూట అరవై ఆరు (666) రాదు.
(66) మాత్రమే వచ్చును. మానవునితో సహా సృష్టినంతటిని తయారు చేయుటకు కేవలము ఒక ఆరు (6) దినములే
పట్టాయనీ, తర్వాత సాతాను తయారు చేయుటకు మరియొక ఆరు (6) రోజులు పట్టాయనీ చెప్పినప్పుడు మొత్తము
ఇక్కడ మూడు ఆరులను
వెనుకనుండి ముందుకు
కేవలము అరువై ఆరు
30

Page 32
12 దినములే అగును. 12 ను రెండు భాగములుగ చేస్తే రెండు ఆర్లే అగును. ఆ లెక్క ప్రకారము 66 అగును. లేదు
కాదు అనీ సాతాన్ పుట్టుకను ప్రత్యేకముగా చెప్పినట్లు మనిషి పుట్టుకను మాత్రము ప్రత్యేకమైన దినముగా చెప్పుచున్నామనీ,
దాని ప్రకారము భూమి చెట్లు పక్షుల యొక్క సృష్ఠి దినముల సంఖ్య ఆరు (6) కాగ, మనిషి సృష్ఠి ప్రత్యేకముగ ఆరు
(6) కాగ, సాతాను యొక్క పుట్టుక మరియొక ఆరు (6) అయినదని కూడా లెక్క సరిచేసి చెప్పవలెనని చూచినా అది
సరిపోని లెక్కనే అగును. ఎట్లనగా! మనిషి తప్ప మిగత సృష్టిని ఐదు (5) దినములుగ లెక్కించుకోవలసి వచ్చును.
తర్వాత మనిషిని ఒక (1) దినముగ లెక్కించుకోవలసివచ్చును. ఆ తర్వాత సాతానును ఆరవ (6) దినమునకు
లెక్కించవచ్చును. ఈ లెక్కప్రకారము మనిషిని ప్రత్యేకముగ చెప్పితే 516 అగును. అపుడు 666 అని చెప్పక 516
అని చెప్పవలెను కదా! 516 ప్రకారమైతే పండ్రెండు (12) దినములకు సరిపోవును.
మన లెక్క అంతయు వదలివేసి అటురావుగారుగానీ, ఇటు రాజుగారుగానీ చెప్పిన లెక్కప్రకారము ఆర్నూట
అరువది ఆరు (666) అను సంఖ్యయే సరియైనదని అనుకొందాము. ఆ సంఖ్యను దేవుని గుర్తుగ పెట్టుటకు
ఆధారమేమిగలదు? అదంతయు ప్రకృతీ అందులోని జీవరాసులూ తయారైన సంఖ్య కావున అది ప్రకృతికి వర్తిస్తుంది,
కానీ దేవునికి ఎలా వర్తిస్తుంది? అని అడిగితే దీనికి జవాబుండదు.
ఇలా మేము ప్రశ్నించి అడిగామనుకో దేవుని విషయములో అడ్డము మాట్లాడు అజ్ఞానులుగా మమ్ములను
అనుకోవచ్చును, మీరు బైబిలు చదవ లేదు, చదివి చూడండి తెలుస్తుంది అని అనవచ్చు, దేవుని విషయములో ఇలా
మాట్లాడము వలన పాపమొస్తుంది అనవచ్చును. దానికి జవాబుగ నేనూ అదే మాటలంటున్నాను. మీరు బైబిలు
చదవలేదు, ఒకమారు జాగ్రత్తగ చదవండి తెలుస్తుంది అంటున్నాను. దేవుని విషయములో భయములేకుండా, అడ్డముగా
అబద్దపు మాటలను మాట్లాడితే భయంకర పాపమొస్తుందంటున్నాను. బైబిలు ఎప్పటికీ పరిశుద్ధగ్రంథమే. అందులోని
పరిశుద్ధతను గ్రహించక, శాస్త్రబద్ధత లేకుండ మాట్లాడితే, బైబిలును దేవున్ని అపరిశుద్ధము చేసినట్లు కాదా? బైబిలులో
ఏసుప్రభువు చరిత్రగల నాలుగు సువార్తలే ఆణిముత్యములలాంటివి. నాలుగు సువార్తలతోనే అది పరిశుద్ధ గ్రంథముగ
కీర్తికెక్కినది. అందులోని ఏసుప్రభువు మాటలు ఆనాటికీ నేటికీ ఏనాటికీ వెలకట్టలేని వజ్రములలాంటివి. అంతవిలువైన
ప్రభువు మాటలను వదలి బైబిలును ఇష్టమొచ్చినట్లు చెప్పుకోవడము మనుషులైన వారికి తగిన పనేనా అంటున్నాము?
ఏకంగా సాతాను సంఖ్య అయిన ఆర్నూట అరువది ఆరు (666) సంఖ్యను దేవుని సంఖ్యగ చెప్పడము చేయవలసినపనేనా
అని అడుగుచున్నాము.
మాకు అర్థము కాలేదు వివరముగా చెప్పండని కోడ్గా చెప్పిన 666 ను గురించి ముగ్గురు అడుగగా రాజుగారు
ఒక ఉపమానము చెప్పారు. "ముద్దాయికి జడ్జిగారు 112 అను నంబరు ఇచ్చినపుడు అది జడ్జిదే కదా! జడ్జి
ఇచ్చినదేకదా! 112 ముద్దాయిదే అయినప్పటికి ఆ నంబరు జడ్జీదే” అని చెప్పవలెను. అందువలన ఆర్నూట అరువది
ఆరు (666) ను సాతాను నంబరు కాదు సృష్ఠికర్తదే అంటున్నామని వివరించారు. విన్న ముగ్గురికి ఆ విషయము
తప్పు అని తెలిసినప్పటికి ఎదురు మాట్లాడకుండ దానిని అంతటితో వదిలేశారు. కానీ మేము అడుగునదేమనగా?
రాజుగారు తెలివిగ చెప్పి ఒప్పించాలని చూచినప్పటికి అది సరియైన ఉపమానము కాదు, సరియైన సమాధానము
కాదు. ఎందుకనగా! 112 అని పిలిచినప్పుడు ముద్దాయి పలుకుతాడా? జడ్జి పలుకుతాడా? ఏ విధముగా చూచినప్పటికి
ముద్దాయే పలుకుతాడని చెప్పవచ్చును. ఒకవేళ 112 అను నంబరును జడ్జి ఇచ్చినప్పటికీ ఇచ్చిన తర్వాత అది
ఖైదీనంబరే అవుతుంది కానీ జడ్జీనంబరు కాదు. ఇతను పలానా ఖైదీ అని గుర్తించుటకు పెట్టిన నంబరే కానీ అది
31

Page 33
జడ్జీని గుర్తించుటకుకాదు. ఖైదీ నిమిత్తము రికార్డులో ఖైదీనంబరు 112 అని వ్రాస్తున్నారుగానీ, జడ్జీనంబరుగా రికార్డులో
వ్రాయలేదు కదా! ఆ విధముగనే మాయ నిమిత్తము జగతిలో చెప్పుచున్నపుడు మాయ నంబరు ఆర్నూట అరువది
ఆరు (666) అని చెప్పుచున్నాము. ఖైదీ నంబరును ఖైదీనంబరుగా చెప్పకుండ ఆ నంబరును జడ్జీనంబరుగా చెప్పితే
ఎంత తప్పగునో అలాగే మాయ నంబరును మాయనంబరుగా చెప్పకుండ సృష్టికర్త (దేవుని) నంబరుగా చెప్పడము
అంతే తప్పగును. సృష్ఠికర్త నంబరు 666 అనుట సరియైనదేనా అని చాలామంది క్రైస్తవ బోధకులైన ఫాదర్లను,
ఫాస్టర్లను మరికొంత మంది క్రైస్తవులను విడదీసి అడిగితే ఆరువందల అరువది ఆరు (666) సాతాన్ (మాయ) నంబరే
అని ఒప్పుకొంటున్నారు. ఈ ప్రకారము రాజుగారు గానీ వారి గురువుగారైన రావుగారుగానీ మాట్లాడిన సృష్ఠికర్తకోడ్
666 అను విషయము పూర్తి తప్పు అని తెలిసిపోవుచున్నది. దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, జయశాలి అను పేరు పెట్టుకొన్న
రావుగారు చెప్పడము దానిని రాజుగారు వ్రాయడము దేవునికి వ్యతిరేఖమైన పనికాదా?
రాజుగారు తన మాటలలో దేవునికి అనేక నివాసములున్నవి అన్నాడు. ఆ నివాసములలో కొందరిని
దేవుడుంచునని కూడ చెప్పాడు. దీనినిబట్టి చూస్తే దేవునిది ఎక్కడో ప్రక్కనున్న ప్రదేశమని, ప్రత్యేకమైన ప్రదేశము
కొంతమేర వ్యాపించియున్నదని, అదంతయు దేవుని సామ్రాజ్యమని, అక్కడ అందమైన భవంతులు కలవని అర్థమగుచున్నది.
దీని ప్రకారము దేవుని రాజ్యమునకు ఎల్లలున్నవని కూడ తెలియుచున్నది. ఇదంతయు రాజుగారి భావము ప్రకారమున్నది.
మేము చెప్పునదేమనగా! దేవుడు సర్వవ్యాపి, అణువణువున వ్యాపించి పరమాణువులో కూడ ఉన్నాడు. తాను లేని
స్థలముగానీ, తాను చూడనిదేదికానిలేదు. అందువలన దేవున్ని సర్వవ్యాపి, సర్వదర్శి అని అనుచున్నాము. భూమికానీ,
ఆకాశముకానీ, నక్షత్రగోళములుకానీ, సూర్యమండలములుగానీ అన్నిటిలోను దేవుడు వ్యాపించియున్నాడు. కావున
విశ్వమంతా ఆయన రాజ్యమే. విశ్వమునకంతా ఆయన అధిపతియే. దేవుని రాజ్యముకాక ఇంకొకటిలేదు కావున
దేవుని రాజ్యమునకు ఎల్లలు లేవని చెప్పవచ్చును. దేవుడు నిరాకారుడు ఆయన ప్రాణమున్నవాటిలోను
ప్రాణములేనివాటిలో కూడ అణువణువున వ్యాపించినవాడు, అంతటా ఉన్నవాడు దేవుడు కనుక ఆయనకు అనేక
నివాసములున్నాయన్నారు. అనేకము అనగా ఒకటికంటే ఎక్కువ అని అర్థము. కానీ కొన్ని అని అర్థము చేసుకోకూడదు.
కొన్ని తనవంటే మరికొన్ని తనవికాదనేగా అర్థము. అందువలన కొన్నికాక అన్ని నివాసములు ఆయనవే. ఆయన
నివాసములేని ఏ అణువు కూడ లేదు. ప్రతి పదార్ధములోను సాక్షియై దేవుడున్నాడు.
సర్వవ్యాపి, సర్వదర్శి అయిన దేవునికి సాతాను ముఖ్యమైన పని మనిషి అనీ, సాతాను దేవున్ని మోసము
చేశాడనీ రాజుగారు చెప్పారు. దేవుడేమైన ఒక మనిషిలాంటివాడా అతనిని సాతాను మోసము చేయడానికి.
రూపముగానీ, నామముగానీ, క్రియలుగానీ లేని దేవునికి ఇల్లూ, ఇంటిలో పనీ ఉండునా? ఆయన చేయవలసిన
పనిగానీ, ఆయనకు కావలసిన పనిగానీ ఏమిలేదు. ఎప్పుడైనా మనుషులకు తన ధర్మములను తెలియ జేయుటకు తన
కుమారుని రూపముతో తన ప్రతినిధిగా ఒక మనిషిని భూమిమీదకు పంపును. భూమిమీదున్న తన పుత్రుడు
మనుషులకు కావలసిన జ్ఞానమును బోధించి తిరిగి తండ్రిలోనే చేరిపోవును. తండ్రియైన దేవుడు కుమారుడైన ప్రవక్త
విడివిడిగా ఉన్నప్పటికి ఇద్దరు ఒక్కటే. అందువలన నాతండ్రిమాటలు నామాటలు రెండు ఒక్కటేననీ, నన్ను చూచిన
వాడు నాతండ్రిని చూచినట్లేనని ప్రభువు చెప్పాడు. ప్రభువు చనిపోయిన తర్వాత దేవునిలో ఐక్యమై పోయాడు. కావున
నేను పోవు చోటికి మీరెవరు రాలేరని మనుషులతో చెప్పాడు. దేవుడు కొన్ని వేల యుగముల కొకమారు భూమిమీదకు
మనిషిరూపములో వచ్చి జ్ఞానమును బోధించి పోవును. ఆయనకు అంతకంటే వేరు పనిలేదు. అటువంటి దేవునికి
32

Page 34
పని మనుషులని చెప్పడమూ, పని మనిషి అయిన సాతాను దేవున్ని మోసము చేశాడనడమూ వాస్తవ విషయమగునా?
అంతేకాక పని మనుషులు తనను మోసము చేస్తారని, దేవుడు తన స్వంతకొడుకులను పుట్టించుకోవాలనుకొన్నాడని
రాజుగారు చెప్పడము మరీ విచిత్రముగా ఉన్నది. దీనిని గురించి మేమేమనుచున్నామంటే! సమస్త జీవకోటి దేవుని
సంతానమై ఉన్నది. సృష్టికర్త దేవుడైనపుడు అందరికి ఆయన తండ్రికాక ఏమౌతాడు. జగతి అంతా ఆయన సంతానమే
అయినపుడు స్వంత కొడుకులను పుట్టించు కోవాలనుకోవడమేమిటి? దేవున్ని గొప్పగ పోల్చుకోక మనవలె పోల్చుకుంటే
ఇల్లూ, ఇంటిలో పనిమనుషులూ, స్వంతకొడుకులుండవచ్చును. దేవునికి ఒక ఇల్లుగానీ, పనిమనుషులుగానీ,
స్వంతకొడుకులుగానీ ఎవరులేరని తెలియవలెను. దేవుని మార్గములో లేకుండ, దేవుని జ్ఞానమును అనుసరించకుండ,
మాయ (సాతాన్) మార్గములో నడుచువానిని సర్ప సంతానమని చెప్పారు. సర్పము మాయకు గుర్తు అందువలన
మాయలోనున్న వారిని సర్పసంతానమనుట జరిగినది. సర్పసంతానము అనబడువారు దేవుని సంతతివారేనని తెలియాలి.
బైబిలులో ఆత్మకు గుర్తుగ పావురమును (పక్షిని), మాయకు గుర్తుగ కొండశిలువ పామును (సర్పమును) చెప్పుకొన్నారు.
దీనిప్రకారము దైవమార్గములోని వారు పక్షిసంతానమనీ, మాయమార్గములోనివారు సర్పసంతానమని గుర్తింపుకు చెప్పినదే.
పక్షి సంతానము పాము సంతానము రెండు దేవుని సంతానమేనని తెలియాలి. ఏ విధముగ జ్ఞానిని చూచినపుడు
దేవుని సంఖ్య 963 ను, అజ్ఞానిని చూచినపుడు మాయసంఖ్య 666 ను గుర్తు చేసుకొన్నట్లు, సాతాన్ (మాయ)
మార్గములోని వారిని సర్పసంతానము అంటున్నాము.
విశ్వసృష్ఠిని గురించి బైబిలు పాతనిబంధన ఆదికాండములో మొదటి అధ్యాయమునందు చూడండి అని రాజుగారు
చెప్పాడు. ఆయన మాట ప్రకారము ఆదికాండములోని ఆది అధ్యాయములో ఒకటి నుండి ఐదు వాక్యముల వరకు
చదివితే ఈ విధముగా ఉన్నది. "1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2. భూమి నిరాకారముగాను
శూణ్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను.
3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును
చీకటిని వేరుపరచెను. 5. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును
ఉదయమును కలుగగా ఒక దినమాయెను.” ఈ ఐదు వాక్యములు బైబిలులో మొట్ట మొదటి వాక్యములు. ఇక్కడ
మేము అడుగునదేమనగా! మొదట భూమి నిరాకారముగాను శూణ్యముగాను ఉండగా, అగాధజలము పైన చీకటి
కమ్మియుండగా, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అని వ్రాయబడియున్నది కదా! అక్కడ చెప్పిన దానిని
ఊహించుకొంటే అగాధమైన జలములు వాటిపైన గాఢమైన చీకటి చీకటిలో దేవుని ఆత్మ నీటిమీద తేలియాడడము
అంతా ఒక దృశ్యరూపముగ బుద్ధికి గోచరిస్తున్నది. దీనినంతటిని మొదట ఎవరైన చూచియుంటేనే కదా అక్కడ
పరిస్థితిని వర్ణించి చెప్పేది. సృష్టికంటే ముందు ఎవరున్నారు? అక్కడున్నవాడు ఎవడో చీకటిని జలములను, జలముల
మీద దేవున్ని చూచియుండాలి. అంత చీకటిలోను వెలుగులేనప్పుడే జలములను దేవున్ని చూచినవాడు, దేవుని
సృష్ఠికంటే ముందున్న వాడు ఎవడో కాని వాడు సృష్టికంటే ముందూ, దేవునికంటే పెద్దవాడైయుండాలి. అలా సృష్ఠికంటే
ముందుయుండి చీకటిలోనే దేవున్ని ముందే చూచిన వాడెవడైన ఉండగలడా? ఈ విషయమును గ్రుడ్డిగనమ్మక ప్రతి
క్రైస్తవుడూ, ప్రతి మనిషీ ఆలోచించి తీరవలసిందే. ఇలా మొదట చెప్పిన రెండు వాక్యములు దేవున్ని ఘనపరచగలవా?
హీనపరచగలవా? అని యోచిస్తే ఇందులో దేవున్ని ఘనపరుచు విధానము లేదు. దేవునికంటే ముందే, సృష్టికంటే
ముందే, మరియొకనిని ఘనపరచినట్లున్నది. దేవునికంటే పెద్ద ఎవరులేరని నమ్మిన విశ్వాసులలో కూడ అనుమానమును,
33

Page 35
అవిశ్వాసమును కలుగజేయునట్లు మొదటిలోనే రెండు వాక్యములు గలవు. ఏది ఏమైన సృష్ఠి పూర్వము ఉండి
చూచినవాడెవడో ఎవరైనా చెప్పగలరా! ఎవరూ చెప్పలేరు.
66
ఎక్కడ ఖండింపబడనిది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానమును తెలిసినవాడు జ్ఞానవిషయములో ఎవడు ఏ ప్రశ్న
అడిగిన జవాబు చెప్పు స్థోమత కల్గియుండును. దేవుని జ్ఞానము ప్రకారము జవాబు చెప్పితే దానిని పద్ధతి ప్రకారము
మాట్లాడువాడు ఎవడూ కాదని చెప్పలేడు, ఖండించి మాట్లాడలేడు. ఆ విషయమునే ఏసుప్రభువు చెప్పినట్లు లూకా
సువార్త 21వ అధ్యాయము 15వ వచనములో కలదు. "మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును
వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును” అంతేకాక ఆకాశమును, భూమియు గతించును
కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు" అని ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయము, 35వ వచనములో
చెప్పియున్నాడు. ఈ విధముగ ప్రభువు చెప్పిన జ్ఞానము ఎక్కడ ఖండింపబడక పూర్తిగ శాస్త్రబద్దమై ఉండునని
తెలియుచున్నది. బైబిలులో అదియు క్రొత్తనిబంధనలో గల ప్రభువు యొక్క మాటలు గల నాలుగు సువార్తలలోని
జ్ఞానమును ఎవరు ఖండించుటకు వీలులేదు. ఎందుకనగా అవి స్వయముగ దేవుడు చెప్పిన వాక్యములు. ఇక్కడ
దేవుడు చెప్పాడా? ప్రభువు కదా చెప్పినది అని అనుకోకుండ ఈ విషయములో ఎవరికీ అనుమానము రాకుండ
ముందే ప్రభువు ఈ విధముగ చెప్పాడు. యోహాను సువార్త, 7వ అధ్యాయము, 16వ వాక్యములో "నేను చేయు బోధ
నాదికాదు. నన్ను పంపినవానిదే” ఈ రెండు వాక్యములను చూచితే దేవుని వాక్యములు ఎంత బలమైనవో అర్థమౌచున్నది.
ఏ నాస్తికవాదిగానీ, ఏ హేతువాదిగానీ ఖండించుటకు వీలులేని వాక్యములై యుండును. కానీ ప్రభువు మాటలను
వదలి మిగతా బైబిలంతటిని చూస్తే అందులో దేవుని మీదనే అనుమానమును కలిగించు వాక్యములు ఉన్నవి.
అందువలన బైబిలులో పరిశుద్ధత అంటే ప్రభువు జ్ఞానముగల నాలుగు సువార్తలలోనే గలదని మేము చెప్పుచున్నాము.
బైబిలు పరిశుద్ధగ్రంథము, మహిమగల గ్రంథము అనడానికి నాలుగు సువార్తలే ముఖ్యకారణము. ప్రభువు పలికిన
మాటల ముందర మిగతా బైబిలంతా సారములేనిదే అని చెప్పవచ్చును. అందువలన మిగతా బైబిలులోని విషయములను
ఎవరైన విమర్శించుటకు ఖండించుటకు అవకాశము గలదు. కానీ బైబిలు క్రొత్తనిబంధనలోని నాలుగు సువార్తలను
ఎవరూ ఖండించలేరని చెప్పవచ్చును. మిగతా బైబిలు ఎలా హేతువాదుల విమర్శకు లోనవుతూ ఉన్నదో వివరించుకొని
చూస్తాము. బైబిలులో మొట్టమొదట ప్రారంభములోనే మొదటి అధ్యాయము ఒకటి రెండు వాక్యములే అనుమానము
రేకెత్తించి అవిశ్వాస బీజమును నాటుచున్నవి.
ఇంకనూ చూస్తే దేవుడు సమస్త సృష్టిని ఆరుదినములలో సృష్టించాడని ఆదికాండము మొదటి అధ్యాయములో
గలదు. మొదటి అధ్యాయమంతగల 31 వచనములు, తర్వాత రెండవ అధ్యాయములో 7వ వచనము వరకు చూస్తే
ఎంత లోపభూయిష్టముగ ఉన్నదో చూడండి. 1) ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2) భూమి
నిరాకారముగాను శూణ్యముగాను ఉండెను. చీకటి అగాధజలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన
అల్లాడుచుండెను. 3) దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4) వెలుగు మంచి దైనట్టు దేవుడు చూచెను.
దేవుడు వెలుగును చీకటిని వేరు పరచెను. 5) దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.
అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
34

Page 36
6) మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలభాగము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును
గాకని పలికెను. 7) దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు
పరుచగా ఆ ప్రకారమాయెను. 8) దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును
కలుగగా రెండవ దినమాయెను.
ఆరిననేల కనపడును గాకని పలుకగా
జలరాశికి ఆయన సముద్రములని పేరు
9) దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి
ఆప్రకారమాయెను. 10) దేవుడు ఆరిననేలకు భూమి అని పేరు పెట్టెను,
పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. 11) దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ
జాతిప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాకని పలుకగా ఆప్రకారమాయెను.
12) భూమి గడ్డిని తమ తమ జాతిప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు
గల ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 13) అస్తమయమును ఉదయమును కలుగగా
మూడవ దినమాయెను.
14) దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి
సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకైయుండుగాకనియు, 15) భూమి మీద వెలుగిచ్చుటకు
అవి ఆకాశవిశాలమందు జ్యోతులైయుండుగాకనియు పలికెను, ఆ ప్రకారమాయెను. 16) దేవుడు ఆరెండు గొప్ప
జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17), 18)
భూమి మిద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరుచుటకును, దేవుడు ఆకాశ
విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. 19) అస్తమయమును ఉదయమును కలుగగా
నాలుగవ దినమాయెను.
20) దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన
ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21) దేవుడు జలములలో వాటివాటి జాతిప్రకారము జలములు
సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతిప్రకారము రెక్కలుగల
ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22) దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది
సముద్రజలములలో నిండియుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.
23) అస్తమయములను ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.
24) దేవుడు వాటివాటి జాతిప్రకారము జీవముగలవాటిని, అనగా వాటివాటి జాతిప్రకారము పశువులను,
పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను, ఆ ప్రకారమాయెను. 25) దేవుడు ఆయా
జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలకు
ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 26) దేవుడు తన స్వరూపమునందు తన పోలిక
చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను సమస్త భూమిని భూమి
మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27) దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను. 28) దేవుడు వారిని
35

Page 37
ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి,
సముద్ర చేపలను ఆకాశ పక్షలను భూమి మీద ప్రాకు ప్రతిజీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29) దేవుడు
ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతిచెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను.
అవి మీ కాహారమగును. 30) భూమి మీదనుండు జంతువులన్నిటికిని, ఆకాశపక్షులన్నిటికిని, భూమిమీద ప్రాకు
సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను, ఆప్రకారమాయెను. 31) దేవుడు తాను చేసినది
యావత్తును చూచినపుడు అది చాలామంచిగనుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయెను.
రెండవ అధ్యాయము : - ఒకటవ వాక్యమునుండి 1) ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును
సంపూర్తి చేయబడెను. 2) దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన
పనియంతటనుండి ఏడవ దినమున విశ్రమించెను. 3) కాబట్టి దేవుడు ఆ ఏడవదినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను.
ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
4) దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజింపబడినపుడు వాటివాటి
ఉత్పత్తిక్రమము ఇదే. 5) అది వరకు పొలమందలి ఏ పొదయు భూమిమీదనుండలేదు. పొలమందలి ఏ చెట్టును
మొలచలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వానను కురిపించలేదు. నేలను సేద్యపరుచుటకు నరుడులేడు.
6) అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను. 7) దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
ఇప్పుడు పైన వ్రాసినదంతయు బైబిలు ఆదికాండములోని మొదటి విషయమన్నాము కదా! ఇక్కడున్నదంతయు
హేతువాదమునకుగానీ, సతివిమర్శకుగాని నిలువని విషయమని తెలుస్తుంది. వాటిలో కొన్నిటిని మేము అడుగుచున్నాము.
మొదటి అధ్యాయములో ఒకటి రెండు వాక్యములను చూచిన తర్వాత మొదట సృష్ఠియేలేనప్పుడు, మానవుడే లేనప్పుడు
అప్పుడు అక్కడున్న పరిస్థితిని ఎవడు చూచి వ్రాశాడు? అని ప్రశ్న వస్తున్నది. 2వ వాక్యములో "భూమి నిరాకారముగాను,
శూణ్యము గాను ఉండెను" అని అన్నపుడు. మూడవ దినమున దేవుడు భూమిని తయారు చేశాడు అని ఉంది.
అంతవరకు భూమిలేదనేగా అర్థము. అలాంటపుడు మొదటి రోజే భూమి నిరాకారముగా శూణ్యముగా ఉండెనని
భూమిని గురించి ప్రస్తావించారు గదా! ఇందులో ఏ మాట నిజము. మొదటి దినమున్న రెండవ (2) వాక్యములోని
భూమి సత్యమా? లేక మూడవదినమున్న తొమ్మిదవ (9) వాక్యములోని భూమి సత్యమా? ఏది సత్యమను అనుమానము
రాక తప్పదు. ఇటు రెండవ వాక్యము సత్యమైతే, అటు తొమ్మిదవ వాక్యము అసత్యము కావాలి. అట్లుకాక తొమ్మిదవ
వాక్యము సత్యమైతే, రెండవ వాక్యము అసత్యముకావాలి.
రెండవ వాక్యములోనే శూణ్యముగా ఉండెనను మాటకూడ కలదు. శూణ్యము అనగా ఆకాశమనియేగా
అర్థము. గగనమ్ శూణ్యమ్ అనుమాట ప్రకారము శూణ్యమనిన ఆకాశమనిన రెండు ఒక్కటే. మొదటి దినమున
వెలుతురును కూడ సృష్టించకముందే శూణ్యమున్నప్పుడు రెండవదినము దేవుడు ఆకాశమును తయారు చేసెనని
చెప్పడమేమిటి? అని ప్రశ్నరాక తప్పదు. మొదటి దినము చెప్పిన శూణ్యము ఆకాశము కాదా? రెండవ దినము
చేసిన ఆకాశమునకు మొదటిదినమే ఉన్నదని చెప్పిన ఆకాశమునకు ఏమైన తేడా ఉన్నదా? దీని ప్రకారము మొదటి
దినము చెప్పిన ఆకాశము సత్యమా? రెండవదినము చెప్పిన ఆకాశము సత్యమా? ఇది కూడ ఇరుకున పడ్డ విషయమే
కదా!
36

Page 38
ఇకపోతే ఐదవ (5) వాక్యమును చూచినట్లయితే “దేవుడు వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు
పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను” అని ఉన్నది. ఇక్కడ ఉదయమును అస్తమయమును
తీసుకొని చూస్తాము. ఉదయించడము అనగా పుట్టడము అను అర్థము అందరికి తెలుసును. అలాగే అస్తమించడము
అనగా లేకుండపోవడము అనికూడ అందరికి తెలుసు. దీనిప్రకారము పుట్టివచ్చిన కాలమును ఉదయము అని,
పుట్టివచ్చినవాడు లేకుండపోయిన కాలమును అస్తమయమని అంటాము. ప్రతి దినము సూర్యుని పుట్టుక కాలమును
సూర్యోదయమని అలాగే సూర్యుడు కనిపించక పోవు కాలమును సూర్యాస్తమయని అంటున్నాము. కాని ఐదవ (5)
వాక్యము ప్రకారము ఎవరు పుట్టింటే ఉదయమయినది. ఎవరు పోయింటే అస్తమయమయినది అను ప్రశ్న రాకతప్పదు.
అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను అనియు అలాగే రెండవ దినమాయెను, మూడవ దినమాయెను
అని వ్రాయబడియున్నది. సృష్ఠిక్రమములో దేవుడు నాల్గవ దినమున రెండు జ్యోతులైన సూర్యచంద్రులను సృష్టించినట్లు,
మరియు దినము సంవత్సరములను సూచించుటకే రెండు జ్యోతులను తయారుచేసినట్లు పదునాల్గవ (14) వాక్యములో
గలదు. నాల్గవ దినమున సూర్యచంద్రులు తయారు చేయబడి దినముల సంవత్సరముల క్రమము వచ్చియుంటే
మొదటిదినము ఎవరి అస్తమయము ఎవరి ఉదయము ప్రకారము దినమైనదని చెప్పబడినదను ప్రశ్న ఎవరికైనా
రాగలదు. ఒక దినమని, అస్తమయమని, ఉదయమని ఐదవ వాక్యములో ఉండినప్పుడు ఎవరి ప్రమాణముతో దినమైనది?
ఎవరి ప్రమాణముతో అస్తమయమైనది? ఎవరి ప్రమాణముతో ఉదయమైనది ఎవరైనా చెప్పగలరా?
సృష్టిక్రమములో ఐదవ దినమున జీవము కలిగి నీటిలో చలించు చేపలను, భూమిపై ఆకాశములో ఎగురు
పక్షులను దేవుడు తయారు చేసెనని 20, 21, 22 వాక్యములలో గలదు. తర్వాత ఆరవదినమున మొదట జీవముగల
పురుగులను జంతువులను మృగములను తయారు చేసిన తర్వాత మనిషిని తయారు చేశాడని ఉన్నది. మనిషిని
మట్టితో తయారుచేసి నాసికా రంధ్రములలో జీవవాయువునూదగా నరుడు జీవాత్మ ఆయెను అని 2వ అధ్యాయము
7వ వాక్యములో కలదు. ఇప్పుడు మేము అడుగునదేమనగా! ఆరవదినము మనిషిని తయారు చేసిన తర్వాత జీవాత్మ
తయారైనదని చెప్పినప్పుడు, మూడవ దినమున జీవము కలిగి నీటిలో చలించు చేపలను గాలిలో ఎగురు పక్షులను
సృష్ఠించినట్లున్నది కదా! ఆరవదినము కూడ మనిషిని తయారు చేయకముందే జీవముగల జంతువులను, మృగములను,
నేలమీద ప్రాకు పురుగులను దేవుడు తయారు చేశాడని చెప్పారు కదా! దానిప్రకారము మూడవరోజునుండే భూమిమీద
జీవము (జీవాత్మ) ఉన్నట్లే కదా! అటువంటప్పుడు ఆరవదినము మనిషిని చేసినప్పుడు జీవాత్మ ఆయెను అనుట
ఏమిటి? అంతకు ముందు మూడవదినమునుండి తయారైన జీవముగల ప్రాణులన్నీ జీవాత్మలు కావా? ఎవరో
ప్రక్కనుండి దేవుని సృష్ఠిక్రమమునంతటిని చూచి వ్రాసిన అతనికి ముందు పుట్టిన జంతువులు పక్షులు చేపలు జీవాత్మలుగ
కనిపించలేదా? కనిపించకపోతే జీవముగల వాటిని దేవుడు తయారు చేశాడని ఎలా వ్రాశాడు? ప్రతి విషయము
మాకు వివరముగా కావాలనువారికి ఆదికాండములోని మొదటి అధ్యాయము సంశయములేని జ్ఞానమును అందిస్తుందా?
లేక అంతా సంశయములతో కూడుకొన్న సమాచారమును అందిస్తుందా? ఈ విధముగ అడుగుతూపోతే అన్నీ
ప్రశ్నలేమిగులును. ఒక్కదానికి కూడ సరియైన సమాధానము దొరకదు. ఇటువంటి అనుమానములతో కూడిన
సమాచారమున్నదేదైనా పవిత్రమనిపించుకోదు. అందువలన బైబిలుకు పవిత్రత, పరిశుద్ధత క్రొత్త నిబంధనలోని
నాలుగు సువార్తల వలననే వచ్చాయి అనుకోవచ్చును. ఏసుప్రభువు జీవిత పాఠములున్న మత్తయి, మార్కు, లూకా,
యోహాను సువార్తలే బైబిలుకు పరిశుద్ధగ్రంథమని పేరు తెచ్చాయి. ఆ నాలుగు సువార్తలలోని ప్రభువు జ్ఞానముతోనే
బైబిలుగ్రంథమునకు శక్తికూడ ఏర్పడినది. ఏసుప్రభువు చరిత్రయుండుట వలననే దయ్యములు సహితము బైబిలును
37

Page 39
చూస్తే బయపడుచున్నవి. ఇదంతయు చూస్తే ఆదికాండములోని ఆది అధ్యాయము శాస్త్రబద్ధతలేని అబద్దాల పుట్టయని
తెలియుచున్నది. శాస్త్రబద్ధతలేని అధ్యాయములో సృష్టి విధానమున్నది. కావున దేవుడు ఈ విధముగ సృష్టించి
యుండడేమోనని, చెప్పినదంతా అబద్దమని అనుమానము వస్తున్నది.
దేవుడు మానవులకు ఏమిచెప్పిన సత్యవచనములే చెప్పును. అసత్యవచనములనుగానీ, అనుమానమొచ్చు
మాటలనుగానీ, సందిగ్ధములో పడవేయు వాక్యములనుగానీ చెప్పడు. దేవుడు తెలియజేసిన జ్ఞానము మనుషులు
చెప్పిన జ్ఞానముకంటే ఎన్నో రెట్లు గొప్పది. దేవుని జ్ఞానము దేవునికే తెలుసును, మనుషులకు ఎవరికీ తెలియదు.
అందువలన మనుషులకు దేవుని జ్ఞానమును తెలియజేయుటకు దేవుడే మనిషిరూపములో భూమిమీద కనిపించి తన
బోధను చెప్పిపోవును. ఆ విధముగ వచ్చిన మనిషి తాను దేవుడని ఎవరు గుర్తుపట్టనట్లుండి జ్ఞానమును చెప్పిపోవును.
దేవుడు మనిషిగా వచ్చిన సందర్భములు రెండు మాత్రము మాకు తెలిసినవి కలవు. ఆ రెండు మార్లు దేవుడు
మనిషిరూపములో ఉండి చెప్పిన బోధలు చాలా గొప్పవి. అయితే ఆ గొప్పతనము ఏమిటో చాలామంది మనుషులకు
అర్థము కాకుండాపోయినది. దానికి కారణము దేవునిచేత తయారు చేయబడిన మాయయొక్క పనియే అని తెలియుచున్నది.
మాయకు మరికొన్ని పేర్లు గలవు. సాతాన్ అనినా, సైతాన్ అనినా రెండు మాయ యొక్క పేర్లే. దేవుడు భూమిమీద
తన స్వచ్ఛమైన పవిత్రమైన జ్ఞానమును చెప్పిపోతే మాయ దానిని స్వచ్ఛతలేకుండునట్లు, పవిత్రత లేకుండునట్లు, ప్రక్క
మనుషుల మాటలను కలిపి దేవుని జ్ఞానమునకు విలువలేకుండ చేయుచున్నది. అదే పద్ధతి ప్రకారము భగవద్గీతలో
కృష్ణుడు చెప్పిన బోధకు మనుషుల మాటలను కలిపి కొంత అశాస్త్రీయము చేసినది. అలాగే పరిశుద్ధ బైబిలులో
నాలుగు (4) భాగములు దేవుడు చెప్పిన జ్ఞానముంటే అరువది రెండు (62) భాగములు మనుషులచేత చెప్పబడిన
జ్ఞానమున్నది. భగవద్గీతలో ఎవరూ గుర్తించనట్లు అక్కడక్కడ 701 శ్లోకములలో 123 శ్లోకములు మనుషులు చెప్పినవున్నవి.
అందువలన భగవద్గీతకానీ, బైబిలు గానీ ఇంతవరకు చాలామందికి అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుని చేత
చెప్పబడిన జ్ఞానములో కూడ మాయా ప్రభావము కొంత చోటు చేసుకొన్న దానివలన, మాయచేత ఆకర్షితులైన
జనులు ఇటు బైబిలులోగాని అటు భగవద్గీతలోగాని మాయ మాటలనే ముఖ్య జ్ఞానముగ ఎన్నుకొనుచు, దేవుని
మాటలను ప్రక్కకు త్రోయుచున్నారు. మేము ఈ విషయమును గ్రహించి మాయచేత చెప్పించబడిన మనుషుల మాటలకు
విలువ ఇవ్వకుండ దేవుని మాటలకే ఎక్కువ విలువిస్తున్నాము. ఈ మా విధానము ప్రకారము భగవద్గీతలోని
అశాస్త్రీయమైన 123 శ్లోకములను తీసివేశాము. అలాగే బైబిలులోని ఏసుప్రభువు మాటలున్న నాలుగు సువార్తలు
మనిషిని తరింపజేస్తాయనీ, అంతకంటే మించిన జ్ఞానము మిగతా బైబిలులో లేదని చెప్పుచున్నాము. కావున నాలుగు
సువార్తలు తప్ప మిగత వాటిలో అక్కడక్కడ అశాస్త్రీయత కనిపిస్తుందని చెప్పుచున్నాము. భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ
చాలామంది మాయతో కూడుకొన్న వాక్యములనే చెప్పుకొనుచున్నారు. వారంతా నిజమైన దేవుని జ్ఞానము తెలియుటకు
ఉదాహరణగ ఆదికాండము మొదటి అధ్యాయమును నమూనాగా తీసి చూపించాము. అలాగే మేము వ్రాసిన త్రైత
సిద్ధాంత భగవద్గీతలో కూడ ఇవి దేవుడు చెప్పిన శ్లోకములు కావని చెప్పి వాటిని పూర్తిగ గీతనుండి తీసివేయడము
జరిగినది.
మేము క్రైస్తవులతో మాట్లాడితే నాలుగు సువార్తలలోని జ్ఞానమే మాట్లాడుతాము. హిందువులతో మాట్లాడితే
భగవద్గీతలో మేము దేవుని జ్ఞానముగ గుర్తించిన దానినే మాట్లాడుతాము. అయితే మేము మాట్లాడితే ఏ అసూయలేకుండ
క్రైస్తవులు వినగలుగుచున్నారు. చివరకు మాకు గౌరవము నిచ్చుచున్నారు. హిందువుల విషయానికి వచ్చేటప్పటికి
38

Page 40
వారు మాయవైపే ఎక్కువ మొగ్గుచూపుచు మేము చెప్పు జ్ఞానమును లెక్క చేయకున్నారు. భగవద్గీతకే విలువివ్వని
స్థితిలోయుండి మమ్ములను కూడ అగౌరవపరచుచున్నారు. ఇక ముస్లీముల విషయానికి వస్తే మేము చెప్పు మాటలు
బాగానచ్చినవారై సంతోషపడుచు మమ్ములను గొప్ప భావముతో చూస్తున్నారు. మేము ఇంతవరకు క్రైస్తవమతములోను,
హిందూమతము లోను గల జ్ఞానలోపములను చెప్పుతూ వచ్చాము. దేవుడు మాత్రము ఏ మతములోనైన సరియైన
బోధనే చెప్పాడు. ఖండించబడు జ్ఞానముగానీ, అశాస్త్రీయతగలిగిన జ్ఞానమునుగానీ ఎక్కడ చెప్పలేదు. దేవుడు చెప్పనిది
ఏదైనా ఉంటే మేమే దానిని తీసివేసి ఎవరూ ప్రక్కదారి (మాయదారి పట్టకుండ దేవుని మార్గమునే అవలంభించునట్లు
చేయుచున్నాము. దేవుని మార్గమును తెలుపు ప్రయత్నములో మాయకు సంబంధించిన మాటలను, ఇటు బైబిలులోగానీ,
అటు భగవద్గీతలోగానీ ఖండించి చెప్పవలసి వచ్చినదని నిజమైన జిజ్ఞాసులు అర్థము చేసుకుంటారనుకుంటున్నాను.
ఇట్లు
అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ (హిందూ) ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
6
39

Page 41
ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
1) నీ పేరు నీకు తెలుసా? జ॥ నా పేరు జీవుడు.
2) నీవు ఏ ఊరినుండి వచ్చావో తెలుసా? జ॥ దేవుని నుండి.
3) నీవు ఆడనా, మగనా, నపుంసకుడివా తెలుసా? జ॥ నపుంసకుడిని.
4) నీవు ఎవరి ఆధీనములో ఉన్నావో తెలుసా? జ॥ ప్రకృతి.
5) నీకు తండ్రి ఎవరో తెలుసా? జ॥ పరమాత్మ.
6) నీకు తల్లి ఎవరో తెలుసా? జ॥ ప్రకృతి.
7) నీవు గ్రుడ్డివాడివా, కళ్లున్నవానివా తెలుసా? జ॥ గ్రుడ్డివాడిని.
8) నీకు ఆహారమేమిటో తెలుసా? జ॥ జ్ఞానము.
9) నీ ఉద్యోగము ఏదో తెలుసా? జ॥ కర్మయోగము.
10) నీ ఆకారము నీకు తెలుసా? జ॥ తెలియదు. గుండ్రని అకారము.
11) నీకు బలముందో లేదో తెలుసా? జ॥ లేదు. బలము ఆత్మది.
12) నీకు ఆరోగ్యమున్నదా లేదా తెలుసా? జ॥ లేదు. రోగమున్నది.
13) నీకు బుద్ధి ఉన్నదో లేదో తెలుసా? జ॥ లేదు. బుద్ధి ఆత్మది.
14) నీవు ఎక్కడున్నావో తెలుసా? జ॥ జన్మ అను జైలులో.
15) నీవు ఎక్కడికి పోవాలో తెలుసా? జ॥ దేవునివద్దకు.
16) నీకు పెళ్ళి అయిందా తెలుసా? జ॥ కాలేదు. ఎప్పుడు ముక్తి
కల్గితే అప్పుడు పెళ్ళి అవుతుంది.
40

Page 42
"If you only knew the
magnificence of the
3, 6, and 9,
then you would have
a key to the universe.”
“3, 6 మరియు 9 యొక్క విశేషతను
తెలుసుకొంటే విశ్వము గురించి
తెలుసుకోగల అవకాశము కలదు.”
(1)
- నికోలా టెస్లా
6-3=6
(2)
-ఐన్స్టీన్
30
-9
--6
(3)
41

Page 43
మేము ఇంతవరకు 3 69 అను అంకెలను ఆధ్యాత్మిక భావముతో కూడిన అర్థమును తెలియజేస్తూ వచ్చాము.
ఈ చిన్న గ్రంథమును ఆరు సంవత్సరముల క్రితమే వ్రాసియుంచాము. అయితే 3 6 9 ని గురించి మిగతా
శాస్త్రవేత్తలు కూడా వారి భావమును ప్రకటించి యుండడమును రెండు రోజుల క్రితమే చూచాను. గణిత శాస్త్రములో
ఎంతో విజ్ఞానమును సంపాదించుకొన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు 3, 6, 9 ని గురించి వ్రాసియున్న చిత్రపటములను
ఇప్పుడు మీకు చూపుటకు ప్రచురించాము. అవి అన్నియు మేము చెప్పిన దానికి బలమును చేకూర్చునట్లుండుట
వలన, వారు చెప్పిన విషయములను ప్రచురించడము జరిగినది. ఇక్కడ మొదటయున్న శాస్త్రవేత్త పేరు నికోలా టెస్లా
(Nikola Tesla). ఈయన కరెంటును కనుగొన్న వ్యక్తి. ఆయన "3, 6, 9 యొక్క విశేషతను తెలుసుకొంటే విశ్వమును
గురించి తెలుసుకొను అవకాశము గలదు" అని వ్రాసియుండడము ఖగోళశాస్త్రమునకు సంబంధించిన విషయమైనా,
అది బ్రహ్మవిద్యాశాస్త్రమునకు చాలా దగ్గర సంబంధమున్నది. అలాగే ప్రపంచములో పెద్ద సైంటిస్టని పేరుగాంచిన
ఐన్స్టీన్ (Einstein) గణిత శాస్త్రము ప్రకారము 6-3=6 అని వ్రాసిన అంకెలను చూస్తూనే ఆధ్యాత్మికము గుర్తుకు
వచ్చుచున్నది. ఇద్దరు శాస్త్రవేత్తలు వారి భావములలో ఏ అర్థముతో చెప్పినా, మా భావములో దేవుడు విశ్వములో 3,
6, 9 గా యున్నాడనీ, 3, 6, 9 నే జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా చెప్పుచున్నామనీ ఈ గ్రంథములో మొదటనే
చెప్పుకొన్నాము. అదే ప్రకారమే ఇప్పుడు ఈ చిత్ర పటములకు వివరమును చెప్పుకొందాము.
మొదటి చిత్రములోని శాస్త్రవేత్తను గమనించితే ఒక చేతితో వెలుగుచున్న లైటును చూపుచూ మరియొక చేతితో
ఒక వ్రేలిని తలలోని మెదడువైపుకూ, మరియొక వ్రేలిని నోటి వైపుకూ, మూడవ వ్రేలిని శరీరము వైపుకూ చూపుచున్నాడు.
ఆ దినము ఆ వ్యక్తిలో ఆరుగాయున్న రెండవ ఆత్మ ఏ భావమును అందించినదో నాకు తెలియదుగానీ, ఇప్పుడు మనకు
అవసరమైన ఆధ్యాత్మిక భావమునే నాలో ఆరుగా యున్న రెండవ ఆత్మ అందించిన విషయమునే తెలియజేస్తున్నాను.
జీవమున్న శరీరమును వెలుగుచున్న బల్బుతో సమానముగా పోల్చి ఒక చేతితో చూపుచున్నాడు. వెలగని బల్బు జీవము
లేని శరీరములాంటిది. ఒక బల్బు వెలగాలంటే దానికి పాజిటివ్, నెగిటివ్, ఎర్త్ అను మూడు అమరికలుంటాయి.
అలాగే ఒక శరీరము సజీవము కావాలంటే దానిలోపల జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మలుండాలి. ముఖ్యముగా
బల్బు వెలుగుటకు పాజిటివ్, నెగిటివ్ (ధన ధృవము, ఋణధృవము) అను రెండు అమరికలున్నా మూడవ అమరిక ఎర్త్
(భూమి) అను అమరిక తప్పనిసరిగా అనుసంధానమై యుండును. దీనిని గురించి తెలియుటకు ఒక ప్లగ్ సాకెట్ను
చూస్తే బాగా అర్థమగును.
భూమి
(Earth)
ధన ధృవము
(పాజిటివ్)
ఋణ ధృవము
(నెగిటివ్)
42

Page 44
ఒక వెలుగుచున్న బల్బును చూపిన నికోలా టెస్లా సజీవముగాయున్న శరీరములో మూడు ఆత్మలున్నవని
తెల్పుచున్నాడు. అంతేకాక మూడు వ్రేళ్ళను చూపుచూ ఒక దానిని పైకి మెదడువైపుకు, రెండవ దానిని నోటి వైపుకు,
మూడవ దానిని శరీరము వైపుకు చూపుచున్నాడు. ఎవరికీ తెలియకుండా ఆజ్ఞలనిచ్చు మెదడును పరమాత్మ గుర్తుగా,
కదిలి పని చేయుచు మాట్లాడు నోటిని ఆత్మగా, కొంత కాలము పెరిగి ఎప్పటికైనా నశించు శరీరమును జీవాత్మ గుర్తుగా
సూచిస్తూ ఆ విధముగా ఒక వ్రేలిని పైకి, రెండవ వ్రేలిని మధ్యకు, మూడవ వ్రేలిని క్రిందివైపుకు చూపడము జరిగినది.
దీనినిబట్టి వెలుగుచున్న బల్బు (దీపము) లాంటిది సజీవముగా యున్న శరీరమని చూపించునట్లు కలదు. జీవాత్మ,
ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మల విషయము తెలుసుకొంటే జీవముతో కూడుకొన్న ప్రపంచము అనగా విశ్వము
యొక్క వివరము తెలియునని 3, 6, 9 ని చూపించి వీటిని గురించి తెలియగల్గితే ప్రకృతి పరమాత్మతో కూడియున్న
విశ్వమును (ప్రకృతి+ఆత్మలు=విశ్వము) తెలియవచ్చునని నికోలా టెస్లా తెలిపాడు.
ఇక ఐన్స్టీన్ తెలిపిన విషయానికి వస్తే ఆయన 6-3=6 అని వ్రాసియున్నాడు. అలా వ్రాయడమేకాక,
ఒకవైపు చేతితో 6-3ను అండర్ లైన్ చేసి (6-3 కు క్రింద గీత గీచి) చూపుచూ, మరియొక ప్రక్క నోటితో నాలుకను
పూర్తి బయటికి పెట్టి చూపుచున్నాడు. ఈ దృశ్యమంతయూ ఒక వింతగా కనిపించినా, ఆత్మ విషయములో (ఆధ్యాత్మిక
విషయములో) ఎంతో జ్ఞానముతో కూడుకొన్న అర్థము గలదని ఆత్మే తెల్పుచున్నది చూడండి. మనము గ్రంథములో
వ్రాసుకొన్న అర్థము ప్రకారము ఆరు (6) ఆత్మకు గుర్తుయనీ, మూడు (3) జీవాత్మకు గుర్తనీ చెప్పుకొన్నాము. సజీవ
శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మయను మూడు ఆత్మలున్నా పరమాత్మ రూప, నామ, క్రియలు లేనిదై శరీరములో యున్నా
అది లేనట్లే, ఎక్కడా లెక్కించబడదు. శరీరములో తెలియబడునవి ఆత్మ, జీవాత్మ అను రెండే కనుక, ఐన్స్టీన్ ఆరును,
మూడును మాత్రమే చూపాడు. శరీరములో ఆత్మకు జీవాత్మకు రెండిటికి గుర్తుగా నాలుక గలదు. ఒక పనిని
చేసినప్పుడు, ఆ పనిని జీవున్ని అయిన నేను చేసినట్లు మీకు కనిపించినా, దానిని నేను చేయలేదు, నాలోయున్న ఆత్మ
చేసిందని తెలుపు నిమిత్తము, పూర్వము ఒక కార్యమును చేసిన వ్యక్తి అది తనకు సంబంధము లేదని అర్థమగునట్లు
నాలుకను బయటికి పెట్టి చూపెడివారు. ప్రస్తుత కాలములో కర్మయోగ సారాంశమును తెలియజేయు నాలుకను
బయటికి చూపు విధానము ఎవరికీ తెలియకుండా పోయినది. అయినా నా మాటకు సాక్ష్యము నేటికీ కొన్ని చోట్లగలదనీ,
దానిప్రకారమే అమెరికా రెజ్లింగ్ కింగ్ అయిన అండర్టేకర్ తాను మ్యాచ్ గెలిచినప్పుడంతా గెలిచినది నేను కాదు,
ఆత్మశక్తి వలననే గెలువడము జరిగినదని తెలియునట్లు, మ్యాచ్ అయిపోయిన తర్వాత మోకాళ్ళమీద కూర్చొని తన
నాలుకను పూర్తి బయటికి పెట్టి చూపడము జరుగుచున్నది. మీకు అర్థము కావాలంటే ఇంటర్
నెట్లో అండర్ కర్
గెలిచిన మ్యాచ్లను చూడవచ్చును. నాలుక మనిషి అల్లాడిస్తే అల్లాడుచున్నది. అలాగే మనిషి కదిలించకున్నా కదలుచున్నది.
మనిషి అనుకొన్నప్పుడు అల్లాడిస్తే అల్లాడు నాలుక, ఎటు కదిలిస్తే అటు కదలు నాలుక, మిగతా సమయములలో
మనిషికి తెలియకుండా, మనిషి ప్రమేయము లేకుండా దానంతకదే కదలుచున్నట్లు కనిపించుచున్నది. అలా మనిషి
ప్రమేయము లేకుండా కదలుటకు కారణము మనకు తెలియకుండా శరీరములోనున్న ఆత్మేనని తెలియుచున్నది. ఆత్మ
తన శక్తితో నాలుకను పళ్ళ మధ్యలో వేగముగా కదిలించుచూ తన శక్తికి సాక్ష్యము నిచ్చుచున్నది. అందువలన మనిషి
ప్రమేయముతో కదలు నాలుక జీవాత్మకు గుర్తనీ, మనిషి ప్రమేయము లేకుండా, జీవునికి తెలియకుండా కదలు నాలుక
ఆత్మకు గుర్తనీ తెలియ వచ్చును. ఇటు జీవునికీ అటు ఆత్మకూ రెండిటికీ గుర్తు అయిన నాలుకను ఐన్స్టీన్ చూపుచూ,
జీవాత్మకు, ఆత్మకు గుర్తయిన మూడు ఆరునే అండర్లైన్ చేసి చూపాడు. మనిషి శరీరములో జీవునికి తెలిసి పని
జరిగినప్పుడు ఉపయోగపడు శక్తి ఆత్మశక్తేననీ, జీవునికి తెలియకుండా జరుగునప్పుడు కూడా ఉపయోగపడు శక్తి
43

Page 45
ఆత్మశక్తేననీ, అందరికీ తెలియునట్లు ఆత్మ గుర్తయిన ఆరులో మూడును తీసివేసినా, అరే వున్నదని 6-3-6 అని
చూపడము జరిగినది.
ఇక మూడవ చిత్రములో తెలుపులో నల్లని గుర్తుగా మూడును, నలుపులో తెల్లని గుర్తుగా ఆరును చూపడము
జరిగినది. శరీరములో జీవాత్మ (3), ఆత్మ (6) రెండూ వేరువేరుగాయున్నా రెండిటిలో పరమాత్మ కలిసి అణువణువున
శరీరమంతా వ్యాపించియున్నదని తెలియునట్లు, తెలుపు నలుపు రెండు రంగులు కలిసిన లేత తెలుపు, లేత నలుపు
రంగు గీతను మూడుకు ఆరుకు మధ్యలోనూ, మూడుకు ఆరుకు చుట్టూనూయున్నట్లు చూపడము జరిగినది.
చూపడమేకాక గీతగాయున్న నలుపు తెలుపు కలిసియున్న లేత రంగు గీతను తొమ్మిది (9)గా గుర్తించి చూపడము
జరిగినది. ఆ దినము వారు ఏ భావముతో చూపినా, ఈ దినము ఆత్మ తన జ్ఞానము తెలియునట్లు ఆ బొమ్మలకు పూర్తి
వివరమును ఇచ్చినది.
9
8
1
7
0
2
6
5
4
3
8
1
2
6
3
5
4
44

Page 46
7
8
9
6
LO
360°
4
45
2
3
360°
(3+6+0=9)

Page 47
180°
90°
46
180°
(1+8+0=9)
90°
(9+0=9)

Page 48
45°
47
45°
(4+5=9)
22.5°
22.5°
(2+2+5=9)

Page 49
48
11.25°
11.25°
(1+1+2+5=9)
5.625°
5.625°
(5+6+2+5=18)
(1+8=9)

Page 50
60°
60°
150°
60°
90°
90°
60°
X 3
180°
(1+8+0=9)
90°
X
4
360°
90°
90°
(3+6+0=9)
49

Page 51
108°
108°
108°
/108°
120°
120°
108°
108°
X 5
540°
(5+4+0=9)
120°
120°
120° 120°
50
120°
X 6
720°
(7+2+0=9)

Page 52
135°
135°
135°
135°
135°
135°
140°
140°
140°
135°
135°
X 8
135°
1080°
(1+0+8+0=9)
140°
140°
140°
X
9
1260°
140°
140°
(1+2+6+0=9)
140° 140°
51

Page 53
144°
144
144°
144
144°
144°
144°
10
1440°
144
144°
(1+4+4+0=9)
144°
144
Paradoxically,
Nine plus any digit
returns the same digit.
i.e. 9+5=14 (1+4=5)
The sum of all digits
excluding nine is 36.
1+2+3+4+5+6+7+8=36
(3+6=9)
52

Page 54
7
14
21-3
28-
.9
35.
1-9
.9
+3
42-6
493
32-
56
63-9
3-3
6-6
176 73.
9-9
181613
24-6
321-9
40
48-3.
561.16
64-
72-9
12-3
916-9
20-
24-6
28
36-9
10
357
51
15-6
-6
201-9
8
.9
.9
25
10
30-3-
12
14
6
40-
16
45-9
18-9
9
53

---


-----
Page 1
ఖుర్ఆన్-హదీసు
ఏది ముఖ్యము?
ఖుర్ఆన్
హదీసు
రచయిత: త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త
ఇందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
www.thraithashakam.org
H

Page 2
ॐ
ఖుర్ఆన్-హదీసు
ఏది ముఖ్యము?
రచయిత : త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, 97వ గ్రంథకర్త
ఇందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
కాల
కర్మ
గుణ
ఇందూ
చక్రం
చక్రం
చక్రం
చక్రం
- బ్రహ్మనాడి
జ్ఞాన వేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞానవేదిక
(Estd. in 1978 - Regd. No.: 168/2004)
త్రైత శకము-40
ప్రథమ ముద్రణ : జూలై-2018
ప్రతులు : 1000 వెల : 70/-
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక రచనలు
02
“ఇందూ జ్ఞానవేదిక” ప్రచురణలు
01) త్రైత సిద్ధాంత భగవద్గీత.
02) ఇందూ సాంప్రదాయములు.
03) ఇందుత్వమును కాపాడుదాం.
04) ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
05) హిందూమతములో కులవివక్ష.
06) తిట్ల జ్ఞానము-దీవెనల అజ్ఞానము.
07) శ్రీకృష్ణుడు దేవుడా! భగవంతుడా!!
08) యజ్ఞములు (నిజమా అబద్ధమా?).
09) ఏ మతములో ఎంత మతద్వేషము?
10) హిందూ మతములో సిద్ధాంతకర్తలు.
11) దైవగ్రంథములో సత్యాసత్య విచక్షణ.
12) దేవుని రాకకు ఇది సమయము కాదా!
13) మూడు గ్రంథములు, ఇద్దరు గురువులు.
14) దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు.
15) ప్రతిమ × విగ్రహ-దైవము X దైయ్యము.
16) త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా).
17) హేతువాద ప్రశ్నలు- సత్యవాద జవాబులు.
18) జ్యోతిష్యశాస్త్రము (శాస్త్రమా-అశాస్త్రమా?).
19) మంత్రము-మహిమ (నిజమా అబద్దమా?).
20) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
21) మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?).
22) కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు).
23) కృష్ణ మూస (శ్రీకృష్ణ మరణము తర్వాత జీవితము)
24) స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!!
25) మూడు దైవ గ్రంథములు-మూడు ప్రథమ వాక్యములు.

Page 3
ॐ
ఖుర్ఆన్-హదీసు
ఏది ముఖ్యము?
రచయిత : త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, 97వ గ్రంథకర్త
ఇందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
కాల
కర్మ
గుణ
ఇందూ
చక్రం
చక్రం
చక్రం
చక్రం
- బ్రహ్మనాడి
జ్ఞాన వేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞానవేదిక
(Estd. in 1978 - Regd. No.: 168/2004)
త్రైత శకము-40
ప్రథమ ముద్రణ : జూలై-2018
ప్రతులు : 1000 వెల : 70/-
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక రచనలు
02
“ఇందూ జ్ఞానవేదిక” ప్రచురణలు
01) త్రైత సిద్ధాంత భగవద్గీత.
02) ఇందూ సాంప్రదాయములు.
03) ఇందుత్వమును కాపాడుదాం.
04) ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
05) హిందూమతములో కులవివక్ష.
06) తిట్ల జ్ఞానము-దీవెనల అజ్ఞానము.
07) శ్రీకృష్ణుడు దేవుడా! భగవంతుడా!!
08) యజ్ఞములు (నిజమా అబద్ధమా?).
09) ఏ మతములో ఎంత మతద్వేషము?
10) హిందూ మతములో సిద్ధాంతకర్తలు.
11) దైవగ్రంథములో సత్యాసత్య విచక్షణ.
12) దేవుని రాకకు ఇది సమయము కాదా!
13) మూడు గ్రంథములు, ఇద్దరు గురువులు.
14) దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు.
15) ప్రతిమ × విగ్రహ-దైవము X దైయ్యము.
16) త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా).
17) హేతువాద ప్రశ్నలు- సత్యవాద జవాబులు.
18) జ్యోతిష్యశాస్త్రము (శాస్త్రమా-అశాస్త్రమా?).
19) మంత్రము-మహిమ (నిజమా అబద్దమా?).
20) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
21) మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?).
22) కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు).
23) కృష్ణ మూస (శ్రీకృష్ణ మరణము తర్వాత జీవితము)
24) స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!!
25) మూడు దైవ గ్రంథములు-మూడు ప్రథమ వాక్యములు.

Page 4
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక రచనలు
“ఇందూ జ్ఞానవేదిక” ప్రచురణలు
26) తీర్పు - దేవుని తీర్పు.
27) గుత్తా.
28) ప్రబోధ
51) దేవుని చిహ్నము.
52) మతము-పథము.
03
04
76)
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక రచనలు
“ఇందూ జ్ఞానవేదిక” ప్రచురణలు
నాది లోచన-నీది ఆలోచన
77)
ద్యానము-ప్రార్థన-నమాజ్.
78)
సాయిబాబా దేవుడా! కాదా?
53) ద్రావిడ బ్రాహ్మణ.
79)
లు అంటే ఏమిటి? (తెలుగు)
29) సుబోధ.
30) ఆదిత్య.
54) ప్రవక్తలు ఎవరు?
80) చెట్టుముందా! విత్తుముందా?
55) ధర్మశాస్త్రము ఏది?
81)
గీతం-గీత (పాటల జ్ఞానము).
31) సమాధి.
56) దేవుని గుర్తు-963.
82)
మరణము తర్వాత జీవితము.
32) తల్లి తండ్రి.
57) ఇందువు క్రైస్తవుడా?
83)
ప్రథమ దైవగ్రంథము భగవద్గీత.
33) గీటురాయి.
58) నాస్తికులు ఆస్తికులు.
84)
దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది.
34) త్రైతారాధన.
35) ధర్మచక్రము
36) ప్రసిద్ది బోధ.
37) కర్మ పత్రము.
59) ప్రబోధ తరంగాలు.
60) గీతా పరిచయము
61) త్రైత సిద్ధాంతము.
62) వార్తకుడు-వర్తకుడు.
85) అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.
86)
87)
88)
89)
38) నీకు నా లేఖ.
63) ధర్మము-అధర్మము.
90)
39) ఒక్కడే ఇద్దరు.
64) తత్త్వముల జ్ఞానము.
91)
65) మరణ రహస్యము.
40) దేవుని ముద్ర
41) భావము-భాష
42) కథల జ్ఞానము.
43) సత్యాన్వేషి కథ.
66) పునర్జన్మ రహస్యము.
67) గురు ప్రార్థనామంజరి.
68) సామెతల జ్ఞానము.
92)
ఒక మాట మూడు గ్రంథములు.
త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు.
ఏసు చనిపోయాడా? చంపబడ్డాడా?
ఏది సత్యము-ఏది అసత్యము.
ఒక వ్యక్తి రెండు కోణములు.
అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు.
బ్రహ్మ-రావణబ్రహ్మ-భగవాన్ రావణబ్రహ్మ.
93) ద్వితీయ దైవగ్రంథములో రత్న వాక్యములు.
96) ఉపనిషత్తులలో లోపాలు.
94)
హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?
95)
వేదములు మనిషికి అవసరమా?
44) సిలువ దేవుడా?
69) పొడుపు కథల జ్ఞానము.
97)
ఖుర్ఆన్, హదీసు ఏది ముఖ్యము.
45) ఆత్మలింగార్థము.
70) ఏది నిజమైన జ్ఞానము?
98)
సుప్రసిద్ధి బోధ.
46) ప్రాథమిక జ్ఞానము.
71) నిగూఢ తత్త్వార్థ బోధిని.
99)
సిద్ది బోధ.
47) విశ్వ విద్యాలయము
48) జీహాద్ అంటే యుద్ధమా?
49) జనన మరణ సిద్ధాంతము.
50) మతాతీత దేవుని మార్గము.
72) దేవాలయ రహస్యములు
73) ప్రబోధానందం నాటికలు.
74) హేతువాదము-ప్రతివాదము.
75) మత మార్పిడి దైవద్రోహము.
100) సత్యార్థ ప్రకాశికలో సత్యమెంత.
101) రూపము మారిన గీత.
102) సున్న.
103) తత్వార్థ బొమ్మల జ్ఞానము.

Page 5
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక రచనలు
“ఇందూ జ్ఞానవేదిక” ప్రచురణలు
26) తీర్పు - దేవుని తీర్పు.
27) గుత్తా.
28) ప్రబోధ
51) దేవుని చిహ్నము.
52) మతము-పథము.
03
04
76)
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక రచనలు
“ఇందూ జ్ఞానవేదిక” ప్రచురణలు
నాది లోచన-నీది ఆలోచన
77)
ద్యానము-ప్రార్థన-నమాజ్.
78)
సాయిబాబా దేవుడా! కాదా?
53) ద్రావిడ బ్రాహ్మణ.
79)
లు అంటే ఏమిటి? (తెలుగు)
29) సుబోధ.
30) ఆదిత్య.
54) ప్రవక్తలు ఎవరు?
80) చెట్టుముందా! విత్తుముందా?
55) ధర్మశాస్త్రము ఏది?
81)
గీతం-గీత (పాటల జ్ఞానము).
31) సమాధి.
56) దేవుని గుర్తు-963.
82)
మరణము తర్వాత జీవితము.
32) తల్లి తండ్రి.
57) ఇందువు క్రైస్తవుడా?
83)
ప్రథమ దైవగ్రంథము భగవద్గీత.
33) గీటురాయి.
58) నాస్తికులు ఆస్తికులు.
84)
దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది.
34) త్రైతారాధన.
35) ధర్మచక్రము
36) ప్రసిద్ది బోధ.
37) కర్మ పత్రము.
59) ప్రబోధ తరంగాలు.
60) గీతా పరిచయము
61) త్రైత సిద్ధాంతము.
62) వార్తకుడు-వర్తకుడు.
85) అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.
86)
87)
88)
89)
38) నీకు నా లేఖ.
63) ధర్మము-అధర్మము.
90)
39) ఒక్కడే ఇద్దరు.
64) తత్త్వముల జ్ఞానము.
91)
65) మరణ రహస్యము.
40) దేవుని ముద్ర
41) భావము-భాష
42) కథల జ్ఞానము.
43) సత్యాన్వేషి కథ.
66) పునర్జన్మ రహస్యము.
67) గురు ప్రార్థనామంజరి.
68) సామెతల జ్ఞానము.
92)
ఒక మాట మూడు గ్రంథములు.
త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు.
ఏసు చనిపోయాడా? చంపబడ్డాడా?
ఏది సత్యము-ఏది అసత్యము.
ఒక వ్యక్తి రెండు కోణములు.
అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు.
బ్రహ్మ-రావణబ్రహ్మ-భగవాన్ రావణబ్రహ్మ.
93) ద్వితీయ దైవగ్రంథములో రత్న వాక్యములు.
96) ఉపనిషత్తులలో లోపాలు.
94)
హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?
95)
వేదములు మనిషికి అవసరమా?
44) సిలువ దేవుడా?
69) పొడుపు కథల జ్ఞానము.
97)
ఖుర్ఆన్, హదీసు ఏది ముఖ్యము.
45) ఆత్మలింగార్థము.
70) ఏది నిజమైన జ్ఞానము?
98)
సుప్రసిద్ధి బోధ.
46) ప్రాథమిక జ్ఞానము.
71) నిగూఢ తత్త్వార్థ బోధిని.
99)
సిద్ది బోధ.
47) విశ్వ విద్యాలయము
48) జీహాద్ అంటే యుద్ధమా?
49) జనన మరణ సిద్ధాంతము.
50) మతాతీత దేవుని మార్గము.
72) దేవాలయ రహస్యములు
73) ప్రబోధానందం నాటికలు.
74) హేతువాదము-ప్రతివాదము.
75) మత మార్పిడి దైవద్రోహము.
100) సత్యార్థ ప్రకాశికలో సత్యమెంత.
101) రూపము మారిన గీత.
102) సున్న.
103) తత్వార్థ బొమ్మల జ్ఞానము.

Page 6
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక ప్రసంగములు
(DVD'S)
05
06
27. ఆత్మ.
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక ప్రసంగములు
01. గుర్తింపబడనివాడు గురువు.
02. పుట్టినరోజు ఎవ్వరికీ రాదు.
03. ద్వితీయుడు-అద్వితీయుడు.
04. ఏక్ నిరంజన్ - అలక్ నిరంజన్.
05. మాయకుడు-అమాయకుడు.
(DVD'S)
06. తల్లి తండ్రి - గురువు దైవము.
07. గురువులేని విద్య గ్రుడ్డివిద్య.
08. మతములలో పవిత్రయుద్ధము.
09. ప్రపంచ శ్రద్ధ-పరమాత్మ శ్రద్ధ.
10. దేశం మోసం దేహం మోహం.
11. ఎదమీదముద్ర-తల్లి తండ్రి గుర్తు.
12. మూడు పుట్టుకలు-రెండు జాగాలు.
13. యోగీశ్వరుల జన్మదిన సందేశము.
14. తెలుగులో మూడు-ఆరు-తొమ్మిది.
15. మాయ మర్మము- ఆత్మ ధర్మము.
16. బయటి సమాజం లోపలి సమాజం.
17. దేవుని జ్ఞానము-మాయ మహత్యము.
18. మూడు నిర్మాణాలు-ఒక పరిశుభ్రత.
19. సహజ మరణం తాత్కాలిక మరణం.
20. మేఘం ఒకభూతం- రోగం ఒకభూతం.
21. కర్మ లేని కృష్ణుడు-కర్మ ఉన్న కృష్ణుడు.
22. స్వార్థ రాజకీయం (స్వ+అర్థ రాజకీయం).
23. శ్రీకృష్ణుడు చనిపోయాడా? చంపబడ్డాడా?
24. అంతిమ గ్రంథములో ప్రథమ వాక్యములు.
28. తాత.
55. భగవంతుడు.
56. ఏది ధర్మము?
29. తల్లి.
30. భయం.
31. ఆత్మపని.
32. బట్టతల.
33. యాదవ్.
34. జ్ఞానశక్తి.
35. సమాధి.
36. 6-3=6.
37. సంతకము.
38. ప్రభు-ప్రజ.
39. త్రైతశకము.
40. తోలేవాడు.
41. తల్లి తండ్రి.
42. నటించే ఆత్మ.
57. గురుపౌర్ణమి.
58. శ్రీకృష్ణాష్టమి.
59. గోరు-గురు.
60. దశ-దిశలు.
61. మాట-మందు.
52. సృష్ఠి - సృష్ఠికర్త.
63. కలియుగము.
64. సేవా శాతము.
65. ప్రకృతి-వికృతి.
66. పైత్యం-సైత్యం.
67. నైజం-సహజం.
68. భక్తి-భయము.
69. సాంప్రదాయము.
70. అదురు బెదురు.
43. సంచిత కర్మ.
71. నీ వెనుక వాడు.
44. గురు చిహ్నం.
45. ఆస్తి-దోస్తి.
46. వెలుగుబంటు.
47. ధర్మచక్రము.
48. దైవగ్రంథము.
49. భక్తి-శ్రద్ధలు.
50. పురుషోత్తమ.
51. మతద్వేషము.
52. గ్రాహిత శక్తి
72. శవము-శివము.
73. శైవము-వైష్ణవము.
74. ధర్మము-అధర్మము.
75. ద్రావిడులు-ఆర్యులు.
76. కాయ-పండు-కాయ.
77. యుగము-యోగము.
78. దేవునికి మతమున్నదా?
79. కర్మ మర్మము.
80. పుట్టుట-గిట్టుట.
81. ఏకత-ఏకాగ్రత.
25. ఇచ్ఛాధీన కార్యములు-అనిచ్ఛాధీన కార్యములు.
53. ఆడించే ఆత్మ.
26. టక్కుటమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ.
54. ఏది శాస్త్రము?

Page 7
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక ప్రసంగములు
(DVD'S)
05
06
27. ఆత్మ.
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక ప్రసంగములు
01. గుర్తింపబడనివాడు గురువు.
02. పుట్టినరోజు ఎవ్వరికీ రాదు.
03. ద్వితీయుడు-అద్వితీయుడు.
04. ఏక్ నిరంజన్ - అలక్ నిరంజన్.
05. మాయకుడు-అమాయకుడు.
(DVD'S)
06. తల్లి తండ్రి - గురువు దైవము.
07. గురువులేని విద్య గ్రుడ్డివిద్య.
08. మతములలో పవిత్రయుద్ధము.
09. ప్రపంచ శ్రద్ధ-పరమాత్మ శ్రద్ధ.
10. దేశం మోసం దేహం మోహం.
11. ఎదమీదముద్ర-తల్లి తండ్రి గుర్తు.
12. మూడు పుట్టుకలు-రెండు జాగాలు.
13. యోగీశ్వరుల జన్మదిన సందేశము.
14. తెలుగులో మూడు-ఆరు-తొమ్మిది.
15. మాయ మర్మము- ఆత్మ ధర్మము.
16. బయటి సమాజం లోపలి సమాజం.
17. దేవుని జ్ఞానము-మాయ మహత్యము.
18. మూడు నిర్మాణాలు-ఒక పరిశుభ్రత.
19. సహజ మరణం తాత్కాలిక మరణం.
20. మేఘం ఒకభూతం- రోగం ఒకభూతం.
21. కర్మ లేని కృష్ణుడు-కర్మ ఉన్న కృష్ణుడు.
22. స్వార్థ రాజకీయం (స్వ+అర్థ రాజకీయం).
23. శ్రీకృష్ణుడు చనిపోయాడా? చంపబడ్డాడా?
24. అంతిమ గ్రంథములో ప్రథమ వాక్యములు.
28. తాత.
55. భగవంతుడు.
56. ఏది ధర్మము?
29. తల్లి.
30. భయం.
31. ఆత్మపని.
32. బట్టతల.
33. యాదవ్.
34. జ్ఞానశక్తి.
35. సమాధి.
36. 6-3=6.
37. సంతకము.
38. ప్రభు-ప్రజ.
39. త్రైతశకము.
40. తోలేవాడు.
41. తల్లి తండ్రి.
42. నటించే ఆత్మ.
57. గురుపౌర్ణమి.
58. శ్రీకృష్ణాష్టమి.
59. గోరు-గురు.
60. దశ-దిశలు.
61. మాట-మందు.
52. సృష్ఠి - సృష్ఠికర్త.
63. కలియుగము.
64. సేవా శాతము.
65. ప్రకృతి-వికృతి.
66. పైత్యం-సైత్యం.
67. నైజం-సహజం.
68. భక్తి-భయము.
69. సాంప్రదాయము.
70. అదురు బెదురు.
43. సంచిత కర్మ.
71. నీ వెనుక వాడు.
44. గురు చిహ్నం.
45. ఆస్తి-దోస్తి.
46. వెలుగుబంటు.
47. ధర్మచక్రము.
48. దైవగ్రంథము.
49. భక్తి-శ్రద్ధలు.
50. పురుషోత్తమ.
51. మతద్వేషము.
52. గ్రాహిత శక్తి
72. శవము-శివము.
73. శైవము-వైష్ణవము.
74. ధర్మము-అధర్మము.
75. ద్రావిడులు-ఆర్యులు.
76. కాయ-పండు-కాయ.
77. యుగము-యోగము.
78. దేవునికి మతమున్నదా?
79. కర్మ మర్మము.
80. పుట్టుట-గిట్టుట.
81. ఏకత-ఏకాగ్రత.
25. ఇచ్ఛాధీన కార్యములు-అనిచ్ఛాధీన కార్యములు.
53. ఆడించే ఆత్మ.
26. టక్కుటమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ.
54. ఏది శాస్త్రము?

Page 8
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక ప్రసంగములు
82. చమత్కార ఆత్మ.
83. నిదర్శ - నిరూప.
84. గురువు ఎవరు?
85. త్రైత సిద్ధాంతము.
86. స్త్రీ / పు - లింగము.
87. జీర్ణ+ఆశయము.
88. శ్రీకృష్ణుడు ఎవరు?
89. ఆట-దోబూచులాట.
90. ప్రజలు-మానవులు.
91. దంతము-అంతము.
92. మతము-పథము.
93. ఏడు ఆకాశములు.
94. అర్థము-అపార్థము.
95. మూడు గ్రంథములు.
96. గ్రంథము - బోధ.
97 ప్రభువు - ప్రభుత్వం.
98. జ్ఞానము-విజ్ఞానము.
99. వార-మాస-వత్సర.
100. భూతం-మహాభూతం.
101. సేకూవలి-కూలిసేవా.
102. ఆత్మకు వెంట్రుక గుర్తు.
(DVD'S)
112. మరణము-శరీరము.
113. దివ్యఖురాన్-హదీసు.
114. ఇందువు-హిందువు.
115. సుఖము-ఆనందము.
116. కాలజ్ఞాన వాక్యములు.
117. భౌతికము-అభౌతికము.
118. దేవుని ఆజ్ఞ-మరణము.
119. జ్ఞానము దగ్గర జాగ్రత్త!
120. చంద్రాకారము (బట్టతల).
121. జ్ఞానము కబ్జా అయ్యింది!
122. దేవుడు ఇద్దరా! ఒక్కరా!!
123. మత సామరస్యం.
124. మోక్షము-మోసము.
125. అక్షర జ్ఞానము.
126. లలా జలము.
ఇందూ జ్ఞానవేదిక ఆధ్యాత్మిక ప్రచురణలు లభించు చిరునామా
07
08
127. దైవ ధర్మములు-మత సాంప్రదాయములు
128. ఆహారము నీకా! నీ ఆత్మకా!!
129. మాత్ర-మందు.
130. కాలచక్రం.
131. బ్రహ్మవిద్య.
132. శక్తి.
103. కోడిపుంజు-పాదరసము. 133. పౌర్ణమి-అమావాస్య.
104. ఇందూ మహాసముద్రము.
105. శ్రీకృష్ణజన్మ మధుర.
106. అధర్మ ఆరాధనలు.
107. పుస్తకము-గ్రంథము.
108. హరికాలు-హరచేయి.
109. పుట్టగోసి మొలత్రాడు.
110. 1 2 3 గురుపౌర్ణమి.
111. క్షమించరాని పాపము.
134. ఈశ్వర పరమేశ్వర.
135. పురుషోత్తమ-శ్రీరామ.
136. దేవునికి ఒక్కడే కుమారుడు-
దేవునికి అనేకమంది కుమారులు.
137. జలం.
138. అధిపతి.
139. గ్రహంతర వాసులు.
140. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
ప్రబోధాశ్రమము (శ్రీకృష్ణమందిరము)
చిన్నపొడమల (గ్రా), తాడిపత్రి (మం), అనంతపురం (జిల్లా) A.P.
Cell: 98665 12667, 99516 75081, 94903 63038.
ఇందూ జ్ఞానవేదిక శాఖ
అనంతపురము టౌన్, A.P.
Cell : 97059 59390, 99855 80099
కె.లక్ష్మీనారాయణాచారి (ప్రెసిడెంట్)
ధర్మవరం, అనంతపురం (జిల్లా),
Cell: 94405 56968, 92900 12413, 94406 01136
టి. సూర్యనారాయణ (సూర్య మీ సేవా)
పామిడి, గుత్తిరోడ్, అనంతపురం జిల్లా
Cell : 9885250967
ఇందూ ధరణి జనరల్ స్టోర్స్
(పి.శివరామ్ ప్రసాద్)
పామిడి, గుత్తిరోడ్, అనంతపురం జిల్లా
Cell: 9030057963, 9063504963
బి. ఆదిశేషయ్య (టీచర్) (ప్రెసిడెంట్)
ప్రబోధాశ్రమము, తాడిపత్రి (మం)
Cell: 9491362448, 7382986963.
పి. ఆదినారాయణ (ప్ర.సభ్యుడు)
ముద్దిరెడ్డి పల్లి (గ్రా॥), అనంతపురం (జిల్లా).
Cell: 9440745800, 7259851861.
ఎ. నాగేంద్ర (ప్రెసిడెంట్)
క్రొత్త చెరువు (గ్రా, మం)
అనంతపురం జిల్లా. Cell:9493622669
9959316410, 9949995090.
పి. నాగయ్య (ప్ర.సభ్యుడు)
వీకర్ సెక్షన్ కాలనీ, కర్నూలు టౌన్
Cell : 9440244598, 9849303902
ఇందూ జ్ఞానవేదిక (Head Office)
చైతన్యపురి, దిల్సుఖ్నగర్,
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం,
Cell:94910 40963, 90329 63963, 98485 90172.
డి. గోపికృష్ణ
హుజురాబాద్, కరీంనగర్ జిల్లా, T.S
Cell : 9989202003, 9542061601
కె.వెంకటేశ్వర్లు (ప్ర.సభ్యుడు)
నందికొట్కూరు, కర్నూలు జిల్లా
Cell: 9440047256, 9701956599
కె. అశోక్ బాబు (టీచర్) (ప్రెసిడెంట్)
రామాపురం (గ్రా), వి.కోట (మం).
చిత్తూరు జిల్లా. Cell : 9440305700
వి. రామక్రిష్ణన్ (వైస్ ప్రెసిడెంట్)
కుప్పం, చిత్తూరు జిల్లా. Cell : 9652755110
డి. బాలాజీ (వైస్ ప్రెసిడెంట్)
బంగారు పాళ్యం (గ్రా), చిత్తూరు జిల్లా.
Cell: 9985483241, 7396077408.
బాలం లక్ష్మీనరసింహులు (ప్రెసిడెంట్)
మదనపల్లి, చిత్తూరు జిల్లా.
Cell: 9440825533, 8519938999.
టి.వి.రమణ (ప్రెసిడెంట్)
ముదిగుబ్బ (గ్రా) అనంతపురం జిల్లా
Cell: 9440980036, 07406039453.

Page 9
యోగీశ్వరుల వారి సంచలనాత్మక త్రిమత ఆధ్యాత్మిక ప్రసంగములు
82. చమత్కార ఆత్మ.
83. నిదర్శ - నిరూప.
84. గురువు ఎవరు?
85. త్రైత సిద్ధాంతము.
86. స్త్రీ / పు - లింగము.
87. జీర్ణ+ఆశయము.
88. శ్రీకృష్ణుడు ఎవరు?
89. ఆట-దోబూచులాట.
90. ప్రజలు-మానవులు.
91. దంతము-అంతము.
92. మతము-పథము.
93. ఏడు ఆకాశములు.
94. అర్థము-అపార్థము.
95. మూడు గ్రంథములు.
96. గ్రంథము - బోధ.
97 ప్రభువు - ప్రభుత్వం.
98. జ్ఞానము-విజ్ఞానము.
99. వార-మాస-వత్సర.
100. భూతం-మహాభూతం.
101. సేకూవలి-కూలిసేవా.
102. ఆత్మకు వెంట్రుక గుర్తు.
(DVD'S)
112. మరణము-శరీరము.
113. దివ్యఖురాన్-హదీసు.
114. ఇందువు-హిందువు.
115. సుఖము-ఆనందము.
116. కాలజ్ఞాన వాక్యములు.
117. భౌతికము-అభౌతికము.
118. దేవుని ఆజ్ఞ-మరణము.
119. జ్ఞానము దగ్గర జాగ్రత్త!
120. చంద్రాకారము (బట్టతల).
121. జ్ఞానము కబ్జా అయ్యింది!
122. దేవుడు ఇద్దరా! ఒక్కరా!!
123. మత సామరస్యం.
124. మోక్షము-మోసము.
125. అక్షర జ్ఞానము.
126. లలా జలము.
ఇందూ జ్ఞానవేదిక ఆధ్యాత్మిక ప్రచురణలు లభించు చిరునామా
07
08
127. దైవ ధర్మములు-మత సాంప్రదాయములు
128. ఆహారము నీకా! నీ ఆత్మకా!!
129. మాత్ర-మందు.
130. కాలచక్రం.
131. బ్రహ్మవిద్య.
132. శక్తి.
103. కోడిపుంజు-పాదరసము. 133. పౌర్ణమి-అమావాస్య.
104. ఇందూ మహాసముద్రము.
105. శ్రీకృష్ణజన్మ మధుర.
106. అధర్మ ఆరాధనలు.
107. పుస్తకము-గ్రంథము.
108. హరికాలు-హరచేయి.
109. పుట్టగోసి మొలత్రాడు.
110. 1 2 3 గురుపౌర్ణమి.
111. క్షమించరాని పాపము.
134. ఈశ్వర పరమేశ్వర.
135. పురుషోత్తమ-శ్రీరామ.
136. దేవునికి ఒక్కడే కుమారుడు-
దేవునికి అనేకమంది కుమారులు.
137. జలం.
138. అధిపతి.
139. గ్రహంతర వాసులు.
140. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
ప్రబోధాశ్రమము (శ్రీకృష్ణమందిరము)
చిన్నపొడమల (గ్రా), తాడిపత్రి (మం), అనంతపురం (జిల్లా) A.P.
Cell: 98665 12667, 99516 75081, 94903 63038.
ఇందూ జ్ఞానవేదిక శాఖ
అనంతపురము టౌన్, A.P.
Cell : 97059 59390, 99855 80099
కె.లక్ష్మీనారాయణాచారి (ప్రెసిడెంట్)
ధర్మవరం, అనంతపురం (జిల్లా),
Cell: 94405 56968, 92900 12413, 94406 01136
టి. సూర్యనారాయణ (సూర్య మీ సేవా)
పామిడి, గుత్తిరోడ్, అనంతపురం జిల్లా
Cell : 9885250967
ఇందూ ధరణి జనరల్ స్టోర్స్
(పి.శివరామ్ ప్రసాద్)
పామిడి, గుత్తిరోడ్, అనంతపురం జిల్లా
Cell: 9030057963, 9063504963
బి. ఆదిశేషయ్య (టీచర్) (ప్రెసిడెంట్)
ప్రబోధాశ్రమము, తాడిపత్రి (మం)
Cell: 9491362448, 7382986963.
పి. ఆదినారాయణ (ప్ర.సభ్యుడు)
ముద్దిరెడ్డి పల్లి (గ్రా॥), అనంతపురం (జిల్లా).
Cell: 9440745800, 7259851861.
ఎ. నాగేంద్ర (ప్రెసిడెంట్)
క్రొత్త చెరువు (గ్రా, మం)
అనంతపురం జిల్లా. Cell:9493622669
9959316410, 9949995090.
పి. నాగయ్య (ప్ర.సభ్యుడు)
వీకర్ సెక్షన్ కాలనీ, కర్నూలు టౌన్
Cell : 9440244598, 9849303902
ఇందూ జ్ఞానవేదిక (Head Office)
చైతన్యపురి, దిల్సుఖ్నగర్,
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం,
Cell:94910 40963, 90329 63963, 98485 90172.
డి. గోపికృష్ణ
హుజురాబాద్, కరీంనగర్ జిల్లా, T.S
Cell : 9989202003, 9542061601
కె.వెంకటేశ్వర్లు (ప్ర.సభ్యుడు)
నందికొట్కూరు, కర్నూలు జిల్లా
Cell: 9440047256, 9701956599
కె. అశోక్ బాబు (టీచర్) (ప్రెసిడెంట్)
రామాపురం (గ్రా), వి.కోట (మం).
చిత్తూరు జిల్లా. Cell : 9440305700
వి. రామక్రిష్ణన్ (వైస్ ప్రెసిడెంట్)
కుప్పం, చిత్తూరు జిల్లా. Cell : 9652755110
డి. బాలాజీ (వైస్ ప్రెసిడెంట్)
బంగారు పాళ్యం (గ్రా), చిత్తూరు జిల్లా.
Cell: 9985483241, 7396077408.
బాలం లక్ష్మీనరసింహులు (ప్రెసిడెంట్)
మదనపల్లి, చిత్తూరు జిల్లా.
Cell: 9440825533, 8519938999.
టి.వి.రమణ (ప్రెసిడెంట్)
ముదిగుబ్బ (గ్రా) అనంతపురం జిల్లా
Cell: 9440980036, 07406039453.

Page 10
ఇందూ జ్ఞానవేదిక ఆధ్యాత్మిక ప్రచురణలు లభించు చిరునామా
డి. వరుణ్ కుమార్ శ్రేష్ఠి (ప్రెసిడెంట్)
పులివెందుల, కడప (జిల్లా).
Cell: 9293199539, 9985714382
P.M.H నాయుడు
కొలిమిగుండ్ల, కర్నూలు (జిల్లా).
Cell : 9440490963
P. రామకృష్ణారెడ్డి
కొలిమిగుండ్ల, కర్నూలు (జిల్లా)
Cell : 9666202963
శ్రీ ప్రబోధ క్లీనిక్
U. జనార్ధన్ (R.M.P)
ఆటోనగర్, కోయిలకుంట్ల (మం),
కర్నూలు (జిల్లా) Cell : 9491851911
డా॥యం. వెంకటేశ్వర రావు (ప్రెసిడెంట్)
శాంతినగర్, నెల్లూరు జిల్లా.
MD (acu)
Cell: 7989100433, 9246770277.
అనమల మహేశ్వర్ (ప్రెసిడెంట్)
చవటపాల్యం (గ్రా), గూడూరు, నెల్లూరు జిల్లా.
Cell: 9494631664, 9490809181, 8106065300.
రౌతు శ్రీనివాసరావు (ప్రెసిడెంట్)
దర్గామాన్యం, గుంటూరు (జిల్లా).
Cell: 9948014366, 9052870853
ఘడియం. పెద్దరెడ్డి (ప్రెసిడెంట్)
నరసరావుపేట, గుంటూరు (జిల్లా).
Cell: 9989204097, 9505904097
నర్రా శ్రీనివాస్ రెడ్డి
కంభం (మం), ప్రకాశం (జిల్లా).
తలారి గంగాధర్
గుడిపాటి గడ్డ, నంద్యాల టౌన్
Cell: 9491846282, 7671963963
Y. రవిశేఖర్ రెడ్డి
ఇందూ జ్ఞానవేదిక ఆధ్యాత్మిక ప్రచురణలు లభించు చిరునామా
09
10
పెద్దకొట్టాల (గ్రా), నంద్యాల (మం)
కర్నూలు (జిల్లా).
Cell : 9440420240, 9885385215
టి. ఉదయకుమార్ (ప్రెసిడెంట్)
భీమవరం వన్డేన్, పశ్చిమ. గో. జిల్లా
Cell: 99482 75984, 73864 33834.
ఇందూ జ్ఞానవేదిక శాఖ
విశాఖపట్టణము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
Cell 76749 79663, 94400 42763,
89777 13666, 92478 26253.
ఎన్.బి. నాయక్ (ప్ర.సభ్యుడు)
పెదమడక, అగనంపూడి,
విశాఖపట్నం (జిల్లా), Cell : 73964 92239,
92483 15309, 73862 12589.
వి.సి.వర్మ (గురూజీ) ఆనందాశ్రమము
మజ్జివలస (గ్రా, పోస్టు),
భీమిలి (మం), విశాఖపట్నం (జిల్లా).
Cell: 94415 67394, 9502 172711.
వి. శంకర రావు (టీచర్) (ప్రెసిడెంట్)
అశోక్ నగర్, విజయనగరము (జిల్లా).
Cell: 9703534224, 9491785963.
తులసీ రావు
Opp. T.T.D కళ్యాణమండపం,
విజయనగరము (జిల్లా).
Cell :9849883261, 8142853311, 8187084516 Cell: 9441878096, 9030089206.
www.thraithashakam.org | Email : info@thraithashakam.org
యస్. అనిల్కుమార్
కాకినాడ టౌన్, తూర్పు గోదావరి జిల్లా
ఇందూ జ్ఞానవేదిక శాఖ
కొత్తకోట, మహబూబ్ నగర్ (జిల్లా).
Cell:9866195252, 9640526520, 7396038888 Cell: 87905 58815, 9440655409, 9701261165
బండారు సత్యనారాయణ
మామిడి కుదురు (మం),
తూ.గోదావరి జిల్లా, Cell: 95535 07141,
84669 20419, 94902 95577
ఎన్.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
బొద్దాం (గ్రా), రాజాం (మం),
శ్రీకాకుళం (జిల్లా).
Cell: 9494248963, 9959779187.
చెల్లారపు అప్పల నాయుడు
చెల్లారపు వలస (గ్రా),
బొబ్బిలి (మం), విజయనగరం జిల్లా.
Cell:9494853773, 8465860706
ఇందూ జ్ఞానవేదిక శాఖ
మల్లిగాం (గ్రా), కొత్తపేట్ (పో),
రాయగడ (జి), ఒడిశా (రాష్ట్రం)
09437527499, 09437527470, 09437975781
షేక్ అమీర్ అలీ (President, K.I.S.S)
నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
Cell: 9505989898, 9505768181
షఫీ షేక్ (Vice President, K.I.S.S)
చెన్నై, తమిళనాడు రాష్ట్రం.
Ph:09445554354.
షేక్ ఇబ్రహీం (K.I.S.S Member)
కర్నూల్ టౌన్, ఆం.ప్ర. Ph:70950 08369
యం. అల్లీ పీర్ (K.I.S.S Member)
మడకశిరా, అనంతపురం జిల్లా, ఆం.ప్ర.
Cell : 8978058081
యం. మురళి (Cell : 9705716469)
జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా.
యం. జైరాంనాయక్
పద్మావతి కాలనీ, మహబూబ్నగర్ టౌన్.
Cell : 70321 74830, 90009 16419
జి. సాయిశంకర్ శ్రేష్ఠి (టీచర్)
అచ్చంపేట, మహబూబ్ నగర్ (జి)
Cell : 9948947630, 9640717574
ప్రెసిడెంట్
పోటు వెంకటేశ్వర్లు (గురూజీ)
హుజూర్ నగర్, నల్గొండ జిల్లా.
Cell: 9848574803, 9866423853.
బి. దేవేందర్
భువనగిరి టౌన్, నల్గొండ జిల్లా.
Cell:9948060838, 9704885964, 9848741703
ఇ. శ్రీనాథ్ శ్రేష్ఠి
గణేష్ స్ట్రీట్, జనగాం, వరంగల్ జిల్లా.
Cell: 9573552963, 8096958359.
ఎ. రాఘవేంద్ర శ్రేష్ఠి
శ్రీకృష్ణ మెడికల్స్ & జనరల్స్
పటేల్ నగర్, 3వ క్రాస్ హోస్పేట,
బళ్ళారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
Cell: 097318 16452, 096111 33635.
A.V. LAKSHMI NARAYANA
San Antonio, TEXAS, U.S.A
+1(210) 527 3436, +1(210) 668 8963
K.SIVA KRISHNA
Atlanta, GEORGIA, U.S.A
+1(404) 551 3297, +1(470) 658 7635

Page 11
ఇందూ జ్ఞానవేదిక ఆధ్యాత్మిక ప్రచురణలు లభించు చిరునామా
డి. వరుణ్ కుమార్ శ్రేష్ఠి (ప్రెసిడెంట్)
పులివెందుల, కడప (జిల్లా).
Cell: 9293199539, 9985714382
P.M.H నాయుడు
కొలిమిగుండ్ల, కర్నూలు (జిల్లా).
Cell : 9440490963
P. రామకృష్ణారెడ్డి
కొలిమిగుండ్ల, కర్నూలు (జిల్లా)
Cell : 9666202963
శ్రీ ప్రబోధ క్లీనిక్
U. జనార్ధన్ (R.M.P)
ఆటోనగర్, కోయిలకుంట్ల (మం),
కర్నూలు (జిల్లా) Cell : 9491851911
డా॥యం. వెంకటేశ్వర రావు (ప్రెసిడెంట్)
శాంతినగర్, నెల్లూరు జిల్లా.
MD (acu)
Cell: 7989100433, 9246770277.
అనమల మహేశ్వర్ (ప్రెసిడెంట్)
చవటపాల్యం (గ్రా), గూడూరు, నెల్లూరు జిల్లా.
Cell: 9494631664, 9490809181, 8106065300.
రౌతు శ్రీనివాసరావు (ప్రెసిడెంట్)
దర్గామాన్యం, గుంటూరు (జిల్లా).
Cell: 9948014366, 9052870853
ఘడియం. పెద్దరెడ్డి (ప్రెసిడెంట్)
నరసరావుపేట, గుంటూరు (జిల్లా).
Cell: 9989204097, 9505904097
నర్రా శ్రీనివాస్ రెడ్డి
కంభం (మం), ప్రకాశం (జిల్లా).
తలారి గంగాధర్
గుడిపాటి గడ్డ, నంద్యాల టౌన్
Cell: 9491846282, 7671963963
Y. రవిశేఖర్ రెడ్డి
ఇందూ జ్ఞానవేదిక ఆధ్యాత్మిక ప్రచురణలు లభించు చిరునామా
09
10
పెద్దకొట్టాల (గ్రా), నంద్యాల (మం)
కర్నూలు (జిల్లా).
Cell : 9440420240, 9885385215
టి. ఉదయకుమార్ (ప్రెసిడెంట్)
భీమవరం వన్డేన్, పశ్చిమ. గో. జిల్లా
Cell: 99482 75984, 73864 33834.
ఇందూ జ్ఞానవేదిక శాఖ
విశాఖపట్టణము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
Cell 76749 79663, 94400 42763,
89777 13666, 92478 26253.
ఎన్.బి. నాయక్ (ప్ర.సభ్యుడు)
పెదమడక, అగనంపూడి,
విశాఖపట్నం (జిల్లా), Cell : 73964 92239,
92483 15309, 73862 12589.
వి.సి.వర్మ (గురూజీ) ఆనందాశ్రమము
మజ్జివలస (గ్రా, పోస్టు),
భీమిలి (మం), విశాఖపట్నం (జిల్లా).
Cell: 94415 67394, 9502 172711.
వి. శంకర రావు (టీచర్) (ప్రెసిడెంట్)
అశోక్ నగర్, విజయనగరము (జిల్లా).
Cell: 9703534224, 9491785963.
తులసీ రావు
Opp. T.T.D కళ్యాణమండపం,
విజయనగరము (జిల్లా).
Cell :9849883261, 8142853311, 8187084516 Cell: 9441878096, 9030089206.
www.thraithashakam.org | Email : info@thraithashakam.org
యస్. అనిల్కుమార్
కాకినాడ టౌన్, తూర్పు గోదావరి జిల్లా
ఇందూ జ్ఞానవేదిక శాఖ
కొత్తకోట, మహబూబ్ నగర్ (జిల్లా).
Cell:9866195252, 9640526520, 7396038888 Cell: 87905 58815, 9440655409, 9701261165
బండారు సత్యనారాయణ
మామిడి కుదురు (మం),
తూ.గోదావరి జిల్లా, Cell: 95535 07141,
84669 20419, 94902 95577
ఎన్.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
బొద్దాం (గ్రా), రాజాం (మం),
శ్రీకాకుళం (జిల్లా).
Cell: 9494248963, 9959779187.
చెల్లారపు అప్పల నాయుడు
చెల్లారపు వలస (గ్రా),
బొబ్బిలి (మం), విజయనగరం జిల్లా.
Cell:9494853773, 8465860706
ఇందూ జ్ఞానవేదిక శాఖ
మల్లిగాం (గ్రా), కొత్తపేట్ (పో),
రాయగడ (జి), ఒడిశా (రాష్ట్రం)
09437527499, 09437527470, 09437975781
షేక్ అమీర్ అలీ (President, K.I.S.S)
నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
Cell: 9505989898, 9505768181
షఫీ షేక్ (Vice President, K.I.S.S)
చెన్నై, తమిళనాడు రాష్ట్రం.
Ph:09445554354.
షేక్ ఇబ్రహీం (K.I.S.S Member)
కర్నూల్ టౌన్, ఆం.ప్ర. Ph:70950 08369
యం. అల్లీ పీర్ (K.I.S.S Member)
మడకశిరా, అనంతపురం జిల్లా, ఆం.ప్ర.
Cell : 8978058081
యం. మురళి (Cell : 9705716469)
జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా.
యం. జైరాంనాయక్
పద్మావతి కాలనీ, మహబూబ్నగర్ టౌన్.
Cell : 70321 74830, 90009 16419
జి. సాయిశంకర్ శ్రేష్ఠి (టీచర్)
అచ్చంపేట, మహబూబ్ నగర్ (జి)
Cell : 9948947630, 9640717574
ప్రెసిడెంట్
పోటు వెంకటేశ్వర్లు (గురూజీ)
హుజూర్ నగర్, నల్గొండ జిల్లా.
Cell: 9848574803, 9866423853.
బి. దేవేందర్
భువనగిరి టౌన్, నల్గొండ జిల్లా.
Cell:9948060838, 9704885964, 9848741703
ఇ. శ్రీనాథ్ శ్రేష్ఠి
గణేష్ స్ట్రీట్, జనగాం, వరంగల్ జిల్లా.
Cell: 9573552963, 8096958359.
ఎ. రాఘవేంద్ర శ్రేష్ఠి
శ్రీకృష్ణ మెడికల్స్ & జనరల్స్
పటేల్ నగర్, 3వ క్రాస్ హోస్పేట,
బళ్ళారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
Cell: 097318 16452, 096111 33635.
A.V. LAKSHMI NARAYANA
San Antonio, TEXAS, U.S.A
+1(210) 527 3436, +1(210) 668 8963
K.SIVA KRISHNA
Atlanta, GEORGIA, U.S.A
+1(404) 551 3297, +1(470) 658 7635

Page 12
ఖుర్ఆన్ - హదీసు ఏది ముఖ్యము?
11
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు, అనంత శక్తి
మయుడు, అపార యుక్తిమయుడు అయినటువంటి దేవున్ని, ఇస్లాములో
అల్లాహ్ అనబడేటటువంటి దైవమును ప్రార్థిస్తూ, ఇప్పుడు ఇస్లాముకు
సంబంధించిన దైవములో ఉండేటటువంటి ప్రత్యేకతను మీకు తెలియ
జేయాలని అనుకుంటున్నాము. ఇస్లామ్ మతములో ప్రత్యేకించి ఒక
గ్రంథము ఉంది. అది పవిత్ర ఖుర్ఆన్ గ్రంథము. ఆ పవిత్ర ఖుర్ఆన్
గ్రంథములో దేవునికి (అల్లాహ్కు) సంబంధించిన సంపూర్ణ సమాచారము
తెలియజేయబడింది. దేవునికి సంబంధించిన సంపూర్ణ సమాచారము
హిందూ మతములో భగవద్గీతయందు, క్రైస్తవ మతములో బైబిలియందు,
ఇస్లామ్ మతములో పవిత్ర ఖుర్ఆన్ యందు చెప్పబడి ఉండగా, ఈ మూడు
మతస్థులు తమ తమ గ్రంథాలను గొప్పగా చెప్పుకుంటూ, అంటే ఒక
మతానికి ఇంకొక మతానికి సంబంధము లేకుండా, మా మతములో
ఉండే దేవుడు ప్రత్యేకమైనవాడు అనేటటువంటి భావము పెట్టుకొని, మాది
ప్రత్యేకమైన మతము అని, మా దేవుడు ప్రత్యేకమైనటువంటివాడు అని
అనుకుంటున్నారు. కానీ సర్వజగత్తును సృష్టించినటువంటివాడు ఒకే ఒక
దేవుడు అనేటటువంటి విషయాన్ని మరచిపోయినారు.
కానీ ఇస్లామ్ మతములో కూడా సర్వమును సృష్టించినవాడు దేవుడే
అని అంటారు. అదే విధముగా క్రైస్థవులలో కూడా సర్వమును సృష్టించినది
దేవుడే అని అంటారు. హిందూమతములో కూడా సృష్ఠికర్త దేవుడే అని
అంటారు. కానీ అక్కడేమో అందరినీ సృష్టించినటువంటి వాడు దేవుడే
అని అంటూ, ప్రత్యేకముగా మమ్ములను సృష్టించిన దేవుడు వేరు, మిమ్ములను
సృష్టించిన దేవుడు వేరు అనే భావము పెట్టుకోవడము చాలా పొరపాటు.
ఈ రకముగా ఇప్పుడు మనలో ఉండే భావాలలో తేడా వచ్చి, అనేక రకాల
12
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ద్వేషాలు పెంచుకొని, అలాగే మతద్వేషాలు పెంచుకొని ఒకరికొకరు
హింసించుకొనే స్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ దేవుడే
మా దేవుడు, మా దేవుడే మీ దేవుడు అనే భావముతో మీరు, మేము ఒకటే
అనే ఐక్యమత్యముతో మనమందరము దైవగ్రంథములో ఉండేటటువంటి
విషయాలను మరొకరు తెలుసుకుంటూ, ఒక మతములో ఉండేటటువంటి
సారాంశాన్ని ఇంకొక మతము వారు తెలుసుకుంటూ, సమైక్యముగా
ఉంటూ దేవున్ని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో మేము ఈ రోజు
ఎవరూ చేయలేనటువంటి పనిని చేస్తున్నాము. ఎవరూ చేయలేని పని
అంటే ఏమీ లేదు, అందరూ ఎవరి మతాల గురించి వాళ్ళు చెప్పు
కుంటుంటారు. అయితే ఇప్పుడు మేము హిందూ జ్ఞానమునే కాక క్రైస్థవ
జ్ఞానమును, ఇస్లామ్ జ్ఞానమును గురించి కూడా చెప్పుతున్నాము. ఒక
హిందువు ఇస్లామ్ మతము గురించి చెప్పడము ఏమిటి? అని
అనుకోకూడదు. ఇందువు అంటే 'జ్ఞాని' అని అర్ధము. ఇందువు దేవునికి
సంబంధించిన జ్ఞానమే చెప్పుతాడు, కాబట్టి దేనిలో అయినా దేవునికి
సంబంధించిన జ్ఞానాన్ని చెప్పేదానికి ఏ ఇందువుకైనా హక్కు ఉంది. ఇస్లాము
మతములో ఇది దేవునికి సంబంధించిన జ్ఞానము, సర్వమానవులకు
చెప్పినటువంటి విషయము అని పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు
చెప్పేటప్పుడు, సర్వమానవులకు అని చెప్పినప్పుడు అది మీకూ సంబంధమే,
నాకు సంబంధమే, ప్రతి ముస్లీముకు సంబంధమే, ప్రతి హిందువుకూ
సంబంధమే, ప్రతి క్రైస్తవునికి కూడా అందులోని జ్ఞానము సంబంధమే
అవుతుంది. కాబట్టి ఎవరైనా మూడు దైవగ్రంథముల గురించి మాట్లాడే
హక్కు అందరికీ ఉంది. అందరూ తెలుసుకొనే హక్కు ఉంది. తెలుసుకొన్న
దానిని అందరూ బయటికి చెప్పుకునే హక్కు కూడా ఉంది. ఎవరు చెప్పినా

Page 13
ఖుర్ఆన్ - హదీసు ఏది ముఖ్యము?
11
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు, అనంత శక్తి
మయుడు, అపార యుక్తిమయుడు అయినటువంటి దేవున్ని, ఇస్లాములో
అల్లాహ్ అనబడేటటువంటి దైవమును ప్రార్థిస్తూ, ఇప్పుడు ఇస్లాముకు
సంబంధించిన దైవములో ఉండేటటువంటి ప్రత్యేకతను మీకు తెలియ
జేయాలని అనుకుంటున్నాము. ఇస్లామ్ మతములో ప్రత్యేకించి ఒక
గ్రంథము ఉంది. అది పవిత్ర ఖుర్ఆన్ గ్రంథము. ఆ పవిత్ర ఖుర్ఆన్
గ్రంథములో దేవునికి (అల్లాహ్కు) సంబంధించిన సంపూర్ణ సమాచారము
తెలియజేయబడింది. దేవునికి సంబంధించిన సంపూర్ణ సమాచారము
హిందూ మతములో భగవద్గీతయందు, క్రైస్తవ మతములో బైబిలియందు,
ఇస్లామ్ మతములో పవిత్ర ఖుర్ఆన్ యందు చెప్పబడి ఉండగా, ఈ మూడు
మతస్థులు తమ తమ గ్రంథాలను గొప్పగా చెప్పుకుంటూ, అంటే ఒక
మతానికి ఇంకొక మతానికి సంబంధము లేకుండా, మా మతములో
ఉండే దేవుడు ప్రత్యేకమైనవాడు అనేటటువంటి భావము పెట్టుకొని, మాది
ప్రత్యేకమైన మతము అని, మా దేవుడు ప్రత్యేకమైనటువంటివాడు అని
అనుకుంటున్నారు. కానీ సర్వజగత్తును సృష్టించినటువంటివాడు ఒకే ఒక
దేవుడు అనేటటువంటి విషయాన్ని మరచిపోయినారు.
కానీ ఇస్లామ్ మతములో కూడా సర్వమును సృష్టించినవాడు దేవుడే
అని అంటారు. అదే విధముగా క్రైస్థవులలో కూడా సర్వమును సృష్టించినది
దేవుడే అని అంటారు. హిందూమతములో కూడా సృష్ఠికర్త దేవుడే అని
అంటారు. కానీ అక్కడేమో అందరినీ సృష్టించినటువంటి వాడు దేవుడే
అని అంటూ, ప్రత్యేకముగా మమ్ములను సృష్టించిన దేవుడు వేరు, మిమ్ములను
సృష్టించిన దేవుడు వేరు అనే భావము పెట్టుకోవడము చాలా పొరపాటు.
ఈ రకముగా ఇప్పుడు మనలో ఉండే భావాలలో తేడా వచ్చి, అనేక రకాల
12
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ద్వేషాలు పెంచుకొని, అలాగే మతద్వేషాలు పెంచుకొని ఒకరికొకరు
హింసించుకొనే స్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ దేవుడే
మా దేవుడు, మా దేవుడే మీ దేవుడు అనే భావముతో మీరు, మేము ఒకటే
అనే ఐక్యమత్యముతో మనమందరము దైవగ్రంథములో ఉండేటటువంటి
విషయాలను మరొకరు తెలుసుకుంటూ, ఒక మతములో ఉండేటటువంటి
సారాంశాన్ని ఇంకొక మతము వారు తెలుసుకుంటూ, సమైక్యముగా
ఉంటూ దేవున్ని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో మేము ఈ రోజు
ఎవరూ చేయలేనటువంటి పనిని చేస్తున్నాము. ఎవరూ చేయలేని పని
అంటే ఏమీ లేదు, అందరూ ఎవరి మతాల గురించి వాళ్ళు చెప్పు
కుంటుంటారు. అయితే ఇప్పుడు మేము హిందూ జ్ఞానమునే కాక క్రైస్థవ
జ్ఞానమును, ఇస్లామ్ జ్ఞానమును గురించి కూడా చెప్పుతున్నాము. ఒక
హిందువు ఇస్లామ్ మతము గురించి చెప్పడము ఏమిటి? అని
అనుకోకూడదు. ఇందువు అంటే 'జ్ఞాని' అని అర్ధము. ఇందువు దేవునికి
సంబంధించిన జ్ఞానమే చెప్పుతాడు, కాబట్టి దేనిలో అయినా దేవునికి
సంబంధించిన జ్ఞానాన్ని చెప్పేదానికి ఏ ఇందువుకైనా హక్కు ఉంది. ఇస్లాము
మతములో ఇది దేవునికి సంబంధించిన జ్ఞానము, సర్వమానవులకు
చెప్పినటువంటి విషయము అని పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు
చెప్పేటప్పుడు, సర్వమానవులకు అని చెప్పినప్పుడు అది మీకూ సంబంధమే,
నాకు సంబంధమే, ప్రతి ముస్లీముకు సంబంధమే, ప్రతి హిందువుకూ
సంబంధమే, ప్రతి క్రైస్తవునికి కూడా అందులోని జ్ఞానము సంబంధమే
అవుతుంది. కాబట్టి ఎవరైనా మూడు దైవగ్రంథముల గురించి మాట్లాడే
హక్కు అందరికీ ఉంది. అందరూ తెలుసుకొనే హక్కు ఉంది. తెలుసుకొన్న
దానిని అందరూ బయటికి చెప్పుకునే హక్కు కూడా ఉంది. ఎవరు చెప్పినా

Page 14
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
13
దేవుని గురించి చెప్పుకోవడమే, దేవుని పవిత్రతను గురించి చెప్పుకోవడమే
అంత తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి దేవుని పవిత్రతను మనము
కొనియాడుతూ ఇప్పుడు ఇస్లామ్ మతములో ఉండేటటువంటి హెచ్చు
తగ్గులు తెలియజేసుకొని, అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే మనము
సర్దుకొని, ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశ్యముతో మనము ఈ ప్రయత్నము
చేస్తున్నాము.
ఇప్పుడు ఇస్లామ్ సోదరులు కొంతమంది, మా ఇస్లామ్ మతములో
ప్రార్థన ఎక్కువగా ఉంది, దైవజ్ఞానము తక్కువగా ఉంది అని చెప్పారు.
మేము ఏమి చెప్పాము అంటే ప్రార్థన ఉంది మరియు దైవజ్ఞానము ఉంది,
రెండూ ఉన్నాయి అని చెప్పాము. వాళ్ళు మాకు ఖుర్ఆన్ జ్ఞానము
తెలియడములేదు అని అంటే అందులోని వాక్యములు మీరు అర్థము
చేసుకోనప్పుడు అవి మీకు తెలియడము లేదు, కానీ అర్థము చేసుకుంటే
హిందుమతములో ఏదైతే ఉందో అదే ఇస్లామ్ మతములో ఉంది, ఇస్లాము
మతములో ఏదైతే ఉందో అదే క్రైస్థవమతములో ఉంది, అన్ని మతములలో
ఉండేది ఒకటే అని తెలుస్తుంది. మీకు అందించిన "కలియుగము
యుగాంతము ఎప్పటికీ కాదు" అనే గ్రంథములో నేను ఒక మాట
వ్రాసాను. అది ఏమనగా! ఒక తులము బంగారుతో మనము ఒక గొలుసును
చేశాము. అట్లే అదే తులము బంగారుతో ఇంకొక గొలుసును చేసాము.
రెండు గొలుసుల పరిమాణములో తేడా ఉండవచ్చు, కానీ తూకములో
అంతా ఒకటే, పదార్థములో కూడా రెండు ఒకటే అని తెలుస్తుంది. ఒక
తులములో ఒక బిళ్ళను చేసినప్పుడు, అంతే తులములో ఇంకొక బిళ్ళను
కూడా తయారు చేసారు. ఆ విధముగా మూడు రకాలుగా మూడు బిళ్ళలు
ఉన్నాయి, అయితే అవి వేరు వేరుగా కనిపిస్తున్నాయి. అంతమాత్రమున
14
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అవి బంగారు కాదు అనుకోవద్దండి. అన్నిటిలో ఉండేది బంగారే, అన్నిటిలో
ఉండేది కూడా ఒకటే తూకము గల బంగారే ఉంది, కాబట్టి ఏ దానిలోనూ
వ్యత్యాసము లేదు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఖుర్ఆన్ గురించి
చెప్పితే, హిందుమతములో మేము ఏది అర్థము చేసుకోగల్గినామో,
హిందుమతములో ఏ దేవుడు ఉన్నాడు అని చెప్పినామో, అదే దేవుడే ఇస్లామ్
మతములో కూడా ఉన్నాడు. ఇస్లామ్ మతములో ఉండే వాళ్ళు ప్రతి
ఒక్కరు ముస్లీమ్ అని అంటున్నారు. ముస్లీమ్ అంటే దేవుని మీద విశ్వాసము
కల్గిన వానిని మనము ముస్లీమ్ అని అంటున్నాము. అంటే దేవుని మీద
దేవుని జ్ఞానము మీద ఆసక్తి గల్గిన వానిని ముస్లీమ్ అంటున్నాము.
అన్నా
దేవుని జ్ఞానము తెలుసుకున్నవాడు ఎవడు అయినా గానీ వానిని
ఇందువు అనే చెప్పాలి. కాబట్టి ఇస్లామ్ మతములో ఉండే జ్ఞానాన్ని
తెలుసుకున్న ఎవరయినా ఇందువులే! ఇస్లామ్ మతములో ఉండే
జ్ఞానాన్ని
అర్థము చేసుకున్నా గాని మనము ముస్లీమ్లమే. ముస్లీమ్ అన్నా, ఇందువు
ఈ రెండు ఒకటే అర్థముతో కూడుకొన్నవే గానీ, ముస్లీమ్ అంటే
వేరు, ఇందువు అంటే వేరు అనేటటువంటి అర్థము ఏమీ లేదు. ఇందు
అంటే జ్ఞాని, ముస్లీమ్ అన్నా కూడా దైవత్వమును తెలుసుకున్న జ్ఞాని అని
అర్థము. ఇస్లాము మతములో ముస్లీమ్ అని పేరు పెట్టారు. హిందూ
మతములో 'ఇందూ' అని పేరు పెట్టారు. పేర్లు వేరు వేరు అయినా గానీ
అర్థము మాత్రము ఒక్కటే. ఇప్పుడు నేను ఇస్లామ్ మతములో ఉండేటటు
వంటి జ్ఞానమును తెలుసుకున్నాను కాబట్టి నేను నిజమైన ముస్లిమ్నే. అదే
హిందూ మతములో ఉండేటటువంటి జ్ఞానమును ఎవరన్నా తెలుసుకున్నా
గానీ, ఏ ముస్లీమైనా గాని అతను నిజమైన హిందువే. కాని హిందువు
అన్నా, ముస్లీమ్ అన్నా ఇద్దరూ ఒకటే జ్ఞానము కల్గినటువంటివాళ్ళే గానీ

Page 15
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
13
దేవుని గురించి చెప్పుకోవడమే, దేవుని పవిత్రతను గురించి చెప్పుకోవడమే
అంత తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి దేవుని పవిత్రతను మనము
కొనియాడుతూ ఇప్పుడు ఇస్లామ్ మతములో ఉండేటటువంటి హెచ్చు
తగ్గులు తెలియజేసుకొని, అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే మనము
సర్దుకొని, ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశ్యముతో మనము ఈ ప్రయత్నము
చేస్తున్నాము.
ఇప్పుడు ఇస్లామ్ సోదరులు కొంతమంది, మా ఇస్లామ్ మతములో
ప్రార్థన ఎక్కువగా ఉంది, దైవజ్ఞానము తక్కువగా ఉంది అని చెప్పారు.
మేము ఏమి చెప్పాము అంటే ప్రార్థన ఉంది మరియు దైవజ్ఞానము ఉంది,
రెండూ ఉన్నాయి అని చెప్పాము. వాళ్ళు మాకు ఖుర్ఆన్ జ్ఞానము
తెలియడములేదు అని అంటే అందులోని వాక్యములు మీరు అర్థము
చేసుకోనప్పుడు అవి మీకు తెలియడము లేదు, కానీ అర్థము చేసుకుంటే
హిందుమతములో ఏదైతే ఉందో అదే ఇస్లామ్ మతములో ఉంది, ఇస్లాము
మతములో ఏదైతే ఉందో అదే క్రైస్థవమతములో ఉంది, అన్ని మతములలో
ఉండేది ఒకటే అని తెలుస్తుంది. మీకు అందించిన "కలియుగము
యుగాంతము ఎప్పటికీ కాదు" అనే గ్రంథములో నేను ఒక మాట
వ్రాసాను. అది ఏమనగా! ఒక తులము బంగారుతో మనము ఒక గొలుసును
చేశాము. అట్లే అదే తులము బంగారుతో ఇంకొక గొలుసును చేసాము.
రెండు గొలుసుల పరిమాణములో తేడా ఉండవచ్చు, కానీ తూకములో
అంతా ఒకటే, పదార్థములో కూడా రెండు ఒకటే అని తెలుస్తుంది. ఒక
తులములో ఒక బిళ్ళను చేసినప్పుడు, అంతే తులములో ఇంకొక బిళ్ళను
కూడా తయారు చేసారు. ఆ విధముగా మూడు రకాలుగా మూడు బిళ్ళలు
ఉన్నాయి, అయితే అవి వేరు వేరుగా కనిపిస్తున్నాయి. అంతమాత్రమున
14
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అవి బంగారు కాదు అనుకోవద్దండి. అన్నిటిలో ఉండేది బంగారే, అన్నిటిలో
ఉండేది కూడా ఒకటే తూకము గల బంగారే ఉంది, కాబట్టి ఏ దానిలోనూ
వ్యత్యాసము లేదు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఖుర్ఆన్ గురించి
చెప్పితే, హిందుమతములో మేము ఏది అర్థము చేసుకోగల్గినామో,
హిందుమతములో ఏ దేవుడు ఉన్నాడు అని చెప్పినామో, అదే దేవుడే ఇస్లామ్
మతములో కూడా ఉన్నాడు. ఇస్లామ్ మతములో ఉండే వాళ్ళు ప్రతి
ఒక్కరు ముస్లీమ్ అని అంటున్నారు. ముస్లీమ్ అంటే దేవుని మీద విశ్వాసము
కల్గిన వానిని మనము ముస్లీమ్ అని అంటున్నాము. అంటే దేవుని మీద
దేవుని జ్ఞానము మీద ఆసక్తి గల్గిన వానిని ముస్లీమ్ అంటున్నాము.
అన్నా
దేవుని జ్ఞానము తెలుసుకున్నవాడు ఎవడు అయినా గానీ వానిని
ఇందువు అనే చెప్పాలి. కాబట్టి ఇస్లామ్ మతములో ఉండే జ్ఞానాన్ని
తెలుసుకున్న ఎవరయినా ఇందువులే! ఇస్లామ్ మతములో ఉండే
జ్ఞానాన్ని
అర్థము చేసుకున్నా గాని మనము ముస్లీమ్లమే. ముస్లీమ్ అన్నా, ఇందువు
ఈ రెండు ఒకటే అర్థముతో కూడుకొన్నవే గానీ, ముస్లీమ్ అంటే
వేరు, ఇందువు అంటే వేరు అనేటటువంటి అర్థము ఏమీ లేదు. ఇందు
అంటే జ్ఞాని, ముస్లీమ్ అన్నా కూడా దైవత్వమును తెలుసుకున్న జ్ఞాని అని
అర్థము. ఇస్లాము మతములో ముస్లీమ్ అని పేరు పెట్టారు. హిందూ
మతములో 'ఇందూ' అని పేరు పెట్టారు. పేర్లు వేరు వేరు అయినా గానీ
అర్థము మాత్రము ఒక్కటే. ఇప్పుడు నేను ఇస్లామ్ మతములో ఉండేటటు
వంటి జ్ఞానమును తెలుసుకున్నాను కాబట్టి నేను నిజమైన ముస్లిమ్నే. అదే
హిందూ మతములో ఉండేటటువంటి జ్ఞానమును ఎవరన్నా తెలుసుకున్నా
గానీ, ఏ ముస్లీమైనా గాని అతను నిజమైన హిందువే. కాని హిందువు
అన్నా, ముస్లీమ్ అన్నా ఇద్దరూ ఒకటే జ్ఞానము కల్గినటువంటివాళ్ళే గానీ

Page 16
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
15
వేరు వేరు కాదు అని అర్థము చేసుకోవాలి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు
కాదు అనే భావముతో మనము దైవజ్ఞానమును అర్థము చేసుకోవాలి.
ఇప్పుడు పవిత్ర ఖురాన్ గ్రంథములో ఉండేటటువంటి విషయాన్ని
మనము తెలుసుకొనేదానికి ప్రయత్నము చేస్తున్నాము. పవిత్ర ఖురాన్
గ్రంథము చాలా గొప్పది. అందులో చాలా పవిత్రమైన వాక్యములు
ఉన్నాయి. ఆ వాక్యములను “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన
వాక్యములు”, “అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు" అని మేము
గ్రంథ రూపములో వ్రాశాము. ఎందుకంటే ఇస్లామ్ మతములో ఖుర్ఆన్
గురించి చాలామంది చాలా వ్యాఖ్యానాలు చెప్పుకున్నాగానీ, ఖుర్ఆన్లో
సంపూర్ణమైన జ్ఞానము మనకు అర్థము కాలేదు. అందువలన అర్థమయ్యే
విధముగా మేము దానిని రెండు గ్రంథములరూపములో వ్రాశాము. ఇప్పుడు
ఆ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములు మనము చెప్పుకోవాల్సిన పని
వచ్చింది. ఇప్పుడు పవిత్ర ఇస్లామ్ మతములో ఉన్నటువంటి కొన్ని
సూత్రాలను మనము చెప్పుకుంటే, ఆ సూత్రాలన్నీ పవిత్ర ఖుర్ఆన్
గ్రంథములో ఉన్నాయి. ఆ ఖుర్ఆన్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను
మనము పరిశీలించి చూస్తే, అందులో ప్రతీ ఒక్కటి దేవునికి సంబంధించిన
విషయాలు తప్ప మరొకటి ఏవీ లేవు. అందువలన మనము ఒక్కొక్క
వాక్యాన్ని తెలుసుకొని చూడవలసిన అవసరము ఎంతో ఉంది. ఆ విధముగా
చూడగలిగితే, అంటే ప్రతి ఒక్కరు ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యములు
తెలుసుకోగలిగితే, దేవుని జ్ఞానము బాగా తెలుసుకుంటారు. ఇప్పుడు
హిందువులను కూర్చోపెట్టి ముస్లీమ్ యొక్క మాటలు మాకు చెప్పడము
సబబేనా అని మీరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇది కూడా
హిందువుల జ్ఞానమే అని మీరు ఎందుకు అనుకోకూడదు? హిందువుల
16
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
భగవద్గీతలో ఉండే జ్ఞానమే అని ఎందుకు మీరు అనుకోకూడదు? అలా
అనుకోకుండా పోవడమే పెద్ద అజ్ఞానము. మేము వేరే జ్ఞానాన్ని
బోధిస్తున్నామని వీళ్ళు (హిందువులు) చెప్పుతున్నారు. వీళ్ళు హిందూ
మతములో గురువుగా ఉండి వేరే మతాన్ని ప్రచారము చేస్తున్నారు అని
కొంతమంది మమ్ములను గురించి అన్నారు.
మేము ఆ విధముగా చెప్పలేదు, అందరూ ఒకటే అనే భావముతోనే
చెప్పుతున్నాము. వేరే మతస్తులను ఎవరినీ హిందువులుగా మార్చలేదు.
అట్లే హిందువులను ఇతర మతములోనికి మార్చలేదు. మీరంతా మతాలు
పెట్టి, పార్టీలు పెట్టి బాంబులు వేయించుకుంటున్నారు, అమాయక ప్రజలను
చంపుతున్నారు. మేము అలాగ చేయడము లేదు. మా దగ్గరికి వచ్చిన
వాళ్ళంతా ఐక్యమత్యముగా మాలో కలసిపోతున్నారు. మాతో సోదర
భావముతో, స్నేహ భావముతో మా దగ్గరకు వస్తున్నారు. మీ దగ్గరకు
ఎవరూ రావడము లేదు చూడండి అని మేము చెప్పుతున్నాము. మా
దగ్గరికి దేవుడు ఒకడే అనే భావముతో వస్తున్నారు. జ్ఞానము అనే
బంధుత్వముతో వస్తున్నారు అంతతప్ప వేరే ద్వేష భావముతో రాలేదు.
మీ దగ్గరకి మతద్వేషము పెట్టుకొని వస్తున్నారు, మీరు వేరు, మేము వేరు
అని వస్తున్నారు, మీరు చిన్నగా చేస్తే, మేము పెద్దగా చేస్తాము అని మీరు
చిన్న బాణము వేస్తే, మేము పెద్ద బాంబే వేస్తామని మీ మీద వేస్తున్నారు.
అంటే మీరు మత ద్వేషాలు పెట్టి ఎక్కడో కూర్చున్నారు, అమాయక ప్రజలు
చనిపోతున్నారు. ఇటువంటివి లేకుండా ఎక్కడా ఏ దురాగతాలు
జరుగకుండా, అమాయక ప్రజలు చనిపోకుండా అందరూ సమానముగా
ఉండాలి అంటే హిందువులను ముస్లీమ్లు అర్థము చేసుకోవాలి, అట్లే
ముస్లీమ్లను హిందువులు అర్థము చేసుకోవాలి, ముస్లీమ్ హిందువు అంటే

Page 17
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
15
వేరు వేరు కాదు అని అర్థము చేసుకోవాలి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు
కాదు అనే భావముతో మనము దైవజ్ఞానమును అర్థము చేసుకోవాలి.
ఇప్పుడు పవిత్ర ఖురాన్ గ్రంథములో ఉండేటటువంటి విషయాన్ని
మనము తెలుసుకొనేదానికి ప్రయత్నము చేస్తున్నాము. పవిత్ర ఖురాన్
గ్రంథము చాలా గొప్పది. అందులో చాలా పవిత్రమైన వాక్యములు
ఉన్నాయి. ఆ వాక్యములను “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన
వాక్యములు”, “అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు" అని మేము
గ్రంథ రూపములో వ్రాశాము. ఎందుకంటే ఇస్లామ్ మతములో ఖుర్ఆన్
గురించి చాలామంది చాలా వ్యాఖ్యానాలు చెప్పుకున్నాగానీ, ఖుర్ఆన్లో
సంపూర్ణమైన జ్ఞానము మనకు అర్థము కాలేదు. అందువలన అర్థమయ్యే
విధముగా మేము దానిని రెండు గ్రంథములరూపములో వ్రాశాము. ఇప్పుడు
ఆ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములు మనము చెప్పుకోవాల్సిన పని
వచ్చింది. ఇప్పుడు పవిత్ర ఇస్లామ్ మతములో ఉన్నటువంటి కొన్ని
సూత్రాలను మనము చెప్పుకుంటే, ఆ సూత్రాలన్నీ పవిత్ర ఖుర్ఆన్
గ్రంథములో ఉన్నాయి. ఆ ఖుర్ఆన్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను
మనము పరిశీలించి చూస్తే, అందులో ప్రతీ ఒక్కటి దేవునికి సంబంధించిన
విషయాలు తప్ప మరొకటి ఏవీ లేవు. అందువలన మనము ఒక్కొక్క
వాక్యాన్ని తెలుసుకొని చూడవలసిన అవసరము ఎంతో ఉంది. ఆ విధముగా
చూడగలిగితే, అంటే ప్రతి ఒక్కరు ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యములు
తెలుసుకోగలిగితే, దేవుని జ్ఞానము బాగా తెలుసుకుంటారు. ఇప్పుడు
హిందువులను కూర్చోపెట్టి ముస్లీమ్ యొక్క మాటలు మాకు చెప్పడము
సబబేనా అని మీరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇది కూడా
హిందువుల జ్ఞానమే అని మీరు ఎందుకు అనుకోకూడదు? హిందువుల
16
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
భగవద్గీతలో ఉండే జ్ఞానమే అని ఎందుకు మీరు అనుకోకూడదు? అలా
అనుకోకుండా పోవడమే పెద్ద అజ్ఞానము. మేము వేరే జ్ఞానాన్ని
బోధిస్తున్నామని వీళ్ళు (హిందువులు) చెప్పుతున్నారు. వీళ్ళు హిందూ
మతములో గురువుగా ఉండి వేరే మతాన్ని ప్రచారము చేస్తున్నారు అని
కొంతమంది మమ్ములను గురించి అన్నారు.
మేము ఆ విధముగా చెప్పలేదు, అందరూ ఒకటే అనే భావముతోనే
చెప్పుతున్నాము. వేరే మతస్తులను ఎవరినీ హిందువులుగా మార్చలేదు.
అట్లే హిందువులను ఇతర మతములోనికి మార్చలేదు. మీరంతా మతాలు
పెట్టి, పార్టీలు పెట్టి బాంబులు వేయించుకుంటున్నారు, అమాయక ప్రజలను
చంపుతున్నారు. మేము అలాగ చేయడము లేదు. మా దగ్గరికి వచ్చిన
వాళ్ళంతా ఐక్యమత్యముగా మాలో కలసిపోతున్నారు. మాతో సోదర
భావముతో, స్నేహ భావముతో మా దగ్గరకు వస్తున్నారు. మీ దగ్గరకు
ఎవరూ రావడము లేదు చూడండి అని మేము చెప్పుతున్నాము. మా
దగ్గరికి దేవుడు ఒకడే అనే భావముతో వస్తున్నారు. జ్ఞానము అనే
బంధుత్వముతో వస్తున్నారు అంతతప్ప వేరే ద్వేష భావముతో రాలేదు.
మీ దగ్గరకి మతద్వేషము పెట్టుకొని వస్తున్నారు, మీరు వేరు, మేము వేరు
అని వస్తున్నారు, మీరు చిన్నగా చేస్తే, మేము పెద్దగా చేస్తాము అని మీరు
చిన్న బాణము వేస్తే, మేము పెద్ద బాంబే వేస్తామని మీ మీద వేస్తున్నారు.
అంటే మీరు మత ద్వేషాలు పెట్టి ఎక్కడో కూర్చున్నారు, అమాయక ప్రజలు
చనిపోతున్నారు. ఇటువంటివి లేకుండా ఎక్కడా ఏ దురాగతాలు
జరుగకుండా, అమాయక ప్రజలు చనిపోకుండా అందరూ సమానముగా
ఉండాలి అంటే హిందువులను ముస్లీమ్లు అర్థము చేసుకోవాలి, అట్లే
ముస్లీమ్లను హిందువులు అర్థము చేసుకోవాలి, ముస్లీమ్ హిందువు అంటే

Page 18
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
17
ఇద్దరూ ఒక్కటే అని అర్థము చేసుకోవాలి. ఆ విషయాలను తెలియజేసే
దానికొరకే నేను ఇప్పుడు ఈ కార్యక్రమము పెట్టి మీకు జ్ఞానమును
తెలుపడము జరుగుతుంది.
ఇప్పుడు ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యము ఏమి అంటే మా
ముస్లీమ్ సోదరులు కొందరు "ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ"
అనే ఒక సంఘాన్ని స్థాపించారు. వారు ఖుర్ఆన్ జ్ఞానము మాకు అర్థము
కావడము లేదు అని అడిగారు. కావున పవిత్ర ఖుర్ఆన్ గ్రంథము నుండి
జ్ఞానమును మేము ప్రజలకు తెలియజేయాలనుకున్నాము. ఈ విధముగా
హిందువులకు గానీ, ముస్లీమ్లకు గానీ అందరికీ జ్ఞానమును తెలియ
జేయాలని అనుకున్నాము. “ఖుర్ఆన్లో ఉన్నటువంటి చిక్కు విషయాలను
ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే, మేము జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాము”
అని ముస్లీమ్లు అడిగిన దానివలన జ్ఞాన విషయములో మా చేతనైనంత
సహాయము చేస్తామని వారికి చెప్పాము. ఇప్పుడు మేము అదే విధానాన్ని
ఆచరిస్తూ, ఖుర్ఆన్క సంబంధించిన జ్ఞాన అర్థాలతో చెప్పుచున్నాము.
“ఎదురాడని జ్ఞానాన్ని దేవుడు అందిస్తానని” మీకు చెప్పినప్పుడు, ఎక్కడ ఏ
ప్రశ్నా మిగలకూడదు, ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి జవాబు చెప్పేటటు
వంటి స్థోమతతో మనము ఉండాలి. అటువంటి స్థోమత మనకు
ఉండాలి అంటే ఖుర్ఆన్ గ్రంథము నుండి సంపూర్ణమైన జ్ఞానము మనకు
తెలిసి ఉండాలి. ప్రతి హిందువుకు, ప్రతి ముస్లీమ్కు ఖురాన్ గ్రంథములో
ఉన్న పవిత్ర వాక్యముల గురించి అర్థాలన్నీ పూర్తిగా తెలిసి ఉండాలి.
ఎవరయినా ఖుర్ఆన్లో ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పలేని స్థితిలో
చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా అందరూ సరియైన
జవాబు చెప్పే విధముగా ఉండాలి అని మేము అంటున్నాము.
18
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఒకానొక రోజు ముహమ్మద్ ప్రవక్తగారు నిరక్ష్యరాస్యుడు, చదువు
లేనటువంటివ్యక్తి అయినా గానీ, ఆయన ఈ రోజు ఏ శాస్త్రవేత్తా చెప్ప
లేనటువంటి విధానాన్ని ఆ రోజు చెప్పగలిగినాడు. ఆయన పరమపదించి
1400 సంవత్సరములు అయినా గానీ, ఆయన ఆ రోజు చెప్పిన వాక్యాల
యొక్క రహస్యాలను ఏ శాస్త్రవేత్తా ఈ రోజు కూడా కనుగొనలేకపోతున్నాడు.
దాని గురించి చెప్పలేకపోతున్నాడు. అంటే అంత గొప్ప భావాలు, అంత
గొప్ప రహస్యాలను తెలియజేసినట్టి ప్రవక్తగారు ఆ రోజు నిరక్ష్యరాస్యుడైనా
ఆయన నోటి వెంట ఈ దైవ వాక్కులు బయటికి రావడము జరిగింది. ఆ
వాక్యముల గురించి మనము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నము
చేస్తున్నాము. అటువంటి వాక్యములు మనము గమనించగలిగితే అవి
114 అధ్యాయాలలో ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడి ఉన్నాయి. 114
అధ్యాయాలలో అనేక ఆయత్ల రూపములో దైవజ్ఞానము ఉన్నా ప్రతి
వాక్యము మనము అర్థము చేసుకొని, ఇతరులకు కూడా అర్థమయ్యే
విధముగా చెప్పుకుంటే ఖురాన్లో ఉండే గొప్పతనము మనకు తెలియ
బడుతుంది. ఈ ఖురాన్ గొప్పతనాన్ని మనము తెలియజెప్పుకుంటూ పోతే,
మన శక్తి చాలదు. ఎందుకంటే భగవద్గీతలో ఎంత సారాంశము ఉందో
అంత సారాంశము ఖుర్ఆన్లో ఉంది. దేవుని గురించి మనము పూర్తిగా
చెప్పలేము. ఎందుకంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే
శక్తివంతుడు కాబట్టి ఆయన గురించి పూర్తిగా చెప్పే అర్హత మనకు ఎవరికీ
లేదు. ఆయన గొప్పతనాన్ని పూర్తి చెప్పలేము. కానీ కొంత కొంత అయినా
చెప్పుకోవడానికి మనము ప్రయత్నము చేస్తాము.
ఇప్పుడు ఈ ఖుర్ఆన్ గురించి ప్రజలలో ఎంతవరకు అవగాహన
ఉంది అని చూస్తే, కేవలము 5 శాతము మాత్రమే అర్థమయిందని, మిగతా

Page 19
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
17
ఇద్దరూ ఒక్కటే అని అర్థము చేసుకోవాలి. ఆ విషయాలను తెలియజేసే
దానికొరకే నేను ఇప్పుడు ఈ కార్యక్రమము పెట్టి మీకు జ్ఞానమును
తెలుపడము జరుగుతుంది.
ఇప్పుడు ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యము ఏమి అంటే మా
ముస్లీమ్ సోదరులు కొందరు "ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ"
అనే ఒక సంఘాన్ని స్థాపించారు. వారు ఖుర్ఆన్ జ్ఞానము మాకు అర్థము
కావడము లేదు అని అడిగారు. కావున పవిత్ర ఖుర్ఆన్ గ్రంథము నుండి
జ్ఞానమును మేము ప్రజలకు తెలియజేయాలనుకున్నాము. ఈ విధముగా
హిందువులకు గానీ, ముస్లీమ్లకు గానీ అందరికీ జ్ఞానమును తెలియ
జేయాలని అనుకున్నాము. “ఖుర్ఆన్లో ఉన్నటువంటి చిక్కు విషయాలను
ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే, మేము జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాము”
అని ముస్లీమ్లు అడిగిన దానివలన జ్ఞాన విషయములో మా చేతనైనంత
సహాయము చేస్తామని వారికి చెప్పాము. ఇప్పుడు మేము అదే విధానాన్ని
ఆచరిస్తూ, ఖుర్ఆన్క సంబంధించిన జ్ఞాన అర్థాలతో చెప్పుచున్నాము.
“ఎదురాడని జ్ఞానాన్ని దేవుడు అందిస్తానని” మీకు చెప్పినప్పుడు, ఎక్కడ ఏ
ప్రశ్నా మిగలకూడదు, ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి జవాబు చెప్పేటటు
వంటి స్థోమతతో మనము ఉండాలి. అటువంటి స్థోమత మనకు
ఉండాలి అంటే ఖుర్ఆన్ గ్రంథము నుండి సంపూర్ణమైన జ్ఞానము మనకు
తెలిసి ఉండాలి. ప్రతి హిందువుకు, ప్రతి ముస్లీమ్కు ఖురాన్ గ్రంథములో
ఉన్న పవిత్ర వాక్యముల గురించి అర్థాలన్నీ పూర్తిగా తెలిసి ఉండాలి.
ఎవరయినా ఖుర్ఆన్లో ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పలేని స్థితిలో
చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా అందరూ సరియైన
జవాబు చెప్పే విధముగా ఉండాలి అని మేము అంటున్నాము.
18
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఒకానొక రోజు ముహమ్మద్ ప్రవక్తగారు నిరక్ష్యరాస్యుడు, చదువు
లేనటువంటివ్యక్తి అయినా గానీ, ఆయన ఈ రోజు ఏ శాస్త్రవేత్తా చెప్ప
లేనటువంటి విధానాన్ని ఆ రోజు చెప్పగలిగినాడు. ఆయన పరమపదించి
1400 సంవత్సరములు అయినా గానీ, ఆయన ఆ రోజు చెప్పిన వాక్యాల
యొక్క రహస్యాలను ఏ శాస్త్రవేత్తా ఈ రోజు కూడా కనుగొనలేకపోతున్నాడు.
దాని గురించి చెప్పలేకపోతున్నాడు. అంటే అంత గొప్ప భావాలు, అంత
గొప్ప రహస్యాలను తెలియజేసినట్టి ప్రవక్తగారు ఆ రోజు నిరక్ష్యరాస్యుడైనా
ఆయన నోటి వెంట ఈ దైవ వాక్కులు బయటికి రావడము జరిగింది. ఆ
వాక్యముల గురించి మనము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నము
చేస్తున్నాము. అటువంటి వాక్యములు మనము గమనించగలిగితే అవి
114 అధ్యాయాలలో ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడి ఉన్నాయి. 114
అధ్యాయాలలో అనేక ఆయత్ల రూపములో దైవజ్ఞానము ఉన్నా ప్రతి
వాక్యము మనము అర్థము చేసుకొని, ఇతరులకు కూడా అర్థమయ్యే
విధముగా చెప్పుకుంటే ఖురాన్లో ఉండే గొప్పతనము మనకు తెలియ
బడుతుంది. ఈ ఖురాన్ గొప్పతనాన్ని మనము తెలియజెప్పుకుంటూ పోతే,
మన శక్తి చాలదు. ఎందుకంటే భగవద్గీతలో ఎంత సారాంశము ఉందో
అంత సారాంశము ఖుర్ఆన్లో ఉంది. దేవుని గురించి మనము పూర్తిగా
చెప్పలేము. ఎందుకంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే
శక్తివంతుడు కాబట్టి ఆయన గురించి పూర్తిగా చెప్పే అర్హత మనకు ఎవరికీ
లేదు. ఆయన గొప్పతనాన్ని పూర్తి చెప్పలేము. కానీ కొంత కొంత అయినా
చెప్పుకోవడానికి మనము ప్రయత్నము చేస్తాము.
ఇప్పుడు ఈ ఖుర్ఆన్ గురించి ప్రజలలో ఎంతవరకు అవగాహన
ఉంది అని చూస్తే, కేవలము 5 శాతము మాత్రమే అర్థమయిందని, మిగతా

Page 20
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
19
20
95 శాతము అర్థము కాలేదని తెలియుచున్నది. ముస్లీమ్లు వారి పెద్దలు
చెప్పినట్లు వాళ్ళు ఆచరించడము తప్ప ఖుర్ఆన్లో పూర్తి సమాచారాన్ని
వాళ్ళు స్వీకరించడము లేదు. సరే ఈ రోజు ఎక్కువ ఆచరణ కలిగిన
వాళ్ళు ముస్లీమ్ అని చెప్పవచ్చు. భక్తిమార్గములో ఎక్కువ ఆచరణ
కల్గినటువంటి వాళ్ళు ముస్లీమ్లో అనే విషయాన్ని మేము చెప్పాము. ఆ
లెక్కప్రకారము పోతే ఇస్లామ్ మతములో ఉండేవాళ్ళే ఎక్కువ ఆచరణ కల్గి
ఉన్నా, వారి ఆచరణ హదీసు వాక్యముల మీద ఆధారపడి ఉంది, కానీ
ఖురాన్ వాక్యముల మీద ఎక్కువ ఆధారపడిలేదు అని చెప్పుతున్నాము.
హదీసులు అంటే ఏమిటో మనము "కలియుగము” గ్రంథములో వ్రాశాము.
హిందూ సాంప్రదాయాలు ఎట్లు ఉన్నాయో అట్లే ముస్లీమ్లకు కూడా కొన్ని
సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాలలో హిందువులు కొన్నిటిని
ఆచరిస్తున్నారు, కానీ అందరికీ పూర్తిగా తెలియవనే చెప్పాలి. అలాగే ఇస్లామ్
మతములో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వాటినే 'హదీసులు’
అంటారు. ఆ హదీసులను ఆచరిస్తున్నారు కానీ వాటి వివరము కూడా
పూర్తిగా తెలియదు. కొన్ని సాంప్రదాయాలు హిందువులలో ఎట్లు వచ్చినాయి
అంటే పురాణాల వలన, వేదాల వలన వచ్చినాయి.
కానీ భగవద్గీత
వలన సాంప్రదాయాలు ఏవీ రాలేదు. భగవద్గీతలో ఒకే ఒక జ్ఞానము
తప్ప వేరేది ఏమీ లేదు. ప్రపంచములో జీవించే సాంప్రదాయాలు ఏవీ
కూడా భగవద్గీతలో లేవు. ప్రపంచములో మనము ఏ విధముగా మాట్లాడాలి,
ఏ పనులు చేయాలి, ఎలా ఉండాలి అనేటివన్నీ మనకు పురాణాల వలన,
వేదాల వలన వచ్చాయి.
ఒక ఆరాధనను మనము ఆచరించాలంటే,
మనకు వేదాలు, యజ్ఞములు చెప్పడము వలన ఆ విధానాలే మనము
ఆచరిస్తున్నాము. ఆ ఆచరణలే మనకు సాంప్రదాయములుగా ఉన్నాయి.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఆ సాంప్రదాయములు హిందువులకు ప్రత్యేకముగా ఉన్నాయి. అలాగే
ఇస్లామ్ మతములో వాళ్లకు ప్రత్యేకముగా ఉన్నాయి. అలాగే క్రైస్థవ
మతములో కూడా ప్రత్యేకముగా ఉన్నాయి. ఈ సాంప్రదాయాల వలననే
మనము వేరు వేరు మనుషులుగా ప్రవర్తిస్తున్నాము. వేరు వేరు మతాలుగా
మనము చీలిపోయినాము. ఈ సాంప్రదాయములు వదలి కేవలము మూల
గ్రంథములలో ఉండేటటువంటి జ్ఞానాన్ని చూస్తే, మనమంతా ఒకటే అని
తెలుస్తుంది. ఏమాత్రము బేధాలు రావు. వేదాలు, పురాణములను వదలి
భగవద్గీతను మనము చూస్తే, అదే విధముగా క్రైస్థవులలో కూడా నాలుగు
సువార్తలను ఆధారము పెట్టుకొని చూస్తే, ఇంకా అదే విధముగానే ఇస్లామ్లో
కూడా ఖుర్ఆన్నే ఆధారము పెట్టుకొని చూస్తే మనుషులు అంతా ఒక్కటే,
మనుషులందరికి దేవుడు ఒక్కడే, ఏ విధమైన వ్యత్యాసములు లేవు అని
మనకు తెలియబడుతుంది. ఆ విధమైన వ్యత్యాసములు లేకుండా ఉండే
జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలని ఇప్పుడు తెలియజెప్పుకొంటున్నాము.
ముఖ్యముగా ఇస్లామ్ మతములో ఉండే చిన్న చిన్న పొరపాట్లను,
మనము గ్రహించుకోలేని వాక్యములను తీసుకొని వాటిని సరిదిద్దుకొని
చూస్తే, సంపూర్ణమైన జ్ఞానమును మనము తెలుసుకోవచ్చు. ఖురాన్
గ్రంథము దాదాపు 1400 సంవత్సరముల పూర్వము ముహమ్మద్ ప్రవక్తగారు
తెలియజేసారు. తరువాత అది పవిత్ర గ్రంథముగానే మనకు లెక్కించబడి
నది. దాని తరువాత ఆయన ఉన్నప్పుడు ప్రార్థన నేర్పించాడు, కొన్ని
పనులు నేర్పించాడు, మనిషికి మనిషికి సలామ్ చేసే విధానము కూడా
ఆయన నేర్పించాడు. ఆ రోజే మంచి పద్ధతులు అన్నీ నేర్పించిపోయాడు.
ఇస్లామ్ మతములో ఏవేవి అయితే మంచి పద్ధతులు ఉన్నాయో, ఆ మంచి
పద్దతులన్నీ ఆయన ఆ రోజు నేర్పించిపోవడము కూడా జరిగింది. తరువాత

Page 21
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
19
20
95 శాతము అర్థము కాలేదని తెలియుచున్నది. ముస్లీమ్లు వారి పెద్దలు
చెప్పినట్లు వాళ్ళు ఆచరించడము తప్ప ఖుర్ఆన్లో పూర్తి సమాచారాన్ని
వాళ్ళు స్వీకరించడము లేదు. సరే ఈ రోజు ఎక్కువ ఆచరణ కలిగిన
వాళ్ళు ముస్లీమ్ అని చెప్పవచ్చు. భక్తిమార్గములో ఎక్కువ ఆచరణ
కల్గినటువంటి వాళ్ళు ముస్లీమ్లో అనే విషయాన్ని మేము చెప్పాము. ఆ
లెక్కప్రకారము పోతే ఇస్లామ్ మతములో ఉండేవాళ్ళే ఎక్కువ ఆచరణ కల్గి
ఉన్నా, వారి ఆచరణ హదీసు వాక్యముల మీద ఆధారపడి ఉంది, కానీ
ఖురాన్ వాక్యముల మీద ఎక్కువ ఆధారపడిలేదు అని చెప్పుతున్నాము.
హదీసులు అంటే ఏమిటో మనము "కలియుగము” గ్రంథములో వ్రాశాము.
హిందూ సాంప్రదాయాలు ఎట్లు ఉన్నాయో అట్లే ముస్లీమ్లకు కూడా కొన్ని
సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాలలో హిందువులు కొన్నిటిని
ఆచరిస్తున్నారు, కానీ అందరికీ పూర్తిగా తెలియవనే చెప్పాలి. అలాగే ఇస్లామ్
మతములో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వాటినే 'హదీసులు’
అంటారు. ఆ హదీసులను ఆచరిస్తున్నారు కానీ వాటి వివరము కూడా
పూర్తిగా తెలియదు. కొన్ని సాంప్రదాయాలు హిందువులలో ఎట్లు వచ్చినాయి
అంటే పురాణాల వలన, వేదాల వలన వచ్చినాయి.
కానీ భగవద్గీత
వలన సాంప్రదాయాలు ఏవీ రాలేదు. భగవద్గీతలో ఒకే ఒక జ్ఞానము
తప్ప వేరేది ఏమీ లేదు. ప్రపంచములో జీవించే సాంప్రదాయాలు ఏవీ
కూడా భగవద్గీతలో లేవు. ప్రపంచములో మనము ఏ విధముగా మాట్లాడాలి,
ఏ పనులు చేయాలి, ఎలా ఉండాలి అనేటివన్నీ మనకు పురాణాల వలన,
వేదాల వలన వచ్చాయి.
ఒక ఆరాధనను మనము ఆచరించాలంటే,
మనకు వేదాలు, యజ్ఞములు చెప్పడము వలన ఆ విధానాలే మనము
ఆచరిస్తున్నాము. ఆ ఆచరణలే మనకు సాంప్రదాయములుగా ఉన్నాయి.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఆ సాంప్రదాయములు హిందువులకు ప్రత్యేకముగా ఉన్నాయి. అలాగే
ఇస్లామ్ మతములో వాళ్లకు ప్రత్యేకముగా ఉన్నాయి. అలాగే క్రైస్థవ
మతములో కూడా ప్రత్యేకముగా ఉన్నాయి. ఈ సాంప్రదాయాల వలననే
మనము వేరు వేరు మనుషులుగా ప్రవర్తిస్తున్నాము. వేరు వేరు మతాలుగా
మనము చీలిపోయినాము. ఈ సాంప్రదాయములు వదలి కేవలము మూల
గ్రంథములలో ఉండేటటువంటి జ్ఞానాన్ని చూస్తే, మనమంతా ఒకటే అని
తెలుస్తుంది. ఏమాత్రము బేధాలు రావు. వేదాలు, పురాణములను వదలి
భగవద్గీతను మనము చూస్తే, అదే విధముగా క్రైస్థవులలో కూడా నాలుగు
సువార్తలను ఆధారము పెట్టుకొని చూస్తే, ఇంకా అదే విధముగానే ఇస్లామ్లో
కూడా ఖుర్ఆన్నే ఆధారము పెట్టుకొని చూస్తే మనుషులు అంతా ఒక్కటే,
మనుషులందరికి దేవుడు ఒక్కడే, ఏ విధమైన వ్యత్యాసములు లేవు అని
మనకు తెలియబడుతుంది. ఆ విధమైన వ్యత్యాసములు లేకుండా ఉండే
జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలని ఇప్పుడు తెలియజెప్పుకొంటున్నాము.
ముఖ్యముగా ఇస్లామ్ మతములో ఉండే చిన్న చిన్న పొరపాట్లను,
మనము గ్రహించుకోలేని వాక్యములను తీసుకొని వాటిని సరిదిద్దుకొని
చూస్తే, సంపూర్ణమైన జ్ఞానమును మనము తెలుసుకోవచ్చు. ఖురాన్
గ్రంథము దాదాపు 1400 సంవత్సరముల పూర్వము ముహమ్మద్ ప్రవక్తగారు
తెలియజేసారు. తరువాత అది పవిత్ర గ్రంథముగానే మనకు లెక్కించబడి
నది. దాని తరువాత ఆయన ఉన్నప్పుడు ప్రార్థన నేర్పించాడు, కొన్ని
పనులు నేర్పించాడు, మనిషికి మనిషికి సలామ్ చేసే విధానము కూడా
ఆయన నేర్పించాడు. ఆ రోజే మంచి పద్ధతులు అన్నీ నేర్పించిపోయాడు.
ఇస్లామ్ మతములో ఏవేవి అయితే మంచి పద్ధతులు ఉన్నాయో, ఆ మంచి
పద్దతులన్నీ ఆయన ఆ రోజు నేర్పించిపోవడము కూడా జరిగింది. తరువాత

Page 22
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
21
22
కొంత కాలానికి ఆయన దేవుని దగ్గరకు పోవడము కూడా జరిగింది.
దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన పరమపదించడము కూడా జరిగింది.
తరువాత, కొంతకాలమునకు అంటే దాదాపు మనకు 120 సంవత్సరముల
తరువాత ప్రవక్తగారి దగ్గర శిష్యునిగా ఉన్నటువంటి శిష్యుని యొక్క శిష్యుడు
ఒకరు ఈ హదీసు గ్రంథములు వ్రాయడము జరిగింది. ప్రవక్తగారు ఈ
విధముగా చెప్పేవాడు, ఆ చెప్పినటువంటి విషయాలు ఈ విధముగా
ఉన్నాయి, మనలను ఈ విధముగా ప్రవర్తించమని చెప్పాడు. ఇవి ఈ
విధముగా చేయమని చెప్పాడు అని హదీసు గ్రంథమును రాయడము
జరిగింది. అంటే ఖురాన్ గ్రంథము వేరు, హదీసు గ్రంథము వేరు అని
మనకు బాగా తెలిసిపోతుంది కదా! ఖుర్ఆన్ ముహమ్మద్ ప్రవక్తగారు
చెప్పారు. హదీసు గ్రంథములను ఆయన తరువాత వచ్చినవారు 121
సంవత్సరముల తరువాత చెప్పారు. ఆ విధముగా 145, 149, 168
సంవత్సరముల వరకు ఆరుగురు వ్యక్తులు ఆరు గ్రంథాలు వ్రాశారు. ప్రవక్త
ఉన్న రోజు వీళ్ళులేరు కానీ ఆ రోజు ఉన్న వాళ్ళు ఇలా చెప్పారు అని
వ్రాశారు. అవి ఇప్పుడు మనకు హదీసు గ్రంథములుగా నిలిచాయి. ఈ
ఆరుగురేకాక మిగతా 35 మంది కూడా వ్రాయడము జరిగినది. వారి
పేర్లు ఇలా కలవు.
7.
8.
9.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇమామ్ ముహమ్మద్ బిన్ యజీద్ బిన్ మాజీ (రహ్మలై)
ఐసఖ్ బిన్ రాహ్వేహ్ (రహ్మలై)
అహ్మద్ బిన్ ఇబ్రాహిం ఇస్మాయిలీ (రహ్మలై)
10. అహ్మద్ బిన్ అమ్ బజ్జార్ (రహ్మలై)
11.
12.
అహ్మద్ బిన్ హుసైన్ బైహఖీ (రహ్మలై)
అబూ హాతిం ముహమ్మద్ బిన్ ఇద్రీస్ రాజీ (రహ్మలై)
13. అబ్దుల్లాహ్ బిన్ అలీబిన్ జౌరుజ్ (రహ్మలై)
14.
15.
హారిస్ బిన్ అబూ ఉసామ (రహ్మలై)
అబూ అబ్దుల్లాహ్ అల్ హాకిమ్ (రహ్మలై)
16.
అబూహీతిం ముహమ్మద్ బిన్ హిబ్బాన్ (రహ్మలై)
17.
ముహమ్మద్ బిన్ ఇసఖ్ బిన్ ఖుజైమ (రహ్మలై)
18.
ఇబ్నె అబూ ఖెపమ (రహ్మలై)
19.
అలీ బిన్ ఉమర్ దారె ఖుత్నీ (రహ్మలై)
20.
ఇమామ్ దారిమీ (రహ్మలై)
21.
అబూదావూద్ తయాలిసీ (రహ్మలై)
22.
ఇబ్నె అబూ అద్దున్యా (రహ్మలై)
23.
ఇమామ్ జుహ్లీ (రహ్మలై)
24.
అబూ జుర్రి రాజీ (రహ్మలై)
1.
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మలై)
2.
ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ (రహ్మలై)
3.
ఇమామ్ ముస్లిం బిన్ హజ్జాజ్ (రహ్మలై)
4.
ఇమామ్ అబూదావూద్ సులైమాన్ బిన్ అష్ అస్ (రహ్మలై)
5.
6.
ఇమామ్ అబూ ఈసా ముహమ్మద్ బిన్ ఈసా తిర్మిజీ (రహ్మలై)
ఇమామ్ అబూ అబ్దుర్రహ్మన్ అహ్మద్ బిన్ షుఐబ్ నసాయి (రహ్మలై)
25. సయీద్ బిన్ మన్సూర్ (రహ్మలై)
26.
ఇబ్నె సకన్ (రహ్మలై)
27. ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయి (రహ్మలై)
28. అబూబక్ర్ బిన్ అబూ షైబ (రహ్మలై)
29. సులైమాన్ బిన్ అహ్మద్ (రహ్మలై)
30. అహ్మద్ బిన్ ముహమ్మద్ తహవీ (రహ్మలై)

Page 23
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
21
22
కొంత కాలానికి ఆయన దేవుని దగ్గరకు పోవడము కూడా జరిగింది.
దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన పరమపదించడము కూడా జరిగింది.
తరువాత, కొంతకాలమునకు అంటే దాదాపు మనకు 120 సంవత్సరముల
తరువాత ప్రవక్తగారి దగ్గర శిష్యునిగా ఉన్నటువంటి శిష్యుని యొక్క శిష్యుడు
ఒకరు ఈ హదీసు గ్రంథములు వ్రాయడము జరిగింది. ప్రవక్తగారు ఈ
విధముగా చెప్పేవాడు, ఆ చెప్పినటువంటి విషయాలు ఈ విధముగా
ఉన్నాయి, మనలను ఈ విధముగా ప్రవర్తించమని చెప్పాడు. ఇవి ఈ
విధముగా చేయమని చెప్పాడు అని హదీసు గ్రంథమును రాయడము
జరిగింది. అంటే ఖురాన్ గ్రంథము వేరు, హదీసు గ్రంథము వేరు అని
మనకు బాగా తెలిసిపోతుంది కదా! ఖుర్ఆన్ ముహమ్మద్ ప్రవక్తగారు
చెప్పారు. హదీసు గ్రంథములను ఆయన తరువాత వచ్చినవారు 121
సంవత్సరముల తరువాత చెప్పారు. ఆ విధముగా 145, 149, 168
సంవత్సరముల వరకు ఆరుగురు వ్యక్తులు ఆరు గ్రంథాలు వ్రాశారు. ప్రవక్త
ఉన్న రోజు వీళ్ళులేరు కానీ ఆ రోజు ఉన్న వాళ్ళు ఇలా చెప్పారు అని
వ్రాశారు. అవి ఇప్పుడు మనకు హదీసు గ్రంథములుగా నిలిచాయి. ఈ
ఆరుగురేకాక మిగతా 35 మంది కూడా వ్రాయడము జరిగినది. వారి
పేర్లు ఇలా కలవు.
7.
8.
9.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇమామ్ ముహమ్మద్ బిన్ యజీద్ బిన్ మాజీ (రహ్మలై)
ఐసఖ్ బిన్ రాహ్వేహ్ (రహ్మలై)
అహ్మద్ బిన్ ఇబ్రాహిం ఇస్మాయిలీ (రహ్మలై)
10. అహ్మద్ బిన్ అమ్ బజ్జార్ (రహ్మలై)
11.
12.
అహ్మద్ బిన్ హుసైన్ బైహఖీ (రహ్మలై)
అబూ హాతిం ముహమ్మద్ బిన్ ఇద్రీస్ రాజీ (రహ్మలై)
13. అబ్దుల్లాహ్ బిన్ అలీబిన్ జౌరుజ్ (రహ్మలై)
14.
15.
హారిస్ బిన్ అబూ ఉసామ (రహ్మలై)
అబూ అబ్దుల్లాహ్ అల్ హాకిమ్ (రహ్మలై)
16.
అబూహీతిం ముహమ్మద్ బిన్ హిబ్బాన్ (రహ్మలై)
17.
ముహమ్మద్ బిన్ ఇసఖ్ బిన్ ఖుజైమ (రహ్మలై)
18.
ఇబ్నె అబూ ఖెపమ (రహ్మలై)
19.
అలీ బిన్ ఉమర్ దారె ఖుత్నీ (రహ్మలై)
20.
ఇమామ్ దారిమీ (రహ్మలై)
21.
అబూదావూద్ తయాలిసీ (రహ్మలై)
22.
ఇబ్నె అబూ అద్దున్యా (రహ్మలై)
23.
ఇమామ్ జుహ్లీ (రహ్మలై)
24.
అబూ జుర్రి రాజీ (రహ్మలై)
1.
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మలై)
2.
ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ (రహ్మలై)
3.
ఇమామ్ ముస్లిం బిన్ హజ్జాజ్ (రహ్మలై)
4.
ఇమామ్ అబూదావూద్ సులైమాన్ బిన్ అష్ అస్ (రహ్మలై)
5.
6.
ఇమామ్ అబూ ఈసా ముహమ్మద్ బిన్ ఈసా తిర్మిజీ (రహ్మలై)
ఇమామ్ అబూ అబ్దుర్రహ్మన్ అహ్మద్ బిన్ షుఐబ్ నసాయి (రహ్మలై)
25. సయీద్ బిన్ మన్సూర్ (రహ్మలై)
26.
ఇబ్నె సకన్ (రహ్మలై)
27. ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయి (రహ్మలై)
28. అబూబక్ర్ బిన్ అబూ షైబ (రహ్మలై)
29. సులైమాన్ బిన్ అహ్మద్ (రహ్మలై)
30. అహ్మద్ బిన్ ముహమ్మద్ తహవీ (రహ్మలై)

Page 24
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
31. ఇబ్నె అబ్దుల్ బర్ (రహ్మలై)
32. అబ్దుల్ హఖ్ (రహ్మలై)
33. అబ్దుర్రజ్జాఖ్ హుమామ్ (రహ్మలై)
34. అబ్దుల్లాహి బిన్ అదీ (రహ్మలై)
35. ముహమ్మద్ బిన్ అమ్ అఖీలీ (రహ్మలై)
36. అలీ బిన్ మదీని (రహ్మలై)
37.
38.
అలీ బిన్ ముహమ్మద్ ఇబ్నుల్ ఖత్తాన్ (రహ్మలై)
ఇమామ్ మాలిక్ (రహ్మలై)
39. ముహమ్మద్ బిన్ ఇసఖ్ ఇబ్నె మంద (రహ్మలై)
40.
అబూ నూఐమ్ అస్ఫహానీ (రహ్మలై)
41.
అబూ యాల అహ్మద్ బిన్ అలీ (రహ్మలై)
23
24
ఈ రకముగా వ్రాసిన తరువాత మరలా కొంతకాలానికి అనగా
200 సంవత్సరముల తరువాత ఇమామ్ బుఖారి గారు, దాదాపు 210
సంవత్సరాల తరువాత ఇమామ్ ముస్లీమ్ గారు ఒకటి హదీసు గ్రంథాలు
వ్రాయడము జరిగింది. వాటిలో బాగా ప్రచారము పొందినది ఇమామ్
బుఖారి గారి గ్రంథమే బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన బాగా జ్ఞాపక శక్తి
గలవాడు. ఆయన చాలా మంచి తెలివైనవాడు. ఆ రోజు ప్రవక్తగారు
ఇవే విషయాలు చెప్పాడు అని మనకు నీతి వాక్యములన్నీ వ్రాసిపెట్టడము
జరిగింది. ఆ విధముగా వ్రాసిన వాక్యములు మొత్తము మనకు ఆరు
లక్షలు ఉన్నాయి. అంటే మొట్టమొదట ఇమామ్ బుఖారి గారు వ్రాసిన
హదీసు గ్రంథము ఏది అయితే ఉందో, అది ఆరు లక్షల హదీసు
వాక్యములతో నిండుకొని ఉంది. కానీ అది అత్యంత ప్రామాణిక గ్రంథము
అయినా గానీ వాటిలో నుండి సరిగా ఏర్పరిచి పెట్టినటువంటివి 7397
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఈ రకముగా ఆయన 16
వాక్యములు. ఆరు లక్షలలో నుండి ముఖ్యమైన 7397 వాక్యములను
మాత్రమే బయటికి తీసారు. అంటే మిగతా వాటిని వదలివేయడము
జరిగింది. వీటినన్నింటినీ తీసివేస్తూ, ఇంకా తీసివేస్తూ పోతే ఎక్కడా ఏ
హదీసు వాక్యము కూడా ప్రవక్తగారి హోదాకు భంగము కల్గించకుండా
ఉండేటటువంటి విధానముతో చూస్తూ అన్నీ కరెక్ట్ గా ఉండేవాటిని
ఏర్పరచుకుంటూ వస్తే చివరకు మిగిలినవి 2602 హదీసులు మాత్రమే
మిగిలినాయి. అంటే 6 లక్షలు నుండి చివరకు ఎన్ని మిగిలినాయి అంటే
2602 హదీసులు మాత్రమే మిగిలినాయి.
సంవత్సరములు కష్టపడి హదీసు గ్రంథము వ్రాసిపోయాడు. ఆయన
తరువాత అంటే కొద్దికాలము ఒక పది సంవత్సరములు గడచిన పిమ్మట
పుట్టిన ఇమామ్ ముస్లీమ్ గారు కూడా హదీసు గ్రంథములు వ్రాయడము
జరిగింది. ఆయన మొత్తము 4 లక్షల హదీసులను వ్రాశాడు. ఇమామ్
బుఖారి గారు 6 లక్షలు వ్రాస్తే, ఇమామ్ ముస్లీమ్ గారు 4 లక్షలు
సేకరించాడు. అందులో ఇమామ్ ముస్లిము గారు ఇది బాగలేదు, అది
బాగలేదు, ఇది ఎక్కడైనా మనకు జవాబు చెప్పలేని పరిస్థితి వస్తుంది, ఇది
ప్రవక్త గారి బోధకు ప్రత్యక్షముగా భంగము కల్గుతుందనీ అని ఆ విధముగా
తీసివేస్తూ, తీసివేస్తూ వస్తే ఆయనవి కూడా 7270 హదీసులు మాత్రమే
మిగిలినాయి. ఈ విధముగా చివరకు వాటిలో కూడా ఇంకా వడగట్టితే
4000 హదీసులు మాత్రమే మిగిలినాయి. ఈ రకముగా 4000
హదీసులతో ఇమామ్ ముస్లీమ్హరు, 2602 హదీసులతో ఇమామ్ బుఖారి,
గారు నిలిచారు. ఈ విధముగా మనకు హదీసులు అనేవి వ్రాయబడ్డాయి.
ఖురాన్ వేరు, హదీసులు వేరు అని మీరు బాగా గ్రహించుకోవాలి. (ఇమామ్
బుఖారి, ఇమామ్ ముస్లీమ్ గారి విషయము "మహా ప్రవక్త హితోక్తులు”
అను గ్రంథము నుండి సేకరించినది ఇక్కడ తెలుపుచున్నాము చూడండి.)

Page 25
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
31. ఇబ్నె అబ్దుల్ బర్ (రహ్మలై)
32. అబ్దుల్ హఖ్ (రహ్మలై)
33. అబ్దుర్రజ్జాఖ్ హుమామ్ (రహ్మలై)
34. అబ్దుల్లాహి బిన్ అదీ (రహ్మలై)
35. ముహమ్మద్ బిన్ అమ్ అఖీలీ (రహ్మలై)
36. అలీ బిన్ మదీని (రహ్మలై)
37.
38.
అలీ బిన్ ముహమ్మద్ ఇబ్నుల్ ఖత్తాన్ (రహ్మలై)
ఇమామ్ మాలిక్ (రహ్మలై)
39. ముహమ్మద్ బిన్ ఇసఖ్ ఇబ్నె మంద (రహ్మలై)
40.
అబూ నూఐమ్ అస్ఫహానీ (రహ్మలై)
41.
అబూ యాల అహ్మద్ బిన్ అలీ (రహ్మలై)
23
24
ఈ రకముగా వ్రాసిన తరువాత మరలా కొంతకాలానికి అనగా
200 సంవత్సరముల తరువాత ఇమామ్ బుఖారి గారు, దాదాపు 210
సంవత్సరాల తరువాత ఇమామ్ ముస్లీమ్ గారు ఒకటి హదీసు గ్రంథాలు
వ్రాయడము జరిగింది. వాటిలో బాగా ప్రచారము పొందినది ఇమామ్
బుఖారి గారి గ్రంథమే బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన బాగా జ్ఞాపక శక్తి
గలవాడు. ఆయన చాలా మంచి తెలివైనవాడు. ఆ రోజు ప్రవక్తగారు
ఇవే విషయాలు చెప్పాడు అని మనకు నీతి వాక్యములన్నీ వ్రాసిపెట్టడము
జరిగింది. ఆ విధముగా వ్రాసిన వాక్యములు మొత్తము మనకు ఆరు
లక్షలు ఉన్నాయి. అంటే మొట్టమొదట ఇమామ్ బుఖారి గారు వ్రాసిన
హదీసు గ్రంథము ఏది అయితే ఉందో, అది ఆరు లక్షల హదీసు
వాక్యములతో నిండుకొని ఉంది. కానీ అది అత్యంత ప్రామాణిక గ్రంథము
అయినా గానీ వాటిలో నుండి సరిగా ఏర్పరిచి పెట్టినటువంటివి 7397
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఈ రకముగా ఆయన 16
వాక్యములు. ఆరు లక్షలలో నుండి ముఖ్యమైన 7397 వాక్యములను
మాత్రమే బయటికి తీసారు. అంటే మిగతా వాటిని వదలివేయడము
జరిగింది. వీటినన్నింటినీ తీసివేస్తూ, ఇంకా తీసివేస్తూ పోతే ఎక్కడా ఏ
హదీసు వాక్యము కూడా ప్రవక్తగారి హోదాకు భంగము కల్గించకుండా
ఉండేటటువంటి విధానముతో చూస్తూ అన్నీ కరెక్ట్ గా ఉండేవాటిని
ఏర్పరచుకుంటూ వస్తే చివరకు మిగిలినవి 2602 హదీసులు మాత్రమే
మిగిలినాయి. అంటే 6 లక్షలు నుండి చివరకు ఎన్ని మిగిలినాయి అంటే
2602 హదీసులు మాత్రమే మిగిలినాయి.
సంవత్సరములు కష్టపడి హదీసు గ్రంథము వ్రాసిపోయాడు. ఆయన
తరువాత అంటే కొద్దికాలము ఒక పది సంవత్సరములు గడచిన పిమ్మట
పుట్టిన ఇమామ్ ముస్లీమ్ గారు కూడా హదీసు గ్రంథములు వ్రాయడము
జరిగింది. ఆయన మొత్తము 4 లక్షల హదీసులను వ్రాశాడు. ఇమామ్
బుఖారి గారు 6 లక్షలు వ్రాస్తే, ఇమామ్ ముస్లీమ్ గారు 4 లక్షలు
సేకరించాడు. అందులో ఇమామ్ ముస్లిము గారు ఇది బాగలేదు, అది
బాగలేదు, ఇది ఎక్కడైనా మనకు జవాబు చెప్పలేని పరిస్థితి వస్తుంది, ఇది
ప్రవక్త గారి బోధకు ప్రత్యక్షముగా భంగము కల్గుతుందనీ అని ఆ విధముగా
తీసివేస్తూ, తీసివేస్తూ వస్తే ఆయనవి కూడా 7270 హదీసులు మాత్రమే
మిగిలినాయి. ఈ విధముగా చివరకు వాటిలో కూడా ఇంకా వడగట్టితే
4000 హదీసులు మాత్రమే మిగిలినాయి. ఈ రకముగా 4000
హదీసులతో ఇమామ్ ముస్లీమ్హరు, 2602 హదీసులతో ఇమామ్ బుఖారి,
గారు నిలిచారు. ఈ విధముగా మనకు హదీసులు అనేవి వ్రాయబడ్డాయి.
ఖురాన్ వేరు, హదీసులు వేరు అని మీరు బాగా గ్రహించుకోవాలి. (ఇమామ్
బుఖారి, ఇమామ్ ముస్లీమ్ గారి విషయము "మహా ప్రవక్త హితోక్తులు”
అను గ్రంథము నుండి సేకరించినది ఇక్కడ తెలుపుచున్నాము చూడండి.)

Page 26
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇమామ్ బుఖారీ (రహ్మలై) :
25
26
సహీమ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా
ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహ్మలై) హిబ్రీ శకం
194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద
కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం
ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్య
కోసం ముస్లీం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ
సుధీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య
నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యా
పారంగతులు ఇమామ్ దాఖలీ (రహ్మలై) గారి పాఠశాలలో చేరారు.
ఒకరోజు ఇమామ్ దాఖలీ (రహ్మలై) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ
“సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం" అని అన్నారు. అప్పుడు ఇమామ్ బుఖారీ
(రహ్మలై) కల్పించుకొని "ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్
ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించలేదు" అని అన్నారు.
అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో
గురువుగారు ఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొరకొరా చూశారు. ఇమామ్
బుఖారీ (రహ్మలై) గురువుగారి పట్ల ఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ
“మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారి చూచుకోండి" అని ప్రశాంతంగా
అన్నారు.
ఇమామ్ దాఖలీ (రహ్మలై) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి
ఇమామ్ బుఖారీ (రహ్మలై) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు.
ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?" అని అడిగారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
వన్బు అదియ్యి అన్ ఇబ్రహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహ్మలై -ఉ
ల్లేఖించారు; అబూబుబైర్ అనడం సరికాదు" అని అన్నారు.
అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు.
పదహారు సంవత్సరాల వయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్
(రహ్మలై), ఇమామ్ వకీ (రహ్మలై) లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు.
18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించనారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త
ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారు
చెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన
దైవప్రవక్త (స) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో వ్రాశారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేథా సంపన్నులు.
ఎంత పెద్ద హదీసయినా సరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయి
పోయేది.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్
ఇస్మాయీల్ ఇలా తెలియజేస్తున్నారు. “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు
హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు.
ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈ విధంగా 16 రోజులు గడచి
పోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని
విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ " ఈ పదహారు రోజుల కాలంలో
నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా
చదువుతాను విను" అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా
హదీసుల్ని ఒక్కపొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా
మేము అనేకచోట్ల మా వ్రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించు
కోవలసి వచ్చింది."

Page 27
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇమామ్ బుఖారీ (రహ్మలై) :
25
26
సహీమ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా
ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహ్మలై) హిబ్రీ శకం
194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద
కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం
ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్య
కోసం ముస్లీం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ
సుధీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య
నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యా
పారంగతులు ఇమామ్ దాఖలీ (రహ్మలై) గారి పాఠశాలలో చేరారు.
ఒకరోజు ఇమామ్ దాఖలీ (రహ్మలై) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ
“సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం" అని అన్నారు. అప్పుడు ఇమామ్ బుఖారీ
(రహ్మలై) కల్పించుకొని "ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్
ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించలేదు" అని అన్నారు.
అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో
గురువుగారు ఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొరకొరా చూశారు. ఇమామ్
బుఖారీ (రహ్మలై) గురువుగారి పట్ల ఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ
“మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారి చూచుకోండి" అని ప్రశాంతంగా
అన్నారు.
ఇమామ్ దాఖలీ (రహ్మలై) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి
ఇమామ్ బుఖారీ (రహ్మలై) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు.
ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?" అని అడిగారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
వన్బు అదియ్యి అన్ ఇబ్రహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహ్మలై -ఉ
ల్లేఖించారు; అబూబుబైర్ అనడం సరికాదు" అని అన్నారు.
అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు.
పదహారు సంవత్సరాల వయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్
(రహ్మలై), ఇమామ్ వకీ (రహ్మలై) లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు.
18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించనారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త
ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారు
చెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన
దైవప్రవక్త (స) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో వ్రాశారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేథా సంపన్నులు.
ఎంత పెద్ద హదీసయినా సరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయి
పోయేది.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్
ఇస్మాయీల్ ఇలా తెలియజేస్తున్నారు. “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు
హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు.
ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈ విధంగా 16 రోజులు గడచి
పోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని
విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ " ఈ పదహారు రోజుల కాలంలో
నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా
చదువుతాను విను" అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా
హదీసుల్ని ఒక్కపొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా
మేము అనేకచోట్ల మా వ్రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించు
కోవలసి వచ్చింది."

Page 28
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
27
ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి జ్ఞాపకశక్తి గాథలు దశ దిశలా వ్యాపించి
పోయాయి. ఆయన ఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ
ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన
జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి
ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించే వారు. ఆ కాలములోనే షేఖ్ అబూజరఆ
(రహ్మలై), అబూ హాతిం (రహ్మలై), ముహమ్మద్ బిన నస్ (రహ్మలై), ఇబ్ను ఖుజైమా
(రహ్మలై), ఇమామ్ తిర్మిజి (రహ్మలై), ఇమామ్ ముస్లిమం (రహ్మలై) లు ఆయనకు
శిష్యులయిపోయారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన
అభిప్రాయాలు వినండి :
“బుఖారీ (రహ్మలై) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి
కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే
బుఖారీని మించిన వారే లేరు.”
- ఇమామ్ దారిమి (రహ్మలై)
“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహ్మలై) లాంటి మహోన్నత
వ్యక్తి మరొకరు జన్మించలేదు."
- ఇమామ్ అహ్మద్ (రహ్మలై)
“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహ్మలై) కూడా తనలాంటి వ్యక్తిని
చూడలేదు.”
- ఇబ్నుల్ మదీని (రహ్మలై)
“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహ్మలై) ఓసారి ఇమామ్ బుఖారీ
(రహ్మలై) సన్నిధికి వెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా
నేను కళ్ళారా చూశాను. ఆ తరువాత ఆయన 'గురువులకు గురువూ! హదీసువేత్తల
28
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని అన్నారు."
- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహ్మలై)
“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహ్మలై)
ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.”
-ఇబ్నె ఖుజైమా (రహ్మలై)
ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది.
ఆయన తన జీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించ లేదు,
బాధించనూ లేదు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక
విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదని నేను
ఆశిస్తున్నాను" అని అప్పుడప్పుడూ అంటుండేవారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి
ఉమర్ బిన్ హఫ్స్ (రహ్మలై) ఇలా తెలియజేస్తున్నారు. “బస్రాలోని హదీసు
పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహ విద్యార్థులం గా ఉండే వాళ్ళం. ఒకరోజు
ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి
బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల
ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల ఆయన
ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత ఆయన కోసం బట్టలు
సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు
రావడం ప్రారంభించారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా
ఉండేవారు. అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు
హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహ్మలై) కి విజ్ఞప్తి చేశాడు.
దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఒక ప్రత్యేక సమావేశంలో తన

Page 29
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
27
ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి జ్ఞాపకశక్తి గాథలు దశ దిశలా వ్యాపించి
పోయాయి. ఆయన ఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ
ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన
జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి
ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించే వారు. ఆ కాలములోనే షేఖ్ అబూజరఆ
(రహ్మలై), అబూ హాతిం (రహ్మలై), ముహమ్మద్ బిన నస్ (రహ్మలై), ఇబ్ను ఖుజైమా
(రహ్మలై), ఇమామ్ తిర్మిజి (రహ్మలై), ఇమామ్ ముస్లిమం (రహ్మలై) లు ఆయనకు
శిష్యులయిపోయారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన
అభిప్రాయాలు వినండి :
“బుఖారీ (రహ్మలై) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి
కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే
బుఖారీని మించిన వారే లేరు.”
- ఇమామ్ దారిమి (రహ్మలై)
“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహ్మలై) లాంటి మహోన్నత
వ్యక్తి మరొకరు జన్మించలేదు."
- ఇమామ్ అహ్మద్ (రహ్మలై)
“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహ్మలై) కూడా తనలాంటి వ్యక్తిని
చూడలేదు.”
- ఇబ్నుల్ మదీని (రహ్మలై)
“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహ్మలై) ఓసారి ఇమామ్ బుఖారీ
(రహ్మలై) సన్నిధికి వెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా
నేను కళ్ళారా చూశాను. ఆ తరువాత ఆయన 'గురువులకు గురువూ! హదీసువేత్తల
28
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని అన్నారు."
- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహ్మలై)
“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహ్మలై)
ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.”
-ఇబ్నె ఖుజైమా (రహ్మలై)
ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది.
ఆయన తన జీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించ లేదు,
బాధించనూ లేదు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక
విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదని నేను
ఆశిస్తున్నాను" అని అప్పుడప్పుడూ అంటుండేవారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి
ఉమర్ బిన్ హఫ్స్ (రహ్మలై) ఇలా తెలియజేస్తున్నారు. “బస్రాలోని హదీసు
పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహ విద్యార్థులం గా ఉండే వాళ్ళం. ఒకరోజు
ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి
బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల
ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల ఆయన
ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత ఆయన కోసం బట్టలు
సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు
రావడం ప్రారంభించారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా
ఉండేవారు. అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు
హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహ్మలై) కి విజ్ఞప్తి చేశాడు.
దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఒక ప్రత్యేక సమావేశంలో తన

Page 30
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
29
పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు. ఇమామ్
ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి
ఉంటుంది. నా సమావేశంలో ధనికుడు పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి
హదీసు విద్య నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికీ హక్కుంది" అని సమాధానమిచ్చారు.
ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ అగ్రహోదగ్రుడయ్యాడు. ఆ
తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్
బుఖారీ (రహ్మలై) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో
ఇమామ్ బుఖారీ (రహ్మలై) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికి వెళ్ళి
తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తు
లయ్యారు. చివరికి హిజీ శకం 256లో ఈదుల్ఫిత్ నాడు 62 సంవత్సరాల
వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-
జామె సహీహ్ బుఖారీ :-
ఇది ఇమామ్ బుఖారీ (రహ్మలై) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు
పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి
మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత
ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397
హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే
మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని
ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ
పద్ధతిలో సంకలనం చేశారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16
సంవత్సరాల పాటు ఆహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి
30
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్
నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు వ్రాయడానికి ఉపక్రమించేవారు.
ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తి
భావంతో గ్రంథస్తం చేశారు.
ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం
ప్రామాణికతను పరీక్షించడానికి వివిధ రకాలుగా ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరూ
ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించ లేకపోయారు.
కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్య
ఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజ గ్రంథం ఏదయినా ఉ
ందంటే అది వహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ
గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.
ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు
ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని
హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ (రహ్మలై) నోట తొంభై వేలమంది
హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలు వెలువడ్డాయి. వాటిలో
కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్నిబట్టి సహీహ్
బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) :
సహీహ్ ముస్లిం గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్
ముస్లిం బిన్ హిజాజ్ (రహ్మలై) హిబ్రీ శకం 204లో నీషాపూర్ లో జన్మించారు.
బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ
కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర

Page 31
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
29
పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు. ఇమామ్
ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి
ఉంటుంది. నా సమావేశంలో ధనికుడు పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి
హదీసు విద్య నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికీ హక్కుంది" అని సమాధానమిచ్చారు.
ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ అగ్రహోదగ్రుడయ్యాడు. ఆ
తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్
బుఖారీ (రహ్మలై) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో
ఇమామ్ బుఖారీ (రహ్మలై) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికి వెళ్ళి
తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తు
లయ్యారు. చివరికి హిజీ శకం 256లో ఈదుల్ఫిత్ నాడు 62 సంవత్సరాల
వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-
జామె సహీహ్ బుఖారీ :-
ఇది ఇమామ్ బుఖారీ (రహ్మలై) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు
పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి
మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత
ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397
హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే
మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని
ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ
పద్ధతిలో సంకలనం చేశారు.
ఇమామ్ బుఖారీ (రహ్మలై) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16
సంవత్సరాల పాటు ఆహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి
30
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్
నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు వ్రాయడానికి ఉపక్రమించేవారు.
ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తి
భావంతో గ్రంథస్తం చేశారు.
ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం
ప్రామాణికతను పరీక్షించడానికి వివిధ రకాలుగా ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరూ
ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించ లేకపోయారు.
కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్య
ఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజ గ్రంథం ఏదయినా ఉ
ందంటే అది వహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ
గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.
ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు
ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని
హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ (రహ్మలై) నోట తొంభై వేలమంది
హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలు వెలువడ్డాయి. వాటిలో
కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్నిబట్టి సహీహ్
బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) :
సహీహ్ ముస్లిం గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్
ముస్లిం బిన్ హిజాజ్ (రహ్మలై) హిబ్రీ శకం 204లో నీషాపూర్ లో జన్మించారు.
బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ
కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర

Page 32
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
31
32
హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి
గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ
(రహ్మలై)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.
ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్
ముస్లిం (రహ్మలై) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం
రాజి (రహ్మలై), ముసాబిన్ హారూన్ (రహ్మలై), అహ్మద్ బిన్ సల్మ (రహ్మలై), ఇమామ్
తిర్మిజీ (రహ్మలై) ప్రభృతులు కూడా ఉన్నారు. ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస
వరకు ఎంతో దైవభీతి, ధర్మ పరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు.
ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గానీ, బాధించడం గానీ చేయలేదు.
ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒకసారి
ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే
ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియక
పోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు. తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ
హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న
ఖర్జూర పండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు. హదీసు
అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు.
చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్టవైపు చూస్తే అది దాదాపు
ఖాళీ అయిపోయింది. అప్పుడర్థమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ
తిన్నానని. కానీ ఇక చేసేదేమి లేదు, జరుగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు
తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హెబ్రీ శకం 261,
రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం
వీడిపోయారు. చనిపోయేనాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే.
స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అబూహాతిం (రహ్మలై) ఇలా తెలియజేస్తున్నారు. “ఇమామ్ ముస్లిం
(రహ్మలై) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన
దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహ్మలై)
‘దేవుడు తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి
వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ'ని అన్నారు.
జామె సహీహ్ ముస్లిం :-
ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్య స్థితి రీత్యా
సహీహ్ బుఖారీకి ఏమాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్
బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా
ఏకీభవించారు.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో
సంకలనం చేశారు. అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి,
అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహ్మలై) ఈ గ్రంథంలో
ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒక చోట చేర్చారు. దాంతో పాటు
హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పద జాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త
వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ
పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో
ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం
చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘకాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి
అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించిన హదీసుల్ని మాత్రమే
ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275

Page 33
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
31
32
హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి
గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ
(రహ్మలై)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.
ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్
ముస్లిం (రహ్మలై) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం
రాజి (రహ్మలై), ముసాబిన్ హారూన్ (రహ్మలై), అహ్మద్ బిన్ సల్మ (రహ్మలై), ఇమామ్
తిర్మిజీ (రహ్మలై) ప్రభృతులు కూడా ఉన్నారు. ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస
వరకు ఎంతో దైవభీతి, ధర్మ పరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు.
ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గానీ, బాధించడం గానీ చేయలేదు.
ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒకసారి
ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే
ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియక
పోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు. తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ
హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న
ఖర్జూర పండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు. హదీసు
అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు.
చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్టవైపు చూస్తే అది దాదాపు
ఖాళీ అయిపోయింది. అప్పుడర్థమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ
తిన్నానని. కానీ ఇక చేసేదేమి లేదు, జరుగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు
తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హెబ్రీ శకం 261,
రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం
వీడిపోయారు. చనిపోయేనాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే.
స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అబూహాతిం (రహ్మలై) ఇలా తెలియజేస్తున్నారు. “ఇమామ్ ముస్లిం
(రహ్మలై) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన
దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహ్మలై)
‘దేవుడు తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి
వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ'ని అన్నారు.
జామె సహీహ్ ముస్లిం :-
ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్య స్థితి రీత్యా
సహీహ్ బుఖారీకి ఏమాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్
బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా
ఏకీభవించారు.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో
సంకలనం చేశారు. అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి,
అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహ్మలై) ఈ గ్రంథంలో
ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒక చోట చేర్చారు. దాంతో పాటు
హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పద జాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త
వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ
పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో
ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం
చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘకాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి
అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించిన హదీసుల్ని మాత్రమే
ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275

Page 34
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
33
34
హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత
హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు.
“నేనీ గ్రంథంలో ఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన
ఆధారాలతోనే దాన్ని
గ్రంథస్తం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని
తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని
తొలగించారు. అందువల్ల ప్రపంచ ములోని జనమంతా రెండొందల యేండ్ల పాటు
హదీసుల్ని పరిశీలించి వ్రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”
సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర
విషయాలరీత్యా ఏది గొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు
ఉన్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటే ఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే,
సహీహ్ ముస్లిం అన్నిటికంటే ఉన్నతమైన గ్రంథమని, మరికొందరు అభిప్రాయ
పడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా
సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాలరీత్యా సహీహ్ ముస్లిం
ఉన్నతమైనదని అభిప్రాయ పడ్డారు.
ఏమయిన్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవ
భీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి
భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం
గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖున్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది?
పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ 'ఏకీభవిత' హదీసులు మరెంత ప్రామాణిక
మైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.
సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో
ఉన్న హదీసుల్ని ముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలనకర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అభివర్ణించిన సంగతి ప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో
ముత్యాలు ఉంటే, మరొ సముద్రంలో పగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండూ
సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో
ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!
ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో
పునరావృత హదీసులు తీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ
గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులు తగ్గిపోయాయి. మరో మాటలో
చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహ్మలై) గారి గ్రంథంలో లేని 696 హదీసులు
ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక
రకంగా చెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య
పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.
ఇప్పుడు వాటి నుండి మనము లెక్కవేసుకుంటూ పోతే ఇంకా
మనకు ఎన్ని చివరకు మిగిలి ఉన్నాయి అంటే 1900 హదీసులే ముఖ్యముగా
మనము తీసుకున్నాము. అంటే ఇమామ్ బుఖారి గారు వ్రాసిన దానిని
ఇమామ్ ముస్లీమ్ గారు ఒప్పుకోవడము లేదు. ఇమామ్ ముస్లీమ్ గారు
వ్రాసిన దానిని ఇమామ్ బుఖారి గారు ఒప్పుకోవడము లేదు. ఆ విధముగా
ఇద్దరి వాక్యములలో అభిప్రాయబేధాలు వచ్చాయి, కాబట్టి అవన్నీ తీసివేస్తే
చివరకు మనకు దాదాపు 1906 హదీసులు మిగిలినాయి. ఈ రకముగా
మనము లెక్కవేసుకుంటే 1906 హదీసులను గట్టిగా ఈ రోజు మనము
సేకరించి పెట్టుకున్నాము. ఇట్లు ఉండేటటువంటి వాటిలో ఏవి సరియైనవి,
ఏమి సరియైనవికాదు అని మనము లెక్కవేసుకుంటే, ఇప్పుడు ప్రతి
ఒక్కరు అన్నీ సత్యమే అని నమ్మేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ లెక్క
ప్రకారము పోతే అవన్నీ ఖుర్ఆన్ గ్రంథానికి భంగము కల్గించేటట్లుగా,

Page 35
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
33
34
హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత
హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.
ఇమామ్ ముస్లిం (రహ్మలై) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు.
“నేనీ గ్రంథంలో ఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన
ఆధారాలతోనే దాన్ని
గ్రంథస్తం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని
తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని
తొలగించారు. అందువల్ల ప్రపంచ ములోని జనమంతా రెండొందల యేండ్ల పాటు
హదీసుల్ని పరిశీలించి వ్రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”
సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర
విషయాలరీత్యా ఏది గొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు
ఉన్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటే ఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే,
సహీహ్ ముస్లిం అన్నిటికంటే ఉన్నతమైన గ్రంథమని, మరికొందరు అభిప్రాయ
పడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా
సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాలరీత్యా సహీహ్ ముస్లిం
ఉన్నతమైనదని అభిప్రాయ పడ్డారు.
ఏమయిన్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవ
భీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి
భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం
గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖున్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది?
పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ 'ఏకీభవిత' హదీసులు మరెంత ప్రామాణిక
మైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.
సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో
ఉన్న హదీసుల్ని ముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలనకర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అభివర్ణించిన సంగతి ప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో
ముత్యాలు ఉంటే, మరొ సముద్రంలో పగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండూ
సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో
ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!
ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో
పునరావృత హదీసులు తీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ
గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులు తగ్గిపోయాయి. మరో మాటలో
చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహ్మలై) గారి గ్రంథంలో లేని 696 హదీసులు
ఇమామ్ బుఖారీ (రహ్మలై) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక
రకంగా చెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య
పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.
ఇప్పుడు వాటి నుండి మనము లెక్కవేసుకుంటూ పోతే ఇంకా
మనకు ఎన్ని చివరకు మిగిలి ఉన్నాయి అంటే 1900 హదీసులే ముఖ్యముగా
మనము తీసుకున్నాము. అంటే ఇమామ్ బుఖారి గారు వ్రాసిన దానిని
ఇమామ్ ముస్లీమ్ గారు ఒప్పుకోవడము లేదు. ఇమామ్ ముస్లీమ్ గారు
వ్రాసిన దానిని ఇమామ్ బుఖారి గారు ఒప్పుకోవడము లేదు. ఆ విధముగా
ఇద్దరి వాక్యములలో అభిప్రాయబేధాలు వచ్చాయి, కాబట్టి అవన్నీ తీసివేస్తే
చివరకు మనకు దాదాపు 1906 హదీసులు మిగిలినాయి. ఈ రకముగా
మనము లెక్కవేసుకుంటే 1906 హదీసులను గట్టిగా ఈ రోజు మనము
సేకరించి పెట్టుకున్నాము. ఇట్లు ఉండేటటువంటి వాటిలో ఏవి సరియైనవి,
ఏమి సరియైనవికాదు అని మనము లెక్కవేసుకుంటే, ఇప్పుడు ప్రతి
ఒక్కరు అన్నీ సత్యమే అని నమ్మేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ లెక్క
ప్రకారము పోతే అవన్నీ ఖుర్ఆన్ గ్రంథానికి భంగము కల్గించేటట్లుగా,

Page 36
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
35
36
ఇది మనము
ప్రవక్త వాక్యములకు భంగము కల్గించే విధముగా ఉన్నాయని ఆ రోజు
హదీసు పండితులే వాటిని తీసివేయడము జరిగింది.
చెప్పుకోవలసిన విషయము, అర్థము కావలసిన విషయము. మీకు ఖురాన్
అంటే ఏమో తెలియదు, హదీసులు అంటే ఏమో తెలియదు కాబట్టి మీకు
ముందుగా హదీసులు అంటే ఇవి, ఖురాన్ అంటే ఇది అని చెప్పుతున్నాము.
ఈ రోజు ముస్లీమ్లు అంతా ఎక్కువగా హదీసులనే ఆచరిస్తున్నారు. అంటే
95% హదీసులను, కేవలము 5% మాత్రము ఖురాన్ను అనుసరిస్తున్నారని
మనము చెప్పుకోవాలి. ఇప్పుడు ఖురాన్ యొక్క పవిత్రతను ఈ 'ఖుదా
ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ' గొప్పగా చెప్పుకుంటూ ఉంది, ఖుర్ఆన్
యొక్క పవిత్రతను అది కాపాడుతూ ఉంది. అక్కడ ఖుర్ఆన్ యొక్క
పవిత్రత తరువాత ముహమ్మద్ ప్రవక్తగారి గౌరవానికి ఎక్కడా భంగము
కలుగకుండా చేసేటటువంటి విధానము ఈ సొసైటిలో ఉంది, కాబట్టి
ఇప్పుడు మనకు అటువంటిది తప్పు ఏదైనా ఎక్కడయినా హదీసులలో
కనిపించినా, కొన్ని లక్షల హదీసులను వాళ్ళు తీసివేసినప్పుడు, మనము
కూడా ఒకటో రెండో ప్రక్కన పెట్టి, దానికంటే ముఖ్యమైనవి ఖుర్ఆన్ అని
చెప్పుకోవడము మనకు జరుగుతుంది. ఆ లెక్క ప్రకారము పోతే ఖుర్ఆన్
గ్రంథము తరువాత ఈ హదీసు గ్రంథాలు వచ్చాయని తెలియుచున్నది.
హదీసులలో ఇంకా మనకు యోగ్యమైనవి ఎన్ని? అయోగ్యమైనవి ఎన్ని?
అని తెలుసుకోవాలి. ఆ విధముగా మనము లెక్కవేసుకుంటూ పోతే,
హదీసులు, ఖుర్ఆన్ ఇవి మీకు క్రొత్త వాక్యములుగా కనిపించినా గానీ,
ఇవి మనము ఇస్లామ్ మతమును అర్థము చేసుకొనే దానికి పునాదిలాంటివి
అని కొందరు చెప్పినా హదీసులకంటే ఖుర్ఆన్ గ్రంథమే ముస్లీమ్లకు
ముఖ్యమైనదని మరి కొందరు అంటున్నారు. ఖుర్ఆన్ దైవ గ్రంథమని
మేము అంటున్నాము.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ప్రబోధానంద యోగీశ్వరులు భగవద్గీత చెప్పుతున్నాడు, మరలా
ఇస్లామ్లోనికి వెళ్ళినాడు అని మీరు అనుకోవద్దండి. నేను క్రైస్తవములో
మాట్లాడుతున్నాను, ఇస్లామ్లో మాట్లాడుతున్నాను, హిందుత్వములో కూడా
మాట్లాడుతున్నాను. ఈ రోజు 'ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ'
వాళ్ళు నన్ను అడిగినప్పుడు, నాకు తెలిసినంతవరకు నేను కొన్ని విషయాలు
వాళ్ళతో చెప్పగలిగాను. ఆ చెప్పిన విషయాలనే మీకు కూడా ఇప్పుడు
అందిస్తున్నాము. మీరు కూడా దీనిని అర్థము చేసుకోగలిగితే, ఇస్లామ్
అంటే ఏమి? ఇందుత్వము అంటే ఏమి? అనేది తెలుస్తుంది. ఒకరికొకరు
ద్వేషాలు పెంచుకోకుండా మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని
అనుకోకుండా అందరూ జ్ఞానమును గురించి అవగాహన చేసుకొనేదానికి
అవకాశము ఉంటుంది. హిందువులను ఆ మతములోకి పోమ్మని చెప్పలేదు
కదా! ముస్లీమ్లను ఈ మతములోకి రమ్మని చెప్పలేదు కదా! ఎవరినీ
మతాలు మార్చుకోమని నేను చెప్పలేదు కదా! మతములో ఉండే సారాంశము
తెలుసుకోమని చెప్పుతున్నాను. ఏ మతములో ఉండే వాళ్లు ఆ మతములోనే
ఉండండి. మతాల మార్పిడి మంచిది కాదు అని మేము మొదటి నుంచి
చెప్పుతున్నాము. అంతమాత్రమున మీరు ఉలిక్కి పడడము ఎందుకు? ఆ
రకముగా అసూయ లేకుండా విషయాన్ని ఆవగాహన చేసుకోండి.
అవగాహన చేసుకోవడము తప్పులేదు కదా! ఇదేమీ మీకు దుష్టకార్యము
కాదు కదా! మరి మనము ఎన్నో పనికి మాలిన పనులు చేస్తున్నాము.
దొంగతనములు చేస్తున్నాము, రకరకాలుగా మోసాలు చేస్తున్నాము, ఎంతో
హీనమైన పనులు చేస్తున్నాము. ఒక పవిత్ర గ్రంథాన్ని గురించి
తెలుసుకోవడము హీనమైన పనేమీ కాదు కదా! అదేమి చెడ్డ పని కాదు
కదా! కానీ కొంతమంది మమ్మల్ని కూడా నిందించిన వాళ్ళు ఉన్నారు.

Page 37
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
35
36
ఇది మనము
ప్రవక్త వాక్యములకు భంగము కల్గించే విధముగా ఉన్నాయని ఆ రోజు
హదీసు పండితులే వాటిని తీసివేయడము జరిగింది.
చెప్పుకోవలసిన విషయము, అర్థము కావలసిన విషయము. మీకు ఖురాన్
అంటే ఏమో తెలియదు, హదీసులు అంటే ఏమో తెలియదు కాబట్టి మీకు
ముందుగా హదీసులు అంటే ఇవి, ఖురాన్ అంటే ఇది అని చెప్పుతున్నాము.
ఈ రోజు ముస్లీమ్లు అంతా ఎక్కువగా హదీసులనే ఆచరిస్తున్నారు. అంటే
95% హదీసులను, కేవలము 5% మాత్రము ఖురాన్ను అనుసరిస్తున్నారని
మనము చెప్పుకోవాలి. ఇప్పుడు ఖురాన్ యొక్క పవిత్రతను ఈ 'ఖుదా
ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ' గొప్పగా చెప్పుకుంటూ ఉంది, ఖుర్ఆన్
యొక్క పవిత్రతను అది కాపాడుతూ ఉంది. అక్కడ ఖుర్ఆన్ యొక్క
పవిత్రత తరువాత ముహమ్మద్ ప్రవక్తగారి గౌరవానికి ఎక్కడా భంగము
కలుగకుండా చేసేటటువంటి విధానము ఈ సొసైటిలో ఉంది, కాబట్టి
ఇప్పుడు మనకు అటువంటిది తప్పు ఏదైనా ఎక్కడయినా హదీసులలో
కనిపించినా, కొన్ని లక్షల హదీసులను వాళ్ళు తీసివేసినప్పుడు, మనము
కూడా ఒకటో రెండో ప్రక్కన పెట్టి, దానికంటే ముఖ్యమైనవి ఖుర్ఆన్ అని
చెప్పుకోవడము మనకు జరుగుతుంది. ఆ లెక్క ప్రకారము పోతే ఖుర్ఆన్
గ్రంథము తరువాత ఈ హదీసు గ్రంథాలు వచ్చాయని తెలియుచున్నది.
హదీసులలో ఇంకా మనకు యోగ్యమైనవి ఎన్ని? అయోగ్యమైనవి ఎన్ని?
అని తెలుసుకోవాలి. ఆ విధముగా మనము లెక్కవేసుకుంటూ పోతే,
హదీసులు, ఖుర్ఆన్ ఇవి మీకు క్రొత్త వాక్యములుగా కనిపించినా గానీ,
ఇవి మనము ఇస్లామ్ మతమును అర్థము చేసుకొనే దానికి పునాదిలాంటివి
అని కొందరు చెప్పినా హదీసులకంటే ఖుర్ఆన్ గ్రంథమే ముస్లీమ్లకు
ముఖ్యమైనదని మరి కొందరు అంటున్నారు. ఖుర్ఆన్ దైవ గ్రంథమని
మేము అంటున్నాము.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ప్రబోధానంద యోగీశ్వరులు భగవద్గీత చెప్పుతున్నాడు, మరలా
ఇస్లామ్లోనికి వెళ్ళినాడు అని మీరు అనుకోవద్దండి. నేను క్రైస్తవములో
మాట్లాడుతున్నాను, ఇస్లామ్లో మాట్లాడుతున్నాను, హిందుత్వములో కూడా
మాట్లాడుతున్నాను. ఈ రోజు 'ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ'
వాళ్ళు నన్ను అడిగినప్పుడు, నాకు తెలిసినంతవరకు నేను కొన్ని విషయాలు
వాళ్ళతో చెప్పగలిగాను. ఆ చెప్పిన విషయాలనే మీకు కూడా ఇప్పుడు
అందిస్తున్నాము. మీరు కూడా దీనిని అర్థము చేసుకోగలిగితే, ఇస్లామ్
అంటే ఏమి? ఇందుత్వము అంటే ఏమి? అనేది తెలుస్తుంది. ఒకరికొకరు
ద్వేషాలు పెంచుకోకుండా మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని
అనుకోకుండా అందరూ జ్ఞానమును గురించి అవగాహన చేసుకొనేదానికి
అవకాశము ఉంటుంది. హిందువులను ఆ మతములోకి పోమ్మని చెప్పలేదు
కదా! ముస్లీమ్లను ఈ మతములోకి రమ్మని చెప్పలేదు కదా! ఎవరినీ
మతాలు మార్చుకోమని నేను చెప్పలేదు కదా! మతములో ఉండే సారాంశము
తెలుసుకోమని చెప్పుతున్నాను. ఏ మతములో ఉండే వాళ్లు ఆ మతములోనే
ఉండండి. మతాల మార్పిడి మంచిది కాదు అని మేము మొదటి నుంచి
చెప్పుతున్నాము. అంతమాత్రమున మీరు ఉలిక్కి పడడము ఎందుకు? ఆ
రకముగా అసూయ లేకుండా విషయాన్ని ఆవగాహన చేసుకోండి.
అవగాహన చేసుకోవడము తప్పులేదు కదా! ఇదేమీ మీకు దుష్టకార్యము
కాదు కదా! మరి మనము ఎన్నో పనికి మాలిన పనులు చేస్తున్నాము.
దొంగతనములు చేస్తున్నాము, రకరకాలుగా మోసాలు చేస్తున్నాము, ఎంతో
హీనమైన పనులు చేస్తున్నాము. ఒక పవిత్ర గ్రంథాన్ని గురించి
తెలుసుకోవడము హీనమైన పనేమీ కాదు కదా! అదేమి చెడ్డ పని కాదు
కదా! కానీ కొంతమంది మమ్మల్ని కూడా నిందించిన వాళ్ళు ఉన్నారు.

Page 38
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
37
38
వాళ్లు అజ్ఞానులు, వాళ్లతో మాకు పని లేదు అనే ఉద్దేశ్యముతో మా పని
మేము చేస్తున్నాము అంటే ఒకరి నింద గురించి మేము పెద్దగా
పట్టించుకోలేదు. మేము దేవుని జ్ఞానాన్ని ప్రచారము చేయదలుచుకున్నాము.
దేవుని జ్ఞానాన్నే చెప్పుతున్నాము. కాబట్టి ఈ రోజు మా సంఘము అయిన
“ప్రబోధ సేవా సమితి”లో ఎంతోమంది ముస్లీమ్లు ఉన్నారు. ఎంతోమంది
క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు అందరూ మా జ్ఞానాన్ని అర్థము చేసుకోగలిగి
వుంటేనే కదా! ఇక్కడికి వచ్చేది? కానీ మతద్వేషాలు పెట్టుకుంటే ఎవరైనా
ఇక్కడికి వస్తారా? కానీ మతద్వేషాలు లేకుండా ఉండాలి అంటే మొదట
మీకు మతాల అవగాహన ఉండాలి. ఏ మతము ఏమిటి అని తెలియాలి.
ఇప్పుడు మనకు క్రైస్తవ మతము గురించి పూర్తిగా తెలియదు. అందులో
కూడా దాని విషయాలు తెలియజేస్తాము. అట్లే ఇస్లామ్ మతము గురించి
పూర్తిగా తెలియదు కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే మీకు
తెలియజేస్తున్నాము. ఆ విషయాలను మీరు లెక్కవేసుకుంటే ఇప్పుడు
ఖుర్ఆన్ అంటే ఏమి? హదీసు అంటే ఏమి? అని మీకు తెలిసిపోయింది.
హదీసు సాంప్రదాయములు, ఖుర్ఆన్ జ్ఞానము కొంతవరకు
తెలుసుకొన్నాము. మనకు భగవద్గీతలో దేవుని జ్ఞానము ఉంది కానీ నీవు
పంచ కట్టుకోవడము, బొట్టు పెట్టుకోవడము అనేటివి దేవుని జ్ఞానము
కాదు అవి భగవద్గీతలో లేవు. నీవు పెట్టుకున్నా, పెట్టుకోక పోయినా
దేవుని జ్ఞానము అనేది నీ లోపలే ఉంటుంది. ఇవన్నీ సాంప్రదాయాలు,
అయితే సాంప్రదాయాలు వేరు, జ్ఞానము వేరు. ఇప్పుడు మనము
తెలుసుకొనేది ఏమిటి అంటే ఇస్లామ్ మతములో ఉండే సాంప్రదాయములు
తెలుసుకుంటే, మనము వాటిలో ఉండే అర్ధము ఏమిటి అని తెలుసుకోగలుగు
తాము. కానీ ఇక్కడ ముఖ్యముగా ఏమి చెప్పుతున్నాము అని గమనించితే
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మీరు అర్థము చేసుకోవలసినది జ్ఞానముకంటే సాంప్రదాయాలు ముఖ్యమైనవి
కాదు, పెద్దవి కాదు. జ్ఞానము తరువాతనే మీకు సాంప్రదాయాలు కాబట్టి
ముందు దేవుని జ్ఞానాన్ని తెలుసుకో! ఖురాన్ గ్రంథములో ఉన్న దైవత్వమును
తెలుసుకో! తరువాత ఇస్లామ్ మతములో ఉన్నటువంటి సాంప్రదాయాలు
నేర్చుకోండి. మీకు మతము కాదు ముఖ్యము, దైవత్వము ముఖ్యము.
అందువలన మీరు ఖుర్ఆన్ గ్రంథాన్ని గొప్పగా చూసుకోండి. తరువాత
హదీసు గ్రంథాన్ని చూసుకోండి. మొట్ట మొదటనే హదీసు గ్రంథాన్ని
చూసుకొని ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టవద్దండి. దానికి విలువ లేకుండా
చేయవద్దండి. కాబట్టి మేము ఏమి చెప్పుతున్నాము అంటే ముహమ్మద్
ప్రవక్తగారి యొక్క గౌరవమునకు లోటు లేకుండా దేవుని యొక్క శక్తికి
ఏమాత్రము భంగము కలుగకుండా, అందరూ గుర్తించే విధముగా ఇప్పుడు
హదీసులు, ఖుర్ఆన్ విషయాలు మనము చెప్పుకుంటున్నాము. ఇందులో
ఏమి తప్పు లేదు. ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు. ఒక హిందువు
ముస్లీమ్ మాటలు చెప్పడము ఏమిటి? అని అనుకోకూడదు.
సిగ్గుపడాల్సిన విషయము ఏమీ కాదు, సంతోష పడవలసిన విషయము.
ఎందుకంటే వాళ్ళకు తెలియని విషయాలు మనము తెలుసుకొని చెప్పగలుగు
తున్నాము అంటే మీకు కూడా గొప్పగా ఉంటుంది. సంతోషముగా
ఉంటుంది. ఎందుకంటే హిందువులకు జ్ఞానము చెప్పే వ్యక్తి, ఇస్లామ్
మతములో కూడా జ్ఞానము చెప్పుతున్నాడు అంటే మీకు గొప్పతనమే కదా.
కాబట్టి మీరు కూడా సంతోషించాల్సిన విషయమే. ఇప్పుడు ముఖ్యముగా
మనము ఏమి చెప్పుతున్నాము అంటే హదీసులు అనేటి వాటికంటే ఖుర్ఆన్
గొప్పది. ఖుర్ఆన్ గ్రంథములో ఉండేటటువంటి జ్ఞానము గొప్పది. ఖుర్ఆన్
గ్రంథములో ఉండేటటువంటి జ్ఞానము ప్రకారము, ముందు దానిని మనము
ఇది

Page 39
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
37
38
వాళ్లు అజ్ఞానులు, వాళ్లతో మాకు పని లేదు అనే ఉద్దేశ్యముతో మా పని
మేము చేస్తున్నాము అంటే ఒకరి నింద గురించి మేము పెద్దగా
పట్టించుకోలేదు. మేము దేవుని జ్ఞానాన్ని ప్రచారము చేయదలుచుకున్నాము.
దేవుని జ్ఞానాన్నే చెప్పుతున్నాము. కాబట్టి ఈ రోజు మా సంఘము అయిన
“ప్రబోధ సేవా సమితి”లో ఎంతోమంది ముస్లీమ్లు ఉన్నారు. ఎంతోమంది
క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు అందరూ మా జ్ఞానాన్ని అర్థము చేసుకోగలిగి
వుంటేనే కదా! ఇక్కడికి వచ్చేది? కానీ మతద్వేషాలు పెట్టుకుంటే ఎవరైనా
ఇక్కడికి వస్తారా? కానీ మతద్వేషాలు లేకుండా ఉండాలి అంటే మొదట
మీకు మతాల అవగాహన ఉండాలి. ఏ మతము ఏమిటి అని తెలియాలి.
ఇప్పుడు మనకు క్రైస్తవ మతము గురించి పూర్తిగా తెలియదు. అందులో
కూడా దాని విషయాలు తెలియజేస్తాము. అట్లే ఇస్లామ్ మతము గురించి
పూర్తిగా తెలియదు కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే మీకు
తెలియజేస్తున్నాము. ఆ విషయాలను మీరు లెక్కవేసుకుంటే ఇప్పుడు
ఖుర్ఆన్ అంటే ఏమి? హదీసు అంటే ఏమి? అని మీకు తెలిసిపోయింది.
హదీసు సాంప్రదాయములు, ఖుర్ఆన్ జ్ఞానము కొంతవరకు
తెలుసుకొన్నాము. మనకు భగవద్గీతలో దేవుని జ్ఞానము ఉంది కానీ నీవు
పంచ కట్టుకోవడము, బొట్టు పెట్టుకోవడము అనేటివి దేవుని జ్ఞానము
కాదు అవి భగవద్గీతలో లేవు. నీవు పెట్టుకున్నా, పెట్టుకోక పోయినా
దేవుని జ్ఞానము అనేది నీ లోపలే ఉంటుంది. ఇవన్నీ సాంప్రదాయాలు,
అయితే సాంప్రదాయాలు వేరు, జ్ఞానము వేరు. ఇప్పుడు మనము
తెలుసుకొనేది ఏమిటి అంటే ఇస్లామ్ మతములో ఉండే సాంప్రదాయములు
తెలుసుకుంటే, మనము వాటిలో ఉండే అర్ధము ఏమిటి అని తెలుసుకోగలుగు
తాము. కానీ ఇక్కడ ముఖ్యముగా ఏమి చెప్పుతున్నాము అని గమనించితే
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మీరు అర్థము చేసుకోవలసినది జ్ఞానముకంటే సాంప్రదాయాలు ముఖ్యమైనవి
కాదు, పెద్దవి కాదు. జ్ఞానము తరువాతనే మీకు సాంప్రదాయాలు కాబట్టి
ముందు దేవుని జ్ఞానాన్ని తెలుసుకో! ఖురాన్ గ్రంథములో ఉన్న దైవత్వమును
తెలుసుకో! తరువాత ఇస్లామ్ మతములో ఉన్నటువంటి సాంప్రదాయాలు
నేర్చుకోండి. మీకు మతము కాదు ముఖ్యము, దైవత్వము ముఖ్యము.
అందువలన మీరు ఖుర్ఆన్ గ్రంథాన్ని గొప్పగా చూసుకోండి. తరువాత
హదీసు గ్రంథాన్ని చూసుకోండి. మొట్ట మొదటనే హదీసు గ్రంథాన్ని
చూసుకొని ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టవద్దండి. దానికి విలువ లేకుండా
చేయవద్దండి. కాబట్టి మేము ఏమి చెప్పుతున్నాము అంటే ముహమ్మద్
ప్రవక్తగారి యొక్క గౌరవమునకు లోటు లేకుండా దేవుని యొక్క శక్తికి
ఏమాత్రము భంగము కలుగకుండా, అందరూ గుర్తించే విధముగా ఇప్పుడు
హదీసులు, ఖుర్ఆన్ విషయాలు మనము చెప్పుకుంటున్నాము. ఇందులో
ఏమి తప్పు లేదు. ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు. ఒక హిందువు
ముస్లీమ్ మాటలు చెప్పడము ఏమిటి? అని అనుకోకూడదు.
సిగ్గుపడాల్సిన విషయము ఏమీ కాదు, సంతోష పడవలసిన విషయము.
ఎందుకంటే వాళ్ళకు తెలియని విషయాలు మనము తెలుసుకొని చెప్పగలుగు
తున్నాము అంటే మీకు కూడా గొప్పగా ఉంటుంది. సంతోషముగా
ఉంటుంది. ఎందుకంటే హిందువులకు జ్ఞానము చెప్పే వ్యక్తి, ఇస్లామ్
మతములో కూడా జ్ఞానము చెప్పుతున్నాడు అంటే మీకు గొప్పతనమే కదా.
కాబట్టి మీరు కూడా సంతోషించాల్సిన విషయమే. ఇప్పుడు ముఖ్యముగా
మనము ఏమి చెప్పుతున్నాము అంటే హదీసులు అనేటి వాటికంటే ఖుర్ఆన్
గొప్పది. ఖుర్ఆన్ గ్రంథములో ఉండేటటువంటి జ్ఞానము గొప్పది. ఖుర్ఆన్
గ్రంథములో ఉండేటటువంటి జ్ఞానము ప్రకారము, ముందు దానిని మనము
ఇది

Page 40
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
39
40
అనుసరిస్తే తరువాత హదీసులను గురించి తెలియవచ్చు. అదే రకముగా
ఇందూ జ్ఞానములో ఉండేటటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోగలిగితే,
తరువాత
హిందూ సాంప్రదాయాలను మనము ఏ విధముగానైనా
తెలుసుకోవచ్చు, సాంప్రదాయాలకంటే ముందు జ్ఞానము ముఖ్యము.
అందువలన ఈ జ్ఞానానికి భంగము కల్గించే సాంప్రదాయాలు ఎక్కడా
ఉండకూడదు. అలాగే ఉన్నాయి అని 6 లక్షల హదీసులు వ్రాసుకున్నటువంటి
ఆయన చివరకు 2602 హదీసులకే ఎందుకు వచ్చాడు? 4 లక్షల హదీసులు
వ్రాసుకున్నటివంటి ఆయన 4000 హదీసులకే ఎందుకు వచ్చాడు? వాటిల్లో
కూడా ఏదో భంగము కల్గించేటటువంటి విషయాలు ఉన్నాయని చివరకి
1900 హదీసులను మాత్రము ఉంచాడు. కానీ ఈ రోజు మనము
హదీసులను చిన్నపుచ్చి మాట్లాడడము లేదు. వాటిని వ్రాసిన పెద్దలే
హదీసులను ఆ విధముగా తగ్గించారు. కాబట్టి హదీసు పెద్దలను
(పండితులను) అనుసరించి మనము కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాటు
ఉంటే అటువంటి హదీసులను మనము విమర్శించుకోవాల్సిందే,
విడదీసుకోవాల్సిందే. వాటిని వదలిపెట్టి ఖుర్ఆన్ గ్రంథములోనికి మనము
ప్రవేశించాల్సిందే, ఖుర్ఆన్ గ్రంథమును గొప్పగా చెప్పుకోవాల్సిందే.
మనము హదీసు గ్రంథాలలో ఉండేటటువంటి ఎక్కడైనా లోపాలను ఏ
విధముగా గుర్తించవచ్చు అని అంటే ఇప్పుడు మనము ఒక విషయము
చెప్పుకుందాము.
ఒక వ్యక్తి ఎక్కడైనా ప్రశ్న వేస్తే దానికి సంపూర్ణమైన జవాబు
ఉంటే అది జ్ఞానము, జవాబు లేకపోతే అది అజ్ఞానము అని చాలామార్లు
మనము చెప్పుకున్నాము. ఆ విధముగానే ఒక ముస్లీమ్ వ్యక్తి ఒక ముస్లీమ్
పండితున్ని అంటే బాగా జ్ఞానము తెలిసిన వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడు.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
“ఈ హదీసులో ఒక విషయము వ్రాయబడి ఉంది. నాకు అర్థము కాలేదు
నీవు చెప్పుతావా” అని అడిగినాడు. అంటే మత పెద్దలు, హదీసు పండితులు
ఆ విషయాలు చెప్పేదానికే కదా! ఉండేది. అప్పుడు నేను చెప్తాను అని
పండితుడు అన్నాడు. అప్పుడు ముస్లీమ్ వ్యక్తి ఇలా అడిగాడు “ఒకానొకరోజు
ముహమ్మద్ ప్రవక్త గారికి జ్ఞానాన్ని తెలియజేసిన దైవదూత అయిన
జిబ్రయేల్, ముహమ్మద్ ప్రవక్తగారిని పిలుచుకొని పాకిస్తాను పోయి, అక్కడ
మసీదులో ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసిన తరువాత అక్కడ నుంచి జిబ్రయేల్
దూత, ముహమ్మద్ ప్రవక్తగారిని తీసుకొని పోయినట్లు ఒక హదీసులో
వ్రాయబడి ఉంది. ఆకాశము వరకు పోయిన తరువాత, జిబ్రయేల్ దైవదూత
ఆకాశమును తెరుచుకో అని అంటే మొదటి ఆకాశము తెరుచుకుంది.
ఆకాశము తెరుచుకున్న తరువాత అక్కడ అందరికి తండ్రి అయిన ఆదాము
ఉన్నాడు అని వ్రాసారు. అందరికి తండ్రి అయిన ఆదాము ఇతను దైవ
ప్రవక్తే అని ప్రవక్తను దీవించాడు. అక్కడి నుంచి ఆయన దీవెనలను
తీసుకొని మరలా జిబ్రయేల్, ముహమ్మద్ గారు ఇద్దరూ ఇంకా పైకి వెళ్ళితే
అక్కడ రెండవ ఆకాశము ఉంది. అప్పుడు జిబ్రయేల్ దైవదూత రెండవ
ఆకాశమును తెరుచుకో అని కోరితే రెండవ ఆకాశము కూడా తెరుచుకుంది.
అక్కడ ఈసా, ఎషయా అను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు
గొప్ప వ్యక్తులు ప్రవక్తను దీవించడము జరిగింది. ఈ రకముగా తర్వాత
వారు మూడవ ఆకాశానికి పోయారు. అక్కడ కూడా ఒక ఆయన గొప్ప
ప్రవక్త ఉండేవాడు. అతను కూడా ప్రవక్తగారిని దీవించడము జరిగింది.
నాలుగో ఆకాశానికి పోయినారు. అక్కడ కూడా ఉన్నవారు దీవించడము
జరిగింది.
ఇలా ఆరవ ఆకాశము వరకు పోయినప్పుడు ఆరవ ఆకాశము
కూడా తెరుచుకోబడింది. అక్కడ పూర్వము ఉన్నటువంటి మూసా అనే

Page 41
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
39
40
అనుసరిస్తే తరువాత హదీసులను గురించి తెలియవచ్చు. అదే రకముగా
ఇందూ జ్ఞానములో ఉండేటటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోగలిగితే,
తరువాత
హిందూ సాంప్రదాయాలను మనము ఏ విధముగానైనా
తెలుసుకోవచ్చు, సాంప్రదాయాలకంటే ముందు జ్ఞానము ముఖ్యము.
అందువలన ఈ జ్ఞానానికి భంగము కల్గించే సాంప్రదాయాలు ఎక్కడా
ఉండకూడదు. అలాగే ఉన్నాయి అని 6 లక్షల హదీసులు వ్రాసుకున్నటువంటి
ఆయన చివరకు 2602 హదీసులకే ఎందుకు వచ్చాడు? 4 లక్షల హదీసులు
వ్రాసుకున్నటివంటి ఆయన 4000 హదీసులకే ఎందుకు వచ్చాడు? వాటిల్లో
కూడా ఏదో భంగము కల్గించేటటువంటి విషయాలు ఉన్నాయని చివరకి
1900 హదీసులను మాత్రము ఉంచాడు. కానీ ఈ రోజు మనము
హదీసులను చిన్నపుచ్చి మాట్లాడడము లేదు. వాటిని వ్రాసిన పెద్దలే
హదీసులను ఆ విధముగా తగ్గించారు. కాబట్టి హదీసు పెద్దలను
(పండితులను) అనుసరించి మనము కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాటు
ఉంటే అటువంటి హదీసులను మనము విమర్శించుకోవాల్సిందే,
విడదీసుకోవాల్సిందే. వాటిని వదలిపెట్టి ఖుర్ఆన్ గ్రంథములోనికి మనము
ప్రవేశించాల్సిందే, ఖుర్ఆన్ గ్రంథమును గొప్పగా చెప్పుకోవాల్సిందే.
మనము హదీసు గ్రంథాలలో ఉండేటటువంటి ఎక్కడైనా లోపాలను ఏ
విధముగా గుర్తించవచ్చు అని అంటే ఇప్పుడు మనము ఒక విషయము
చెప్పుకుందాము.
ఒక వ్యక్తి ఎక్కడైనా ప్రశ్న వేస్తే దానికి సంపూర్ణమైన జవాబు
ఉంటే అది జ్ఞానము, జవాబు లేకపోతే అది అజ్ఞానము అని చాలామార్లు
మనము చెప్పుకున్నాము. ఆ విధముగానే ఒక ముస్లీమ్ వ్యక్తి ఒక ముస్లీమ్
పండితున్ని అంటే బాగా జ్ఞానము తెలిసిన వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడు.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
“ఈ హదీసులో ఒక విషయము వ్రాయబడి ఉంది. నాకు అర్థము కాలేదు
నీవు చెప్పుతావా” అని అడిగినాడు. అంటే మత పెద్దలు, హదీసు పండితులు
ఆ విషయాలు చెప్పేదానికే కదా! ఉండేది. అప్పుడు నేను చెప్తాను అని
పండితుడు అన్నాడు. అప్పుడు ముస్లీమ్ వ్యక్తి ఇలా అడిగాడు “ఒకానొకరోజు
ముహమ్మద్ ప్రవక్త గారికి జ్ఞానాన్ని తెలియజేసిన దైవదూత అయిన
జిబ్రయేల్, ముహమ్మద్ ప్రవక్తగారిని పిలుచుకొని పాకిస్తాను పోయి, అక్కడ
మసీదులో ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసిన తరువాత అక్కడ నుంచి జిబ్రయేల్
దూత, ముహమ్మద్ ప్రవక్తగారిని తీసుకొని పోయినట్లు ఒక హదీసులో
వ్రాయబడి ఉంది. ఆకాశము వరకు పోయిన తరువాత, జిబ్రయేల్ దైవదూత
ఆకాశమును తెరుచుకో అని అంటే మొదటి ఆకాశము తెరుచుకుంది.
ఆకాశము తెరుచుకున్న తరువాత అక్కడ అందరికి తండ్రి అయిన ఆదాము
ఉన్నాడు అని వ్రాసారు. అందరికి తండ్రి అయిన ఆదాము ఇతను దైవ
ప్రవక్తే అని ప్రవక్తను దీవించాడు. అక్కడి నుంచి ఆయన దీవెనలను
తీసుకొని మరలా జిబ్రయేల్, ముహమ్మద్ గారు ఇద్దరూ ఇంకా పైకి వెళ్ళితే
అక్కడ రెండవ ఆకాశము ఉంది. అప్పుడు జిబ్రయేల్ దైవదూత రెండవ
ఆకాశమును తెరుచుకో అని కోరితే రెండవ ఆకాశము కూడా తెరుచుకుంది.
అక్కడ ఈసా, ఎషయా అను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు
గొప్ప వ్యక్తులు ప్రవక్తను దీవించడము జరిగింది. ఈ రకముగా తర్వాత
వారు మూడవ ఆకాశానికి పోయారు. అక్కడ కూడా ఒక ఆయన గొప్ప
ప్రవక్త ఉండేవాడు. అతను కూడా ప్రవక్తగారిని దీవించడము జరిగింది.
నాలుగో ఆకాశానికి పోయినారు. అక్కడ కూడా ఉన్నవారు దీవించడము
జరిగింది.
ఇలా ఆరవ ఆకాశము వరకు పోయినప్పుడు ఆరవ ఆకాశము
కూడా తెరుచుకోబడింది. అక్కడ పూర్వము ఉన్నటువంటి మూసా అనే

Page 42
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
41
42
ప్రవక్త ఉండేవాడు. అతను ప్రవక్తను దీవించడము జరిగింది. దీవించిన
తరువాత మూసా ప్రవక్త ఏడ్చాడట. ముహమ్మద్ ప్రవక్త గారిని చూసి
ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చినాడు అంటే నా కాలములో నేను జ్ఞానము
చెప్పితే ఎవరూ స్వర్గానికి పోయే వాళ్ళు కాదు, కానీ నీవు చెప్పుతూ ఉంటే
చాలామంది స్వర్గానికి పోతున్నారు. అందువలన నాకు ఏడుపు వచ్చింది
అని అన్నాడు. అలా ఏడ్వడము సంతోషముతోనా, అసూయతోనా నాకేమీ
అర్థము కాలేదు, కానీ ఒక రకముగా అసూయతోనే అనుకుందాము.
తరువాత అక్కడ నుంచి వాళ్ళు ఏడో ఆకాశము వరకు పోయారు. అప్పుడు
ఏడవ ఆకాశము తెరుచుకుంది. అక్కడ దేవుడు ఉన్నాడన్నమాట. బాగా
జ్ఞాపకము పెట్టుకోండి. ఇంతకు ముందు ఒక ఆయన ఇంద్రధనస్సులో
ఏడు రంగులే ఎందుకు ఉన్నాయి? అని ఒక ప్రశ్న అడిగాడు. ఇంద్ర
ధనుస్సులో ఏడురంగులు ఉండేది వాస్తవమే. అక్కడ ఎనిమిది లేవు,
తొమ్మిది లేవు కానీ ఏడే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏడే ఆకాశములు
ఉన్నాయి. మనకు తెలియదు కానీ ఇక్కడ ఏదో లిటిగేషన్ ఉంది. అది
ముస్లీమ్లకు కూడా తెలియలేదు. కానీ ఇక్కడ మనకు ఏమి తెలిసింది
అంటే ఏడవ ఆకాశములో దేవుడు ఉన్నాడని మనకు తెలిసింది. ఇది ఒక
గొప్ప రహస్యము, ఇది వాస్తవమే, ఇది నూటికి నూరుపాళ్లు సత్యమే.
ఇప్పుడు దేవుని దగ్గరకు పోయి వీళ్ళు దేవునికి నమస్కరించడము జరిగింది.
అప్పుడు దేవుడు వీళ్ళకు ఒక విధి విధానాన్ని సమర్పించాడు.
దేవుడు మీరు ఒక రోజులో 50 పూటలు నమాజు చేసుకోండి
అని చెప్పాడు. అంటే ఒక రోజకు 50 సార్లు సరే! అని అక్కడ ఒప్పుకొని
ముహమ్మద్ ప్రవక్తగారు ఆరవ ఆకాశానికి వచ్చారు. అక్కడ నుంచి క్రిందికి
(ఆరవ ఆకాశానికి) వస్తూనే, అక్కడ ఉన్న మూసా ప్రవక్త ఏమి అయిందని
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
వారిని అని అడిగినాడు. 50 సార్లు నమాజు చేయమని దేవుడు చెప్పినాడు
అని ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. ఈయన ముందే ఏడ్చినాడు.
మీరు ఉండే దానివలనే ఎక్కువమంది స్వర్గానికి పోతున్నారు. నేను
ఉన్నప్పుడు ఎవరూ పోకుండా ఉన్నారు అని ఈయనకు అసూయ
ఎక్కువైపోయిందో మరి ఏమి ఎక్కువ అయిపోయిందో కానీ మీరు 50
సార్లు ఎక్కడ చేస్తారు? మరలా వెనక్కి పోయి తగ్గించుకోమని దేవున్ని
అడగండి అని మూసా ప్రవక్త చెప్పినాడు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త
గారు ఏదో ఒక విధముగా చేస్తాములే అని అంటే, వద్దు వద్దు మీరు
చేయలేరు, చాలా కష్టపడుతారు. ఎందుకంటే 50 సార్లు రోజంతా నమాజు
చేయడమే సరిపోతుంది. ఇంకా అన్నము ఎప్పుడు తింటారు? నీళ్ళు
ఎప్పుడు త్రాగుతారు? పనులు ఎప్పుడు చేసుకుంటారు? బ్రతికేదానికి
ఎప్పుడు సంపాదించుకుంటారు? కాలము అంతా దానికే సరిపోతుంది.
అలా వద్దు నీవు పోయి దేవున్ని అడుగు అని మూసా చెప్పాడు. సరే అని
అప్పుడు ప్రవక్తగారు, జిబ్రయిల్ దూతగారు ఇద్దరూ పైకి పోవడము
జరిగింది. దేవుడు మొదట ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. అప్పుడు
అల్లాహ్ను ఏమి అడిగినారు అంటే, ఈ 50 నమాజులు మేము చేయలేము
కొంత తగ్గించుకోమని అని అడిగారు. అప్పుడు అల్లాహ్ ఏదో విధముగా
చేయిపోండి అని కొంత తగ్గించుకొని పంపించినాడు. తరువాత వాళ్ళు
క్రిందికి వస్తే, మరలా మూసా ఏమయింది అని అంటే ఐదో ఆరో
తగ్గించుకున్నాడు అని ముహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అప్పుడు అలా కూడా
మీరు చేయలేరు, చాలా కష్టము, చూడండి! మీరు పోయి మరలా అడగండి
అని మూసా చెప్పాడు. సరే అని వాళ్ళు మరలా తిరిగి ఏడవ ఆకాశనమునకు
పోయారు. ఈ విధముగా వీళ్ళు పోవడము, ఆయన తగ్గించుకోవడము

Page 43
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
41
42
ప్రవక్త ఉండేవాడు. అతను ప్రవక్తను దీవించడము జరిగింది. దీవించిన
తరువాత మూసా ప్రవక్త ఏడ్చాడట. ముహమ్మద్ ప్రవక్త గారిని చూసి
ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చినాడు అంటే నా కాలములో నేను జ్ఞానము
చెప్పితే ఎవరూ స్వర్గానికి పోయే వాళ్ళు కాదు, కానీ నీవు చెప్పుతూ ఉంటే
చాలామంది స్వర్గానికి పోతున్నారు. అందువలన నాకు ఏడుపు వచ్చింది
అని అన్నాడు. అలా ఏడ్వడము సంతోషముతోనా, అసూయతోనా నాకేమీ
అర్థము కాలేదు, కానీ ఒక రకముగా అసూయతోనే అనుకుందాము.
తరువాత అక్కడ నుంచి వాళ్ళు ఏడో ఆకాశము వరకు పోయారు. అప్పుడు
ఏడవ ఆకాశము తెరుచుకుంది. అక్కడ దేవుడు ఉన్నాడన్నమాట. బాగా
జ్ఞాపకము పెట్టుకోండి. ఇంతకు ముందు ఒక ఆయన ఇంద్రధనస్సులో
ఏడు రంగులే ఎందుకు ఉన్నాయి? అని ఒక ప్రశ్న అడిగాడు. ఇంద్ర
ధనుస్సులో ఏడురంగులు ఉండేది వాస్తవమే. అక్కడ ఎనిమిది లేవు,
తొమ్మిది లేవు కానీ ఏడే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏడే ఆకాశములు
ఉన్నాయి. మనకు తెలియదు కానీ ఇక్కడ ఏదో లిటిగేషన్ ఉంది. అది
ముస్లీమ్లకు కూడా తెలియలేదు. కానీ ఇక్కడ మనకు ఏమి తెలిసింది
అంటే ఏడవ ఆకాశములో దేవుడు ఉన్నాడని మనకు తెలిసింది. ఇది ఒక
గొప్ప రహస్యము, ఇది వాస్తవమే, ఇది నూటికి నూరుపాళ్లు సత్యమే.
ఇప్పుడు దేవుని దగ్గరకు పోయి వీళ్ళు దేవునికి నమస్కరించడము జరిగింది.
అప్పుడు దేవుడు వీళ్ళకు ఒక విధి విధానాన్ని సమర్పించాడు.
దేవుడు మీరు ఒక రోజులో 50 పూటలు నమాజు చేసుకోండి
అని చెప్పాడు. అంటే ఒక రోజకు 50 సార్లు సరే! అని అక్కడ ఒప్పుకొని
ముహమ్మద్ ప్రవక్తగారు ఆరవ ఆకాశానికి వచ్చారు. అక్కడ నుంచి క్రిందికి
(ఆరవ ఆకాశానికి) వస్తూనే, అక్కడ ఉన్న మూసా ప్రవక్త ఏమి అయిందని
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
వారిని అని అడిగినాడు. 50 సార్లు నమాజు చేయమని దేవుడు చెప్పినాడు
అని ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. ఈయన ముందే ఏడ్చినాడు.
మీరు ఉండే దానివలనే ఎక్కువమంది స్వర్గానికి పోతున్నారు. నేను
ఉన్నప్పుడు ఎవరూ పోకుండా ఉన్నారు అని ఈయనకు అసూయ
ఎక్కువైపోయిందో మరి ఏమి ఎక్కువ అయిపోయిందో కానీ మీరు 50
సార్లు ఎక్కడ చేస్తారు? మరలా వెనక్కి పోయి తగ్గించుకోమని దేవున్ని
అడగండి అని మూసా ప్రవక్త చెప్పినాడు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త
గారు ఏదో ఒక విధముగా చేస్తాములే అని అంటే, వద్దు వద్దు మీరు
చేయలేరు, చాలా కష్టపడుతారు. ఎందుకంటే 50 సార్లు రోజంతా నమాజు
చేయడమే సరిపోతుంది. ఇంకా అన్నము ఎప్పుడు తింటారు? నీళ్ళు
ఎప్పుడు త్రాగుతారు? పనులు ఎప్పుడు చేసుకుంటారు? బ్రతికేదానికి
ఎప్పుడు సంపాదించుకుంటారు? కాలము అంతా దానికే సరిపోతుంది.
అలా వద్దు నీవు పోయి దేవున్ని అడుగు అని మూసా చెప్పాడు. సరే అని
అప్పుడు ప్రవక్తగారు, జిబ్రయిల్ దూతగారు ఇద్దరూ పైకి పోవడము
జరిగింది. దేవుడు మొదట ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. అప్పుడు
అల్లాహ్ను ఏమి అడిగినారు అంటే, ఈ 50 నమాజులు మేము చేయలేము
కొంత తగ్గించుకోమని అని అడిగారు. అప్పుడు అల్లాహ్ ఏదో విధముగా
చేయిపోండి అని కొంత తగ్గించుకొని పంపించినాడు. తరువాత వాళ్ళు
క్రిందికి వస్తే, మరలా మూసా ఏమయింది అని అంటే ఐదో ఆరో
తగ్గించుకున్నాడు అని ముహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అప్పుడు అలా కూడా
మీరు చేయలేరు, చాలా కష్టము, చూడండి! మీరు పోయి మరలా అడగండి
అని మూసా చెప్పాడు. సరే అని వాళ్ళు మరలా తిరిగి ఏడవ ఆకాశనమునకు
పోయారు. ఈ విధముగా వీళ్ళు పోవడము, ఆయన తగ్గించుకోవడము

Page 44
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
43
మరలా వీళ్ళు తిరిగి పోవడము, ఆయన తగ్గించుకోవడము ఇక్కడికి వస్తే
మూసా పోండి అని మరలా చెప్పడము ఈ రకముగా 7, 8 సార్లు తిరిగిన
తరువాత, చివరకు 5 సార్లు చేసుకోండి అని అల్లాహ్ చెప్పినాడంట. చివరకు
50 నుంచి 5 సార్లకు వచ్చింది. 5 సార్లకు వస్తే, మరలా మూసా ఏమి
చెప్పినాడు అంటే 5 సార్లు కూడా మీరు చేయలేరు మీకు కష్టము ఇంకొకసారి
వెళ్ళి అడుగుపోండి అని అంటే ముహమ్మద్ ప్రవక్త “అక్కడకు పోయి
పోయి నాకు సిగ్గు అవుతుంది. నేను పోయి అడగలేను. చాలు 5 సార్లు,
మేము ఏదో విధముగా నమాజ్ చేసుకుంటాము” అని ఆయన మాటను
లెక్కపెట్టుకోలేదు.
5 నమాజులతో తృప్తిపడి, వాళ్ళు క్రిందికి వచ్చారు. క్రిందికి
వచ్చేటప్పుడు వాళ్ళకు దారిలో అన్ని ఆకాశాలలో పాపము చేసిన వారు
ఎడమ ప్రక్క, పుణ్యములు చేసినవారు కుడిప్రక్క ఉన్నట్లు కనిపించారు.
వ్యభిచారము చేసినవాళ్ళ ఎదలకు కొండ్లు వేసి దేవుడు వ్రేలాడకట్టినాడంట.
అంటే వాళ్ళు ఆ రకమైన కర్మను అనుభవిస్తున్నారు. ఇంకా అబద్ధాలు
చెప్పిన వాళ్ళకు నోటిలో అగ్ని పోసినారట. ఆ అగ్నికి కడుపులో ప్రేవులు
ఉడుకుతా ఉన్నాయట.
ఈ రకముగా అనేక రకాలుగా నరకము
అనుభవిస్తున్నారంట. ఈ రకముగా స్వర్గము అనుభవించేవాళ్ళు ఉన్నారు.
నరకము అనుభవించే వాళ్ళు ఉన్నారు. రకరకాల నరకాలను స్వర్గాలను
కుడి ఎడమ ప్రక్కల వీళ్ళు చూస్తూ రావడము జరిగింది. ఇదంతా జరిగిన
తరువాత తప్పని సరిగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ, మీరు 5 పూటల
నమాజు చేసుకోండి అని ప్రజలకు చెప్పడము జరిగింది. అప్పటి నుండి
అలానే నమాజు చేసుకుంటున్నారు. ఒక మంచి పని చేసే దానికి చాలా
అబద్దాలు చెప్పవలసిన పని వచ్చింది. అలా లేకుండా మంచి పనిని
44
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మంచి పని గానే చెప్పితే సరిపోతుంది.
నమాజు చేయడము (దేవుని
ప్రార్థన చేయడము) చాలా మంచి పని. అయినా ఈ కథ చెప్పుకోకుండా
చెప్పివుంటే బాగుండేది. ఎలా అయితే హిందూమతములో పురాణాలు
చెప్పినారో అలానే వీరు చెప్పారు. భక్తిని కలుగజేసేదానికి మనిషికి
పురాణాలు చెప్పినారు. కానీ భక్తిని కలుగజేసేదానికి అన్ని అబద్దాలు చెప్పినారు
అన్నమాట. అబద్దాలు చెప్పినప్పుడు కొంచెము తెలివి ఉన్నవాడు ఇది అంతా
అబద్దము అని అంటే మొదటికే మోసము వచ్చి వదలి పెట్టేదానికి
అవకాశము ఉంది. ఆ రకముగానే ఇప్పుడు ఈ కథలో దేవునికి ప్రార్థన
చేయడము, చెయ్యమని చెప్పడము బాగుంది, దీనిని ఇంకొక రకముగా
దేవుడు ఇలాగే చెప్పాడు మీరు కూడా ఇలాగే చేయండి అని అంటే
బాగుండేది. కానీ ఈ విధముగా ఈ కథను అల్లడము పొరపాటు అయింది.
ఇది హదీసు గ్రంథములో ఉండే ఒక ఘట్టము. అయితే దీంట్లో ఉండే
తప్పు ఒప్పులను మనము తీసుకుంటే ఇది ఖుర్ఆన్ గ్రంథములోని దైవ
ప్రవక్త గౌరవానికి, అల్లాహ్ గౌరవానికి భంగము కల్గించే వాక్యములుగా
ఉన్నాయి. అందువలన మనము వీటిని సవరించుకొని ఈ కథను
మరచిపోయి, మనము దేవుని కోసము ప్రార్థన చేయాలి అనేదే ముఖ్యముగా
పెట్టుకొని 5 పూటల నమాజు చేయండి మీరు అని నేను అందరికీ
తెలియజేస్తున్నాను. అందరికీ అంటే హిందువులు కూడా దేవున్ని 5 పూటల
తలుచుకోవడము మంచిది.
ముస్లీమ్లు 5 పూటలు దేవున్ని ప్రార్థన చేయండి మంచిదే కానీ
ఈ కథను బట్టి మీరు చేయవద్దండి. కథను బట్టి చేస్తే మనకు ఇబ్బంది
అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే, ఒకటవ ఆకాశము
దగ్గరకు పోయినపుడు అక్కడ ఆదాము ఉన్నాడు. అందరికీ తండ్రి ఆదాము

Page 45
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
43
మరలా వీళ్ళు తిరిగి పోవడము, ఆయన తగ్గించుకోవడము ఇక్కడికి వస్తే
మూసా పోండి అని మరలా చెప్పడము ఈ రకముగా 7, 8 సార్లు తిరిగిన
తరువాత, చివరకు 5 సార్లు చేసుకోండి అని అల్లాహ్ చెప్పినాడంట. చివరకు
50 నుంచి 5 సార్లకు వచ్చింది. 5 సార్లకు వస్తే, మరలా మూసా ఏమి
చెప్పినాడు అంటే 5 సార్లు కూడా మీరు చేయలేరు మీకు కష్టము ఇంకొకసారి
వెళ్ళి అడుగుపోండి అని అంటే ముహమ్మద్ ప్రవక్త “అక్కడకు పోయి
పోయి నాకు సిగ్గు అవుతుంది. నేను పోయి అడగలేను. చాలు 5 సార్లు,
మేము ఏదో విధముగా నమాజ్ చేసుకుంటాము” అని ఆయన మాటను
లెక్కపెట్టుకోలేదు.
5 నమాజులతో తృప్తిపడి, వాళ్ళు క్రిందికి వచ్చారు. క్రిందికి
వచ్చేటప్పుడు వాళ్ళకు దారిలో అన్ని ఆకాశాలలో పాపము చేసిన వారు
ఎడమ ప్రక్క, పుణ్యములు చేసినవారు కుడిప్రక్క ఉన్నట్లు కనిపించారు.
వ్యభిచారము చేసినవాళ్ళ ఎదలకు కొండ్లు వేసి దేవుడు వ్రేలాడకట్టినాడంట.
అంటే వాళ్ళు ఆ రకమైన కర్మను అనుభవిస్తున్నారు. ఇంకా అబద్ధాలు
చెప్పిన వాళ్ళకు నోటిలో అగ్ని పోసినారట. ఆ అగ్నికి కడుపులో ప్రేవులు
ఉడుకుతా ఉన్నాయట.
ఈ రకముగా అనేక రకాలుగా నరకము
అనుభవిస్తున్నారంట. ఈ రకముగా స్వర్గము అనుభవించేవాళ్ళు ఉన్నారు.
నరకము అనుభవించే వాళ్ళు ఉన్నారు. రకరకాల నరకాలను స్వర్గాలను
కుడి ఎడమ ప్రక్కల వీళ్ళు చూస్తూ రావడము జరిగింది. ఇదంతా జరిగిన
తరువాత తప్పని సరిగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ, మీరు 5 పూటల
నమాజు చేసుకోండి అని ప్రజలకు చెప్పడము జరిగింది. అప్పటి నుండి
అలానే నమాజు చేసుకుంటున్నారు. ఒక మంచి పని చేసే దానికి చాలా
అబద్దాలు చెప్పవలసిన పని వచ్చింది. అలా లేకుండా మంచి పనిని
44
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మంచి పని గానే చెప్పితే సరిపోతుంది.
నమాజు చేయడము (దేవుని
ప్రార్థన చేయడము) చాలా మంచి పని. అయినా ఈ కథ చెప్పుకోకుండా
చెప్పివుంటే బాగుండేది. ఎలా అయితే హిందూమతములో పురాణాలు
చెప్పినారో అలానే వీరు చెప్పారు. భక్తిని కలుగజేసేదానికి మనిషికి
పురాణాలు చెప్పినారు. కానీ భక్తిని కలుగజేసేదానికి అన్ని అబద్దాలు చెప్పినారు
అన్నమాట. అబద్దాలు చెప్పినప్పుడు కొంచెము తెలివి ఉన్నవాడు ఇది అంతా
అబద్దము అని అంటే మొదటికే మోసము వచ్చి వదలి పెట్టేదానికి
అవకాశము ఉంది. ఆ రకముగానే ఇప్పుడు ఈ కథలో దేవునికి ప్రార్థన
చేయడము, చెయ్యమని చెప్పడము బాగుంది, దీనిని ఇంకొక రకముగా
దేవుడు ఇలాగే చెప్పాడు మీరు కూడా ఇలాగే చేయండి అని అంటే
బాగుండేది. కానీ ఈ విధముగా ఈ కథను అల్లడము పొరపాటు అయింది.
ఇది హదీసు గ్రంథములో ఉండే ఒక ఘట్టము. అయితే దీంట్లో ఉండే
తప్పు ఒప్పులను మనము తీసుకుంటే ఇది ఖుర్ఆన్ గ్రంథములోని దైవ
ప్రవక్త గౌరవానికి, అల్లాహ్ గౌరవానికి భంగము కల్గించే వాక్యములుగా
ఉన్నాయి. అందువలన మనము వీటిని సవరించుకొని ఈ కథను
మరచిపోయి, మనము దేవుని కోసము ప్రార్థన చేయాలి అనేదే ముఖ్యముగా
పెట్టుకొని 5 పూటల నమాజు చేయండి మీరు అని నేను అందరికీ
తెలియజేస్తున్నాను. అందరికీ అంటే హిందువులు కూడా దేవున్ని 5 పూటల
తలుచుకోవడము మంచిది.
ముస్లీమ్లు 5 పూటలు దేవున్ని ప్రార్థన చేయండి మంచిదే కానీ
ఈ కథను బట్టి మీరు చేయవద్దండి. కథను బట్టి చేస్తే మనకు ఇబ్బంది
అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే, ఒకటవ ఆకాశము
దగ్గరకు పోయినపుడు అక్కడ ఆదాము ఉన్నాడు. అందరికీ తండ్రి ఆదాము

Page 46
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
45
46
అని అక్కడ ఆ మాట చెప్పారు. మరి అక్కడ ఏమి అంతరాయము కల్గుతుంది
అని ఆలోచిస్తే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే కానీ మధ్యలో ఆదాము
ఎక్కడ నుంచి వచ్చాడు? ఆదాము మీ నాయన కాదు, మా నాయన
కాదు. మనందరికీ తండ్రి, మీ నాయనకు, మా నాయనకు, నీకు అందరికీ
తండ్రి ఒక్కడు ఉన్నాడు. ఆయనే 'దేవుడు' (అల్లాహ్) అని మనము
చెప్పుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఖురాన్ గ్రంథము కూడా అదే
విషయమునే చెప్పుతూవుంది. అటువంటప్పుడు ఆదాము కూడా ఎవరికీ
తండ్రి కాడు. అయితే అందరికీ తండ్రి ఆదాము అని అంటే దేవున్ని
ప్రక్కన పెట్టాల్సిన పని వస్తుంది. 'అందరికీ తండ్రి ఆదాము' అను వాక్యము
మనకు విరుద్ధముగా కనిపిస్తుంది. వేరే మతస్థులు విమర్శించే దానికి
అవకాశము ఉంది. వేరే మతస్థులు ఇస్లామ్ గ్రంథాన్ని విమర్శించే దానికి,
అవకాశము ఉంది, కాబట్టి అటువంటి అవకాశము వాళ్ళకు ఇవ్వకుండా
ఉండాలి అని అంటే అదాము అందరికి తండ్రియని మనము చెప్పుకో
కూడదు. ఎందుకంటే అల్లాహ్ అందరికీ తండ్రి. ఆయన సృష్టికర్త అందరినీ
సృష్టించినటువంటివాడు సమస్త మానవులకు అల్లాహ్ తండ్రి అయినప్పుడు
మధ్యలో ఆదాము అనడము మంచిది కాదు. ఈ మాటను మనము
ప్రక్కన పెడుదాము. ఇంకా ఏముంది అంటే దేవుడు చెప్పిన తరువాత
దేవుని వాక్యమును గొప్పగా మనము స్వీకరించేటట్లుగా ఉండాలి కానీ,
మాటి మాటికి నమాజు చేయడము నాతో కాదు అని చెప్పితే ఏమి
బాగుంటుంది. దేవుడు చెప్పిన వాక్యమును నాతో కాదు అని మరలా
తిరిగి ఎదురు చెప్పినట్లు ఉంటుంది. అంటే దేవుడు ఒక పని చెప్పితే
మనము నాతో కాదు, నాతో కాదు అంటే ఎంత బాగుంటుంది. దేవునికి
గౌరవము ఉంటుందా!
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని మనిషికి నేర్పించకుండా
ఉండాలి అంటే దేవున్ని తిరిగి అడుగకూడదు. దేవుడు ఏమి చెప్పితే అది
చేసే విధముగా ఉండాలి. నీవు చనిపో! అంటే చనిపోయేటట్లుగా ఉండాలి.
అగ్నిలో దూకు అంటే దూకేటట్లుగా ఉండాలి. అందరికీ పెద్ద దేవుడు.
అందరికీ పెద్ద దేవుడు అయినప్పుడు దేవుని మాటలు వినకుండా నాకు
చేతకాదు, నాకు చేతకాదు అంటూ పోతే ఎలా? 50 నుంచి 5కి
తగ్గించుకుంటే ఏమౌతుంది? నీ అంత సోమరి మనిషే లేడు, ముస్లీమ్
మతములో సోమరి మనుషులున్నారని చెడ్డపేరు వస్తుంది. కాబట్టి ఈ
పదాన్ని కూడా మరచిపోదాము. మనకు ఏమి చెప్పాడు అంటే దేవుడు
ఏమి చేసినా గానీ, ఏమి చెప్పినా గానీ దానికి సంసిద్ధముగా ఉండడమే
ముఖ్యము గాని, ఏమో నాకు చేతనైతే చేస్తాను లేకపోతే లేదు అనే విధముగా
ఉండకూడదు. ఈ పద్ధతి చూస్తే ఇది అలాగే ఉంది. 50 ఉంటే 5కు
తగ్గించుకుంటే అది ఏమి బాగుంటుంది? అందువలన మనము దీనిని
కూడా మరచి పోదాము. దీనిని ఇతరులు విమర్శిస్తే మనము దానికి
జవాబులు చెప్పలేము కాబట్టి ఇది కూడా మనకు ఆటంక యోగ్యముగా
ఉంది. అంటే ఖురాన్ పవిత్రతకు భంగము కలిగేటట్లుగా ఉంది కాబట్టి
దీనిని మనము తీసివేసి ఖుర్ఆన్లో చెప్పినట్లు అల్లాహ్ యే అందరికీ దేవుడు
అనుకుందాము. అల్లాహ్ ఏమి చెప్పితే అది చేస్తాము అనుకుందాము.
అంటే దేవుడు ఏమి చెప్పినా చేసేదానికి సంసిద్దముగా ఉండాలి. దేవుడు
ఈ గంటలో నీవు చనిపో అంటే చనిపోయే దానికి సంసిద్ధముగా ఉండాలి.
నీవు అందరినీ వదలిపెట్టు అని అంటే వదలిపెట్టేదానికి సంసిద్ధముగా
ఉండాలి.
అదే బైబిల్లో ఏమి చెప్పినారో తెలుసా? దేవుని విషయములో నీ
చేయి నిన్ను ఆటంకపరిస్తే నీ చేయిని తీసివేయి అన్నాడు. నీ కన్ను

Page 47
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
45
46
అని అక్కడ ఆ మాట చెప్పారు. మరి అక్కడ ఏమి అంతరాయము కల్గుతుంది
అని ఆలోచిస్తే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే కానీ మధ్యలో ఆదాము
ఎక్కడ నుంచి వచ్చాడు? ఆదాము మీ నాయన కాదు, మా నాయన
కాదు. మనందరికీ తండ్రి, మీ నాయనకు, మా నాయనకు, నీకు అందరికీ
తండ్రి ఒక్కడు ఉన్నాడు. ఆయనే 'దేవుడు' (అల్లాహ్) అని మనము
చెప్పుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఖురాన్ గ్రంథము కూడా అదే
విషయమునే చెప్పుతూవుంది. అటువంటప్పుడు ఆదాము కూడా ఎవరికీ
తండ్రి కాడు. అయితే అందరికీ తండ్రి ఆదాము అని అంటే దేవున్ని
ప్రక్కన పెట్టాల్సిన పని వస్తుంది. 'అందరికీ తండ్రి ఆదాము' అను వాక్యము
మనకు విరుద్ధముగా కనిపిస్తుంది. వేరే మతస్థులు విమర్శించే దానికి
అవకాశము ఉంది. వేరే మతస్థులు ఇస్లామ్ గ్రంథాన్ని విమర్శించే దానికి,
అవకాశము ఉంది, కాబట్టి అటువంటి అవకాశము వాళ్ళకు ఇవ్వకుండా
ఉండాలి అని అంటే అదాము అందరికి తండ్రియని మనము చెప్పుకో
కూడదు. ఎందుకంటే అల్లాహ్ అందరికీ తండ్రి. ఆయన సృష్టికర్త అందరినీ
సృష్టించినటువంటివాడు సమస్త మానవులకు అల్లాహ్ తండ్రి అయినప్పుడు
మధ్యలో ఆదాము అనడము మంచిది కాదు. ఈ మాటను మనము
ప్రక్కన పెడుదాము. ఇంకా ఏముంది అంటే దేవుడు చెప్పిన తరువాత
దేవుని వాక్యమును గొప్పగా మనము స్వీకరించేటట్లుగా ఉండాలి కానీ,
మాటి మాటికి నమాజు చేయడము నాతో కాదు అని చెప్పితే ఏమి
బాగుంటుంది. దేవుడు చెప్పిన వాక్యమును నాతో కాదు అని మరలా
తిరిగి ఎదురు చెప్పినట్లు ఉంటుంది. అంటే దేవుడు ఒక పని చెప్పితే
మనము నాతో కాదు, నాతో కాదు అంటే ఎంత బాగుంటుంది. దేవునికి
గౌరవము ఉంటుందా!
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని మనిషికి నేర్పించకుండా
ఉండాలి అంటే దేవున్ని తిరిగి అడుగకూడదు. దేవుడు ఏమి చెప్పితే అది
చేసే విధముగా ఉండాలి. నీవు చనిపో! అంటే చనిపోయేటట్లుగా ఉండాలి.
అగ్నిలో దూకు అంటే దూకేటట్లుగా ఉండాలి. అందరికీ పెద్ద దేవుడు.
అందరికీ పెద్ద దేవుడు అయినప్పుడు దేవుని మాటలు వినకుండా నాకు
చేతకాదు, నాకు చేతకాదు అంటూ పోతే ఎలా? 50 నుంచి 5కి
తగ్గించుకుంటే ఏమౌతుంది? నీ అంత సోమరి మనిషే లేడు, ముస్లీమ్
మతములో సోమరి మనుషులున్నారని చెడ్డపేరు వస్తుంది. కాబట్టి ఈ
పదాన్ని కూడా మరచిపోదాము. మనకు ఏమి చెప్పాడు అంటే దేవుడు
ఏమి చేసినా గానీ, ఏమి చెప్పినా గానీ దానికి సంసిద్ధముగా ఉండడమే
ముఖ్యము గాని, ఏమో నాకు చేతనైతే చేస్తాను లేకపోతే లేదు అనే విధముగా
ఉండకూడదు. ఈ పద్ధతి చూస్తే ఇది అలాగే ఉంది. 50 ఉంటే 5కు
తగ్గించుకుంటే అది ఏమి బాగుంటుంది? అందువలన మనము దీనిని
కూడా మరచి పోదాము. దీనిని ఇతరులు విమర్శిస్తే మనము దానికి
జవాబులు చెప్పలేము కాబట్టి ఇది కూడా మనకు ఆటంక యోగ్యముగా
ఉంది. అంటే ఖురాన్ పవిత్రతకు భంగము కలిగేటట్లుగా ఉంది కాబట్టి
దీనిని మనము తీసివేసి ఖుర్ఆన్లో చెప్పినట్లు అల్లాహ్ యే అందరికీ దేవుడు
అనుకుందాము. అల్లాహ్ ఏమి చెప్పితే అది చేస్తాము అనుకుందాము.
అంటే దేవుడు ఏమి చెప్పినా చేసేదానికి సంసిద్దముగా ఉండాలి. దేవుడు
ఈ గంటలో నీవు చనిపో అంటే చనిపోయే దానికి సంసిద్ధముగా ఉండాలి.
నీవు అందరినీ వదలిపెట్టు అని అంటే వదలిపెట్టేదానికి సంసిద్ధముగా
ఉండాలి.
అదే బైబిల్లో ఏమి చెప్పినారో తెలుసా? దేవుని విషయములో నీ
చేయి నిన్ను ఆటంకపరిస్తే నీ చేయిని తీసివేయి అన్నాడు. నీ కన్ను

Page 48
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
47
48
ఆటంకపరిస్తే కన్ను పెకలించివేయి అన్నాడు. ఆ విధముగా పోతే చేతులు,
కాళ్ళు, కన్ను అన్ని అవయవాలనే మొత్తము తీసి ప్రక్కన పెట్టు అన్నప్పుడు
మనము అన్నింటికీ సంసిద్ధముగా ఉండాలనే అక్కడ బోధించారు. నాకు
చేతనయితే చేస్తాను లేకపోతే లేదు. అంటే కాళ్ళు వద్దులే ఇంకొకటి చిన్నది
చెప్పు అని మనము అడుగుతామా? ఆ రకముగా ఆడగకుండా ముందే
ఏమి చెప్పుతున్నాము అంటే ఇది మంచి పద్దతి కాదు. దేవుని విషయములో
అన్నిటికి మనము సంసిద్దముగా ఉండాలి. కాబట్టి ఏ దానికి కూడా
మనము వెనక్కిపోకూడదు అనేది మనము నేర్చుకోవాలంటే ఈ హదీసులను
మనము మరిచిపోవడములో తప్పు ఏముంది? 7 లక్షల హదీసులలో
వాళ్ళు 2000లకు వచ్చినప్పుడు మనము ఒక హదీసును ప్రక్కన
పెట్టుకుందాము. దేవునికి ఆటంకము కదా! ఇది మరల ప్రశ్నార్థకము
అవుతుంది కదా! దాంట్లో తప్పు ఏమి ఉంది? అంటే దేవుడు చెప్పినట్లు
వినాలి అనేది మంచిది కాని అడుక్కుందాము అని పోయేది మంచిదా?
కాదు నాకు చేతకాదు అని చెప్పడము మంచిదా? ఈ మాట కూడా మనకు
ఇబ్బంది కలుగజేసే విధముగా ఉంది కాబట్టి మనము ఆ మాటను కూడా
ప్రక్కన పెడుదాము.
తరువాత ఇంకొక మాట ఏమి అంటే జిబ్రయేల్, ముహమ్మద్
ప్రవక్తగారు వచ్చేటప్పుడు స్వర్గము, నరకము యొక్క స్థానాలు చూసినారు.
స్వర్గాన్ని అనుభవించే వాళ్ళను చూసారు. నరకాన్ని అనుభవించే వాళ్ళను
చూసారు. స్వర్గాన్ని, నరకాన్ని అనుభవించే వాళ్ళు అక్కడ కనిపించినప్పుడు
అంటే వాళ్ళ యొక్క నరక బాధలు, స్వర్గ సుఖాలు చూసినప్పుడు మనకు
తప్పకుండా ఒక్క ప్రశ్నవస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా ప్రవక్త
ఉన్నాడు, మనుషులు ఉన్నారు. ప్రళయము రాలేదు. ప్రళయము చివర
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
రోజుల్లో మనుషులంతా సమాధి నుండి లేపబడుతారు. లేపబడినప్పుడు
దేవుడు వచ్చి తీర్పు చెప్పుతాడు. అప్పుడు స్వర్గానికి నరకానికి
పంపిస్తాడన్నప్పుడు వీళ్ళు ముందే స్వర్గానికి, నరకానికి ఎందుకు
పోయినారు? ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే మనకు ఇబ్బందే కదా! కాబట్టి
వాళ్ళు స్వర్గము, నరకము ముందే చూసినారు అని చెప్పడము కూడా
పొరపాటే, అంటే వీళ్ళను దేవుడు పంపించకనే ఎలా పోయినారు? అని
ప్రశ్న వస్తుంది. అంటే దేవుడు చివరి దినాలలో కదా పంపించేది. ఇప్పుడు
ఎలా పంపించినాడు? ఆయన పంపించకనే మనుషులు పోయారా అనే
ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఇటువంటి ప్రశ్నలు వేరేవాళ్ళు అడిగితే
మనకు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముస్లీమ్ అడిగితే
ఇంకొక పెద్ద ముస్లీమ్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాడు. ఒక
ముస్లీమ్ పిల్లవాడు అడిగితే వాళ్ళ ఇంట్లో తండ్రిగా ఉన్నటువంటి ముస్లీమే
ఇటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాడు. కాబట్టి మీ పిల్లవాడు
మీ ఇంట్లో అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అటువంటి
హదీసును బయటకు చెప్పవద్దండి. ఖుర్ఆన్ గురించి చెప్పండి లేకపోతే
దేవుని పవిత్రతను కాపాడే విషయములను చెప్పండి. దేవునికి ప్రశ్నార్థక
మైనటువంటి విషయాలు చెప్పవద్దండి.
హిందూమతములో ఇలాగ ఉన్నారు అని, భగవద్గీతలో తప్పులు,
ఒప్పులు మీరు చెప్పవచ్చు. అటు పోయి ఇటు పోయి మరలా ఈ
ఇస్లామ్ మతములో తప్పులు ఉన్నాయని చెప్పడము ఎందుకు అని కొందరు
నన్ను అడుగవచ్చు. దానికి నా జవాబు, ఎవరికైనా గాని తప్పు తప్పే
ఒప్పు ఒప్పే. ఇప్పుడు మనము ఏమి చెప్పుతున్నాము అంటే, ఇస్లామ్

Page 49
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
47
48
ఆటంకపరిస్తే కన్ను పెకలించివేయి అన్నాడు. ఆ విధముగా పోతే చేతులు,
కాళ్ళు, కన్ను అన్ని అవయవాలనే మొత్తము తీసి ప్రక్కన పెట్టు అన్నప్పుడు
మనము అన్నింటికీ సంసిద్ధముగా ఉండాలనే అక్కడ బోధించారు. నాకు
చేతనయితే చేస్తాను లేకపోతే లేదు. అంటే కాళ్ళు వద్దులే ఇంకొకటి చిన్నది
చెప్పు అని మనము అడుగుతామా? ఆ రకముగా ఆడగకుండా ముందే
ఏమి చెప్పుతున్నాము అంటే ఇది మంచి పద్దతి కాదు. దేవుని విషయములో
అన్నిటికి మనము సంసిద్దముగా ఉండాలి. కాబట్టి ఏ దానికి కూడా
మనము వెనక్కిపోకూడదు అనేది మనము నేర్చుకోవాలంటే ఈ హదీసులను
మనము మరిచిపోవడములో తప్పు ఏముంది? 7 లక్షల హదీసులలో
వాళ్ళు 2000లకు వచ్చినప్పుడు మనము ఒక హదీసును ప్రక్కన
పెట్టుకుందాము. దేవునికి ఆటంకము కదా! ఇది మరల ప్రశ్నార్థకము
అవుతుంది కదా! దాంట్లో తప్పు ఏమి ఉంది? అంటే దేవుడు చెప్పినట్లు
వినాలి అనేది మంచిది కాని అడుక్కుందాము అని పోయేది మంచిదా?
కాదు నాకు చేతకాదు అని చెప్పడము మంచిదా? ఈ మాట కూడా మనకు
ఇబ్బంది కలుగజేసే విధముగా ఉంది కాబట్టి మనము ఆ మాటను కూడా
ప్రక్కన పెడుదాము.
తరువాత ఇంకొక మాట ఏమి అంటే జిబ్రయేల్, ముహమ్మద్
ప్రవక్తగారు వచ్చేటప్పుడు స్వర్గము, నరకము యొక్క స్థానాలు చూసినారు.
స్వర్గాన్ని అనుభవించే వాళ్ళను చూసారు. నరకాన్ని అనుభవించే వాళ్ళను
చూసారు. స్వర్గాన్ని, నరకాన్ని అనుభవించే వాళ్ళు అక్కడ కనిపించినప్పుడు
అంటే వాళ్ళ యొక్క నరక బాధలు, స్వర్గ సుఖాలు చూసినప్పుడు మనకు
తప్పకుండా ఒక్క ప్రశ్నవస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా ప్రవక్త
ఉన్నాడు, మనుషులు ఉన్నారు. ప్రళయము రాలేదు. ప్రళయము చివర
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
రోజుల్లో మనుషులంతా సమాధి నుండి లేపబడుతారు. లేపబడినప్పుడు
దేవుడు వచ్చి తీర్పు చెప్పుతాడు. అప్పుడు స్వర్గానికి నరకానికి
పంపిస్తాడన్నప్పుడు వీళ్ళు ముందే స్వర్గానికి, నరకానికి ఎందుకు
పోయినారు? ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే మనకు ఇబ్బందే కదా! కాబట్టి
వాళ్ళు స్వర్గము, నరకము ముందే చూసినారు అని చెప్పడము కూడా
పొరపాటే, అంటే వీళ్ళను దేవుడు పంపించకనే ఎలా పోయినారు? అని
ప్రశ్న వస్తుంది. అంటే దేవుడు చివరి దినాలలో కదా పంపించేది. ఇప్పుడు
ఎలా పంపించినాడు? ఆయన పంపించకనే మనుషులు పోయారా అనే
ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఇటువంటి ప్రశ్నలు వేరేవాళ్ళు అడిగితే
మనకు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముస్లీమ్ అడిగితే
ఇంకొక పెద్ద ముస్లీమ్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాడు. ఒక
ముస్లీమ్ పిల్లవాడు అడిగితే వాళ్ళ ఇంట్లో తండ్రిగా ఉన్నటువంటి ముస్లీమే
ఇటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాడు. కాబట్టి మీ పిల్లవాడు
మీ ఇంట్లో అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అటువంటి
హదీసును బయటకు చెప్పవద్దండి. ఖుర్ఆన్ గురించి చెప్పండి లేకపోతే
దేవుని పవిత్రతను కాపాడే విషయములను చెప్పండి. దేవునికి ప్రశ్నార్థక
మైనటువంటి విషయాలు చెప్పవద్దండి.
హిందూమతములో ఇలాగ ఉన్నారు అని, భగవద్గీతలో తప్పులు,
ఒప్పులు మీరు చెప్పవచ్చు. అటు పోయి ఇటు పోయి మరలా ఈ
ఇస్లామ్ మతములో తప్పులు ఉన్నాయని చెప్పడము ఎందుకు అని కొందరు
నన్ను అడుగవచ్చు. దానికి నా జవాబు, ఎవరికైనా గాని తప్పు తప్పే
ఒప్పు ఒప్పే. ఇప్పుడు మనము ఏమి చెప్పుతున్నాము అంటే, ఇస్లామ్

Page 50
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
49
50
మతములో కూడా దేవుడు చెప్పినటువంటి వాక్యాలకు భంగము కలుగకుండా
ఉండాలి అని అంటున్నాము. నేను సర్వులను సృష్టించినాను అని దేవుడు
అక్కడ చెప్పినపుడు మరలా చివరిలో పాప, పుణ్యములను బట్టి తీర్పు
చెప్పుతాను అన్నప్పుడు, సమాధుల నుండి చివరలో లేపుతాను అని
అన్నప్పుడు వీళ్ళంతా ముందే స్వర్గము నరకాల్లో ఎందుకు ఉన్నారు అని
మనము ప్రశ్నించుకుండేదానికి అవకాశము ఉంది. వేరేవాళ్ళు అడిగితే
కూడా మన దగ్గర జవాబు లేదు. అందువలన మీరు ఏమి చేస్తారు అంటే,
ఖుర్ఆన్ గ్రంథములో విషయాల మీదనే మీరు దృష్టి పెట్టుకోండి అని
మేము ప్రత్యేకించి అందరికీ చెప్పుతున్నాము. ఇదేమిటి? మరలా భగవద్గీత
విడిచిపెట్టి ఖుర్ఆన్ అంటున్నావే? అని అనుకోవద్దండి. మీరు భగవద్గీత
చూసుకున్నా ఖుర్ఆన్ చూసుకున్నా అందరికీ దేవుని జ్ఞానము అర్థము
అయ్యే విధముగా నేను చెప్పుతున్నాను. ఒకవేళ చేతనయితే బైబిల్ కూడా
మీరు చూడండి. మేము భగవద్గీత చూసాము. అట్లే ఖుర్ఆన్ కూడా
చూసాము. చేతనయింది కాబట్టి బైబిల్ని కూడా చూసినాము. చేతనయింది
కాబట్టి అందరికీ తెలియని విషయాలు కూడా నేను తెలుసుకోగలిగినాను.
చేతనయింది కాబట్టి ప్రశ్నిస్తున్నాను. చేతకాలేదు కాబట్టి చాలామంది
చెప్పలేదు. కాబట్టి అటువంటి సంధర్భము రాకుండా మీరు అన్నీ
చెప్పగలగాలి కదా! మీరు చెప్పే స్థోమతలో ఉన్నారా? ఇప్పుడు మీరు
మిమ్ములను ప్రశ్నించుకొని చూసుకోండి. మీరు ప్రతి ప్రశ్నకు జవాబు
చెప్పుగలుగుతారేమో గుండెల మీద చేయి పెట్టుకొని చూసుకోండి.
చెప్పగలుగుతారా? లేదు.
ఈ మధ్య విజయనగరము మీటింగ్ లో కూడా నేను చెప్పినాను.
అక్కడ నా దగ్గరికి కొంతమంది ముస్లీమ్లు వచ్చారు. నన్ను వాళ్ళ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మతములోనికి కలుపుకోవాలి అని అంటే లక్షణముగా కలిసిపోతాను, నాకేమీ
అభ్యంతరము లేదు. నాకు కొంత జ్ఞానము అర్థమయితే కదా! మతములో
కలిసిపోయిన తరువాత ఎవరైనా అడిగితే నేను ఏమి చెప్పాలి? ముందు
నాకు కొంత జ్ఞానము అర్థము కావాలి అన్నాను. అప్పుడు వారు ఏమి
అర్థము కాలేదో చెప్పండి అన్నారు. నేను ఒక ప్రశ్న అడిగితే, వాళ్ళు
గందరగోళపడి చివరకు ఇంటర్నెట్లో చూసి చెప్పుతాము అన్నారు.
అప్పుడు నేను మీరు జవాబు చెప్పిన తరువాత చూస్తాము అని చెప్పి
బయటకు వచ్చినాను. ఆ రకముగా మతపెద్దలయిన వాళ్ళు చెప్ప
లేకపోయారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందువలన మనము
అలా కాకుండా అంటే మనము తెలుసుకోగలిగితే ఏదైనా తెలుసుకోవచ్చు.
అందువలన మేము ఒక చిన్న ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పలేని
పరిస్థితి అందులో ఉంది. కాబట్టి అలా కాకుండా అటువంటి పరిస్థితి
ఖుర్ఆన్ గ్రంథంలో రాకుండా ప్రతి వాక్యానికి అంటే ప్రతి ఆయత్కు
జవాబు చెప్పే స్థోమత కల్గించాలి అంటే ప్రతి ఒక్క ముస్లీమ్ ఆ విధంగా
తయారు కావాలనే ఉద్దేశ్యముతో మీ దగ్గర మీకు ఏమైనా తెలియని
విషయాలు ఉంటే మమ్మల్ని అడగండి దానికి వివరము చెప్తాము. ఈ
మతము, ఆ మతము అని మత బేధము పెట్టుకోవద్దండి. మీకు దేవుని
విషయము కదా కావల్సినది! నాకు కూడా దేవుని విషయమే అవసరము.
దేవుని విషయమును ప్రశ్నించండి మా ఖుర్ఆన్ గ్రంథములో ఇది ఉంది.
దీని అర్థము ఏమి అని అడగండి తప్పక చెప్పుతాము. మా వాళ్ళు చెప్పలేని
అర్థము మీరు చెప్పగలరా? అని అనుకోవద్దండి. మీ వాళ్ళే మీకు
చెప్పలేకపోయినా దాని అర్థము నేను చెప్పుతాను అని చెప్పుతున్నాను.
ఇక్కడ మీవాళ్ళు మావాళ్లు అని అనుకోకూడదు.

Page 51
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
49
50
మతములో కూడా దేవుడు చెప్పినటువంటి వాక్యాలకు భంగము కలుగకుండా
ఉండాలి అని అంటున్నాము. నేను సర్వులను సృష్టించినాను అని దేవుడు
అక్కడ చెప్పినపుడు మరలా చివరిలో పాప, పుణ్యములను బట్టి తీర్పు
చెప్పుతాను అన్నప్పుడు, సమాధుల నుండి చివరలో లేపుతాను అని
అన్నప్పుడు వీళ్ళంతా ముందే స్వర్గము నరకాల్లో ఎందుకు ఉన్నారు అని
మనము ప్రశ్నించుకుండేదానికి అవకాశము ఉంది. వేరేవాళ్ళు అడిగితే
కూడా మన దగ్గర జవాబు లేదు. అందువలన మీరు ఏమి చేస్తారు అంటే,
ఖుర్ఆన్ గ్రంథములో విషయాల మీదనే మీరు దృష్టి పెట్టుకోండి అని
మేము ప్రత్యేకించి అందరికీ చెప్పుతున్నాము. ఇదేమిటి? మరలా భగవద్గీత
విడిచిపెట్టి ఖుర్ఆన్ అంటున్నావే? అని అనుకోవద్దండి. మీరు భగవద్గీత
చూసుకున్నా ఖుర్ఆన్ చూసుకున్నా అందరికీ దేవుని జ్ఞానము అర్థము
అయ్యే విధముగా నేను చెప్పుతున్నాను. ఒకవేళ చేతనయితే బైబిల్ కూడా
మీరు చూడండి. మేము భగవద్గీత చూసాము. అట్లే ఖుర్ఆన్ కూడా
చూసాము. చేతనయింది కాబట్టి బైబిల్ని కూడా చూసినాము. చేతనయింది
కాబట్టి అందరికీ తెలియని విషయాలు కూడా నేను తెలుసుకోగలిగినాను.
చేతనయింది కాబట్టి ప్రశ్నిస్తున్నాను. చేతకాలేదు కాబట్టి చాలామంది
చెప్పలేదు. కాబట్టి అటువంటి సంధర్భము రాకుండా మీరు అన్నీ
చెప్పగలగాలి కదా! మీరు చెప్పే స్థోమతలో ఉన్నారా? ఇప్పుడు మీరు
మిమ్ములను ప్రశ్నించుకొని చూసుకోండి. మీరు ప్రతి ప్రశ్నకు జవాబు
చెప్పుగలుగుతారేమో గుండెల మీద చేయి పెట్టుకొని చూసుకోండి.
చెప్పగలుగుతారా? లేదు.
ఈ మధ్య విజయనగరము మీటింగ్ లో కూడా నేను చెప్పినాను.
అక్కడ నా దగ్గరికి కొంతమంది ముస్లీమ్లు వచ్చారు. నన్ను వాళ్ళ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మతములోనికి కలుపుకోవాలి అని అంటే లక్షణముగా కలిసిపోతాను, నాకేమీ
అభ్యంతరము లేదు. నాకు కొంత జ్ఞానము అర్థమయితే కదా! మతములో
కలిసిపోయిన తరువాత ఎవరైనా అడిగితే నేను ఏమి చెప్పాలి? ముందు
నాకు కొంత జ్ఞానము అర్థము కావాలి అన్నాను. అప్పుడు వారు ఏమి
అర్థము కాలేదో చెప్పండి అన్నారు. నేను ఒక ప్రశ్న అడిగితే, వాళ్ళు
గందరగోళపడి చివరకు ఇంటర్నెట్లో చూసి చెప్పుతాము అన్నారు.
అప్పుడు నేను మీరు జవాబు చెప్పిన తరువాత చూస్తాము అని చెప్పి
బయటకు వచ్చినాను. ఆ రకముగా మతపెద్దలయిన వాళ్ళు చెప్ప
లేకపోయారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందువలన మనము
అలా కాకుండా అంటే మనము తెలుసుకోగలిగితే ఏదైనా తెలుసుకోవచ్చు.
అందువలన మేము ఒక చిన్న ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పలేని
పరిస్థితి అందులో ఉంది. కాబట్టి అలా కాకుండా అటువంటి పరిస్థితి
ఖుర్ఆన్ గ్రంథంలో రాకుండా ప్రతి వాక్యానికి అంటే ప్రతి ఆయత్కు
జవాబు చెప్పే స్థోమత కల్గించాలి అంటే ప్రతి ఒక్క ముస్లీమ్ ఆ విధంగా
తయారు కావాలనే ఉద్దేశ్యముతో మీ దగ్గర మీకు ఏమైనా తెలియని
విషయాలు ఉంటే మమ్మల్ని అడగండి దానికి వివరము చెప్తాము. ఈ
మతము, ఆ మతము అని మత బేధము పెట్టుకోవద్దండి. మీకు దేవుని
విషయము కదా కావల్సినది! నాకు కూడా దేవుని విషయమే అవసరము.
దేవుని విషయమును ప్రశ్నించండి మా ఖుర్ఆన్ గ్రంథములో ఇది ఉంది.
దీని అర్థము ఏమి అని అడగండి తప్పక చెప్పుతాము. మా వాళ్ళు చెప్పలేని
అర్థము మీరు చెప్పగలరా? అని అనుకోవద్దండి. మీ వాళ్ళే మీకు
చెప్పలేకపోయినా దాని అర్థము నేను చెప్పుతాను అని చెప్పుతున్నాను.
ఇక్కడ మీవాళ్ళు మావాళ్లు అని అనుకోకూడదు.

Page 52
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
51
52
జ్ఞానము తెలిసినవాళ్ళు ఎవరైనా మీవాడే. కాబట్టి దేవుడు అందరికి
ఒక్కడే. మీ దేవుడు, మా దేవుడు అని వేరు వేరుగా లేడు, మీ జ్ఞానము,
మా జ్ఞానము ఏమిటి? అంతా ఒకటే జ్ఞానమే. కాబట్టి మేము ఏ జ్ఞానానికైనా
మా
జవాబు చెప్పుతాము. అది మా జ్ఞానమే! దేవుడు అందరికీ ఒక్కడే.
అటువంటప్పుడు ఏముంది? మేము అన్నిటికీ సమాధానము చెప్పుతాము
కదా! అందువలన ఖురాన్లోని జ్ఞానవాక్యములు అనే పేరు పెట్టి ఒక
గ్రంథము, అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యములు అను పేరుతో మరొక
గ్రంథము కూడా వ్రాశాము. అది మామూలుగా “ఖుదా ఇస్లామిక్
స్పిరిచ్యువల్ సొసైటీ" కి ఆ గ్రంథాలను అందజేయాలనుకున్నాము. ఆ
గ్రంథములతో వాళ్ళు ముందుకు పోవాలనుకున్నారు. ఇప్పుడు మీకు
చెప్పడము ఏమి అంటే ఖుర్ఆన్ వేరు, హదీసులు వేరు. హదీసులకంటే
ఖుర్ఆన్ గొప్పది. ఖుర్ఆన్ విషయాలు మీరు తెలుసుకోండి. ఎక్కడైనా
హదీసులలో ఏదైనా పొరపాటు ఉంటే వాటిని విడిచిపెట్టండి. అయితే
ఖుర్ఆన్లో ఒక దానిని కూడా వదలిపెట్టవద్దండి. 7 లక్షల హదీసులలో
వాళ్ళు రెండువేలకు వచ్చినారు. 7 లక్షల హదీసులను వ్రాసినవాళ్ళే అన్నిటినీ
కాదుయని చివరకు రెండు వేలు ముఖ్యము అని అన్నారు. ఎప్పుడో
ప్రవక్తగారు పరమపదించిన తరువాత 120 సం॥ల తరువాత చెప్పు
కున్నటువంటి విషయాలు మనకు ఎంత స్వచ్ఛతను ఇస్తాయో మనము
చెప్పలేము,
కానీ ఆ రోజు ప్రవక్త గారు ఉన్నప్పుడే కొందరు తప్పు చేస్తూ
ఉంటే వారికి ప్రవక్త గారు చెప్పినమాటలే అర్థము కాకుండా ఉంటే, “ఇది
తప్పు, ప్రవక్తగారు ఈ విధముగా చెప్పలేదు. ప్రవక్త గారు చెప్పినటువంటిది
మీరు సరిగా అర్థము చేసుకోలేదు. ప్రవక్తగారు చెప్పనటువంటి భావము
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇది. ఈ భావము ప్రకారము మీరు నడుచుకోకుండా వేరే భావముతో
నడుచుకుంటున్నారని” ప్రవక్త ఉన్న రోజులలోనే, ప్రవక్త భార్య అయిన
ఆయేషాగారు చెప్పారు. ఆ రోజు ప్రవక్త గారు ఉన్న రోజులలోనే వాళ్ళకు
అర్థము కానప్పుడు ప్రవక్త పోయిన తరువాత కొన్ని సంవత్సరములకు
అది నిజము ఎంతో, అబద్దము ఎంతో హదీసులను వ్రాసుకొని దానినే
సత్యముగా చెప్పుకుంటే మన జ్ఞానమునకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి
వాటిలో అన్నీ పనికి రావు అని నేను చెప్పలేదు. కొన్ని పనికి రానివి
ఉన్నాయి. వాటిని తీసివేయవచ్చు, కానీ ఖుర్ఆన్ గ్రంథములో అలా
కాదు ప్రతి వాక్యము పనికి వచ్చేదే. అన్ని వాక్యములకు నేను వివరము
చెప్పలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన అన్ని వాక్యాలకు వివరము చెప్పేదానికి
మనకు చేతకాదు. మనము కొన్ని వాక్యాలకు మాత్రమే వివరము
చెప్పగలుగుతాము. మేము ఏమి చెప్పుతున్నాము అంటే దేవుడు చెప్పిన
అన్ని వాక్యములకు దేవుడే సమాధానము చెప్పాలి. దేవుడు ఎటువంటి
వాడు అని చెప్పేదానికి ఏ మనిషితోను కాదు. మనము చూచాయగా
ఏ
కొన్ని విషయములు చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని విషయాలు దేవుడే
చెప్పాలి. ఖుర్ఆన్ వాక్యములలో ఏ వాక్యమును తీసివేసేదానికి కాదు.
కానీ అన్ని వాక్యములు మనకు తెలియవు. కొన్ని వాక్యముల గురించే
మనము వ్రాసుకోగలుగుతాము, కానీ అన్ని వాక్యముల గురించి మేము
వ్రాయలేము. అందువలన మేము కొన్ని వాక్యములకే వివరమును
వ్రాయగలిగాము. అవి జ్ఞాన వాక్యములు, వజ్రవాక్యములు అను రెండు
పేర్లతో ఉన్నాయి. ఖుర్ఆన్ గ్రంథము గొప్పది ఆ ఖుర్ఆన్ వాక్యములే
మేము ముఖ్యముగా కొన్నింటిని వ్రాశాము. ఖుర్ఆన్ తర్వాత హదీసులు
రెండవది. కాబట్టి హదీసులలో నీవు కొన్ని తీసివేసుకోవచ్చు.

Page 53
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
51
52
జ్ఞానము తెలిసినవాళ్ళు ఎవరైనా మీవాడే. కాబట్టి దేవుడు అందరికి
ఒక్కడే. మీ దేవుడు, మా దేవుడు అని వేరు వేరుగా లేడు, మీ జ్ఞానము,
మా జ్ఞానము ఏమిటి? అంతా ఒకటే జ్ఞానమే. కాబట్టి మేము ఏ జ్ఞానానికైనా
మా
జవాబు చెప్పుతాము. అది మా జ్ఞానమే! దేవుడు అందరికీ ఒక్కడే.
అటువంటప్పుడు ఏముంది? మేము అన్నిటికీ సమాధానము చెప్పుతాము
కదా! అందువలన ఖురాన్లోని జ్ఞానవాక్యములు అనే పేరు పెట్టి ఒక
గ్రంథము, అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యములు అను పేరుతో మరొక
గ్రంథము కూడా వ్రాశాము. అది మామూలుగా “ఖుదా ఇస్లామిక్
స్పిరిచ్యువల్ సొసైటీ" కి ఆ గ్రంథాలను అందజేయాలనుకున్నాము. ఆ
గ్రంథములతో వాళ్ళు ముందుకు పోవాలనుకున్నారు. ఇప్పుడు మీకు
చెప్పడము ఏమి అంటే ఖుర్ఆన్ వేరు, హదీసులు వేరు. హదీసులకంటే
ఖుర్ఆన్ గొప్పది. ఖుర్ఆన్ విషయాలు మీరు తెలుసుకోండి. ఎక్కడైనా
హదీసులలో ఏదైనా పొరపాటు ఉంటే వాటిని విడిచిపెట్టండి. అయితే
ఖుర్ఆన్లో ఒక దానిని కూడా వదలిపెట్టవద్దండి. 7 లక్షల హదీసులలో
వాళ్ళు రెండువేలకు వచ్చినారు. 7 లక్షల హదీసులను వ్రాసినవాళ్ళే అన్నిటినీ
కాదుయని చివరకు రెండు వేలు ముఖ్యము అని అన్నారు. ఎప్పుడో
ప్రవక్తగారు పరమపదించిన తరువాత 120 సం॥ల తరువాత చెప్పు
కున్నటువంటి విషయాలు మనకు ఎంత స్వచ్ఛతను ఇస్తాయో మనము
చెప్పలేము,
కానీ ఆ రోజు ప్రవక్త గారు ఉన్నప్పుడే కొందరు తప్పు చేస్తూ
ఉంటే వారికి ప్రవక్త గారు చెప్పినమాటలే అర్థము కాకుండా ఉంటే, “ఇది
తప్పు, ప్రవక్తగారు ఈ విధముగా చెప్పలేదు. ప్రవక్త గారు చెప్పినటువంటిది
మీరు సరిగా అర్థము చేసుకోలేదు. ప్రవక్తగారు చెప్పనటువంటి భావము
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇది. ఈ భావము ప్రకారము మీరు నడుచుకోకుండా వేరే భావముతో
నడుచుకుంటున్నారని” ప్రవక్త ఉన్న రోజులలోనే, ప్రవక్త భార్య అయిన
ఆయేషాగారు చెప్పారు. ఆ రోజు ప్రవక్త గారు ఉన్న రోజులలోనే వాళ్ళకు
అర్థము కానప్పుడు ప్రవక్త పోయిన తరువాత కొన్ని సంవత్సరములకు
అది నిజము ఎంతో, అబద్దము ఎంతో హదీసులను వ్రాసుకొని దానినే
సత్యముగా చెప్పుకుంటే మన జ్ఞానమునకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి
వాటిలో అన్నీ పనికి రావు అని నేను చెప్పలేదు. కొన్ని పనికి రానివి
ఉన్నాయి. వాటిని తీసివేయవచ్చు, కానీ ఖుర్ఆన్ గ్రంథములో అలా
కాదు ప్రతి వాక్యము పనికి వచ్చేదే. అన్ని వాక్యములకు నేను వివరము
చెప్పలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన అన్ని వాక్యాలకు వివరము చెప్పేదానికి
మనకు చేతకాదు. మనము కొన్ని వాక్యాలకు మాత్రమే వివరము
చెప్పగలుగుతాము. మేము ఏమి చెప్పుతున్నాము అంటే దేవుడు చెప్పిన
అన్ని వాక్యములకు దేవుడే సమాధానము చెప్పాలి. దేవుడు ఎటువంటి
వాడు అని చెప్పేదానికి ఏ మనిషితోను కాదు. మనము చూచాయగా
ఏ
కొన్ని విషయములు చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని విషయాలు దేవుడే
చెప్పాలి. ఖుర్ఆన్ వాక్యములలో ఏ వాక్యమును తీసివేసేదానికి కాదు.
కానీ అన్ని వాక్యములు మనకు తెలియవు. కొన్ని వాక్యముల గురించే
మనము వ్రాసుకోగలుగుతాము, కానీ అన్ని వాక్యముల గురించి మేము
వ్రాయలేము. అందువలన మేము కొన్ని వాక్యములకే వివరమును
వ్రాయగలిగాము. అవి జ్ఞాన వాక్యములు, వజ్రవాక్యములు అను రెండు
పేర్లతో ఉన్నాయి. ఖుర్ఆన్ గ్రంథము గొప్పది ఆ ఖుర్ఆన్ వాక్యములే
మేము ముఖ్యముగా కొన్నింటిని వ్రాశాము. ఖుర్ఆన్ తర్వాత హదీసులు
రెండవది. కాబట్టి హదీసులలో నీవు కొన్ని తీసివేసుకోవచ్చు.

Page 54
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
53
ఖురాన్ గ్రంథములో జ్ఞానము ప్రకారము నడుచుకొనే దానికి,
ఆటంకము కలుగకుండా ఉండేదానికి హదీసు గ్రంథములో కొన్నిటిని
వదిలిపెట్టినా ఫరవాలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథములో వదిలిపెట్టేదానికి
అవకాశము లేదు. నీకు అర్థము కాకపోతే కొన్ని చెప్పుకో, కొన్ని వదలిపెట్టు
ఎవరినైనా అడిగి తెలుసుకో ఫరవాలేదు. అంతేగాని ఏ ఒక్కటి కూడా
తీసివేసేదానికి కాదు. అందువలన పవిత్రమైన ఖుర్ఆన్ గ్రంథములో
దేవుని ధర్మము ఉంది. ప్రవక్తగారి జ్ఞానము ఉంది. మనుషులము
అయినటువంటి మనము దేవుని జ్ఞానమును ఆచరించాలనే ఉద్దేశ్యముతో
చెప్పుచున్న దేమనగా! పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో ధర్మము దేవునిది,
జ్ఞానము ప్రవక్తది, ఆచరణ మనుషులది. కాబట్టి మనము ఆచరించే
దానికి ప్రయత్నము చేయాలి. రెండో విధానము మనకు వద్దు. అందువల్ల
ఖురాన్ గ్రంథములో ఉండేటటువంటి విషయాలను ప్రతి ముస్లీమ్
తెలుసుకొని అందులో సారాంశమును గ్రహించుకోవాలి. మీరు ఊరక
చదవడము ముఖ్యము కాదు. ప్రతి వాక్యములో ఉండే సారాంశమును
తెలుసుకొని, దాని ఆచరణ ఏ విధముగా చేయాలనే ఉద్దేశ్యముతో మీరు
ఆచరించగలిగితే దేవునికి దగ్గరగా పోవచ్చు. అల్లాహ్ దగ్గరకు మీరు
చేరుకోవచ్చు. ఈ జన్మలోనే చేరుకోవచ్చు. అందువలన ప్రతి ఒక్కరు అదే
ప్రయత్నము చేయండి. ఖుర్ఆన్ యొక్క స్వచ్ఛమైనటువంటి వివరాలను
తెలుసుకోండి. అల్లాహ్ దగ్గరకి పోయేదానికి ప్రయత్నము చేయండి.
ఇంకా కొందరు ముస్లీమ్ పండితులు ఖుర్ఆన్నే ముఖ్యము,
హదీసులు ముఖ్యము కాదు అని అంటున్నారు. అంతేకాక ప్రవక్తగారు
54
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
బ్రతికి ఉన్నప్పుడు హదీసులను వ్రాయదలచినవారిని మందలించి అది
తప్పు దేవుని గ్రంథము ఒక్కటే మనుషులకు అవసరము. కావున ఎవరూ
హదీసులను వ్రాయకూడదు అని చెప్పారు. ఆ విషయములను సేకరించి
క్రింద పొందుపరుస్తున్నాము చూడండి.
హదీసుల చరిత్ర
ఎప్పుడు ఎందుకు వ్రాశారు.
ముహమ్మద్ ప్రవక్త హదీసులు వ్రాయడము నిషేదించారు.
ముహమ్మద్ ప్రవక్త హదీసులు వ్రాయడము నిషేధించాడు. నేడు
మన దగ్గరవున్న అన్ని హదీసులు, వేటిని హదీసు పండితులు నిర్ధారించారో,
అవి అన్నియు ప్రవక్త మరణించిన 200 సంవత్సరాల తరువాత వ్రాసినవి.
200 సంవత్సరాల వరకు ప్రవక్త విధించిన నియమాల వలన, ఏ హదీసు
గ్రంథమూ నిర్ధారింపబడి వ్రాయబడి లేదు. నేడు మనవద్ద ఉన్న షాహీ
సేకరణలు (హదీసులు) రచించిన బుఖారి కూడా హిజ్రా (870) తరువాత
194 సంవత్సరాలకు జన్మించాడు. మిగతా 6 హదీసులు రచయితలు
కూడా బుఖారి జన్మించిన తరువాత జన్మించారు.
ఖుర్ఆన్, హదీసు కల్పితం గురించి చెప్తుంది. అది ప్రవక్త యొక్క
శత్రువుల చేత కల్పించబడుతుంది. 6వ సూరా, 112 వ ఆయత్ (6-112)
మేము ప్రతి ప్రవక్తకు, మానవునికి, జిన్నులకి శత్రువులని తయారు చేశాము.
ఒకరినొకరు ప్రేరేపించటానికి ఆకర్షణీయ మాటలు మోసం చేయటానికి
దేవుడు తలచియుంటే వారు అలా చేసేవారు కాదు. మీరు హదీసులను
వదిలివేయాలి, వారు కల్పించినవి.

Page 55
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
53
ఖురాన్ గ్రంథములో జ్ఞానము ప్రకారము నడుచుకొనే దానికి,
ఆటంకము కలుగకుండా ఉండేదానికి హదీసు గ్రంథములో కొన్నిటిని
వదిలిపెట్టినా ఫరవాలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథములో వదిలిపెట్టేదానికి
అవకాశము లేదు. నీకు అర్థము కాకపోతే కొన్ని చెప్పుకో, కొన్ని వదలిపెట్టు
ఎవరినైనా అడిగి తెలుసుకో ఫరవాలేదు. అంతేగాని ఏ ఒక్కటి కూడా
తీసివేసేదానికి కాదు. అందువలన పవిత్రమైన ఖుర్ఆన్ గ్రంథములో
దేవుని ధర్మము ఉంది. ప్రవక్తగారి జ్ఞానము ఉంది. మనుషులము
అయినటువంటి మనము దేవుని జ్ఞానమును ఆచరించాలనే ఉద్దేశ్యముతో
చెప్పుచున్న దేమనగా! పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో ధర్మము దేవునిది,
జ్ఞానము ప్రవక్తది, ఆచరణ మనుషులది. కాబట్టి మనము ఆచరించే
దానికి ప్రయత్నము చేయాలి. రెండో విధానము మనకు వద్దు. అందువల్ల
ఖురాన్ గ్రంథములో ఉండేటటువంటి విషయాలను ప్రతి ముస్లీమ్
తెలుసుకొని అందులో సారాంశమును గ్రహించుకోవాలి. మీరు ఊరక
చదవడము ముఖ్యము కాదు. ప్రతి వాక్యములో ఉండే సారాంశమును
తెలుసుకొని, దాని ఆచరణ ఏ విధముగా చేయాలనే ఉద్దేశ్యముతో మీరు
ఆచరించగలిగితే దేవునికి దగ్గరగా పోవచ్చు. అల్లాహ్ దగ్గరకు మీరు
చేరుకోవచ్చు. ఈ జన్మలోనే చేరుకోవచ్చు. అందువలన ప్రతి ఒక్కరు అదే
ప్రయత్నము చేయండి. ఖుర్ఆన్ యొక్క స్వచ్ఛమైనటువంటి వివరాలను
తెలుసుకోండి. అల్లాహ్ దగ్గరకి పోయేదానికి ప్రయత్నము చేయండి.
ఇంకా కొందరు ముస్లీమ్ పండితులు ఖుర్ఆన్నే ముఖ్యము,
హదీసులు ముఖ్యము కాదు అని అంటున్నారు. అంతేకాక ప్రవక్తగారు
54
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
బ్రతికి ఉన్నప్పుడు హదీసులను వ్రాయదలచినవారిని మందలించి అది
తప్పు దేవుని గ్రంథము ఒక్కటే మనుషులకు అవసరము. కావున ఎవరూ
హదీసులను వ్రాయకూడదు అని చెప్పారు. ఆ విషయములను సేకరించి
క్రింద పొందుపరుస్తున్నాము చూడండి.
హదీసుల చరిత్ర
ఎప్పుడు ఎందుకు వ్రాశారు.
ముహమ్మద్ ప్రవక్త హదీసులు వ్రాయడము నిషేదించారు.
ముహమ్మద్ ప్రవక్త హదీసులు వ్రాయడము నిషేధించాడు. నేడు
మన దగ్గరవున్న అన్ని హదీసులు, వేటిని హదీసు పండితులు నిర్ధారించారో,
అవి అన్నియు ప్రవక్త మరణించిన 200 సంవత్సరాల తరువాత వ్రాసినవి.
200 సంవత్సరాల వరకు ప్రవక్త విధించిన నియమాల వలన, ఏ హదీసు
గ్రంథమూ నిర్ధారింపబడి వ్రాయబడి లేదు. నేడు మనవద్ద ఉన్న షాహీ
సేకరణలు (హదీసులు) రచించిన బుఖారి కూడా హిజ్రా (870) తరువాత
194 సంవత్సరాలకు జన్మించాడు. మిగతా 6 హదీసులు రచయితలు
కూడా బుఖారి జన్మించిన తరువాత జన్మించారు.
ఖుర్ఆన్, హదీసు కల్పితం గురించి చెప్తుంది. అది ప్రవక్త యొక్క
శత్రువుల చేత కల్పించబడుతుంది. 6వ సూరా, 112 వ ఆయత్ (6-112)
మేము ప్రతి ప్రవక్తకు, మానవునికి, జిన్నులకి శత్రువులని తయారు చేశాము.
ఒకరినొకరు ప్రేరేపించటానికి ఆకర్షణీయ మాటలు మోసం చేయటానికి
దేవుడు తలచియుంటే వారు అలా చేసేవారు కాదు. మీరు హదీసులను
వదిలివేయాలి, వారు కల్పించినవి.

Page 56
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
55
56
ఖుర్ఆన్ కూడా నిర్ధారిస్తుంది అది దేవుని యొక్క ఇష్టముతోనే
హదీసుల కల్పన (తయారు చేయుట) అనుమతించబడింది. ఇది ఒక
ఖుర్ఆన్ సూత్రము ప్రకారము, దుర్మార్గులని మరియు విశ్వాసులని వేరు
చేయటానికి. ఎవరు హదీసులని ఆచరిస్తారో వారు అసత్య విశ్వాసులు
అని నిర్ధారించబడింది. నిజమైన విశ్వాసులు దేవునితో మాత్రమే సంతృప్తి
చెందుతారు. వారు దేవుని మాటలతోనే సంతృప్తి చెందుతారు, ఇంకా
దేవుని ధర్మంతో (ఖుర్ఆన్) మాత్రమే తృప్తి పడతారు. వారు దేవుని
యొక్క మాటలనే విశ్వసిస్తారు, ఏవి ఖుర్ఆన్ సంపూర్ణం మరియు
వివరణాత్మకం అని వర్ణిస్తాయో వాటినే నమ్ముతారు. కావున వారికి వేరే
ఇంకేవీ అవసరము లేదు.
(6-114, 115) “నేను దేవుడిని వదలి వేరే మరో తీర్పరిని
అన్వేషించాలా? అసలు ఆయనే కదా! పూర్తి వివరాలతో ఈ గ్రంథాన్ని
పంపినవాడు”. నీకు పూర్వం గ్రంథము ఇవ్వబడినవారికి నీ ప్రభువు
నుండే సత్యపూరితమైన ఈ గ్రంథము కూడా అవతరించిందని తెలుసు.
కనుక నీవు అవమానించేవారిలో చేరిపోకు. నీ ప్రభువు వాక్కు సత్యం,
న్యాయాల దృష్ట్యా స్వచ్ఛమైనది, సమగ్రమైనది. ఆయన వచనాలను ఎవరూ
మార్చలేరు. ఆయన సమస్తం వింటున్నాడు, సర్వం ఎరిగినవాడు.
వారు దేవుని ఆజ్ఞని పాటిస్తారు ఖుర్ఆన్ తప్ప ఏ హదీసుని
ఆచరించకూడదు అని.
(45-6) ఇవి దేవుడు తెలియజేసిన విషయాలు, వీటిని మేము
మీకు సత్యముగా చెప్పుచున్నాము. దేవుడు మరియు దేవుని సందేశములు
కాకుండా వారు ఏ హదీసుని విశ్వసిస్తున్నారు? (దేనిని విశ్వసించరు.)
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
వారు దేవుని ఆజ్ఞని పాటిస్తారు ఖుర్ఆన్ తప్ప ఏ హదీసుని
ఆచరించకూడదు అని అంటారు.
మరొక ప్రక్క, అసత్య విశ్వాసులు ధర్మానికి ఆధారమైన ఖుర్ఆన్తో
సంతృప్తి చెందలేదు, అందుకే వారు ఇతర (హదీసు) గ్రంథాల కోసము
చూస్తున్నారు.
(6–113) పరలోకం నమ్మనివారి హృదయాలు గలవారు సహజము
గానే మనుషులు చెప్పిన తియ్యటి మాటలు వినటానికి మొగ్గు చూపుతాయి.
అందువలన వారు లోగడ చేస్తూ వచ్చిన కార్యాలే ఇప్పుడూ చేస్తున్నారు.
హదీసు గ్రంథము చెప్పుచున్నది, ప్రవక్త తన హదీసు వ్రాయటం
నిషేధించాడు అని. ఇంకా అతని అనుచరులకు కూడా ఖుర్ఆన్ తప్ప వేరే
గ్రంథము వ్రాయకూడదు అని ఆదేశించాడు! ప్రవక్త తాను చెప్పిన దానిని
తాను చనిపోయే అంతవరకు ఆచరించాడు. క్రింద అటువంటి హదీసులను
చూడండి.
1) ఇబ్న్ సయీద్ అల ఖుద్రి ఇలా నివేదించాడు, దేవుని దూత
(జిబ్రయేల్) ఇలా చెప్పాడు.
“నా నుంచి వచ్చిన ఖుర్ఆన్ తప్ప ఇతరము వ్రాయకండి. ఎవరైనా
ఖుర్ఆన్ తప్ప ఇతరము వ్రాసివుంటే వాటిని చెరిపేయాలి”. (అహ్మద్ సం
1, పేజీ 171 మరియు షాహీ మొస్లిం, జుహాడ్, బుక్ 42, నెంబర్ 7147)
కొంతమంది హదీసు పండితులు ముహమ్మద్ హదీసులు వ్రాయటం
గురించి తన మనుసు మార్చుకున్నాడు అని చెప్పారని ప్రయత్నం చేశారు.
కానీ, క్రింద చెప్పబడిన హదీసులు ప్రవక్త చనిపోయిన చాలా సంవత్సరాలు
తరువాత వ్రాసినవి, ముహ్మద్ ప్రవక్త ఏనాడూ హదీసులను వ్రాయటం

Page 57
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
55
56
ఖుర్ఆన్ కూడా నిర్ధారిస్తుంది అది దేవుని యొక్క ఇష్టముతోనే
హదీసుల కల్పన (తయారు చేయుట) అనుమతించబడింది. ఇది ఒక
ఖుర్ఆన్ సూత్రము ప్రకారము, దుర్మార్గులని మరియు విశ్వాసులని వేరు
చేయటానికి. ఎవరు హదీసులని ఆచరిస్తారో వారు అసత్య విశ్వాసులు
అని నిర్ధారించబడింది. నిజమైన విశ్వాసులు దేవునితో మాత్రమే సంతృప్తి
చెందుతారు. వారు దేవుని మాటలతోనే సంతృప్తి చెందుతారు, ఇంకా
దేవుని ధర్మంతో (ఖుర్ఆన్) మాత్రమే తృప్తి పడతారు. వారు దేవుని
యొక్క మాటలనే విశ్వసిస్తారు, ఏవి ఖుర్ఆన్ సంపూర్ణం మరియు
వివరణాత్మకం అని వర్ణిస్తాయో వాటినే నమ్ముతారు. కావున వారికి వేరే
ఇంకేవీ అవసరము లేదు.
(6-114, 115) “నేను దేవుడిని వదలి వేరే మరో తీర్పరిని
అన్వేషించాలా? అసలు ఆయనే కదా! పూర్తి వివరాలతో ఈ గ్రంథాన్ని
పంపినవాడు”. నీకు పూర్వం గ్రంథము ఇవ్వబడినవారికి నీ ప్రభువు
నుండే సత్యపూరితమైన ఈ గ్రంథము కూడా అవతరించిందని తెలుసు.
కనుక నీవు అవమానించేవారిలో చేరిపోకు. నీ ప్రభువు వాక్కు సత్యం,
న్యాయాల దృష్ట్యా స్వచ్ఛమైనది, సమగ్రమైనది. ఆయన వచనాలను ఎవరూ
మార్చలేరు. ఆయన సమస్తం వింటున్నాడు, సర్వం ఎరిగినవాడు.
వారు దేవుని ఆజ్ఞని పాటిస్తారు ఖుర్ఆన్ తప్ప ఏ హదీసుని
ఆచరించకూడదు అని.
(45-6) ఇవి దేవుడు తెలియజేసిన విషయాలు, వీటిని మేము
మీకు సత్యముగా చెప్పుచున్నాము. దేవుడు మరియు దేవుని సందేశములు
కాకుండా వారు ఏ హదీసుని విశ్వసిస్తున్నారు? (దేనిని విశ్వసించరు.)
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
వారు దేవుని ఆజ్ఞని పాటిస్తారు ఖుర్ఆన్ తప్ప ఏ హదీసుని
ఆచరించకూడదు అని అంటారు.
మరొక ప్రక్క, అసత్య విశ్వాసులు ధర్మానికి ఆధారమైన ఖుర్ఆన్తో
సంతృప్తి చెందలేదు, అందుకే వారు ఇతర (హదీసు) గ్రంథాల కోసము
చూస్తున్నారు.
(6–113) పరలోకం నమ్మనివారి హృదయాలు గలవారు సహజము
గానే మనుషులు చెప్పిన తియ్యటి మాటలు వినటానికి మొగ్గు చూపుతాయి.
అందువలన వారు లోగడ చేస్తూ వచ్చిన కార్యాలే ఇప్పుడూ చేస్తున్నారు.
హదీసు గ్రంథము చెప్పుచున్నది, ప్రవక్త తన హదీసు వ్రాయటం
నిషేధించాడు అని. ఇంకా అతని అనుచరులకు కూడా ఖుర్ఆన్ తప్ప వేరే
గ్రంథము వ్రాయకూడదు అని ఆదేశించాడు! ప్రవక్త తాను చెప్పిన దానిని
తాను చనిపోయే అంతవరకు ఆచరించాడు. క్రింద అటువంటి హదీసులను
చూడండి.
1) ఇబ్న్ సయీద్ అల ఖుద్రి ఇలా నివేదించాడు, దేవుని దూత
(జిబ్రయేల్) ఇలా చెప్పాడు.
“నా నుంచి వచ్చిన ఖుర్ఆన్ తప్ప ఇతరము వ్రాయకండి. ఎవరైనా
ఖుర్ఆన్ తప్ప ఇతరము వ్రాసివుంటే వాటిని చెరిపేయాలి”. (అహ్మద్ సం
1, పేజీ 171 మరియు షాహీ మొస్లిం, జుహాడ్, బుక్ 42, నెంబర్ 7147)
కొంతమంది హదీసు పండితులు ముహమ్మద్ హదీసులు వ్రాయటం
గురించి తన మనుసు మార్చుకున్నాడు అని చెప్పారని ప్రయత్నం చేశారు.
కానీ, క్రింద చెప్పబడిన హదీసులు ప్రవక్త చనిపోయిన చాలా సంవత్సరాలు
తరువాత వ్రాసినవి, ముహ్మద్ ప్రవక్త ఏనాడూ హదీసులను వ్రాయటం

Page 58
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
57
58
అనుమతించలేదు, తాను తన అనుచరులకు హదీసులని వ్రాయవద్దు అని
చెప్పిన తరువాత అని నిర్ధారిస్తున్నాయి.
ఇబ్న్ హంబల్ :
2)
జాయిద్ ఇబ్న్ తబిత్ (ప్రవక్త దగ్గరి అనుచరుడు మరియు ఖుర్ఆన్
రచయిత) ఖలీఫాము ఆవియాను (ప్రవక్త మరణించిన 30 సంవత్సరాలు
తరువాత) కలుసుకున్నాడు, మరియు అతనికి ప్రవక్త గురించి ఒక కథ
చెప్పాడు. ము ఆవియాకి ఆ కథ నచ్చింది. ఇంకా ఆ కథను రచించమని
చెప్పాడు. కానీ జాయిద్ అన్నాడు “దేవుని దూత మాకు ఎప్పుడూ తన
హదీసు వ్రాయమని ఆజ్ఞాపించలేదు”.
3) ప్రఖ్యాత పుస్తకము “ఉలూమ్ అల్ హడిత్” ఇది ఇబ్న్ అల్ సలహా
చేత వ్రాయబడినది. ఇది అబూ హురాయ చెప్పిన హదీసుని నివేదిస్తుంది.
అందులో అబూ హురైరా ఇలా చెప్పాడు “మేము హదీసులని
వ్రాస్తున్నప్పుడు ప్రవక్త మా దగ్గరికి వచ్చి మీరు ఏమి వ్రాస్తున్నారు? అని
అడిగారు. మేము చెప్పాము “ఓ ప్రవక్తా! మీ నుండి విన్న హదీసులని
వ్రాయుచున్నాము”. ఆయన ఇలా అన్నాడు “ఏమిటీ? దేవుని గ్రంథము
కాకుండా ఇంకొకటా? అన్నప్పుడు మేము అన్నాము “నీ గురించి మనము
మాట్లాడుదామా?” అతను (ప్రవక్త) అన్నాడు “నా గురించి మాట్లాడండి
అది మంచిది, కానీ అబద్దం చెప్పేవారు నరకానికి పోతారు”.
హురైరా చెప్పాడు, మేము వ్రాసిన అన్ని హదీసులని సేకరించి వాటిని
అగ్గిలో కాల్చివేశాము.
అబూ
4) ప్రఖ్యాత గ్రంథము "తక్ - ఈద్ అల్-ఇల్మ్"లో అబూ హురైరా
ఇలా చెప్పాడు. కొంతమంది హదీసులని వ్రాస్తున్నారు అని ప్రవక్తకు
తెలిసినది. ప్రవక్త మస్జీద్లోని వేదిక వద్దకు తీసుకొనిపోయాడు, ఇంకా
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇలా అన్నాడు. "మీరు వ్రాశారు అని నేను విన్న ఈ గ్రంథాలు ఏమిటి?”
"నేను కేవలం ఒక మనిషిని. ఇలా వ్రాసినవి ఇంకా ఎవరి వద్దయినా
ఉంటే వాటిని ఇక్కడకు తీసుకురండి అన్నాడు. అప్పుడు అబూ హురాయ
చెప్పాడు, మేము వాటిని సేకరించి అన్నిటినీ అగ్గిలో కాల్చివేశాము.
5) ఇబ్న్ హంబల్ తన గ్రంథము ముస్నాద్లో ఒక హదీసుని ఇలా
చెప్పాడు. అందులో అబ్దుల్లాహ్ ఇబ్న్ ఒమర్ ఇలా చెప్పాడు. ప్రవక్త ఒక
రోజు మా వద్దకు తాను త్వరలో చనిపోవువానివలె వచ్చాడు మరియు
ప్రవక్త ఇలా చెప్పాడు. “నేను వెళ్లిపోయిన (చనిపోయిన) తరువాత దేవుని
గ్రంథానికి కట్టుబడి ఉండండి. అది దేనిని నిషేధిస్తుందో దానిని
నిషేధించండి మరియు అది దేనిని హలాల్ చేసిందో దానిని హలాల్గా
స్వీకరించండి”.
6) ఇంకా “తక్-ఈద్ అల్-ఇల్మ్ లో అబూ సయీద్ అల్-ఖుద్రీ
ఇలా చెప్పాడు. "నేను ప్రవక్తను అతని హదీసుని వ్రాయటానికి అనుమతి
అడిగాను, కానీ ఆయన అనుమతి ఇవ్వటానికి నిరాకరించాడు”.
7)
ప్రవక్త యొక్క వీడ్కోలు యాత్ర ముస్లీమ్ చరిత్రలో ఒక మైలురాయి.
ఈ యాత్రలో ప్రవక్త ఇచ్చిన తన చివరి ప్రసంగమును ఎన్నో వేలమంది
ముస్లీమ్లు వీక్షించారు. కానీ ఈ ప్రసంగం హదీసు గ్రంథాలలో మూడు
విధాలుగా ఉన్నది. ఈ ఒక్క విషయమే హదీసు గ్రంథాలు ఎంతమేర
అస్థిరంగా (ఒకే విధానం కాకుండ) ఉన్నాయో చూపిస్తుంది. ఎందుకంటే
ప్రవక్త యొక్క చివరి ప్రసంగం ఎంతోమంది చూచినది.
1. మొదటి రకము. “నేను మీకు వదిలిపెట్టాను, దేనిని మీరు
పట్టుకుంటే, మీరు ఎప్పటికీ అపమార్గం పట్టించబడరు. దేవుని యొక్క

Page 59
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
57
58
అనుమతించలేదు, తాను తన అనుచరులకు హదీసులని వ్రాయవద్దు అని
చెప్పిన తరువాత అని నిర్ధారిస్తున్నాయి.
ఇబ్న్ హంబల్ :
2)
జాయిద్ ఇబ్న్ తబిత్ (ప్రవక్త దగ్గరి అనుచరుడు మరియు ఖుర్ఆన్
రచయిత) ఖలీఫాము ఆవియాను (ప్రవక్త మరణించిన 30 సంవత్సరాలు
తరువాత) కలుసుకున్నాడు, మరియు అతనికి ప్రవక్త గురించి ఒక కథ
చెప్పాడు. ము ఆవియాకి ఆ కథ నచ్చింది. ఇంకా ఆ కథను రచించమని
చెప్పాడు. కానీ జాయిద్ అన్నాడు “దేవుని దూత మాకు ఎప్పుడూ తన
హదీసు వ్రాయమని ఆజ్ఞాపించలేదు”.
3) ప్రఖ్యాత పుస్తకము “ఉలూమ్ అల్ హడిత్” ఇది ఇబ్న్ అల్ సలహా
చేత వ్రాయబడినది. ఇది అబూ హురాయ చెప్పిన హదీసుని నివేదిస్తుంది.
అందులో అబూ హురైరా ఇలా చెప్పాడు “మేము హదీసులని
వ్రాస్తున్నప్పుడు ప్రవక్త మా దగ్గరికి వచ్చి మీరు ఏమి వ్రాస్తున్నారు? అని
అడిగారు. మేము చెప్పాము “ఓ ప్రవక్తా! మీ నుండి విన్న హదీసులని
వ్రాయుచున్నాము”. ఆయన ఇలా అన్నాడు “ఏమిటీ? దేవుని గ్రంథము
కాకుండా ఇంకొకటా? అన్నప్పుడు మేము అన్నాము “నీ గురించి మనము
మాట్లాడుదామా?” అతను (ప్రవక్త) అన్నాడు “నా గురించి మాట్లాడండి
అది మంచిది, కానీ అబద్దం చెప్పేవారు నరకానికి పోతారు”.
హురైరా చెప్పాడు, మేము వ్రాసిన అన్ని హదీసులని సేకరించి వాటిని
అగ్గిలో కాల్చివేశాము.
అబూ
4) ప్రఖ్యాత గ్రంథము "తక్ - ఈద్ అల్-ఇల్మ్"లో అబూ హురైరా
ఇలా చెప్పాడు. కొంతమంది హదీసులని వ్రాస్తున్నారు అని ప్రవక్తకు
తెలిసినది. ప్రవక్త మస్జీద్లోని వేదిక వద్దకు తీసుకొనిపోయాడు, ఇంకా
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఇలా అన్నాడు. "మీరు వ్రాశారు అని నేను విన్న ఈ గ్రంథాలు ఏమిటి?”
"నేను కేవలం ఒక మనిషిని. ఇలా వ్రాసినవి ఇంకా ఎవరి వద్దయినా
ఉంటే వాటిని ఇక్కడకు తీసుకురండి అన్నాడు. అప్పుడు అబూ హురాయ
చెప్పాడు, మేము వాటిని సేకరించి అన్నిటినీ అగ్గిలో కాల్చివేశాము.
5) ఇబ్న్ హంబల్ తన గ్రంథము ముస్నాద్లో ఒక హదీసుని ఇలా
చెప్పాడు. అందులో అబ్దుల్లాహ్ ఇబ్న్ ఒమర్ ఇలా చెప్పాడు. ప్రవక్త ఒక
రోజు మా వద్దకు తాను త్వరలో చనిపోవువానివలె వచ్చాడు మరియు
ప్రవక్త ఇలా చెప్పాడు. “నేను వెళ్లిపోయిన (చనిపోయిన) తరువాత దేవుని
గ్రంథానికి కట్టుబడి ఉండండి. అది దేనిని నిషేధిస్తుందో దానిని
నిషేధించండి మరియు అది దేనిని హలాల్ చేసిందో దానిని హలాల్గా
స్వీకరించండి”.
6) ఇంకా “తక్-ఈద్ అల్-ఇల్మ్ లో అబూ సయీద్ అల్-ఖుద్రీ
ఇలా చెప్పాడు. "నేను ప్రవక్తను అతని హదీసుని వ్రాయటానికి అనుమతి
అడిగాను, కానీ ఆయన అనుమతి ఇవ్వటానికి నిరాకరించాడు”.
7)
ప్రవక్త యొక్క వీడ్కోలు యాత్ర ముస్లీమ్ చరిత్రలో ఒక మైలురాయి.
ఈ యాత్రలో ప్రవక్త ఇచ్చిన తన చివరి ప్రసంగమును ఎన్నో వేలమంది
ముస్లీమ్లు వీక్షించారు. కానీ ఈ ప్రసంగం హదీసు గ్రంథాలలో మూడు
విధాలుగా ఉన్నది. ఈ ఒక్క విషయమే హదీసు గ్రంథాలు ఎంతమేర
అస్థిరంగా (ఒకే విధానం కాకుండ) ఉన్నాయో చూపిస్తుంది. ఎందుకంటే
ప్రవక్త యొక్క చివరి ప్రసంగం ఎంతోమంది చూచినది.
1. మొదటి రకము. “నేను మీకు వదిలిపెట్టాను, దేనిని మీరు
పట్టుకుంటే, మీరు ఎప్పటికీ అపమార్గం పట్టించబడరు. దేవుని యొక్క

Page 60
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
59
60
గ్రంథము మరియు నా కుటుంబం. మొస్లిం 44/4, Number 2408,
ఇబ్న్ హంబల్ 4/366, దరిమి 23 / 1, Number 3319.
ఈ మాటలు ఒక రకము. వీటిని షియా ముస్లీమ్స్ నిర్దారిస్తారు.
2. రెండవ రకము
“నేను మీ కొరకు విడిచిపెట్టాను దేనిని మీరు
పట్టుకుంటారో, మీరు ఎప్పటికీ అపమార్గం పట్టించబడరు. దేవుని గ్రంథము
మరియు నా సున్నహ్ (సంప్రదాయము / విధానము) - మువాత, 46/3.
ఈ రకము మాటలని సున్ని ముస్లీమ్వరు నిర్ధారిస్తారు.
3. మూడవ రకము “నేను మీ కొరకు విడిచిపెట్టాను దేనిని మీరు
పట్టుకుంటే, మీరు ఎప్పటికీ అపమార్గం పట్టించబడరు. దేవుని గ్రంథము.”
మొస్లీం _ 15/19, Nu 1218, ఇబ్న్ మజ 25/84, అబూ Dawud
11/56.
ఈ మూడవ రకం మాటలని సున్ని, షియా ముస్లీమ్స్ ఇద్దరూ
ఒకే రకంగా ద్వేషిస్తారు. ఈ మూడవ రకము మాత్రమే ముహమ్మద్
సందేశము మాత్రమే ఖురాన్ అని మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు చెప్పిన మాటలని
నిర్దారిస్తుంది. చాలామంది సున్ని, షియా ముస్లీమ్లకు ఈ మూడవ రకం
ఉందని కూడా తెలియదు. వాస్తవానికి వారు దానిని తెలుసు
కోవాలనుకోలేదు. ఎందుకంటే నిజము కఠినంగా ఉంటుంది.
హదీసు గ్రంథములు వ్రాయుట యొక్క చరిత్ర :
దేవుడు మళ్లీ మళ్లీ నిర్ధారించాడు ఖుర్ఆన్ సంపూర్ణ గ్రంథము
అని, ఖచ్చితమైనది మరియు పూర్తిగా వివరించబడినది అని (6-19,38,
114, 115; 50-45, 12-111) మరియు, ఒకవేళ అవసరంగా ఉంటే
ఆయనే (దేవుడు) మనకి వందల గ్రంథాలను ఇచ్చేవాడు, ఒక్క ఖుర్ఆన్
గ్రంథము మాత్రమే కాదు (చూడండి 18-109, 31-27).
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
హడిత్ మరియు ఖైఫాస్ అల్-రాషిదీన్ (గైడెడ్ ఖైఫాస్)
ప్రవక్త మరణించిన తరువాత ముస్లీమ్ ఉమ్మ (దేశం) ని పాలించిన
నలుగురు నడిపించబడిన ఖైఫాలు మహ్మద్ ప్రవక్త యొక్క ఆదేశాన్ని
గౌరవించి హదీసులని వ్రాయటం ఖండించారు. మరియు అప్పటికే ఉన్న
వాటిని నిషేధించారు. వారు ఖుర్ఆన్ పూర్తిగా వివరించబడింది అనే
విషయాన్ని స్వీకరించారు మరియు అది మాత్రమే మతానికి ప్రజలకు
మూలము అని (6-114). అబూ బకర్కి ఒకానొక సమయంలో
నిర్ధారించుకోలేకపోయాడు తనకు తెలిసిన హదీసులను ఉంచాలో,
ఉంచకూడదో అని. ఎంతోకాలం ముహమ్మద్ ప్రవక్తతో కలిసివున్న
నలుగురు
సమయంలో అతను (అబూ బాకర్) 500 హదీసులని సేకరించాడు, కానీ
తాను వాటిని కాల్చే వరకు రాత్రి నిద్రించలేదు. ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్
తన కొడుకు అబ్దుల్లాహ్ సేకరించిన హదీసులని నాశనం చేయాలని
పట్టుబట్టాడు. ఇస్లామ్ చరిత్ర ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ ప్రవక్త యొక్క
అనుచరులకు దూరంగా ఉండే చరిత్రని చెప్పుచున్నది.
ఎందుకంటే, వారు హదీసులని చెప్పాలని పట్టుబట్టారు. ఆ నలుగురు
అనుచరులు ఇబ్న్ మసూద్, అబూ అల్-దర్గా, అబూ మసూద్ అల్-అన్సారీ
మరియు అబూ తర్అల్-గఫ్ఫారీ. ఒమర్ (పిలిచాడు) అబుహురాయరాని
అబద్ధాలకోరు అని అన్నాడు మరియు ప్రవక్త గురించి అబద్దాలు చెప్పటం
ఆపకపోతే తను (అబూ) ఎక్కడికి నుండి వచ్చాడో (యెమెన్) అక్కడికి
తిరిగి పంపుతానని అబూని బెదిరించాడు. అతను ఒమర్ మరణించే
వరకు ఊరికే ఉన్నాడు. తరువాత మళ్లీ మొదలు పెట్టాడు.
ఒమర్ కూడా ఇలా నివేదించాడు అని చెప్పబడి వుంది. ఏమిటంటే
అతను ప్రవక్త మాట్లాడిన వచనాలను వ్రాయాలని కోరుకున్నాడు, కానీ

Page 61
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
59
60
గ్రంథము మరియు నా కుటుంబం. మొస్లిం 44/4, Number 2408,
ఇబ్న్ హంబల్ 4/366, దరిమి 23 / 1, Number 3319.
ఈ మాటలు ఒక రకము. వీటిని షియా ముస్లీమ్స్ నిర్దారిస్తారు.
2. రెండవ రకము
“నేను మీ కొరకు విడిచిపెట్టాను దేనిని మీరు
పట్టుకుంటారో, మీరు ఎప్పటికీ అపమార్గం పట్టించబడరు. దేవుని గ్రంథము
మరియు నా సున్నహ్ (సంప్రదాయము / విధానము) - మువాత, 46/3.
ఈ రకము మాటలని సున్ని ముస్లీమ్వరు నిర్ధారిస్తారు.
3. మూడవ రకము “నేను మీ కొరకు విడిచిపెట్టాను దేనిని మీరు
పట్టుకుంటే, మీరు ఎప్పటికీ అపమార్గం పట్టించబడరు. దేవుని గ్రంథము.”
మొస్లీం _ 15/19, Nu 1218, ఇబ్న్ మజ 25/84, అబూ Dawud
11/56.
ఈ మూడవ రకం మాటలని సున్ని, షియా ముస్లీమ్స్ ఇద్దరూ
ఒకే రకంగా ద్వేషిస్తారు. ఈ మూడవ రకము మాత్రమే ముహమ్మద్
సందేశము మాత్రమే ఖురాన్ అని మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు చెప్పిన మాటలని
నిర్దారిస్తుంది. చాలామంది సున్ని, షియా ముస్లీమ్లకు ఈ మూడవ రకం
ఉందని కూడా తెలియదు. వాస్తవానికి వారు దానిని తెలుసు
కోవాలనుకోలేదు. ఎందుకంటే నిజము కఠినంగా ఉంటుంది.
హదీసు గ్రంథములు వ్రాయుట యొక్క చరిత్ర :
దేవుడు మళ్లీ మళ్లీ నిర్ధారించాడు ఖుర్ఆన్ సంపూర్ణ గ్రంథము
అని, ఖచ్చితమైనది మరియు పూర్తిగా వివరించబడినది అని (6-19,38,
114, 115; 50-45, 12-111) మరియు, ఒకవేళ అవసరంగా ఉంటే
ఆయనే (దేవుడు) మనకి వందల గ్రంథాలను ఇచ్చేవాడు, ఒక్క ఖుర్ఆన్
గ్రంథము మాత్రమే కాదు (చూడండి 18-109, 31-27).
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
హడిత్ మరియు ఖైఫాస్ అల్-రాషిదీన్ (గైడెడ్ ఖైఫాస్)
ప్రవక్త మరణించిన తరువాత ముస్లీమ్ ఉమ్మ (దేశం) ని పాలించిన
నలుగురు నడిపించబడిన ఖైఫాలు మహ్మద్ ప్రవక్త యొక్క ఆదేశాన్ని
గౌరవించి హదీసులని వ్రాయటం ఖండించారు. మరియు అప్పటికే ఉన్న
వాటిని నిషేధించారు. వారు ఖుర్ఆన్ పూర్తిగా వివరించబడింది అనే
విషయాన్ని స్వీకరించారు మరియు అది మాత్రమే మతానికి ప్రజలకు
మూలము అని (6-114). అబూ బకర్కి ఒకానొక సమయంలో
నిర్ధారించుకోలేకపోయాడు తనకు తెలిసిన హదీసులను ఉంచాలో,
ఉంచకూడదో అని. ఎంతోకాలం ముహమ్మద్ ప్రవక్తతో కలిసివున్న
నలుగురు
సమయంలో అతను (అబూ బాకర్) 500 హదీసులని సేకరించాడు, కానీ
తాను వాటిని కాల్చే వరకు రాత్రి నిద్రించలేదు. ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్
తన కొడుకు అబ్దుల్లాహ్ సేకరించిన హదీసులని నాశనం చేయాలని
పట్టుబట్టాడు. ఇస్లామ్ చరిత్ర ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ ప్రవక్త యొక్క
అనుచరులకు దూరంగా ఉండే చరిత్రని చెప్పుచున్నది.
ఎందుకంటే, వారు హదీసులని చెప్పాలని పట్టుబట్టారు. ఆ నలుగురు
అనుచరులు ఇబ్న్ మసూద్, అబూ అల్-దర్గా, అబూ మసూద్ అల్-అన్సారీ
మరియు అబూ తర్అల్-గఫ్ఫారీ. ఒమర్ (పిలిచాడు) అబుహురాయరాని
అబద్ధాలకోరు అని అన్నాడు మరియు ప్రవక్త గురించి అబద్దాలు చెప్పటం
ఆపకపోతే తను (అబూ) ఎక్కడికి నుండి వచ్చాడో (యెమెన్) అక్కడికి
తిరిగి పంపుతానని అబూని బెదిరించాడు. అతను ఒమర్ మరణించే
వరకు ఊరికే ఉన్నాడు. తరువాత మళ్లీ మొదలు పెట్టాడు.
ఒమర్ కూడా ఇలా నివేదించాడు అని చెప్పబడి వుంది. ఏమిటంటే
అతను ప్రవక్త మాట్లాడిన వచనాలను వ్రాయాలని కోరుకున్నాడు, కానీ

Page 62
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
61
ముస్లీమ్స్ ఖుర్ఆన్ని వదలి హదీసులని స్వీకరిస్తారేమో అని భయపడి వాటిని
వ్రాయటం మానుకున్నాడు.
“నేను సున్నహ్ వ్రాయాలని కోరుకున్నా, మరియు నేను జ్ఞాపకం
తెచ్చుకున్నా నీకంటే ముందు వున్న ప్రజలు గురించి, వారు గ్రంథాలను
రచించారు. వాటిని అనుసరించడానికి మరియు దేవుని గ్రంథాన్ని వదలి
పెట్టటానికి. మరియు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా నేను ఎప్పుడూ కానీ దేవుని
గ్రంథాన్ని వేరొక గ్రంథముతో మార్చాను అని "జమి అల్-బయన్ 1/67
అలీ ఇబ్న్ అబూ తాలిబ్, నాలుగవ ఖలీఫా తన ప్రసంగాలలో ఒక దానిలో
ఇలా చెప్పాడు. “ఎవరెవరు ప్రవక్త నుండి వ్రాతలను తీసుకున్నారో
వారినందరినీ అర్థిస్తున్నాను, మీరు ఇంటికి పోయి వాటిని చెరిపేయండి.
మీకంటే ముందు ప్రజలు నాశనం చేయబడ్డారు. ఎందుకంటే వారు
పండితులు వ్రాసిన హదీసులను అనుసరించి మరియు వారికి దేవుడు
ఇచ్చిన గ్రంథాన్ని వదలిపెట్టారు” (సునన్ అల్-ధరామి).
ఖలీఫా ఒమర్ ఇబ్న్ అబ్దుల్ ఆజిజ్, అంత్యము యొక్క మొదలు.
అబూ హురైరా అందరికంటే ఎక్కువగా ఎవరూ చెప్పనన్ని
హదీసులని చెప్పాడు. ఇంకా ప్రవక్తతో కలిసి వారి జీవితాంతం జీవించిన
అబూ బాకర్, ఒమర్ అలీ మరియు ఆయిషా వారికంటే కూడా ఎక్కువ
హదీసులు చెప్పాడు. కేవలం రెండు సంవత్సరాలకంటే తక్కువ సమయం
ప్రవక్తతో కలిసి వున్న సమయములో అతను ప్రవక్త అనుచరులు అందరూ
వ్రాసిన హదీసులకంటే ఎక్కువ హదీసులు వ్రాశాడు. అతను మొత్తము
5374 హదీసులు చెప్పాడు. ఇబ్న్ హంబల్ మొత్తం 3848 హదీసులను
తన గ్రంథములో చెప్పాడు. ప్రవక్త మరణించిన తరువాత ముస్లీమ్ దేశాన్ని
పాలించిన నడిపించబడిన ఖైపాలు ఖుర్ఆన్ తప్ప వేరే ఏదీ వ్రాయకూడదు
62
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అను ప్రవక్త కోరికను గౌరవించి మరియు, హదీసులు మరియు సున్నాహ్
వ్రాసే ఎటువంటి ప్రయత్నం అయినా తప్పు అని చెప్పారు. (ఖండించారు
/ నిషేధించారు.)
వారు సూచించిన పద్ధతిని ప్రవక్త మరణించిన రెండు వందల
సంవత్సరాల వరకు పాటించారు. ఆ సమయానికే, ప్రవక్త గురించి అబద్దాలు
వ్యాప్తి చెందాయి మరియు ప్రజలు హదీసుల కోసం ఖుర్ఆన్ను
వదలిపెట్టారు. అటువంటి ఆ సమయములో ఖలీఫా ఇబ్న్ అబ్దేల్-ఆజిజ్,
హదీసులు మరియు సున్నాహ్ వ్రాయటానికి అనుమతి ఆదేశాన్ని ఇచ్చారు,
ఎందుకంటే దానివలన కేవలం వాస్తవ హదీసులు మాత్రమే రికార్డు
చేయబడతాయి మరియు అవి అసత్యాలకి ముగింపు చేస్తాయి అని ఆలోచించి
ఖలీఫా ఆ నిర్ణయం తీసుకున్నారు. అతని పాలనలో, అతను ఖుర్ఆన్లోని
దేవుని ధర్మాలని మరియు ప్రవక్త నియమాలను ఇంకా అతనికంటే ముందు
ప్రజల ఉదాహరణలను మరియు అతని కాలములోని ఎంతోమంది
పండితుల అభ్యంతరాలను నిరాకరించాడు. అప్పటినుండి దేవుని మతం
అయిన ఖుర్ఆన్ నుండి, ఇస్లామ్ హదీసులు సున్నాహ్ మీదికి వెళ్ళింది,
వేటిని (హదీసులను, సున్నార్ట్లను) దేవుడు ఆయన ప్రవక్త వాస్తవానికి
నిషేధించారో, వాటి మీదికే ఇస్లామ్ మతం వెళ్ళింది.
హదీసుల మొదటి వ్రాతలు :
చరిత్ర ప్రకారము హదీసులు ప్రవక్త ఉన్న కాలములోనే వ్రాశారు
అనేది వాస్తవము, కానీ ప్రవక్త మరియు అతని తరువాత పాలించిన వారు
ఈ వ్రాతలను (హదీసులని) ఖండించారు, నాశనం చేశారు. మరియు
హదీసులని వ్రాసిన వారిని అవమానకరంగా చూశారు. హదీసు గ్రంథాలు
ఇలా చెప్పాయి, మహ్మద్ ప్రవక్త, సేకరింపబడిన అన్ని హదీసులని

Page 63
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
61
ముస్లీమ్స్ ఖుర్ఆన్ని వదలి హదీసులని స్వీకరిస్తారేమో అని భయపడి వాటిని
వ్రాయటం మానుకున్నాడు.
“నేను సున్నహ్ వ్రాయాలని కోరుకున్నా, మరియు నేను జ్ఞాపకం
తెచ్చుకున్నా నీకంటే ముందు వున్న ప్రజలు గురించి, వారు గ్రంథాలను
రచించారు. వాటిని అనుసరించడానికి మరియు దేవుని గ్రంథాన్ని వదలి
పెట్టటానికి. మరియు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా నేను ఎప్పుడూ కానీ దేవుని
గ్రంథాన్ని వేరొక గ్రంథముతో మార్చాను అని "జమి అల్-బయన్ 1/67
అలీ ఇబ్న్ అబూ తాలిబ్, నాలుగవ ఖలీఫా తన ప్రసంగాలలో ఒక దానిలో
ఇలా చెప్పాడు. “ఎవరెవరు ప్రవక్త నుండి వ్రాతలను తీసుకున్నారో
వారినందరినీ అర్థిస్తున్నాను, మీరు ఇంటికి పోయి వాటిని చెరిపేయండి.
మీకంటే ముందు ప్రజలు నాశనం చేయబడ్డారు. ఎందుకంటే వారు
పండితులు వ్రాసిన హదీసులను అనుసరించి మరియు వారికి దేవుడు
ఇచ్చిన గ్రంథాన్ని వదలిపెట్టారు” (సునన్ అల్-ధరామి).
ఖలీఫా ఒమర్ ఇబ్న్ అబ్దుల్ ఆజిజ్, అంత్యము యొక్క మొదలు.
అబూ హురైరా అందరికంటే ఎక్కువగా ఎవరూ చెప్పనన్ని
హదీసులని చెప్పాడు. ఇంకా ప్రవక్తతో కలిసి వారి జీవితాంతం జీవించిన
అబూ బాకర్, ఒమర్ అలీ మరియు ఆయిషా వారికంటే కూడా ఎక్కువ
హదీసులు చెప్పాడు. కేవలం రెండు సంవత్సరాలకంటే తక్కువ సమయం
ప్రవక్తతో కలిసి వున్న సమయములో అతను ప్రవక్త అనుచరులు అందరూ
వ్రాసిన హదీసులకంటే ఎక్కువ హదీసులు వ్రాశాడు. అతను మొత్తము
5374 హదీసులు చెప్పాడు. ఇబ్న్ హంబల్ మొత్తం 3848 హదీసులను
తన గ్రంథములో చెప్పాడు. ప్రవక్త మరణించిన తరువాత ముస్లీమ్ దేశాన్ని
పాలించిన నడిపించబడిన ఖైపాలు ఖుర్ఆన్ తప్ప వేరే ఏదీ వ్రాయకూడదు
62
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అను ప్రవక్త కోరికను గౌరవించి మరియు, హదీసులు మరియు సున్నాహ్
వ్రాసే ఎటువంటి ప్రయత్నం అయినా తప్పు అని చెప్పారు. (ఖండించారు
/ నిషేధించారు.)
వారు సూచించిన పద్ధతిని ప్రవక్త మరణించిన రెండు వందల
సంవత్సరాల వరకు పాటించారు. ఆ సమయానికే, ప్రవక్త గురించి అబద్దాలు
వ్యాప్తి చెందాయి మరియు ప్రజలు హదీసుల కోసం ఖుర్ఆన్ను
వదలిపెట్టారు. అటువంటి ఆ సమయములో ఖలీఫా ఇబ్న్ అబ్దేల్-ఆజిజ్,
హదీసులు మరియు సున్నాహ్ వ్రాయటానికి అనుమతి ఆదేశాన్ని ఇచ్చారు,
ఎందుకంటే దానివలన కేవలం వాస్తవ హదీసులు మాత్రమే రికార్డు
చేయబడతాయి మరియు అవి అసత్యాలకి ముగింపు చేస్తాయి అని ఆలోచించి
ఖలీఫా ఆ నిర్ణయం తీసుకున్నారు. అతని పాలనలో, అతను ఖుర్ఆన్లోని
దేవుని ధర్మాలని మరియు ప్రవక్త నియమాలను ఇంకా అతనికంటే ముందు
ప్రజల ఉదాహరణలను మరియు అతని కాలములోని ఎంతోమంది
పండితుల అభ్యంతరాలను నిరాకరించాడు. అప్పటినుండి దేవుని మతం
అయిన ఖుర్ఆన్ నుండి, ఇస్లామ్ హదీసులు సున్నాహ్ మీదికి వెళ్ళింది,
వేటిని (హదీసులను, సున్నార్ట్లను) దేవుడు ఆయన ప్రవక్త వాస్తవానికి
నిషేధించారో, వాటి మీదికే ఇస్లామ్ మతం వెళ్ళింది.
హదీసుల మొదటి వ్రాతలు :
చరిత్ర ప్రకారము హదీసులు ప్రవక్త ఉన్న కాలములోనే వ్రాశారు
అనేది వాస్తవము, కానీ ప్రవక్త మరియు అతని తరువాత పాలించిన వారు
ఈ వ్రాతలను (హదీసులని) ఖండించారు, నాశనం చేశారు. మరియు
హదీసులని వ్రాసిన వారిని అవమానకరంగా చూశారు. హదీసు గ్రంథాలు
ఇలా చెప్పాయి, మహ్మద్ ప్రవక్త, సేకరింపబడిన అన్ని హదీసులని

Page 64
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
63
కాల్చివేశాడు. మరియు “ఖుర్ఆన్తో పాటు ఇంకొక గ్రంథము తయారు
చేసినందుకు” వారిపట్ల కోపోద్రిక్తుడు అయినాడు. అబూ బాకర్ మరియు
ఇబ్న్ అల్-ఖత్తాబ్ కూడా సేకరించిన హదీసులు అన్నిటినీ (కలెక్షన్స్) కాల్చి
వేయాలని ఆజ్ఞాపించబడ్డారు.
ఈ హదీసుల నిషేధం అలానే కొనసాగింది ఒమర్ అబ్దేల్-ఆజిజ్
హదీసులు వ్రాయటానికి అనుమతి ఇచ్చేవరకు, అప్పుడు చాలా గ్రంథాలు
మరియు (కరారీస్) హదీసులు కలిగినవి వచ్చాయి, ఉదాహరణకు ఇబ్న్
గ్రీగ్, మాలిక్ ఇబ్న్ అనాస్, మహమ్మద్ ఇబ్న్ ఇషాక్. వీటన్నిటిలో అత్యంత
ప్రఖ్యాతమైనది మాలిక్ ఇబ్న్ అనాస్ యొక్క గ్రంథము (అల్-మువాత్తా)
అది దాదాపు 500 హదీసులు కలిగియుంది. రెండవ శతాబ్దం చివరిలో
మాసానిద్ అనే గ్రంథాలూ వచ్చాయి. ఉదాహరణకు అహ్మద్ ఇబ్న్ హంబల్
యొక్క మస్నాద్ గ్రంథము ఇది 40,000 హదీసులు కలిగివుంది. మూడవ
శతాబ్దం మొదటి 50 సంవత్సరాలలో ప్రఖ్యాత ఆరు హదీసు గ్రంథాలు
తయారైనాయి మరియు వీటిని నేటి ఎంతోమంది పండితులు
ఉపయోగిస్తున్నారు. 1) షాహీ బుఖారీ, 2) షాహీ మోస్లేమ్, 3) సునన్
అబూ దావుద్, 4) సునన్ అల్-టెర్మితే, 5) సునన్ అల్-నేసెయ్,
6) సునన్ ఇబ్న్ మగెహ్.
ఈ గ్రంథాలలో ఒక క్రొత్త మతము వ్రాయబడి అది ఖుర్ఆన్
మీద అధిపత్యం వహించింది. అది ప్రకటించిన విషయానికి వ్యతిరేఖంగా
(అంటే అవి తమకు తాము ఖుర్ఆన్కంటే తక్కువ అని చెప్పిన దానికి) ఈ
గ్రంథాలు వ్రాయటంలో రచయితలు, హదీసులు ఖుర్ఆనికి వ్యతిరేఖంగా
వున్నా లేక ఇతర హదీసులకు వ్యతిరేఖంగా వున్నా లేక సాధారణ విచక్షణ
లేకున్నా వాటిని పట్టించుకోలేదు. వాస్తవానికి అవి 6-112, 113లో
చెప్పిన దేవుని ప్రతిజ్ఞని నెరవేర్చాయి.
64
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
(6-112, 113) అదే విధముగా మేము పైశాచిక స్వభావం గల
మానవుల్ని, జిన్నులనీ, ప్రతి దైవ ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు
ఆత్మ వంచనతో పరస్పరం మనోహరమైన మాటలు చెప్పుకుంటారు. అలా
చేయకూడదని ముందే నీ ప్రభువు నిర్ణయించి ఉంటే వారలా ఎన్నటికీ
చేయరు. కనుక వారు అలాగే తియ్యటి మాటలతో (హదీసులతో)
ఒకరినొకరు మోసగించుకొనేలా వారి మానాన వారిని వదిలిపెట్టు.
పరలోకాన్ని విశ్వసించినవారి హృదయాలు సహజంగానే తియ్యటి మాటల
వైపు మొగ్గుతాయి. అవంటేనే వారికి ఇష్టం. (యదార్థం వారికిప్పుడు
చేదుగానే ఉంటుంది.) అందువలన వారు (యదార్థము తెలిసినప్పటికీ)
లోగడ చేస్తూ వచ్చిన (దుష్టు) కార్యాలే ఇప్పుడూ చేస్తున్నారు.
ఎన్ని హదీసులు :
సేకరించిన హదీసులు మరియు ప్రవక్త ముహమ్మద్
సంబంధించినవి వందల వేలు, దాదాపు 7,00,000. వీటిలో చాలావరకు
పచ్చి అబద్దాలు మరియు కల్పితాలు మరియు ఏ ముస్లీమ్ పండితులు
హదీసులు ఏవి సత్యము, ఏవి సత్యము కాదో చెప్పగలిగే వారిచేత నిరాకరించ
బడినవి. ఇప్పుడు మనము కొంతమంది ప్రఖ్యాత హదీసు సేకరణకర్తలు
మరియు వారు సేకరించినవి చూస్తాము.
1) మాలిక్ ఇబ్న్ అనాస్ దాదాపు 500 హదీసులని తన ప్రఖ్యాత
గ్రంథం “అల్-మువాత్తా” లో సేకరించాడు.
2) అహ్మద్ ఇబ్న్ హంబల్ దాదాపు 40,000 హదీసులని తన ప్రఖ్యాత
గ్రంథము “ముస్నాద్”లో సేకరించాడు. అతను ఆ 40,000 హదీసులని
7,00,000 హదీసుల నుండి ఎంచుకున్నాడు. అంటే ఇంకోరకంగా
చెప్పాలంటే, అతను 6,60,000 హదీసులు అబద్దాలని నిరూపించబడినవి

Page 65
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
63
కాల్చివేశాడు. మరియు “ఖుర్ఆన్తో పాటు ఇంకొక గ్రంథము తయారు
చేసినందుకు” వారిపట్ల కోపోద్రిక్తుడు అయినాడు. అబూ బాకర్ మరియు
ఇబ్న్ అల్-ఖత్తాబ్ కూడా సేకరించిన హదీసులు అన్నిటినీ (కలెక్షన్స్) కాల్చి
వేయాలని ఆజ్ఞాపించబడ్డారు.
ఈ హదీసుల నిషేధం అలానే కొనసాగింది ఒమర్ అబ్దేల్-ఆజిజ్
హదీసులు వ్రాయటానికి అనుమతి ఇచ్చేవరకు, అప్పుడు చాలా గ్రంథాలు
మరియు (కరారీస్) హదీసులు కలిగినవి వచ్చాయి, ఉదాహరణకు ఇబ్న్
గ్రీగ్, మాలిక్ ఇబ్న్ అనాస్, మహమ్మద్ ఇబ్న్ ఇషాక్. వీటన్నిటిలో అత్యంత
ప్రఖ్యాతమైనది మాలిక్ ఇబ్న్ అనాస్ యొక్క గ్రంథము (అల్-మువాత్తా)
అది దాదాపు 500 హదీసులు కలిగియుంది. రెండవ శతాబ్దం చివరిలో
మాసానిద్ అనే గ్రంథాలూ వచ్చాయి. ఉదాహరణకు అహ్మద్ ఇబ్న్ హంబల్
యొక్క మస్నాద్ గ్రంథము ఇది 40,000 హదీసులు కలిగివుంది. మూడవ
శతాబ్దం మొదటి 50 సంవత్సరాలలో ప్రఖ్యాత ఆరు హదీసు గ్రంథాలు
తయారైనాయి మరియు వీటిని నేటి ఎంతోమంది పండితులు
ఉపయోగిస్తున్నారు. 1) షాహీ బుఖారీ, 2) షాహీ మోస్లేమ్, 3) సునన్
అబూ దావుద్, 4) సునన్ అల్-టెర్మితే, 5) సునన్ అల్-నేసెయ్,
6) సునన్ ఇబ్న్ మగెహ్.
ఈ గ్రంథాలలో ఒక క్రొత్త మతము వ్రాయబడి అది ఖుర్ఆన్
మీద అధిపత్యం వహించింది. అది ప్రకటించిన విషయానికి వ్యతిరేఖంగా
(అంటే అవి తమకు తాము ఖుర్ఆన్కంటే తక్కువ అని చెప్పిన దానికి) ఈ
గ్రంథాలు వ్రాయటంలో రచయితలు, హదీసులు ఖుర్ఆనికి వ్యతిరేఖంగా
వున్నా లేక ఇతర హదీసులకు వ్యతిరేఖంగా వున్నా లేక సాధారణ విచక్షణ
లేకున్నా వాటిని పట్టించుకోలేదు. వాస్తవానికి అవి 6-112, 113లో
చెప్పిన దేవుని ప్రతిజ్ఞని నెరవేర్చాయి.
64
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
(6-112, 113) అదే విధముగా మేము పైశాచిక స్వభావం గల
మానవుల్ని, జిన్నులనీ, ప్రతి దైవ ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు
ఆత్మ వంచనతో పరస్పరం మనోహరమైన మాటలు చెప్పుకుంటారు. అలా
చేయకూడదని ముందే నీ ప్రభువు నిర్ణయించి ఉంటే వారలా ఎన్నటికీ
చేయరు. కనుక వారు అలాగే తియ్యటి మాటలతో (హదీసులతో)
ఒకరినొకరు మోసగించుకొనేలా వారి మానాన వారిని వదిలిపెట్టు.
పరలోకాన్ని విశ్వసించినవారి హృదయాలు సహజంగానే తియ్యటి మాటల
వైపు మొగ్గుతాయి. అవంటేనే వారికి ఇష్టం. (యదార్థం వారికిప్పుడు
చేదుగానే ఉంటుంది.) అందువలన వారు (యదార్థము తెలిసినప్పటికీ)
లోగడ చేస్తూ వచ్చిన (దుష్టు) కార్యాలే ఇప్పుడూ చేస్తున్నారు.
ఎన్ని హదీసులు :
సేకరించిన హదీసులు మరియు ప్రవక్త ముహమ్మద్
సంబంధించినవి వందల వేలు, దాదాపు 7,00,000. వీటిలో చాలావరకు
పచ్చి అబద్దాలు మరియు కల్పితాలు మరియు ఏ ముస్లీమ్ పండితులు
హదీసులు ఏవి సత్యము, ఏవి సత్యము కాదో చెప్పగలిగే వారిచేత నిరాకరించ
బడినవి. ఇప్పుడు మనము కొంతమంది ప్రఖ్యాత హదీసు సేకరణకర్తలు
మరియు వారు సేకరించినవి చూస్తాము.
1) మాలిక్ ఇబ్న్ అనాస్ దాదాపు 500 హదీసులని తన ప్రఖ్యాత
గ్రంథం “అల్-మువాత్తా” లో సేకరించాడు.
2) అహ్మద్ ఇబ్న్ హంబల్ దాదాపు 40,000 హదీసులని తన ప్రఖ్యాత
గ్రంథము “ముస్నాద్”లో సేకరించాడు. అతను ఆ 40,000 హదీసులని
7,00,000 హదీసుల నుండి ఎంచుకున్నాడు. అంటే ఇంకోరకంగా
చెప్పాలంటే, అతను 6,60,000 హదీసులు అబద్దాలని నిరూపించబడినవి

Page 66
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
65
66
లేక కల్పితాలు మరియు అవి ధ్రువీకరించినవి కాకపోవచ్చు. అంటే దాదాపు
అబద్ధాలు మరియు కల్పితాలు.
94%
3)
బుఖారి దాదాపు 6,00,000 హదీసులు సేకరించాడు కానీ 7275
హదీసులని మాత్రమే స్వీకరించాడు మరియు 5,92,725 హదీసులని
నిరూపితం కానివి, అబద్దాలు కట్టు కథలు అని నిర్ధారించుకున్నారు. అంటే
అవి దాదాపు 99% తను సేకరించిన వాటిలో గలవు.
4)
మోస్లేమ్ 3,00,000 హదీసులని సేకరించాడు కానీ 4,000
మాత్రమే స్వీకరించాడు. 2,96,000 హదీసులని నిరాకరించాడు. అంటే
దాదాపు 99% తను సేకరించిన హదీసులు. (దీనినిబట్టి హదీసులలో
ఎన్ని అసత్యాలు గలవో అర్థమవుతుంది.)
ఈ విషయాలు మనకు ఒక అవగాహన ఇస్తాయి. ఏమిటంటే
వెనుక ద్వారం గుండా ఇస్లామ్ మతంలోనికి ఎంత కలుషితం చేరిందో
మరియు చేరటానికి ప్రయత్నం చేసిందో. ఇప్పుడు మనము అర్థము
చేసుకోవాలి దేవుడు ఎందుకు ఒకే ఒక హదీసు అని నిర్ధారించబడిన తన
గ్రంథమును కాపాడుతానని, సంరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడో, ఆ గ్రంథమే
స్వీకరించవలసిన హదీసు మరియు ఉత్తమమైన హదీసు. అదే ఖుర్ఆన్
గ్రంథము.
దేవుడిని అవమానపరిచే హదీసులు :-
క్రింద కొన్ని హదీసు ఉదాహరణలు ఇవ్వబడినాయి. ఏవి దేవుడిని
అవమానపరుస్తున్నాయో చూడండి.
దేవుడు తన గురించి ఖుర్ఆన్లో చెప్పిన మాటలు మనము గుర్తు తెచ్చు
కొనుట మనకు ఉపయోగకరం.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
(6-113) ఎవరి చూపులూ ఆయనని అందుకోలేవు. ఆయన
మాత్రం అందరి చూపులని అందుకోగలడు. ఆయన ఎంతో సునిశిత
దృష్ఠికలవాడు, ప్రతీ దానిని తెలుసుకోగలవాడు.
(42-11) విశ్వ వ్యవస్థలో ఆయనను పోలినది ఏదీ లేదు.
మోసే దేవుడిని చూడాలని అడిగినప్పుడు (7-143) దేవుడు తనని
మోసే చూడలేడు అని మోసేకి చెప్పాడు.
ఇప్పుడు మనము బుఖారి మరియు మోస్లేమ్ దేవుడిని గురించి
వర్ణిస్తూ తమ గ్రంథాలలో చెప్పిన కట్టుకథలు అన్ని అవి ప్రవక్త యొక్క
మాటలు అని చెప్పినవి (చెప్పారు)
1) దేవుడు తన విశ్వాసులకి కనిపిస్తాడు, వారు నిండు చంద్రుడిని
చూసినట్టు చూస్తారు (బుఖారి భాగం 9, బుక్ 93, నెంబర్ 529). (దేవుడు
కనిపించడు అని ఖుర్ఆన్ చెప్పింది.)
2)
దేవుడు తన పాదాన్ని నరకాగ్ని మీద ఉంచాడు. దానితో అది
నిండుకుంటుంది అని (బుఖారి భాగం 8, బుక్ 78, నెంబర్ 654).
(ఖుర్ఆన్ ప్రకారము పూర్తి అసత్యము)
3) దేవుడు మనుషులవలె నవ్వుతాడు! (మోస్లేమ్ బుక్ 1, నెంబర్
349). (దేవుడు మనుషులవలె లేడు)
అబూ హురైరా మరియు ఎన్నో అసత్యాలు :
అబూ హురైరా యెమెన్ దేశం నుంచి హిజ్రా ఏడవ శతాబ్దంలో
వచ్చాడు మరియు ఇస్లామ్ మతంలోనికి మారాడు. దాదాపు రెండు
సంవత్సరాలు ప్రవక్త ముహమ్మద్ సాన్నిధ్యంలో వున్నాడు. అతను 5000
కంటే ఎక్కువ హదీసులు చెప్పాడు. 5374 ఖచ్చితంగా అంటే అన్ని

Page 67
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
65
66
లేక కల్పితాలు మరియు అవి ధ్రువీకరించినవి కాకపోవచ్చు. అంటే దాదాపు
అబద్ధాలు మరియు కల్పితాలు.
94%
3)
బుఖారి దాదాపు 6,00,000 హదీసులు సేకరించాడు కానీ 7275
హదీసులని మాత్రమే స్వీకరించాడు మరియు 5,92,725 హదీసులని
నిరూపితం కానివి, అబద్దాలు కట్టు కథలు అని నిర్ధారించుకున్నారు. అంటే
అవి దాదాపు 99% తను సేకరించిన వాటిలో గలవు.
4)
మోస్లేమ్ 3,00,000 హదీసులని సేకరించాడు కానీ 4,000
మాత్రమే స్వీకరించాడు. 2,96,000 హదీసులని నిరాకరించాడు. అంటే
దాదాపు 99% తను సేకరించిన హదీసులు. (దీనినిబట్టి హదీసులలో
ఎన్ని అసత్యాలు గలవో అర్థమవుతుంది.)
ఈ విషయాలు మనకు ఒక అవగాహన ఇస్తాయి. ఏమిటంటే
వెనుక ద్వారం గుండా ఇస్లామ్ మతంలోనికి ఎంత కలుషితం చేరిందో
మరియు చేరటానికి ప్రయత్నం చేసిందో. ఇప్పుడు మనము అర్థము
చేసుకోవాలి దేవుడు ఎందుకు ఒకే ఒక హదీసు అని నిర్ధారించబడిన తన
గ్రంథమును కాపాడుతానని, సంరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడో, ఆ గ్రంథమే
స్వీకరించవలసిన హదీసు మరియు ఉత్తమమైన హదీసు. అదే ఖుర్ఆన్
గ్రంథము.
దేవుడిని అవమానపరిచే హదీసులు :-
క్రింద కొన్ని హదీసు ఉదాహరణలు ఇవ్వబడినాయి. ఏవి దేవుడిని
అవమానపరుస్తున్నాయో చూడండి.
దేవుడు తన గురించి ఖుర్ఆన్లో చెప్పిన మాటలు మనము గుర్తు తెచ్చు
కొనుట మనకు ఉపయోగకరం.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
(6-113) ఎవరి చూపులూ ఆయనని అందుకోలేవు. ఆయన
మాత్రం అందరి చూపులని అందుకోగలడు. ఆయన ఎంతో సునిశిత
దృష్ఠికలవాడు, ప్రతీ దానిని తెలుసుకోగలవాడు.
(42-11) విశ్వ వ్యవస్థలో ఆయనను పోలినది ఏదీ లేదు.
మోసే దేవుడిని చూడాలని అడిగినప్పుడు (7-143) దేవుడు తనని
మోసే చూడలేడు అని మోసేకి చెప్పాడు.
ఇప్పుడు మనము బుఖారి మరియు మోస్లేమ్ దేవుడిని గురించి
వర్ణిస్తూ తమ గ్రంథాలలో చెప్పిన కట్టుకథలు అన్ని అవి ప్రవక్త యొక్క
మాటలు అని చెప్పినవి (చెప్పారు)
1) దేవుడు తన విశ్వాసులకి కనిపిస్తాడు, వారు నిండు చంద్రుడిని
చూసినట్టు చూస్తారు (బుఖారి భాగం 9, బుక్ 93, నెంబర్ 529). (దేవుడు
కనిపించడు అని ఖుర్ఆన్ చెప్పింది.)
2)
దేవుడు తన పాదాన్ని నరకాగ్ని మీద ఉంచాడు. దానితో అది
నిండుకుంటుంది అని (బుఖారి భాగం 8, బుక్ 78, నెంబర్ 654).
(ఖుర్ఆన్ ప్రకారము పూర్తి అసత్యము)
3) దేవుడు మనుషులవలె నవ్వుతాడు! (మోస్లేమ్ బుక్ 1, నెంబర్
349). (దేవుడు మనుషులవలె లేడు)
అబూ హురైరా మరియు ఎన్నో అసత్యాలు :
అబూ హురైరా యెమెన్ దేశం నుంచి హిజ్రా ఏడవ శతాబ్దంలో
వచ్చాడు మరియు ఇస్లామ్ మతంలోనికి మారాడు. దాదాపు రెండు
సంవత్సరాలు ప్రవక్త ముహమ్మద్ సాన్నిధ్యంలో వున్నాడు. అతను 5000
కంటే ఎక్కువ హదీసులు చెప్పాడు. 5374 ఖచ్చితంగా అంటే అన్ని

Page 68
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
67
68
కేవలము రెండు సంవత్సరాలకంటే తక్కువ ప్రవక్తతో కలిసివున్న కాలంలో
(ఆయిషా, అబూ బకర్ మరియు ఒమర్ చెప్పిన తక్కువ హదీసులతో
పోల్చినప్పుడు) అతను చెప్పిన హదీసులు చాలా వరకు “ఆహద్” హదీసులు
అని పిలువబడేవి అనగా! కేవలం ఒకే వ్యక్తి సాక్షిగా ఉన్న హదీసులు, ఆ
ఒక వ్యక్తి అబూ హురైరా మాత్రమే. ప్రవక్త యొక్క కొంతమంది సన్నిహితులు
మరియు ప్రవక్త భార్య ఆయిషా అతనిని (అబూ హురైరా) అబద్ధాలకోరు
అని ఆరోపించారు. అతను హదీసులకి గొప్పతనం చేకూర్చటానికి ఒక
హోదా పొందటానికి ప్రవక్త గురించి అబద్దాలు చెప్పేవాడు అని. నడిపించ
బడిన రెండవ ఖలీఫా ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్, అబూ హురైరా ప్రవక్త
గురించి అబద్దాలు చెప్పడం ఆపకపోతే దేశం నుండి పంపిస్తాను అని
అబూ హురైరాని ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ బెదిరించాడు, ఒమర్ చంపబడే
అంతవరకు అతను ఊరికే ఉండి మళ్లీ మొదలు పెట్టాడు. అతను ముస్లీమ్ల
ఖలీఫాను ఆనందింప చేయటము కోసం హదీసులని చెప్పటము అలాగే
కొన సాగించాడు. అతను సిరియాలో ముఆవియా యొక్క రాజ భవనంలో
జీవించిన కాలంలో కూడా హదీసులు చెప్పాడు. అబూ హురైరా తన
ప్రేక్షకులకి హదీసులు చెప్పుచూ ఇలా చెప్పాడు తాను ఎప్పుడైనా ఒమర్
జీవించి ఉన్నప్పుడు హదీసులు చెప్పియుంటే తనకి ఒమర్ కొరడా దెబ్బలు
ఇచ్చేవాడు అని.
అబూ జాఫర్ అల్ ఇస్కఫీ ఇలా చెప్పాడు. ఏమిటంటే ఖలీఫా
మరియు ముఆవియాహ్ కొంతమంది ప్రజలను ఎన్నుకొన్నారు అబూ
హురైరాని కూడా కట్టు కథలు చెప్పటానికి, మరియు అలీ ఇబ్న్ అబూ
తాలిబ్ గురించి హదీసులు చెప్పటానికి అతనిని తక్కువ చెయ్యటానికి,
అలీ ఇబ్న్ అబూ తాలిబ్ ప్రవక్త యొక్క బంధువు (కజిన్) ముఆవియా
యొక్క రాజ భవనంలో అబూ హురైరా జీవించాడు మరియు ముఆవియాకి
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అతను అలీ ఇబ్న్ అబూ
రాజకీయంగా కూడా సేవలు అందించాడు.
తాలిబ్ను కించపరిచే, అవమానపరిచే కొన్ని హదీసులని తయారు చేశాడు.
ఇంకా అబూ బాకర్, ఒమర్ మరియు ఉత్మన్కంటే తక్కువవాడు అలీ ఇబ్న్
అబూ తాలిబ్ అని చూపించటానికి, ఇది కేవలం ముఆవియాని సంతోష
పెట్టుట కోసం అలా చేశాడు. ముఆవియాహ్ పరిపాలన కాలంలో, ఇమాం
లేక ఖలీఫా మాటలను దేవుని మాటలవలె పాటించటానికి ఎన్నో హదీసులు
అబూ హురైరా చేత తయారు చేయబడినాయి. అవి ఖుర్ఆన్ నియమానికి
(రూల్కి) విరుద్ధముగా ఉన్నాయి. ఖుర్ఆన్ నియమం - అన్ని విషయాలు
ప్రజాస్వామ్యబద్దముగా ఉండాలి అనేవాడు. (అబూ హురైరా ఆ
సమయములో ఖలీఫా యొక్క రాజభవనంలో నివసిస్తున్నాడని మర్చి
పోకూడదు.)
అబూ హురైరా చెప్పిన ఎన్నో హదీసులు ఇతర హదీసులతో
విభేదిస్తాయి. తాను చెప్పిన హదీసులతో కూడా, మరియు ఇతర ప్రజల
హదీసులతో, ఖుర్ఆన్ సాధారణ విచక్షణతో అతని హదీసులు
విభేదిస్తాయి.
అబూ హురైరా కాబ్ అల్ అహబర్ యొక్క హదీసులు కూడా
చెప్పాడు, కాబ్ అల్ అహబర్ ముస్లీమ్గా మారిన ఒక యూదుడు. అతను
యూదుల కలుషిత గ్రంథాలని ఉపయోగించి ఖుర్ఆన్ని వివరించటానికి
ప్రయత్నం చేశాడు. అతను కొన్ని దారుణమైన హదీసులని తయారు
చేశాడు. అవి పూర్తిగా ఖుర్ఆనికి విరుద్ధముగా ఉన్నాయి. అవి తోరాలోని
తప్పుడు కథల నుండి తీసుకున్నవి.
ఇస్లామ్ చరిత్రకారులు అబూ హురైరాకు పరిపాలనాధికారం
(Governor Ship) ఇవ్వబడిన తరువాతి కథ చెప్పారు. అతను రెండు

Page 69
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
67
68
కేవలము రెండు సంవత్సరాలకంటే తక్కువ ప్రవక్తతో కలిసివున్న కాలంలో
(ఆయిషా, అబూ బకర్ మరియు ఒమర్ చెప్పిన తక్కువ హదీసులతో
పోల్చినప్పుడు) అతను చెప్పిన హదీసులు చాలా వరకు “ఆహద్” హదీసులు
అని పిలువబడేవి అనగా! కేవలం ఒకే వ్యక్తి సాక్షిగా ఉన్న హదీసులు, ఆ
ఒక వ్యక్తి అబూ హురైరా మాత్రమే. ప్రవక్త యొక్క కొంతమంది సన్నిహితులు
మరియు ప్రవక్త భార్య ఆయిషా అతనిని (అబూ హురైరా) అబద్ధాలకోరు
అని ఆరోపించారు. అతను హదీసులకి గొప్పతనం చేకూర్చటానికి ఒక
హోదా పొందటానికి ప్రవక్త గురించి అబద్దాలు చెప్పేవాడు అని. నడిపించ
బడిన రెండవ ఖలీఫా ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్, అబూ హురైరా ప్రవక్త
గురించి అబద్దాలు చెప్పడం ఆపకపోతే దేశం నుండి పంపిస్తాను అని
అబూ హురైరాని ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ బెదిరించాడు, ఒమర్ చంపబడే
అంతవరకు అతను ఊరికే ఉండి మళ్లీ మొదలు పెట్టాడు. అతను ముస్లీమ్ల
ఖలీఫాను ఆనందింప చేయటము కోసం హదీసులని చెప్పటము అలాగే
కొన సాగించాడు. అతను సిరియాలో ముఆవియా యొక్క రాజ భవనంలో
జీవించిన కాలంలో కూడా హదీసులు చెప్పాడు. అబూ హురైరా తన
ప్రేక్షకులకి హదీసులు చెప్పుచూ ఇలా చెప్పాడు తాను ఎప్పుడైనా ఒమర్
జీవించి ఉన్నప్పుడు హదీసులు చెప్పియుంటే తనకి ఒమర్ కొరడా దెబ్బలు
ఇచ్చేవాడు అని.
అబూ జాఫర్ అల్ ఇస్కఫీ ఇలా చెప్పాడు. ఏమిటంటే ఖలీఫా
మరియు ముఆవియాహ్ కొంతమంది ప్రజలను ఎన్నుకొన్నారు అబూ
హురైరాని కూడా కట్టు కథలు చెప్పటానికి, మరియు అలీ ఇబ్న్ అబూ
తాలిబ్ గురించి హదీసులు చెప్పటానికి అతనిని తక్కువ చెయ్యటానికి,
అలీ ఇబ్న్ అబూ తాలిబ్ ప్రవక్త యొక్క బంధువు (కజిన్) ముఆవియా
యొక్క రాజ భవనంలో అబూ హురైరా జీవించాడు మరియు ముఆవియాకి
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
అతను అలీ ఇబ్న్ అబూ
రాజకీయంగా కూడా సేవలు అందించాడు.
తాలిబ్ను కించపరిచే, అవమానపరిచే కొన్ని హదీసులని తయారు చేశాడు.
ఇంకా అబూ బాకర్, ఒమర్ మరియు ఉత్మన్కంటే తక్కువవాడు అలీ ఇబ్న్
అబూ తాలిబ్ అని చూపించటానికి, ఇది కేవలం ముఆవియాని సంతోష
పెట్టుట కోసం అలా చేశాడు. ముఆవియాహ్ పరిపాలన కాలంలో, ఇమాం
లేక ఖలీఫా మాటలను దేవుని మాటలవలె పాటించటానికి ఎన్నో హదీసులు
అబూ హురైరా చేత తయారు చేయబడినాయి. అవి ఖుర్ఆన్ నియమానికి
(రూల్కి) విరుద్ధముగా ఉన్నాయి. ఖుర్ఆన్ నియమం - అన్ని విషయాలు
ప్రజాస్వామ్యబద్దముగా ఉండాలి అనేవాడు. (అబూ హురైరా ఆ
సమయములో ఖలీఫా యొక్క రాజభవనంలో నివసిస్తున్నాడని మర్చి
పోకూడదు.)
అబూ హురైరా చెప్పిన ఎన్నో హదీసులు ఇతర హదీసులతో
విభేదిస్తాయి. తాను చెప్పిన హదీసులతో కూడా, మరియు ఇతర ప్రజల
హదీసులతో, ఖుర్ఆన్ సాధారణ విచక్షణతో అతని హదీసులు
విభేదిస్తాయి.
అబూ హురైరా కాబ్ అల్ అహబర్ యొక్క హదీసులు కూడా
చెప్పాడు, కాబ్ అల్ అహబర్ ముస్లీమ్గా మారిన ఒక యూదుడు. అతను
యూదుల కలుషిత గ్రంథాలని ఉపయోగించి ఖుర్ఆన్ని వివరించటానికి
ప్రయత్నం చేశాడు. అతను కొన్ని దారుణమైన హదీసులని తయారు
చేశాడు. అవి పూర్తిగా ఖుర్ఆనికి విరుద్ధముగా ఉన్నాయి. అవి తోరాలోని
తప్పుడు కథల నుండి తీసుకున్నవి.
ఇస్లామ్ చరిత్రకారులు అబూ హురైరాకు పరిపాలనాధికారం
(Governor Ship) ఇవ్వబడిన తరువాతి కథ చెప్పారు. అతను రెండు

Page 70
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
69
సంవత్సరాలలో చాలా ధనవంతుడు అయ్యాడు. దానితో ఒమర్ అతనిని
పిలిచి ఇలా చెప్పాడు. “నీవు, అల్లాహ్ యొక్క శత్రువు, నీవు అల్లాహ్
యొక్క ధనాన్ని దొంగలించావు. నేను నిన్ను బహరేన్ (దేశం) యొక్క
ఎమిర్ (అధికారి / పాలకుడు) ని చేశాను. నీకు ఒక జత షూ (చెప్పులు)
కూడా లేనప్పుడు, నీవు ఈ డబ్బునంతటిని ఎక్కడి నుండి పొందావు
(4,00,000 దిర్హామ్)?” ఒమర్ 10,000 దిర్హాములు అతని నుండి
తీసుకున్నది అని చెప్పబడివుంది (అబూ హురైరా కేవలం 20,000
దిర్హాములకు మాత్రమే హదీసులు వ్రాయడానికి ఒప్పుకున్నాడు)
హదీసులు కల్పితము చేయటంలో ఎక్కువగా అబూ హురైరా
ఆరోపించబడ్డాడు. ప్రవక్త చిన్న భార్య ఆయిషా అతనిని నిందించింది.
అతను సరికాని లేక అసంపూర్ణ కథలు చెప్పుటను మరియు ప్రవక్త ఎప్పుడూ
చెప్పని హదీసులను తయారు చేసినందుకు అయిషా అతనిని
నిందించడము జరిగినది. స్త్రీల మీద మరియు కుక్కల మీద అతనికి వేరు
దురభిప్రాయం ఉందని అతనికి పేరు ఉండేది. అతను ముస్లీమ్ మహిళలను
తీవ్రంగా అవమానించే కొన్ని హదీసులని తయారు చేశాడు. ఇంకా కొన్ని
హదీసులు కుక్కలని చంపమని పిలుపునిచ్చే వాటిని కూడా తయారు చేశాడు.
స్త్రీలను పంట చేలతో పొల్చడము ఎటువైపు నుండి అయినా భార్యను
పొందవచ్చుననడము స్త్రీలను కించపరచినట్లు కాదా? (హదీసు మకరందము
రెండవ భాగము 175వ పేజీ చూడండి.)
ఆయిషా మరియు అబూ హురైరా బేధముగా :
ఇబ్న్ కూతైబా అల్-దినోరి చేత రచించబడిన ప్రఖ్యాత గ్రంథం
"టా ఔయీల్ ముఖ్తలాఫ్ అల్ హడిత్" లో, ఆయిషా అబూ హురైరాతో
చెప్పుచున్న కథ. “ప్రవక్త చెప్పగా మేము విననివి నీవు ప్రవక్త హదీసులని
70
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
చెప్తున్నావు.” అతను ఇలా చెప్పాడు (బుఖారి నివేదించిన ప్రకారముగా)
“నీవు (ఆయిషా) ఎప్పుడు అద్దంతో నీ అలంకరణతో బిజీగా ఉంటావు.”
ఆమె (ఆయిషా) అతనికి ఇలా సమాధానం ఇచ్చింది “నీవు మాత్రమే నీ
కడుపుతోను, నీ ఆకలితోను బిజీగా ఉన్నావు. నీ ఆకలే నిన్ను బిజీగా
ఉంచింది, నీవు గుంపుగా వెళ్ళి ప్రజల వెంటపడుతున్నావు, వారిని ఆహారం
అడుక్కుంటున్నావు. మరియు వారు నిన్ను తప్పించుకొని నీ నుంచి దూరంగా
పోతున్నారు మరియు చివరికి నువ్వు వెనక్కు వచ్చి నా గది ముందరి
నుంచి పోతావు, ప్రజలు నువ్వు పిచ్చోడివి అని అనుకొని అందరూ నిన్ను
తొక్కుతారు.”
బుఖారి యొక్క షాహీ : కలుషితానికి ఉదాహరణ
చాలామంది ముస్లీమ్లు హదీసుల గురించి గౌరవముతో
మాట్లాడుతారు, ఆ మాటలు కొన్నిసార్లు ఖుర్ఆన్తో సమానంగా మరియు
కొన్నిసార్లు ఖుర్ఆన్ని కూడా మించి ఉంటాయి. ఖుర్ఆన్ మనుషులకి
దైవ గ్రంథము. (దేవుడు) విశ్వాసులు దేనిని మార్గదర్శి మరియు సంపూర్ణ
ఆనందం కోసం దేనిని చూడాలో దాని గురించి సందేహానికి చోటు ఇవ్వరు.
దేవుని మాటలు నమ్మనివారు సాధారణముగా హదీసులు ఆశ్రయం
పొందుతారు. వాటిని ఖుర్ఆన్లో మాటి మాటికీ ఖండించారు. దేవుడు
ఖురాన్ని "ఉత్తమ హదీసు” అని వర్ణించాడు, (39-23) “అల్లాహ్
అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక
కలిగివుండే, పదే పదే పునరావృత్తం అవుతూ ఉండే ఆయతులతో కూడిన
గ్రంథం రూపంలో ఉంది. దానివల్ల తమ ప్రభువుకు భయపడేవారి
శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు,
హృదయాలు అల్లాహ్ స్మరణపట్ల మెత్తబడిపోతాయి. ఇది అల్లాహ్

Page 71
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
69
సంవత్సరాలలో చాలా ధనవంతుడు అయ్యాడు. దానితో ఒమర్ అతనిని
పిలిచి ఇలా చెప్పాడు. “నీవు, అల్లాహ్ యొక్క శత్రువు, నీవు అల్లాహ్
యొక్క ధనాన్ని దొంగలించావు. నేను నిన్ను బహరేన్ (దేశం) యొక్క
ఎమిర్ (అధికారి / పాలకుడు) ని చేశాను. నీకు ఒక జత షూ (చెప్పులు)
కూడా లేనప్పుడు, నీవు ఈ డబ్బునంతటిని ఎక్కడి నుండి పొందావు
(4,00,000 దిర్హామ్)?” ఒమర్ 10,000 దిర్హాములు అతని నుండి
తీసుకున్నది అని చెప్పబడివుంది (అబూ హురైరా కేవలం 20,000
దిర్హాములకు మాత్రమే హదీసులు వ్రాయడానికి ఒప్పుకున్నాడు)
హదీసులు కల్పితము చేయటంలో ఎక్కువగా అబూ హురైరా
ఆరోపించబడ్డాడు. ప్రవక్త చిన్న భార్య ఆయిషా అతనిని నిందించింది.
అతను సరికాని లేక అసంపూర్ణ కథలు చెప్పుటను మరియు ప్రవక్త ఎప్పుడూ
చెప్పని హదీసులను తయారు చేసినందుకు అయిషా అతనిని
నిందించడము జరిగినది. స్త్రీల మీద మరియు కుక్కల మీద అతనికి వేరు
దురభిప్రాయం ఉందని అతనికి పేరు ఉండేది. అతను ముస్లీమ్ మహిళలను
తీవ్రంగా అవమానించే కొన్ని హదీసులని తయారు చేశాడు. ఇంకా కొన్ని
హదీసులు కుక్కలని చంపమని పిలుపునిచ్చే వాటిని కూడా తయారు చేశాడు.
స్త్రీలను పంట చేలతో పొల్చడము ఎటువైపు నుండి అయినా భార్యను
పొందవచ్చుననడము స్త్రీలను కించపరచినట్లు కాదా? (హదీసు మకరందము
రెండవ భాగము 175వ పేజీ చూడండి.)
ఆయిషా మరియు అబూ హురైరా బేధముగా :
ఇబ్న్ కూతైబా అల్-దినోరి చేత రచించబడిన ప్రఖ్యాత గ్రంథం
"టా ఔయీల్ ముఖ్తలాఫ్ అల్ హడిత్" లో, ఆయిషా అబూ హురైరాతో
చెప్పుచున్న కథ. “ప్రవక్త చెప్పగా మేము విననివి నీవు ప్రవక్త హదీసులని
70
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
చెప్తున్నావు.” అతను ఇలా చెప్పాడు (బుఖారి నివేదించిన ప్రకారముగా)
“నీవు (ఆయిషా) ఎప్పుడు అద్దంతో నీ అలంకరణతో బిజీగా ఉంటావు.”
ఆమె (ఆయిషా) అతనికి ఇలా సమాధానం ఇచ్చింది “నీవు మాత్రమే నీ
కడుపుతోను, నీ ఆకలితోను బిజీగా ఉన్నావు. నీ ఆకలే నిన్ను బిజీగా
ఉంచింది, నీవు గుంపుగా వెళ్ళి ప్రజల వెంటపడుతున్నావు, వారిని ఆహారం
అడుక్కుంటున్నావు. మరియు వారు నిన్ను తప్పించుకొని నీ నుంచి దూరంగా
పోతున్నారు మరియు చివరికి నువ్వు వెనక్కు వచ్చి నా గది ముందరి
నుంచి పోతావు, ప్రజలు నువ్వు పిచ్చోడివి అని అనుకొని అందరూ నిన్ను
తొక్కుతారు.”
బుఖారి యొక్క షాహీ : కలుషితానికి ఉదాహరణ
చాలామంది ముస్లీమ్లు హదీసుల గురించి గౌరవముతో
మాట్లాడుతారు, ఆ మాటలు కొన్నిసార్లు ఖుర్ఆన్తో సమానంగా మరియు
కొన్నిసార్లు ఖుర్ఆన్ని కూడా మించి ఉంటాయి. ఖుర్ఆన్ మనుషులకి
దైవ గ్రంథము. (దేవుడు) విశ్వాసులు దేనిని మార్గదర్శి మరియు సంపూర్ణ
ఆనందం కోసం దేనిని చూడాలో దాని గురించి సందేహానికి చోటు ఇవ్వరు.
దేవుని మాటలు నమ్మనివారు సాధారణముగా హదీసులు ఆశ్రయం
పొందుతారు. వాటిని ఖుర్ఆన్లో మాటి మాటికీ ఖండించారు. దేవుడు
ఖురాన్ని "ఉత్తమ హదీసు” అని వర్ణించాడు, (39-23) “అల్లాహ్
అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక
కలిగివుండే, పదే పదే పునరావృత్తం అవుతూ ఉండే ఆయతులతో కూడిన
గ్రంథం రూపంలో ఉంది. దానివల్ల తమ ప్రభువుకు భయపడేవారి
శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు,
హృదయాలు అల్లాహ్ స్మరణపట్ల మెత్తబడిపోతాయి. ఇది అల్లాహ్

Page 72
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
71
72
మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరినవారిని సన్మార్గానికి
తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం
చూపేవాడెవడూ ఉండడు.” మరియు మనము ఖుర్ఆన్ తప్ప ఏ ఇతర
హదీసు నమ్మకూడదు (45-6) “ఇవి అల్లాహ్ వాక్యాలు. వీటిని మేము
నీకు ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ మరియు
ఆయన సూచనల (ను కాదన్న) తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు
(ట)?" మరియు (7-185) “ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క
వ్యవస్థను, అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా?
వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు
ఆలోచించలేదా? మరి ఖుర్ఆన్ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు
ఏముంటుంది?”
బుఖారి ఎంతోమంది పండితులలో కేవలం ఒక పండితుడు
మాత్రమే, ప్రవక్త మరియు అతని తరువాత ఖలీఫాలు అందరూ హదీసులు
వద్దని ఆదేశాలు ఇచ్చినా కూడా బుఖారి హదీసులని సేకరించాలని
నిర్ణయించుకున్నాడు. నేటి క్రిస్టియానిటీ ఎక్కువగా పాల్ యొక్క కలుషితం
వలన కట్టుకథల వలన వచ్చినది అయినా, నేడు ఆచరింపబడుచున్న
సాంప్రదాయ సున్ని ఇస్లామ్ బుఖారివంటి ప్రజలు నిజమైన ఇస్లామ్
మతమును కలుషితం చేయటం వలన తయారై వచ్చిన మతం.
ముస్లీమ్ ప్రజలు హదీసులు గ్రంథాల కోసం ఖుర్ఆన్ గ్రంథాన్ని
విడిచిపెట్టిన వెంటనే, వారి మతము నమ్మలేనంతగా కలుషితం అయ్యింది
(చెడిపోయింది). నేటి ఆచరణలో ఉన్న ఇస్లామ్ కేవలము బుఖారి, మోస్లేమ్,
నిసే టెర్మితే, అబూ దావుద్ మరియు ఇతరుల ప్రతిబింబం మాత్రమే.
అది ఇంక ఎంతమటుకు ప్రవక్త ముహమ్మద్ ఇచ్చిన నిజమైన సందేశం
కాదు.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
బుఖారి హదీసులు నిర్ధారణను చూస్తాను అన్న నిమయాన్ని
ఉల్లఘించడము మాత్రమే కాకుండా, ఇంకా అతని వ్యక్తిగత అభిప్రాయాలూ,
రాజకీయ కూటమి మరియు అలీ ఇబ్న్ అబూ తాలిబ్వంటి వ్యక్తుల మీద
ద్వేషము అతను తన గ్రంథములలో వ్రాయటం కొరకు ఎంచుకున్న హదీసుల
మీద ప్రభావం చూపాయి, మరియు ఏ హదీసులని నిరాకరించాలో కూడా
దాని మీద ప్రభావం చూపాయి. అతను హదీసులలో ఏమున్నదో అని
ఎక్కువగా పట్టించుకోలేదు. అతను ఖుర్ఆన్కు వ్యతిరేఖంగా ఉన్న ఎన్నో
హదీసులను వ్రాశాడు, ఇతర హదీసులతో మరియు సాధారణ విచక్షణకు
విరోధముగా వున్నవి, దేవుడిని అవమానపరిచేవి, ప్రవక్త ముహమ్మదిని
అవమానపరిచేవి, ప్రవక్త భార్యలను మరియు అతని కుటుంబాన్ని
అవమానపరిచేవి. ముఆవియాహ్ పట్ల బుఖారి విధానము మరియు అలీ
ఇబ్న్-అబూ తాలిబికి విరుద్ధముగా సంబంధించి అతని (బుఖారి) విధానము
కేవలము బుఖారి యొక్క అక్రమ రాజకీయము వలన మరియు అలీని
తక్కువ చేసి అతని బద్ద శత్రువు ముఆవియాహ్ పూర్తి అక్రమాల వ్యక్తి
మరియు చిన్న చిన్న ఇస్లామ్ ధర్మాలను పాటించని వాడు అయినా కూడా
అతనిని (ముఆవియాహ్) స్వచ్ఛమైన సక్రమమైన వ్యక్తిగా వర్ణించే హదీసులను
గ్రంథములో వ్రాయటంలో అతని (బుఖారి) పక్షపాత వైఖరి. బుఖారి తన
గ్రంథములో ఎన్నో హదీసులని చెప్పాడు. అవి నేడు 'సాహీహ్ (ధృవీకరించ
బడినవి) అని అబద్ధాలకోరులు అక్రమార్కులు వ్రాసినవి నమ్మదగనివి
అనబడిన వాటిగా ప్రజల చేత పేరు పొందాయి. అతని తరువాత వచ్చిన
ముస్లీమ్ పండితులు బుఖారి యొక్క లోపాలని మరియు ఇతర హదీసు
పండితులని ఇంకా అతనిలాంటి సున్నాహ్ (సంప్రదాయం / విధానం) ని
బయట పెట్టటానికి భయపడ్డారు. దీనికోసం ఒక ఉదాహరణ.
“అల్-ముస్తడ్రేక్” అను ప్రఖ్యాత గ్రంథములో రచయిత ఇలా చెప్పాడు.
బుఖారి తన గ్రంథములో మోస్లేమ్ నిరాకరించిన 434 వ్యక్తుల నుండి

Page 73
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
71
72
మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరినవారిని సన్మార్గానికి
తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం
చూపేవాడెవడూ ఉండడు.” మరియు మనము ఖుర్ఆన్ తప్ప ఏ ఇతర
హదీసు నమ్మకూడదు (45-6) “ఇవి అల్లాహ్ వాక్యాలు. వీటిని మేము
నీకు ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ మరియు
ఆయన సూచనల (ను కాదన్న) తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు
(ట)?" మరియు (7-185) “ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క
వ్యవస్థను, అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా?
వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు
ఆలోచించలేదా? మరి ఖుర్ఆన్ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు
ఏముంటుంది?”
బుఖారి ఎంతోమంది పండితులలో కేవలం ఒక పండితుడు
మాత్రమే, ప్రవక్త మరియు అతని తరువాత ఖలీఫాలు అందరూ హదీసులు
వద్దని ఆదేశాలు ఇచ్చినా కూడా బుఖారి హదీసులని సేకరించాలని
నిర్ణయించుకున్నాడు. నేటి క్రిస్టియానిటీ ఎక్కువగా పాల్ యొక్క కలుషితం
వలన కట్టుకథల వలన వచ్చినది అయినా, నేడు ఆచరింపబడుచున్న
సాంప్రదాయ సున్ని ఇస్లామ్ బుఖారివంటి ప్రజలు నిజమైన ఇస్లామ్
మతమును కలుషితం చేయటం వలన తయారై వచ్చిన మతం.
ముస్లీమ్ ప్రజలు హదీసులు గ్రంథాల కోసం ఖుర్ఆన్ గ్రంథాన్ని
విడిచిపెట్టిన వెంటనే, వారి మతము నమ్మలేనంతగా కలుషితం అయ్యింది
(చెడిపోయింది). నేటి ఆచరణలో ఉన్న ఇస్లామ్ కేవలము బుఖారి, మోస్లేమ్,
నిసే టెర్మితే, అబూ దావుద్ మరియు ఇతరుల ప్రతిబింబం మాత్రమే.
అది ఇంక ఎంతమటుకు ప్రవక్త ముహమ్మద్ ఇచ్చిన నిజమైన సందేశం
కాదు.
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
బుఖారి హదీసులు నిర్ధారణను చూస్తాను అన్న నిమయాన్ని
ఉల్లఘించడము మాత్రమే కాకుండా, ఇంకా అతని వ్యక్తిగత అభిప్రాయాలూ,
రాజకీయ కూటమి మరియు అలీ ఇబ్న్ అబూ తాలిబ్వంటి వ్యక్తుల మీద
ద్వేషము అతను తన గ్రంథములలో వ్రాయటం కొరకు ఎంచుకున్న హదీసుల
మీద ప్రభావం చూపాయి, మరియు ఏ హదీసులని నిరాకరించాలో కూడా
దాని మీద ప్రభావం చూపాయి. అతను హదీసులలో ఏమున్నదో అని
ఎక్కువగా పట్టించుకోలేదు. అతను ఖుర్ఆన్కు వ్యతిరేఖంగా ఉన్న ఎన్నో
హదీసులను వ్రాశాడు, ఇతర హదీసులతో మరియు సాధారణ విచక్షణకు
విరోధముగా వున్నవి, దేవుడిని అవమానపరిచేవి, ప్రవక్త ముహమ్మదిని
అవమానపరిచేవి, ప్రవక్త భార్యలను మరియు అతని కుటుంబాన్ని
అవమానపరిచేవి. ముఆవియాహ్ పట్ల బుఖారి విధానము మరియు అలీ
ఇబ్న్-అబూ తాలిబికి విరుద్ధముగా సంబంధించి అతని (బుఖారి) విధానము
కేవలము బుఖారి యొక్క అక్రమ రాజకీయము వలన మరియు అలీని
తక్కువ చేసి అతని బద్ద శత్రువు ముఆవియాహ్ పూర్తి అక్రమాల వ్యక్తి
మరియు చిన్న చిన్న ఇస్లామ్ ధర్మాలను పాటించని వాడు అయినా కూడా
అతనిని (ముఆవియాహ్) స్వచ్ఛమైన సక్రమమైన వ్యక్తిగా వర్ణించే హదీసులను
గ్రంథములో వ్రాయటంలో అతని (బుఖారి) పక్షపాత వైఖరి. బుఖారి తన
గ్రంథములో ఎన్నో హదీసులని చెప్పాడు. అవి నేడు 'సాహీహ్ (ధృవీకరించ
బడినవి) అని అబద్ధాలకోరులు అక్రమార్కులు వ్రాసినవి నమ్మదగనివి
అనబడిన వాటిగా ప్రజల చేత పేరు పొందాయి. అతని తరువాత వచ్చిన
ముస్లీమ్ పండితులు బుఖారి యొక్క లోపాలని మరియు ఇతర హదీసు
పండితులని ఇంకా అతనిలాంటి సున్నాహ్ (సంప్రదాయం / విధానం) ని
బయట పెట్టటానికి భయపడ్డారు. దీనికోసం ఒక ఉదాహరణ.
“అల్-ముస్తడ్రేక్” అను ప్రఖ్యాత గ్రంథములో రచయిత ఇలా చెప్పాడు.
బుఖారి తన గ్రంథములో మోస్లేమ్ నిరాకరించిన 434 వ్యక్తుల నుండి

Page 74
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
73
74
సేకరించిన హదీసులని తన (బుఖారి) గ్రంథములో వ్రాశాడు. వారిని
మోస్లేమ్ తన గ్రంథము ‘సాహీహ్ మోస్లేమ్' కొరకు ఆ 434 మందిని
నమ్మదగిన వారు కాదు అని నిరాకరించాడు. ఇంకో ప్రక్క మోస్లేమ్ తన
గ్రంథములో బుఖారి నిరాకరించిన హదీసులు చెప్పిన 625 మందిని తన
గ్రంథములో స్వీకరించాడు.
హదీసుల ద్వారా ఇస్లామ్ యొక్క కలుషితం, ప్రవక్త జీవించి యున్న
కాలములో మరియు అతను మరణించిన తర్వాత మొదలైంది. ఈ హదీసు
సేకరణలు దేవుని చేత ఖండించబడినాయి. ఇంకా ప్రవక్త మరియు సహాబా
(ప్రవక్త యొక్క సన్నిహితులు) చేత కూడా ఖండించబడ్డాయి. హిజ్రా రెండవ
శతాబ్దం చివరికి వచ్చేసరికి ప్రఖ్యాత ఆరు గ్రంథాలూ రచించే సమయానికి
ఈ పని అత్యంత తీవ్రస్థితికి చేరుకుంది. ఖుర్ఆన్ చెప్పుతుంది తీర్పు
దినమున ప్రవక్త దేవునికి ముస్లీమ్స్ ఖుర్ఆన్ గ్రంథము విడిచిపెట్టుట గురించి
ఫిర్యాదు చేస్తాడు అని.
ఇతర సాహీహ్, అబద్దాలు మరియు కల్పితాలు :
ఈ ఈ భాగంలో కొన్ని దారుణమైన అబద్దాలు మరియు కల్పితాలు
చెప్పబడ్డాయి. వేటిని హదీసు పండితులు ధృవీకరించబడినవి (సాహీహ్)
అని చెప్పారో, ఈ హదీసులు హదీసు సేకరణలలో నిర్ధారించబడినవి,
వాటిని చెప్పినవారు (ఇస్నాద్) నమ్మదగిన వారు అని భావించే వరకు ఆ
హదీసులు ధృవీకరించబడుతాయి. ఇది హదీసులలో ఏమి విషయం
ఉన్నది అన్నదానికి సంబంధం లేకుండ. అవి ఖుర్ఆన్కి విరోధముగా
ఉన్న లేక అందులో సాధారణ విచక్షణ లేకపోయినా అది పెద్ద విషయం
కాదు. క్రింద చెప్పబడినవి ఈ సాహీహ్ అబద్దాలు యొక్క ఉదాహరణలు
(శాంపిల్) మాత్రమే :
1)
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
నిలబడి త్రాగవద్దు.
సాహీహ్ మోస్లేమ్, బుక్ 23, నెంబర్ 5017
“అబూ హురైరా ఇలా చెప్పాడు. దేవుని దూత చెప్పాడు 'నిలబడి
యున్నప్పుడు త్రాగవద్దు, ఎవరైనా మర్చిపోయి అలా చేసుంటే, వారు
త్రాగినది అంతా వాంతికి చేసుకోవాలి”
2)
నిలబడివున్న స్థితిలో ఉచ్చ పోయండి.
సాహీహ్ బుఖారి Vol. 3, Book 43, Number 651.
3)
"దేవుని యొక్క వార్తకుడు నిలబడి ఉన్నప్పుడు ఉచ్చపోశాడు.”
నిలబడి ఉన్నప్పుడు ఉచ్చపోయకండి.
సునన్ ఇబ్న్ మజాహ్, Vol. 1, Book 1, Number 308
“నిలబడి ఉచ్చ పోయకండి”
4) దేవుని రూపంలో మనిషి.
సహీహ్ మోస్లేమ్, ·Book 40, Number 6809.
అబూ హురైరా చెప్పాడు. దేవుని యొక్క దూత చెప్పాడు “గొప్పవాడైన
అల్లాహ్ ఆదమ్ను తన సొంత రూపంలో సృష్టించాడు. అబూ హురైరా
చెప్పిన ఇంకొక అబద్దము మరియు కల్పితము మరియు మోస్లేమ్ తన
గ్రంథములో స్వీకరించినది.
5) ఆదమ్ 60 బాహువుల ఎత్తు మరియు 7 బహువుల వెడల్పు
ముస్నాద్ అహ్మద్ :
అబూ హురైరా ఇలా చెప్పాడు, ప్రవక్త చెప్పాడు “దేవుడు ఆదమ్ను 60
బాహువుల ఎత్తు మరియు 7 బహువుల వెడల్పుతో తయారు చేశాడు”

Page 75
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
73
74
సేకరించిన హదీసులని తన (బుఖారి) గ్రంథములో వ్రాశాడు. వారిని
మోస్లేమ్ తన గ్రంథము ‘సాహీహ్ మోస్లేమ్' కొరకు ఆ 434 మందిని
నమ్మదగిన వారు కాదు అని నిరాకరించాడు. ఇంకో ప్రక్క మోస్లేమ్ తన
గ్రంథములో బుఖారి నిరాకరించిన హదీసులు చెప్పిన 625 మందిని తన
గ్రంథములో స్వీకరించాడు.
హదీసుల ద్వారా ఇస్లామ్ యొక్క కలుషితం, ప్రవక్త జీవించి యున్న
కాలములో మరియు అతను మరణించిన తర్వాత మొదలైంది. ఈ హదీసు
సేకరణలు దేవుని చేత ఖండించబడినాయి. ఇంకా ప్రవక్త మరియు సహాబా
(ప్రవక్త యొక్క సన్నిహితులు) చేత కూడా ఖండించబడ్డాయి. హిజ్రా రెండవ
శతాబ్దం చివరికి వచ్చేసరికి ప్రఖ్యాత ఆరు గ్రంథాలూ రచించే సమయానికి
ఈ పని అత్యంత తీవ్రస్థితికి చేరుకుంది. ఖుర్ఆన్ చెప్పుతుంది తీర్పు
దినమున ప్రవక్త దేవునికి ముస్లీమ్స్ ఖుర్ఆన్ గ్రంథము విడిచిపెట్టుట గురించి
ఫిర్యాదు చేస్తాడు అని.
ఇతర సాహీహ్, అబద్దాలు మరియు కల్పితాలు :
ఈ ఈ భాగంలో కొన్ని దారుణమైన అబద్దాలు మరియు కల్పితాలు
చెప్పబడ్డాయి. వేటిని హదీసు పండితులు ధృవీకరించబడినవి (సాహీహ్)
అని చెప్పారో, ఈ హదీసులు హదీసు సేకరణలలో నిర్ధారించబడినవి,
వాటిని చెప్పినవారు (ఇస్నాద్) నమ్మదగిన వారు అని భావించే వరకు ఆ
హదీసులు ధృవీకరించబడుతాయి. ఇది హదీసులలో ఏమి విషయం
ఉన్నది అన్నదానికి సంబంధం లేకుండ. అవి ఖుర్ఆన్కి విరోధముగా
ఉన్న లేక అందులో సాధారణ విచక్షణ లేకపోయినా అది పెద్ద విషయం
కాదు. క్రింద చెప్పబడినవి ఈ సాహీహ్ అబద్దాలు యొక్క ఉదాహరణలు
(శాంపిల్) మాత్రమే :
1)
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
నిలబడి త్రాగవద్దు.
సాహీహ్ మోస్లేమ్, బుక్ 23, నెంబర్ 5017
“అబూ హురైరా ఇలా చెప్పాడు. దేవుని దూత చెప్పాడు 'నిలబడి
యున్నప్పుడు త్రాగవద్దు, ఎవరైనా మర్చిపోయి అలా చేసుంటే, వారు
త్రాగినది అంతా వాంతికి చేసుకోవాలి”
2)
నిలబడివున్న స్థితిలో ఉచ్చ పోయండి.
సాహీహ్ బుఖారి Vol. 3, Book 43, Number 651.
3)
"దేవుని యొక్క వార్తకుడు నిలబడి ఉన్నప్పుడు ఉచ్చపోశాడు.”
నిలబడి ఉన్నప్పుడు ఉచ్చపోయకండి.
సునన్ ఇబ్న్ మజాహ్, Vol. 1, Book 1, Number 308
“నిలబడి ఉచ్చ పోయకండి”
4) దేవుని రూపంలో మనిషి.
సహీహ్ మోస్లేమ్, ·Book 40, Number 6809.
అబూ హురైరా చెప్పాడు. దేవుని యొక్క దూత చెప్పాడు “గొప్పవాడైన
అల్లాహ్ ఆదమ్ను తన సొంత రూపంలో సృష్టించాడు. అబూ హురైరా
చెప్పిన ఇంకొక అబద్దము మరియు కల్పితము మరియు మోస్లేమ్ తన
గ్రంథములో స్వీకరించినది.
5) ఆదమ్ 60 బాహువుల ఎత్తు మరియు 7 బహువుల వెడల్పు
ముస్నాద్ అహ్మద్ :
అబూ హురైరా ఇలా చెప్పాడు, ప్రవక్త చెప్పాడు “దేవుడు ఆదమ్ను 60
బాహువుల ఎత్తు మరియు 7 బహువుల వెడల్పుతో తయారు చేశాడు”

Page 76
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
75
76
మరియు సాహీహ్ మోస్లేమ్లో Book 40, Number 6795 ఆదమ్ 60 గజాల
ఎత్తు! అని చెప్పబడింది.
6) స్త్రీలు, కుక్కలు మరియు గాడిద
సాహీహ్ మోస్లేమ్, Book 4, Number 1032.
“దూత చెప్పాడు ఒక గాడిదకానీ, స్త్రీకానీ, నల్లకుక్కకానీ ప్రార్థన
చేసేవాడి ముందు నుంచి వెళ్ళింది అంటే ఆ ప్రార్థన పనికి రాదు.”
ఇది స్త్రీలకు ఎంతటి ఘోర అవమానం? నిజంగా ఈ మాటలు
దేవుని ప్రవక్త నుండి వచ్చియుంటాయా?
7) స్త్రీలలో చెడు శకునం :
సాహీహ్ బుఖారి Vol.7, Book 62, Number 30.
“స్త్రీలలో, గుర్రంలో, ఇంటిలో చెడు శకునం (ఒమెన్) ఉంది”.
స్త్రీలకు వ్యతిరేఖంగా మరొక పక్షపాత విషయం హదీసులని వ్రాసిన
వారి యొక్క పద్ధతి. ఖుర్ఆన్ నుండి వచ్చిన నిజమైన ఇస్లామ్ స్త్రీలకు
సంపూర్ణ గౌరవాన్ని ఇస్తుంది మరియు అలాంటి వర్ణనలని ఎప్పుడూ
ఉపయోగించదు.
8) బేధము మరియు బేధము లేకుండుట దూతలలో, విరుద్ధము :
సాహీహ్ బుఖారి Vol.4, Book 55, Number 608.
:
ఇబ్న్ అబ్బాస్ ఇలా చెప్పాడు, ప్రవక్త చెప్పాడు “ఎవరు కానీ నేను యూనుస్
(జోనా) ఇబ్న్ మత్తకంటే మేలు అని అనకూడదు”.
పై హదీసు చెప్పబడియున్నా కూడా, మనము హదీసు గ్రంథములలో
ముహమ్మద్ ప్రవక్త, ఇతర ప్రవక్తలకంటే ఇతర మనుషులకంటే గొప్పవాడు
అని చెప్పిన ఎన్నో కథలను చూడవచ్చు. ఈ హదీసులు పైన చెప్పిన
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
హదీసుకి విరుద్దము మరియు ఖుర్ఆన్ బోధలకు విరుద్ధము. విశ్వాసులకు
అందరు కోసం ఖుర్ఆన్ స్పష్టమైన ఆదేశం కలిగివుంది. ఏమిటంటే
ప్రవక్తలలో తేడాలు కల్పించుకోకండి (2-285) “తన ప్రభువు తరపున
అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు
కూడా (సత్యమని నమ్మారు) వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను,
ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. మేము ఆయన
(పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణము, భేదభావాన్నీ పాటించము”
(అని వారు చెబుతారు.) "మేము విన్నాము. విధేయులం అయ్యాము.
మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి
రావలసింది నీ వద్దకే” అని అంటారు. హదీసు గ్రంథాలను
అనుసరిస్తున్నాము అని చెప్పేవారు ప్రవక్తలలో తేడాలు కల్పించుకోకండి
అని మళ్లీ మళ్లీ చెప్పిన హదీసులను గురించి పట్టించుకోలేదు.
(అన్ని కులముల వారు నేను చెప్పిన మూడు మతముల
సారాంశమును చదివి మనస్సు మార్పు చెందిన వారుగా తయారైనారు.
ఆ విషయమునకు ఉదాహరణగా ఒక ముస్లీమ్, ఒక క్రైస్తవుడు వ్రాసిన
ఉత్తరములను చదవండి.)
ఉత్తరములు
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి
పాద పద్మములకు నా సాష్టాంగ వందనములు.
నా పేరు సాకా ధనుంజయ, S/O అచ్చప్ప, వయస్సు 48 సం||లు,
కులము పద్మశాలి, నివాసము బెంగుళూరు, యలహంక అగ్రహార లేఅవుట్.

Page 77
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
75
76
మరియు సాహీహ్ మోస్లేమ్లో Book 40, Number 6795 ఆదమ్ 60 గజాల
ఎత్తు! అని చెప్పబడింది.
6) స్త్రీలు, కుక్కలు మరియు గాడిద
సాహీహ్ మోస్లేమ్, Book 4, Number 1032.
“దూత చెప్పాడు ఒక గాడిదకానీ, స్త్రీకానీ, నల్లకుక్కకానీ ప్రార్థన
చేసేవాడి ముందు నుంచి వెళ్ళింది అంటే ఆ ప్రార్థన పనికి రాదు.”
ఇది స్త్రీలకు ఎంతటి ఘోర అవమానం? నిజంగా ఈ మాటలు
దేవుని ప్రవక్త నుండి వచ్చియుంటాయా?
7) స్త్రీలలో చెడు శకునం :
సాహీహ్ బుఖారి Vol.7, Book 62, Number 30.
“స్త్రీలలో, గుర్రంలో, ఇంటిలో చెడు శకునం (ఒమెన్) ఉంది”.
స్త్రీలకు వ్యతిరేఖంగా మరొక పక్షపాత విషయం హదీసులని వ్రాసిన
వారి యొక్క పద్ధతి. ఖుర్ఆన్ నుండి వచ్చిన నిజమైన ఇస్లామ్ స్త్రీలకు
సంపూర్ణ గౌరవాన్ని ఇస్తుంది మరియు అలాంటి వర్ణనలని ఎప్పుడూ
ఉపయోగించదు.
8) బేధము మరియు బేధము లేకుండుట దూతలలో, విరుద్ధము :
సాహీహ్ బుఖారి Vol.4, Book 55, Number 608.
:
ఇబ్న్ అబ్బాస్ ఇలా చెప్పాడు, ప్రవక్త చెప్పాడు “ఎవరు కానీ నేను యూనుస్
(జోనా) ఇబ్న్ మత్తకంటే మేలు అని అనకూడదు”.
పై హదీసు చెప్పబడియున్నా కూడా, మనము హదీసు గ్రంథములలో
ముహమ్మద్ ప్రవక్త, ఇతర ప్రవక్తలకంటే ఇతర మనుషులకంటే గొప్పవాడు
అని చెప్పిన ఎన్నో కథలను చూడవచ్చు. ఈ హదీసులు పైన చెప్పిన
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
హదీసుకి విరుద్దము మరియు ఖుర్ఆన్ బోధలకు విరుద్ధము. విశ్వాసులకు
అందరు కోసం ఖుర్ఆన్ స్పష్టమైన ఆదేశం కలిగివుంది. ఏమిటంటే
ప్రవక్తలలో తేడాలు కల్పించుకోకండి (2-285) “తన ప్రభువు తరపున
అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు
కూడా (సత్యమని నమ్మారు) వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను,
ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. మేము ఆయన
(పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణము, భేదభావాన్నీ పాటించము”
(అని వారు చెబుతారు.) "మేము విన్నాము. విధేయులం అయ్యాము.
మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి
రావలసింది నీ వద్దకే” అని అంటారు. హదీసు గ్రంథాలను
అనుసరిస్తున్నాము అని చెప్పేవారు ప్రవక్తలలో తేడాలు కల్పించుకోకండి
అని మళ్లీ మళ్లీ చెప్పిన హదీసులను గురించి పట్టించుకోలేదు.
(అన్ని కులముల వారు నేను చెప్పిన మూడు మతముల
సారాంశమును చదివి మనస్సు మార్పు చెందిన వారుగా తయారైనారు.
ఆ విషయమునకు ఉదాహరణగా ఒక ముస్లీమ్, ఒక క్రైస్తవుడు వ్రాసిన
ఉత్తరములను చదవండి.)
ఉత్తరములు
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి
పాద పద్మములకు నా సాష్టాంగ వందనములు.
నా పేరు సాకా ధనుంజయ, S/O అచ్చప్ప, వయస్సు 48 సం||లు,
కులము పద్మశాలి, నివాసము బెంగుళూరు, యలహంక అగ్రహార లేఅవుట్.

Page 78
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
77
నేను ప్రస్తుతము బెంగుళూరు సెంట్రల్ జైల్నందు గత నాలుగు
సంవత్సరముల నుండి జైల్ నందు సజా ఖైదిగా ఉన్నాను. నాకు జీవిత
ఖైదీగా కోర్టు శిక్ష విధించింది. నా సజా ఖైది నెంబర్. 9203 (Convict
Prison) రూమ్ నెంబర్ C-7 (Block No-7) నందు ఉంటున్నాను.
నేను బాల్యము నుండి రాముడు మరియు ఆంజనేయ భక్తునిగా
ఉంటూ, నా జీవితములో వచ్చే సమస్యలకు, బాధలకు అనుగుణముగా
వేరే ఇతరత్రా దేవతలను కూడా పూజించేవాడిని. కానీ ఎంతమంది
దేవతలను పూజించినా నా సమస్యలు, బాధలు పోలేదు. నేను బాల్యము
నుండి దైవభక్తితో జ్ఞానము తెలుసుకోవాలని చాలా శ్రద్ధతో కొన్ని ఆశ్రమాలకు
కూడా వెళ్ళి, జ్ఞానబోధలు వినుచుండేవాడిని. అందులో భాగముగా కైవారం
తాతయ్య మఠములో (పోతులూరి వీరబ్రహ్మయ్య గారి అనుబంధ మఠం)
వెళ్ళి తత్త్వ జ్ఞానబోధలను శ్రద్ధగా వింటుండేవాడిని. కానీ నా బాధలు
ఇంకా పెరుగుతూనే ఉండేవి.
నేను జ్ఞానము అని, భక్తి అని తిరుగుతూ ఉంటే మా కుటుంబము
వారంతా వ్యతిరేఖించుతూ ఉండేవారు. అయినా నేను అలాగే చేస్తూ
ఉండడము వలన, నా కుటుంబమువారు, బంధువులు అందరూ
దూరమయ్యారు. నేను పెళ్ళి కూడా చేసుకోలేదు. నాకు జీవితముపై
నిరాశ కలుగుతుండేది, బాధలు భరిస్తూ, జ్ఞానము తెలుసుకోవాలనే శ్రధ్ధతో
చాలాచోట్లకు వెళ్ళి, గురువుల వద్దకు, పండితుల వద్దకు, బాబాల వద్దకు
కూడా వెళ్ళి చాలా బోధలు వింటుండే వాడిని. నాకు జ్ఞాన సంబంధ ఎన్నో
ప్రశ్నలు వస్తుండేవి, వారిని అడిగితే వారు చెప్పే సమాధానములో నాకు
తృప్తిగా సమాధానము దొరికేది కాదు.
78
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఈ విధంగా నేను జీవితము గడుపుచుండగా, నేను పని చేసే
చింతామణి టౌన్ లో ఉన్న కొనకపల్లి గ్రామంలో హ్యాండ్లూమ్ మగ్గం
పరిశ్రమలో మా పరిశ్రమ యజమానికి, అతని భార్యకు మధ్య గొడవ
వచ్చి ఆమె నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొనగా, ఆ నేరం నాపై
మోపబడి నాకు జీవిత ఖైదీగా శిక్ష పడింది. జైలు జీవితము గడుపుతూ
చదువు పెద్దగా రాని కారణముగా ఇంకా చదువుకోవాలనే కోరిక కల్గి
కన్నడ, తెలుగు భాషలు నేర్చుకొని వార్తా పత్రికలు, ఇతర దైవ గ్రంథాలు
చదువుతూ, చదువును కొనసాగిస్తూ, కేసు ట్రైల్ నడుపుకుంటూ, భగవద్గీతను
చదువుకుంటున్నాను.
జైలుకు వచ్చిన ఒక సం॥ కాలమునకు ఒకరోజు మా జైల్లో మా
రూమ్కు క్రైస్తవ బోధకులు వచ్చి బైబిల్ గురించి, ఏసు గురించి బోధించారు.
నేను బోధ తర్వాత ఫాదర్ని కలవాలని అనిపించింది. ఎందుకంటే వారి
బోధలో మీ పాపాలు పోతాయి, బాధలు, కష్టాలు పోయి కేసులో నుండి
కూడా పోతారు అని చెప్పినారు. అది విన్న నేను ఫాదర్ గారికి నా బాధలు
చెప్పుకున్నాను. అప్పుడు ఫాదర్గారు ఏసుప్రభువును నమ్ముకొని, బైబిల్
చదువుకుంటూ, రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండమని ఒక బైబిల్ ఇచ్చి
దీవించారు. అప్పటి నుండి ఏసుభక్తునిగా మారిపోయి, హిందూ గ్రంథాలను,
దేవతలను వదిలివేసినాను. నేను పూర్తి విశ్వాసిగా మారి, ఏసుభక్తునిగా
ఉంటూ, బైబిల్ చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, చర్చికి వెళ్ళి క్రైస్తవ బోధలు
వింటూ, ఇతరులకు కూడా బోధలు చెప్పుతూ నా జీవితం గడుపుతున్నాను.
అయిన నా బాధలు, సమస్యలు అలాగే ఉన్నాయి. కేసు కూడా పరిష్కారము
కావటం లేదు. ఈ విషయము గురించి ఫాదర్ను అడుగగా, ఎన్నో సం||ల
నుండి ఉన్న వారికే సమస్యలు పోలేదు. నీకు అప్పుడే పోతాయా? ఇంకా

Page 79
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
77
నేను ప్రస్తుతము బెంగుళూరు సెంట్రల్ జైల్నందు గత నాలుగు
సంవత్సరముల నుండి జైల్ నందు సజా ఖైదిగా ఉన్నాను. నాకు జీవిత
ఖైదీగా కోర్టు శిక్ష విధించింది. నా సజా ఖైది నెంబర్. 9203 (Convict
Prison) రూమ్ నెంబర్ C-7 (Block No-7) నందు ఉంటున్నాను.
నేను బాల్యము నుండి రాముడు మరియు ఆంజనేయ భక్తునిగా
ఉంటూ, నా జీవితములో వచ్చే సమస్యలకు, బాధలకు అనుగుణముగా
వేరే ఇతరత్రా దేవతలను కూడా పూజించేవాడిని. కానీ ఎంతమంది
దేవతలను పూజించినా నా సమస్యలు, బాధలు పోలేదు. నేను బాల్యము
నుండి దైవభక్తితో జ్ఞానము తెలుసుకోవాలని చాలా శ్రద్ధతో కొన్ని ఆశ్రమాలకు
కూడా వెళ్ళి, జ్ఞానబోధలు వినుచుండేవాడిని. అందులో భాగముగా కైవారం
తాతయ్య మఠములో (పోతులూరి వీరబ్రహ్మయ్య గారి అనుబంధ మఠం)
వెళ్ళి తత్త్వ జ్ఞానబోధలను శ్రద్ధగా వింటుండేవాడిని. కానీ నా బాధలు
ఇంకా పెరుగుతూనే ఉండేవి.
నేను జ్ఞానము అని, భక్తి అని తిరుగుతూ ఉంటే మా కుటుంబము
వారంతా వ్యతిరేఖించుతూ ఉండేవారు. అయినా నేను అలాగే చేస్తూ
ఉండడము వలన, నా కుటుంబమువారు, బంధువులు అందరూ
దూరమయ్యారు. నేను పెళ్ళి కూడా చేసుకోలేదు. నాకు జీవితముపై
నిరాశ కలుగుతుండేది, బాధలు భరిస్తూ, జ్ఞానము తెలుసుకోవాలనే శ్రధ్ధతో
చాలాచోట్లకు వెళ్ళి, గురువుల వద్దకు, పండితుల వద్దకు, బాబాల వద్దకు
కూడా వెళ్ళి చాలా బోధలు వింటుండే వాడిని. నాకు జ్ఞాన సంబంధ ఎన్నో
ప్రశ్నలు వస్తుండేవి, వారిని అడిగితే వారు చెప్పే సమాధానములో నాకు
తృప్తిగా సమాధానము దొరికేది కాదు.
78
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఈ విధంగా నేను జీవితము గడుపుచుండగా, నేను పని చేసే
చింతామణి టౌన్ లో ఉన్న కొనకపల్లి గ్రామంలో హ్యాండ్లూమ్ మగ్గం
పరిశ్రమలో మా పరిశ్రమ యజమానికి, అతని భార్యకు మధ్య గొడవ
వచ్చి ఆమె నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొనగా, ఆ నేరం నాపై
మోపబడి నాకు జీవిత ఖైదీగా శిక్ష పడింది. జైలు జీవితము గడుపుతూ
చదువు పెద్దగా రాని కారణముగా ఇంకా చదువుకోవాలనే కోరిక కల్గి
కన్నడ, తెలుగు భాషలు నేర్చుకొని వార్తా పత్రికలు, ఇతర దైవ గ్రంథాలు
చదువుతూ, చదువును కొనసాగిస్తూ, కేసు ట్రైల్ నడుపుకుంటూ, భగవద్గీతను
చదువుకుంటున్నాను.
జైలుకు వచ్చిన ఒక సం॥ కాలమునకు ఒకరోజు మా జైల్లో మా
రూమ్కు క్రైస్తవ బోధకులు వచ్చి బైబిల్ గురించి, ఏసు గురించి బోధించారు.
నేను బోధ తర్వాత ఫాదర్ని కలవాలని అనిపించింది. ఎందుకంటే వారి
బోధలో మీ పాపాలు పోతాయి, బాధలు, కష్టాలు పోయి కేసులో నుండి
కూడా పోతారు అని చెప్పినారు. అది విన్న నేను ఫాదర్ గారికి నా బాధలు
చెప్పుకున్నాను. అప్పుడు ఫాదర్గారు ఏసుప్రభువును నమ్ముకొని, బైబిల్
చదువుకుంటూ, రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండమని ఒక బైబిల్ ఇచ్చి
దీవించారు. అప్పటి నుండి ఏసుభక్తునిగా మారిపోయి, హిందూ గ్రంథాలను,
దేవతలను వదిలివేసినాను. నేను పూర్తి విశ్వాసిగా మారి, ఏసుభక్తునిగా
ఉంటూ, బైబిల్ చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, చర్చికి వెళ్ళి క్రైస్తవ బోధలు
వింటూ, ఇతరులకు కూడా బోధలు చెప్పుతూ నా జీవితం గడుపుతున్నాను.
అయిన నా బాధలు, సమస్యలు అలాగే ఉన్నాయి. కేసు కూడా పరిష్కారము
కావటం లేదు. ఈ విషయము గురించి ఫాదర్ను అడుగగా, ఎన్నో సం||ల
నుండి ఉన్న వారికే సమస్యలు పోలేదు. నీకు అప్పుడే పోతాయా? ఇంకా

Page 80
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
79
కొన్నాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ వుండమని చెప్పగా నేను అలాగే
చేస్తూ ఉండేవాడిని. నా కేసు ట్రైల్ అయిపోయి నేను క్రైస్తవునిగా మారిన
ఒకటిన్నర సం॥నకు కేసు జడ్జిమెంట్ జరిగి, నాకు జీవిత ఖైదు శిక్ష
పడింది. ఈ విషయము గురించి ఫాదర్ని అడుగగా వారు ఫలానా వారు
ఏసుని విశ్వసించినందువలన తరువాత బెయిల్ దొరికింది అని, ఒక అతను
కేసు కొట్టివేయబడిందని వారిని గురించి చెప్పారు. నేను అలాగే బైబిల్
చదువుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, జ్ఞాన బోధలు వింటూ కొన్ని
అర్థము కాని వాక్యములను అడిగితే ఎందుకో వారి సమాధానం తృప్తిగా
అనిపించక పోయేది. ఈ విధముగా నా జీవితము సాగుతుండగా!
ఒక రోజు సుమారు 7 లేదా 8 నెలల క్రితం మా రూమ్ ప్రక్కన
ఉన్న రూమ్ లో ఉన్న దిలీప్ అనే వ్యక్తితో ఒక వ్యక్తి దైవజ్ఞానము గురించి
తెలుగులో బోధిస్తుండగా, నేను విని ప్రక్కనే పోయి నిలబడి వింటూ, ఈయన
ఎవరు గడ్డము పెట్టుకొని ముస్లీమ్ అనిపిస్తూ తెలుగులో దైవజ్ఞానము
చెప్పుతున్నాడని కొంత శ్రద్ధ పెట్టి విన్నాను. ఆయన మాటలలో నమ్మకము
సత్యము చెప్పినట్లుగా అనిపించి, కూర్చోని బోధ అయిపోయో వరకు శ్రద్ధగా
విన్నాను. ఆయన చెప్పిన బోధ ఇంతవరకు ఎక్కడా వినలేదనిపించింది.
బోధ అయిపోయిన తరువాత ఆయనతో పరిచయము చేసుకోగా, ఆయన
పేరు అమీర్ అలి అని చెప్పారు. ఆ తరువాత ఆయన నాతో మీకు దేవుని
మీద భక్తి, జ్ఞానం మీద శ్రద్ధ ఉంటే, దీలీప్ దగ్గర జ్ఞానగ్రంథములు
ఉన్నాయి. అందులో మీకు నచ్చింది ఒకటి తీసుకొని చదవమని చెప్పారు.
అయినా నాకు గ్రంథము చదవడము ఇష్టముగా అనిపించలేదు. ఎందుకంటే
బైబిల్ చదువుతూ ఉండేవాడిని, వేరే గ్రంథాలు చదవవద్దని మా ఫాదర్
కూడా చెప్పినారు. కానీ అమీర్ అలి చెప్పిన బోధ నాకు అదే రోజు పదే
80
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
పదే గుర్తుకు వస్తావుంది. ఆయన చెప్పిన బోధ సత్యము అనిపించింది.
నా మనసులో అదే రోజు సాయంత్రం ఆయన చెప్పిన గ్రంథము
చదవాలనిపించి, దీలీప్ దగ్గరకు వెళ్ళి ఆ గ్రంథాలు చూసి అందులో
“దేవాలయ రహస్యాలు” అనే గ్రంథమును తీసుకొని వచ్చి చదివినాను.
దేవాలయములో ఉన్న రహస్యాలు గ్రంథము ద్వారా తెలిసి అద్భుతం
అనిపించింది. అప్పుడు దేహమే దేవాలయమని, దేవుడు దేహములోనే
ఉన్నాడని తెలిసి నా హృదయములో ఎంతో ఆనందము, తృప్తి కల్గినాయి.
నా మనసులో మిగతా గ్రంథాలు కూడా చదవాలనే ప్రేరణ పెరిగింది.
తరువాత అమీర్ అలితో రెండవసారి కలిసినపుడు జ్ఞానపరముగా చర్చించిన
తరువాత నాలో ఉన్న కొన్ని ప్రశ్నలకు ఆయన ద్వారా తెలిసిన
సమాధానములో సత్యమున్నదనే నమ్మకము, విశ్వాసం కలిగినది. అప్పుడు
ఆయన నాతో స్వామివారి గ్రంథాలు మిగతావి కూడా చదవండి,
ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని జ్ఞానరహస్యాలు స్వామి వారి
గ్రంథముల ద్వారా తెలుస్తాయి అని చెప్పి మళ్ళీ కలుద్దాము, అప్పటివరకు
గ్రంథాలు చదువుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు నేను
చదివిన గ్రంథాలు 1. దేవాలయ రహస్యాలు 2. ప్రబోధ 3. సుబోధ
4. శిలువా దేవుడా? 5. ఏసు చనిపోయాడా చంపబడ్డాడా? 6. తల్లి
తండ్రి 7. సమాధి 8. త్రైతాకార రహస్యం 9. శ్రీకృష్ణుడు దేవుడా
భగవంతుడా? 10. దయ్యాల భూతాల యధార్థ సంఘటనలు 11. జనన
మరణ సిద్ధాంతము 12. వార్తకుడు వర్తకుడు 13. ప్రతిమ × విగ్రహ
14. సత్యాన్వేషి కథ 15. యజ్ఞములు 16. మన పండుగలు 17. ఇందూ
సాంప్రదాయాలు 18. భగవద్గీత 19. దేవుని గుర్తు 963, మాయ గుర్తు
666 20. ప్రసిద్ది బోధ 21. నాస్తికులు. ఆస్తికులు 22. కర్మపత్రం

Page 81
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
79
కొన్నాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ వుండమని చెప్పగా నేను అలాగే
చేస్తూ ఉండేవాడిని. నా కేసు ట్రైల్ అయిపోయి నేను క్రైస్తవునిగా మారిన
ఒకటిన్నర సం॥నకు కేసు జడ్జిమెంట్ జరిగి, నాకు జీవిత ఖైదు శిక్ష
పడింది. ఈ విషయము గురించి ఫాదర్ని అడుగగా వారు ఫలానా వారు
ఏసుని విశ్వసించినందువలన తరువాత బెయిల్ దొరికింది అని, ఒక అతను
కేసు కొట్టివేయబడిందని వారిని గురించి చెప్పారు. నేను అలాగే బైబిల్
చదువుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, జ్ఞాన బోధలు వింటూ కొన్ని
అర్థము కాని వాక్యములను అడిగితే ఎందుకో వారి సమాధానం తృప్తిగా
అనిపించక పోయేది. ఈ విధముగా నా జీవితము సాగుతుండగా!
ఒక రోజు సుమారు 7 లేదా 8 నెలల క్రితం మా రూమ్ ప్రక్కన
ఉన్న రూమ్ లో ఉన్న దిలీప్ అనే వ్యక్తితో ఒక వ్యక్తి దైవజ్ఞానము గురించి
తెలుగులో బోధిస్తుండగా, నేను విని ప్రక్కనే పోయి నిలబడి వింటూ, ఈయన
ఎవరు గడ్డము పెట్టుకొని ముస్లీమ్ అనిపిస్తూ తెలుగులో దైవజ్ఞానము
చెప్పుతున్నాడని కొంత శ్రద్ధ పెట్టి విన్నాను. ఆయన మాటలలో నమ్మకము
సత్యము చెప్పినట్లుగా అనిపించి, కూర్చోని బోధ అయిపోయో వరకు శ్రద్ధగా
విన్నాను. ఆయన చెప్పిన బోధ ఇంతవరకు ఎక్కడా వినలేదనిపించింది.
బోధ అయిపోయిన తరువాత ఆయనతో పరిచయము చేసుకోగా, ఆయన
పేరు అమీర్ అలి అని చెప్పారు. ఆ తరువాత ఆయన నాతో మీకు దేవుని
మీద భక్తి, జ్ఞానం మీద శ్రద్ధ ఉంటే, దీలీప్ దగ్గర జ్ఞానగ్రంథములు
ఉన్నాయి. అందులో మీకు నచ్చింది ఒకటి తీసుకొని చదవమని చెప్పారు.
అయినా నాకు గ్రంథము చదవడము ఇష్టముగా అనిపించలేదు. ఎందుకంటే
బైబిల్ చదువుతూ ఉండేవాడిని, వేరే గ్రంథాలు చదవవద్దని మా ఫాదర్
కూడా చెప్పినారు. కానీ అమీర్ అలి చెప్పిన బోధ నాకు అదే రోజు పదే
80
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
పదే గుర్తుకు వస్తావుంది. ఆయన చెప్పిన బోధ సత్యము అనిపించింది.
నా మనసులో అదే రోజు సాయంత్రం ఆయన చెప్పిన గ్రంథము
చదవాలనిపించి, దీలీప్ దగ్గరకు వెళ్ళి ఆ గ్రంథాలు చూసి అందులో
“దేవాలయ రహస్యాలు” అనే గ్రంథమును తీసుకొని వచ్చి చదివినాను.
దేవాలయములో ఉన్న రహస్యాలు గ్రంథము ద్వారా తెలిసి అద్భుతం
అనిపించింది. అప్పుడు దేహమే దేవాలయమని, దేవుడు దేహములోనే
ఉన్నాడని తెలిసి నా హృదయములో ఎంతో ఆనందము, తృప్తి కల్గినాయి.
నా మనసులో మిగతా గ్రంథాలు కూడా చదవాలనే ప్రేరణ పెరిగింది.
తరువాత అమీర్ అలితో రెండవసారి కలిసినపుడు జ్ఞానపరముగా చర్చించిన
తరువాత నాలో ఉన్న కొన్ని ప్రశ్నలకు ఆయన ద్వారా తెలిసిన
సమాధానములో సత్యమున్నదనే నమ్మకము, విశ్వాసం కలిగినది. అప్పుడు
ఆయన నాతో స్వామివారి గ్రంథాలు మిగతావి కూడా చదవండి,
ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియని జ్ఞానరహస్యాలు స్వామి వారి
గ్రంథముల ద్వారా తెలుస్తాయి అని చెప్పి మళ్ళీ కలుద్దాము, అప్పటివరకు
గ్రంథాలు చదువుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు నేను
చదివిన గ్రంథాలు 1. దేవాలయ రహస్యాలు 2. ప్రబోధ 3. సుబోధ
4. శిలువా దేవుడా? 5. ఏసు చనిపోయాడా చంపబడ్డాడా? 6. తల్లి
తండ్రి 7. సమాధి 8. త్రైతాకార రహస్యం 9. శ్రీకృష్ణుడు దేవుడా
భగవంతుడా? 10. దయ్యాల భూతాల యధార్థ సంఘటనలు 11. జనన
మరణ సిద్ధాంతము 12. వార్తకుడు వర్తకుడు 13. ప్రతిమ × విగ్రహ
14. సత్యాన్వేషి కథ 15. యజ్ఞములు 16. మన పండుగలు 17. ఇందూ
సాంప్రదాయాలు 18. భగవద్గీత 19. దేవుని గుర్తు 963, మాయ గుర్తు
666 20. ప్రసిద్ది బోధ 21. నాస్తికులు. ఆస్తికులు 22. కర్మపత్రం

Page 82
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
81
82
23. దేవుని చిహ్నం 24. దేవుని ముద్ర 25. మతాతీత దేవుని మార్గం
26. నిగూఢ తత్త్వార్థ బోధిని 27. చెట్టుముందా, విత్తు ముందా? 28.
ఒక్కడే ఇద్దరు 29. కృష్ణ మూస 30. ద్వితీయ దైవగ్రంథములో రత్న
వాక్యములు 31. హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా? 32. ఆధ్యాత్మిక
ప్రశ్నలు జవాబులు. 33. భగవాన్ రావణ బ్రహ్మ.
ఈ గ్రంథాలు అన్నీ అమీర్ అలి ద్వారా తీసుకొని చదవినాను.
ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తుల గురించిన గ్రంథాలు ఇచ్చినారు.
చదువుతున్నాను. ఇంకా గ్రంథాలు చదవాలనే కాంక్ష పెరుగుతూ ఉంది.
ఈ గ్రంథాల ద్వారా తెలిసిన నిజమైన జ్ఞానము ఏమనగా జీవాత్మ, ఆత్మ,
పరమాత్మ అని మూడు ఆత్మల జ్ఞానం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు
అని తెలిసింది. దేవునికి, భగవంతునికి తేడా తెలిసినది. ఆత్మ పని తెలిసినది.
పరమాత్మ అంశయే భగవంతునిగా కృష్ణునిగా వచ్చినాడు అని తెలిసింది.
ధర్మములు, అధర్మములు తెలిసినాయి. నిరాకారము, సాకారము గురించి
తెలిసింది. ముఖ్యముగా శరీరం 24 భాగాలు ప్రకృతి అని అందులో
మూడు ఆత్మలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు ఉన్నాయని నేను జీవాత్మ
కర్మలు అనుభవించేవాడినని, ఆత్మ అనుభవింపజేసేదని, పరమాత్మ సాక్షి
భూతుడని తెలిసింది బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తియోగం కూడా
తెలిసినది.
ద్వితీయ దైవగ్రంథము బైబిల్ ద్వారా రాబోయే ఆదరణకర్త సాక్షాత్తు
యోగీశ్వర్లువారే, పరిశుద్ధాత్మ అని తెలిసినది. భగవద్గీత శ్లోకాల
సారాంశము మొత్తము శరీరములో ఉన్న జ్ఞానం గురించే చెప్పిందని
తెలిసినది. భగవద్గీతలో భాగమే బైబిల్ జ్ఞానము అని తెలిసినది. సాకార
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
రూపంలో భగవంతుడు చెప్పినదే నిజమైన జ్ఞానము అని, అధర్మముల
ఆచరణ ద్వారా కర్మలు అంటుకొని జన్మలు కల్గుతాయని, ధర్మముల ఆచరణ
ద్వారా కర్మలు నాశనము చేసి, మోక్షము ప్రాప్తింపజేస్తాయని తెలిసింది.
దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే, దేవుని మోక్షము ఒక్కటే అనే
నిజము తెలిసినది. మతాలు మానవుల సృష్ఠి అని తెలిసినది. ప్రపంచములో
ఏ మానవుడు ఇంత గొప్ప జ్ఞానము చెప్పలేడని, దైవశక్తి తప్ప మానవ శక్తి
చెప్పిన జ్ఞానము కాదు అని, ఈ జ్ఞానము ద్వారా సాక్షాత్తు పరమాత్మ అంశ
అయిన భగవంతుడే యోగీశ్వరుల వారు అని, “భగవాన్ రావణ బ్రహ్మ”
మరియు "వేదములు మనిషికి అవసరమా?” అన్న గ్రంథములపై ఉన్న
నాలుగు దైవాంశలు 1. భగవాన్ రావణ బ్రహ్మ 2. శ్రీకృష్ణుడు 3. ఏసు
ప్రభువు 4. యోగీశ్వరులు వీరు నలుగురు సాక్షాత్తు పరమాత్మ అంశ
అయిన భగవంతులని తెలిసినది. ప్రపంచ మూఢులను జ్ఞానులజేయ
వచ్చిన భగవంతులని పూర్తిగా విశ్వసిస్తున్నాను. త్రిమత ఏకైక గురువు,
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అని, మీ గ్రంథాలపై ఉన్న విషయం 100%
నిజము. తమరి దైవజ్ఞాన గ్రంథముల ద్వారా మా జీవితం ధన్యమయినది.
మా
మిగిలిన జీవితము కూడా జ్ఞానము తెలుసుకుంటూ, ఆచరిస్తూ ధర్మ ప్రచారం
చేస్తూ గడపాలని నిశ్చయించుకొని సంపూర్ణ జ్ఞానాన్ని ఆచరించే శక్తిని
అనుగ్రహించమని నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ
ఆత్మతో సాకార రూపము అయిన యోగీశ్వరుల వారి పాద పద్మముల
పైన శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. భగవద్గీత శ్లోకాలు 3-9
మరియు 17–66 ప్రకారం సాకార రూపము అయిన మీరు మాకు
పాపవిమోచన చేసి ముక్తిని చెయ్యమని ఈ జన్మలో మీ దర్శన భాగ్యము

Page 83
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
81
82
23. దేవుని చిహ్నం 24. దేవుని ముద్ర 25. మతాతీత దేవుని మార్గం
26. నిగూఢ తత్త్వార్థ బోధిని 27. చెట్టుముందా, విత్తు ముందా? 28.
ఒక్కడే ఇద్దరు 29. కృష్ణ మూస 30. ద్వితీయ దైవగ్రంథములో రత్న
వాక్యములు 31. హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా? 32. ఆధ్యాత్మిక
ప్రశ్నలు జవాబులు. 33. భగవాన్ రావణ బ్రహ్మ.
ఈ గ్రంథాలు అన్నీ అమీర్ అలి ద్వారా తీసుకొని చదవినాను.
ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తుల గురించిన గ్రంథాలు ఇచ్చినారు.
చదువుతున్నాను. ఇంకా గ్రంథాలు చదవాలనే కాంక్ష పెరుగుతూ ఉంది.
ఈ గ్రంథాల ద్వారా తెలిసిన నిజమైన జ్ఞానము ఏమనగా జీవాత్మ, ఆత్మ,
పరమాత్మ అని మూడు ఆత్మల జ్ఞానం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు
అని తెలిసింది. దేవునికి, భగవంతునికి తేడా తెలిసినది. ఆత్మ పని తెలిసినది.
పరమాత్మ అంశయే భగవంతునిగా కృష్ణునిగా వచ్చినాడు అని తెలిసింది.
ధర్మములు, అధర్మములు తెలిసినాయి. నిరాకారము, సాకారము గురించి
తెలిసింది. ముఖ్యముగా శరీరం 24 భాగాలు ప్రకృతి అని అందులో
మూడు ఆత్మలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు ఉన్నాయని నేను జీవాత్మ
కర్మలు అనుభవించేవాడినని, ఆత్మ అనుభవింపజేసేదని, పరమాత్మ సాక్షి
భూతుడని తెలిసింది బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తియోగం కూడా
తెలిసినది.
ద్వితీయ దైవగ్రంథము బైబిల్ ద్వారా రాబోయే ఆదరణకర్త సాక్షాత్తు
యోగీశ్వర్లువారే, పరిశుద్ధాత్మ అని తెలిసినది. భగవద్గీత శ్లోకాల
సారాంశము మొత్తము శరీరములో ఉన్న జ్ఞానం గురించే చెప్పిందని
తెలిసినది. భగవద్గీతలో భాగమే బైబిల్ జ్ఞానము అని తెలిసినది. సాకార
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
రూపంలో భగవంతుడు చెప్పినదే నిజమైన జ్ఞానము అని, అధర్మముల
ఆచరణ ద్వారా కర్మలు అంటుకొని జన్మలు కల్గుతాయని, ధర్మముల ఆచరణ
ద్వారా కర్మలు నాశనము చేసి, మోక్షము ప్రాప్తింపజేస్తాయని తెలిసింది.
దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే, దేవుని మోక్షము ఒక్కటే అనే
నిజము తెలిసినది. మతాలు మానవుల సృష్ఠి అని తెలిసినది. ప్రపంచములో
ఏ మానవుడు ఇంత గొప్ప జ్ఞానము చెప్పలేడని, దైవశక్తి తప్ప మానవ శక్తి
చెప్పిన జ్ఞానము కాదు అని, ఈ జ్ఞానము ద్వారా సాక్షాత్తు పరమాత్మ అంశ
అయిన భగవంతుడే యోగీశ్వరుల వారు అని, “భగవాన్ రావణ బ్రహ్మ”
మరియు "వేదములు మనిషికి అవసరమా?” అన్న గ్రంథములపై ఉన్న
నాలుగు దైవాంశలు 1. భగవాన్ రావణ బ్రహ్మ 2. శ్రీకృష్ణుడు 3. ఏసు
ప్రభువు 4. యోగీశ్వరులు వీరు నలుగురు సాక్షాత్తు పరమాత్మ అంశ
అయిన భగవంతులని తెలిసినది. ప్రపంచ మూఢులను జ్ఞానులజేయ
వచ్చిన భగవంతులని పూర్తిగా విశ్వసిస్తున్నాను. త్రిమత ఏకైక గురువు,
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అని, మీ గ్రంథాలపై ఉన్న విషయం 100%
నిజము. తమరి దైవజ్ఞాన గ్రంథముల ద్వారా మా జీవితం ధన్యమయినది.
మా
మిగిలిన జీవితము కూడా జ్ఞానము తెలుసుకుంటూ, ఆచరిస్తూ ధర్మ ప్రచారం
చేస్తూ గడపాలని నిశ్చయించుకొని సంపూర్ణ జ్ఞానాన్ని ఆచరించే శక్తిని
అనుగ్రహించమని నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ
ఆత్మతో సాకార రూపము అయిన యోగీశ్వరుల వారి పాద పద్మముల
పైన శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. భగవద్గీత శ్లోకాలు 3-9
మరియు 17–66 ప్రకారం సాకార రూపము అయిన మీరు మాకు
పాపవిమోచన చేసి ముక్తిని చెయ్యమని ఈ జన్మలో మీ దర్శన భాగ్యము

Page 84
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
83
కల్గించి, ధన్యున్ని చేయ్యమని మరి ఒక్కసారి సాష్టాంగ వందనం మీ
పాదపద్మములకు చేయుచూ....
మీ సంపూర్ణ విశ్వాసి
ధనుంజయ్
*****
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి
పాద పద్మములకు నా సాష్టాంగ వందనములు.
సాక్ష్యాత్తూ ఖుదాకు (సజ్దా కర్తాహు) సాష్టాంగ వందనములు
సమర్పించుకుంటున్నాను.
నేను అనగా జీవాత్మగా ఉన్న నా శరీరము యొక్క పేరు సయ్యద్
సల్మాన్షా S/o సయ్యద్ ముస్లీషా నా వయస్సు 34 సం||లు. వృత్తి
అక్వేరియం (షోకేసులలో చేపలు పెంచి అమ్మటం) మతము ముస్లీమ్,
చదువు 9వ తరగతి ఇంగ్లీషు మీడియము, నివాసము బెంగుళూరు
(వివేక్నగర్).
ప్రస్తుతము సెంట్రల్ జైల్ బెంగుళూరులో అండర్ ట్రైల్ ఖైదిగా
(UTP) ఉన్నాను. నా ఖైది నెంబర్ : 7579 / 14 రూమ్ నెంబర్ 10లో
జైలు జీవితము అనుభవిస్తూ ఉన్నాను. నా కుటుంబ వివరాలు ఏమనగా
మా కుటుంబము వారు గత ఏడు తరాల నుండి ముస్లీమ్ పండితులుగా
(అనగా హాఫిజె ఖుర్ఆన్, ఆలిమె ఖుర్ఆన్) ఉన్నారని తెలిపినారు. ప్రస్తుతం
నేను తప్ప మా కుటుంబము వారు అందరూ ముస్లీమ్ పాండిత్యము
కల్గినవారే. (తమ గ్రంథముల ద్వారా జ్ఞానము తెలిసిన తర్వాత ఎవరు
పండితులో అనే విషయము తెలిసింది).
84
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
నేను సాధారణ ముస్లీముగా ఉంటూ, నమాజ్ చేసుకుంటూ, రోజా
ఉంటూ జీవితం గడుపుతూ ఉండేవాడిని. నాకు సాధారణముగా సహనము
తక్కువ, కోపం ఎక్కువగా ఉండేది. ఎక్కువ అసహనముతో, ఆవేదనతో
బాగా వత్తిడికి లోనౌతూ ఉండేవాడిని. జ్ఞానమునకు సంబంధించిన
ఆలోచనలు వస్తూ వుండేవి. ఆ క్రమంలో నేను మా ఇంటి నుండి ఎవరికీ
చెప్పకుండా వెళ్ళిపోయాను. హిందూ పుణ్య స్థలాలైనా ద్వారకా (గుజరాత్)
నగరమునకు వెళ్ళినాను. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ (అమృత్సర్),
హరిద్వార్, ఋషికేష్, డిల్లీలో ఉన్న ఆశ్రమాలు, మందిరములు, దర్గాలను
సందర్శించుకుంటూ, హిందువుల జీవిత విధానాలు, ఆచరణలు, పూజా
విధానాలు మరియు ముస్లీముల జీవిత విధానాలను పరిశీలించుకుంటూ,
తెలుసుకుంటూ, 12 సం॥లు మా కుటుంబము వారితో సంబంధము
లేకుండా గడిపి, తిరిగి 2008 సం॥లో ఇంటికి వచ్చాను. ఇంటిలో
ఉంటూ రెండు సం||లు ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ ఉండగా, ఒక ముస్లీమ్
అమ్మాయితో ప్రేమలో పడి, మా కుటుంబమువారితో ఆమెతో పెళ్ళి
గురించిన విషయము చర్చించితే వాళ్ళు తిరస్కరించారు. అమ్మాయి వాళ్ళ
తల్లి తండ్రులు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు నేను అమ్మాయిని హైద్రాబాద్
తీసుకెళ్ళి, అక్కడ పెళ్ళి చేసుకొని, బాగ్ అంబర్పేట్, హైద్రాబాద్లో నాలుగు
నెలలు ఉండి తిరిగి బెంగుళూర్కి వచ్చినాను. నేను మా ఇంటికి వెళ్ళకుండా
కిరాయి ఇంటిలో ఉండేవాడిని. అప్పటి వరకు నేను ముస్లీము గ్రంథాలు
ఏవీ చదవలేదు. 2013 సం॥ వరకు నేను సాధారణ జీవితము గడుపు
చుండగా కుటుంబ కలహాల కారణముగా, మా బాబాయిని హత్య చేయటం
జరిగింది. అది నేను చేశానని ఎవరికీ తెలియదు. మరలా కుటుంబ
తగాదాల కారణముగా 2014 లో 7 సం॥లు గల నా చెల్లెలు కూతురుని
కూడా నా భార్య సహాయముతో హత్య చేయడము జరిగింది. అప్పుడు

Page 85
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
83
కల్గించి, ధన్యున్ని చేయ్యమని మరి ఒక్కసారి సాష్టాంగ వందనం మీ
పాదపద్మములకు చేయుచూ....
మీ సంపూర్ణ విశ్వాసి
ధనుంజయ్
*****
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి
పాద పద్మములకు నా సాష్టాంగ వందనములు.
సాక్ష్యాత్తూ ఖుదాకు (సజ్దా కర్తాహు) సాష్టాంగ వందనములు
సమర్పించుకుంటున్నాను.
నేను అనగా జీవాత్మగా ఉన్న నా శరీరము యొక్క పేరు సయ్యద్
సల్మాన్షా S/o సయ్యద్ ముస్లీషా నా వయస్సు 34 సం||లు. వృత్తి
అక్వేరియం (షోకేసులలో చేపలు పెంచి అమ్మటం) మతము ముస్లీమ్,
చదువు 9వ తరగతి ఇంగ్లీషు మీడియము, నివాసము బెంగుళూరు
(వివేక్నగర్).
ప్రస్తుతము సెంట్రల్ జైల్ బెంగుళూరులో అండర్ ట్రైల్ ఖైదిగా
(UTP) ఉన్నాను. నా ఖైది నెంబర్ : 7579 / 14 రూమ్ నెంబర్ 10లో
జైలు జీవితము అనుభవిస్తూ ఉన్నాను. నా కుటుంబ వివరాలు ఏమనగా
మా కుటుంబము వారు గత ఏడు తరాల నుండి ముస్లీమ్ పండితులుగా
(అనగా హాఫిజె ఖుర్ఆన్, ఆలిమె ఖుర్ఆన్) ఉన్నారని తెలిపినారు. ప్రస్తుతం
నేను తప్ప మా కుటుంబము వారు అందరూ ముస్లీమ్ పాండిత్యము
కల్గినవారే. (తమ గ్రంథముల ద్వారా జ్ఞానము తెలిసిన తర్వాత ఎవరు
పండితులో అనే విషయము తెలిసింది).
84
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
నేను సాధారణ ముస్లీముగా ఉంటూ, నమాజ్ చేసుకుంటూ, రోజా
ఉంటూ జీవితం గడుపుతూ ఉండేవాడిని. నాకు సాధారణముగా సహనము
తక్కువ, కోపం ఎక్కువగా ఉండేది. ఎక్కువ అసహనముతో, ఆవేదనతో
బాగా వత్తిడికి లోనౌతూ ఉండేవాడిని. జ్ఞానమునకు సంబంధించిన
ఆలోచనలు వస్తూ వుండేవి. ఆ క్రమంలో నేను మా ఇంటి నుండి ఎవరికీ
చెప్పకుండా వెళ్ళిపోయాను. హిందూ పుణ్య స్థలాలైనా ద్వారకా (గుజరాత్)
నగరమునకు వెళ్ళినాను. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ (అమృత్సర్),
హరిద్వార్, ఋషికేష్, డిల్లీలో ఉన్న ఆశ్రమాలు, మందిరములు, దర్గాలను
సందర్శించుకుంటూ, హిందువుల జీవిత విధానాలు, ఆచరణలు, పూజా
విధానాలు మరియు ముస్లీముల జీవిత విధానాలను పరిశీలించుకుంటూ,
తెలుసుకుంటూ, 12 సం॥లు మా కుటుంబము వారితో సంబంధము
లేకుండా గడిపి, తిరిగి 2008 సం॥లో ఇంటికి వచ్చాను. ఇంటిలో
ఉంటూ రెండు సం||లు ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ ఉండగా, ఒక ముస్లీమ్
అమ్మాయితో ప్రేమలో పడి, మా కుటుంబమువారితో ఆమెతో పెళ్ళి
గురించిన విషయము చర్చించితే వాళ్ళు తిరస్కరించారు. అమ్మాయి వాళ్ళ
తల్లి తండ్రులు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు నేను అమ్మాయిని హైద్రాబాద్
తీసుకెళ్ళి, అక్కడ పెళ్ళి చేసుకొని, బాగ్ అంబర్పేట్, హైద్రాబాద్లో నాలుగు
నెలలు ఉండి తిరిగి బెంగుళూర్కి వచ్చినాను. నేను మా ఇంటికి వెళ్ళకుండా
కిరాయి ఇంటిలో ఉండేవాడిని. అప్పటి వరకు నేను ముస్లీము గ్రంథాలు
ఏవీ చదవలేదు. 2013 సం॥ వరకు నేను సాధారణ జీవితము గడుపు
చుండగా కుటుంబ కలహాల కారణముగా, మా బాబాయిని హత్య చేయటం
జరిగింది. అది నేను చేశానని ఎవరికీ తెలియదు. మరలా కుటుంబ
తగాదాల కారణముగా 2014 లో 7 సం॥లు గల నా చెల్లెలు కూతురుని
కూడా నా భార్య సహాయముతో హత్య చేయడము జరిగింది. అప్పుడు

Page 86
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
85
86
పాత హత్య విషయము కూడా తెలిసిపోయింది. ఈ రెండు హత్యల
కారణముగా నేను, నా భార్య 2014 సం॥ము జులై నెల 14వ తారీఖున
జైలుకు రావడము జరిగింది. అప్పటి నుండి అనగా 14.07.2014
నుండి ఇప్పటి వరకు అనగా నాలుగు సం॥ల నుండి ఇద్దరము కూడా
జైల్లోనే ఉన్నాము.
నేను జైలుకు వచ్చిన తరువాత జైల్లోఉన్న కొంతమంది ముస్లీమ్లతో
పరిచయమై, 2014 జులై నుండి 2016 డిసెంబర్ వరకు హదీసులు
చదువుకుంటూ, నమాజ్ చేస్తూ, రోజా ఉంటూ గడుపుతున్నాను. నేను
చదివిన హదీసులు 1. సహీ బుఖారి (9 వాల్యూమ్లు), 2. అబుదావూద్
3. తిర్మిజి 4. సహి ముస్లీమ్ మరియు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర
(సరాతున్నబి), వారి శిష్యుల ఖలీఫాల చరిత్రలు చదివాను. కానీ హదీసులు
కొన్ని విషయాలలో ఒక దానిలో చెప్పిన దానికి, మరొక దానికి వ్యతిరేఖంగా
ఉండేవి. నమాజ్ విధానము ఒక హదీసు వేరొక హదీసు చెప్పే విధానానికి
వ్యతిరేఖంగా ఉండేది. జైల్లో కూడా నాలుగు, ఐదు (ఫిర్కే) వర్గాల వారు
ఉన్నారు. మొత్తం ముస్లీమ్ సమాజము 73 వర్గాలుగా ఉన్నారని, 73వ
వర్గం ఒకటి మాత్రమే జన్నత్ (స్వర్గం) లోకి వెళ్ళుతుందని చెప్పేవారు.
73 వర్గాలలో ఆ ఒక్కటి ఏది అంటే అందరూ మాది మాది మాత్రమే
జన్నత్ లోనికి వెళ్ళుతుంది. మిగతావర్గాలవారు వెళ్ళరు అనేవారు. ఏ వర్గము
జన్నత్లో వెళ్ళదని నమ్మకము, రుజువు ఏమిటి అంటే ప్రళయ దినము
అల్లాహ్ వద్దకు వెళ్ళిన తరువాత తెలుస్తుంది గాని ఇప్పుడు చెప్పలేము,
ఎవరికీ తెలియదు అని చెపుతున్నారు. నమాజ్ చేసుకుంటూ, రోజా
ఉంటూ, బోధలు వింటూ ఉంటే, పాపాలన్నీ క్షమించబడి స్వర్గంలోకి
వెళ్ళుతాము అని చెప్పేవారు. జ్ఞానం గురించి ఎంత తెలుసుకుంటుంటే,
హదీసులు చదువుతున్నప్పుడు ప్రశ్నలు, సందేహాలు ఉంటుంటే పెరుగుతూ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఉన్నాయి గానీ స్పష్టమైన సమాధానము దొరకడము లేదు. తెలిసినవారని
పెద్దలని అడిగితే వారు చెప్పే సమాధానము అసంపూర్తిగా ఉండేది. ఒకరు
చెప్పేదానికి మరొకరు చెప్పేదానికి పొంతన లేకుండా ఉండేది.
ఇలా నా జీవితం సాగుతుండగా 2016 సం॥ సెప్టెంబర్ నెలలో
నేనున్న రూమ్ (బ్యారక్ కు అమీర్ అలి అనే వ్యక్తి వచ్చాడు. అతను
ఎప్పుడూ ఏదో చదువుతూ, రాసుకుంటూ ఉండేవాడు, ఎవరితో ఎక్కువగా
మాట్లాడేవాడు కాదు. నాకు 2016 సం॥ నవంబర్ నెలలో విపరీతమైన
బ్యాక్పెయిన్ వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పుడు నాకు వేరే
వారి ద్వారా అమీర్ అలికి చూపించు, అతను ఏదో ట్రీట్మెంట్ చేస్తాడట
అని తెలిసి అతనికి నా ప్రాబ్లమ్ గురించి చెప్పాను. అప్పుడు అతను
నన్ను చెక్ చేసి ఏదో పాయింట్ల పైవత్తి ట్రీట్మెంట్ చేశాడు. అప్పుడు
వెంటనే నొప్పి తగ్గి రిలీఫ్ అయింది. దానితో వారితో పరిచయము పెరిగి
జ్ఞానము గురించి అడగడము జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానము గురించి
తెలుసుకోవాలని ఉంటే వచ్చి కూర్చోండి చర్చిద్దాము అని అన్నాడు. అప్పటి
నుండి (2016 డిసెంబర్ నుండి) ప్రతి రోజు సాయంత్రము లాకప్ తరువాత
7 గంటల నుండి 9 గంటల వరకు, నాకున్న డౌట్స్కి ఖుర్ఆన్ ఆయత్ల
ద్వారా చూపించి వివరించేవారు. ఒక నెల రోజులలో నా సందేహాలకు
చాలా జవాబులు దొరికేవి. అంతేకాక ఎన్నో తెలియని రహస్యాలు కూడా
తెలియజెప్పేవారు. ఖుర్ఆన్లో శరీరము గురించిన ఆయత్లు ఇలా
ఉన్నాయని, అల్లాహ్ విధానము ఇలా ఉంది అని వివరించేవారు. ఇప్పటి
వరకు ఎవరూ చెప్పనివి, ఎవరికీ తెలియనివి చెప్పుతూవుంటే మొత్తం
సత్యము, నిజమైనదని అనిపించింది. అప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞాన
విషయాలు తెలుసుకోవాలని పగలు కూడా జ్ఞానము గురించి చెప్పమని
అడిగినాను.

Page 87
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
85
86
పాత హత్య విషయము కూడా తెలిసిపోయింది. ఈ రెండు హత్యల
కారణముగా నేను, నా భార్య 2014 సం॥ము జులై నెల 14వ తారీఖున
జైలుకు రావడము జరిగింది. అప్పటి నుండి అనగా 14.07.2014
నుండి ఇప్పటి వరకు అనగా నాలుగు సం॥ల నుండి ఇద్దరము కూడా
జైల్లోనే ఉన్నాము.
నేను జైలుకు వచ్చిన తరువాత జైల్లోఉన్న కొంతమంది ముస్లీమ్లతో
పరిచయమై, 2014 జులై నుండి 2016 డిసెంబర్ వరకు హదీసులు
చదువుకుంటూ, నమాజ్ చేస్తూ, రోజా ఉంటూ గడుపుతున్నాను. నేను
చదివిన హదీసులు 1. సహీ బుఖారి (9 వాల్యూమ్లు), 2. అబుదావూద్
3. తిర్మిజి 4. సహి ముస్లీమ్ మరియు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర
(సరాతున్నబి), వారి శిష్యుల ఖలీఫాల చరిత్రలు చదివాను. కానీ హదీసులు
కొన్ని విషయాలలో ఒక దానిలో చెప్పిన దానికి, మరొక దానికి వ్యతిరేఖంగా
ఉండేవి. నమాజ్ విధానము ఒక హదీసు వేరొక హదీసు చెప్పే విధానానికి
వ్యతిరేఖంగా ఉండేది. జైల్లో కూడా నాలుగు, ఐదు (ఫిర్కే) వర్గాల వారు
ఉన్నారు. మొత్తం ముస్లీమ్ సమాజము 73 వర్గాలుగా ఉన్నారని, 73వ
వర్గం ఒకటి మాత్రమే జన్నత్ (స్వర్గం) లోకి వెళ్ళుతుందని చెప్పేవారు.
73 వర్గాలలో ఆ ఒక్కటి ఏది అంటే అందరూ మాది మాది మాత్రమే
జన్నత్ లోనికి వెళ్ళుతుంది. మిగతావర్గాలవారు వెళ్ళరు అనేవారు. ఏ వర్గము
జన్నత్లో వెళ్ళదని నమ్మకము, రుజువు ఏమిటి అంటే ప్రళయ దినము
అల్లాహ్ వద్దకు వెళ్ళిన తరువాత తెలుస్తుంది గాని ఇప్పుడు చెప్పలేము,
ఎవరికీ తెలియదు అని చెపుతున్నారు. నమాజ్ చేసుకుంటూ, రోజా
ఉంటూ, బోధలు వింటూ ఉంటే, పాపాలన్నీ క్షమించబడి స్వర్గంలోకి
వెళ్ళుతాము అని చెప్పేవారు. జ్ఞానం గురించి ఎంత తెలుసుకుంటుంటే,
హదీసులు చదువుతున్నప్పుడు ప్రశ్నలు, సందేహాలు ఉంటుంటే పెరుగుతూ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఉన్నాయి గానీ స్పష్టమైన సమాధానము దొరకడము లేదు. తెలిసినవారని
పెద్దలని అడిగితే వారు చెప్పే సమాధానము అసంపూర్తిగా ఉండేది. ఒకరు
చెప్పేదానికి మరొకరు చెప్పేదానికి పొంతన లేకుండా ఉండేది.
ఇలా నా జీవితం సాగుతుండగా 2016 సం॥ సెప్టెంబర్ నెలలో
నేనున్న రూమ్ (బ్యారక్ కు అమీర్ అలి అనే వ్యక్తి వచ్చాడు. అతను
ఎప్పుడూ ఏదో చదువుతూ, రాసుకుంటూ ఉండేవాడు, ఎవరితో ఎక్కువగా
మాట్లాడేవాడు కాదు. నాకు 2016 సం॥ నవంబర్ నెలలో విపరీతమైన
బ్యాక్పెయిన్ వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పుడు నాకు వేరే
వారి ద్వారా అమీర్ అలికి చూపించు, అతను ఏదో ట్రీట్మెంట్ చేస్తాడట
అని తెలిసి అతనికి నా ప్రాబ్లమ్ గురించి చెప్పాను. అప్పుడు అతను
నన్ను చెక్ చేసి ఏదో పాయింట్ల పైవత్తి ట్రీట్మెంట్ చేశాడు. అప్పుడు
వెంటనే నొప్పి తగ్గి రిలీఫ్ అయింది. దానితో వారితో పరిచయము పెరిగి
జ్ఞానము గురించి అడగడము జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానము గురించి
తెలుసుకోవాలని ఉంటే వచ్చి కూర్చోండి చర్చిద్దాము అని అన్నాడు. అప్పటి
నుండి (2016 డిసెంబర్ నుండి) ప్రతి రోజు సాయంత్రము లాకప్ తరువాత
7 గంటల నుండి 9 గంటల వరకు, నాకున్న డౌట్స్కి ఖుర్ఆన్ ఆయత్ల
ద్వారా చూపించి వివరించేవారు. ఒక నెల రోజులలో నా సందేహాలకు
చాలా జవాబులు దొరికేవి. అంతేకాక ఎన్నో తెలియని రహస్యాలు కూడా
తెలియజెప్పేవారు. ఖుర్ఆన్లో శరీరము గురించిన ఆయత్లు ఇలా
ఉన్నాయని, అల్లాహ్ విధానము ఇలా ఉంది అని వివరించేవారు. ఇప్పటి
వరకు ఎవరూ చెప్పనివి, ఎవరికీ తెలియనివి చెప్పుతూవుంటే మొత్తం
సత్యము, నిజమైనదని అనిపించింది. అప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞాన
విషయాలు తెలుసుకోవాలని పగలు కూడా జ్ఞానము గురించి చెప్పమని
అడిగినాను.

Page 88
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
87
అప్పుడు ఆయన సురా 3-7 ఆయతను చూపించి ఖుర్ఆన్
ముహ్కమాత్ మరియు ముతషాబిహాత్ (స్థూల, సూక్ష్మ) ఆయత్లు ఉన్నాయి,
ఇవి ఇప్పటి వరకు ముస్లీమ్లకు తెలియక ఖుర్ఆన్ మొత్తము ఆయత్లను
స్థూలముగా రాసుకున్నారు. అందుకే ఖుర్ఆన్ ఎవరికీ సరిగా అర్థము
కాక, ఎవరికి అర్థమైనది వారు హదీసుల రూపములో రాసుకొని, 72
వర్గాలుగా చీలిపోయారు. ఈ సూక్ష్మ ఖుర్ఆన్ ఆయతులను ప్రబోధానంద
యోగీశ్వరులు అనే ఒక స్వామివారు వీటి గురించి వివరణ గ్రంథములో
వ్రాశారు. వారి ద్వారానే నాకు ఈ జ్ఞానం దొరికిందని, వారు మూడు
మతాల జ్ఞానం చెబుతారు, చాలా గ్రంథాలు వ్రాశారు. నీకు శ్రద్ధవుంటే
జ్ఞానం తెలుసుకోవాలని అనిపిస్తే, నీకు స్వామివారు రాసిన గ్రంథాలు నా
దగ్గర ఉన్నాయి. చదువుతానంటే ఇస్తాను అవి తెలుగు మరియు కన్నడ
భాషలలోనే ఉన్నాయి. కొన్ని ఉర్దూలో ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు
నేను నాకు కన్నడ భాష వస్తుందని చెప్పాను. అప్పుడు నాకు మొదటిసారిగా
2017 సం॥ జనవరిలో "ధర్మశాస్త్రం ఏది (ధర్మశాస్త్ర యావదు)” అనే
గ్రంథము ఇచ్చారు. అప్పటి వరకు నాకు ధర్మం అంటే, శాస్త్రము అంటే
కూడా ఏమీ తెలియదు. కానీ ఈ గ్రంథము చదివిన తరువాత ధర్మము,
శాస్త్రము అంటే ఏమిటో తెలిసింది. అంతేకాక చాలా జ్ఞాన విషయాలు
తెలిసినాయి. అన్నీ నిజాలుగా అర్థము అయ్యాయి. మిగతా గ్రంథాలు
కూడా చదవాలని శ్రద్ధ పెరిగింది. నేను 2017 సం॥ జనవరి నుండి
2018 సం|| ఏప్రిల్ వరకు చదివిన మొత్తం గ్రంథాలు 1. ధర్మశాస్త్రం
ఏది? 2. ప్రవక్తలు ఎవరు? 3. కర్మపత్రం 4. ఒక మాట మూడు గ్రంథాలు
5. దేవుని తీర్పు (జడ్జిమెంట్ ఆఫ్ గాడ్) 6. మూడు గ్రంథములు ఇద్దరు
గురువులు ఒక బోధకుడు 7. ఒక్కడే ఇద్దరు 8. దేవుని రాకకు ఇది
సమయము కాదా? 9.ఏసు చంపబడ్డాడా? చనిపోయాడా? 10. త్రైతాకార
88
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
రహస్యం 11. నీకు నాలేఖ 12. గీతా పరిచయం 13. సాయిబాబా దేవుడా
కాదా? 14. మంత్రం-మహిమ 15. దేవాలయ రహస్యాలు 16. ఇందూ
సాంప్రదాయాలు 17. దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు
18. 1058 ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు 19. భగవద్గీత 20. స్వర్గం
ఇంద్రలోకమా! నరకం యమలోకమా? 21. దేవుని చిహ్నం 22. ఏది
నిజమైన జ్ఞానం 23. మరణం తరువాత జీవితం 24. జనన మరణ
సిద్ధాంతం 25. పునర్జన్మ రహస్యం 26. సమాధి 27. విశ్వవిద్యాలయం
28. సుబోధ 29. శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా? 30. హిందూమతంలో
సిద్ధాంతకర్తలు 31. ధ్యానం- ప్రార్థన - నమాజ్ 32. సామెతల జ్ఞానం
33. హేతువాద ప్రశ్నలు- సత్యవాద జవాబులు 34. హిందూమతంలో
కుల వివక్ష 35. శిలువ దేవుడా? 36. వార్తకుడు-వర్తకుడు 37. ప్రబోధ
38. మన పండుగలు 39. తల్లి తండ్రి 40. త్రెతారాధన 41. భగవాన్
రావణ బ్రహ్మ 42. ఒక వ్యక్తి రెండు కోణములు 43. ప్రథమ దైవ గ్రంథం
భగవద్గీత 44. మతం పథం 45. అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన
వాక్యములు, రెండవది వజ్ర వాక్యములు మరియు 46. ద్వితీయ గ్రంథము
బైబల్ కూడా తెలుగులోవి ఉర్దూలో ట్రాన్స్లేషన్ చేసి ప్రతిరోజు రెండు
గంటలు చెప్పేవారు. మిగతా గ్రంథాలలో ఉన్న డౌట్స్ కూడా అమీర్
అలితో అడిగి తెలుసుకొనేవాడిని.
పైన తెలిపిన గ్రంథాలు ఒక్కొక్క గ్రంథము చదువుతూ ఉంటే
నాకు ప్రతి ఒక్క గ్రంథములో తెలియబడే జ్ఞానముతో ఆనందముతో క్రొత్త
అనుభూతులు పొందుతూ నా హృదయం పులకించిపోయేది. నా గత
జీవితములో ఉన్న కోపం తగ్గిపోయింది, సహనము పెరిగింది. నాలో
ఊహించని మార్పు వచ్చింది. నాకు తమరి జ్ఞానము ద్వారా కొత్త జన్మ
(అంటే బిందు పుత్రునినుండి నాద పుత్రుని జన్మ) ప్రసాదించబడిందని
ఆనందముగా ఉన్నాను.

Page 89
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
87
అప్పుడు ఆయన సురా 3-7 ఆయతను చూపించి ఖుర్ఆన్
ముహ్కమాత్ మరియు ముతషాబిహాత్ (స్థూల, సూక్ష్మ) ఆయత్లు ఉన్నాయి,
ఇవి ఇప్పటి వరకు ముస్లీమ్లకు తెలియక ఖుర్ఆన్ మొత్తము ఆయత్లను
స్థూలముగా రాసుకున్నారు. అందుకే ఖుర్ఆన్ ఎవరికీ సరిగా అర్థము
కాక, ఎవరికి అర్థమైనది వారు హదీసుల రూపములో రాసుకొని, 72
వర్గాలుగా చీలిపోయారు. ఈ సూక్ష్మ ఖుర్ఆన్ ఆయతులను ప్రబోధానంద
యోగీశ్వరులు అనే ఒక స్వామివారు వీటి గురించి వివరణ గ్రంథములో
వ్రాశారు. వారి ద్వారానే నాకు ఈ జ్ఞానం దొరికిందని, వారు మూడు
మతాల జ్ఞానం చెబుతారు, చాలా గ్రంథాలు వ్రాశారు. నీకు శ్రద్ధవుంటే
జ్ఞానం తెలుసుకోవాలని అనిపిస్తే, నీకు స్వామివారు రాసిన గ్రంథాలు నా
దగ్గర ఉన్నాయి. చదువుతానంటే ఇస్తాను అవి తెలుగు మరియు కన్నడ
భాషలలోనే ఉన్నాయి. కొన్ని ఉర్దూలో ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు
నేను నాకు కన్నడ భాష వస్తుందని చెప్పాను. అప్పుడు నాకు మొదటిసారిగా
2017 సం॥ జనవరిలో "ధర్మశాస్త్రం ఏది (ధర్మశాస్త్ర యావదు)” అనే
గ్రంథము ఇచ్చారు. అప్పటి వరకు నాకు ధర్మం అంటే, శాస్త్రము అంటే
కూడా ఏమీ తెలియదు. కానీ ఈ గ్రంథము చదివిన తరువాత ధర్మము,
శాస్త్రము అంటే ఏమిటో తెలిసింది. అంతేకాక చాలా జ్ఞాన విషయాలు
తెలిసినాయి. అన్నీ నిజాలుగా అర్థము అయ్యాయి. మిగతా గ్రంథాలు
కూడా చదవాలని శ్రద్ధ పెరిగింది. నేను 2017 సం॥ జనవరి నుండి
2018 సం|| ఏప్రిల్ వరకు చదివిన మొత్తం గ్రంథాలు 1. ధర్మశాస్త్రం
ఏది? 2. ప్రవక్తలు ఎవరు? 3. కర్మపత్రం 4. ఒక మాట మూడు గ్రంథాలు
5. దేవుని తీర్పు (జడ్జిమెంట్ ఆఫ్ గాడ్) 6. మూడు గ్రంథములు ఇద్దరు
గురువులు ఒక బోధకుడు 7. ఒక్కడే ఇద్దరు 8. దేవుని రాకకు ఇది
సమయము కాదా? 9.ఏసు చంపబడ్డాడా? చనిపోయాడా? 10. త్రైతాకార
88
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
రహస్యం 11. నీకు నాలేఖ 12. గీతా పరిచయం 13. సాయిబాబా దేవుడా
కాదా? 14. మంత్రం-మహిమ 15. దేవాలయ రహస్యాలు 16. ఇందూ
సాంప్రదాయాలు 17. దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు
18. 1058 ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు 19. భగవద్గీత 20. స్వర్గం
ఇంద్రలోకమా! నరకం యమలోకమా? 21. దేవుని చిహ్నం 22. ఏది
నిజమైన జ్ఞానం 23. మరణం తరువాత జీవితం 24. జనన మరణ
సిద్ధాంతం 25. పునర్జన్మ రహస్యం 26. సమాధి 27. విశ్వవిద్యాలయం
28. సుబోధ 29. శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా? 30. హిందూమతంలో
సిద్ధాంతకర్తలు 31. ధ్యానం- ప్రార్థన - నమాజ్ 32. సామెతల జ్ఞానం
33. హేతువాద ప్రశ్నలు- సత్యవాద జవాబులు 34. హిందూమతంలో
కుల వివక్ష 35. శిలువ దేవుడా? 36. వార్తకుడు-వర్తకుడు 37. ప్రబోధ
38. మన పండుగలు 39. తల్లి తండ్రి 40. త్రెతారాధన 41. భగవాన్
రావణ బ్రహ్మ 42. ఒక వ్యక్తి రెండు కోణములు 43. ప్రథమ దైవ గ్రంథం
భగవద్గీత 44. మతం పథం 45. అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన
వాక్యములు, రెండవది వజ్ర వాక్యములు మరియు 46. ద్వితీయ గ్రంథము
బైబల్ కూడా తెలుగులోవి ఉర్దూలో ట్రాన్స్లేషన్ చేసి ప్రతిరోజు రెండు
గంటలు చెప్పేవారు. మిగతా గ్రంథాలలో ఉన్న డౌట్స్ కూడా అమీర్
అలితో అడిగి తెలుసుకొనేవాడిని.
పైన తెలిపిన గ్రంథాలు ఒక్కొక్క గ్రంథము చదువుతూ ఉంటే
నాకు ప్రతి ఒక్క గ్రంథములో తెలియబడే జ్ఞానముతో ఆనందముతో క్రొత్త
అనుభూతులు పొందుతూ నా హృదయం పులకించిపోయేది. నా గత
జీవితములో ఉన్న కోపం తగ్గిపోయింది, సహనము పెరిగింది. నాలో
ఊహించని మార్పు వచ్చింది. నాకు తమరి జ్ఞానము ద్వారా కొత్త జన్మ
(అంటే బిందు పుత్రునినుండి నాద పుత్రుని జన్మ) ప్రసాదించబడిందని
ఆనందముగా ఉన్నాను.

Page 90
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
89
90
సాక్షాత్తూ ఖుదా చెప్పిన జ్ఞానము ద్వారా తెలియబడిన నిగూఢ
రహస్య నిజాలు ఏమనగా మూడు ఆత్మల జ్ఞానం (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
మూడు గ్రంథాలలో ఉన్నదని భగవద్గీత 14-16, 17 శ్లోకాలు బైబిల్
మత్తయి సువార్త 28-19 వాక్యము, ఖుర్ఆన్ 50-21 ఆయతుల
ద్వారా తెలిసింది. మూడు దైవ గ్రంథాలలో చెప్పబడిన జ్ఞానము దేవుడు
ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే, దేవున్ని చేరవలసిన గమ్యము కూడా
ఒక్కటే అనే విషయము తెలిసిపోయింది. మతాలను మానవులు తయారు
చేసుకున్నారని అర్థము అయింది.
నేను ముస్లీముగా నా బాధ్యత నమాజ్, రోజా, జకాత్, హజ్ చేసి,
హదీసులలో తెలిపిన ప్రవక్త ఆదేశాలను (సున్నత్లను) ఆచరిస్తే నేను
నిజమైన ముస్లీముగా మారి జన్నత్ (స్వర్గం)లో చేరిపోతానని నమ్మినాను.
కానీ ఖుదా రాసిన గ్రంథాలు చదివిన తరువాత నిజమైన జ్ఞానము తెలిసిన
తరువాత, అసలు నిజమైన ముస్లీమ్ ఎవరో తెలిసిపోయింది. నిజమైన
నమాజ్, జకాత్, రోజా, హజ్, అల్లాహ్ సృష్ఠిఆదిలో ఉన్న పేర్లు అని వాటి
గురించి వివరణ చదినిన నాకు ఏదో రహస్య నిధి (దైవనిధి) దొరికినంత
ఆనందం కల్గినది. జన్నత్ దోజఖ్ (స్వర్గం, నరకం) అంటే ఏమిటి?
మోక్షం (ఆఖిరత్) అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి?
అనే విషయము తెలిసింది. మా ముస్లీములకు తెలియని మోక్షం (ఆఖిరత్,
నజాత్) కూడా ఉన్నదని స్వామి వారి గ్రంథముల జ్ఞానము ద్వారా తెలిసి
ఆనందభరితుడైనాను.
తౌరాత్ అంటే భగవద్గీత అని ప్రపంచానికే తెలియని గొప్ప రహస్య
జ్ఞానము చెప్పిన ప్రపంచములోనే మొదటి వ్యక్తిగా కీర్తికెక్కినారు. ఖుర్ఆన్లో
తౌరాత్ అంటే ఏమిటో 5-44, 46, 48, 68 మరియు 62-5 ఆయతుల
ద్వారా రుజువు చేసినారు. ఖుర్ఆన్లో 25-1, 2-53, 8-8 ప్రకారం
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఫుర్ఖాన్ (గీటురాయి) మహమ్మద్ ప్రవక్తకు ఇచ్చిన గీటురాయి, మూసాకు
ఇచ్చిన గీటురాయి (ఫుర్ఖాన్) ఒక్కటే అని, ఆ ఆయత్ల ద్వారా తౌరాత్
(భగవద్గీత) లో ఉన్న జ్ఞానము, ఖుర్ఆన్లో ఉన్న జ్ఞానం ఒక్కటేనని మరియు
తౌరాత్ ఖుర్ఆన్కు మాతృ గ్రంథము (ఉమ్ముల్ కితాబ్ అని, బైబిల్ కూడా
భగవద్గీతలో భాగమేనని పరమ రహస్యం తెలిసింది. మూడు గ్రంథములు
ఒకే దైవము గురించి, మూడు ఆత్మల గురించి చెప్పినవని జీవాత్మలమైన
మాకు ముక్తిని ప్రసాదించేవే మూడు గ్రంథాలు అని స్వామి వారి జ్ఞానము
ద్వారా
తెలిసింది.
తౌరాత్ (భగవద్గీత) లో చెప్పిన ప్రకారం ధర్మములు, అధర్మములు
అంటే ఏమిటి, ధర్మాలు (బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు) ఆచరిస్తే మోక్షం
వస్తుందని, అధర్మాలు (దానాలు, వేదాలు, యజ్ఞములు, తపస్సులు) ఆచరిస్తే
పాప, పుణ్యకర్మలు అంటుకొని జన్మలు కలుగుతాయని తెలిసింది. ధర్మములు
తెలిసి ఆచరిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అని, ఈ విషయమే ఖురాన్లో
ఉందని తెలిసినది.
భగవద్గీతయే తౌరాత్ గ్రంథము అని, తౌరాత్ పేరుతో గ్రంథము
ఎక్కడా లేదని బైబిల్లో మోషేకు, ఖుర్ఆన్లో మూసాకు ఇవ్వబడినదే
భగవద్గీత గ్రంథము అని ఖురాన్ 6-91 ఆయత్ ద్వారా తెలిసింది. సృష్ఠి
ఆదిలో దేవుని జ్ఞానము భగవద్గీత శ్లోకం 4-1 ద్వారా పరమాత్మ మొదట
సూర్యునికి చెప్పాడు అని, సూర్యుడు మనువుకు చెప్పాడని, మనువు ద్వారా
ఇక్ష్వాకుడు అను రాజుకు తెలియబడినది అని, అదే జ్ఞానం (జపర జ్ఞానం)
5000 సం||ల క్రితం అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పారని, శ్రీకృష్ణ భగవానే
మోషే (మూసా) కు స్వప్నంలో భగవద్గీత గ్రంథాన్ని తౌరాత్ పేరుతో ఇచ్చారని
తరువాత శ్రీకృష్ణ భగవానే ఏసుప్రభువుగా వచ్చి బైబిల్ (ఇంజిల్) జ్ఞానము
చెప్పినారు అని తరువాత సూర్యుడే పేరు మార్చుకొని జిబ్రయిల్గా తెర

Page 91
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము ?
89
90
సాక్షాత్తూ ఖుదా చెప్పిన జ్ఞానము ద్వారా తెలియబడిన నిగూఢ
రహస్య నిజాలు ఏమనగా మూడు ఆత్మల జ్ఞానం (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
మూడు గ్రంథాలలో ఉన్నదని భగవద్గీత 14-16, 17 శ్లోకాలు బైబిల్
మత్తయి సువార్త 28-19 వాక్యము, ఖుర్ఆన్ 50-21 ఆయతుల
ద్వారా తెలిసింది. మూడు దైవ గ్రంథాలలో చెప్పబడిన జ్ఞానము దేవుడు
ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే, దేవున్ని చేరవలసిన గమ్యము కూడా
ఒక్కటే అనే విషయము తెలిసిపోయింది. మతాలను మానవులు తయారు
చేసుకున్నారని అర్థము అయింది.
నేను ముస్లీముగా నా బాధ్యత నమాజ్, రోజా, జకాత్, హజ్ చేసి,
హదీసులలో తెలిపిన ప్రవక్త ఆదేశాలను (సున్నత్లను) ఆచరిస్తే నేను
నిజమైన ముస్లీముగా మారి జన్నత్ (స్వర్గం)లో చేరిపోతానని నమ్మినాను.
కానీ ఖుదా రాసిన గ్రంథాలు చదివిన తరువాత నిజమైన జ్ఞానము తెలిసిన
తరువాత, అసలు నిజమైన ముస్లీమ్ ఎవరో తెలిసిపోయింది. నిజమైన
నమాజ్, జకాత్, రోజా, హజ్, అల్లాహ్ సృష్ఠిఆదిలో ఉన్న పేర్లు అని వాటి
గురించి వివరణ చదినిన నాకు ఏదో రహస్య నిధి (దైవనిధి) దొరికినంత
ఆనందం కల్గినది. జన్నత్ దోజఖ్ (స్వర్గం, నరకం) అంటే ఏమిటి?
మోక్షం (ఆఖిరత్) అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి?
అనే విషయము తెలిసింది. మా ముస్లీములకు తెలియని మోక్షం (ఆఖిరత్,
నజాత్) కూడా ఉన్నదని స్వామి వారి గ్రంథముల జ్ఞానము ద్వారా తెలిసి
ఆనందభరితుడైనాను.
తౌరాత్ అంటే భగవద్గీత అని ప్రపంచానికే తెలియని గొప్ప రహస్య
జ్ఞానము చెప్పిన ప్రపంచములోనే మొదటి వ్యక్తిగా కీర్తికెక్కినారు. ఖుర్ఆన్లో
తౌరాత్ అంటే ఏమిటో 5-44, 46, 48, 68 మరియు 62-5 ఆయతుల
ద్వారా రుజువు చేసినారు. ఖుర్ఆన్లో 25-1, 2-53, 8-8 ప్రకారం
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ఫుర్ఖాన్ (గీటురాయి) మహమ్మద్ ప్రవక్తకు ఇచ్చిన గీటురాయి, మూసాకు
ఇచ్చిన గీటురాయి (ఫుర్ఖాన్) ఒక్కటే అని, ఆ ఆయత్ల ద్వారా తౌరాత్
(భగవద్గీత) లో ఉన్న జ్ఞానము, ఖుర్ఆన్లో ఉన్న జ్ఞానం ఒక్కటేనని మరియు
తౌరాత్ ఖుర్ఆన్కు మాతృ గ్రంథము (ఉమ్ముల్ కితాబ్ అని, బైబిల్ కూడా
భగవద్గీతలో భాగమేనని పరమ రహస్యం తెలిసింది. మూడు గ్రంథములు
ఒకే దైవము గురించి, మూడు ఆత్మల గురించి చెప్పినవని జీవాత్మలమైన
మాకు ముక్తిని ప్రసాదించేవే మూడు గ్రంథాలు అని స్వామి వారి జ్ఞానము
ద్వారా
తెలిసింది.
తౌరాత్ (భగవద్గీత) లో చెప్పిన ప్రకారం ధర్మములు, అధర్మములు
అంటే ఏమిటి, ధర్మాలు (బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు) ఆచరిస్తే మోక్షం
వస్తుందని, అధర్మాలు (దానాలు, వేదాలు, యజ్ఞములు, తపస్సులు) ఆచరిస్తే
పాప, పుణ్యకర్మలు అంటుకొని జన్మలు కలుగుతాయని తెలిసింది. ధర్మములు
తెలిసి ఆచరిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అని, ఈ విషయమే ఖురాన్లో
ఉందని తెలిసినది.
భగవద్గీతయే తౌరాత్ గ్రంథము అని, తౌరాత్ పేరుతో గ్రంథము
ఎక్కడా లేదని బైబిల్లో మోషేకు, ఖుర్ఆన్లో మూసాకు ఇవ్వబడినదే
భగవద్గీత గ్రంథము అని ఖురాన్ 6-91 ఆయత్ ద్వారా తెలిసింది. సృష్ఠి
ఆదిలో దేవుని జ్ఞానము భగవద్గీత శ్లోకం 4-1 ద్వారా పరమాత్మ మొదట
సూర్యునికి చెప్పాడు అని, సూర్యుడు మనువుకు చెప్పాడని, మనువు ద్వారా
ఇక్ష్వాకుడు అను రాజుకు తెలియబడినది అని, అదే జ్ఞానం (జపర జ్ఞానం)
5000 సం||ల క్రితం అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పారని, శ్రీకృష్ణ భగవానే
మోషే (మూసా) కు స్వప్నంలో భగవద్గీత గ్రంథాన్ని తౌరాత్ పేరుతో ఇచ్చారని
తరువాత శ్రీకృష్ణ భగవానే ఏసుప్రభువుగా వచ్చి బైబిల్ (ఇంజిల్) జ్ఞానము
చెప్పినారు అని తరువాత సూర్యుడే పేరు మార్చుకొని జిబ్రయిల్గా తెర

Page 92
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
91
92
చాటు నుండి మహమ్మద్ ప్రవక్తకు చెప్పినారు అని తమరి గ్రంథాల ద్వారా
తెలిసింది. ఎవరికీ తెలియని పరమ రహస్యాలు తెలిసి ఆనందభరితుడైనాను.
తౌరాత్ (భగవద్గీత) ప్రకారం నాకు తెలిసిన నిగూఢ జ్ఞానము
సృష్టి ఆదిలో పరమాత్మ నాలుగు భాగాలు (ప్రకృతి, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
గా విభజింపబడినాడు అని, ప్రకృతి అనేది చర, అచర ప్రకృతిగా రెండు
భాగాలుగా మారిందని, చర ప్రకృతిగా 24 భాగాల శరీరం, అందులో
జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు కలిపి 27 భాగాలు అని, ప్రకృతియే మాయగా
గుణాల రూపంలో (సైతాన్) తలలో ఉంది అని, బ్రహ్మ, కాల, కర్మ, గుణ
చక్రాలు మనిషి కర్మలు అనుభవించడానికి మూలము అని, జీవాత్మ అయిన
నేను గుణచక్రములో రవ్వంతగా ఉన్నానని, ఆత్మ శరీరము అంతా వ్యాపించి
ఉంది అని, పరమాత్మ శరీరము లోపల, బయట అణువు అణువు వ్యాపించి
ఉందని, ఖురాన్ 6-95 ఆయత్ ప్రకారం జీవాత్మల జన్మలు మూడు
విధాలు అండజ, పిండజ, ఉద్భిజాలుగా ఉన్నాయని, కర్మలు మూడు విధాలు
ప్రారబ్ద, ఆగామిక, సంచిత కర్మలని, మరణాలు కూడా (మూడు +ఒకటి)
నాలుగు అని కాల, అకాల, తాత్కాలిక, ఆఖరి మరణములు అని అద్భుతమైన
అగోచర జ్ఞానము తెలిసినది.
నేను జీవాత్మనని, పరమాత్మ అంశనని, కర్మ బంధములో చిక్కుకొని
ప్రకృతి చేతిలో ఉన్నానని, కర్మలు నాశనం చేసుకుంటేనే జన్మ, కర్మ బంధాల
నుండి ముక్తి కలుగుతుందని, ముక్తి కలగాలంటే భగవద్గీతలో భగవానుడు
చెప్పిన ధర్మాలు బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది
అని తెలిసినది. 1. బ్రహ్మయోగం మనసును నియంత్రించడం అని
2. కర్మయోగం అహము (అహంభావం) లేకుండా, నేనే కార్యములు
చేస్తున్నాననే భావం లేకుండా కార్యములు చేయడం అని 3. భక్తియోగం
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ధర్మముల ప్రచారము, దైవసేవ అని ఈ మూడింటి ద్వారానే కర్మలు
నాశనం చేసుకొని, జన్మలు లేకుండా చేసుకొని మోక్షం పొందాలని
తెలిసింది.
సూక్ష్మములో మోక్షం అంటే భగవంతుడిని తెలిసి సాకారాన్ని
ఆరాధించడము భగవద్గీత శ్లోకాలు, 4-9, మరియు
18-66 ద్వారా
తెలిసినాయి. శిశువు జన్మించిన తరువాత మొదటి శ్వాసలో జీవాత్మ
ప్రవేశించిన తరువాతనే ప్రాణం వస్తుందని, మనిషికి స్థూల, సూక్ష్మ రెండు
శరీరములు ఉన్నవని అలాగే స్థూల, సూక్ష్మ కర్మలు కూడా రెండు రకములు
అని, దయ్యాలు, భూతాలు గురించి రహస్యాలు తెలిసినాయి. బ్రహ్మవిద్య
శాస్త్రం ఆధ్యాత్మిక జ్ఞాననిధి అని తెలిసిపోయినది. మనిషి శరీరములోని
బ్రహ్మనాడిలోనే, విశ్వము ఇమిడి ఉన్నదని, షట్ శాస్రములు, సర్వవిద్యలు,
బయటి సమస్త ప్రపంచము, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మోక్షప్రాప్తి
కూడా, సర్వము బ్రహ్మనాడిలో ఇమిడి ఉన్నాయనే నిజము తెలిసింది.
ఖుర్ఆన్ మరియు ముస్లీమ్ల విషయములో వారు అజ్ఞానముతో,
అపోహలతో, భ్రమలతో ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానాన్ని ఎలా తప్పుడు
భావము చెప్పుకుంటున్నారో, తమరి జ్ఞాన గ్రంథాల ద్వారా నిజాలు తెలిసి
విస్మయం, ఆశ్చర్యం కల్గినది. ఖుర్ఆన్లో దాగి ఉన్న రత్నాలు, ముత్యాలను
సాధారణ రాళ్ళుగా భావించిన మా ముస్లీమ్లకు పంచి పెట్టిన జ్ఞాన
ప్రదాతగా మీకు నా సాష్టాంగ సుమాంజలులు తెల్పుతున్నాను.
సురా 3 ఆయత్ 7 ద్వారా ఖురాన్లో ముహ్కమాత్ (స్థూల),
ముతషాబిహాత్ (సూక్ష్మ) ఆయత్లు ఉన్నాయని, శరీరములో దాగివున్న
సూక్ష్మజ్ఞానం గురించి తెలియని జ్ఞానాన్ని అంతిమ గ్రంథములో, జ్ఞాన
వాక్యాలు, వజ్ర వాక్యాలు అనే రెండు జ్ఞాన గనులను మా ముస్లీమ్

Page 93
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
91
92
చాటు నుండి మహమ్మద్ ప్రవక్తకు చెప్పినారు అని తమరి గ్రంథాల ద్వారా
తెలిసింది. ఎవరికీ తెలియని పరమ రహస్యాలు తెలిసి ఆనందభరితుడైనాను.
తౌరాత్ (భగవద్గీత) ప్రకారం నాకు తెలిసిన నిగూఢ జ్ఞానము
సృష్టి ఆదిలో పరమాత్మ నాలుగు భాగాలు (ప్రకృతి, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
గా విభజింపబడినాడు అని, ప్రకృతి అనేది చర, అచర ప్రకృతిగా రెండు
భాగాలుగా మారిందని, చర ప్రకృతిగా 24 భాగాల శరీరం, అందులో
జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు కలిపి 27 భాగాలు అని, ప్రకృతియే మాయగా
గుణాల రూపంలో (సైతాన్) తలలో ఉంది అని, బ్రహ్మ, కాల, కర్మ, గుణ
చక్రాలు మనిషి కర్మలు అనుభవించడానికి మూలము అని, జీవాత్మ అయిన
నేను గుణచక్రములో రవ్వంతగా ఉన్నానని, ఆత్మ శరీరము అంతా వ్యాపించి
ఉంది అని, పరమాత్మ శరీరము లోపల, బయట అణువు అణువు వ్యాపించి
ఉందని, ఖురాన్ 6-95 ఆయత్ ప్రకారం జీవాత్మల జన్మలు మూడు
విధాలు అండజ, పిండజ, ఉద్భిజాలుగా ఉన్నాయని, కర్మలు మూడు విధాలు
ప్రారబ్ద, ఆగామిక, సంచిత కర్మలని, మరణాలు కూడా (మూడు +ఒకటి)
నాలుగు అని కాల, అకాల, తాత్కాలిక, ఆఖరి మరణములు అని అద్భుతమైన
అగోచర జ్ఞానము తెలిసినది.
నేను జీవాత్మనని, పరమాత్మ అంశనని, కర్మ బంధములో చిక్కుకొని
ప్రకృతి చేతిలో ఉన్నానని, కర్మలు నాశనం చేసుకుంటేనే జన్మ, కర్మ బంధాల
నుండి ముక్తి కలుగుతుందని, ముక్తి కలగాలంటే భగవద్గీతలో భగవానుడు
చెప్పిన ధర్మాలు బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది
అని తెలిసినది. 1. బ్రహ్మయోగం మనసును నియంత్రించడం అని
2. కర్మయోగం అహము (అహంభావం) లేకుండా, నేనే కార్యములు
చేస్తున్నాననే భావం లేకుండా కార్యములు చేయడం అని 3. భక్తియోగం
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
ధర్మముల ప్రచారము, దైవసేవ అని ఈ మూడింటి ద్వారానే కర్మలు
నాశనం చేసుకొని, జన్మలు లేకుండా చేసుకొని మోక్షం పొందాలని
తెలిసింది.
సూక్ష్మములో మోక్షం అంటే భగవంతుడిని తెలిసి సాకారాన్ని
ఆరాధించడము భగవద్గీత శ్లోకాలు, 4-9, మరియు
18-66 ద్వారా
తెలిసినాయి. శిశువు జన్మించిన తరువాత మొదటి శ్వాసలో జీవాత్మ
ప్రవేశించిన తరువాతనే ప్రాణం వస్తుందని, మనిషికి స్థూల, సూక్ష్మ రెండు
శరీరములు ఉన్నవని అలాగే స్థూల, సూక్ష్మ కర్మలు కూడా రెండు రకములు
అని, దయ్యాలు, భూతాలు గురించి రహస్యాలు తెలిసినాయి. బ్రహ్మవిద్య
శాస్త్రం ఆధ్యాత్మిక జ్ఞాననిధి అని తెలిసిపోయినది. మనిషి శరీరములోని
బ్రహ్మనాడిలోనే, విశ్వము ఇమిడి ఉన్నదని, షట్ శాస్రములు, సర్వవిద్యలు,
బయటి సమస్త ప్రపంచము, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మోక్షప్రాప్తి
కూడా, సర్వము బ్రహ్మనాడిలో ఇమిడి ఉన్నాయనే నిజము తెలిసింది.
ఖుర్ఆన్ మరియు ముస్లీమ్ల విషయములో వారు అజ్ఞానముతో,
అపోహలతో, భ్రమలతో ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానాన్ని ఎలా తప్పుడు
భావము చెప్పుకుంటున్నారో, తమరి జ్ఞాన గ్రంథాల ద్వారా నిజాలు తెలిసి
విస్మయం, ఆశ్చర్యం కల్గినది. ఖుర్ఆన్లో దాగి ఉన్న రత్నాలు, ముత్యాలను
సాధారణ రాళ్ళుగా భావించిన మా ముస్లీమ్లకు పంచి పెట్టిన జ్ఞాన
ప్రదాతగా మీకు నా సాష్టాంగ సుమాంజలులు తెల్పుతున్నాను.
సురా 3 ఆయత్ 7 ద్వారా ఖురాన్లో ముహ్కమాత్ (స్థూల),
ముతషాబిహాత్ (సూక్ష్మ) ఆయత్లు ఉన్నాయని, శరీరములో దాగివున్న
సూక్ష్మజ్ఞానం గురించి తెలియని జ్ఞానాన్ని అంతిమ గ్రంథములో, జ్ఞాన
వాక్యాలు, వజ్ర వాక్యాలు అనే రెండు జ్ఞాన గనులను మా ముస్లీమ్

Page 94
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
93
94
సమాజానికి అందించిన తమరి రుణం తీర్చుకోలేనిది. మొత్తము ముస్లీమ్
సమాజానికే తెలియని అగోచర జ్ఞానాన్ని తెలిపిన ఖుదాకు (అల్లాహ్ జ్ఞానము
అల్లాహు తప్ప ఎవరికీ తెలియదు) భగవంతునికి, ఆదరణకర్తకు నా సజా
చేస్తున్నాను.
ఏడు ఆకాశాలు, భూమి వాటి మధ్య ఉన్న సమస్తము అంటే
శరీరము అని 30-8, 11-123, 74-30,31 ఆయతుల ద్వారా,
ముస్లీమ్లకు ఇంతవరకు తెలియని గొప్ప రహస్యం తెలిపినారు. శరీరము
లోనే మూడు ఆత్మలు ఉన్నాయని ఖురాన్ ఆయత్ 50-21 ద్వారా “తోలబడే
వాడు జీవాత్మ, తోలేవాడు ఆత్మ, సాక్షిగా చూసేవాడు పరమాత్మ” అని,
ఇవి భగవద్గీతలో 14–16,17 మరియు బైబిల్లో మత్తయి సువార్తలో
28-19 నందు మూడు దైవగ్రంథాలలో ఉన్న విషయం ముస్లీమ్ సమాజానికి
ఒక కనువిప్పుగా ఉన్నది. ముస్లీమ్లు ఆచరించే నమాజ్ తపస్సు అని,
నిజమైన నమాజ్ శరీరములోనే ఉందని 4-103, 3-191 ఆయతుల
ద్వారా తెలిసింది. జకాత్ అంటే వందరూపాయలకు 2.50 రూపాయలను
బీదలకు పంచడము కాదని దైవసేవ, ధర్మ ప్రచారమని (భగవద్గీతలో చెప్పిన
బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు అని) ఖురాన్ 48 - 15,16,17 ఆయతులని,
రోజా అంటే అన్నం తినకుండా ఉండుట కాదని, ఖుర్ఆన్ 2-187 ఆ
యత్ ద్వారా ఆత్మని పొందడము ఉపవాసమని తెలిసినది. హజ్లో చేసే
ఆచరణ సఫా,మర్వా చర, అచర ప్రకృతికి గుర్తులు అని తెలియని రహస్యము
తెలిసింది.
ముస్లీమ్లకు ఖుర్ఆన్లో సూక్ష్మ ఆయత్లు అర్థముకాక స్థూలముగా
చెప్పుకొని మొత్తము ముస్లీము సమాజానికి ఖుర్ఆన్ దూరము చేసి ఆయత్
2-79 ప్రకారం మనుషులు హదీసులను వ్రాసుకొని అవి మాత్రమే బోధిస్తూ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మొత్తము ముస్లీమ్ సమాజాన్ని 72 వర్గాలుగా చీల్చి, ఖుర్ఆన్క, అల్లాకు
దూరం చేసి ఖుర్ఆన్ ఆయత్లు 2-159, 41-40 ప్రకారం అల్లాహ్
శాపానికి గురైనారు. స్వర్గమే జీవిత లక్ష్యముగా పెట్టుకున్నారు. ముస్లీములకు
స్వర్గము, నరకము తప్ప, పరలోకము (మోక్షము) అంటే ఏమిటో అవి
ఎక్కడ ఉంటాయో తెలియకున్నారు. ఆయన్లు 10-106, 107, 108
స్వర్గం, నరకం గురించి, 3-14, 6-127, 13-24, 30-7,8, 40-
39, 40 పరలోకము గురించి ఖుర్ఆన్లో ఉన్నప్పటికీ, ముస్లీమ్ పెద్దలకు
తెలియకపోవడము దురదృష్టకరము.
ముస్లీములకు పునర్జన్మలు ఉన్నాయని ఖుర్ఆన్ ఆయతులు 7-
29, 22-66, 36-68, 40-11 చెప్పుతున్నాయి. గత జన్మలో చేసుకున్న
కర్మలు అనుభవించడానికే జన్మలు ఉన్నాయని ఆయత్ 10-4 చెప్పుతుంది.
ముస్లీములకు తద్దీర్ (కర్మ) అంటే పూర్తిగా తెలియదు. ఆయత్ 9-51,
57-22 పుట్టుక ముందే అన్నీ రాయబడి ఉన్నాయంటే ఏమి వ్రాయబడి
ఉన్నాయో తెలియక అయోమయములో ఉన్నారు. 7-187, 30-56
ప్రళయము గురించి, 9-5, 5-32 జీహాద్ గురించి, 72-6, 3-41
జిన్నాతుల గురించి, 40-40, 48-5 స్త్రీలకు స్వర్గము గురించి ఖురాన్లో
స్పష్టముగా ఉన్నప్పటికీ తెలియకున్నారు.
97-1, 2, 3, 4, 5 ఖుర్ఆన్ ఆయత్ల ద్వారా సృష్టి రహస్యము
తెలియబడింది. దానికి భిన్నముగా ముస్లీములు లైల తుల్ ఖద్రి
అంటే రంజాన్ అవతరించిన రోజు అని చెప్పుకుంటూ అధర్మ ఆచరణ
చేస్తున్నారు. తమరి గ్రంథముల జ్ఞానము ద్వారా నిజమైన ముస్లీముగా
మారినాను. తమరికి సాష్టాంగ నమస్కారములు.

Page 95
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
93
94
సమాజానికి అందించిన తమరి రుణం తీర్చుకోలేనిది. మొత్తము ముస్లీమ్
సమాజానికే తెలియని అగోచర జ్ఞానాన్ని తెలిపిన ఖుదాకు (అల్లాహ్ జ్ఞానము
అల్లాహు తప్ప ఎవరికీ తెలియదు) భగవంతునికి, ఆదరణకర్తకు నా సజా
చేస్తున్నాను.
ఏడు ఆకాశాలు, భూమి వాటి మధ్య ఉన్న సమస్తము అంటే
శరీరము అని 30-8, 11-123, 74-30,31 ఆయతుల ద్వారా,
ముస్లీమ్లకు ఇంతవరకు తెలియని గొప్ప రహస్యం తెలిపినారు. శరీరము
లోనే మూడు ఆత్మలు ఉన్నాయని ఖురాన్ ఆయత్ 50-21 ద్వారా “తోలబడే
వాడు జీవాత్మ, తోలేవాడు ఆత్మ, సాక్షిగా చూసేవాడు పరమాత్మ” అని,
ఇవి భగవద్గీతలో 14–16,17 మరియు బైబిల్లో మత్తయి సువార్తలో
28-19 నందు మూడు దైవగ్రంథాలలో ఉన్న విషయం ముస్లీమ్ సమాజానికి
ఒక కనువిప్పుగా ఉన్నది. ముస్లీమ్లు ఆచరించే నమాజ్ తపస్సు అని,
నిజమైన నమాజ్ శరీరములోనే ఉందని 4-103, 3-191 ఆయతుల
ద్వారా తెలిసింది. జకాత్ అంటే వందరూపాయలకు 2.50 రూపాయలను
బీదలకు పంచడము కాదని దైవసేవ, ధర్మ ప్రచారమని (భగవద్గీతలో చెప్పిన
బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలు అని) ఖురాన్ 48 - 15,16,17 ఆయతులని,
రోజా అంటే అన్నం తినకుండా ఉండుట కాదని, ఖుర్ఆన్ 2-187 ఆ
యత్ ద్వారా ఆత్మని పొందడము ఉపవాసమని తెలిసినది. హజ్లో చేసే
ఆచరణ సఫా,మర్వా చర, అచర ప్రకృతికి గుర్తులు అని తెలియని రహస్యము
తెలిసింది.
ముస్లీమ్లకు ఖుర్ఆన్లో సూక్ష్మ ఆయత్లు అర్థముకాక స్థూలముగా
చెప్పుకొని మొత్తము ముస్లీము సమాజానికి ఖుర్ఆన్ దూరము చేసి ఆయత్
2-79 ప్రకారం మనుషులు హదీసులను వ్రాసుకొని అవి మాత్రమే బోధిస్తూ
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
మొత్తము ముస్లీమ్ సమాజాన్ని 72 వర్గాలుగా చీల్చి, ఖుర్ఆన్క, అల్లాకు
దూరం చేసి ఖుర్ఆన్ ఆయత్లు 2-159, 41-40 ప్రకారం అల్లాహ్
శాపానికి గురైనారు. స్వర్గమే జీవిత లక్ష్యముగా పెట్టుకున్నారు. ముస్లీములకు
స్వర్గము, నరకము తప్ప, పరలోకము (మోక్షము) అంటే ఏమిటో అవి
ఎక్కడ ఉంటాయో తెలియకున్నారు. ఆయన్లు 10-106, 107, 108
స్వర్గం, నరకం గురించి, 3-14, 6-127, 13-24, 30-7,8, 40-
39, 40 పరలోకము గురించి ఖుర్ఆన్లో ఉన్నప్పటికీ, ముస్లీమ్ పెద్దలకు
తెలియకపోవడము దురదృష్టకరము.
ముస్లీములకు పునర్జన్మలు ఉన్నాయని ఖుర్ఆన్ ఆయతులు 7-
29, 22-66, 36-68, 40-11 చెప్పుతున్నాయి. గత జన్మలో చేసుకున్న
కర్మలు అనుభవించడానికే జన్మలు ఉన్నాయని ఆయత్ 10-4 చెప్పుతుంది.
ముస్లీములకు తద్దీర్ (కర్మ) అంటే పూర్తిగా తెలియదు. ఆయత్ 9-51,
57-22 పుట్టుక ముందే అన్నీ రాయబడి ఉన్నాయంటే ఏమి వ్రాయబడి
ఉన్నాయో తెలియక అయోమయములో ఉన్నారు. 7-187, 30-56
ప్రళయము గురించి, 9-5, 5-32 జీహాద్ గురించి, 72-6, 3-41
జిన్నాతుల గురించి, 40-40, 48-5 స్త్రీలకు స్వర్గము గురించి ఖురాన్లో
స్పష్టముగా ఉన్నప్పటికీ తెలియకున్నారు.
97-1, 2, 3, 4, 5 ఖుర్ఆన్ ఆయత్ల ద్వారా సృష్టి రహస్యము
తెలియబడింది. దానికి భిన్నముగా ముస్లీములు లైల తుల్ ఖద్రి
అంటే రంజాన్ అవతరించిన రోజు అని చెప్పుకుంటూ అధర్మ ఆచరణ
చేస్తున్నారు. తమరి గ్రంథముల జ్ఞానము ద్వారా నిజమైన ముస్లీముగా
మారినాను. తమరికి సాష్టాంగ నమస్కారములు.

Page 96
ముస్లీమ్ సమాజానికి నా విజ్ఞప్తి ఏమనగా!
95
మొత్తము ముస్లీమ్ సమాజము ఖుర్ఆన్ అల్లాహ్ చెప్పిన
ఖుర్ఆన్లో ఉన్న సురా 3 ఆయత్ 7 ప్రకారం ముహ్కమాత్, ముతషాబిహాత్
అంటే స్థూలవాక్యములు, సూక్ష్మవాక్యములు అంటే ఏమిటో తెలియక
అజ్ఞానముతో, ఖుర్ఆన్ ప్రవక్తకే అర్థమవుతుంది, మనకు అర్థము కాదని,
ప్రవక్త జీవిత విధానమే మనము ఆచరించాలని ముస్లీము పెద్దలు, హదీసులు
వ్రాసి వాటిని మాత్రమే బోధిస్తూ ఖుర్ఆన్ జ్ఞానానికి, అల్లాహ్కు మొత్తము
ముస్లీమ్ సమాజాన్ని దూరము చేసి, తీరని అన్యాయము చేసి అల్లాహ్
శాపానికి గురైనారు (ఆయతులు 2-159, 41-40). ఖుర్ఆన్ ఆయత్
6-91లో మీ పెద్దలకు తెలియని విషయాలు ఎన్నో తౌరాత్లో తెలియబడ్డా
యని ఉంది. ఖుర్ఆన్ ఆయత్ 2-79 ప్రకారం మనుషులు వ్రాసిన
హదీసులను వదలి, నిజమైన అల్లాహ్ భక్తులుగా, ఖుర్ఆన్ ఆయతు
51-56 ప్రకారము అల్లాహ్ ను, నిజజ్ఞానం తెలిసి ఆరాధించుదాము.
ముస్లీమ్ పెద్దలు వారికే ఖుర్ఆన్ ప్రకారము నిజ జ్ఞానము తెలియక తత్తీర్
గురించి, పునర్జన్మల గురించి, ప్రళయము గురించి, జీహాద్ గురించి,
స్వర్గము, నరకము, మోక్షము గురించి, ముఖ్యముగా నమాజ్, జకాత్,
రోజా, హజ్ గురించి అర్థముకాక తప్పు భావముతో హదీసులను వ్రాసి,
ఖుర్ఆన్ జ్ఞానము తప్పు భావము చెప్పి, ముస్లీమ్ సమాజాన్ని 72 వర్గాలుగా
చీల్చినారు. స్వర్గము పొందటమే జీవిత లక్ష్యముగా హదీసులు బోధిస్తున్నారు.
ముస్లీములారా! ఇప్పటికైనా మేల్కోండి. అల్లాహ్ మన కోసము
ఖుర్ఆన్ ఆయత్ 2-186 ప్రకారం ఒక వ్యక్తిలో దైవశక్తి ద్వారా నిజమైన
జ్ఞానాన్ని తెలియపరచడానికి పంపి మనలను నిజమైన ముస్లీములుగా,
96
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
సంపూర్ణ ముస్లీములుగా చేయటానికి పంపి, యోగీశ్వరులు వారి ద్వారా
“అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు, వజ్ర వాక్యములు” అని
ముస్లీము సమాజానికి తెలియని ఖుర్ఆన్ సూక్ష్మ ఆయతుల జ్ఞానాన్ని అల్లాహ్
ప్రేరణతో (సంకల్పముతో) మనకు రెండు గ్రంథాలను వాటికి అనుబంధ
గ్రంథాలను వ్రాసి ఇచ్చారు. కాబట్టి స్వర్గానికి తీసుకువెళ్ళే హదీసులను
వదలి, మోక్షానికి తీసుకువెళ్ళే ఖుర్ఆన్ ఆయత్ 40-39, 41 ను తీసుకొని
ఆచరించి, 72 వర్గాలను వదలి నిజమైన అల్లాహ్ మార్గములోనికి రావాలని
అందుకోసము యోగీశ్వరులవారి గ్రంథములను అసూయ లేకుండా చదివి,
అర్థము చేసుకొని ఆచరించి నిజమైన 73వ అల్లాహ్ వర్గములోకి వచ్చి
మోక్షము పొందుదాము (ఖుదా హాఫిజ్. ఖుదాకు మీ ప్రియ భక్తుడి
విన్నపము. నాకు సంపూర్ణ జ్ఞానము ప్రసాదించమని, భగవద్గీత శ్లోకము
17-66 ప్రకారం శరణు వేడుకుంటున్నాను. నా జీవిత ధ్యేయము దైవ
జ్ఞానము తెలుసుకుంటూ దైవసేవగా ధర్మప్రచారము చేసుకోవాలని
నిశ్చయించుకొన్నాను. దానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించ
మని, మీ దర్శన భాగ్యము కల్పించమని, ఈ జ్ఞానము చెప్పింది. సాక్ష్యాత్తూ
ఖుదా, భగవంతుడే, ఆదరణకర్తేనని సంపూర్ణముగా విశ్వసిస్తూ.... సాష్టాంగ
నమస్కారము చేస్తున్నాను.
ఈ
ఇట్లు మీ ప్రియ భక్తుడు
సయ్యద్ సల్మాన్షా
అసత్యమును వేయిమంది
సత్యమును
చెప్పినా, అది
వేయిమంది కాదనినా, అది
సత్యము కాదు,
అసత్యము కాదు.

Page 97
ముస్లీమ్ సమాజానికి నా విజ్ఞప్తి ఏమనగా!
95
మొత్తము ముస్లీమ్ సమాజము ఖుర్ఆన్ అల్లాహ్ చెప్పిన
ఖుర్ఆన్లో ఉన్న సురా 3 ఆయత్ 7 ప్రకారం ముహ్కమాత్, ముతషాబిహాత్
అంటే స్థూలవాక్యములు, సూక్ష్మవాక్యములు అంటే ఏమిటో తెలియక
అజ్ఞానముతో, ఖుర్ఆన్ ప్రవక్తకే అర్థమవుతుంది, మనకు అర్థము కాదని,
ప్రవక్త జీవిత విధానమే మనము ఆచరించాలని ముస్లీము పెద్దలు, హదీసులు
వ్రాసి వాటిని మాత్రమే బోధిస్తూ ఖుర్ఆన్ జ్ఞానానికి, అల్లాహ్కు మొత్తము
ముస్లీమ్ సమాజాన్ని దూరము చేసి, తీరని అన్యాయము చేసి అల్లాహ్
శాపానికి గురైనారు (ఆయతులు 2-159, 41-40). ఖుర్ఆన్ ఆయత్
6-91లో మీ పెద్దలకు తెలియని విషయాలు ఎన్నో తౌరాత్లో తెలియబడ్డా
యని ఉంది. ఖుర్ఆన్ ఆయత్ 2-79 ప్రకారం మనుషులు వ్రాసిన
హదీసులను వదలి, నిజమైన అల్లాహ్ భక్తులుగా, ఖుర్ఆన్ ఆయతు
51-56 ప్రకారము అల్లాహ్ ను, నిజజ్ఞానం తెలిసి ఆరాధించుదాము.
ముస్లీమ్ పెద్దలు వారికే ఖుర్ఆన్ ప్రకారము నిజ జ్ఞానము తెలియక తత్తీర్
గురించి, పునర్జన్మల గురించి, ప్రళయము గురించి, జీహాద్ గురించి,
స్వర్గము, నరకము, మోక్షము గురించి, ముఖ్యముగా నమాజ్, జకాత్,
రోజా, హజ్ గురించి అర్థముకాక తప్పు భావముతో హదీసులను వ్రాసి,
ఖుర్ఆన్ జ్ఞానము తప్పు భావము చెప్పి, ముస్లీమ్ సమాజాన్ని 72 వర్గాలుగా
చీల్చినారు. స్వర్గము పొందటమే జీవిత లక్ష్యముగా హదీసులు బోధిస్తున్నారు.
ముస్లీములారా! ఇప్పటికైనా మేల్కోండి. అల్లాహ్ మన కోసము
ఖుర్ఆన్ ఆయత్ 2-186 ప్రకారం ఒక వ్యక్తిలో దైవశక్తి ద్వారా నిజమైన
జ్ఞానాన్ని తెలియపరచడానికి పంపి మనలను నిజమైన ముస్లీములుగా,
96
ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము?
సంపూర్ణ ముస్లీములుగా చేయటానికి పంపి, యోగీశ్వరులు వారి ద్వారా
“అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు, వజ్ర వాక్యములు” అని
ముస్లీము సమాజానికి తెలియని ఖుర్ఆన్ సూక్ష్మ ఆయతుల జ్ఞానాన్ని అల్లాహ్
ప్రేరణతో (సంకల్పముతో) మనకు రెండు గ్రంథాలను వాటికి అనుబంధ
గ్రంథాలను వ్రాసి ఇచ్చారు. కాబట్టి స్వర్గానికి తీసుకువెళ్ళే హదీసులను
వదలి, మోక్షానికి తీసుకువెళ్ళే ఖుర్ఆన్ ఆయత్ 40-39, 41 ను తీసుకొని
ఆచరించి, 72 వర్గాలను వదలి నిజమైన అల్లాహ్ మార్గములోనికి రావాలని
అందుకోసము యోగీశ్వరులవారి గ్రంథములను అసూయ లేకుండా చదివి,
అర్థము చేసుకొని ఆచరించి నిజమైన 73వ అల్లాహ్ వర్గములోకి వచ్చి
మోక్షము పొందుదాము (ఖుదా హాఫిజ్. ఖుదాకు మీ ప్రియ భక్తుడి
విన్నపము. నాకు సంపూర్ణ జ్ఞానము ప్రసాదించమని, భగవద్గీత శ్లోకము
17-66 ప్రకారం శరణు వేడుకుంటున్నాను. నా జీవిత ధ్యేయము దైవ
జ్ఞానము తెలుసుకుంటూ దైవసేవగా ధర్మప్రచారము చేసుకోవాలని
నిశ్చయించుకొన్నాను. దానికి కావలసిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించ
మని, మీ దర్శన భాగ్యము కల్పించమని, ఈ జ్ఞానము చెప్పింది. సాక్ష్యాత్తూ
ఖుదా, భగవంతుడే, ఆదరణకర్తేనని సంపూర్ణముగా విశ్వసిస్తూ.... సాష్టాంగ
నమస్కారము చేస్తున్నాను.
ఈ
ఇట్లు మీ ప్రియ భక్తుడు
సయ్యద్ సల్మాన్షా
అసత్యమును వేయిమంది
సత్యమును
చెప్పినా, అది
వేయిమంది కాదనినా, అది
సత్యము కాదు,
అసత్యము కాదు.

Page 98
ఖుర్ఆన్-హదీసు
ఏది ముఖ్యము?
666
Author: The Only Guru of Three Religions
The Spiritual Emperor, Thraitha Theorem Originator
Sri Acharya Prabodhananda Yogeeshwarulu
www.thraithashakam.org

------
Page 1
30
mD
ఇందువు-క్రైస్తవుడా?
(ఇది మతమార్పిడి మీద బ్రహ్మాస్త్రం)
ఇందూ (హిందూ) ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
చక్రం
కాల
చక్రం
ఇందూ
చక్రం
చక్రం
-బ్రహ్మనాడి
నవేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞానవేదిక
(Regd.No. : 168/2004)
1

Page 2
-
ఇందువు క్రైస్తవుడా?
ఈ గ్రంథము యొక్క పేరునుబట్టి ఇదేదో మతద్వేషమునకు సంబంధించినదేమో అని కొందరనుకొనుటకు
అవకాశముకలదు. మా గ్రంథములలో మతసామరస్యమే ఉంటుందిగానీ, మతద్వేషము ఉండదు. మేము అన్ని
మతములనూ, అన్ని మత గ్రంథములనూ సమాన దృష్టితో చూస్తాము. అందువలన మా వద్ద మతద్వేషము అను
మాటే ఉండదు. ఏ మతస్థుడైనా దేవునికీ, దేవుని జ్ఞానమునకూ వ్యతిరేఖముగా ప్రవర్తించు చుండినా, బోధించుచుండినా,
దేవుని పక్షముననున్న నేను దానిని ఖండించడము జరుగుచుండును. వారు చేయుచున్న తప్పును ఖండించడమే
కాక, వారి తప్పును శాస్త్రబద్ధముగా తప్పని వివరించి చెప్పి, అటువంటి తప్పును చేయకుండునట్లు వారికి పూర్తిగా
అర్థమయ్యేలాగున చేయుదుము. దేవుని వైపునుండి నేను చేయవలసిన పని అదియే, కనుక ఎవరి తప్పునైనా విప్పి
చెప్పవలసి వచ్చుచున్నది.
గతములో 'ఋజుదర్శిని' అను పుస్తకమును చూచి, అందులో మతద్వేషము తప్ప వేరు జ్ఞానములేదని
గ్రహించి, అందులోని లోపములను తీసివేస్తూ, దేవుని జ్ఞానమునకు విలువ ఉండునట్లు, దానిని కొన్ని విషయము
లలో ఖండించుచూ, కొన్ని విషయములలో సవరించుచూ ప్రత్యేకముగా ఒక గ్రంథమును వ్రాయవలసివచ్చినది.
అలా వ్రాసిన గ్రంథము పేరు “మతాతీత దేవుని మార్గము”. ఇప్పుడు కూడా ఇందువు క్రైస్తవునిగా మారగలడా అను
సమస్యను వివరిస్తూ, ఒక ఇందువు ఎప్పటికీ క్రైస్తవునిగా మారలేడని, ఎవరూ మార్చలేరని తెలుపుచూ
“ఇందువు-క్రైస్తవుడా?” అను గ్రంథమును వ్రాయవలసి వచ్చినది. ఇందులో దేవుని జ్ఞానమునకు వ్యతి రేఖముగాయున్న
విషయములను మాత్రము ఖండించి, సరియైన మార్గమును చూపుచూ వ్రాయడము జరిగినదని ముందే చెప్పుచున్నాము.
దేవుని మార్గములోని కంపనూ, కల్లనూ తీసివేసి, దేవుని జ్ఞానములో మనుషులు కలుపుకొన్న కాలుష్యమును తీసివేసి,
స్వచ్ఛమైన మార్గమునూ, స్వచ్ఛమైన జ్ఞానమునూ అందివ్వడమే ఇందులోని ఉద్దేశ్యము. దైవ గ్రంథములను ఆధారము
చేసుకొని, వాటిలో దేవుడు సూచించిన జ్ఞానమునే చూపుచూ, దాని ప్రకారము మనుషులు చేయుచున్న తప్పులను
తెలుపడము తప్ప స్వయముగా నేను దేనినీ ఖండించలేదు.
భూమిమీద ప్రతి మనిషీ ఏదో ఒక మతములోనున్న కుటుంబములో పుట్టడము జరుగుచున్నది. నేను
హిందువుల కుటుంబములో పుట్టాను. పుట్టిన కొన్ని సంవత్సరముల వరకు మతము అనుమాటే నాకు తెలియదు.
కొంత కాలము గడచిన తర్వాత నేను ఏ మతములో పుట్టానో తెలియకున్నా, మొదట ఇతర మతములను గురించి
కొంత తెలియడము జరిగినది. వాడు ముస్లీమ్, వీడు క్రైస్తవుడు అని కొందరంటూవుండగా విన్నానుగానీ, మతము
అనునది మానవ జీవితములో ఎంతో లోతుగా చొచ్చుకొని పోయినదని తెలియదు. తర్వాత కొంత కాలమునకు
నేనున్నది హిందూమతమని తెలిసిపోయినది. కొన్ని దేవతారాధనలు చేయు సందర్భములో మేము హిందువులము
అను విషయము కొంత అర్థమైనది. నేను హిందూ మతములో పుట్టిన దానివలన చాలా ఆలస్యముగా నేనున్న
మతమును గురించి నాకు తెలిసినది. అదే ముస్లీమ్ కుటుంబములోగానీ, క్రైస్తవ కుటుంబములోగానీ పుట్టియుంటే
ఏడు లేక ఎనిమిది సంవత్సరముల లోనే నేను ఫలానా మతస్థుడనని తెలిసిపోయివుండెడిది. ఎందుకనగా! వారు
చిన్న వయస్సు పిల్లలను కూడా వారి ప్రార్థనలలో పాల్గొనునట్లు చేయడము వలన చిన్న వయస్సులోనే వారి మతమును
2

Page 3
ఇందువు-క్రైస్తవుడా?
గురించి, వారు ఆరాధించు దేవుని గురించి వారికి కొంత తెలియును. అలా చిన్న వయసులోనే ప్రారంభమైన
మతాభిలాష వయస్సు పెరుగుకొద్దీ మతాభి మానముగా కూడా పెరిగిపోవును. ఎప్పుడైతే ఇది నా మతమని
దానిమీద అభిమానమును మనిషి పెంచుకొనునో, అప్పుడు తనకు తెలియకుండగనే ఇతరుల మతముల మీద
అసూయ పెరిగిపోవును. ఎక్కడ మాట్లాడినా తన మతమును గురించి గొప్పగా, ఇతరుల మతములను గురించి
తక్కువగా మాట్లాడడము మొదలు పెట్టును. వయస్సు పెరుగుకొద్దీ స్వమతాభిమానము ఒకవైపు, పరమత ద్వేషము
మరొకవైపు పెరిగి, చివరకు మనిషి పూర్తి ఒక మతవాదిగా మారిపోవుచున్నాడు. పుట్టుకలో మత ప్రసక్తే లేని మనిషి
తాను పుట్టిన కుటుంబమునుబట్టి, కుటుంబములోని వారు తనవారేననీ, అట్లే తన కుటుంబము యొక్క మతమే
తన మతమని అనుకోవడము జరుగుచున్నది.
ఇదంతయు గమనిస్తే ఒక మనిషి ఒక మతమును గురించి చెప్పుకోవడము భూమిమీద సహజ
సిద్ధమైపోయినది. ఒక మనిషి ఒక మతమును సమర్థించుచూ మాట్లాడడము సహజమైనప్పుడు, ఇతర మతములను
గురించి వ్యతిరేఖముగా మాట్లాడడము కూడా సహజసిద్ధమై పోయివుండును. తనది అనుకొని ఒక మతమును
సమర్థించు మనిషి. ఇతరులదని మిగత మతములను విమర్శించుచుండును. దీనినిబట్టి ఒక మనిషిలో అన్ని
మతములను సమానముగా గౌరవించు మతసామరస్యము ఉండదని తెలియుచున్నది. సాధారణ మనిషి అయినవాడు
మిగత మతమును గురించి విమర్శించలేరు, తన మతమును గౌరవించినట్లే ప్రక్కనున్న మరొక మతమును కూడా
గౌరవించుచున్నాడు అంటే, అది కొంత గొప్పగానే బయట ప్రజలకు కనిపించును. అయినా అందులో మనము
గమనించవలసినది ఏమనగా! భూమిమీద ముఖ్యముగాయున్న మూడు మతములలో, ఒక మతములోని వ్యక్తి
మిగిలిన రెండు మతములలో ఒక మతమును గూర్చి మాత్రము కొంత గౌరవముగా మాట్లాడుచుండును. అయితే
మిగిలిన మరొక మతము మీద పూర్తి అసూయ కల్గియుండును. తన మతము మీద ఎంత ప్రేమగలదో రెండవ
మతము మీద అంత ప్రేమ లేకున్నా, కొన్ని విషయములలో రెండవ మతములోని కొన్ని గ్రంథములను సమర్థించి
మాట్లాడుట వలన, అతను రెండవ మతమును సమర్థించినట్లు కనిపించినా, అది తన మతమును అభివృద్ధి
చేసుకొనే దానికేనని ఎవరికీ తెలియదు. అటువంటివాడు మూడవ మతము మీద పూర్తి ద్వేషము కల్గియుండును.
మూడు మతములను సమానముగా గౌరవించువాడు బహుశా ఎవడూ ఉండడు. తన మతము మీద ప్రేమ
గల్గినవాడు రెండవ మతమును కొంత సమర్థించినా, అదియూ తన మతమును పెంచుకొనుటకే అని చెప్పాము.
కొంతయినా భేద భావము లేకుండా మూడు మతములను ఆదరించువాడు, ఒకే గౌరవముతో మాట్లాడువాడు
ఎవడైనా భూమిమీద ఉంటే, వాడు సాధారణ మనిషియై ఉండడు.
ఒక మతస్థుడు రెండవ మతమును కొంత సమర్థించడము అక్కడక్కడ కనిపించుచున్నది. అటువంటివాడు
రెండవ మతమును పూర్తిగా సమర్థించక, తన మతము అభివృద్ధి అగుటకు కావలసిన విషయములను మాత్రము
సమర్థించుచుండును. ఉదాహరణకు కొందరు క్రైస్తవ బోధకులు హిందూమతములోని వేదములను సమర్థించుచూ,
అందులోని కొన్ని వాక్యములను
కొన్ని వాక్యములను గొప్ప వాక్యములుగా చెప్పుచుందురు. అటువంటివారు హిందూమతమును పూర్తిగా
సమర్థించకుండా, హిందూమతములోని వేదములను మాత్రము సమర్థించి చెప్పుచుందురు. అదియూ వేదములందు
తమ మతమునకు ఉపయోగపడు కొన్ని శ్లోకములను మాత్రము తీసుకొని వాటికి అర్థము చెప్పుచుందురు. అట్లు
3

Page 4
ఇందువు-క్రైస్తవుడా?
చెప్పబడు విషయమంతయు తమ మతమును ఉద్దేశించి వేదములలో కూడా కలదనీ, వేదములు కూడా తమ
మతమును సమర్థించుచున్నవనీ చెప్పుచుందురు. ఈ విధముగా తమ మతమును అభివృద్ధి చేసుకొను నిమిత్తము
కొందరు క్రైస్తవ బోధకులు హిందూమతములోని వేదములను సమర్థించుచున్నారు. అంతమాత్రమున వారు
హిందూమతమునంతటినీ సమర్థించారనుకోవడము పొరపాటు. హిందూమతములోని గ్రంథములలో గల కొన్ని
శ్లోకములను లేక కొన్ని వాక్యములను తమ మతమును సమర్థించుచున్నవని చెప్పుచూ, చివరకు తమ మతమును
గురించి ప్రచారము చేసుకొనుచుందురు. వేదములలో ఏసును గురించి చెప్పారనీ, వేదములలో రక్తప్రోక్షణము
వలన పాప పరిహారము కలదని చెప్పారనీ, ఇంకా ఎన్నో విషయములు క్రైస్తవ మతమును గురించి వేదములలో
చెప్పియున్నారనీ ప్రచారము చేయుచుందురు.
అదే విధముగా ముస్లీమ్లలో కొందరు బోధకులుగాయున్నవారు కొన్ని సంఘములను ఏర్పరచుకొని,
తాము ఇతర మతములను కూడా సమానముగా గౌరవిస్తామని చెప్పుకొనుచుందురు. అటువంటివారు
హిందూమతములోని వేదములను, ఉపనిషత్తులను, పురాణములను, చివరకు భగవద్గీతను కూడా వాడుకొనుచూ,
అందులో వారికి అవసరమైన శ్లోకములను, వాక్యములను, పద్యములను చెప్పుచూ అవన్నియూ తమ మతమును
బలపరుస్తున్నవని చెప్పి ప్రచారము చేసుకొనుచుందురు. ఇదంతయు ఒక పథకము ప్రకారము తమ మతమును
ప్రచారము చేసుకొను నిమిత్తము చెప్పునది తప్ప, హిందూమతమును పూర్తిగా సమర్థించుటకు కాదు. ఉదాహరణకు
దేవుడు మనిషివలె పుట్టడు అను ఖుర్ఆన్లోని విషయమును సమర్థించుటకు, దానికి సరిపడు శ్లోకమును
భగవద్గీతనుండి చెప్పి, ఖుర్ఆన్లో చెప్పిన విషయమునే భగవద్గీతలో కూడా చెప్పారని చెప్పుచుందురు. ఇక్కడ
హిందూమతములోని భగవద్గీతనూ, దానిలోని శ్లోకమునూ చెప్పినా, అది తమ మతమును ప్రచారము చేయు
నిమిత్తమేనని తెలియుచున్నది. భగవద్గీతలోని వారికి అవసరమైన శ్లోకములను మాత్రము తీసుకొని చెప్పుదురుగానీ,
భగవద్గీతలో దేవుడు మనిషిగా పుట్టుతాడు అని ఉన్న శ్లోకమును మాత్రము చెప్పరు.
వేదములు, వేదములలోని ఉపనిషత్తులు, భగవద్గీత మరియు పురాణములను అన్నిటిని ఉ
పయోగించుకొనుచూ, ఎక్కడ ఏది అవసరమో దానిని చెప్పుచూ క్రైస్తవులు తమ మతమును ప్రచారము చేసుకోగా,
అలాగే ముస్లీమ్లు కూడా ప్రత్యేకముగా సంఘములను ఏర్పరచుకొని, ఆ సంఘముల అధ్యక్షులు ఒకరికంటే
మరొకరు పోటీగా హిందువుల గ్రంథములను వాడుకొనుచూ, అందులోనుండి వారికి అనుకూలమైన శ్లోకములను,
వాక్యములను వాడుకొనుచూ, వారి మతమును గొప్పగా చెప్పుకోవడము జరుగుచున్నది. ఇదంతయు గమనిస్తే
హిందూమతములోని గ్రంథములన్నియు ఇటు బైబిలునూ, అటు ఖుర్ఆన్ గ్రంథమునూ సమర్థిస్తున్నట్లు
కనపడుచున్నది. హిందూమతమును చూపించుచూ మిగతా రెండు మతములు తమ తమ మతములను ప్రచారము
చేసుకోవడము తప్ప, వారు హిందూ మతమును సామరస్యముగా చూచినట్లు ఏమాత్రము కనిపించడములేదు.
మొత్తము మీద మతపిచ్చి తప్ప దైవభావముగానీ, జ్ఞానప్రసక్తిగానీ వీరి పనులయందు కనిపించడములేదు. ఇక్కడ
కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా! అన్నిటిని సృష్టించిన దేవుడు మతములను ఎందుకు సృష్టించాలి?
అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలా కలదు.
4

Page 5
ఇందువు-క్రైస్తవుడా?
దేవుడు జ్ఞానమును సృష్టించాడుగానీ, మతములను సృష్టించలేదు. మతము అనునది ప్రాథమిక అజ్ఞానమని
మేము చాలామార్లు చెప్పాము. దేవుడు తన జ్ఞానమును రెండు దేశములలో నాలుగుమార్లు తెలియజేశాడు. దేవుడు
తన ధర్మమును అనుసరించి ఎవరితోనూ నేరుగా మాట్లాడడు. అయితే ఆయన (దేవుడు) ప్రత్యక్షముగా ఎవరితో
మాట్లాడకున్నా, పరోక్షముగా మాట్లాడవచ్చునను సూత్రమును బట్టి, తన జ్ఞానమును గ్రహములైన ఇద్దరిచేత
రెండుమార్లు, మనుషులవలెనున్న తన దూతలచేత రెండుమార్లు, రెండు దేశములలో తన జ్ఞానమును చెప్పించాడు.
అలా చెప్పించిన జ్ఞానములో ఒక గ్రహమూ, ఒక దూత (మనిషివలెనున్న భగవంతుడు) చెప్పిన జ్ఞానము భగవద్గీత
అను ప్రథమ దైవ గ్రంథముగా బయలుపడినది. అట్లే మరొక గ్రహము చెప్పిన జ్ఞానము ఖుర్ఆన్ గ్రంథము గానూ,
వచ్చిన దూత చెప్పిన జ్ఞానము బైబిలు గ్రంథముగానూ తయారు కావడము జరిగినది. మొత్తము మీద దేవుడు
తెలియజేసిన దేవుని జ్ఞానము మూడు గ్రంథములైనది. ఆ మూడు గ్రంథములలోనిది దేవుని జ్ఞానమే, కనుక ఆ
మూడు గ్రంథములను మూడు దైవ గ్రంథములని చెప్పడము జరిగినది.
దేవుడు తన విధానమ ులను (ధర్మములను) మనుషులకు తెలుపుటకు మూడు దైవ గ్రంథములను,
మూడు కాలములలో ఇవ్వగా, మనిషి ఆ మూడు గ్రంథములను తీసుకొని, దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము
కాకుండా, తన స్వంత జ్ఞానముతో మూడు గ్రంథములను మూడు మతములను పుట్టలుగా తయారు చేసుకొని
తాము ఆ పుట్టలలో నివశించు చెదలుగా మారిపోయాడు. ప్రపంచములో దేనిని చేయుటకుగానీ ఏమాత్రము
స్వతంత్రత లేని మనిషికి, దేవుడు ఒకే ఒక స్వాతంత్ర్యమును ఇచ్చాడు. ఒకే ఒక దేవుని విషయములో మాత్రము
మనిషికి స్వతంత్రము కలదు. ప్రపంచ విషయములలో మనిషికి ఏమాత్రము స్వతంత్రత లేదు. మనిషిని కర్మ
తన వశములో ఉంచుకొని కర్మప్రకారమే నడిపించుచున్నది. దేవుని విషయములలో కర్మ పని చేయదు.
కర్మాతీతమైనది దైవము. అందువలన దేవుని విషయములో మనిషిని తన ఇష్టము ప్రకారము నడుచు కొనునట్లు
దేవుడే మనిషికి స్వాతంత్ర్యమునిచ్చాడు. దేవుని విషయములో స్వాతంత్ర్యత కల్గిన మనిషి దేవుడిచ్చిన మూడు దైవ
గ్రంథములను తీసుకొని తన ఇష్టమొచ్చినట్లు మూడు మతములను సృష్టించి, వాటికి ఆధారము మూడు గ్రంథములని
భగవద్గీతను, బైబిలును, ఖుర్ఆన్ను చూపడము జరిగినది. అలాచూపడమే కాకుండా మూడు దైవ గ్రంథములను
మూడు మత గ్రంథములుగా వర్ణించి చెప్పడము జరిగినది. అందువలన మూడు మతములలో ఒక్కొక్క మతమువారు
ఒక్కొక్క గ్రంథమును తమ మత గ్రంథముగా చెప్పుకొంటున్నారు. తాము ఖుర్ఆన్ గ్రంథము ప్రకారము
అనుసరించుటవలన తమది ప్రత్యేక మతముగా ఉన్నదని ముస్లీమ్లు అనుచున్నారు. అట్లే తాము బైబిల్ గ్రంథమును
అనుసరించుట వలన క్రైస్తవులమైనామని కొందరంటున్నారు. అదే విధముగా తాము ముస్లీమ్, క్రైస్తవులకు వేరుగానున్న
హిందూమతముగా ఉన్నామని కొందరంటున్నారు. అయితే హిందువులలో కొందరు తమ గ్రంథము భగవద్గీతయని,
కాదు తమ గ్రంథములు వేదములని కొందరూ అంటున్నారు. క్రైస్తవ మతము వారికి బైబిలు, ముస్లీమ్ మతము
వారికి ఖుర్ఆన్ గ్రంథము ఆధారమని వారు చెప్పుచుండగా, హిందువులు మాత్రము తమ గ్రంథమేదో కూడా
సరిగా తెలియని స్థితిలో ఉంటూ కొందరు భగవద్గీతయంటే, కొందరు వేదములని అంటున్నారు. అంతేకాక
ముస్లీమ్లు తమ దేవుడు “అల్లాహ్” అనీ, క్రైస్తవులు తమ దేవుడు “యెహోవా” అని అంటూ ఉంటే, హిందువులు
మాత్రము తమ దేవుడు ఎవరో చెప్పలేని స్థితిలో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవున్ని తెలుపుచూ, రాముడని,
రంగడని, విష్ణువని, ఈశ్వరుడని అనేక మందిని చెప్పుచున్నారు.
5

Page 6
ఇందువు-క్రైస్తవుడా?
ఆధ్యాత్మిక విషయములలో జీవునికి స్వాతంత్ర్యమునిచ్చి, దైవ మార్గములో కర్మబంధము లేకుండా దేవుడు
చేసి, మనిషికి స్వేచ్ఛనిచ్చుట వలన మనిషి తన భక్తి మార్గములోనే మతమును సృష్టించుకొన్నాడు. మతము
అనునది దైవమార్గములో ముఖ్యమైన విశ్వాసమార్గమని అనుకొని, ఈ మతములో తప్ప ఏ మతములోనూ దేవుడు
తెలియబడడు అని చెప్పుకొనుచూ, తమ మతమే నిజమైన దేవుని మార్గమను నమ్మకముతో ప్రతిమనిషి యున్నాడు.
మతము అనునది దైవమార్గములో ప్రాథమిక అజ్ఞానమని తెలియలేకపోయారు. క్రైస్తవులలో, ముస్లీమ్లలో మతము
వరకే అజ్ఞానము ఆగక, ఇంకా కొంత ముందుకు ప్రాకి మతములోనే కొన్ని తెగలు ఏర్పడి, మా తెగయే దేవునికి
దగ్గరగాయున్నదని ఎవరికి వారు అనుకోవడము జరిగినది. ఆ రెండు మతములలో క్రైస్తవులు కొన్ని తెగలుగా ఉ
ండగా, ముస్లీమ్లు ఏకంగా 74 తెగలుగా ఉన్నట్లు వినికిడి. అందులో “జమాయతే ఇస్లామ్” తెగ ప్రత్యేకమైనదికాగా
మిగతాది సున్నీ జమావత్ తెగ అనియూ, సున్నీ జమావత్ తెగలోనే 73 భాగములున్న వనియూ, కొందరు ముస్లీమ్
పెద్దలు చెప్పగా విన్నాము. ఇక హిందూ మతమును చూస్తే కులములను పేరుతో వందలసంఖ్యతో హిందూమతము
కలగూర గంపవలెకలదు. ముస్లీమ్ మతములో సున్నీ జమావత్ తెగకంటే జమాయతే ఇస్లామ్ తెగవారు మేమే
నిజమైన భక్తులము, మా మార్గమే దేవునికి దగ్గరగా యున్న మార్గమని ఏక్మినార్ మస్జీద్లను ఏర్పరచుకొని
చెప్పుచుండగా, సున్నీ జమావత్ వర్గమువారు మేము ఎన్ని చీలికలుగాయున్నా జమాయతే ఇస్లామ్ తెగకంటే మేమే
దైవమార్గములో ముందున్నామని చెప్పుకొనుచూ, రెండు మీనార్ల మస్జీద్లు ఏర్పరచుకొని ప్రత్యేకముగా
కనిపించుచున్నారు.
క్రైస్తవులు, ముస్లీమ్లు వర్గములు, చీలికలు అను రూపములో ఉండగా, హిందూ మతము కులములను
రూపములో అనేక రంగుల గుడ్డలతో కుట్టిన బొంతగా తయారైపోయినది. అలా తయారవడమేకాక అందులో ఒక
వర్ణము (కులము) వారు దేవుని ముఖమునుండి పుట్టినవారనీ, వారే దేవునికి దగ్గరవారనీ, మిగతా కులముల
వారందరూ దేవునికి చేతుల యందునూ, తొడలయందునూ, పాదములయందునూ, పుట్టారనీ, చేతుల యందు
పుట్టిన క్షత్రియులు రాజ్యమును పాలించు రాజులుగా ఉండవలెననీ, తొడలయందు పుట్టిన వైశ్యులు ఒకచోట
కూర్చొని వ్యాపారము చేసుకోవాలని, పాదములందు పుట్టిన శూద్రులు పైన పుట్టిన మూడు తెగలవారికి సేవలు
చేయు నిమిత్తమే ఉండవలెననీ, దేవుని ముఖమునందు పుట్టిన బ్రాహ్మణులు మాత్రము దేవుని ఆరాధన చేయుచూ
దేవునికి దగ్గరగా ఉందురని ప్రచారము చేసుకొన్నారు. అలా ప్రచారము చేయడమేకాక ప్రథమ దైవ గ్రంథమైన
భగవద్గీతలో జ్ఞానయోగమున పదమూడవ (13) శ్లోకమునందు “చాతుర్వర్ణ్యం మయా సృష్టం” నాలుగు వర్ణములను
మనుషులలో సృష్టించాను అని దేవుడు చెప్పగా దానిని వక్రీకరించి దేవుడు చెప్పిన భావమును వదలి తాము
స్వంతముగా అర్థము చెప్పుచూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు రకముల మనుషులను దేవుడు
సృష్ఠించాడని చెప్పారు.
జనాభా శాతములో 90 పాళ్ళుగల శూద్రులను మిగతా వారికి సేవ చేయు నిమిత్తము నియమించి వారిచేత
పనులను చేయించుకొనుచూ, దేవుని జ్ఞానమునకు పూర్తి దూరముగా ఉంచారు. ఈ విధముగా హిందువులలో 90
శాతము మనుషులను దేవునికి దేవుని జ్ఞానమునకు దూరముగా ఉంచి, అంటరానివారిగా చెప్పి తమ వెంటవచ్చునట్లు
చేసుకొన్నారు. మతమనునదే పెద్ద అజ్ఞానమని మేము చెప్పుచుండగా అందులో చీలికలు మరీ అజ్ఞానము.
6

Page 7
ఇందువు-క్రైస్తవుడా?
ప్రత్యేకించి హిందూమతములో శూద్రులను పేరుతో వారి మెదడులో దేవుడను భావము రాకుండా చేసి, దేవునికి
అంటరాని వారని, దేవుని జ్ఞానమునకే దూరముగా ఒక వర్ణము వారు ఉంచడము అజ్ఞానములో మరీ పెద్ద అజ్ఞానమని
చెప్పవచ్చును. ఎవరైనా శూద్రులుగా యున్న మాలాంటివారు దేవుని జ్ఞానమును బోధించితే, అగ్రవర్ణముగా
పేరుగాంచినవారు పూర్తి అసూయచెంది, మేము తప్ప శూద్రులు ఎవరూ దైవజ్ఞానమునకు అర్హులు కాదను ఉ
ద్దేశ్యముతో, యోగిగా యున్న మేము చెప్పు జ్ఞానము కూడా హిందువులది కాదనీ, పరమతమును బోధించుచున్నామనీ,
ఏమీ తెలియని వారిని ప్రేరేపించి, మా మీదికి కూడా దాడులకు పంపినవారు కలరు. పైగా తాము హిందూధర్మ
రక్షకులమని, మేము మా మతమును రక్షించు కొనుటకు భౌతికదాడులైనా చేస్తామని చెప్పుకొంటున్నారు. తమకు
ఇష్టము లేని శూద్రులు జ్ఞానమును చెప్పితే, వారు హిందువులైనా పరమతము వారుగా కనిపిస్తారంటే హిందూమతము
కులము అను అజ్ఞానములో ఎంతగా కూరుకుపోయివున్నదో చెప్పకనే అర్థమగుచున్నది.
క్రైస్తవ, ముస్లీమ్ మతములు రెండూ కొన్ని చీలికలుగాయున్నా అవి అన్నియు దేవుని విషయములో ముందుకు
పోవుటకు పోటీపడుచున్నవి. ఒక దానికంటే మరొకటి ముందున్నామని చెప్పుకొంటున్నవిగానీ, హిందూ మతములో
90 శాతము జనాభాయున్న శూద్రులను దేవుని జ్ఞానమునకు పూర్తి అనర్హము చేసినట్లు మిగతా ఏ మతములోగానీ,
ఏ తెగనూ అంటరాని అనర్హులుగా చేయలేదు. హిందూమతము తప్ప మిగతా మతములవారు ఎన్ని తెగలుగా
వారి అంతర్గతములోయున్నా బయటికి మాత్రము మా మతము మిగతా మతములకంటే గొప్పదనీ, దేవునికి దగ్గరగా
యున్నదని చెప్పుకొనుచుందురు. మిగతా రెండు మతములైన క్రైస్తవ, ముస్లీమ్ మతములు రెండూ, దేవుని
విషయములో ఏమీ తెలియక అనర్హులుగాయున్న హిందూమతములోని 90 శాతము శూద్రులను తమవైపు
ఆకర్షించుకొని, తమ మతమును పెంచుకోవాలని ప్రయత్నము చేయను మొదలుపెట్టాయి. ఈ విధముగా
ప్రయత్నము చేయు రెండు మతములలో క్రైస్తవ మతము ముందంజవేసి శూద్రులుగాయున్న అన్ని కులముల
వారికి కొంత జ్ఞానము చెప్పి, జ్ఞానము యొక్క రుచి చూపించి తమవైపు లాగుకొన్నారు. జ్ఞానము మీద శ్రద్ధలేని
వారికి కొంత ఉద్యోగ అవకాశములు ఇచ్చి బ్రతుకుతెరువును చూపించి కొందరినీ, ఆర్థిక ఇబ్బందులు తీర్చి కొందరినీ,
చేసుకొన్న పాపములు లేకుండా పోతాయని చెప్పి కొందరినీ తమవైపు లాగుకొని క్రైస్తవులుగా మార్చుకొన్నారు.
తమ గ్రంథమే ఆఖరి గ్రంథమనీ, దీని తర్వాత దేవుని జ్ఞానమే లేదనీ, నిజమైన దేవుడు మా మతములోనే తెలియుననీ,
వారి ఉపాయముకొద్ది వారు చెప్పుచూ కొంతమంది హిందువులను ముస్లీమ్లు లాగుకొన్నారు. వర్షము వచ్చిన
రెండవరోజు భూమి నుండి ఉసుర్లు (ఒకజాతి పురుగులు) బయటికి వస్తే సులభముగా దొరికే ఆహారము కదాయని
తేళ్ళు, కప్పలు మొదలగునవి తినుటకు వచ్చినట్లు సులభముగా తమ మాటలకు లొంగు హిందువులమీద మిగతా
రెండు మతములూ వాలిపోయి, ఎవరికి దొరికిన వారిని వారు తమ మతములో చేర్చుకొని వారి మత ముద్రవేసి,
హిందువు అను పేరును లేకుండా చేయుచున్నారు.
ఊరకనే దొరకు ఉసుర్లను తేళ్ళు, కప్పలు సులభముగా చిక్కించుకొని భక్షించునట్లు హిందూమతములో
దేవుని జ్ఞానము ఏ దారీ తెలియని హిందువులను క్రైస్తవులు, ముస్లీమ్లు సులభముగా
తమ మతములోనికి చేర్చుకోవడము జరుగుచున్నది.
జరుగుచున్నది. ముస్లీమ్లు కొంత ఆలస్యముగా ఆ పనిని ప్రారంభించినా,
క్రైస్తవులు తెలివిగా ముందే వేట ప్రారంభించి భారతదేశములోని హిందువులను నలభై (40) శాతము పైగా
7

Page 8
ఇందువు-క్రైస్తవుడా?
క్రైస్తవులుగా మార్చివేసుకొన్నారు. కొన్ని ప్రాంతములలో నూటికి తొంభైమంది హిందువులనుండి క్రైస్తవులుగా
మారిపోయారు. కొంత ఆలస్యముగా తమ మతము క్షీణించిపోవుచున్నదని తెలుసుకొన్న హిందువులు స్వమత
రక్షణ అను నినాదమును తెరపైకి తెచ్చారు. చెరువులోని చేపలన్నిటినీ బెస్తవారే (మత్స్యకారులే) పట్టుకొని పోతే
మాకు ఏమీ మిగలవని తలచిన కొంగలు బెస్తవారు తమ చెరువు దగ్గరకు రాకుండా చేయుటకు, చెరువు దగ్గరకు
వచ్చిన వారిమీద దాడిచేసి, ముక్కుతో పొడిచి, కాళ్ళతో రక్కి, రెండూ చేతకానప్పుడు చివరకు వారినెత్తిన రెట్టవేసి
చెరువుకు దూరముగా పోవునట్లు చేసెడివట.
బెస్తవారు చేపలను అమ్ముకొని బ్రతకాలనుకుంటే, వారినుండి కాపాడునట్లు కనపడు కొంగలు, చేపలను
తామే తినవలెనని స్వార్థముతో దాడిచేశాయిగానీ, చేపలమీద దయతోకాదు. నెలకొకరో, వారమునకొకరో సమీప
గ్రామమున ఎవరైనా చనిపోతే, వారు శవము యొక్క అంత్యక్రియలు చేసిన తర్వాత చేపలు తమ కాళ్ళను తాకకుండా
దూరము పోవునట్లు నవధాన్యములను చెరువులో కలిపి స్నానము చేసిపోయెడివారు. అయితే అలా అంత్యక్రియల
తర్వాత స్నానమునకు వచ్చి నవధాన్యములు చెరువులో కలిపి చేపలకు మంచి చేయు వారిని చూచిన కొంగలు,
వారు కూడా చేపలు పట్టనువచ్చారని తలచి, స్నానము చేయను వచ్చిన వారిమీద కూడా కొంగలు దాడి చేశాయట.
చేపలకు ధాన్యము వేసి అవి పెరుగుటకు సహకరించు వారిమీద కూడా కొంగలు దాడిచేయడము చూచి అక్కడికి
వచ్చినవారు, ఆ కొంగలకు గ్రుడ్డికొంగలని పేరుపెట్టారు. అలా పెట్టిన పేరు శాశ్వతముగా నిలిచిపోయినది. మాటల
సందర్భములో గ్రుడ్డి కొంగల వలె పొరపాటుపడినారనుట వినుచుందుము.
హిందూమతములో శూద్రులందరూ చెరువులోని చేపలవలె ఉండగా, అగ్రకులము వారు కొంగలవలె వుండి,
క్రైస్తవులు, ముస్లీమ్లు అను ఇతర మతములవారిని చేపలపట్టు వారుగా (బెస్తవారు) తలచి, తమ మతములో
చేపలవలె నున్న శూద్రులను తమ ఆధీనములో లేకుండా చేయుచున్నారను భావముతో, హిందూ ధర్మరక్షణ
సంఘములను ఏర్పాటు చేసి క్రైస్తవులను, ముస్లీమ్లను తమ మతమువద్దకు రాకుండా చేయుటకు, మత మార్పిడి
చేయకుండా ఉండుటకు కొంత కృషి చేయుచున్నారు. చేపల సంరక్షణ తమ బాధ్యత అని చెప్పుచున్న కొంగలు,
చేపలకు ఆహార ధాన్యమువేసి మంచి చేయు మనుషులమీద కూడా దాడిచేసి, గ్రుడ్డికొంగలవలె ప్రవర్తించి నట్లు,
హిందూ రక్షకులమనువారు తమ మతమునకు జ్ఞానమును చెప్పి, సత్యమును తెలిపి ఇతర కులములకు, మతములకు
లొంగకుండునట్లు చేయు జ్ఞానులను కూడా నమ్మక, వారుచెప్పు జ్ఞానము తెలియక, తమ మతములోని గురువుల
మీద కూడా దాడిచేస్తూ గ్రుడ్డి కొంగలవలె ప్రవర్తించుచున్నారు. కొంగలు ఎవరు మంచివారని తెలియక దాడి
చేసివుండవచ్చును. అయితే హిందూ మతములో జ్ఞానము చెప్పు గురువులు తమ జ్ఞానమునే చెప్పుచున్నారని
తెలిసినా, కులపిచ్చితో మేమే గురువులుగా చెలామణి అవ్వాలి, మాకంటే తక్కువ కులము వారు గురువులుగా
చెలామణి కాకూడదను భావముతో, హిందువులకు జ్ఞానము చెప్పి మేలుచేయు వారిని పరమత బోధకులని పేరుపెట్టి
గురువులైన వారిని కూడా హింసించను మొదలు పెట్టారు. ఈ విధముగా అగ్రవర్ణము వారు హిందూ మతములోని
మిగతా కులముల వారిని పైకి రానివ్వకుండా చేయుట వలన హిందూ మతము అభివృద్ధి కాకుండా, ఉన్నది
ఉన్నట్లు కూడా లేకుండా తొందరగా క్షీణించను మొదలు పెట్టినది.
8

Page 9
ఇందువు-క్రైస్తవుడా?
మేము ఆధ్యాత్మిక విద్యలో యాభై గ్రంథములను రచించి నూట యాభై ఉపన్యాసములను చెప్పినా, మేము
అగ్రకులమువారము కాదను సాకుతో, పరమతమును బోధిస్తున్నాడని నిందవేసి ప్రచారము చేసి ప్రజల నుండి
దూరము చేయాలని హిందూధర్మ రక్షకులమనువారు చాలామార్లు ప్రయత్నించారు. వాస్తవముగా హిందూ ధర్మమంటే
ఏమిటో తెలియని వారు, ధర్మరక్షకులమని పేరు పెట్టుకొన్నంతమాత్రమున ధర్మరక్షకులౌతారా? మేము చెప్పు
జ్ఞానము ముందర వారి యుక్తులు, కుయుక్తులు ఏమీ చేయలేక పోయాయి. చివరకు ప్రజలు మా జ్ఞానములోని
ఔన్నత్యమును గ్రహించిన వారై, మూడు మతముల వారూ మా వద్దకు చేరి ఒకే జ్ఞానమును తెలియుట చేత
అందరూ ఆశ్చర్యపోవడము జరిగినది. మా జ్ఞానములో దేవుడు అను విధానము తప్ప, మతము అను విధానము
లేనిదానివలన, మూడు మతములవారు మా జ్ఞానమును తెలుసుకొని మా మతములు వేరైనా మా జ్ఞానము ఒక్కటే,
మా దేవుడు ఒక్కడే అని చెప్పుకోవడము మాకు సంతోష దాయకమే అయినా, కొందరు హిందువులకే మామీద
అసూయగా ఉండడమూ, అదియూ ఒక వర్గమునకు చెందినవారికే అసూయగా ఉండడమును చూస్తే హిందువులలో
మత మాయయే కాకుండా, కులపిచ్చి అను రోగము కూడా తీవ్రముగా ఉన్నదని చెప్పవచ్చును. ఇంతవరకు నేడు
భూమిమీద మూడు మతములున్న విధానము, ఆ మూడు మతములు ఎంతెంత అజ్ఞానములో ఉన్నది, సూచన
ప్రాయముగా చెప్పుకొన్నాము.
ఇటువంటి పరిస్థితులలో ఒక యోగిగా మేము చేయవలసిన బాధ్యత ఏమిటి? అని యోచించి ప్రజలందరికీ
మూడు మతములలో మాయ ఎంత తీవ్రముగా ఉన్నదో, ఉన్నదున్నట్లు తెలుపాలనుకొన్నాము. అలా తెలుపడము
వలన మతము అను మాయ ఉచ్చులో (వలలో) మనిషి చిక్కుకోకుండా ఉండగలడనీ, అలా ఉన్నప్పుడే మనిషికి
అసలైన జ్ఞానము తెలిసి, అసలైన దేవున్ని ఆశ్రయించగలడని తలచాము. దేవుడు తెల్పిన అసలైన ధర్మములు
మూడు మూల గ్రంథములైన గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో కలవని తెలుపాలనుకొన్నాము. అది తెలిసినప్పుడు
అన్ని మతములు దేవుని దృష్టిలో సమానమని తెలియును. అలా తెలిసినప్పుడు భూమిమీద మతమార్పిడులు అను
సమస్యే ఉండదు. మతమార్పిడులు లేనప్పుడు మతద్వేషములు ఉండవు. అప్పుడు జగత్ ఏక కుటుంబమగును.
జగదేక కుటుంబము అగుటకు మావంతు బాధ్యతగా మేము కృషి చేయవలసియుండును. ఆ నేపథ్యములో
కొన్ని మతములలో మనుషులు చేయు తప్పులను కొన్ని చోట్ల ఎత్తి చూపి వాటిని సవరించవలసియుండును.
అలాగే కొన్ని సందర్భములలో కొందరిని మందలించి మీరు చేయుచున్నది అధర్మమని, అజ్ఞానమని చెప్పవలసి
ఉంటుంది. మరికొన్నిచోట్ల దైవ గ్రంథములలోని వాక్యములను వివరించి చెప్పి, దీని ప్రకారము నడిచినప్పుడే
దేవుడు తెలియునని చెప్పవలసియుంటుంది. కొన్ని సమయములలో కొందరు అజ్ఞానులు మీరు చెప్పునది జ్ఞానమేకాదని
ఎదురుతిరిగి మాట్లాడినా ఓర్చుకొని, సరియైన సమాధానముతో వారిని నిజజ్ఞానమువైపు మార్చ వలసియుంటుంది.
దైవ గ్రంథములను తప్ప మిగతా వేదములను, పురాణములను ఖండించి చెప్పవలసియుంటుంది. ఇవన్నీ చేయుటకు
ముఖ్యముగా మనిషికి ఓర్పు, సహనములు ఉండడమేకాక, నిజమైన దైవ జ్ఞానము తనకు తెలిసివుండాలి. ఇవన్నియూ
తెలిసి మేము ఆత్మప్రేరణతో ప్రజలకు దైవజ్ఞానమును తెలుపాలనుకొన్నాము. ప్రజలలో ఏ మతము వారైనా
ఉండవచ్చును. అయినా అందరికీ సమానముగా వారిలోని తప్పులను తీసివేసి మంచి మార్గమును కలుగజేయాలన్నదే
మా ఉద్దేశ్యము. అందువలన మేము చెప్పు జ్ఞానమును ఎవరుగానీ అసూయతో చూడకుండా శ్రద్ధతో తెలియాలని
తెలుపుచున్నాము.
9

Page 10
ఇందువు-క్రైస్తవుడా?
ఇప్పుడు చెప్పచున్న గ్రంథము పేరు “ఇందువు-క్రైస్తవుడా?” అను ప్రశ్నగా మొదలవుతుంది. ముందు
ఇందూ మతములోనున్న వాడు క్రైస్తవ మతములోనికి మారితే క్రైస్తవుడవుతాడా అన్నది ఇందులోని సమాచారమని
పేరునుబట్టి తెలిసిపోవుచున్నది. అయితే అందరూ అనుకొన్నంత సులభమైన సమాచారము ఇందులో లేదు.
ఇక్కడ ఇందువు అంటే ఏమిటి? క్రైస్తవుడంటే ఏమిటి? అను విషయమును గురించే ఎక్కువగా ఉండును. ఇందులోని
భాగముగా ముందు ఒక ప్రశ్న వేసుకొందాము. అదేమనగా! ఒక ఇందువు లోను అట్లే మరొక క్రైస్తవునిలోను
భౌతికముగాగానీ, మానసికముగాగానీ ఏమి తేడాగలదు? అనునది ప్రశ్న? ఈ ప్రశ్నను గురించి ముందు కొంత
జ్ఞానమును తెలిసిన ఒక మనిషిని ప్రశ్నించి చూద్దాము.
ప్రశ్న :- నీవు ప్రస్తుత కాలములో యున్న మతములలో ఏ మతమునకు సంబంధించిన వాడివి?
జవాబు :- నేను క్రైస్తవ మతస్థుడను. నా మతమును గురించి నీకేమి పని? మీకు ఏమికావాలో దానిని అడగండి.
ప్రశ్న :- దయచేసి ప్రశ్నను నాకు వదలివేయండి. జవాబును మీరు చెప్పండి. సమాజములో మనుషులలోనున్న
కొన్ని అనుమానములను, కొంత అజ్ఞానమును తీసివేయుటకు మిమ్ములను ఈ విధముగా ప్రశ్నించవలసి వచ్చినది.
మీకు తెలిసిన సమాధానమును చెప్పండి. మీ సమాధానమును బట్టి లోకములో ఎందరో బాగుపడగలరు. అందువలన
మీరు కొంత సహనముతో సమాధానము చెప్పండి. ఇప్పుడు మీరు క్రైస్తవులని తెలిసినది. అయితే మీరు బోధకులుగా
ఉన్నారా? లేక సాధారణ మనిషిగా ఉన్నారా?
జవాబు :- నేను క్రైస్తవ మత బోధకుడను. బైబిలును గురించి ఏమడిగినా చెప్పగలను.
ప్రశ్న :- నాకు బైబిలు గురించి సంపూర్ణముగా తెలియదు. బైబిలులోగల అరవై ఆరు (66) పాఠములలో నాలుగు
పాఠములైన మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలు మాత్రము తెలుసు. అవసరమునుబట్టి అందులోని
విషయములడుగ గలను. ఇదంతయు ఇతరులు బాగుపడు నిమిత్తము, జ్ఞానులుగా మారు నిమిత్తము అడుగుచున్నాను
తప్ప వేరు ఉద్దేశ్యము లేదని ముందే చెప్పుచున్నాను. అందువలన మీరు, మీకు తెలిసిన సరియైన, సమాధానమును
ఇవ్వగలరని ఆశిస్తూ, ముందు ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఒక హిందువు (ఇందువు) లో మరియొక క్రైస్తవునిలో
భౌతికముగా ఏమి తేడా ఉన్నది?
జవాబు :- భౌతికముగా ఏమీ తేడా ఉండదు. మానసికముగానే హిందువుకు క్రైస్తవునికి ఎంతో తేడా ఉండును.
హిందువుల మనస్సులో ఎందరో దేవతలు ఉందురు. వారు వానల కాలము వానదేవున్ని, ఎండలకాలము అగ్ని
దేవున్ని పూజించుచుందురు. అలాగే కాలమునుబట్టి వచ్చే పండుగలను ఏర్పరచుకొని శ్రీరామనవమి వచ్చినప్పుడు
శ్రీరామున్ని, ఆంజనేయ జయంతి వచ్చినప్పుడు ఆంజనేయున్ని పూజించుదురు. ఆంజనేయుడు రాముని బంటు,
సేవకుడు అని అందరికీ తెలుసు. అయినా శ్రీరామనవమి రోజు రాముడే దేవుడని పూజించినవారే, ఆంజనేయ
జయంతి రోజు రామున్ని మరచిపోయి ఆయన సేవకున్నే దేవునిగా భావించి పూజించు చుందురు. రాముడు పెద్ద,
ఆంజనేయుడు చిన్న అని చెప్పిన హిందువులే కొన్ని సమయములలో కొన్ని పండుగలలో ఇద్దరికీ సమాన పీట
వేయు చున్నారు. అప్పుడు గురువును శిష్యున్ని ఒకే మంచము మీద కూర్చోబెట్టి ఒకే గౌరవమును ఇచ్చినట్లగును
కదా! అలా చేయడము తప్పుకాదా! అదే విధముగా శివరాత్రి రోజు శివున్ని పూజించి నీవే దేవుడవు, నీవు తప్ప
10

Page 11
ఇందువు-క్రైస్తవుడా?
భూమిమీద నిన్ను మించిన దేవుడు వేరే ఎవరూ లేరని పూజింతురు. కొంత కాలమైన తర్వాత కొన్ని నెలలకే
వినాయక చవితి వస్తే అప్పుడు వినాయకున్ని శివునికంటే ఎక్కువ పూజింతురు. శివరాత్రి రోజు మాత్రము శివున్ని
పొగిడి పూజించినవారు, వినాయక చవితి ఒక రోజు ఉన్న వినాయకున్ని మూడు రోజులు కొంతమంది, తొమ్మిది
రోజులు కొంతమంది, పదకొండు రోజులు కొంతమంది పూజించి చివరి రోజు గొప్పగ ఊరేగింపు చేయుచున్నారు.
శివుని కొడుకు వినాయకుడు అని చెప్పు హిందువులు శివరాత్రి రోజు తండ్రిని దేవుడనుచున్నారు. శివరాత్రి
రోజు తండ్రిని దేవుడనిన వారే మాటమార్చి వినాయక చవితినాడు కొడుకైన వినాయకున్ని దేవుడను చున్నారు.
తండ్రికంటే మించినట్లు ఎక్కువ రోజులు వినాయకున్ని పందిరికట్టి పూజించి శివున్ని ఒక్కరోజు మాత్రము
పూజించడము కొడుకు ముందర తండ్రిని తక్కువ చేసినట్లు కదా! మా లెక్కలో తండ్రి దేవుడా? కొడుకు దేవుడా?
అని అనుమానము వచ్చుచున్నది. ఎక్కడైనా దేవుడు ఒక్కడే ఉంటాడు కదా! అలాంటప్పుడు కొన్నిచోట్ల యజమాని
అయిన రామున్ని దేవుడనినవారే, మరికొన్నిచోట్ల సేవకుడైన ఆంజనేయున్ని దేవుడు అంటున్నారు. శివుని
విషయములో కొచ్చేటప్పటికి శివరాత్రికి తండ్రి అయిన శివుడు దేవుడైతే, వినాయక చవితికల్లా కొడుకైన వినాయకుడే
దేవుడగుచున్నాడు. ఇదేమైనా నీతిగా ఉన్నదా? న్యాయముగా ఉన్నదా? తండ్రికంటే కొడుకును ఎక్కువగా
గౌరవించడముగానీ, సమానముగా పూజించడముగానీ చేయడము వలన తండ్రి అయిన శివున్ని అవమానించి
నట్లు కాదా! మీ మతములో ఎవరు దేవుడో చెప్పలేక ఒక్కొక్కరు ఒక్కొక్క దేవున్ని చెప్పుచున్నారు. ఎక్కడైనా
ప్రపంచమునకు అధిపతి అయినవాడు, ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త అయినవాడు ఒక్కడే దేవుడుంటాడుగానీ,
ఇంతమంది దేవుళ్ళుంటారా? చివరికి జంతువులను కూడా దేవునిగా చెప్పుకొను మానసిక స్థితిలో హిందువులున్నారు.
క్రైస్తవులైన మేము ಅಲ್ಲು లేము. మాకు ఒక్కడే దేవుడు ఆ దేవున్నే ప్రార్థిస్తాము తప్ప ఇతరులను ప్రార్థించము.
అందువలన హిందువులు, క్రైస్తవులు అందరూ మనుషులే అయినా హిందువుల మనోభావములు వేరుగా ఉన్నాయి.
క్రైస్తవుల మనో భావములు వేరుగా ఉన్నాయి.
ప్రశ్న :- మీరు చెప్పిన విషయముతో మేము కూడా ఏకీభవిస్తాము. అయితే హిందువులైన వారంతా మీరు చెప్పుచున్నట్లే
ఉన్నారా అని చూస్తే ఎక్కువ శాతము అలాగేయున్నా, బహుకొద్దిమంది హిందువుల దైవగ్రంథముగా చెప్పుచున్న
భగవద్గీత యొక్క జ్ఞానము ప్రకారము ఒకే దేవున్ని ఆశ్రయించి, ఒకే దేవున్ని ఆరాధించుచూ, దైవ జ్ఞానమును
అనుసరించి పద్ధతిగా యున్నారు. మీరు మనోభావములో ఒకే దేవున్ని ఒకే జ్ఞానమును ఆశ్రయించినట్లే హిందువులలో
కూడా కొందరు ఉండుట వలన వారు మీతో సమానముగా ఉన్నట్లే కదా? అటువంటి వారు మీతో సమానముగా
దైవమార్గములో ఉన్నారని ఒప్పుకుంటారు కదా?
జవాబు :- హిందూమతములో ఒకే దేవున్ని ఆశ్రయించి, ఇతర దేవతలను ఒప్పుకోకుండా ఉన్నవారిని నేను ఎక్కడా
ఇంతవరకు చూడలేదు. అందువలన మా భావములో హిందువులు అంటే మార్గము తప్పి నడచు వారని మేము
లెక్కించుకొన్నాము. అయితే మీరు చెప్పినట్లు భగవద్గీత ప్రకారము ఒకే దేవున్ని ఆశ్రయించినవారు హిందువులలో
ఎక్కడైనా ఉంటే, అటువంటి వారిని మాతో సమానముగా ఒకే దేవున్ని ఆరాధించువారిగా లెక్కింతుము. అయితే
మా బైబిలు ప్రకారము “యెహోవా” ఒక్కడే దేవుడు అని మేము అనుకొంటాము. ఆ విషయమును తెలిపినది
దేవుని కుమారుడయిన ఏసు. ఏసు పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా, ధరించుటకు రెండవ వస్త్రము లేకుండా,
11

Page 12
ఇందువు-క్రైస్తవుడా?
నిరాశగా బ్రతికి మూడు సంవత్సరములు దేవుని జ్ఞానమును ప్రజలకు బోధించాడు. ఆయన దేవుని కుమారుడు
అని ఋజువు చేసుకొనుటకు చనిపోయి మూడవ రోజున లేచినవాడు. అటువంటి ఏసు చెప్పిన జ్ఞానము నిజమైన
జ్ఞానమని మేము నమ్ముచున్నాము. ఆయన చెప్పిన బైబిలును ఆధారము చేసుకొని మేము జ్ఞానపద్ధతిగా ఉన్నాము.
హిందువులేమో ఎనిమిదిమంది భార్యలుగల కృష్ణుడు, విలాసవంతమైన జీవితమును గడిపిన కృష్ణుడు చెప్పిన
భగవద్గీతను అదియు కొందరు హిందువులు ఆశ్రయించారని ఒకే దేవున్ని ఆరాధిస్తున్నారని మీరు చెప్పుచున్నారు.
కృష్ణుడు ఏసువలె దేవుని కుమారుడు కాదు కదా! విలాస జీవితమును గడిపి జీవితములో ఎక్కడా జ్ఞానము
చెప్పనివాడు ఒకచోట ఒక రోజు అదియు కొన్ని నిమిషములు జ్ఞానమును చెప్పితే, ఆయన చెప్పినది నిజమైన
జ్ఞానమని, ఆయన బోధించినది నిజమైన దేవున్నేనని ఎలా నమ్మాలి? అందువలన మీరు అనుకొన్నట్లు హిందువులు
సరియైన దేవున్ని నమ్మలేదేమో, అప్పుడు వారు మాతో సమానము కాదు కదా!
నా ప్రశ్న :- అనుమానములు వ్యక్తము చేయడములో తప్పులేదు. అనుమానములు తీరిన తర్వాత అసలైన సత్యము
ఎవరికైనా తెలియగలదు. నీ అనుమానములు తీరుటకు ఒక ప్రశ్నను అడుగుచున్నాను జవాబు చెప్పండి. కృష్ణుని
విషయమును అటుంచి ఏసును గురించి అడుగుచున్నాను. ఏసు దేవుని కుమారుడు అయినప్పుడు దేవుడు కానట్లే
కదా! మాలోని సందిగ్ధము ప్రకారము ఏసు దేవుని కుమారుడా? మనుష్య కుమారుడా?
జవాబు :- ఏసు దేవుని కుమారుడే, తండ్రియైన యెహోవా పంపగా వచ్చిన వాడు. అందువలన ఆయన ముమ్మాటికీ
దేవుని కుమారుడే.
నా ప్రశ్న :- దేవునికి కుమారుడుంటే కుమారునికి తల్లి కూడా ఉండాలి. అప్పుడు దేవునికి భార్య ఉన్నట్లే కదా!
తండ్రి యెహోవా, కుమారుడు ఏసు, తల్లి ఎవరు? అనగా దేవుని భార్య ఎవరు?
జవాబు :- దేవునికి భార్య ఉన్నట్లు మా గ్రంథములో వ్రాయలేదు. దేవుని కుమారుడు ఏసు అని మాత్రమే కలదు.
నా ప్రశ్న :- వ్రాసినదే నమ్మగలిగినప్పుడు భగవద్గీతలో నేనే దేవున్ని అని కృష్ణుడు చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేదు.
ఏసు నాకు తండ్రి ఉన్నాడని చెప్పాడా? తండ్రియైన యెహోవా నాకు కుమారుడున్నాడని చెప్పాడా?
జవాబు :- ఏసే తండ్రిని గురించి చెప్పాడు. అందరికీ తండ్రి యెహోవానే అని కూడా చెప్పాడు.
నా ప్రశ్న :- అందరికీ అంటే కేవలము క్రైస్తవులకేనా లేక సమస్త మానవులకా?
జవాబు :- క్రైస్తవులకు మాత్రమే అని చెప్పలేదు. కావున సమస్త మనుషులందరికీ అని చెప్పవచ్చును.
నా
ప్రశ్న :- సర్వమానవులకు తండ్రిని గురించి బైబిలు గ్రంథములో చెప్పబడినది. బైబిలు గ్రంథములో దేవుని
సమాచారము ఉన్నది. కనుక బైబిలును దేవుని గ్రంథమని మేము కూడా అనుచున్నాము. అలాగే భగవద్గీతలో
కూడా దేవుని జ్ఞానము కలదు. అటువంటప్పుడు భగవద్గీతను మీరు కూడా దైవ గ్రంథముగా ఒప్పుకోవచ్చును కదా!
ఎవరు ఒప్పుకొనినా ఒప్పుకోకపోయినా ప్రపంచములో దైవ గ్రంథములు మూడు గలవు. ఒకటి ప్రథమ దైవ
గ్రంథము భగవద్గీత, రెండు ద్వితీయ దైవ గ్రంథము బైబిలు, మూడు అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్. ఈ
12

Page 13
ఇందువు-క్రైస్తవుడా?
మూడు గ్రంథములలో మార్చి మార్చి దేవుని విషయములే చెప్పబడినాయి. భగవద్గీతలో అందరికీ తండ్రిని నేనే
అని చెప్పినవాడు మనిషిగాయున్న కృష్ణుడు. మనిషిగా కనిపించు కృష్ణుడు కనిపించని దేవున్ని నేనే అన్నాడు.
బైబిలు గ్రంథములో తండ్రియైన దేవుని కుమారున్ని నేనే అని ఏసు చెప్పాడు. మనిషిగాయున్న ఏసు కనిపించని
దేవుని కుమారున్ని అని చెప్పాడు. రెండుచోట్ల కనిపించే మనిషే చెప్పగా విన్నాము. కనిపించే మనిషి నేనే దేవున్నని
ఒకచోట, నేను దేవుని కుమారున్ని అని మరొక చోట చెప్పియున్న దానినిబట్టి చూస్తే వీరు ఇద్దరూ సామాన్య
మనుషులు కాదని తెలియుచున్నది. భగవద్గీతలో గానీ, బైబిలు గ్రంథములోగానీ ప్రత్యక్షముగా దేవుడు చెప్పలేదు.
ప్రత్యక్షముగా కనిపించే మనిషే చెప్పాడు. బైబిలులో ఏసు చెప్పిన మాట ప్రకారము దేవుడు పేరుకుమాత్రము
తెలుసు, దేవుని భార్య తెలియదు. అలాగే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దానిప్రకారము ఎవరికీ కనిపించని దేవుడు
మనిషిగా ఎలా కనిపించుచున్నాడని ప్రశ్నించిన దానికి కూడా జవాబు తెలియదు. నేను దేవున్ని అని చెప్పిన కృష్ణుని
మాటకు, నేను దేవుని కుమారున్ని అని చెప్పిన ఏసు మాటకు ప్రత్యక్షముగా జవాబు లేదు. అయితే ఎవరి
అంతరంగములో వారు ఈ ప్రశ్నలకు జవాబును తెలుసుకోవలసిందే. ఈ రెండు ప్రశ్నలకు జవాబులు వారివారి
శ్రద్ధమీద, వారివారి విశ్వాసము మీద ఆధారపడియుండును. ఏసు చెప్పిన మాటప్రకారము ఏసు దేవుని కుమారుడు
అని ఎలా నమ్మగలుగుచున్నామో అలాగే కృష్ణుడు దేవుడే అనుమాటను కూడా నమ్మవలసివస్తున్నది. ఒకవేళ
హిందువులైనవారు, భగవద్గీత మీద ప్రేమ ఉన్నవారు కృష్ణుడు దేవుడేయని నమ్మవచ్చును. క్రైస్తవులుగాయున్నవారు
నమ్మగలరా?
జవాబు :- మేము ఎంతమాత్రము నమ్మము. క్రైస్తవులుగాయున్న ఎవరూ కృష్ణున్ని దేవుడని నమ్మరు.
నా ప్రశ్న :- క్రైస్తవులు కృష్ణున్ని నమ్మరు. హిందువులు ఏసును నమ్మరు. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ప్రవర్తించితే
అజ్ఞానము తప్ప జ్ఞానము ఎవరి దగ్గరా లేకుండాపోతుంది. మొండిగా వాదించే దానికంటే ఈ పద్ధతి ప్రకారము
మేము నమ్మము అని ఎవరైనా చెప్పగలరా? ఏసును ఎందుకు నమ్మరు అని అడిగితే శాస్త్రబద్ధమైన సమాధానము
హిందువులవద్దలేదు. అలాగే కృష్ణుని మాటను ఎందుకు నమ్మరు అంటే సూత్రబద్ధమైన జవాబు క్రైస్తవులవద్దయూ
లేదు. గ్రుడ్డిగా ఎవరి మతమును వారు గొప్పగా చెప్పుకోవడము తప్ప దేవుడు ఇచ్చిన దైవ గ్రంథములలో దేవుడు
ఇచ్చిన జ్ఞానమును చూడడము లేదు. క్రైస్తవ మతములో చాలామందికి ఏసును గురించి ఏసు ఎవరో, ఎక్కడినుండి
వచ్చాడో ఎక్కడికి పోయాడో తెలియదు. అలాగే హిందువులకు కృష్ణున్ని గురించి తెలియదు. కృష్ణుడు ఎవరో
సంపూర్ణముగా తెలిసినవారు హిందువులలో కూడా లేరు. తమ మతములోని కృష్ణున్ని గురించి తెలియని హిందువులు
పరమతములోని ఏసును గురించి ఎలా చెప్పగలరు? అలాగే తమ ఏసును గురించి పూర్తిగా తెలియని క్రైస్తవులు
పరమతములోని కృష్ణున్ని గురించి ఎలా తెలియగలరు. అందువలన రెండు మతముల వారికీ తమ ప్రవక్తలైన
కృష్ణున్ని గురించిగానీ, ఏసును గురించిగానీ తెలియదనియే చెప్పవచ్చును.
అలాంటప్పుడు మాకు మా ఏసును గురించి మేము ఒప్పుకొంటాము అని క్రైస్తవులు అంటే అది వారు
గ్రుడ్డిగా చెప్పేమాటయేగానీ, వాస్తవముగా వారికి ఏసును గురించి తెలియదు. అలాగే కృష్ణున్ని గురించి హిందువులు
ఆయన దేవుడని ఒప్పుకొంటాము అంటే అది కూడా వారు గ్రుడ్డిగా చెప్పుమాటయే నని అర్థమగుచున్నది. అట్లే
కృష్ణున్ని మేము ఒప్పుకోము అని క్రైస్తవులనినా, ఏసును మేము ఒప్పుకోము అని హిందువులనినా ఇరువురూ
13

Page 14
ఇందువు-క్రైస్తవుడా?
గ్రుడ్డిగా మాట్లాడు మాటలేగానీ, ఎందుకు ఒప్పుకోలేరో ఆధారమును చూపి ఇరువురూ చెప్పలేదు. ఎవరి మతమును
వారు ప్రచారము చేసుకొనుటకు హిందువులు ఏసును, క్రైస్తవులు కృష్ణున్ని అగౌరవముగా మాట్లాడుచున్నారు.
భగవద్గీతగానీ, బైబిలుగానీ, రెండూ దైవ గ్రంథములైనప్పుడు అందులో దేవుడు పరోక్షముగా చెప్పిన మాటలు పూర్తి
సత్యముగాయున్నప్పుడు, మనుషులు రెండు గ్రంథములను రెండు మతములుగా చెప్పుకొని, మతము అను
మాయలోపడిపోయి, దేవుని మాటనే విస్మరించి తన మాటనే గొప్పగా చెప్పుకొనుచూ, హిందువు ఏసును, క్రైస్తవులు
కృష్ణున్ని ఒప్పుకోని స్థితిలో ఉండిపోయారు. అంతేకాక మతద్వేషములు పెంచుకొని ఒకరినొకరు హింసించుకొను
స్థితికి చేరి పోయారు. ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఈ ప్రశ్నలు ఇతరులకు జ్ఞానమార్గములో
కనువిప్పు కొరకేగానీ, అగౌరవపరచుట కని తలచకూడదు. ఏసు దేవుని కుమారుడా? అయితే ఎలాగైనా వివరముగా
చెప్పగలరా?
జవాబు :- తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని బైబిలు గ్రంథములో కలదు. అక్కడ తండ్రి కుమారుడు అని
చెప్పబడియున్నది కదా! దానినిబట్టి ఏసు దేవుని కుమారుడని చెప్పవచ్చును.
ప్రశ్న :- బైబిలులో మత్తయి సువార్త చివరి 28వ అధ్యాయములో 19వ వాక్యమునందు తండ్రి యొక్కయూ,
కుమారుని యొక్కయూ, పరిశుద్ధాత్మ యొక్క యూ అని ఉన్నది. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని
మూడు పేర్లు వచ్చాయి. ఈ ముగ్గురిలో తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో ఎవరికీ సరిగా
అర్థము కాలేదు. ముగ్గురినీ విడివిడిగా వివరించి ఎవరూ చెప్పలేదు. అటువంటప్పుడు తండ్రి, కుమారుడు అను
ఇరువురికి దేవుడు, దేవుని కుమారుడు ఏసు అని చెప్పితే, తండ్రివలన ఏసు పుట్టలేదని పరిశుద్ధాత్మ వలన పుట్టాడని
కొందరు చెప్పుటకు అవకాశము కలదు. బైబిలు గ్రంథములో మత్తయి సువార్త 1వ అధ్యాయములో 21వ వచనమందు
“ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన” అని కలదు. అందువలన ఏసు పరిశుద్ధాత్మ కుమారుడా? లేక
తండ్రి కుమారుడా? అని ప్రశ్నించితే ఎటూ చెప్పలేని పరిస్థితి క్రైస్తవులలో కలదు. ఎందుకనగా బైబిలు గ్రంథములో
కొన్నిచోట్ల ఏసు తండ్రి కుమారుడని చెప్పబడినది. కొన్నిచోట్లేమో పరిశుద్ధాత్మ కుమారుడని చెప్పబడియున్నది.
దీనినిబట్టి క్రైస్తవులవద్ద సరియైన సమాధానము లేదు. సమాధానము లేకున్నా బైబిలు గ్రంథములోని వాక్యములు
సరిగా అర్థము కాకున్నా, కొందరు గ్రుడ్డి నమ్మకముతో చెప్పుచున్నారు. అయితే అలా నమ్మినవారు మిగతా దైవ
గ్రంథములలోని విషయములను కూడా అలాగే నమ్మాలి కదా! ఒకవేళ ఎవరైనా వివరముగా చెప్పినప్పుడైనా నమ్మాలి
కదా! అలా నమ్మక పోవడానికి కారణము నేను ఫలానా మతస్థుడనను అజ్ఞానము తప్ప వేరు ఏమీకాదని తెలియుచున్నది.
బైబిలులో తండ్రి పరిశుద్ధాత్మ విషయములో సందిగ్ధతయున్నా, ఏసు ఎవరి కుమారుడో తెలియకున్నా, భగవద్గీతలో
కృష్ణుడు దేవుడనుటకు అనుమానము లేని ఆధారములున్నవి. అనుమానముతో కూడుకొన్న వాక్యములను గ్రుడ్డిగ
నమ్మినప్పుడు, అనుమానము లేని వాక్యములను నేరుగా చూచి ఎందుకు నమ్మకూడదని ప్రశ్నించుచున్నాను.
మేము క్రైస్తవులము అను ఒకే ఒక ఉద్దేశ్యముతో, భగవద్గీత హిందువులది అను భావముతో ఉండుట వలన క్రైస్తవులు
శ్రీకృష్ణున్ని దేవుడని ఒప్పుకోలేక పోవుచున్నారు. మీకు అర్థముకాని బైబిలును చేతపూని, అర్థమగుటకు అవకాశమున్న
భగవద్గీతను అసూయగా క్రైస్తవులు చూచుచుండుట వాస్తవమా కాదా మీరే చెప్పండి?
జవాబు :- మాకు అర్థముకానీ అర్థము కాకపోనీ మా గ్రంథము మాకు గొప్ప. ఇతరుల గ్రంథమును (భగవద్గీతను)
14

Page 15
ఇందువు-క్రైస్తవుడా?
ఒప్పుకొంటే మా దేవున్ని కాదని వేరే దేవుని వెంటపడినట్లగును. అప్పుడు ప్రభువు మమ్ములను క్షమించడు. అందులన
భగవద్గీతను మేము ఒప్పుకోము.
నా ప్రశ్న :- భగవద్గీతను చదవకూడదనిగానీ, ఇతర గ్రంథములను చదివితే వేరే దేవుని వెంటబడినట్లనిగానీ, అట్లు
చదివిన వానిని క్షమించనని చెప్పినట్లు గానీ, బైబిలు గ్రంథములో ఎక్కడైనా కలదా? చెప్పండి.
జవాబు :- మా పెద్దలు చెప్పినట్లు, మా గ్రంథములలో ఉన్నట్లు దేవున్ని తప్ప ఇతరులను నమ్మము. అందువలన
గీతనుగానీ, కృష్ణున్నిగానీ మేము నమ్మడము లేదు.
నా ప్రశ్న :- దేవున్ని తప్ప ఇతరులను నమ్మవద్దను మాటను మేము కూడా ఒప్పుకొంటాము. ఆ మాటను ఎవరైనా
ఒప్పుకొని తీరవలసిందే. నేను దేవుని కుమారున్ని అని చెప్పిన ఏసుమాటను నమ్మినప్పుడు నేనే దేవున్ని అని చెప్పిన
వానిమాటను ఎందుకు నమ్మకూడదని అడుగుచున్నాను. దేవున్ని తప్ప ఇతరులను నమ్మము అను మాట ప్రకారము
దేవుడు కానివారిని నమ్మకపోయినా ఫరవాలేదు. దేవున్నని చెప్పుకొన్న వాని మాటలను కూడా నమ్మకపోవడానికి
కారణమేమి?
జవాబు :- ఎలా నమ్మాలి? కృష్ణుని జీవితమును చూస్తే ఆయన దేవుడని నమ్ముటకు అవకాశమే లేదు. అంతేకాక
ఆయనను దేవుడనుటకు ఏసువలె ఎవరి పాపములను కృష్ణుడు క్షమించలేదు కదా! నా వలన మీకు పాప
క్షమాపణగలదని కూడా చెప్పలేదు. ఏసు నా వలన మీకు పాపక్షమాపణ కలదని చెప్పాడు. చేసి చూపించాడు.
అందువలన ఆయనను దేవుడని నమ్ముచున్నాము.
నా ప్రశ్న :- ఏసు నా వలన పాప క్షమాపణ కలదని చెప్పాడు. కృష్ణుడు నా జ్ఞానము వలన కర్మనాశనము కలదని
చెప్పాడు. ఎలా చూచినా ఇద్దరి మాట ఒక్కటే. వారి మాటప్రకారమే జరిగినది. పాప క్షమాపణ అనినా, కర్మనాశనమనినా
రెండూ ఒక్కటే. కావున ఈ విషయములో కూడా మీరు పొరపాటు పడినారని తెలియుచున్నది. ఇంతవరకు ఎన్నో
విధముల మిమ్ములను ప్రశ్నించాను. నా ప్రశ్నకు మీరు చెప్పు జవాబుకంటే మా ప్రశ్నయే పెద్దగా చెప్పబడినది.
ఎంతో వివరముగా ప్రశ్నించినా చివరకు మీ జవాబులు స్వమతాభిమానముతోనే చెప్పబడినాయి. స్వంత మతము
మీద ప్రేమ అభిమానములున్నప్పుడు ప్రక్క మతములో ఉన్నదంతా తక్కువ గానే కనిపించుచుండును. అదే
విధముగా క్రైస్తవ మతము మీద అభిమానమున్న వారందరికీ హిందూమతము మీద ద్వేషముండును. మత
ద్వేషముల వలననే భగవద్గీతను క్రైస్తవులు ఒప్పుకోవడము లేదు. అలాగే కృష్ణున్ని ఒప్పుకోవడము లేదు. బైబిలు
గ్రంథములో ఎక్కడగానీ ఏసు తనది క్రైస్తవ మతమని చెప్పలేదు. క్రైస్తవ మతమును పెంచుటకు ఇతర మతములను
తగ్గించి మాట్లాడి, ఆ మతస్థులను మభ్యపరచి తమ మతములో చేర్చుకోమని కూడా చెప్పలేదు. ఏసు మతమార్పిడి
చేయమనీ, క్రైస్తవ మతమును అభివృద్ధి చేసినవాడు నా భక్తుడగుననీ ఎక్కడా చెప్పలేదు. అటువంటప్పుడు మీరు
హిందూమతస్థులను క్రైస్తవులుగా మార్చుటకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? క్రైస్తవ మతములోని ప్రతి బోధకుడు
చెరువులో చేపలవలె, వానాకాలము సులభముగా దొరుకు ఉసుర్ల ఆహారమువలె నున్న హిందువులలోని శూద్రులను
తమ మతములోనికి మార్చాలని చూస్తున్నారు. బైబిలులో దేవుడు చెప్పని పనిని (మత మార్పిడిని) క్రైస్తవులు
ఎందుకు చేయుచున్నారని అడుగుచున్నాను. ప్రస్తుత కాలములో పెద్ద ప్రశ్నగయున్న దీనికి మీరు జవాబు చెప్పండి.
15

Page 16
ఇందువు-క్రైస్తవుడా?
జవాబు :- మేము మా మతమును అభివృద్ధి చేయుటకు మతమార్పిడి చేస్తున్నామని, హిందువులను క్రైస్తవులుగా
మారుస్తున్నామని అనుకోవడము పొరపాటు. మేము అట్లు ఎప్పుడూ చేయలేదు.
నా ప్రశ్న :- గత యాభై సంవత్సరములను చూస్తే మొదట 90 శాతమున్న హిందువులు నేడు 65 శాతమునకు
దిగిపోయారు. దీనినిబట్టి యాభై సంవత్సరములలో 25 శాతము హిందువులు క్రైస్తవులుగా మారిపోయారు. క్రైస్తవ
బోధకులు తమ మతమును ప్రచారము చేసి, మా మతములో పాప క్షమాపణకలదనీ, మీరు చేసుకొన్న పాపములన్నీ
మా మతములోనికి వస్తే పోతాయని, అనేక రకముల ఆశలను కల్పించిన దానివలన, చెరువులోని చేపలు మత్స్యకారుల
వలలో చిక్కుకొన్నట్లు చేపలవలెనున్న హిందువులు క్రైస్తవ బోధలు అను వలలో చిక్కుకొని, చివరకు క్రైస్తవ
మతము అను గంపలోనికి చేర్చబడి క్రైస్తవులయినారు. ఈ విధముగా మీరు హిందువులను క్రైస్తవులుగా మార్చలేదేమో
చెప్పండి. గత యాభై సంవత్సరముల క్రిందట 90 శాతమున్న హిందువులు 25 శాతము క్రైస్తవులుగా ఎందుకు
మారారో చెప్పండి?
జవాబు :- హిందువులు క్రైస్తవులుగా మారినమాట నిజమేగానీ, మేము వారిని క్రైస్తవులుగా మారమని చెప్పలేదు.
హిందూమతములో ఆదరణలేని వారు, అగ్రకులముల క్రింద నలిగిపోవుచున్నవారు, అగ్రకులముల వారు శూద్రులను
అంటరానివారిగా నీచముగా చూచుట వలన, చాలామందికి దేవాలయ ప్రవేశము లేనిదానివలన, హిందూమతములో
ఎందుకు పుట్టామని బాధపడు వారందరికీ మా మతము బాగా కనిపించింది. హిందూ మతములో ఏనాడూ
జ్ఞానబోధ వినేదానికి నోచుకోని హిందువులకు మా క్రైస్తవ మతములోని బోధలు బాగా కనిపించాయి. దేవాలయముల
లోనికి ప్రవేశము లేనివారికి మా చర్చిలో ఎటువంటి ఆంక్షలు లేకుండా, అందరికీ ప్రవేశముండుట బాగా కనిపించింది.
ఈ విధమైన ఎన్నో లోపములు హిందూమతములో ఉండుట వలన, ఆ లోపములన్నీ లేని మా మతము లోనికి
ఎదురు ప్రవాహమునకు చేపలు వచ్చినట్లు వచ్చారు. నేటికినీ ఎందరో హిందువులు క్రైస్తవమతములోనికి రావాలని
చూస్తున్నారు. మీ మతములో అగ్రకులముల పెత్తనము అను చలికి తట్టుకోలేని వారందరూ వెచ్చగా ఉంటుందని
క్రైస్తవ మతము అను కోటులోనికి దూరుకోవాలని చూస్తున్నారు. హిందూ మతములో కొన్ని పద్ధతులు మారనంతవరకు
శూద్రులుగాయున్న అన్ని కులములవారూ మా మతమువైపు చూస్తూనే ఉందురు. మతము మారవలెనని ప్రయత్నము
చేయుచునే ఉందురు.
నా ప్రశ్న :- మీరు చెప్పినట్లు హిందువులలో అగ్రకులముల వారుండుట నిజమే. అయినా శూద్రులను ఇబ్బంది
పెట్టేంతగా వారు ఏమీ ప్రవర్తించలేదే! కొన్ని సాంప్రదాయముల ప్రకారము వారు నడుచుకోవడము వాస్తవమే.
అంతమాత్రమున మిగతా హిందువులు మతము మార్చుకోవలసినంత పరిస్థితి ఏమీ లేదు కదా!
జవాబు :- ఇంతవరకు నీతిగా, న్యాయబద్దముగా మన మధ్య సంవాదము సాగుచున్నది. మీరు అడుగవలసిన
దానిని వదలకుండా అడిగారు. మీరన్నట్లు మా మతము మీద మాకు అభిమానము గౌరవము ఉండుట నిజమే.
మా తప్పును మేము ఒప్పుకొంటున్నాము. అటువంటప్పుడు మీ లోపములను మీరు కూడా ఒప్పుకోవచ్చును కదా!
ఉన్నదున్నట్లుగా దాచుకోకుండా (Open Heart గా) మాట్లాడండి. మీరు సమాజములో ఒక యోగిగా ఉంటూ,
స్వచ్ఛమైన భగవద్గీతా జ్ఞానమును హిందూమతములో బోధిస్తున్నారు. ఎన్నో సంచలనమైన జ్ఞానవిషయములను
16

Page 17
ఇందువు-క్రైస్తవుడా?
యాభై గ్రంథములుగా వ్రాశారు. హిందూ మతములో ఎంతోమంది అభిమానించు గురువుగా ఉన్నారు. మీరు
చెప్పు ప్రతీదీ భగవద్గీతను ఆధారము చేసుకొని చెప్పు జ్ఞానమే. ఇటువంటి గొప్ప జ్ఞానమున్న మిమ్ములను హిందూ
మతములో ఎంతో గొప్ప వ్యక్తిగా క్రైస్తవులయిన మేము గుర్తించాము. అయితే హిందూమతములో అగ్రవర్ణముల
వారు మిమ్ములను ఎన్నోమార్లు వ్యతిరేఖించారు. మిమ్ములను పరమత బోధను ప్రచారము చేయుచున్నారన
లేదా? ఏమాత్రము దైవజ్ఞానము తెలియని హిందూ ధర్మరక్షకులమను వారిని, వెనుకనుండి ప్రేరేపించి మీ మీద
దాడిచేయుటకు ప్రయత్నించలేదా? హిందూమతమునకు మేమే పెద్దలమని, మేమే హిందూ సాంప్రదాయము లను
కాపాడువారమని చెప్పి హిందూ ధర్మ రక్షణ, పరిరక్షణ అను పేర్లతో సంఘములను స్థాపించి, అందులో
మతాభిమానముగల హిందువులలో శూద్రులనే సభ్యులుగా చేర్చి, శూద్రుల వ్రేలితో శూద్రుల కన్నునే పొడవాలని
అగ్రవర్ణముల హిందువులు ప్రయత్నించడము లేదా? చౌదరీ కులమున పుట్టిన మీరు ఎంతో పెద్ద యోగిగా,
సంపూర్ణ జ్ఞానము తెలిసిన వ్యక్తిగాయున్నా మిమ్ములను అనంతపురం జిల్లా గుంతకల్లులో హిందూధర్మరక్షణ
(విశ్వహిందూపరిషత్) లో నున్న శూద్రుల చేతనే అవమానపరచుటకు ప్రయత్నించలేదా? హిందూజాతికే ఆదర్శ
గ్రంథమైన మీరు వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీతను మీ ముందే అగ్గిపెట్టి కాల్చలేదా? ఆ రోజు మిమ్మల్ని
ఆ
అవమానపరచినది ఒక రెడ్డి ఒక కమ్మ కులస్థులు కాగా మిగత ఇరవైమంది శూద్రులే కదా! ఏమాత్రము జ్ఞానము
తెలియనివారిని వెనుక ప్రేరేపించినది అగ్రకులము వారైన స్వాములని మీకు తెలియదా? మీకు వారిగుండా
బాధకలుగలేదా? వారి వ్రేలు తీసి వారి కన్నులే పొడిచినట్లు మీవారే మిమ్ములను ఇబ్బంది పెట్టలేదా? నేడు క్రైస్తవ
మతమును ఎందుకు మత మార్పిడి చేయుచున్నారని, హిందువులను యాభై సంవత్సరములలో 25 శాతము
క్రైస్తవులుగా మార్చినారని, ఆ విధముగా మత మార్పిడి చేసి హిందువులను క్రైస్తవులుగా మార్చడము క్రైస్తవుల
తప్పుగా, ఇంతవరకు మాతో వాదించిన మిమ్ములను అవమానపరచుటకు, ఎవరో ప్రచురించిన క్రైస్తవ ప్రచార
కాగితమును మీరే ప్రచురించారని అసత్య ఆరోపణ చేసి, మీ ప్రెస్లో పని చేయు భాస్కర్రెడ్డిని విపరీతముగా
కొట్టలేదా? ఆ ప్రచార కాగితములో ఎవరు ప్రచురించినది అడ్రసున్నా, మీరు కాదని తెలిసినా, అదే పనిగా
దాడిచేయాలని ఆ రోజు వచ్చిన వారందరూ శూద్రులే కదా! మీ అనుచరులు పదిమందయినా ఉంటారని వారిని
కొట్టి అవమాన పరచాలని వచ్చిన ఇరువదైదుమంది శూద్రులకు నాయకుడు ధీరజ్ రెడ్డి కూడ ఒక శూద్రుడే కదా!
ధీరజ్ రెడ్డి ఒంటరిగాయున్న భాస్కర్రెడ్డిని కొట్టిపోయాడు. ఒక రెడ్డి మరొక రెడ్డిని క్రైస్తవుడని ఆరోపణ చేసి దాడిచేస్తే
ఎవరి వ్రేలుతో ఎవరి కన్నును పొడిచారో మీరే బాగా ఆలోచించుకోండి. ఇదంతయు గమనిస్తే నేటికినీ
అగ్రకులములవారు తెలివిగా ప్రవర్తించుచూ, మిగిలిన హిందువులను క్రైస్తవులుగా మారకుండునట్లు హిందూ ధర్మరక్షణ
సంఘములను ఏర్పాటు చేసి, ఆ సంఘములను ఇష్టమొచ్చినట్లు వాడుకొనుచూ, వారికంటే ఏ హిందువూ
(ఏ శూద్రుడు) పైకి రాకూడదను ఉద్దేశ్యముతోనే మిమ్ములను చూచి అసూయపడిన అగ్రవర్ణములవారు, శూద్రుల
చేతనే దాడులను చేయించారు కదా!
ఆ రోజు హిందువులైన మీ మీదికి అనేకమార్లు హిందువుల చేతనే దాడులు చేయించినది, వెనుకవుండి
ప్రేరేపించినది హిందువులలోని అగ్రవర్ణముల వారేనని మీకు కూడా తెలుసు. ఆ సంఘటనల వలన మానసికముగా
బాధపడిన మీ శిష్యులు దాదాపు 500 మంది మూకుమ్మడిగా ఇస్లామ్ మతములోనికి పోతామని హైదరాబాద్లోని
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ విలేకరుల మీటింగ్లో చెప్పలేదా? విషయము తెలిసిన మీరు ఎవరో తెలివి తక్కువ పనిచేస్తే
17

Page 18
ఇందువు-క్రైస్తవుడా?
మనము మతము మారడము అజ్ఞానమవుతుందని సర్దిచెప్పి అందరినీ నివారించలేదా? నేటికినీ హిందూధర్మరక్షణ
అను పేరుతో అగ్రవర్ణముల వారు తమ పెత్తనమును చెలాయించుచూ అక్రమాలు చేయడము లేదా? జ్ఞానమును
చెప్పి హిందూమతమును ఉద్దరించు మిమ్ములను మీ శిష్యులను హింసించడము అక్రమము కాదా! మీరే చెప్పండి.
జాతీయ గాయకుడైన జేసుదాసు భక్తిపాటలలో పేరుగాంచిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన ఎంతో భక్తిగా ఏడుకొండల
వెంకటేశ్వరున్ని దర్శించుకోవాలని తిరుమలకు వస్తే ఆయన క్రైస్తవుడని ఆలయములోకి ప్రవేశించకుండా వెనక్కు
పంపినట్లు జేసుదాసే ఒక టీవి ఛానల్లో బాధపడి చెప్పుకోవడము అసత్యమా? ఇన్ని అవకతవకలు జరుగుచున్నా
హిందూమతమును ఏమీ అనకుండా, హిందువులు క్రైస్తవులుగా మారుటకు తప్పంతా మీదే అని మమ్ములను
(క్రైస్తవులను) అనడము న్యాయమేనా మీరే చెప్పండి. హిందూ మతములో అగ్రవర్ణముల హిందువులు ప్రేరేపిస్తే,
మిగతా హిందువులు మిమ్ములను బాధపెట్టలేదా? హిందూమతములో ఎంతో పెద్ద జ్ఞానులైన మీకు సముచిత
స్థానమున్నదా? ఏ ఒక్క స్వామీజీ అయినా మీతో ఏకీభవించి మాట్లాడుచున్నాడా? మీరే చెప్పండి!
నా ప్రశ్న :-
:- మీరు అడిగినవన్నీ సత్యములే. మీరు మతమువైపు నుండి మాట్లాడుచున్నారు. కావున హిందూమతములోని
తప్పులు మీకు కనిపించు చుండవచ్చును. అయినా నేను మతమువైపు నుండి మాట్లాడడము లేదు. దైవికముగా
దేవుని వైపునుండి మాట్లాడుచున్నాను. భగవద్గీతలోనూ, బైబిలు గ్రంథములోనూ గల జ్ఞానమును ఆధారము
చేసుకొని మాట్లాడుచున్నాను. మతము పెద్ద మాయ అని మేము ముందే చెప్పాము. నేను దైవ గ్రంథములను
చూచి, అందులోని జ్ఞానమును అనుసరించి మతమార్పిడి మంచిదికాదని చెప్పుచున్నాను. మీరు కూడా మీ
మతమువైపునుండే పని చేయుచున్నారు తప్ప దేవునివైపునుండి పని చేయడము లేదు. మీ బైబిలు గ్రంథమునుండి
మీరు ఎంత శాతము అర్థము చేసుకొన్నారో, ఏమని అర్థము చేసుకొన్నారో అట్లే ప్రవర్తించుచున్నారు. మీరు చేయుచున్న
పనినిబట్టి చూస్తే బైబిలు గ్రంథములో ప్రత్యేకించి ఏసు చెప్పిన నాలుగు సువార్తలలోని జ్ఞానము అర్థము కాలేదని
మాకు తెలియుచున్నది. మా బైబిలులోని జ్ఞానము హిందువైన మీకు ఎలా తెలయగలదని మీకు ప్రశ్న రావచ్చును.
దానికి మా జవాబు ఏమనగా! మా భగవద్గీతలో ఉన్నదే ఏసు చెప్పిన నాలుగు సువార్తలలో గలదు. కావున నాకు
భగవద్గీత ఎలా తెలుసో అలాగే బైబిలు కూడా తెలుసు.
వాస్తవముగా ఉన్నదున్నట్లు చెప్పితే హిందువులకు భగవద్గీత ఏమాత్రము అర్థము కాలేదు. అలాగే బైబిలు
కూడా క్రైస్తవులకు అర్థము కాలేదనియే చెప్పుచున్నాము. భగవద్గీత హిందువులకు అర్థమైనట్టేయున్నా అందులోని
మూడు ఆత్మల విషయము భగవద్గీతను అనువదించి వ్రాసిన గొప్ప స్వామీజీలకు కూడా తెలియకుండా పోయినది.
వారికి అర్థము కాలేదను విషయము వారు వ్రాసిన విధానమునుబట్టియే తెలిసిపోవుచున్నది. భగవద్గీత మూడు
ఆత్మల త్రైత సిద్ధాంతముతో కూడుకొన్న విషయము హిందువులైన వారికి ఎలా తెలియకుండా పోయినదో, అలాగే
క్రైస్తవులకు కూడా బైబిలులోని సారాంశముగానీ, మూల సూత్రములుగానీ ఏమాత్రము అర్థము కాలేదని చెప్పవచ్చును.
నేడు క్రైస్తవ బోధకులు బోధించు విధానముగానీ, జ్ఞానముగానీ బైబిలులోని సారాంశమునకు విభిన్నముగా యున్నది.
బైబిలులో మత్తయి సువార్త 28వ అధ్యాయములో 19వ వాక్యము యందుగల తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో,
పరిశుద్ధాత్మ ఎవరో సరియైన భావముతో ఇంతవరకు ఎవరికీ అర్థము కాకుండా పోయినది. ఏసు శిలువ వేయబడి
తాత్కాలిక మరణమును పొంది పూర్తి చనిపోకుండా చనిపోయినట్లు కనిపించడము, శ్వాస ఆగిపోవడము, శవముగా
18

Page 19
ఇందువు-క్రైస్తవుడా?
మారి పోవడమును తాత్కాలిక మరణము అంటాము. ఈ విషయము అర్థము కావాలన్నా, ఏసు శిలువ మీద
చనిపోలేదని తెలియాలన్నా మా రచనలలోని “మరణ రహస్యము” అను గ్రంథమును చూడండి. కేవలము
ముప్పైమూడు గంటలు (33) మరణస్థితిలోవుండి, రెండవరోజు 48 గంటలు కూడా పూర్తి కాకముందే మరణమునుండి
లేవడము జరిగినది. మరణమునుండి లేచిన తర్వాత దాదాపు నలభై రోజులుండి, ముప్పైమూడు మార్లు తన
శిష్యులకు కనిపించాడు. అలా కనిపించిన ఏసు తన చివరి దర్శనములో శిష్యులకు ఒక ముఖ్యమైన మాట చెప్పాడు.
ఎవరైనా జీవితము చివరిలో తనవారికి చెప్పు మాట ముఖ్యమైనదిగా ఉంటుంది. అలాగే ఏసు తన జీవితములో
చివరి కలయికైన దానివలన ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19,20 వాక్యములను చూడండి.
“మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ
యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో, వాటినన్నిటిని
గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము (ఎల్లకాలము) మీతో కూడా
ఉన్నానని వారితో చెప్పెను.” ఈ విధముగా ఏసు చెప్పిన చివరిమాట సమస్త మనుషులలో ఎవరికైనా అర్థమైనదా?
అంటే అందరు అర్థమయినట్లే చెప్పగలరు కానీ, అందరికీ అర్థమైన భావము వేరు, ఏసు ఆనాడు చెప్పిన భావము
వేరు. ఆ రోజు తన బోధను ప్రజలకు బోధించమన్నాడు. ఆ బోధలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను గురించే
చెప్పమన్నాడు. ఇది దేవుడు మనుషులకు ఇచ్చిన ఉత్తరువు. అయితే దేవుడు చెప్పిన పనిని ఏ బోధకుడైనా
చేయుచున్నాడా? అంటే వారికే అర్థముగాని తండ్రి, కుమారున్ని, పరిశుద్ధాత్మను గురించి ప్రజలకు చెప్పక, కేవలము
మాయతో కూడుకొన్న మతమును గురించే బోధించుచున్నారు. హిందువులు తమ మతమును కాపాడుకోవాలని
మతము వెంటనే పడిపోయారు. క్రైస్తవులు తమ మతమును వృద్ధి చేసుకోవాలని మతము వెంటపడినారు.
భగవద్గీతలో చెప్పిన ప్రకారము హిందువులు లేరు, అలాగే బైబిలు గ్రంథములో ఏసు చెప్పినట్లు క్రైస్తవులు
లేరు. ఇరువురూ దైవిక భావమును వదలి, ప్రపంచ భావముతో కూడుకొన్న మత విధానములో ఉండిపోయారు.
బైబిలులోగానీ, భగవద్గీతలో గానీ దేవుడు మతము అను మాటనే చెప్పలేదు. ఈ రెండు గ్రంథములలోనూ మరియు
అంతిమ గ్రంథమైన ఖుర్ఆన్ గ్రంథములోనూ దేవుడు తన జ్ఞానమును మాత్రము సూత్రబద్ధముగా బోధించాడు
తప్ప, మత ప్రసక్తిని ఎక్కడా చెప్పలేదు. మేము నేడు మూడు దైవ గ్రంథముల ప్రకారము మనుషులు చేయు మత
ప్రచారములనూ, మత మార్పిడులను పూర్తిగా ఖండించుచున్నాము. నేను దేవుని మాటను అనుసరించుచుండుట
వలన, ఏ మతమువైపూ మొగ్గుచూపక ఒక పక్షము కాకుండా, రెండు మతములవారినీ సమానముగా మీరు దేవుని
జ్ఞానము ప్రకారము నడుచుచున్నారా? యని నిలదీసి అడుగుచున్నాను. నేను పుట్టినది హిందూ కుటుంబములోనని
హిందువులవైపుగా మాట్లాడడముగానీ, ఇతర మతములను అసూయ భావముతో చూడడముగానీ లేదు. రెండు
మతములలోనున్న తప్పులను బహిర్గతము చేసి అడుగుచున్నాము. అలా చేయడము వలన అన్ని మతములవారిని
వారి మత ధ్యాసనుండి దేవునివైపు ధ్యాస మరల్చడానికేనని తెలియవలెను.
నేను వ్రాసిన అనేక గ్రంథములలో ఎక్కువగా హిందువులకే జ్ఞానమును చెప్పుచూ వచ్చాము. మా బోధలలో
మూడు దైవ గ్రంథ విషయములు ప్రస్తావిస్తూ వచ్చాము. నాకు దైవ భావము ప్రకారము అన్ని మతములూ
సమానమే, మూడు దైవ గ్రంథములలోని జ్ఞానమూ సమానమే. అందువలన నా బోధలు తప్పు చేసిన వారిని
19

Page 20
ఇందువు-క్రైస్తవుడా?
పెద్దలు దండించునట్లు, ఏ మతములో తప్పులు కనిపించినా, వాటిని సరిచేయుటకు చెప్పిన మాటలు, మీ పెద్దలు
మిమ్ములను దండించినట్లు ఉండును. ప్రస్తుతము ఇందువు, క్రైస్తవుడా అను పేరుతో వ్రాయు గ్రంథములో
ఇంతవరకూ ఇరువైపులా సమానముగా చెప్పుచూ వచ్చినా, ఇప్పటినుండి క్రైస్తవ బోధకులు మత ప్రచారము కొరకు
ఎటువంటి తెలివిని ఉపయోగించు చున్నారో, ఎటువంటి బోధలు చేయుచున్నారో చెప్పవలసినయున్నది. మేము
చెప్పు విషయములు కొందరికి కొంత బాధ కలిగించినా వారి తప్పును వారికి చూపించి తిరిగి అటువంటి తప్పు
చేయకుండా, దేవుని మార్గము వైపు వారిని మళ్ళించుటకేనని ముందుగానే చెప్పుచున్నాను.
దాదాపు 40 సంవత్సరముల క్రితము నేను ఒక మారుమూల పల్లెటూరికి పోవడము జరిగినది. అప్పటికి
నాకు 23 సంవత్సరముల వయస్సుండెడిది. ఆ పల్లెటూరిలో ముస్లీమ్లు ఐదు లేక ఆరు కుటుంబములు ఉండగా,
మిగతా ఎనభై కుటుంబములు హిందువులవే ఉన్నాయి. ఆరు వందల జనాభాయున్న ఆ గ్రామములో ముస్లీమ్లను
సులభముగా వారి వేషధారణను బట్టి గ్రహించవచ్చును. అయితే ఒక వ్యక్తిని చూచి ఇతను హిందువా లేక ముస్లీమా
అని అనుమానము వచ్చింది. అప్పుడు నా అనుమాన నివృత్తి కొరకు నీది ఏ మతము అని అడిగాను. ఆ మాటకు
అతను అర్థముకానట్లు నావైపు చూచాడు. అతనికి నా మాట అర్థము కాలేదని, అదే మాటనే కొంతమార్చి
అర్థమగునట్లు నీవు ఏ మతస్థుడవు అని అడిగాను. ఆ మాటకు అతను నేను తెలుగువాడిని అన్నాడు. అతను
మొరటుగా “నేను తెలుగోన్ని” అని చెప్పినప్పుడు అతనికి మతము అను విషయమే తెలియదని నాకు అర్థమైపోయినది.
కొన్నిచోట్ల నాగరికతలేని మారుమూల గ్రామములలో హిందువులు ముస్లీమ్లు కలిసి బ్రతుకుతున్నా వారికి మతమను
ధ్యాసలేదు. మతద్వేషములులేవు. అటువంటి వారికి వారి మాట్లాడే భాషను బట్టి నేను తెలుగోన్ని, నేను తురకోన్ని
(ముస్లీము) అని అంటున్నారు. తెలుగు భాష మాట్లాడేవాడు తెలుగోడిననీ, తురక భాష (ఉర్దూ భాష) ను
మాట్లాడేవాడు తురుకోడినని చెప్పడము ఆ పల్లెటూరిలో అలవాటైపోయినది. వారు భాషను బట్టి వారిని కొంతవేరుగా
చెప్పుకొంటున్నారు తప్ప వారికి మతము అనునదే తెలియని స్థితిలో ఉన్నారని అర్థమగుచున్నది.
పది సంవత్సరముల తర్వాత అదే ఊరికి నేను పోవడము జరిగినది. పది సంవత్సరముల తర్వాత కూడా
ఆ ఊరి అభివృద్ధిలో ఏ మార్పూ కనిపించలేదు గానీ మనుషులలో కొంతమార్పు కనిపించినది. మొదట వారు
మాట్లాడే భాషనుబట్టి నేను తెలుగువాడిని, తురకవాడిని అని చెప్పుకొను వారు కొంత మార్పుచెంది, నేను హిందువును,
నేను ముస్లీమ్ను అని చెప్పుకొను స్థితికి వచ్చారు. పది సంవత్సరముల క్రితము చూచిన వారిని చూచిన నేను, పది
సంవత్సరముల తర్వాత వారిలో వచ్చిన మార్పును చూచి ఆశ్చర్యపోయాను. పది సంవత్సరముల క్రింద ఆ
ఊరిలో ఒక పెద్దమ్మ గుడి, ఒక పీర్ల చావిడి మాత్రము ఉండెడిది. ఉగాది రోజు పెద్దమ్మ గుడిలో ఊరంతయూ
పూజలు చేసి, కోళ్ళు, పొట్టేళ్ళను బలి ఇచ్చి పండుగ చేసుకొనెడివారు. అలాగే పీర్ల పండుగ వస్తే ఊరంతయు కలిసి
పీర్లపండుగ చేసుకొనెడివారు. ముస్లీమ్లు, హిందువులు ఇరువురూ కలిసి రెండు పండుగలు ఉత్సాహముతో
చేయడము వలన ఏది ముస్లీమ్ పండుగో, ఏది హిందువుల పండుగో అర్థము కాకుండెడిది. ఈ విధముగా ఎంతో
సామరస్యముగా హిందువులు ముస్లీమ్లు కలిసి బ్రతుకుచూ, ఒకరినొకరు మామా అనియో చిన్నాన్నా, పెద్దనాన్నా
అనియో, బావా అనియో ఒక కుటుంబములోని వారు పిలుచుకొనునట్లు పలకరించుకొనెడివారు. ఆ ఊరంతయు
20

Page 21
ఇందువు-క్రైస్తవుడా?
ఒకే కుటుంబములాగా ఉండెడిది. పది సంవత్సరముల తర్వాత నేను ఫలానా మతమువాడినని చెప్పుకోవడమేకాక,
ఊరి బయట బయలు ప్రాంతములో ఒక మసీదు కూడా ముస్లీమ్లు కట్టుకోవడము జరిగినది.
పది సంవత్సరముల తర్వాత ఆ ఊరిలో క్రొత్తగా మసీద్ కనిపించడమే కాకుండా, ఒక క్రైస్తవ చర్చి కూడా
కనిపించినది. అయితే ఆ ఊరిలోనికి క్రైస్తవులు ఎక్కడనుంచో రాలేదు. ఆ ఊరి చివరి భాగములో నున్న దళిత
కుటుంబములు కొన్ని, ఊరి మధ్యలోనున్న యాదవ కుటుంబములు కొన్ని, బోయ (వాల్మీకి) కుటుంబములు కొన్ని
కలిసి క్రైస్తవులుగా మారిపోయి, వారు ఆదివారము ప్రార్థన కొరకు చర్చీని నిర్మించు కొన్నారు. పది సంవత్సరముల
క్రిందట మతముల పేర్లు కూడా తెలియని వారు, తర్వాత మూడు మతములవారిగా చెప్పుకోవడము ప్రారంభించారు.
మొదట ఎవరి దేవుడు ఎవరో తెలియనివారు, మా దేవుడు ఈయన వారి దేవుడు ఆయన అని చెప్పుకొను స్థితికి
వచ్చారు. తర్వాత రెండు మూడు సంవత్సరములకు కొంత నాగరికతగా మారిన, ఆ ఊరి హిందూ ప్రజలలో
హిందూమతము మీద అభిలాష పెరిగినది. హిందువులకు దేవుడు రాముడని రాముని దేవాలయమును ఊరి
మధ్య కట్టించడము జరిగినది. ఈ విధముగా ఆ ఊరిలో క్రొత్తగా చర్చి, రాముని దేవాలయము తయారైనవి.
ముస్లీమ్లు రాముని దేవాలయమునకుగానీ, పెద్దమ్మ దేవాలయమునకుగానీ రావడం మానుకొని అల్లా అయిన ఒకే
దేవున్ని ఆరాధించడము తప్ప ఇతర దేవతలకు మ్రొక్కడము తప్పు అని చెప్పుకొనెడివారు. క్రైస్తవులు అందరికీ
సృష్టికర్త అయిన యెహోవానే దేవుడు అనెడివారు. ఇక మిగిలిన హిందువులు మా రాముడే దేవుడు అనెడివారు. ఈ
విధముగా భిన్న భావములచేత ఏకత్వముగా, ఒకే కుటుంబముగానున్న ఆ ఊరిలో భిన్నత్వములు ఏర్పడి అభిప్రాయ
భేదములు పెరిగిపోయాయి. ఆ ప్రాంతములో క్రొత్త ప్రాజెక్టు కట్టడము వలన, ఆ భూములన్నీ సస్యశ్యామలముగా
పంటలు పండి ఊరంతయూ ఆర్థికముగా పెరిగిపోయి మంచి స్థోమత కల్గినవారుగా, ఎంతో సుఖమయ జీవనము
గడుపువారిగా తయారైనారు. అయితే మాయ మతము అను చిచ్చును పెట్టి అది రగులునట్లు చేసి, ఒకరిమధ్య
ఒకరికి ఘర్షణ వాతావరణమును సృష్టించి, వారిని మానసికముగా కృంగదీస్తూ హాయిగా బ్రతుకనివ్వడము లేదు.
ಆ
ఇదంతయు గమనిస్తే నలభై సంవత్సరముల క్రితము ఆర్థిక స్థోమత లేకున్నా, హాయిగా ఒకే కుటుంబముగా
బ్రతుకు ఆ ఊరి ప్రజలు, నేడు మంచి స్థోమతకల్గియున్నా ఐకమత్యము లేనివారై ఒకరికొకరు శత్రువుల వలె
చూచుకొనుచూ, మానసికముగా కృంగిపోయి బ్రతుకవలసివచ్చినది. ఒకప్పుడు ఏక కుటుంబముగాయున్న వారు
నేడు ఒకరినొకరు నమ్మని స్థితిలో బ్రతుకుచున్నారు. దీనికంతటికీ కారణము ఆ ఊరిలోనికి 'మతమ్మారి' (మాయ)
ప్రవేశించడమేనని తెలియుచున్నది. ఒక ఊరిలోనే కాకుండా ఒక దేశములోనే కాకుండా మొత్తము ప్రపంచమంతా
నేడు ఇదే పరిస్థితి ఏర్పడియున్నది. ఇంతమంది మనుషుల తలవ్రాతను మార్చిన మతము ఎక్కడిది? దీనిని ఎవరు
సృష్టించారు? అని ప్రతి మనిషి ప్రశ్నించుకొని చూడవలసిన అవసరమున్నది.
దేవుడు మనుషులకు ప్రసాదించిన మూడు దైవ గ్రంథములలో దేవుని జ్ఞానము కూర్చబడియున్నది. అంతేగాక
దేవుని జ్ఞానమును ఇతరులకు తెలియజేయమని కూడా చెప్పబడినది. అందువలన గ్రంథములలోని జ్ఞానమును
తెలిసినవారు తెలియనివారికి చెప్పడము జరుగుచున్నది. తెలిసినవారు తెలియని వారికి చెప్పడము సేవా ధర్మ
మగును. దేవుని జ్ఞానమును ఇతరులకు తెలియజేయడము దేవునికి సేవ చేసిన దానితో సమానమగును. దేవున్ని
21

Page 22
ఇందువు-క్రైస్తవుడా?
మనిషి పూజించినా లేక ప్రార్థించినా దేవునికి ఇష్టముండదు. తన జ్ఞానమును ప్రచారము చేయు వానినే ఇష్టపడును.
అందువలన దేవుని జ్ఞానమును తెలిసినవారు తెలియని వారికి చెప్పడముకంటే ప్రపంచములో ఉత్తమమైన పనిలేదని
చెప్పవచ్చును. అయితే దేవుడిచ్చిన గ్రంథములలోని జ్ఞానమును ముందు మనము చదివి తెలుసుకొని తర్వాత
ఇతరులకు చెప్పడము సులభమేకదా! ఇందులోని కష్టమేమున్నదని ఎవరైనా అనుకోవచ్చును. అంత సులభమైన
పని దేవుని లెక్కలో ఎంతో శ్రేష్టమైనదయినప్పుడు, ఆ పనినే చేసి దేవునికి ఇష్టునిగా ఉండవలెనని తలచి, కొందరు
దేవుని జ్ఞానమును చెప్పడము దేవుని కార్యముగా భావించి చేయుచున్నారు.
అయితే ఎంతో సులభముగా కనిపించు దైవ జ్ఞానబోధ చాటున కనిపించకుండా మాయ అనునది కూడా ఉ
న్నదని ఎవరికీ తెలియదు. దైవ జ్ఞానము ఎవరికైనా అంత సులభముగా దొరకనట్లు చేయుటకు దేవుడే మాయను
సృష్ఠించి పెట్టాడు. అందువలన జ్ఞానము తెలిసి చెప్పుచున్నానని అనుకొను వానివద్ద దేవుని జ్ఞానమున్నదో లేదో
కూడా అర్థము కానట్లు మాయ చేయుచున్నది. దీనినంతటినీ గమనిస్తే దేవుని జ్ఞానము సులభమైనదని అనుకొనినా,
దేవునికి ఇష్టుడు కానివానికి అతి కష్టముగానే ఉండును. గ్రంథమున్నది, నేను చూచి చదువుకోగలను. జ్ఞాపకము
పెట్టుకొని తిరిగి చెప్పగలను, ఒకమారు చూచినంతమాత్రమున ఎలాగైనా దానిని వర్ణించి చెప్పగలను అని
అనుకొనువారికి కూడా అర్థమైనట్లే ఉన్నా, మాయ ప్రభావము వలన అతను జ్ఞానమునకు ఆమడ దూరములో
ఉండును. అందువలన మొదట జ్ఞానము తెలుసుకొని ఇతరులకు బోధించు వారివద్దనుండి మాయ మొదలై,
జ్ఞానము వినేవాని వరకుయుండి, ఎవనికి ఏది అర్థము కావలెనో, ఎవనికి ఏది అర్థము కాకూడదో అలాగే చూచి
చేయుచున్నది. మాయ ప్రభావమును ఉపయోగించి చెప్పేవానికి కొన్ని విషయములను తెలియకుండ చేయగలదు.
అట్లే వినే వానికి ఏది అర్థము కాకూడదో, ఏది అర్థముకావలెనో అలాగే అర్థమగునట్లు మాయ చేయగలదు. దేవుని
ఆజ్ఞకు లోబడి పని చేయు మాయ, దేవునిమార్గములో స్వార్థ బుద్ధి యున్నవానికీ, కుత్సిత బుద్ధియున్న వానికీ
దేవుని జ్ఞానములోని అసలైన భావమును తెలియకుండా చేసి, వానికి మాత్రము అన్నియు తెలిసినట్లు తృప్తిపొందించును.
అప్పుడు వాడు నాకు దేవుని జ్ఞానము తెలిసింది అనుకొనునుగానీ, వాడు దేవుని జ్ఞానమునకు ఎంతో దూరమున్నట్లు
వానికి ఏమాత్రము తెలియదు. దేవుని జ్ఞానమును బోధించడము అనునది దేవుని సేవ అయినా, మనిషి సక్రమముగా
లేనప్పుడు సేవను మాయ ఎలాగైనా మార్చగలదు.
భూమిమీద ఎందరో బోధకులు మూడు మతములలోనూ ఉన్నారు. మూడు గ్రంథములనుండి జ్ఞానమును
గ్రహించి ఇతరులకు చెప్పగలుగుచున్నారు. అయితే దేవునికి నచ్చని విధానము ఏదున్నా అతనిని దేవుడు ఇష్టపడడు.
మాయ వానిని వదలిపెట్టదు. వానికి తాను గొప్ప జ్ఞానిని అనుకొనునట్లు చేసి, అతనికి తెలియకుండానే దేవునికి
దూరముగా ఉండునట్లు చేయును. ఇప్పుడు ఉదాహరణకు ఒక బోధకుడు తన లోపల ఉద్దేశ్యము ఒకటుండగా
బయటికి మరొక విధముగా మాట్లాడుచు, ఎదుటి వాళ్ళను మభ్యపెట్టాలని చూస్తున్న వ్యక్తి, ఎలా తన బోధను
చెప్పుచున్నాడో చూడండి. మొదట ఒక ఉద్దేశ్యమును బయటికి కనిపించునట్లు వ్రాసి, ప్రకటించి మాట్లాడుచూ
పదిహేను నిమిషములకే మొదటి ప్రకటనకు పూర్తి విరుద్ధముగానున్న తనలోపలి ఉద్దేశ్యమును చెప్పడము పూర్తి
కపటముగా మాట్లాడినట్లగుచున్నది. ముందు ఒకటి చెప్పి తర్వాత రెండవ దారిలోనికి ఉద్దేశ్యపూర్వకముగా తీసుకొని
పోవువారిది కపటబుద్ధియని మనకే తెలిసి పోవుచుండగా, అటువంటి వారిని దేవుడు ఒప్పుకోడు, మాయ ఒప్పుకోదు.
22

Page 23
ఇందువు-క్రైస్తవుడా?
నేను చెప్పునది దేవుని జ్ఞానమేకదా! అని బుకాయించినా దేవుని జ్ఞానమును నీ ఇష్టమొచ్చినట్లు వాడుకొని, దేవుని
జ్ఞానముతో చెలగాటమాడితే అటువంటి బోధకుడు ఎవడైనాగానీ, వానిని మాయ దేవునికి దూరంగా ఉంచి,
దేవుని జ్ఞానము కానిదానినే అతనికి మాయ అంటగట్టగలదు. ఎటువంటి బోధను చూచి దేవుడు ఇష్టపడడో ఉ
దాహరణకు ఒక దానిని చూస్తాము.
ఒక హిందువు క్రైస్తవునిగా మారడము, మారిన తర్వాత అంతటితో ఊరుకోకుండ హిందూమతమును
ప్రేమించునట్లు తిరిగి హిందువుగా మారాలనుకొన్నట్లు పైకి చెప్పుచు క్రైస్తవ మతమును ప్రచారము చేయుటకు
హిందూమతమును ఎరగ వాడుకొనుచు, వేదములను గొప్పగ చెప్పుచు అవి కూడా క్రైస్తవ మతమును సూచించునట్లు
బహు తెలివిగ వ్రాసి ప్రచురించిన ఒక పత్రిక ఇలా కలదు.
నేను
హిందువుగా మారాలనుకుంటున్నాను
నేనీ మధ్య. నాలో నేనే చాలా మథన పడిపోతున్నాను.
నా స్వంత దేశంలో, నా స్వంతవారి మధ్య నేనేదో ఒక నేరం చేసినవాడిలాగా,
అనవసరంగా అవమానం పాలైపోయాను.
ప్రతివాడూ నన్నొక అసహ్యమైన వ్యక్తిగా, అంటరానివాడినిగా చూస్తున్నాడు.
ఒక కుట్రదారుగా, ఒక విదేశీతొత్తుగా నన్ను అందరూ పరిగణిస్తున్నారు. నన్నొక
దేశద్రోహిగా, నీచుడిగా చిత్రీకరిస్తున్నారు.
ఇంతకూ నా వాళ్ళ మధ్యలో నేనింతగా అవమానించబడటానికి కారణం,
నేను యేసుక్రీస్తును నా దేవునిగా స్వీకరించటమే. నా దేశం హిందూదేశం.
తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఈ దేశం నమ్మిన మతం, హిందూమతం.
వేలాది సంవత్సరాలుగా ఈ నేల మీద వేళ్ళూనుకున్న హిందూ మతాన్ని కాదని,
ఎక్కడో విదేశీ గడ్డ మీద పుట్టిన క్రైస్తవ మతాన్ని నేను అవలంబించటం -
సహజంగానే నా సాటి భారతీయులకు బాధ కలిగించింది. వారి బాధను
చూస్తుంటే, నాకూ బాధగానే ఉంది.
నా వాళ్ళ దృష్టిలో నేను అనవసంగా చెడ్డవాళ్లెందుకు కావాలి? ఏదో నాలుగు
తరాల వెనుక మా పూర్వీకులు - ఏ కారణం చేతనో గాని, తెల్లదొరల కాలంలో
క్రైస్తవ మతంలోకి మారారు. ఇప్పుడు చూడబోతే రోజులు మారాయి. ప్రస్తుత
కాలంలో క్రైస్తవుణ్ణని చెప్పుకోవటం ఏమంత గౌరవప్రదంగా లేదు.
అసలిదంతా ఎందుకొచ్చిన గొడవ ? ఏ మతం అవలంబిస్తేనేం ? చిత్తశుద్ధి
ఉంటే చాలదా ? మతం కోసం, నా చుట్టూ వున్న సమాజానికి ఎదురీదటం
ఎందుకు? నా స్వంత వాళ్లకు నేను శత్రువును కావటం ఎందుకు ?
అదీ గాక - నాకసలే దేశాభిమానం మెండు! నా గడ్డ మీద పుట్టిన మతాన్ని
ప్రపంచానికి చాటి చెప్పటం నాకు గౌరవంగా వుంటుంది గానీ, పరాయి దేశం
వాళ్ళ మతాన్ని నేను నెత్తిన పెట్టుకోవటం నాకు మాత్రం ఏమంత గౌరవంగా
వుంటుంది?
23

Page 24
ఇందువు-క్రైస్తవుడా?
నాకు, నా వాళ్ళ మధ్యలో మళ్లీ గౌరవం పొందాలని వుంది! అందుకే, నేను
మళ్ళి హిందువుగా మారిపోవాలను కుంటున్నాను.
అయితే నేను హిందువుగా మారాలంటే ఏం చేయాలో నాకర్థం కాలేదు.
ఏ గ్రంథాన్ని నేను ప్రామాణికమైనదిగా ఎంచాలి ? ఏ దేవుణ్ణి సృష్టి,
లయకారకుడిగా ఎంచాలి? నేను అయోమయంలో పడిపోయాను.
ఏమైనా సరే - నేను హిందువుగా మారి, నా దేశంలో నేను మళ్ళీ
గౌరవనీయమైన వ్యక్తిగా జీవించాలన్న ఆశ మాత్రం చావలేదు.
ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైన పురాణ గ్రంథాలను కాస్త ప్రక్కనపెట్టి
అసలు హిందూమతానికి "పునాది" వంటి వేదాల మీద దృష్టి నిమగ్నం చేయాలని
తీర్మానించాను.
ఆర్య సమాజ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతిగారు చెప్పిన మాట
కూడా అదే కదా ?.
-
"వురాణ గ్రంథాలు ప్రామాణికమైన దేవోక్తులు కావు వేదములే
ప్రామాణికమైనవి. గనుక పురాణ గ్రంథాలను విడిచిపెట్టి, వేదాలను
పరిశోధించండి. వైదిక మార్గము నవలంబించుడి" అని నినదించారు -
దయానంద సరస్వతి గారు.
ఆ మాటలు చెప్పినందుకు దయానంద సరస్వతిగారిని దేశద్రోహి అని గాని
విదేశీతొత్తు అని గానీ ఎవరైనా అనగలరా?
అపచారం! అపచారం !! దయానంద సరస్వతిగారిని హిందూమత
సంస్కర్తగా ఆధునిక ప్రవక్తగా యావత్తు భారతీయ సమాజం గౌరవిస్తూ వుంది.
అందుచేత నేను స్వామీదయానంద సరస్వతుల వారి సందేశాన్ననుసరించి,
వేదగ్రంథాలలో చెప్పబడిన మార్గంలోనే ఆ పరమాత్ముని చేరుకోవాలని, ఆయనను
తెలుసుకోవాలనీ సంకల్పించాను. వేదకాలంలో భారతీయ ఋషిపుంగవులు
నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నేను దేవుణ్ణి చేరుకోవాలని ఆశించాను.
ఈ ఉద్దేశ్యంతో పరిశోధన సాగించిన నాకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది -
ప్రస్తుత కాలపు భారతీయ సమాజం, వేదకాలపు హిందూమత సిద్ధాంతాలను
man m
24

Page 25
ఇందువు-క్రైస్తవుడా?
వేదకాలపు హిందూమత సిద్ధాంతం ప్రకారం, మానవుడు పరమాత్ముని
సన్నిధికి చేరేటప్పుడు జంతురక్త ప్రోక్షణం తప్పనిసరి అని నేను గమనించాను.
వేదకాలంలో హిందువులు, బలులు అర్పించారు. యజ్ఞాలు నిర్వహించారు.
“సర్వపాపపరిహరో రక్తప్రోక్షణ మవశ్యమ్" - అంటే "రక్తం చిందింపకుండ
పాపక్షమాపణ కలుగదు" అని ఎలుగెత్తి చాటి చెప్పారు.
సర్వవిశ్వపాప పరిహారం కొరకు ఒక యజ్ఞం జరగాల్సి వుందని వేదకాలపు
హిందూ ఋషులు నమ్మారు. ఆ యజ్ఞానికి "అజామేధం" అని పేరు పెట్టారు.
ఒక మచ్చలేని మేకను తేవాలి. దాని తలమీద బలుసు కంపను చుట్టి కిరీటంగా
పెట్టాలి. ఆ మేకను ఒక చెక్కబల్లకు మేకులతో కొట్టి వేలాడదీయాలి. దాని ఎముకలు
విరుగకుండా జాగ్రత్తగా దాని రక్తమంతా ఓడ్చాలి. అలా ఆ మేక చనిపోయిన
తరువాత మళ్ళీ దానికి ప్రాణం పోయాలి. అదీ "అజామేధం” అంటే!
మళ్ళీ మొదటికొచ్చింది, వ్యవహారం! వేదకాలపు హిందువుల మతాన్ని నేనూ
నమ్మితే చచ్చినట్టు మళ్ళీ నేను యేసుక్రీస్తునే నా దైవంగా నమ్ముకోవలసి వస్తుంది!
ఎందుకంటే సామవేదవు ప్రవచనం ప్రకారం సర్వలోక పాపపరిహారార్థం తన
రక్తాన్ని చిందించి బలిగా మరణించి లేచినవాడు యేసుక్రీస్తు ఒక్కడే మరి!
.
ఇప్పుడు నేను క్రీస్తుకు దూరం అయితే తప్ప, నా సోదర భారతీయులు నన్ను
గౌరవించరు, ఆదరించరు అలా నేను క్రీస్తుకు దూరమవ్వాలంటే వేదాలను
తృణీకరించట మొక్కటే మార్గం.
అంతటి దారుణానికి నేను ఒడిగట్టలేను, వేదాలను నేను తృణీకరించ లేను
వేదాలలో చెప్పబడిన రక్తప్రోక్షణ, యజ్ఞంనకు అక్కరలేదని కొందరు చెబుతున్నారు.
అలా చెప్పటం సనాతన హిందూ ధర్మానికి తీరని ద్రోహం చేయటమే
మన వేదాలలో యజ్ఞాన్ని గూర్చిన ప్రస్తావన, వివరణా ఎంత స్పష్టంగా.
వున్నదంటే వేదాలను గౌరవించేవారు క్రీస్తుప్రభువును యజ్ఞపురుషుడుగాని
విశ్వవిమోచకునిగా జగద్రక్షకునిగా అంగీకరించక తప్పటంలేదు. క్రీస్తుప్రభువు పట్ల '
అకారణద్వేషం పెంచుకున్న కొందరు భారతీయ పండితులకు ఈ పరిస్థితి
మింగుడు పడటంలేదు. వేదాలలో దాగిన క్రీస్తు సిలువయజ్ఞాన్ని మరుగు
చేయడానికి సదరుపండితులు ఒక వితండ వాదాన్ని ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు.
25

Page 26
వేదకాలపు యజ్ఞాలలో జంతురక్తాన్ని చిందించే హింసాత్మక విధానం లేనేలేదనీ
వేదకాలపు ఆర్యులు తాము పండించిన వ్యవసాయ ఫలాలను, ధాన్యాన్ని దేవతలకు
అర్పించటాన్నే వారు "యజ్ఞం" అని పిలిచారనీ వారి వాదన.
అయితే ఇదంతా అసలు సత్యాన్ని మరుగుచేయడానికి కొందరు చేస్తున్న
వ్యర్థప్రయత్నం, వృధా ప్రయాస తప్ప మరేమికాదు. ఆర్యులు సస్యద్రవ్యాలను దేవతలకు
అర్పించినమాట వాస్తవమే కానీ పాప పరిహారం కోసం మాత్రం వారు జంతురక్త
ప్రోక్షణాన్ని జరిగించారనటానికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. సందేహం లేదు. -
"రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు" అని ప్రాచీన భారతీయ
వేదఋషులు నమ్మారు. (ఈ విషయంలో నత్యాన్ని రుజువులతో నహా
తెలుసుకోగోరేవారు నన్ను సంప్రదించవచ్చు)
దేశభక్తుడినైన నేను, సనాతన హిందూ ధర్మాన్ని, వేదాలను గౌరవించే నేను,
సర్వలోకపాప పరిహారం కోసం యజ్ఞమై తిరిగి లేచిన యేసును విడిచి పెట్టడం
ఎలా న్యాయం అవుతుందో నాకు అర్థం కావటం లేదు! యజ్ఞం అక్కర్లేదని ఇప్పుడు
వాదించటం, వేదఋషులను వెర్రిబాగుల వాళ్ళ క్రింద జమకట్టటమే అవుతుంది.
వేదకాలపు హిందూఋషుల పట్ల నా గుండెల్లో అపారగౌరవాన్ని పెంచుకున్న నేను
యజ్ఞపురుషుడైన యేసుక్రీస్తులో నెరవేరిన "అజామేధం" లో విశ్వాసముంచక
తప్పటంలేదు - నా విశ్వాసాన్ని నా సోదర భారతీయలకు చెప్పక తప్పటంలేదు.
నన్ను ఇంకేం చేయమంటారు ??
సత్యమేవ జయతే నానృతమ్
సత్య సంస్థాప నాభిలాషి
రచయిత చిరునామా
అద్దంకి రంజిత్ ఓఫీర్
యం.ఐ.జి. 877, కె.పి.హెచ్.బి. కాలనీ,
హైదరాబాద్ - 500 072 ఫోన్: 040-3058536
ప్రచురణ
పి. సంగీతరావు
అద్దేపల్లి (Post), భట్టిప్రోలు (Post & Mandal), గుంటూరు జిల్లా.
పన్ - 522256. ఆంధ్రప్రదేశ్.
26
ఇందువు-క్రైస్తవుడా?

Page 27
ఇందువు-క్రైస్తవుడా?
ఇది చదివిన తర్వాత అర్థమైనదేమంటే మొదట హిందూమతము మీద అభిమానముగా ప్రేమను ఉలకబోసిన
విధానము ఒక వ్యూహము ప్రకారము చెప్పినది. క్రైస్తవమత ప్రచారములో భాగమే మొదట నేను తిరిగి హిందువును
కావాలనుకోవడము. మొదట హిందూమతము వదలి క్రైస్తవునిగ మారినపుడే హిందూమతము మీద లేని అభిమానము
తర్వాత వచ్చిందని చెప్పడము ఇతరులను మభ్యపెట్టుటకని తెలియుచున్నది. హిందూ మతములోని జ్ఞానమును
తెలియని స్వాములు కొందరు చేసిన ప్రచారము లను ఆధారముగ చేసుకొని, వాటి బలహీనతను బయటికి చెప్పుచు,
హిందూ మతమునే కించపరచడము జరిగినది. హిందూమతమునకు పునాది వంటివి వేదాలని చెప్పడము, దయానంద
సరస్వతి సందేశాన్ననుసరించి వేద గ్రంథాలు చెప్పిన మార్గములోనే పరమాత్ముని చేరుకోవాలని చెప్పడము, ఆ
మాటలు చెప్పిన దయానంద సరస్వతిని దేశద్రోహీ అనిగానీ, విదేశీతొత్తు అనిగానీ ఎవరైనా అనగలరా అని చెప్పడము
చూస్తే, హిందువుల వ్రేలుతో హిందువుల కన్నునే పొడిచినట్లున్నది.
మానవులకున్న మూడు గుణముల విషయములే వేదములని “త్రైగుణ్య విషయా వేదా” అను భగవద్గీత
మాటకు, దయానంద సరస్వతి వేదములే దేవున్ని తెలుసుకొనుటకు ఆధారమని చెప్పుట వ్యతిరేఖము కాదా! గుణ
విషయములే వేదములని “గుణమయి మమ మాయా” గుణములే మాయ అని, గుణములతో కూడివున్న మాయను
దాటుట దుస్సాధ్యమని, గుణములతో కూడిన వేదములను వదలినపుడే దేవున్ని తెలియవచ్చునని, గీతలో దేవుడు
చెప్పగ వేదములు ముఖ్యమని దయానంద సరస్వతి ఎలా చెప్పగలడు. ఒకవేళ చెప్పివుంటే హిందూమతములోని
నిగూఢమైన జ్ఞానము ఆయనకు కూడా తెలియదనియే చెప్పవచ్చును.
వేదములు ప్రపంచమునకు సంబంధించినవి. వాటిని ఆధారము చేసుకొన్నవారు మాయా ప్రపంచములోనే
ఉండగలరు. కాని దైవ సంబంధమైన మోక్షమును పొందలేరు. వేదాలను పట్టుకొని దేవున్ని తెలుసుకోవాలనుకోవడము
కుక్కతోకను పట్టుకొని గోదావరి ఈదగలనను కోవడము వంటిదే అగును. వేద సిద్ధాంతములను అనుసరించి
మానవుడు పరమాత్మను చేరుటకు జంతురక్త ప్రోక్షణం తప్పనిసరి అని అద్దంకి రంజిత్ వ్రాయడము హాస్యాస్పదము.
కర్మయోగము వలనగానీ, బ్రహ్మయోగము వలనగానీ దేవుడు తెలియబడుతాడని బ్రహ్మవిద్యాశాస్త్రమైన గీతయందు
చెప్పారు గానీ, జంతురక్తము కార్చడము వలన మనిషికి దేవుడు తెలియ బడడు. ఈ మాటలు దైవజ్ఞానము
ఏమాత్రము తెలియనివారు వ్రాసినవిగా అర్థమగుచున్నది.
యజ్ఞమును గురించి వ్రాయుచు రక్తముతో చేయాలని వ్రాసినారు. యజ్ఞములంటే ఇంతవరకు హిందూ
స్వాములకే సరిగ్గా అర్థముకాలేదు. అటువంటి యజ్ఞములను గురించి ఇతర మతస్థులు మాట్లాడడము ఉట్టి
కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినానన్నట్లున్నది. యజ్ఞములు రెండు రకములని అవి శరీరములోపల జరుగుచున్నవని
“త్రైత సిద్ధాంత భగవద్గీత” లో స్పష్టముగ చెప్పబడియున్నది. నేను కూడా ఏసును దేవునిగా భావించి ఆయనను
గురించి ఆయన బోధల గురించి ఎంతో గొప్పగ చెప్పుచున్న వాడినే. అయినప్పటికీ మేము మతానికి అతీతమైన
దేవున్ని ఏసులో చూశాము.
'సర్వ పాపపరిహారో రక్తప్రోక్షణ మవశ్యకమ్' అని ఒకమాటను తీసుకొని మన పాపము పోవుటకు ప్రభువు
రక్తము కార్చాడని చెప్పుచున్నారు. పాపము పోవాలంటే రక్తము కారాలని చెప్పారుగానీ, ఫలానావారి రక్తమని ఆ
పదములో లేదు కదా! పాపము అనుభవిస్తేగాని అయిపోదు. ఆ విషయమును మనము తెలుసుకొనునట్లు
27

Page 28
ఇందువు-క్రైస్తవుడా?
దేవుడు ప్రత్యక్షముగా చూపు చున్నాడు. ఉదాహరణకు ఒకడు బస్సు క్రిందపడి గాయాలపాలై రక్తము కారునపుడుగానీ,
ఇతర ప్రమాదములు జరిగినపుడుగానీ అతన్ని మనము చూచినపుడు పాపము! ఎంతపని అయినది అని మనము
అంటుంటాము. ఇక్కడ మనకు తెలియకుండానే పాపము అని పలుకబడుచున్నది. దీనిని బట్టి వాడు రక్తము
కార్చుచు బాధపడడము పాపము వలననే అని, దేవుడే మనలోపలినుండే గుర్తు చేసినట్లున్నది. పాపము పరిహారము
కావాలంటే దానిఫలితమైన బాధను అనుభవించవలసిందే. ఎవడు బాధపడితే వాని పాపము అయిపోతుంది. ఇది
శాస్త్రబద్ధమైన సూత్రము. రక్తము కారుట వలన పాపము పోతుందని మేము కూడా ఒప్పుకుంటాము. కానీ
ఎవరినో చంపి మన పాపము పోతుందని అనుకోవడము పొరపాటు. నీ పాపము పోతుందని ఇతరులను బాధించినా,
వారి రక్తమును కారునట్లు చేసినా, క్రొత్త పాపము వచ్చి చేరుతుంది కాని పాతది పోదు. ప్రభువును చంపి
పాపమును మూటగట్టుకొన్న కైపావంటి గురువులు ఆయన మరణము వలన మన పాపము పోయిందని మాట్లాడిన
మాటలను నేటి క్రైస్తవులు మాట్లాడడము శోచనీయము.
మనము నిత్యము అనుభవిస్తున్న బాధలు పాప కళంకములు కావా! ప్రభువు మరణముతో మన పాపములు
పోయివుంటే నేడు ఏ క్రైస్తవుడైన పాపము అనుభవించకుండ, బాధపడకుండా, రక్తము కారకుండ భూమిమీద ఉ
న్నాడా? ప్రభువును బలవంతముగా చంపి, పాపము మూటగట్టుకొన్న మానవాళి, ఆయన జ్ఞానముతో ఆ పాపమును
పోగొట్టుకోవాలి కానీ నాకు పాపమే లేదు అనుకోవడము పొరపాటు. పాపపుణ్యములు కంటికి కనిపించు నవి
కావు. కనిపించని దానిని గురించి పోయింది అనుకోవడముకంటే ఉన్నదని పాపభీతికల్గి ప్రభువు అందించిన
జీవజలము అను జ్ఞానముతో పాపమును కడిగివేసుకొనువాడు నిజమైన క్రైస్తవుడని మేము నమ్ము చున్నాము.
అట్లుకాక మన తెలివిని మత ప్రచారమునకు వినియోగిస్తూ ప్రభువు చెప్పిన మాటలను వక్రమార్గము పట్టించువాడు
ఎప్పటికీ ప్రభువు భక్తుడు కాలేడు.
ఇదంతయు గమనిస్తే దైవ గ్రంథమైన బైబిలులో దేవుడు వేదములు గొప్పవని చెప్పాడా? లేదు. అందులో
వేదముల ప్రసక్తే ఏసు ఎప్పుడూ తీసుకురాలేదు. ప్రథమ దైవ గ్రంథమైన భగవద్గీతలో దేవుడు నేను వేదముల
వలన తెలియబడుతానని చెప్పాడా? ఎక్కడా అలా చెప్పలేదు. పైగా వేదములు గుణముల సమ్మేళనము అని
సాంఖ్యయోగము 45వ శ్లోకమున చెప్పాడు. అంతేకాక వేదములే నా మాయయని విజ్ఞానయోగమున 14వ శ్లోకమున
చెప్పాడు. విశ్వరూప సందర్శన యోగమున 48 మరియు 53వ శ్లోకమునందు వేదముల వలన నేను తెలియబడనని
స్వయముగా దేవుడే చెప్పాడు. అటువంటి దేవుని మాటలను కాదని దైవ గ్రంథములకు వ్యతిరేఖముగా
మాట్లాడుచున్నానను జ్ఞాపకము ఏమాత్రము లేకుండా చెప్పడము జరిగినది. అంతేకాక మొదట హెడ్డింగులో
ఒకమాటను చూపి చివరికి వేరొక ఉద్దేశ్యమును తెలుపడము దేవుని జ్ఞానముతో, మనుషుల జీవితములతో ఆడుకొన్నట్లు
కాదాయని అడుగుచున్నాము. వారి తలలోనే స్థానము ఏర్పరచుకొన్న మాయ వారిని దేవుని జ్ఞానమును తెలిసినవారిగా,
బోధకులుగా నమ్మించి, మాయతో కూడుకొన్నవని స్వయముగా దేవుడే చెప్పిన వేదములను, మాయ అతని మెదడుకు
అతికించివేసినది. ఏ వేదములైతే తనను తెలుపలేవని అన్నాడో, ఏ వేదముల చేత నన్ను తెలుసు కొనుటకు శక్యము
కాదు అని దేవుడు అన్నాడో, అదే వేదములయందు అతని ధ్యాస ఉండడమునుబట్టి అతడు దేవునికి చాలా
దూరముగా మాయ చేత నెట్టివేయబడినాడని తెలియుచున్నది.
28

Page 29
ఇందువు-క్రైస్తవుడా?
ఏసును నిజమైన దేవుడని, బైబిలు నిజమైన దైవ గ్రంథమని నమ్మియున్నాను కదా! అటువంటి నేను
దేవునికి దూరముగా ఉండడ మేమిటి? తనమీద అసూయతో వ్రాసిన వ్రాతలని మా మాటను తేలికగా తీసుకొనినా
తీసుకోవచ్చును. దేవుని నిజతత్త్యమును తెలియక, దేవున్ని పొగిడినంత మాత్రమున, ఎవరంతకు వారు మేము
దేవునికి దగ్గరగాయున్నా మని అనుకొన్నంతమాత్రమున, అటువంటివారిని దేవుడు ఒప్పుకోడు, దేవుని ధర్మములూ
ఒప్పుకోవు. దైవ నిర్మితమైన మాయ ఏమాత్రమూ ఒప్పుకోదు. బైబిలు గ్రంథములోగానీ, ఏసు జీవితములోగానీ
ఎక్కడా చెప్పని వేదములను గురించి మీకెందుకు అంతప్రేమ అని అడుగుచున్నాను. ఏసు తన చివరి మాటగా
తండ్రియొక్క, కుమారునియొక్క, పరిశుద్ధాత్మయొక్క నామము లోనికి బోధించుచూ, నేను మీకు ఏయే సంగతులు
ఆజ్ఞాపించితినో వాటినే బోధించవలెనని చివరిలో చెప్పిపోగా, ఆయన మాటను కాదని, ఆయన చెప్పని మాటలతో
మనుషులను మభ్యపరచడము, జ్ఞానరీత్యా మంచిదా? అని అడుగుచున్నాము.
ఏసునందు విశ్వాసముంచిన ఏ క్రైస్తవుడైనా గానీ, తాము అనుసరిస్తున్న బైబిలు గ్రంథములోని జ్ఞాన
విషయములే మాట్లాడవలెను గానీ, వేదములను గురించి మాట్లాడడము వాటిని పొగడడము బైబిలుకు వ్యతిరేఖమగును.
రెండవ దైవ గ్రంథమైన బైబిలులో లేని జ్ఞాన విషయములు వేదములలో ఉన్నాయా? ఏసు ప్రభువు చెప్పని విషయములను
దయానంద సరస్వతి చెప్పాడా? ప్రథమ దైవ గ్రంథమైన భగవద్గీతలో వేదాధ్యయనము వలన నన్ను తెలియుటకు
శక్యముకాదు అని దేవుడు చెప్పితే, దేవుని మాటను కాదని, దయానంద సరస్వతి చెప్పాడని, వేదములను గురించి
చెప్పుకోవడము వలన, దేవున్ని దేవుని మాటను అవమానపరచినట్లే యగుచున్నది. దేవుని మాటకంటే ఒక మనిషి
చెప్పిన మాటే గొప్పగ ఎలాగ కనిపించినదో మాకు అర్థము కాలేదు. ఈ విషయములన్నీ గ్రహించిన మేము దేవుని
జ్ఞానమునకు విలువ పెరుగునట్లు చేయుటకు ఇతరులు వ్రాసిన వాక్యములను మీకు తెలియచేసి, వాటిలోని
అసత్యమును ఖండించి వాస్తవ జ్ఞానమును తెలియజేయాలని అనుకొన్నాము. ఆ నేపథ్యములో ఇప్పుడు అద్దంకి
రంజిత్ కుమార్ గారు రచించిన “హైందవ క్రైస్తవము” అను పుస్తకములో 4వ పేజీలోని ఒక వాక్యమును ఇక్కడ
విశ్లేషించి చూస్తాము.
“ప్రధానముగా వేదం సృష్టికర్తను గురించే మాట్లాడు తుంది. దేవున్ని చేరే మార్గమును చెప్పవు.
అనడము వేదాలను అవమానించడమే అవుతుంది.”
వేదాలను అవమానించాలనేది మాకేమైనా కోర్కెనా? మేము సత్యమును మాట్లాడుచున్నాము అసత్యమును
ఖండించుచున్నాము. ఆ పనిలో తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పడము ప్రపంచరీత్యా న్యాయము.
దైవజ్ఞానరీత్యా ధర్మము. మేము ఊరక దేనినీ ఖండించడము లేదు. శాస్త్రబద్ధతను అనుసరించి ఖండించి
చెప్పవలసియున్నది. దేవునికి సంబంధించిన శాస్త్రము బ్రహ్మవిద్యాశాస్త్రము. దానినే ధర్మశాస్త్రము అని కూడా
అంటారు. బ్రహ్మవిద్యాశాస్త్రమును ఉపయోగించి ప్రపంచములోని అనేక వాక్యములను ఏది దైవికమైనది, ఏది
దైవికము కానిదో నిర్ణయించి చెప్పవచ్చును. అయస్కాంతమును పట్టుకొని లోహములను తాకినప్పుడు ఏది
ఇనుమో, ఏది బంగారమో బయటపడును. అంతవరకు బంగారు రంగును పూసుకొన్న ఇనుమును కూడా మనము
బంగారమని అనుకొను అవకాశము కలదు. నేడు భూమిమీద ఎందరో ఎన్నో మాటలను దైవ సంబంధమైనవని
29

Page 30
ఇందువు-క్రైస్తవుడా?
చెప్పుచున్నారు. అలాగే ఎందరో దైవ సంబంధ విషయములని ఎన్నో గ్రంథములను వ్రాశారు. వాటన్నిటిని కాదు
అనిగానీ, ఔను అనిగానీ అనుటకు ఒక ఆధారముండాలి. ఆధారము లేకుండా దేనినీ ఖండించలేము, అలాగే
సమర్థించనూ లేము. ఏ విధముగా అయస్కాంతమును ఉపయోగించి ఒకే రంగున్న బంగారును ఇనుమును వేరుపరచి
కనుగొనుచున్నామో, శాస్త్రమును ఉపయోగించి అసలును నకిలీని, సత్యమును అసత్యమును, ధర్మమును
అధర్మమును గుర్తించవచ్చును. ప్రపంచ విషయములను తెలుపుటకు ఐదు శాస్త్రములుండగా, కేవలము దేవుని
విషయములో సత్యాసత్యములను తేల్చి చెప్పునది బ్రహ్మవిద్యా శాస్త్రము అని చెప్పవచ్చును. దానినే కొందరు
ధర్మశాస్త్రమని కూడా చెప్పుచుందురు.
భూమిమీద ఏ మనిషి చెప్పిన వాక్యముగానీ, లేక ఏ గ్రంథములోని వ్రాతగానీ అది దైవికమైనదా కాదా అను
సత్యమును తెలియుటకు మనకు ధర్మశాస్త్రము (బ్రహ్మవిద్యాశాస్త్రము) అవసరము. ముందు అయస్కాంతము
ఫలానాది అని తెలియగలిగినప్పుడు, దానిని ఉపయోగించి ఇనుమును ఆకర్షించవచ్చును. అలాగే మొదట
శాస్త్రములంటే ఏమిటి? అందులో ధర్మశాస్త్రము ఏది? అని తెలియగలిగినప్పుడు దానిని ఉపయోగించి గ్రంథములోని
వాక్యమునుగానీ, మనుషులు చెప్పిన వాక్యమునుగానీ దైవిక సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదాయని తేల్చి
చెప్పవచ్చును. సమాజమును అసలైన దేవునివైపు నడిపించుటకు కొన్ని వాక్యములనుగానీ, కొందరి మాటలనుగానీ,
తప్పక శాస్త్రమును ఉపయోగించి చూచి సరియైన దైతే, సమర్థించి ప్రజలకియ్యవలెను. సరియైనది కాకపోతే,
ఖండించి అది తప్పని చెప్పి ప్రజలను మోసపోకుండ చూడవలెను. ఈ కార్యము కొంత కష్టమైనదైనా, దేవుని
మార్గమును సరళము చేయుటకు చేతనైనవారు చేయవలసిన పనియని తెలియవలెను. అలా చేయుట వలన జ్ఞాన
రూపములో కల్తీ అయిన దేనినైనా తీసివేసి ప్రజలకు స్వచ్ఛమైన జ్ఞానమును అందించవచ్చును. ప్రపంచములో అన్ని
కార్యములలోకెల్ల జ్ఞానమార్గమును సరళము చేసి, ఏ ఆటంకములు లేకుండా చూచి, వాటివలన ప్రక్కదారి పట్టిపోకుండా
చేయడము అత్యంత ఉన్నతమైన కార్యమగును. అటువంటి ఉన్నత కార్యమును చేయుటకు ముందు మనము
ప్రపంచములోనున్న షట్ శాస్త్రములలో ధర్మశాస్త్రమేదో మొదట తెలుసుకొందాము.
ధర్మశాస్త్రము దేవునికి తప్ప ఏ మనుషులకు తెలియదు. అందువలన దేవునిచేత చెప్పబడినదే
ధర్మశాస్త్రమగును. దేవుడు తప్ప మనుషులు చెప్పినది ధర్మశాస్త్రము కాదు. దేవుడు ప్రత్యక్షముగా కాకుండా
పరోక్షముగా చెప్పినవి మూడు గ్రంథములు భూమిమీద గలవు. ఆ మూడింటిని దైవ గ్రంథములు అంటాము. ఆ
మూడు దైవ గ్రంథములలో ధర్మశాస్త్రము సంపూర్ణముగా కలదు. ధర్మశాస్త్రమును అనుసరించి దేవుడు మూడు
గ్రంథములను తయారు చేసి మానవాళికి ఇచ్చాడు. ఆ మూడు గ్రంథములనే ప్రథమ దైవ గ్రంథమని మొదటి
దానినీ, ద్వితీయ దైవ గ్రంథమని రెండవ దానినీ, అంతిమ దైవ గ్రంథమని మూడవ దానినీ అంటున్నాము. ప్రథమ
దైవ గ్రంథముగా భగవద్గీత, ద్వితీయ దైవ గ్రంథముగా బైబిలు, అంతిమ దైవ గ్రంథముగా ఖుర్ఆన్ గ్రంథములు
గలవు. దేవుని విషయములో ఏది సత్యమో, ఏది సత్యముకాదో, ఏది ధర్మమో, ఏది ధర్మముకాదో తేల్చి చెప్పునవి
ఈ మూడు గ్రంథములేనని తెలియవలెను. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి చూస్తాము. పైన వేదములకు
సంబంధించిన వాక్యమును చెప్పుకొని, అది దేవునికి సంబంధించినదా లేక మాయకు సంబంధించినదా అని
చూచుటకు ధర్మ శాస్త్రమును వినియోగించుకొందాము. ఇతరులు వేదమునకు సంబంధించిన ఆ వాక్యము దేవునికి
30

Page 31
ఇందువు-క్రైస్తవుడా?
సంబంధించినదనీ, ఎవరైనా దేవునికి సంబంధించినది కాదు అంటే వేదములను అవమానపరచినట్లనీ చెప్పారు.
అందువలన వారు చెప్పిన మాటను మూడు దైవ శాస్త్రములను అనుసరించి చూస్తే, బైబిలు గ్రంథములో వేదముల
ప్రసక్తే లేదు. అలాగే ఖుర్ఆన్ గ్రంథములో కూడా వేదముల ప్రస్తావన రాలేదు. ఇక ప్రథమ దైవ గ్రంథమైన
భగవద్గీతలో మాత్రము వేదములను గురించి చెప్పడము జరిగినది.
భగవద్గీతలో సాంఖ్యయోగమున 45వ శ్లోకమందు “త్రైగుణ్య విషయా వేదా” అని ఒకచోట, విజ్ఞాన యోగమున
14వ శ్లోకమందు "గుణమయీ మమ మాయా దురత్యయా” అని ఒకచోట, అలాగే విశ్వరూప సందర్శన యోగమున
48వ శ్లోకమందు మరియు 53వ శ్లోకమందు వేదములను గురించి చెప్పడము జరిగినది.
శ్లో॥ 48.
శ్లో॥ 53.
నవేద యజ్ఞా ధ్యయనైర్న దానైర చక్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవం రూప శృక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర ॥
నాహం వేదైర తపసా నదానేన నచేజ్యయా
శక్య ఏవం విధోద్రష్టుం దృష్ట వానసి మాం యథా ॥
48) భావము :- అర్జునా! భూమిమీద నీవు తప్ప ఈ రూపమును చూచినవారు ఎవ్వరూ లేరు. యజ్ఞముల
వలనగానీ, వేదముల వలనగానీ, దానముల వలనగానీ, తపస్సులచేతగానీ నన్ను చూచుటకు ఎవరికీ శక్యము కాలేదు.
53) భావము :- తపస్సుల చేతగానీ, దానములచేతగానీ, యజ్ఞముల చేతగానీ, వేదాధ్యయనము చేతగానీ ఇప్పుడు
నీవు చూచిన ఈ రూపమును చూచుటకు సాధ్యపడదు.
సాంఖ్యయోగములో వేదములందు మూడు గుణముల విషయములే ఉన్నాయని 45వ శ్లోకమున చెప్పిన
భగవంతుడు, విజ్ఞానయోగమున గుణములతో కూడుకొన్న నా మాయను జయించుట దుస్సాధ్యమని 14వ శ్లోకమున
చెప్పాడు. తర్వాత విశ్వరూప సందర్శన యోగమున 48, 53వ శ్లోకములలో యజ్ఞముల వలనగానీ, వేదములవలనగానీ,
తపస్సుల వలనగానీ, దానముల చేతగానీ నన్ను తెలియుటకు శక్యముకాదు అని చెప్పాడు. భగవంతుడు చెప్పిన
మాటలనుబట్టి ప్రకృతి చేత పుట్టిన గుణముల విషయములే వేదములందు ఉన్నాయనీ, గుణములనే మాయ అంటారనీ
చెప్పాడు. అప్పుడు వేదములు మాయతో కూడుకొన్నవని ప్రత్యేకముగా చెప్పకనే చెప్పినట్లున్నది. ఇదంతయు
గమనిస్తే ధర్మశాస్త్రమైన భగవద్గీత గ్రంథము వేదములనుండి మానవున్ని దూరముగా ఉండమని చెప్పుచున్నట్లు
తెలియుచున్నది. మరియు వేదముల వలన దేవుడు ఎప్పటికీ తెలియడని విశ్వరూప సందర్శనయోగములో
తెలిసిపోయినది.
బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో, వేదములను గురించి స్వయముగా భగవంతుడే వీటి వలన నేను
తెలియబడను అని చెప్పినప్పుడు ఆ మాటను వదలి, మానవుడైన దయానంద సరస్వతో, ప్రేమానంద బృహస్పతో
చెప్పిన మాటలను ఎందుకు పరిగణనలోనికి తీసుకొనవలెను? భగవద్గీత భూమిమీద మొట్టమొదట తెలిసిన
ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రములోని దేవుని మాటను వదలి, వేదములను గురించి గొప్పగ చెప్పవలసిన అవసర
మేమివచ్చినదని మేము ప్రశ్నించుచున్నాము. భూమిమీద స్వాములము, గురువులము, భగవానులము అని పేరు
31

Page 32
ఇందువు-క్రైస్తవుడా?
పెట్టుకొన్న వారందరూ నిజముగా గురువులు కారు, భగవంతులు కారు. అటువంటి వారి మాటలను విని తప్పుదారి
పట్టవలసిన అవసరము లేదు. వేదములు, పురాణములు చదివిన వారికి భగవద్గీతలో వేదముల గురించి చెప్పిన
విషయము తెలియకుండా ఉంటుందా? బహుశా తెలిసేవుంటుంది. ఇప్పుడు మరొక వాక్యమును చూస్తాము.
“హైందవ క్రైస్తవము” అను పుస్తకములో 5వ పేజీలో ఈ విధముగా వ్రాయబడి వున్నది.
"వేదాలు కరుణామయుడైన పరాత్పరుడు మానవాళికి ప్రసాదించిన తొలి జ్ఞానదీపము"
ఈ వాక్యమునుబట్టి వేదములను దేవుడే సృష్టించాడని అందరికీ అర్థము కాగలదు. అయితే ఈ మాట
పచ్చి అబద్ధమా లేక వట్టి నిజమా అని యోచించి, ఆలోచించి చూస్తాము. వేదాలను, పురాణములను దేవుడు
వ్రాయవలసిన అవసరము లేదు. వేదములు గుణములతో కూడుకొన్నవి. కావున గుణములున్న మనుషులే వాటిని
వ్రాయగలరు. దేవుడు గుణములు లేనివాడు, కావున దేవున్ని గుణాతీతుడు అని అంటారు. జీవుడైనవాడు
తలలోని గుణచక్రములో పన్నెండు గుణములయందు చిక్కుకొని ఉన్నాడు. దేవుడు జీవునివలె గుణములలో
లేడు. అందువలన ఆయన గుణాతీతుడు. గుణాతీతుడైన దేవున్ని పై వాక్యములో కరుణామయుడు అని సంబోధించి
చెప్పాడు. ఏ గుణముతో సంబంధము లేనివానిని ఒక గుణముతో ముడివేసి కరుణామయుడు అనడము దేవున్ని
పొగిడినట్లా, లేక కించపరిచినట్లా మీరే ఆలోచించండి. గుమస్తా స్థానములో యజమానిని కూర్చోబెట్టడము వలన
యజమానిని అవమానించినట్లు కాదా! యజమాని స్థానము గొప్పది, గుమస్తా స్థానము చిన్నది అయివుంటుంది.
అటువంటప్పుడు యజమానిని గుమస్తా స్థానములో ఉంచడము వలన యజమానిని గుమస్తా స్థాయికి
దిగజార్చినట్లగును. అందువలన జ్ఞానము తెలిసినవాడు ఎవడైనా దేవున్ని కరుణా మయుడు, దయామయుడు అని
అనడు.
పై వాక్యములో దేవున్ని కరుణామయుడు అని చెప్పడమే పెద్ద తప్పు. అంతటితో ఆగక వేదాలను దేవుడే
మానవాళికి ఇచ్చాడు అనడము మరీ పెద్దతప్పు. తన ధర్మములనే దేవుడు ప్రత్యక్షముగా ఎవరికీ చెప్పలేదు. పరోక్షముగా
మనుషులకు చెప్పాడు. తన ధర్మములు తనకు తప్ప ఏ మానవునికీ తెలియవు. కావున తన ధర్మములను
ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా చెప్పాడు. ప్రత్యక్షముగా చెప్పితే దేవుడు ఎవరైనది, ఎట్లున్నది మనిషికి
తెలిసిపోతుంది. దేవుడు ఎట్లున్నది ఎవరికీ తెలియకూడదు. కావున ఆయన ప్రత్యక్షముగా చెప్పక పరోక్షముగా
చెప్పాడు. అందువలన ప్రపంచములో దేవున్ని ఇంతవరకు ఎవరూ చూడలేదని చెప్పవచ్చును. పూర్తి రహస్యముగా
యున్న దేవుడు గుణములతో కూడుకొన్న వేదములను చెప్పినాడంటే! అడవిలోని పులివచ్చి మా పెరటిలోని ఆవు
దగ్గర పాలు త్రాగిపోయిందని చెప్పినట్లుంటుంది. పులివచ్చి ఆవు పొదుగులోని పాలను త్రాగి పోయిందనడము
ఎంత అసత్యమో, దేవుడు వేదాలను చెప్పాడనడము అంతే అసత్యమగును.
కొందరు మహర్షులు వ్రాసిన విషయములన్నిటినీ ద్వాపర యుగములో వ్యాసమహర్షి జమచేసి, వాటికి
జతగా తాను కూడా కొంత వ్రాసి కూర్చిన గ్రంథములే వేదములు. వేదములు నాలుగు గ్రంథములుగా నాలుగు
పేర్లతో కలవు. నాల్గువేదములను జతచేసి, వ్రాసి నాలుగు గ్రంథములుగా చేసినవాడు వ్యాసుడు. వేదములను
మానవాళికి పరిచయము చేసిన వ్యక్తి వ్యాసుడు. వేదములను అందించినవాడు వ్యాసుడు అని శాశ్వతముగా
తెలియునట్లు, అంతవరకు వ్యాసునిగా పిలువబడు ఆయనను అప్పటినుండి వేదవ్యాసుడు అని అందరూ అనడము
32

Page 33
ఇందువు-క్రైస్తవుడా?
మొదలు పెట్టారు. వేదముల రచయిత గ్రంథకర్త వేదవ్యాసుడు. వేదములను గ్రంథరూపముగా ప్రజలకు పరిచయము
చేసిన తర్వాత వ్యాసుడు పదునెనిమిది పురాణము లను కూడా వ్రాయడము జరిగినది. ఈ విధముగా చతుర్
వేదములనూ, అష్టాదశ పురాణములను వ్యాసుడు వ్రాశాడని చాలామందికి తెలియక పోయినా, కొందరికైనా తెలుసు.
కొందరికి తెలియనంత మాత్రమున వ్యాసున్ని ప్రక్కన పెట్టి, దేవుడే వేదముల రచయిత అనడము పూర్తి అసత్యము.
దేవుడు సృష్ట్యాదిలోనే తన ధర్మశాస్త్రమును తెలియజేశాడు. ద్వాపరయుగము చివరిలో వేదవ్యాసుని చేత వేదములు
బయటికి చెప్పబడినవి. అందువలన పై వాక్యములో దేవుడు వేదములను మానవులకు ఇచ్చాడు అనడము పూర్తి
తప్పు. ఇప్పుడు "హైందవ క్రైస్తవము” అను పుస్తకములోనే ఆరవ పేజీయందు గల ఒక వాక్యమును తీసుకొని
చూద్దాము.
"సనాతన ధర్మమునకు మూలము వేదాలే. వేదము చెప్పిందేమిటో వింటే తప్ప ప్రజలకు సనాతన
ధర్మము అంటే ఏమిటో తెలియదు.”
ఇంటిలో పెరిగిన కుందేలుకు అడవిలో తిరిగే పులి విషయము తెలుసు. అందువలన పులి సమాచారము
ఎవరికైనా కావాలంటే, మా ఇంటిలోని కుందేలే గతి అన్నట్లు, పులిలాంటి సనాతన ధర్మమును తెలియా లంటే,
ఇంటి కుందేలులాంటి వేదాలే ఆధారమని రంజిత్ చెప్పిన మాటను విని వేదముల మీద ఆయనకున్న ప్రేమ ఎంతటిదో
అర్థమైనది. వయస్సులో నేను తండ్రిలాంటివాడిని, ఆయన కుమారునిలాంటి వాడు. మా ఇంటిలో నా కుమారుడు
ఒక విషయములో పొరపడి ఏదైనా తప్పు నిర్ణయమును తీసుకొంటే, ఇంటిలో పెద్దయిన నేను అది మంచి
నిర్ణయముకాదు, దానివలన నీవు ఎక్కువ నష్టపోతావు అని తప్పక చెప్పి, ఆ నిర్ణయమునుండి తప్పించి, మంచి
నిర్ణయము తీసుకొనేలాగ చూస్తాము. ఇప్పుడు ఎవరో క్రైస్తవుడు వ్రాసుకొన్నాడు నాకెందుకులే అని నేను అనుకోవడము
లేదు. ఇంటిలో నా బిడ్డ పొరపడితే సర్ది చెప్పడము నా బాధ్యతయైనట్లు, దేవుని రాజ్యములో ఏక కుటుంబముగాయున్న
మనము, ఒకరి తప్పును మరొకరు విప్పి చెప్పుకొని తప్పును సవరించుకోవడము మన బాధ్యత. ఇప్పుడు అదే
దృష్ఠితోనే అద్దంకి రంజిత్ గారికి నీ నిర్ణయము తప్పు వేదాల మాయలో పడవద్దని చెప్పుచున్నాను.
వేదాల వలలోపడి హిందూ మతములో ఇంతవరకు ఎవరుగానీ దేవున్ని చేరలేదు. దేవునిమీద ఇష్టము,
విశ్వాసమువుంటే దేవుడిచ్చిన బైబిలు గ్రంథమును ఆశ్రయించు, దానినే చెప్పు, దానినే పొగుడు. మనిషి ఆధ్యాత్మిక
మార్గములో ప్రయాణించుటకు దేవుడే మార్గమును ఏర్పరచి భారతదేశములో భగవద్గీతను, ఇజ్రాయేల్ దేశములో
బైబిలు మరియు ఖుర్ఆన్ గ్రంథములను దేవుడే మానవాళికి అందించాడు. దేవుని మార్గములో మూడు గ్రంథములు
సమానమే అయినా, నేడు క్రైస్తవులందరూ బైబిలు గ్రంథమును తమ గ్రంథముగా చెప్పుకొంటున్నారు. ఒక మనిషి
మూడు దైవ గ్రంథములలో దేనిని ఆశ్రయించినా, అందులో దేవుని జ్ఞానమే తెలియును. కనుక వజ్రములాంటి
బైబిలువుండగా, దానిని వదలి ఓటురాయిలాంటి వేదములను గురించి రంజిత్ ఎందుకు చెప్పుచున్నాడో మాకు
అర్థము కాలేదు. అయినా మేము చెప్పదలచుకొన్నది ఏమనగా!
బైబిలు గ్రంథములో దేవుని విషయములు సంపూర్ణముగా ఉన్నవి. బైబిలు గ్రంథము ముందర వేదములు
మృష్టాన్న భోజనములో కేవలము ఊరగాయ లాంటివి. అన్నముతింటే కడుపు నిండుతుందిగానీ, ఊరగాయను
33

Page 34
ఇందువు-క్రైస్తవుడా?
ఎంతతిన్నా కడుపులో మంటతప్ప ఆకలి తీరదు. అలాగే వేదములను ఎంత చెప్పుకొనినా, వాటివలన ప్రపంచములో
చిక్కుకొనడము తప్ప దేవునికి దగ్గర కాలేరు. బైబిలు గ్రంథములో మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలు
నాలుగు దేవుని జ్ఞానమును సంపూర్ణముగా అందించాయి. ఒక్క యోహాన్ సువార్తలో మనిషి తన మెదడుకు ఎంత
అర్థము చేసుకోగలడో అంత జ్ఞానమును దేవుడు అందించాడు. యోహాన్ సువార్తలోని వాక్యములు మనిషిని
కదిలించి వేసి కన్నీటిని కార్చు ఆనందమును అందించుచుండగా, దానిని గొప్పగా చెప్పుకోక ఉల్లిగడ్డ వాసనకు
కళ్ళు మంటలేసి కళ్ళు నీళ్ళు కారితే వాటినే ఆనందభాష్పములు అనడము ఎంత సమంజసము కాదో, వేదములను
గురించి పొగిడి చెప్పుకోవడము అంతే సమంజస మగును. దేవుడు మారువేషములో ఏసు అను పేరుతో భూమిమీదికి
వచ్చి, తనకు తప్ప ఎవరికీ తెలియని జ్ఞానమును మూడు సంవత్సరములు ఊరూరు తిరిగి ప్రజలకు తెలియజేశాడు.
ఆనాడు తనకంటూ ఒక నివాసము ఏర్పరచుకోకుండా, ముప్పైమూడు సంవత్సరములు ఇజ్రాయేల్ దేశములో
వుండి, మూడు సంవత్సరములు జ్ఞానమును బోధించి, ముప్పై మూడు గంటలు మృతి చెంది తిరిగి బ్రతికి,
మూఫ్పైమూడు మార్లు శిష్యులకు కనిపించి, చివరి కలయికలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని చెప్పి బోధకులుగా
యున్నవారు ముగ్గురిని గురించే బాప్తిస్మము ఇచ్చి, తాను చెప్పిన సమాచారమునే బోధించమని చెప్పగా, ఇటు
బోధించే వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎవరో చెప్పడము లేదు. అటు తెలుసుకొనే వారూ ఆ ముగ్గురిని
గురించి అడుగడమూ లేదు. ఆయన చివరిలో చెప్పిన ఎంతో గొప్ప జ్ఞానమునుగానీ, ముందు చెప్పిన యోహాన్
సువార్తలోని జ్ఞానముగానీ, ఎంతో అద్భుతము ఆశ్చర్యమును కల్గించునదై ఉండగా, దానిని వదలి వేదములను
చెప్పుకోవడము పెద్దపొరపాటు. మనిషి అయిన తర్వాత ఎవరైనా దేవుని విషయములో పొరపాటు పడవచ్చును.
అయినా దానిని ఆలోచించి సవరించుకోవడానికి దేవుడు ప్రతి మనిషికీ బుద్ధిని కూడా ఇచ్చాడు. అందువలన
ఎవరైనా తమ తప్పును సవరించుకొనుటకు అవకాశమున్నది. ప్రపంచ విషయములో పొరపడినా ఫరవాలేదు.
దేవుని విషయములో పొరపడకూడదు. మేము మతమునుగానీ, మతద్వేషమును గానీ మనస్సులో పెట్టుకొని ఎవరినీ
విమర్శించడము లేదు. క్రైస్తవులైన వారు బైబిలులోనే జ్ఞానమును వెతుకమని చెప్పుచున్నాము. అలాగే ఏ మతమువారు
ఆ మతమునకు అలవాటైన గ్రంథమునుండే జ్ఞానమును తెలుసుకోమని చెప్పుచున్నాము. హిందువులు భగవద్గీతను,
ముస్లీమ్లు ఖుర్ఆన్ గ్రంథమును చూడమనీ, అందులోని దేవుని జ్ఞానమును తెలుసుకోమని చెప్పుచున్నాను. మా
దృష్ఠిలో అన్ని మతములుగానీ, వారి గ్రంథములుగానీ సమానమే. సత్యమునే బోధించుచున్నాము గానీ మతమును
బోధించడములేదు. నేను హిందువుల కుటుంబములో పుట్టినందుకు హిందువునేనని చెప్పవలసివచ్చినా, నేను
హిందువే (ఇందువే) అయినా హిందువులు గొప్పగా చెప్పుకొను వేదములను ఖండించుచున్నాను కదా! దేవుడే
ఖండించాడని చెప్పుచున్నాము కదా! దీనినిబట్టి మాకు మతము ముఖ్యము కాదు, సత్యము ముఖ్యమని ఆ విధముగానే
మాట్లాడు చుందుమని తెలియవలెను.
సనాతన ధర్మమంటే ఆదినుండి ఉన్న ధర్మమని అర్థము. ఆదిలో ఆకాశ శబ్ధము ద్వారా దేవుడు తెలియజేసిన
జ్ఞానమే సనాతన ధర్మముగా చెప్పబడుచున్నది. దానినే కృష్ణుడు చెప్పాడు. దానినే ఏసు చెప్పాడు. దానినే
జిబ్రయేల్ చెప్పాడు. ఆదిలో చెప్పిన ధర్మమును మనకు తెలిసి కృష్ణుడు, ఏసు, జిబ్రయేల్ ముగ్గురు చెప్పగా,
ఆచరించిన వారిలో ముఖ్యముగా రావణబ్రహ్మ ఉన్నాడని చెప్పవచ్చును. ఈ విధముగా సృష్టి ఆదినుండి ఎప్పటికీ
మారకుండ ఉన్న ధర్మమునే సనాతన ధర్మము అంటున్నాము. అంతే తప్ప సనాతన ధర్మమనునది ప్రత్యేకించి
34

Page 35
ఇందువు-క్రైస్తవుడా?
ఒక మతమునకు సంబంధించినది కాదు. దేవుడు చెప్పినదే సనాతన ధర్మము. అది నేటికినీ మూడు దైవ
గ్రంథములలోనూ చెక్కుచెదరకుండ, ఏ మార్పూ లేకుండా యున్నది. అందువలన సనాతన ధర్మములకు మూలము
మూడు దైవ గ్రంథములేనని చెప్పవచ్చును. అంతేగానీ వేదములు ధర్మములకు మూలము కాదు.
ఇప్పుడు రంజిత్ గారి “హైందవ క్రైస్తవము” అను గ్రంథమునుండి మరొక విషయమును స్వీకరించి, అందులోని
సత్యాసత్యములను తెలుసు కొందాము. ముందు మాటలలోని ఎనిమిదవ పేజీయందు ప్రస్తావన అను పేరు క్రింద
వ్రాయబడిన రెండు మూడు పేరాలలో ఇలా కలదు చూడండి. "భూలోకంలో ఎన్నో వేల, లక్షల గ్రంథములు
వ్రాయబడినాయి. కానీ, ఈ భూమిమీద మొట్టమొదట వ్రాయబడిన గ్రంథము, అతి ప్రాచీన సాహిత్యం
వేదాలే. వేదాలు ఒక అద్భుత విజ్ఞాన భాండాగారం"
ఈ వేదాలు ఎప్పుడు వ్రాయబడ్డాయి? ఈ విషయములో పండితుల మధ్య ఏకాభిప్రాయము
లేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్గారి వంటి ఉద్ధండులు, వేద విద్యాపారంగతులు వేదాలు క్రీస్తు పూర్వము
2000 ఏళ్ళ క్రితము వ్రాయబడినవని అభి ప్రాయపడ్డారు.”
భూలోకంలో తయారైన లక్షలాది గ్రంథములలో మొట్టమొదటిది వేదమే అని చెప్పడము, అతి ప్రాచీన
సాహిత్యము వేదాలే అని చెప్పడము పూర్తి హాస్యాస్పదముగాయున్నది. అంతటి పురాణ గ్రంథములే వేదములైతే
మాజీ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వేదములు ఇప్పటికి నాలుగు వేల సంవత్సరముల క్రిందట
తయారైనాయని ఎలా చెప్పాడు? అని ప్రశ్న రాక తప్పదు. వేదములు ఎప్పుడు తయారైనాయో పండితులవద్దనే
ఏకాభి ప్రాయములేనప్పుడు, అతి ప్రాచీన గ్రంథాలని ఎలా చెప్పగలము? అటువంటప్పుడు వాటిని సనాతన
ధర్మాలు అనడము కూడా తప్పేయగును కదా! వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరియైన సమాధానము కొరకు
కొంత యోచిస్తే, దానికి సంబంధించిన సమాచారము ఇలా కలదు.
భూమిమీద ఆదికవి వాల్మీకి అని అందరికీ తెలుసు. వాల్మీకి రామాయణమును వ్రాశాడు. ఆదికవి
వ్రాసినదే మొదటి గ్రంథమవుతుంది. కనుక రామాయణము అన్ని గ్రంథములకంటే ముందు తయారైన గ్రంథమని
అందరూ ఒప్పుకోకతప్పదు. అలాంటప్పుడు అన్నిటికంటే ముందు వ్రాయబడినవి వేదాలనడము పూర్తి పొరపాటు.
క్రీస్తు పూర్వము 2000 సంవత్సరముల క్రితము వేదాలు వ్రాయబడినాయని డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పడము
వలన అవి (వేదములు) ప్రాచీన గ్రంథములు కావని తెలిసిపోవుచున్నది. వేదముల వెనుకయున్న సత్యమును
బయటికి తీస్తే, వేదములు క్రీస్తు పూర్వము మూడువేల (3000) సంవత్సరముల పూర్వము వ్యాసునిచే
వ్రాయబడినాయని తెలిసిపోవుచున్నది. పూర్తిగా ఇప్పటికి మొత్తము ఐదువేల (5300) మూడు వందల సంవత్సరముల
పూర్వము వేదములను వ్యాసుడు వ్రాసి వేదవ్యాసుడని పేరుగాంచాడు. వ్యాసుడు 4 వేదములను 18 పురాణములను
వ్రాసిన తర్వాత చివరిలో భగవద్గీతను వ్రాయడము జరిగినది. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన సారాంశమును
వ్రాసిన తర్వాత వేదములు మాయతో కూడుకొన్నవని వ్యాసునికి తెలిసిపోయినది. అలా గుణ మాయతో కూడుకొన్న
వేదములను వ్రాసి సమాజమునకు కీడు చేశానని వ్యాసుడు పూర్తిగా బాధపడిపోయాడు. దీనినిబట్టి వేదముల
35

Page 36
ఇందువు-క్రైస్తవుడా?
గ్రంథకర్త వ్యాసుడనీ, వేదములు దాదాపు 5300 సంవత్సరముల క్రితము వ్యాసునిచే వ్రాయబడినవని తెలిసిపోవుచున్నది.
అందువలన వాటిని ప్రాచీన గ్రంథములనకూడదు. వేదములు ద్వాపర యుగము చివరిలో తయారుకాగా,
త్రేతాయుగము మొదటిలోనే వాల్మీకి చేత రామాయణము తయారైనది. అందువలన వేదములకంటే ప్రాచీన గ్రంథము
రామాయణమని చెప్పవచ్చును.
ఇప్పుడు అద్దంకి రంజిత్ వ్రాసిన ఒక కరపత్రములోని విషయమును గమనిద్దాము. కరపత్రములోని
విషయములోగల తప్పుఒప్పులను తెలుసు కొంటే జీవితములో మనము ఎటువంటి తప్పు చేయకుండా ఆధ్యాత్మిక
మార్గములో సాగగలమని తెలిసి, అదేపనిగా ఆ విషయమును గమనిద్దాము. "వేదకాలపు హిందూ మత సిద్ధాంతము
ప్రకారము మానవుడు పరమాత్ముని సన్నిధికి చేరేటప్పుడు జంతురక్త ప్రోక్షణం తప్పని సరియని నేను
గమనించాను.”
“వేదకాలములో హిందువులు బలులు అర్పించారు, యజ్ఞాలు నిర్వహించారు. సర్వపాపపరిహారో
రక్తప్రోక్షణ మవశ్యకమ్ అంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని ఎలుగెత్తిచాటి చెప్పారు.”
"సర్వపాపపరిహారం కొరకు ఒక యజ్ఞము జరగాల్సి ఉందని వేద కాలపు హిందూ ఋషులు నమ్మారు.
ఆ యజ్ఞానికి " అబామేధం" అని పేరు పెట్టారు. ఒక మచ్చలేని మేకను తెచ్చి, దాని తలమీద బలుసుకంపను
చుట్టి కిరీటముగా పెట్టాలి. ఆ మేకను ఒక చెక్కబల్లకు మేకులతో కొట్టి వ్రేలాడదీయాలి. దాని ఎముకలు
విరగకుండా జాగ్రత్తగా దాని రక్తమంతా కారిపోవాలి. అలా ఆ మేక చనిపోయిన తర్వాత మళ్ళీ దానికి
ప్రాణం పోయాలి. అదే అజామేధం అంటే."
ఈ వాక్యములన్నీ గమనిస్తే ఒక క్రొత్త యజ్ఞమును గురించి చెప్పారని తెలియుచున్నది. ఆ యజ్ఞము పేరు
“అజామేధం” అని చెప్పి అది ఎలా చేయాలో కూడా చెప్పారు. యజ్ఞము పేరు ఏదైనా కావచ్చును. దానిని ఎలాగైనా
చేయవచ్చును. ఇంతకీ అలా చేయబడు యజ్ఞము చేత ఏదైనా దైవిక లాభమున్నదా, లేక ప్రపంచ లాభమున్నదా
అని ఆలోచిస్తే దాని ద్వారా రెండూ లేవని తెలియుచున్నది. ఎవడో మతిభ్రమించి చెప్పిన వారిమాటలనెల్ల ఎందుకు
వినాలి? వినినంతమాత్రమున దానిలోని యుక్తా యుక్తములను ఆలోచించకుండా వారు చెప్పినట్లు ఎందుకు చేయాలి?
పొయ్యిమీద కుండబెట్టి కొన్ని కాయకూరలు, బియ్యము వేసి మసాలాలు వేసి వండితే వంట అవుతుంది. అలా
వండిన దానిని కాయకూరల పలావు (వెజిటబుల్ బిరియాని) అని అనవచ్చును. అయితే పొరపాటుగా కాయ
కూరలలో ఒక పాపరకాయను (తిక్కపుచ్చకాయను కోసి వేసి వండితే అదికూడా కాయకూరల పలావే అని
పిలువబడుతుంది. అయితే అది తినేదానికి మాత్రము పనికి రాదు. చూచేదానికి మాత్రము పనికివస్తుంది.
కాయకూరలు, బియ్యము మసాలాలు అన్నీ వేసిన దానిలో పాపరకాయను (తిక్కపుచ్చకాయను) దోసకాయ అనుకొని
కోసివేసిన దానివలన, వండిన పలావు అంతయు చేదుగా మారిపోయి, ఎవరూ తినేదానికి కూడా ఉప యోగపడదు.
చివరకు పశువులు కూడా తినవు. అదే విధముగా యజ్ఞము అంటే ఎట్లుంటుంది, ఎలా చేయాలి? అని తెలియక
36

Page 37
ఇందువు-క్రైస్తవుడా?
ఎవరో చెప్పారని చేస్తే, చివరకు కాయకూరల బిరియాని కాస్త పాపరకాయ బిరియానియైనట్లు చేసిన యజ్ఞము
దేనికీ పనికి రాకుండ పోతుంది. అలాగే వేదములో ఎవరో చెప్పిన అజామేధం అను యజ్ఞమును గురించి ముందు
వెనుక ఆలోచించకుండ ఆచరిస్తే, కూరకాయల బిరియాని కాస్త తిక్క పుచ్చకాయల బిరియాని అయిపోయినట్లు
అది దేనికీ పనికి రాకుండాపోవును. చివరికి వృథాప్రయాసగును.
వేదములు, పురాణములు ఆరు శాస్త్రములలో ఏ శాస్త్రమునకూ సంబంధించినవి కావు. శాస్త్రబద్ధము కాని
దానిని గొప్పగ చెప్పుకోవడము, దానికి ఏదో ఫలితముందని చెప్పుకోవడము అంతయూ మూఢనమ్మక మగును.
శాస్త్రీయతలేని దానిని ఎవరూ సమ్మతించరు. పై వాక్యములో మానవుడు పరమాత్మ సన్నిధికి చేరుటకు జంతురక్త
ప్రోక్షణం తప్పనిసరి అని వ్రాశారు. ఈ మాట మూడు దైవ గ్రంథములలో ఎక్కడైనా ఉన్నదా? అని అడుగుచున్నాను.
అంతేకాక పై వాక్యములో "సర్వ పాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్యకమ్” అనుమాట ఏ శాస్త్రములోనిదో చెప్పగలరా?
పుక్కిడి పురాణములు, వెకిలి వేదములలోని మాటలను చెప్పవలసిన అవసరము ఏమి వచ్చినది? దేవునిలోనికి
ఐక్యమగుట దేవుని విషయమగును. దేవుని విషయములు దైవ గ్రంథములైన ధర్మశాస్త్రములలో ఉండును. దైవ
గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో ఎక్కడైనా 'రక్తప్రోక్షణము' అనుమాటను దేవుడు చెప్పాడేమో
చూపగలరా? మేక రక్తమును కారునట్లు చేసి దానిని చంపడము పాపముతో కూడుకొన్న పని కాక అజామేధ
యజ్ఞమని సమర్థించుకోవడమేమిటి? రక్తము కారి చనిపోయిన మేకను తిరిగి ఎవరైనా బ్రతికించగలరా? ప్రకృతిసిద్ధమైన
చావు పుట్టుకల సిద్ధాంతమునకు అది వ్యతిరేఖము కాదా? రక్తము పోయి చనిపోయిన మేకను బ్రతికించుట సాధ్యమయ్యే
పనియేనా? అలా చనిపోయి బ్రతికిన వాడు ఏసు ఉన్నాడని చెప్పుటకే ఈ అజామేధ యజ్ఞమును గురించి చెప్పడము
తప్ప వేరు ఏమీకాదు. అలా చెప్పవలసిన అవసరము ఏమి వచ్చినది?
యజ్ఞముల విషయమును గురించి దైవగ్రంథమైన బైబిలు, ఖురాన్ లో చెప్పకున్నా, భగవద్గీతలో వివరముగా
చెప్పారు. యజ్ఞములను గురించి "అధి యజ్ఞోహమే వాత్ర దేహే దేహ భృతాంవర" అని అక్షర పరబ్రహ్మ యోగమను
అధ్యాయములో స్వయముగా భగవంతుడైన దేవుడే చెప్పాడు. ఈ మాటనుబట్టి యజ్ఞములు దేహములోనే
జరుగుచున్నవనీ, బయట జరుగు యజ్ఞములు దైవ సంబంధము కాదని తెలిసిపోయినది. శరీరము లోపల జరుగు
యజ్ఞములను గురించి భగవంతుడు తన భగవద్గీతయందు జ్ఞాన యోగమున ముప్పైమూడవ (33) శ్లోకములో
ఇలా చెప్పాడు.
33.5*11
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప।
సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే ॥
భావము :- “ద్రవ్యయజ్ఞముకంటే శ్రేష్ఠమైనది జ్ఞానయజ్ఞము కలదు. జ్ఞాన యజ్ఞములో సర్వకర్మములు కాలి బూడిదయి
పోవుచున్నవి” అని చెప్పబడి యున్నది. దీనినిబట్టి శరీరములో రెండు రకముల యజ్ఞములు జరుగు చున్నవనీ,
అందులో ఒకటి “ద్రవ్యయజ్ఞము”, రెండవది జ్ఞానయజ్ఞమనీ తెలియుచున్నది. ఆ రెండు యజ్ఞములలో
ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనదనీ, మనిషి చేసుకొన్న సర్వకర్మలు అందులో కాలిపోవుననీ తెలియుచున్నది.
ఈ విధముగా యజ్ఞములు శరీరములోనే జరుగుచున్నవని, వాటికి నేనే అధిపతిగాయున్నానని, అక్షర పరబ్రహ్మ
37

Page 38
ఇందువు-క్రైస్తవుడా?
యోగము నాల్గవ శ్లోకమున "అధి యజ్ఞోహమే వాత్ర దేహే దేహ భృతాంవర" అని అన్నాడు. ఇట్లు దైవ గ్రంథమైన
భగవద్గీతలో శాస్త్రబద్ధముగా యజ్ఞములను గురించి చెప్పియుండగా, దీనిని గురించి చెప్పుకోక శాస్త్రముకానటువంటి
వేదములను గురించి, వాటిలోని విషయములను గురించి ఎందుకు చెప్పుకోవాలి? కర్మలు లేకుండా పోయినప్పుడు
జన్మకు పోకుండా ఎవడయినా దేవునియందు ఐక్యము కాగలడు. అంతేగానీ బయట యజ్ఞముల వలనగానీ,
రక్తమును కార్చడము అను అజామేధ యజ్ఞము వలనగానీ ఎవడూ దేవున్ని చేరలేడు.
'హైందవ క్రైస్తవము' అను పుస్తకములో పూర్తి వేదములను, పురాణములను చెప్పడము యొక్క ముఖ్య ఉ
ద్దేశ్యము హిందువులను ఆకర్షించుటకేనని తెలిసిపోయినది. హిందువులకు సంబంధించిన వేదములను, పురాణములను
చెప్పుచూ వాటిని వివరించుచూ, ఆ వివరము ప్రకారము హిందువులను క్రైస్తవము వైపుకు తీసుకుపోవడానికేనని
సులభముగా గ్రహించవచ్చును. లోపల ఏదో ఉద్దేశ్యమును ఉంచుకొని బయటికి మరొక రకముగా మాట్లాడడము
కపటము అంటాము. అద్దంకి రంజిత్ చెప్పిన విషయములన్నియు మొదట హిందువులకు సంబంధించిన వేదములు,
పురాణములతో మొదలుపెట్టి చివరకు క్రైస్తవమును, ఏసును సమర్థించడమూ, ఏసు గొప్ప దేవుడని చెప్పడమూ
జరుగుచున్నది. మొత్తము 'హైందవ క్రైస్తవము' అను పుస్తకమంతా చివరి వరకూ అలాగే సాగినది. ఏసు గొప్ప
దేవుడని మేము కూడా ఒప్పుకొంటాము. బైబిలు గ్రంథములో ఏసు గొప్పవాడనీ, తెలుసుకొనువానికి తెలుసుకొన్నంత
కలదు. శా శాస్త్రబద్ధముగా సమృద్ధిగా ఏసు దేవుడు అని తెలియునట్లుండగా బైబిలు పేరును చెప్పకుండా, హిందువుల
వేదములను తీసుకొని చెప్పడము వెనుక హిందువులను క్రైస్తవము వైపు లాగుటకు తప్ప వేరు ఉద్దేశ్యము లేదని
తెలిసి పోవుచున్నది.
ఈ విధముగా వ్రాయడము దురుద్దేశ్యముతో చేసిన పనేనని చెప్ప వచ్చును. దేవున్ని గురించి మాట్లాడే
హక్కు అందరికీ ఉన్నది. బైబిలు గురించి చెప్పాలనుకుంటే చెప్పు, అందులో లేని దేవుని విషయములు వేదములలో
ఉన్నాయా? లేక బైబిలులో వేదములను గురించి చెప్పారా? వేదములను గొప్పగా పెట్టుకొన్న హిందువులను తమ
మతమువైపు లాగుకొను టకు వేదమునే చెప్పి చివరకు వేదములలో కూడా క్రైస్తవమును, ఏసును గురించే ఉందని
చెప్పడము హిందువులను దారిమళ్ళించుటకేనని తెలిసి పోవుచున్నది. ఈ విధముగా తమ మతమును పెంచుకొనుటకు
ప్రయత్నము చేయడమును దేవుడు కూడా ఒప్పుకోడు. ఏసు గొప్పవాడు అని చెప్పడమే హైందవ క్రైస్తవము అను
గ్రంథములోని సారాంశము. ఏసు గొప్పవాడు అను విషయమును మేము కూడా చెప్పుచున్నాము. అయితే నేను
వేదములను, పురాణములను ఆధారము చేసుకొని చెప్పలేదు. బైబిలు గ్రంథము ప్రకారము అందులో ఆయన
చెప్పిన జ్ఞానము ప్రకారము ఏసు గొప్పవాడే, నిజముగా దేవుడేనని హిందువునైన నేను కూడా చెప్పుచున్నాను. నేను
పద్ధతి ప్రకారము బైబిలు ప్రకారము చెప్పుచున్నాను. దైవజ్ఞానము తెలిసిన ఎవడుగానీ ఆయన చెప్పిన జ్ఞానము
ప్రకారము ఆయనను గొప్పవానిగానే చెప్పవచ్చును. భగవద్గీతలోనున్న జ్ఞానమునే ఏసు చెప్పిన దానివలన, భగవద్గీతను
చెప్పిన కృష్ణుడే ఏసుగా పుట్టాడని మేము చాలామార్లు చెప్పాము. అయితే మేము మా మనస్సులోని మాటను ఉ
న్నదున్నట్లు చెప్పాము. వేదములను, పురాణములను అడ్డము పెట్టుకొని అడ్డముగా ఏదీ చెప్పలేదు. అంతరంగమున
క్రైస్తవమును ఏసును ప్రచారము చేయాలని ఉండడము మంచిదే. ఆయన దేవుడే కాబట్టి దైవ గ్రంథమైన బైబిలును
అనుసరించి అదేమాటను బయటికి చెప్పవచ్చును. అట్లుకాకుండా చెరువులో చేపలవలెనున్న హిందువులకు వేదములు,
38

Page 39
ఇందువు-క్రైస్తవుడా?
పురాణములను వలవేసి పట్టుకొని క్రైస్తవమను బుట్టలో వేసి పెట్టడమును మంచిదికాదని, ఆ పద్ధతిని, ఆ మత
ప్రచారధోరణిని దేవుడు ఒప్పుకోడని తెలుపుచున్నాము. 'హైందవ క్రైస్తవము' అను పేరులోనే హిందువులను క్రైస్తవులుగా
మారుస్తానని చెప్పినట్లున్నది. ఆ గ్రంథములో ఏ మూల చూచినా అదే ఉద్దేశ్యము కనిపించుచున్నది. ఇదంతా నా
హిందూ మతము క్షీణించి పోతుందను బాధతోనో, క్రైస్తవ మతము మీద అసూయతోనో నేను చెప్పడములేదు.
ఇలా చెప్పడము దేవుని విధానమునకు వ్యతిరేఖమని తలచి చెప్పుచున్నాను. వేదములను పొగిడి చెప్పినంతమాత్రమున
మభ్యపడి పొంగిపోవడము లేదు. వేదములు హిందుత్వములోనివైనా అవి భగవద్గీతకంటే తక్కువయిన వనీ,
అందులో దైవత్వము లేదనీ, భగవద్గీతలో దేవుడే వాటిని ఒప్పుకోకుండా ఖండించాడనీ చెప్పుచున్నాము.
మేము
మేము ఇందుత్వమును కాపాడుతాము అను ఉద్దేశ్యముతో “హైందవ క్రైస్తవము” లోని ప్రతి వాక్యమునకు
శాస్త్రబద్ధమైన వివరమును ఇస్తూ అందులోని తప్పుఒప్పులను అందరికీ అర్థమగులాగున చెప్పుచున్నాము.
ఇందుత్వమును కాపాడుదాము అని అనడము మీరు మీ మతమును గొప్పగా చెప్పడమే కదా! అని కొందరు
క్రైస్తవులు ప్రశ్నించవచ్చును. ఇందుత్వము అనునది ఒక మతము కాదు, మతములోని భాగముకాదు. ఇందుత్వము
అనునది అన్ని మతములలో ఉండు దేవుని విధానము. ఇందుత్వము అంటే ఏమిటో, దాని అసలు అర్థము ఏమిటో
గ్రంథము చివరిలో తెలియజేస్తాము. చివరిలో చెప్పడమే సరియైన సందర్భమగును. అందువలన మీ ప్రశ్నకు
జవాబును ఓపికగా చివరిలో చూడమని తెలుపుచున్నాను.
ఇప్పుడు హైందవ క్రైస్తవములో మరియొక వాక్యమును తీసుకొని చూస్తాము. "వేదములు
అపౌరుషేయములు అంటే మానవుల చేత కల్పింపబడినవి కావు. వేదములు బ్రహ్మ ముఖోద్దిష్టములు.
అంటే బ్రహ్మ (సృష్టికర్త) నోటిలోనుండి వెలువడినవని మన పెద్దలు, గురువులు పదేపదే చెప్పచున్నారు?"
వేదములు అపౌరుషేయములు అనుమాట నూటికి నూరుపాళ్ళు సత్యము. అయితే ఈ పదమును అర్థము
చేసుకోవడములో చాలామంది పూర్తిగా పొరపాటుపడిపోయారు. పురుషులు అంటే మనుషులని, అపౌరుష అంటే
మనుషులు వ్రాసినవి కావు అను అర్థమును చెప్పుచున్నారు. మనుషులు వ్రాయకపోతే ఎవరు వ్రాశారని ప్రశ్నించకుండా,
వేదములు బ్రహ్మనోటినుండి పలుకబడినవని లేక చెప్పబడినవని గురువులు, పెద్దలు చెప్పినట్లు పై వాక్యములో
వ్రాశారు. వాస్తవముగా పెద్దలు (జ్ఞానులు) గురువులు అలా చెప్పియుంటే, నిజముగా వారు గురువులూకాదు,
పెద్దలూ కాదని చెప్పవచ్చును. ఎందుకనగా! అపౌరుషేయములు అనుమాటకు పురుషులు వ్రాసినవి కావు అనీ,
బ్రహ్మదేవుడు చెప్పినవనీ చెప్పడము పూర్తి తప్పగును. అక్కడ అపౌరుషేయములు అను మాటలో వివరమును
చూస్తే పురుషత్వము లేనివి అని అర్థముగలదు. పురుషత్వమంటే ఏమిటి? పురుషత్వము లేకపోతే అందులో
ఏముంది? అని అడుగవచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు.
మించినవాడు.
సృష్ఠిని ఆదిలో సృష్టించినవాడు దేవుడు. అందువలన సృష్టించిన వాడు పురుషుడు అనీ, సృష్ఠింపబడిన
ప్రకృతి స్త్రీతత్త్వము కల్గియున్నదనీ మొరటుగా చెప్పవచ్చును. ధర్మశాస్త్రమును అనుసరించి చెప్పితే ప్రథమ
దైవగ్రంథమైన భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగము అను అధ్యాయమున ప్రకృతితో తయారైన శరీరము
స్త్రీతత్యమనియూ, ప్రకృతి స్త్రీ అనియూ, దేవుడైన తాను పురుషుడననియూ, పురుషుడైన తనకూ స్త్రీ అయిన
39

Page 40
ఇందువు-క్రైస్తవుడా?
ప్రకృతికీ పుట్టినవారే సమస్త జీవరాసులనియూ అందువలన సమస్త జీవరాసులకు ప్రకృతి తల్లి అనియూ, దేవుడైన
తాను తండ్రిననియూ చెప్పి యున్నాడు. ఇక్కడ దేవుడు తనను తాను పురుషుడనని చెప్పుకోవడము జరిగినది.
తర్వాత ప్రక్క అధ్యాయమైన పురుషోత్తమప్రాప్తి యోగమను అధ్యాయమున శరీరములోనున్న జీవుడు దేవుని
అంశగలవాడైనందున క్షర పురుషుడనీ, ఆత్మ అక్షర పురుషుడనీ చెప్పి, తనను జీవాత్మ, ఆత్మలకంటే ఉత్తమునిగా
చెప్పుచూ, జీవాత్మ, ఆత్మలను ఇద్దరి పురుషులకంటే ఉత్తమ పురుషుడైనందున తనను పురుషోత్తముడని అందురు
అని స్వయముగా దేవుడే చెప్పడము జరిగినది అందువలన ప్రకృతి విషయములు ఎక్కడ ఉన్నా వాటిని స్త్రీతత్వ
విషయములుగా, అలాగే దేవుని విషయములు ఎక్కడయున్నా వాటిని పురుషత్వ విషయములుగా చెప్పవచ్చును.
పురుషుడు అనగా ఆధ్యాత్మిక అర్థములో దేవుడని అర్థముండుట వలన దైవ గ్రంథములైన భగవద్గీత, బైబిలు,
ఖుర్ఆన్ గ్రంథములను పురుషత్వముతో కూడుకొన్న వగుట వలన వాటిని పౌరుషములనీ, ప్రకృతి విషయములతో
కూడుకొన్న వేదములను పురుషత్వము లేని అపౌరుషములనీ చెప్పబడినవి. పౌరుషములనగా పరమాత్మతత్యముతో
కూడుకొన్నవనియూ, అపౌరుషములనగా, ప్రకృతి తత్త్వముతో కూడుకొన్నవనియూ అర్థము చేసుకోవలెను.
దేవుడు భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగమున ప్రకృతి పురుషులను గురించి పూర్తి వివరముగా
చెప్పియుండుటవలన, అపౌరుషేయములనగా పురుషత్వము లేనివనియూ, దైవజ్ఞానము లేనివనియూ చెప్పవచ్చును.
వేదములలో ప్రకృతి జనితములైన మూడు గుణముల విషయములే ఉండుట వలన, వాటిని దైవత్వము లేనివని
తెలియుటకు వేదములు అపౌరుషములని చెప్పడము జరిగినది. అసలైన అర్థము ఇలాగ ఉండగా, వేదములను
మనుషులు చెప్పలేదు. బ్రహ్మయే స్వయముగా చెప్పాడని కల్పించిన తప్పు అర్థముతో చెప్పినా, వాస్తవానికి వాటిని
మనుషులే వ్రాశారు. ఏ బ్రహ్మా స్వయముగా వేదములను చెప్పలేదు.
వేదములు నాలుగు ఒకే దేవున్ని నామకావాస్తే చెప్పి, ఎక్కువగా మిగతా దేవతలందరినీ చెప్పడము జరిగినది.
ఏ దేవునికి ఏ పూజ చేయాలో, ఏ పూజ ఎలా చేయాలో చెప్పుచూ, మనిషికి మిగతా దేవతలందరినీ పరిచయము
చేసినవి నాలుగు వేదములని చెప్పవచ్చును. మూడు దైవ గ్రంథములలో ఒకే దేవున్ని గురించి చెప్పగా, వేదములు
మొత్తము సమస్త దేవతలను, వారి ఆరాధనలను గురించి తెలుపడము జరిగినది. హిందూ మతములోని వేదములు
ద్వాపరయుగము చివరిలో భగవద్గీతకంటే ముందు తయారైనవి. అంతవరకు విశ్వవ్యాప్తముగాయున్న
హిందూసమాజము హిందూమతముగా మారిపోయినది. వేదములు తయారగుట చేతనే ఇందూ సమాజము
హిందూమతముగా కావడము జరిగినది. తర్వాత వెనువెంటనే మిగతా మతములు పుట్టుకొచ్చినవి. ఒక విధముగా
ఇందూ (హిందూ) సమాజములోని ఏకత్వమును చెడగొట్టినవి వేదములేనని చెప్పవచ్చును. వేదములను అనేక
ఋషులనుండి సేకరించి కూర్చి, వారు వ్రాసిన దానిని బట్టి తానుకొంత వ్రాసి, వ్యాసుడు వేదములను గ్రంథరూపము
చేశాడు. ఆనాడు ఎందరో ఋషులు చెప్పినదంతా జ్ఞానమేనని నమ్మిన వ్యాసుడు అదే కోవలో తానూ కొంత
వ్రాయడమేకాక, సేకరించిన దానినీ, తాను వ్రాసిన దానినీ అన్నిటినీ కలిపి వ్యాసుడు నాలుగు వేదములుగా గ్రంథ
రూపము చేశాడు. తర్వాత అనతి కాలములోనే భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సమాచారము అర్జునుని
ద్వారా వ్యాసునికి చేరినది. అర్జునుడు వినిన దానిని చెప్పగా, విన్న వ్యాసుడు దేవుని జ్ఞానమునకు ఆశ్చర్యపోయి,
తాను వేదములు, పురాణములు వ్రాసి తప్పు చేశానని తలచి, దానికి ప్రాయశ్చిత్తముగా బాధపడడమేకాక, దేవుడు
40

Page 41
ఇందువు-క్రైస్తవుడా?
భగవంతునిగా చెప్పిన జ్ఞానమును ప్రజలకు అందివ్వాలని భగవద్గీతను గ్రంథరూపముగా వ్రాసి ఇచ్చాడు. వేదములను
వ్రాసిన వ్యాసుడే తాను తప్పు చేశానని తలచి ఆ తప్పునుండి బయటపడుటకు భగవద్గీతను వ్రాసి ఇస్తే, నేటి
ప్రజలలో కొందరు భగవద్గీతను వదలి వేదములను పొగడడము ఏమనవచ్చునో మీరే ఆలోచించండి. వేదములకు
వ్యతిరేఖముగానున్న భగవద్గీతను వ్యాసుడు ఎందుకు వ్రాశాడో, వ్యాసుడే తన వ్రాతలో వేదములు గుణ సమ్మేళనము
లనీ, వేదములు మాయయనీ, వేద సహితమైన మాయను దైవజ్ఞానము లేనివారు ఎవరూ దాటలేరని వ్యాసుడు
ఎందుకు చెప్పాడో, కొందరైనా కొంతైనా యోచించక గ్రుడ్డిగా వేదములను పొగడడము జ్ఞానమనవచ్చునో, అజ్ఞాన
మనవచ్చునో మీరే నిర్ణయించుకోండి.
‘హైందవ క్రైస్తవము' అను పుస్తకములో హిందువులను మభ్య పెట్టుటకు ఎన్నో విషయములను వేదములనుండి
తీసి చూపించారు. అలా చూపించుచూ చివరకు క్రైస్తవమును చాటి చెప్పాలనునదే వారి ఉద్దేశ్యము. వారి
ఉద్దేశ్యమంతా మొత్తము మతము మీద ముడిపడియున్నది. ఆ విధానములో బోధించుచూ, ఏసు చనిపోయి తిరిగి
అదే శరీరముతో లేచాడని, దానినే పునరుత్థానమనుచున్నామని, ఇంద్రుడే ఆ విధముగా ఏసుగా పుట్టి తన మహిమను
అలా చూపాడనీ వ్రాశారు. తాము తమ మతమును ప్రచారము చేసుకొనుటకు మా లెక్కలో భగవంతుడైన ఏసును
చివరకు ఇంద్రునిగా చెప్పడము సమంజసమా? అని అడుగుచున్నాము. మాకు తెలిసి ఇంతవరకూ ప్రపంచములో
రెండుమార్లు గ్రహములు దేవుని జ్ఞానమును చెప్పగా, రెండుమార్లు భగవంతుడు జ్ఞానమును చెప్పాడు. ఎవడయితే
శ్రీకృష్ణునిగా భారతదేశములో వచ్చాడో, ఆయనే ఏసుగా ఇజ్రాయేల్ దేశములో రావడము జరిగినది. దేవుడే
భగవంతునిగా రెండు మార్లు రెండు పేర్లతో వచ్చి తన జ్ఞానమును చెప్పిపోతే, ఆయన ఎవరో తెలియనివారు
ఇంద్రునిగా పోల్చి చెప్పడము దేవున్ని అగౌరవపరచినట్లు కాదాయని ప్రశ్నించుచున్నాను. ఒక విధముగా ఏసు
యొక్క మహిమను చాటిచెప్పి హిందువులను ఆకర్షించాలనుకొని చేసిన ప్రయత్నములో, వీరు క్రైస్తవ మతము
కొరకు ఏసును కూడా అమ్మేటట్లున్నారనీ, బజారులో వేలము వేసేటట్లున్నారనీ తెలియుచున్నది. ఆ విధానము
ఎట్లున్నదో అందరికీ తెలియుటకు 'హైందవ క్రైస్తవము' అను పుస్తకములో 44, 45 పేజీలలోని విషయమును
ఉన్నదున్నట్లు చూపించుచున్నాము చూడండి.
“ పునర్జన్మలున్నాయని భారతీయ సమాజము వేల యేళ్ళ తరబడి నమ్ముతోంది. ప్రతి జీవికీ పునర్జన్మ
సహజమని నమ్మినప్సుడు, ఇక ఇంద్రుడు చచ్చిపోయి పునర్జన్మ ఎత్తడములో ఇంద్రుని మహిమ ఏముంది?
ఇంద్రుని మహత్యమేముంది?
అందరూ చచ్చి, మళ్ళీ ఇంకొక మాతృగర్భములో జన్మించడము సాధారణమైన విషయము అనుకుంటున్నారు
కనుక, దానికి భిన్నమైనది ఇందుడ్రు చేసి చూపించాలి. అప్పుడే మనము ఇందున్రి మహత్యమును చూడగలము.
మరణించిన తర్వాత ఇం తన మహిమను చూపించాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడో, ఎవరూ
తర్వాత ఇందు
గుర్తు పట్టడానికి వీలులేకుండా ఇంకొక అమ్మకడుపులో పుట్టడము కాదు.
శరీరముతో లేవాలి. దానిని పునరుత్థానము అంటారు.
ఇందుడ్రు మరణించి మళ్ళీ ఆదే
41

Page 42
ఇందువు-క్రైస్తవుడా?
కొంచెము మనము ఇంగితాన్ని ఉపయోగించి ఆలోచిస్తే చచ్చి మళ్ళీ మరో గర్భమునుండి పుట్టడము
పాణికోటికి సర్వ సహజమని భారత సమాజము నమ్ముతోంది గనుక, ఇందున్రి మహిమను మనము చూడాలి
అంటే (చూడండి అంటోంది వేదము) ఇందుడ్రు మరణించి మళ్ళీ అదే శరీరముతో మరణాన్ని జయించి లేవాలి.
మళ్ళీ పునరుత్థానుడు కావాలి.
అతడే సూర్యుడు, అతడే అగ్ని అతడే అన్నము. అతడు మరణించి లేచినవాడు. అతడు సృష్టికి
పూర్వము ఒకసారి యజ్ఞమైనాడు. సృష్టి జరిగిన తర్వాత మనిషిగా మరోసారి యజ్ఞమైనాడు. మరణించి
లేచి తన మహిమను చూపించాడు.
ఇంతవరకు వ్రాసిన వాక్యములన్నీ చూచారు కదా! ఈ గ్రంథకర్త ఏసును గొప్పగా చెప్పవలెనను ప్రయత్నము
చేయడము మాకు కూడా సంతోషమే. అయితే ఆ ప్రయత్నములో వేదములను ఉపయోగించి చెప్పి ఏసును
సామాన్య మానవుని స్థితిలోనికి దించివేశాడు. ఒక విధముగా ఇది తెలియక చేసిన పొరపాటేనని మాకు అర్థమగుచున్నది.
అయితే తాను చేసిన పొరపాటేమిటో గ్రంథకర్తకు ఇంతవరకూ తెలియదనియే అనుకుంటాను. దీనికంతటికీ
కారణము మతము మీద మమకారము తప్ప మరేమీ కాదని చెప్పవచ్చును. ఏసు చనిపోయి తిరిగి అదే శరీరముతో
లేచినమాట నిజమే. క్రైస్తవులందరికీ అదే గొప్పకార్యముగా కనిపించు చున్నదనుకుంటాను.
చాలామంది క్రైస్తవులు మా దేవుడు తప్ప మరి ఏ ఇతర మతస్థుల దేవుళ్ళయినా చనిపోయి తిరిగి అదే
శరీరముతో లేచారా? అని ప్రశ్నించు చున్నారు. తిరిగి అదే శరీరముతో మరణము నుండి లేచినవాడే నిజమైన
దేవుడని కొందరు క్రైస్తవులు అంటున్నారు. ఇక్కడ ఇంద్రుడే ఏసు అను మనిషిగా పుట్టి తన మహత్యమును
చూపుటకు, ఆ విధముగా చనిపోయిన తర్వాత మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని చెప్పుచున్నారు. ఏసు
ఎవరో సరిగా గుర్తించలేని క్రైస్తవులు అలా ఆయనను ఇంద్రుడనడము చాలా పెద్దపొరపాటు. ఏసును చూచి
ఇంద్రుడనడము చక్రవర్తిని చూచి పౌరాణిక నటుడు అన్నట్లున్నది. ఏసును ఇంద్రునితో పోల్చడము వలన ఏసు
ఎంతటివాడో, ఎంత శక్తిగలవాడో తెలియకనే అలా చెప్పారని అనుకుంటున్నాము. ఏసును ఇంద్రునిగా పోల్చి
గొప్పగ చెప్పుకొన్నట్లు అనుకొనిన వారు, మరణమునుండి తిరిగి అదే శరీరముతో లేచాడనీ, అలా లేచుట వలన
ఏసు గొప్పవాడని చెప్పడము కూడా, ఆయనను వారికి తెలియకనే తగ్గించి మాట్లాడినట్లయినది.
ఇక్కడ నేను ఒక విషయమును చెప్పుతాను దానిని గూర్చి మీరు కొంత ఆలోచించండి. అప్పుడు మీరు
పునరుత్థానము గొప్పదనుట సరియైనదో, కాదో కొంతవరకు మీకే అర్థము కాగలదు. ఏసు తన జీవితములో
ముప్పై సంవత్సరముల తర్వాత మూడు సంవత్సరములు జ్ఞానమును ప్రజలకు బోధించాడు. ఆ సమయములో
ఒకచోట ఒక బాలిక చనిపోయినదని కొందరు ఏడుస్తుండగా చూచి, ఎందుకు రోధించుచున్నారని ఏసు వారిని
అడిగాడు. అప్పుడు వారు తమ ఇంటిలో ఒక బాలిక చనిపోయినదనీ, ఆవేదనను తట్టుకోలేక ఏడుస్తున్నామని చెప్పి
శవయాత్రకు (అంత్యక్రియలకు) తయారవుచుండగా, ఏసు వారిని చూచి మీ బాలిక చనిపోలేదు, మీరు పొరపడి
చనిపోయినదని అనుకొన్నారని చెప్పి, వారి ఇంటిలోనికిపోయి ఆ బాలికను తట్టి చేయిపట్టుకొని లేవమనగా, ఆ
42

Page 43
ఇందువు-క్రైస్తవుడా?
బాలిక సజీవమై లేచినది. అప్పుడు అక్కడున్న వారందరూ ఆ సంఘటనను చూచి ఆశ్చర్యపోయారు. చనిపోయిన
బాలికకు ప్రాణము పోసిన దేవుడని ఏసును అనుకోవడము జరిగినది. ఇదే విధముగా మరియొకచోట లాజర్ అను
వ్యక్తిని లాజర్ లేచిరా! అని పిలిచి అతనిని మరణమునుండి లేపాడు. ఏసు రెండుచోట్ల వారు చనిపోలేదు అని చెప్పి
ఇరువురిని లేపడము జరిగినది కదా! ఆ విషయమును మనము బైబిలులో కూడా చదివియున్నాము.
ఇక్కడ మేము చెప్పు ముఖ్య విషయమేమనగా! ఏసు పిలిచినంత మాత్రమున చనిపోయినవారు తిరిగి అదే
శరీరముతో లేచారు కదా! అది పునరుత్థానము కాదా! చనిపోయినవాడు తిరిగి శరీరముతో లేస్తే, అది పునరుత్థానమే
అగుతుంది. ఏసుప్రభువు మరణమునుండి లేచినప్పుడు అది మహత్యమైనప్పుడు, గొప్పకార్యమైనప్పుడు, ఏసు
సమక్షములోనే లేచిన వారిని ఏమనాలి? దానికి చనిపోయినవారు స్వయముగా లేవలేదు ఏసు ప్రభువు లేపివుంటే
లేచారు. కావున అలా లేపిన ఏసును గొప్పవాడనాలి. లేచిన వారిని గొప్పవారనకూడదు అని అనవచ్చును. సరే
మీకు అలాగే అర్థమైనది కాబట్టి మేము దానిని గురించి ఏమి చెప్పినా వినరు. ఆ విషయమును అలా వదలివేసి,
మరికొన్ని చోట్ల భూమిమీద చనిపోయిన వారు కొన్ని రోజుల తర్వాత లేచిన అనేక సంఘటనలు కలవు. వాటిని
ఏమనాలి? అక్కడ వారిని ఎవరూ లేపలేదే, వారంతకు వారు లేచివచ్చారు కదా! వారిది పునరుత్థానము కాదంటామా?
బహుశ మీవద్ద జవాబు ఉండదనుకొంటాను.
ఒక సామాన్య మనిషి ఉదయము చనిపోయి సాయంత్రము లేచిన సంఘటనలు గలవు. ఏసు ముప్పైమూడు
గంటల తర్వాత మరణమునుండి లేవగా, మరియొకడు పన్నెండు గంటలకే మరణమునుండి సజీవుడుగా
లేచికూర్చున్నాడు. అటువంటప్పుడు ఏసుకంటే ముందుగానే లేచినవానిని ఏసుకంటే గొప్పవాడని అనాలా? అలా
పునరుత్థానమును పొందిన సాధారణ మనుషులలోనికి ఏసును కలుపడము భావ్యమా? అని అడుగు చున్నాను.
భూమిమీద సకల జీవరాసులకు మరణములు మొత్తము నాలుగు రకములు గలవు. అందులో వరుసగా 1) కాల
మరణము, 2) అకాల మరణము, 3) తాత్కాలిక మరణము, 4) ఆఖరీ మరణము అనునవి కలవు. సాధారణముగా
అందరికీ మరణము అనునది మాత్రము తెలుసుగానీ, మరణములో ఇన్ని మరణములున్నవనిగానీ, ఎవరు ఏ
మరణమును పొందుచున్నారనిగానీ, నేటి మనుషులకు తెలియకుండా పోయినది.
(మనిషికున్న నాలుగు మరణములను గురించి సంపూర్ణముగా తెలియాలంటే మా రచనలలోని “మరణ
రహస్యము” అను గ్రంథమును చదవండి.) ఒక మనిషి చనిపోతే వానికి మరణమొచ్చినదని తలచి అంత్య
క్రియలు చేయడము మాత్రము తెలిసిన మనుషులకు, నాలుగు రకముల మరణములున్నవని తెలియకపోయిన
దానివలన, ఏసుప్రభువు విషయములో కూడా చాలా పొరపడినారని తెలియుచున్నది. నాలుగు మరణములలో
ఆఖరీ మరణము అనునది చాలా అరుదుగా జరిగేది. మనిషి దేవుని జ్ఞానమును పూర్తిగా తెలిసి, ఆచరించి కర్మను
కాల్చుకొన్నప్పుడు, కర్మ ఏమాత్రము శేషము లేకుండా అయిపోయినప్పుడు, అతడు తిరిగి జన్మించ వలసిన పనిలేదు.
అతడు పునర్జన్మమును పొందక దేవునియందు ఐక్యమై పోవును. అటువంటివాడు తిరిగి పుట్టడు, మరణించడు.
కావున కర్మరాహిత్యమైనవాడు, మోక్షమును పొందువాడు మరణించినప్పుడు, అది ఆఖరీ మరణమగును. ఏసు
పొందినది ఆఖరీ మరణము కాదనీ, ఆఖరీ మరణము పొందినవాడు తిరిగి సజీవముగా లేవడనీ చెప్పవచ్చును.
43

Page 44
ఇందువు-క్రైస్తవుడా?
శ్వాస
మూడవ మరణమైన తాత్కాలిక మరణమును అరుదుగా మనుషులు పొందుచుందురు. ఒక మనిషి
చనిపోతే మరణములో జీవుడు వానితోపాటు యున్న ఆత్మ, కర్మలు శరీరమునుండి బయటికి పోకుండా శరీరములోనే
ఉండిపోవడమును తాత్కాలిక మరణము అంటాము. తాత్కాలిక మరణములో శ్వాస శరీరములోపలికి పోయి
నిలిచిపోవడము వలన, అతడు పూర్తిగా చనిపోయినట్లు బయటికి కనిపించినా, అది సాధారణ మరణము మాత్రము
కాదు. చనిపోయినప్పుడు శరీరమునుండి జీవుడు పోయినాడా లేదాయని ఎవరూ చూడరు. శరీరములో
ఆడుచున్నదా లేదా అని మాత్రమే గమనించి, శ్వాస ఆడనందున చనిపోయినాడని శ్వాసనుబట్టి నిర్ణయింతురు.
మరణ రహస్యములు తెలియకపోవడమువలన, శ్వాస నిలిచిపోయిన దానినంతటినీ మరణమే అనుకోవడము
మనుషుల పనియైనందున, ఏసు మరణించినప్పుడు కూడా అతడు చనిపోయాడని అను కోవడము జరిగినది.
అయితే ఆయన తాత్కాలిక మరణమును పొందాడని తెలియలేకపోయారు. ఏసుప్రభువు తర్వాత తాత్కాలిక
మరణమును పొందిన మనుషులు ఎందరో ఉన్నారు. ఈ సంవత్సరము అక్కడక్కడ చనిపోయినవారు నలుగురు
తిరిగి బ్రతికినట్లు వార్తల ద్వారా తెలిసినది. తమిళనాడులో (11-07-2012 ఈనాడు బుధవారం న్యూస్పేపరు)
చితిమీద పెట్టిన వ్యక్తి తిరిగి బ్రతికి లేచినట్లు అందరికీ తెలుసు. పునరుత్థానము ఏసు పొందాడు. అలాగే సాధారణ
మనుషులు కూడా పునరుత్థానమును పొందారు. పునరుత్థానము ప్రత్యేకమైన మహిమగా చెప్పుకొనుచూ, అలా
మరణము నుండి అదే శరీరముతో తిరిగి లేచినందుకు ఏసును దేవునిగా చెప్పితే, అలాగే లేచిన వారిని కూడా
ఏసుతో సమానముగా చెప్పాలి. వారిది కూడా మహత్యముగానో, వారిని కూడా దేవుళ్ళుగానో చెప్పాలి.
ఒక్కమారు తప్పటడుగు వేస్తే దానివలన ఎన్నో అనర్థములుండును. ఈ కాలములోగానీ, ఆ కాలములోగానీ
తాత్కాలిక మరణమును పొంది లేచిన మనుషులు ఎందరో ఉన్నారు. అంతమాత్రమున ఏసును వారితో కలుపగలమా?
ఏసుదీ సాధారణ మనుషులదీ ఒకే రకమైన మరణము అయినప్పుడు, ఒకే రకముగా లేచినప్పుడు, అందరినీ ఒకే
రకముగా చెప్ప వలసి వస్తుంది. అందువలన ఏసు తిరిగి లేచిన దానిని గొప్పగ చెప్పవలసిన అవసరము లేదు.
ఆయన పునరుత్థానము పొందితేనే దేవుడయ్యాడా? చనిపోయి తిరిగి లేచిన దానివలన ఆయనను దేవుడనడము
పూర్తి తప్పు. ఏసు ముందునుండి దేవుడేగానీ, పునరుత్థానము పొందినందున దేవుడ నడము గ్రుడ్డిగా
మాట్లాడడమవుతుందని తెలియవలెను.
ద్వితీయ దైవ గ్రంథమైన బైబిలు ప్రకారము ఏసును దేవుడని ఎవరైనా చెప్పవచ్చును. విశాల జ్ఞానముంటే
ప్రథమ దైవ గ్రంథమును అనుసరించి కృష్ణున్ని అసలైన దేవునిగా గుర్తించవచ్చును. భగవద్గీతను సంపూర్ణముగా
తెలిసినవాడు బైబిలు జ్ఞానమును సులభముగా అర్థము చేసుకోగలడు. రెండు గ్రంథముల సారాంశము తెలిసినవాడు,
ఎవడు కృష్ణునిగా భూమిమీద కనిపించాడో అతనే మారువేషముతో ఏసుగా వచ్చాడని తెలియగలడు. అప్పుడు దైవ
గ్రంథముల ప్రకారము కృష్ణున్ని దేవుడే అనవచ్చును. కృష్ణుడే ఏసుగా వచ్చాడు గనుక ఏసును కూడా దేవుడని
చెప్పవచ్చును. దేవున్ని ఎప్పుడైనా ఎక్కడైనా దైవ గ్రంథములలోని ధర్మముల ప్రకారము కనుగొనవచ్చును అను
సూత్రము ప్రకారము, దైవ గ్రంథములను అనుసరించే దేవున్ని తెలియుటకు, గుర్తించుటకు సాధ్యమగునుగానీ,
మరి ఏ ఇతర గ్రంథముల వలనా దేవున్ని తెలియుటకు సాధ్యపడదు. నేను ఇందువును (హిందువును) అయినా
నాకు భగవద్గీత ఎలా తెలుసో, బైబిలు లోని ఏసు చరిత్ర అలా తెలుసు. నా దృష్టిలో నేడు క్రైస్తవులు చెప్పుకొనునది
44

Page 45
ఇందువు-క్రైస్తవుడా?
బైబిలు కాదు. అందులోని అరవై ఆరు పాఠములలో కేవలము నాలుగు పాఠములు మాత్రమే బైబిలుగా
లెక్కించుచున్నాము. దేవుడు చెప్పినదే ధర్మశాస్త్రము. మనుషులు చెప్పినది ఎప్పటికీ ధర్మశాస్త్రము కాదు. దాని
ప్రకారము భగవంతుడైన కృష్ణుడు చెప్పినది భగవద్గీతయైనట్లు, ఏసు చెప్పినది మాత్రమే బైబిలు. అలాగే భగవంతుడు
చెప్పకున్నా సృష్ట్యాదిలో చెప్పబడిన జ్ఞానమునే జిబ్రయేల్ చెప్పడము వలన, అది అంతయూ ఖుర్ఆన్ గ్రంథముగా
తయారైనది. ఒకే దేవునికి సంబంధించిన విషయములన్నియూ ఈ మూడు గ్రంథములలో తప్ప ప్రపంచములో ఏ
గ్రంథములోనూ లేవు. వాస్తవము ఇలా ఉండగా వేదముల వలన దేవుడు తెలియబడుతాడని చెప్పడము ఎంత
అసత్యమో ఆలోచించండి. దేవుని ధర్మములు దేవునికే తెలుసు మరి ఏ మానవులకూ తెలియవు అని ఖుర్ఆన్
గ్రంథములో మూడవ సూరా, ఏడవ ఆయత్నందు చెప్పబడినట్లు, దేవుని విషయములు (ధర్మములను) దేవుడే
చెప్పాలిగానీ, మనుషులు చెప్పలేరు. అందువలన దేవుని జ్ఞానమును, ధర్మమును, దేవుడిచ్చిన దైవ గ్రంథములే
చెప్పాలిగానీ, మనుషులు వ్రాసిన వేదములు చెప్పలేవు. మనుషులు ఇతరులను మభ్యపెట్టి ఇది దేవుని విషయమని
నమ్మించవచ్చును. అయినా వారు ఎంతో తెలివిగా నమ్మించినా, మనుషులు చెప్పినది ఎప్పటికీ దేవుని ధర్మములుగా
ఉండవు. అందువలన వేదములను నమ్మవలసిన పనిలేదు. “దేశము-మోసము, దేహము-మోహము" అని మేము
చెప్పిన నానుడి ప్రకారము మనిషి ఇతరులను మోసము చేయవలెనని ప్రయత్నము చేయుచునే ఉండును. మోసపోయే
వారుంటే ఎంతకైనా మోసము చేయును. మేము వేదములు దేవుని విషయమును తెలుపలేవు అని చెప్పితే, ‘హైందవ
క్రైస్తవము' అను పుస్తకమునందు ఆ గ్రంథకర్త, 72వ పేజీలో ఎలా చెప్పుచున్నాడో చూడండి.
"నిజానికి వేదాలలో తెలుపబడిన దేవున్ని తప్ప మనము ఎవరినీ ఆరాధించకూడదని వేదాలే
ఖండితముగా శాసిస్తున్నాయి." "మిత్రులారా! ఇంద్రున్ని తప్ప అన్యున్ని కీర్తించకండి. అని సామవేదము
ఆజ్ఞాపించు చున్నది."
“ఇంద్రుడంటే? మరణించి తిరిగిలేచి తన మహిమను నిరూపించిన వాడే ఇంద్రుడు. ఆయనే
భూమధ్యప్రదేశములో అవతరించిన రారాజు ఏసు. ఏసును ఆరాధించడము వాస్తవానికి విదేశీ
మతముకాదు. వేద ఋషుల మనస్సులో ప్రత్యక్షమైన దేవుడే ఏసు దేవుడు."
పుల్లకు చెక్కిన ఐసుక్క తియ్యగా, చల్లగా ఉంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. అది వాస్తవమే గనుక
ఎవరైనా ఒప్పుకోవచ్చును. ఐస్ ముక్కను ఒప్పుకొంటున్నారని ఐసమ్మక్కను బురదలో అద్దిస్తే అది తియ్యగా
ఉండదు, చల్లగా ఉండదు. నోటిలోనికి బురదతప్ప ఐస్ రాదు, దాని రుచి తెలియదు. అలాగే దైవ గ్రంథములలో
చెప్పిన దైవమును ఎవరైనా ఒప్పు కుంటారు. ఎందుకనగా అక్కడ చెప్పినది వాస్తవము. అక్కడ ఏసును దేవునిగా
ఒప్పుకొన్నామని, వేదములలో ముంచి లేక కలిపి ఇతనే దేవుడని ఏసును చెప్పినా, అతడు వేదముల వలన చెప్పబడుట
చేత, వేదముల వాసన ఉండుట చేత, ఎవరూ అలా ఒప్పుకోరు. వేదములు చెప్పిన దేవుడు స్వచ్ఛమైన దేవుడు
కాడు. కలుషితమైన దేవుడని చెప్పవచ్చును. దైవ గ్రంథములను తెలిసినవారు, మనుష గ్రంథములైన వేదముల
మాటలను లెక్కించరు. వేదములలో దేవతలందరూ ఉన్నారు. అందువలన ఆ దేవతలవలె అందరిలో ఈయన
45

Page 46
ఇందువు-క్రైస్తవుడా?
ఒక దేవుడై పోవునుగానీ, అందరికీ అధిపతియైన దేవునివలె లెక్కించబడడు. పై వాక్యములో అదే ప్రమాదము
ఏర్పడినది. సృష్టికర్త, సృష్ఠికి అధిపతియైన దేవున్ని పురాణాల దేవతలలోని ఇంద్రునిగా లెక్కించడము జరిగినది.
పోలీస్ డిపార్టుమెంటులో అందరూ ఖాకీ కలర్ గుడ్డలే ధరిస్తారు. పోలీస్ డిపార్టుమెంటు కంతటికీ ఒకే కలర్ డ్రస్
ఉంటుంది. అయితే డ్రస్ ఒకటే అయినా అడ్రస్ మాత్రము వేరువేరుగా ఉంటుంది. పోలీస్ (కానిస్టేబుల్)
మొదలుకొని సన్స్పెక్టర్ వరకు గ్రామములలో గల పోలీస్ స్టేషన్లో ఉంటారు. కొన్ని గ్రామముల పరిధినంత
కలిపి ఒక సర్కిల్గా ఏర్పరచి దానికంతటికీ అధిపతిగా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. అటువంటి కొన్ని ఏరియాలకు
పెద్దగా ఒక పట్టణములో డి.యస్.పి ఉంటాడు. తర్వాత అధికారి అడ్రస్ జిల్లాలోనే ఉండును. జిల్లా పోలీస్
అధికారియైన యస్.పిగారు జిల్లా కేంద్రమైన పట్టణములో ఉండును. తర్వాత అందరికీ అధికారియైన డి.జి.పి
గారు రాష్ట్ర రాజధానిలో ఉంటాడు. ఈ విధముగా పోలీస్ డిపార్టుమెంటులో అందరి డ్రస్ ఒకటే అయినా, వారి
హోదాలనుబట్టి అడ్రస్లు వేరువేరుగా ఉండును. పోలీస్ వారిలో హోదాలను తెలుపు గుర్తులు వారి భుజాలమీద ఉ
ంటాయి. డిపార్టుమెంటు విషయము పూర్తిగా తెలిసినవాడు వారి భుజాల మీద గుర్తులనుబట్టి, ఇతను ఇంత
హోదాగల అధికారియని గుర్తించగలడు. పోలీస్ డిపార్టుమెంటు విషయము ఏమాత్రము తెలియని పల్లెటూరి వ్యక్తి
డి.యస్.పి ని చూచినా డి.జి.పి ని చూచినా ఒక్కటిగానే లెక్కించును గానీ వారి హోదాలోని తేడాను గ్రహించలేడు.
అలాగే ధర్మశాస్త్రము యొక్క విషయము ఏమాత్రము తెలియని వ్యక్తికి దేవతలలోని హోదాలు తెలియక,
అందరికీ అధిపతియైన దేవున్ని కొంత అధికారమున్న వానివలె పోల్చుకొనును. ఏ విధముగా డి.యస్.పి కీ, డి.జి.పి
కీ తేడా తెలియనివాడు ఇద్దరిని ఒకే విధముగా పోల్చుకొనునో, అలాగే ఇంద్రున్నీ, ఇంద్రునికి కూడా అధిపతియైన
దేవున్నీ సమానముగా లెక్కించుకొనును. అందువలన పై వాక్యములో లోకమునకు అధిపతియైన దేవున్ని, ఒక
లోకమునకు కూడా అధిపతి కాని ఇంద్రునిగా చెప్పుకోవడము జరిగినది. ఒక పల్లెటూరివాడు పోలీస్ డిపార్టుమెంటు
విషయము, వివరము తెలియక డి.యస్.పి నీ, డి.జి.పి నీ వారు ధరించిన డ్రస్సును బట్టి ఒకే విధముగా తలచుకొన్నట్లు,
వేదములలో మునిగిన వాడు ధర్మశాస్త్రము యొక్క విషయము, వివరము తెలియక ఇంద్రున్ని, ఇంద్రాధిపతిని
ఇద్దరినీ ఒకే రకమైన దేవతలుగా పోల్చుకొన్నాడు. అదే విధముగా ఇక్కడ కూడా దేవతల యొక్క, దేవుని యొక్క
బేధము తెలియక అందరికీ అధిపతియైన దేవున్ని కొందరికే అధిపతియైన ఇంద్రునిగా పోల్చి చెప్పడము జరిగినది.
క్రైస్తవ మతము మీద తమకున్న ప్రేమ, అభిలాషను బట్టి వేదములను అడ్డము పెట్టుకొని, దేవుని హోదాను
గుర్తించక, కలెక్టర్ కంటే బిల్కలెక్టర్ పెద్ద కదా!యన్నట్లున్నది. ఎవడైనా తెలిసినవాడు బిల్ కలెక్టర్ కంటే కలెక్టర్
పెద్దయని చెప్పితే, అదెలా అవుతుంది. అతను ఉత్త కలెక్టరే కదా! ఇతని ముందర బిల్ ఎక్కువగా ఉన్నది
కదా!యని వాదించాడట. ప్రత్యక్షముగా బిల్ కనిపించే ఆరు అక్షరముల బిల్ కలెక్టర్ పెద్దకాదు, నాలుగక్షరము
కలెక్టర్ పెద్ద అంటే నేనేమి లెక్క తెలియనివాడినా, ఆరు పెద్దనా, నాలుగు పెద్దనా అని ఎదురు ప్రశ్న వేశాడట. ఈ
విధముగా వేదములను లెక్కలు తెలిసినవాడు ధర్మమను హోదాను గుర్తించలేక, దేవుని కంటే ఇంద్రున్ని పెద్దయని
అనుకోవడములో ఆశ్చర్యములేదు. ఒక ప్రక్క ఏసును రారాజే అంటూ, మరొక ప్రక్క ఏసును రాజుక్రింద బంట్రోతుగా
చెప్పడము జరుగుచున్నా, వారికి మాత్రము మతము ముఖ్యముగా కనిపించు చున్నదిగానీ, దేవుడు ముఖ్యముగా
కనిపించలేదు. ఏసును ఆరాధించడము విదేశీ మతము కాదు అని చెప్పడముబట్టి చూస్తే, దేవునికి కూడా మతమును
46

Page 47
ఇందువు-క్రైస్తవుడా?
చుట్టి, ఆయనదొక మతమన్నట్లు చెప్పుచున్నారుగానీ, దేవుడు మతాతీతుడు అని చెప్పడము లేదు. ఏసు విషయము
బైబిలులో గలదు, వేదములలో దేవతల విషయముగలదు. బైబిలులో ఏసును గురించి ఇలా ఉన్నది అని చెప్పితే
హిందువులు తమమాట వినరనీ, ఇది పరమత గ్రంథమని దూరముగా పోవుదురనీ తలచినవాడు, హిందువులకు
సరిపోని బైబిలు పేరుచెప్పక, హిందువులు పెద్దగా భావించుకొన్న వేదముల పేర్లు చెప్పితే బాగుంటుందని వారిని
ఆకర్షించు ఉద్దేశ్యముతో, ఏసుకు సంబంధము లేని వేదములను చెప్పుచూ, వేదములలో ఏసుప్రభువు విషయమే ఉ
న్నదని నమ్మించుచున్నాడు.
“హైందవ క్రైస్తవము” అను గ్రంథములో 76వ పేజీనందు పాపము సంక్రమించు దానిమీద రెండు వాక్యములు
గలవు. అవి దైవ గ్రంథము లలోని దైవ వాక్కులకు వ్యతిరేఖముగా ఉండుట వలన వాటిని విమర్శించి, అవి తప్పు
అని చెప్పవలసి వచ్చినది. పాపము సంభవించు దానిని గురించి ఆ రెండు వాక్యములలో ఏమి వ్రాశారో ఇప్పుడు
చూస్తాము.
"వశిష్టుని పూర్వులు ద్రోహము చేశారని వశిష్ట మహర్షి ఏదో ఆత్రుతతో అసత్యము పలుకలేదు.
పరమాత్ముని ప్రేరణతో వశిష్ఠుడు అన్నాడు. పాపము అనేది వశిష్టునికి పితరులనుండి సంక్రమించినది."
ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత ప్రకారము, మరియు ద్వితీయ దైవ గ్రంథము బైబిలు ప్రకారము, మొత్తము
ధర్మ శాస్త్రము ప్రకారము పాపములుగానీ, పుణ్యములుగానీ ఒక వ్యక్తికి వాని పెద్దలైన తల్లితండ్రుల వలనగానీ,
చిన్నలైన కొడుకు బిడ్డల వలనగానీ సంక్రమించవు. ఎవరు చేసుకొన్న పాపము వారిని చేరును. శరీరములో
అహము వలన ప్రతి మనిషికీ పాపపుణ్యములనబడు కర్మలు ఏర్పడుచున్నవి. ఒక మనిషికి పాపము వచ్చుటకుగానీ,
పుణ్యము వచ్చుటకుగానీ తగినట్లు వాని శరీరము లోనే యంత్రాంగము అమర్చబడియున్నది. అట్లే ఎవని కర్మ
వాడు అనుభవించుటకు కూడా శరీరములోని అంతరంగ యంత్రాంగము తయారై యున్నది. అందువలన ఎవని
పాపము వానిని అంటుకొనునుగానీ, ఇతరులు చేసిన పాపము ఎవరినీ అంటుకొనదు. అలాగే ఎవని పాపమును
వాడు అనుభవించవలసిందేగానీ, ఒకరి పాపము మరొకడు అనుభవించు టకు వీలులేదు. శరీర నిర్మాణములోనే
దేవుడు అటువంటి అమరిక పెట్టాడు. అట్లే దైవజ్ఞానమున్నవాడు కార్యమును చేసినా, కర్మను అంటకుండ
చేసుకొనుటకు తగిన విధానమును కూడా కలుగజేశాడు. అట్లే జ్ఞానము లేనివాడు కార్యమును చేయకున్నా,
అనుకొన్నంత మాత్రమున ఆ కార్యమును చేసినట్లయిపోయి, పాపము వచ్చి చేరునట్లు శరీరములో అమరిక కలదు.
అందువలన భగవద్గీతలో మోక్ష సన్నాస యోగమున 17వ శ్లోకమందు "ఎవని భావములో అహంకారము లేదో
వాడు లోకములోని వారందరినీ హత్య చేసినా, వాడు హంతకుడు కాదు. హత్యాపాపము వానిని అంటదు” అని
చెప్పాడు. అట్లే బైబిలులో మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యమున “ఒక స్త్రీని మోహపు చూపుతో
చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును" అని ఉన్నది. అందువలన
మనిషి భావమునుబట్టి పని చేసినా, చేయకున్నా పాపము రావడము, రాకుండా పోవడము జరుగుచున్నది. పాపము
రావడముగానీ, రాకుండా పోవడముగానీ వారివారి భావమునుబట్టి యుండును. అంతేగానీ ఇతరులు చేసినది
తనకూ, తాను చేసినది ఇతరులకూ పోదు, రాదు అని తెలియవలెను.
47

Page 48
ఇందువు-క్రైస్తవుడా?
ఇప్పుడు అదే పేజీలోని మరొక వాక్యమును చూస్తాము. "మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము
ద్వారా మన తల్లితండ్రుల ద్వారా మనకు పాపము సంక్రమించినదని బైబిలు తెలియజేస్తున్నది" (యోబు
రోమా 5-19).
14-4,
బైబిలు గ్రంథములో యోబు మరియు రోమా అను రెండు సువార్తలలో ఆదాము ద్వారా, మన తల్లితండ్రుల
ద్వారా మనకు పాపము వచ్చినదని చెప్పారు. బైబిలును గురించి ఇంతకుముందే ఒక విషయమును చెప్పాము.
బైబిలులోగల అరవై ఆరు పాఠములు బైబిలుగా ఉండినా అందులో మానవునికి పనికివచ్చు బైబిలు ఏసు చెప్పిన
నాలుగు సువార్తలు మాత్రమేనని చెప్పాము. మనిషిని దైవమార్గములో నడిపించునవి ఏసు చెప్పిన జ్ఞానమున్న
నాలుగు సువార్తలు మాత్రమేనని తెలియాలి. మిగతా అరవై రెండు సువార్తలలో సత్యమే ఉందని నమ్మవలసిన
పనిలేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అను నాలుగు సువార్తలు తప్ప మిగతావన్నీ మనుషులు చెప్పినవే
అయినందున వాటిని జ్ఞానము పరిధిలోనికి తీసుకోకూడదు. బైబిలుకంతటికీ మూల పురుషుడు ఏసుయే అయినప్పుడు
ఆయన చెప్పినవే జ్ఞానము, ధర్మమగును. మనుషులు వ్రాసినవి జ్ఞానము, ధర్మము అగుటకు అవకాశములేదు.
అందువలన పై సువార్తలలోని తల్లి తండ్రుల వలన పాపము వస్తుంది అని చెప్పినమాటను ఖండించవచ్చును. ఆ
మాట సత్యము కాదు. ఏసుప్రభువు చెప్పిన నాలుగు సువార్తలలో తల్లి తండ్రుల వలన పాపము వస్తుందని ఎక్కడా
లేదు. పైగా ఎవడు చేసుకొన్నది వానికే వస్తుందని, చేయకున్నా భావము వలననే పాపము రాగలదని కూడా
చెప్పాడు. పై వాక్యములో మానవ జాతికి మూల పురుషుడు ఆదాము అనియూ, ఆదాము హవ్వల వలననే సమస్త
మానవజాతి పుట్టిందని పాత నిబంధన ఆదికాండములో చెప్పడము జరిగినది. అయితే ఏసుప్రభువు అట్లు ఎక్కడా
చెప్పలేదు. మానవులందరినీ సృష్టికర్త అయిన దేవుడే సృష్టించాడని చెప్పాడు. అంతేకాక అందరినీ సృష్టించిన
దేవుడే సమస్త మానవులకు తండ్రియనీ, ఆయన పరలోకమందున్నాడనీ చెప్పడము జరిగినది. అందువలన పై
వాక్యమును నమ్మవలసిన పనిలేదు.
ఇప్పుడు 77వ పేజీలో పాపపరిహారము కొరకు రక్తప్రోక్షణము జరగాలని చెప్పిన సమాచారమును పరిశీలిద్దాము.
'ఈ మాటలు నేను కల్పించి వ్రాసినవి కావు. ఇంకే ఇతర మానవుడు కల్పించినవి కావు. సాక్షాత్తు
బ్రహ్మముఖము నుండి, అంటే సృష్టికర్త నోట్లో నుండి వచ్చిన మాటలు. ఆ మాటలను పట్టించుకోకుండా
వదలి వేయడము భక్తి కాదు, భక్తిహీనత అవుతుంది, దైవద్రోహం అవుతుంది."
ఇక్కడ పస్తావించబడిన సమస్య ఏమిటి? ఇందున్రికి ఒక సమస్య వచ్చింది, ఏమిటీ సమస్య? అతడు పాప
పాశం చేత బంధించబడ్డాడట. నేను పాపపాశ బంధములచేత బంధింప బడినవాడను. నేను పాపపాశ బంధమునుండి
విముక్తుడను కావాలి. అదే ఇందున్రి కోరిక.
కావాలి. అదే ఇం
అమ్మడు ఇంద్రుడు ఏమి చేశాడు? ఏ మార్గమును అవ లంభించాడు? ఇంద్రుడు ఒక వృషభమును
బలిగా ఇచ్చాడు. అలా ఎద్దును బలి ఇవ్వడము వలన తాను పాపపాశ బంధముల నుండి విముక్తుడను
48

Page 49
ఇందువు-క్రైస్తవుడా?
అవుతానని ఇంద్రుడు భావించాడు. అంటే ఈ మాటకు అర్థము ఏమిటి? పాపపరిహారము కోసము 'బలి'
తప్పనిసరిగా జరగాలి అన్నమాట తర్వాత వచ్చిన గ్రంథాలు, గురువులు పాపక్షమాపణ కొరకు ఎన్ని మారాలైనా
ప్రతిపాదించ నివ్వండి. దేవుని నోట్లోంచి ఊడిపడిన వేదము మాత్రము పాపక్షమాపణ కోసము బలి, రక్త
ప్రోక్షణ అవసరము అనే చెబుతున్నది."
పూర్వము ఒక మనిషికి తిక్కముదిరి రుమాలును (టవలును) తలకు చుట్టమనుట విడచి రోకలిని తెచ్చి
తలకు చుట్టమన్నాడట! నీవే చుట్టుకోమని ప్రక్కవారు చెప్పితే, నా చేతులకు రోకలిని చుట్టుకునే బలము లేదు.
అందువలన మిమ్ములను చుట్టమని చెప్పాను అన్నాడట. తిక్క ముదిరి పోయిన మెదడు దేనినీ సక్రమముగా
యోచించక అన్నీ తప్పుగానే నిర్ణయించును. అలాగే ఆధ్యాత్మిక విద్యలో మతిభ్రమించిన వారిగా కొందరు
మాట్లాడుచుందురు. అటువంటివారికి ఒక పద్ధతి అంటూ ఉండదు. ఒక శాస్త్రమును ఆధారము చేసుకొని
మాట్లాడడమూ ఉండదు. ఎట్లు ఊహవస్తే అట్లు మాట్లాడుచుందురు. మనము మాట్లాడేమాట సమంజసమైనదా
కాదా అని ఏమాత్రము యోచించరు. అదే విధముగా పై వాక్యము కనిపించుచున్నది. దేవున్ని గురించి ధర్మశాస్త్రమును
(బ్రహ్మ విద్యా శాస్త్రమును) ఆధారము చేసుకొని మాట్లాడవలసియున్నది. అట్లు శాస్త్రాధారము లేకుండా మాట్లాడితే
దేవుని విలువను తగ్గించినట్లగును. పై వాక్యములో ఏమాత్రము శాస్త్రాధారము లేదు. అంతేకాక బుద్ధి ముదరని
చిన్న పిల్లలకు కాకమ్మ, గువ్వమ్మ కథలను చెప్పినట్లు పై వాక్యమున్నది. వినేది సత్యమా అసత్యమా అని ఆలోచించలేని
చిన్నపిల్లలు చెప్పిన దానిని వినగలరు. అలాగే కొందరికి ఏమి చెప్పినా అసత్యమును కూడా సత్యముగానే భావించుకొని
వినుచుందురు. అదే పెద్దపిల్లలయితే తిరిగి ప్రశ్నించగలరు. చెప్పిన విషయములో తప్పులుంటే వివరణ కోరుదురు.
అలాగే పై వాక్యమును గ్రుడ్డిగా వినకుండా తిరుగు ప్రశ్న వేస్తూ వివరమడుగుచున్నాము.
దేవుడు ధర్మముల మీద ఆధారపడియున్నాడు. దేవున్ని తెలియుటకు ధర్మముల ఆధారముతో
తెలుసుకోవచ్చును. దేవునికున్న ప్రాథమిక ధర్మము ఒకటి గలదు. దేవుడు రూప, నామ, క్రియారహితుడు
అనునది మొదటి ధర్మము. ఈ వాక్యము మూడు దైవ గ్రంథములలోనూ గోచరించుచున్నది. ఈ వాక్యమునుబట్టి
దేవునికి ఆకారము లేదనీ, పేరు లేదనీ పనియూ లేదనీ తెలియుచున్నది. ఈ ప్రాథమిక ధర్మమును కాదని
దేవునికి రూపమున్నది అంటే అది పూర్తి అసత్యమని, అట్లున్నవాడు దేవుడు కాడని చెప్పవచ్చును. అలాగే దేవునికి
పేరున్నదనిగానీ, ఆయనకంటూ పని ఉన్నదనిగానీ ఎవరైనా అన్నారంటే ఆ మాట దేవుని ధర్మమునకే విరుద్ధమనీ,
అది పూర్తి అసత్యమైన మాటయనీ చెప్పవచ్చును. అయితే దేవునికి పనిలేదు ఆయన పని చేయడు అనుమాటకు
విరుద్ధముగా పై వాక్యమున్నట్లు తెలియు చున్నది. సాక్షాత్తు సృష్టికర్త నోటినుండి వచ్చినమాటలను పట్టించుకోకుండా
వదిలివేస్తే అది దైవ ద్రోహము అవుతుందని చెప్పారు. ఇప్పుడు మేము ఏమి చెప్పుచున్నామంటే, అబద్దమును చెప్పి
భయపెట్టి మీరు చెప్పినట్లు వినవలెనని ప్రయత్నించుచున్నారు. దేవుని విషయములో అసత్యమును, అధర్మమును
బోధించడము వలన మీరే దైవద్రోహము చేసినట్లగుచున్నది.
దేవుడు క్రియారహితుడు అని అంటే దేవుడు పనిని చేయనివాడని అర్థము చేసుకోవలెను. పై వాక్యములో
సృష్టికర్తయిన దేవుడు స్వయముగా చెప్పినట్లు వ్రాయడము వలన దేవునికి పనిని కల్పించి చెప్పినట్లయినది. అలా
49

Page 50
ఇందువు-క్రైస్తవుడా?
చెప్పిన మాటను వినకపోవడము భక్తిహీనత, దైవద్రోహము అవుతుందని చెప్పారు కదా! అయితే మేము ఇప్పుడు
ధర్మవిరుద్ధమని ఆ మాటలను పూర్తిగా ఖండించుచున్నాము. అంతేకాక ఇంద్రుడనే వాడు ఉన్నాడో లేడో కూడా
ఎవరికీ తెలియదు. ఉన్నట్లు కూడా చరిత్ర ఆధారము గానీ, శాస్త్రాధారముగానీ లేదు. అలాంటప్పుడు ఇంద్రున్ని
తెచ్చి చెప్పవలసిన అవసరమేమున్నది? అంతేకాక ఇంద్రుడే ఏసు అని చెప్పడము పూర్తి విడ్డూరము. అంతటితో
ఆగక ఆయనకున్న పాపమునకు పరిహారముగా ఎద్దును బలి ఇచ్చాడనీ, పాప క్షమాపణ కొరకు రక్తప్రోక్షణ (రక్తము
కార్చుట) చేయడము వలన పాపము పరిహారమగునని దేవుడు చెప్పినట్లు చెప్పాడు. దానికి మేము ఏమనుచున్నామంటే
దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు అను ధర్మమునకు విరుద్ధముగా ఈ మాటను చెప్పినట్లగుచున్నది.
రక్తప్రోక్షణకు పాపపరిహారమునకు ఏమి సంబంధమున్నదని అడుగు చున్నాము. రక్తప్రోక్షణమని చెప్పి ఎద్దును బలి
ఇచ్చినట్లు చెప్పారు. కోళ్ళు, గొర్రెలు మొదలుకొని ఆవులనూ, గుర్రములనూ, దున్నలనూ క్షుద్ర దేవతా పూజలలో
బలి ఇవ్వడము నేటికినీ కలదు. ఇలా బలులు ఇవ్వడము భక్తి అంటామా లేక జ్ఞానమంటామా? ధనికులుగాయున్నవారు
ఎంతో పాపము చేసి, ఎన్నో బలులు ఇవ్వగలరు. అయితే వారి పాపము పోతుందా? పూర్వము మనుషులు తమ
పాపమును పరిహారము చేసుకొనుటకు ఏకంగా మనిషి అయిన ఏసునే రక్తము కారునట్లు చేసి శిలువ మీద బలి
ఇచ్చారని కొందరు చెప్పుకురావడము కూడా విన్నాము. అదే నిజమైతే ఆ విధముగా పాపము పోయేటట్లు ఉంటే
వరుసగా పదిమంది మనుషులనైనా బలిఇచ్చు ధనికులు, బలాఢ్యులు ఉన్నారు. ఇంకొకరిని హింసించి రక్తము
కారునట్లు చేయడము వలనగానీ, ఇతర జంతువులను చంపి రక్త తర్పణము చేయడము వలనగానీ, మనుషులు
చేసుకొన్న పాపములు పోతాయని ఏ ధర్మశాస్త్రములో అయినా చెప్పారా?
మనిషి మనుగడ ఎలా ఉన్నది? ఆ మనుగడలో పాపపుణ్యములను మనిషి ఎలా సంపాదించుకొంటున్నాడు?
సంపాదించుకొన్న పాపపుణ్యము లను ఎలా అనుభవించుచున్నాడు? చివరికి మోక్షమెలా పొందును? అను మొత్తము
మానవుని విషయమును విసర్గముతో సహా విడదీసి చెప్పినవి మూడు దైవ గ్రంథములు, మూడు దైవ గ్రంథములలోనే
ధర్మశాస్త్రము ఇమిడి యున్నది. దేవుని ధర్మమును, మనిషి కర్మమును ధర్మశాస్త్రములోనే తెలియవచ్చును.
ధర్మశాస్త్రము తప్ప వేదములు, పురాణములు ధర్మములను కర్మములను తెలుపలేవు. అలాంటపుడు ఏ దైవ
గ్రంథములో లేని బలిని, వేదములు చెప్పాయని వాటిని కొందరు చేసేవారనీ, వాటివలన రక్తప్రోక్షణము జరిగి
పాపము పరిహారమైనదని చెప్పడము విడ్డూరమైన మాటగా యున్నది. ఈ పద్ధతి హింసను ప్రేరేపించడము తప్ప
ఏమైనా ఉన్నదా మీరే ఆలోచించండి. నాకు ఎంతో ఆర్థిక స్థోమతయున్నదని నేను ఇష్టమొచ్చినట్లు పాపములు
చేస్తూ, అవి పోయేదానికి వంద జంతువులనో, ఒక మనిషినో బలి ఇచ్చి పాపములను తప్పించుకోగలను అనుకోవడము
పూర్తి తెలివితక్కువ విధానమగును.
నేడు భూమిమీద మూడు దైవగ్రంథములను ఆధారము చేసుకొని మూడు మతములవారు చలామణి
అగుచున్నారు కదా! ఆ మూడు మతములలో ఒక్క క్రైస్తవులు తప్ప మిగతా హిందువులుగానీ, ముస్లీమ్లు గానీ
వారి గ్రంథములలో ఈ బలి విధానమున్నట్లు ఎవరూ చెప్పలేదు. భగవద్గీతలోగానీ, ఖుర్ఆన్ గ్రంథములోగానీ,
బలి చేయడము వలన, రక్త తర్పణము చేయడము వలన పాపములు పోతాయని చెప్పలేదు. ఇకపోతే రక్తప్రోక్షణ
అనే పదమును వాడుచూ, రక్తమును చిందించడము వలన పాపపరిహారము జరుగుననీ, ఈ విషయమును
50

Page 51
ఇందువు-క్రైస్తవుడా?
వేదములయందు కూడా చెప్పారనీ, తమ బైబిలు గ్రంథములో కూడా ఏసుప్రభువు తన రక్తము చేత
పాపపరిహారమగునని చెప్పాడనీ, అందువలన పాపుల నిమిత్తము తన రక్తమును శిలువ మీద రక్తము కార్చాడనీ,
ఏసు రక్తము వలన క్రైస్తవుల పాపములన్నియూ పోయాయనీ, ఇంకా ఎవరైనా వేరే మతము వారు క్రైస్తవ మతములోనికి
వచ్చి ఏసును తమ దేవునిగా ఒప్పుకుంటే వారి పాపము కూడా పోవుననీ, క్రైస్తవుల బోధకులు ఎంతో ప్రచారము
చేశారు. ఇప్పుడు కూడా అదే మాటను చెప్పుచునే యున్నారు.
బైబిలు గ్రంథములో ఏసు చెప్పిన నాలుగు సువార్తలలో ఎక్కడైనా ఏసు రక్తము వలన క్రైస్తవుల పాపము
పోతుందని చెప్పాడా? అని ప్రశ్నించు చున్నాను. నేను అడుగుచున్న ఈ ప్రశ్నను కొందరు తేలికగా తీసుకొని “ఏసు
చెప్పిన మాటనే మేము చెప్పుచున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 28వ వాక్యమునందు " ఇది నా
రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” అనియున్నది
కదా! ఈ వాక్యము ఏసు చెప్పిన దానికి సాక్ష్యము కాదా?” అని అడుగవచ్చును. దానికి మేము కొంత ఆశ్చర్యపోయి,
బైబిలు గ్రంథములోని ఏసుమాటను వారి పాపములు పోవు నిమిత్తము ఏసు రక్తము చిందించబడినదని అర్థము
చేసుకొన్నందుకు, మాయ వీరిని ఎంతగా మభ్యపెట్టినదోయని అనుకొన్నాము. ఏసు ఎక్కడగానీ తన రక్తమును
కార్చడము వలన, తన రక్తము చేత క్రైస్తవుల పాపములు కడిగివేయబడుతా యని చెప్పలేదని ఇప్పుడు కూడా
చెప్పుచున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యము చెప్పునపుడు ఒక గిన్నెలో ద్రాక్షరసమును
తీసుకొని అక్కడున్న తన శిష్యులకు ఇస్తూ, “ఇది నా రక్తము” అన్నాడు. అయితే తన రక్తముగా పోల్చి చెప్పి
ద్రాక్షరసమును ఇచ్చాడని మరువ కూడదు. అప్పుడు కూడా తన మాటను ఎక్కడ అపార్థము చేసుకొంటారో యని
ఇది నా రక్తము అని చెప్పిన వెంటనే వివరముగా చెప్పుతాను వినండి అన్నట్లు అనగా! అన్నాడు. ఇది నా రక్తము,
అనగా అని తర్వాత పాప క్షమాపణ నిమిత్తము అని చెప్పడము జరిగినది. తన రక్తమనునది దేనికొరకు అను
ప్రశ్నకు జవాబుండునట్లు పాపక్షమాపణ నిమిత్తము అన్నాడు. ఆ మాటలో ఏ అనుమానమూ లేదు. ఆయన
రక్తము పాపక్షమాపణ నిమిత్తమే నని స్పష్టముగా చెప్పడము జరిగినది. సమస్త క్రైస్తవులు ఇక్కడే పొరపాటు పడినారని
చెప్పుచున్నాను. ఏసు రక్తము క్రైస్తవుల కొరకు అని చెప్పాడా, సమస్త మానవులకు అని చెప్పాడా అని చూస్తే, అక్కడ
క్రైస్తవులకని చెప్పలేదు, మానవులందరికీ అని చెప్పాడు. అటువంటప్పుడు క్రైస్తవ మతములోనికి వచ్చి ఏసును తమ
దేవునిగా ఒప్పుకొన్నవారికి మాత్రమే పాపక్షమాపణ అని చెప్పడము తప్పుకాదా? ఏసు చెప్పనిమాటను క్రైస్తవులు
ఎందుకు చెప్పవలసి వచ్చినది?
ಆ
ఏసు చెప్పిన మాట వారికి అర్థముకాకనో, లేక అర్థమైనా తమ మతమును పెంచుకొనేదానికో, ఆ విధముగా
వారు చెప్పారని తెలియు చున్నది. ఏసు చెప్పిన మాటలలో మనుషులందరి పాపక్షమాపణ కొరకు శిలువ మీద
రక్తము కార్చుతాననో, తన రక్తమును చిందిస్తాననో అక్కడ చెప్పాడా? అని ప్రశ్నించితే జరుగుచున్న ఆ కాలములో
(వర్తమాన కాలములో) చిందింపబడుచున్నదని చెప్పాడుగానీ జరుగబోవు భవిష్యత్ కాలములో నా రక్తమును
చిందిస్తానని చెప్పలేదని గమనించండి. జరుగుచున్న వర్తమాన కాలములో జరిగిపోయిన భూతకాలము మూడు
సంవత్సరములనుండి నేటి వరకు నా రక్తమును చిందిస్తూనే ఉన్నానని చెప్పి చివరిలో అందరికీ అర్థమగులాగున
51

Page 52
ఇందువు-క్రైస్తవుడా?
ఒకమాట అన్నాడు అది ఏమనగా! అనేకుల కొరకు చిందింపబడుచున్న 'నిబంధన రక్తము' అని అన్నాడు. ఈ
వాక్యమున కంతటికీ అసలైన అర్థము నిబంధన రక్తము అని చెప్పడములోనే ఉన్నది.
'నిబంధన' అనగా ఏ బంధనము లేనిదని అర్థము. అన్ని బంధములనుండి విడుదల చేయునది, ఏ
బంధము తనను బంధించలేనిదీ అయిన దైవ జ్ఞానమును నిబంధన రక్తమని చెప్పడమైనది. అప్పుడు ద్రాక్ష
రసమును ఇచ్చి దానిని రక్తముగా వర్ణించాడు. శరీరములో రక్తము జీవనము నిచ్చునది. రక్త ప్రసరణ లేకుండాపోతే
మనిషి చనిపోవును. శరీరములో జీవనమునిచ్చునది రక్తమైనట్లు, దేవునిలో జీవించునట్లు చేయునది జ్ఞానము.
ఏసు శరీరములో రక్తముతో పాటు అణువణువున జ్ఞానమే నిండియున్నది. అందువలన ఆయన మూడు
సంవత్సరములనుండి తన జ్ఞానమునే ప్రజలకు పంచుతున్నాడు. అందువలన తన జ్ఞానమునే సమస్త మానవుల
పాపక్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని అన్నాడు. నిబంధన రక్తమును అనగా ఏ బంధనమూ
లేని జ్ఞానమును అప్పటికే అందరికీ చెప్పుచున్నాడు. అతని నుండి పొంగివచ్చుచున్న జ్ఞానము ఆ రోజులలో అందరికీ
అందినది. అప్పటికీ ఎంతో నిబంధన జ్ఞానమును (నిబంధన రక్తమును) అందరిమీదా చిందించుచునే ఉన్నాడు.
అలా చెప్పబడిన జ్ఞానము మనిషికి బంధమైన పాపము నుండి లేక కర్మల నుండి విముక్తున్ని చేయుచున్నది.
అనగా పాపము నుండి క్షమాపణ పొందునట్లు చేయుచున్నది. జ్ఞానము తెలిసిన మనిషికి ఉన్న కర్మలు లేకుండా
కాలిపోవునని భగవద్గీతలో చెప్పినట్లు, పాపము లేకుండా పోవడమునే పాపక్షమాపణ అంటున్నారు. ఏసు శరీరములోని
భౌతిక రక్తమును గురించి, అది కారిపోతే ప్రజలకు పాప క్షమాపణ కలుగుతుందని చెప్పలేదు. ఆయన చెప్పినది
జ్ఞానమను సారాంశమును నిబంధన రక్తమని చెప్పాడు. ఆ మాటతో తనకు ఇష్టము లేనివారు తప్పుగా అర్థము
చేసుకొని తనవైపు రాకుండా ఉండునట్లు చేశాడు.
హిందూమతములో తమ ధర్మ గ్రంథమేదో తెలియనిస్థితిలో చాలామంది ఉన్నారు. చాలావరకు
అగ్రకులములని పేరుగాంచిన బ్రాహ్మణులే భక్తికీ, జ్ఞానమునకూ వారసులుగాయున్నారు. వారు శూద్రులను పైకి
రాకుండా చేయుటకు, తమ పెత్తనములో అంటరానివారిగా పెట్టు కొనుటకు ప్రయత్నము చేయుచూ, శూద్రులకు
జ్ఞానము తెలిస్తే బాగుండదనీ, ఎవరూ తమ ఆధీనములో ఉండరను ఉద్దేశ్యముతో ఉండగా, క్రైస్తవులు హిందూ
శూద్రులను ప్రలోభపెట్టి తమ మతములోనికి మార్చుకోవడము జరుగుచున్నదని చెప్పుకొన్నాము. అటువంటి
స్థితిలో, బ్రాహ్మణులకు అనుకూలమైన వేదములే మన మూల గ్రంథములని బ్రాహ్మణులు చెప్పడము జరిగినది.
హిందువులలో పెద్దగా ఆచార వ్యవహారములు పాటిస్తున్న బ్రాహ్మణులే గొప్పగా కనిపించుట వలన వారిమాటనే
నమ్మి చాలామంది తమ మూల గ్రంథములు వేదములని చెప్పుకోవడము జరిగినది. హిందువులు వేదములను
గౌరవించడమును చూచిన మిగతా మతము వారు అదే వేదములను చెప్పుచూ, అందులోని కొన్ని విషయములు
తమ మతమును గురించి చెప్పుచున్నవని చెప్పుచున్నారు. వేదములలో క్రైస్తవ మతమును గురించి, ఏసును
గురించి ఉందనీ, వేదముల ప్రకారము ఎవరైనా చివరకు క్రైస్తవ మతమునే చేరాల్సిందేనని క్రైస్తవులు చూపుచుండగా,
అదే రాగమునే ముస్లీమ్లు కూడా అందుకొన్నారు. తమ మతములో తెలివైన వారినీ, జ్ఞాపకశక్తియున్నవారినీ
వేదములను నేర్చుకొనునట్లు చేసి, వేదములను ధారాళముగా చెప్పుచూ, వేదములు ముస్లీమ్ మతమునే
సమర్థించుచున్నవనీ, వేదములు తమ ప్రవక్తను గురించి కూడా చెప్పాయని ప్రచారము చేయుచున్నారు.
52

Page 53
ఇందువు-క్రైస్తవుడా?
హిందూమతములో మేమే తెలిసినవారమనీ, మేమే హిందూ మతమునకు పెద్దదిక్కుయని చెప్పుకొను
అగ్రకులమైన బ్రాహ్మణులు తమకు వ్యతిరేఖముగాయున్న భగవద్గీతను అణచివేసి, తమకు అనుకూలముగా
యున్న వేదములను ప్రోత్సహించి చెప్పడము వలన, మూల గ్రంథమైన భగవద్గీతయొక్క జ్ఞానము హిందువులకు
తెలియకపోవడము వలన, హిందువులకు దైవజ్ఞానము తెలియకుండా పోయినది. దైవజ్ఞానము తెలియని వారిని
క్రైస్తవ, ముస్లీమ్ మతములవారు ఏదో ఒక రకముగా తమవైపు లాగుకొనుటకు ప్రయత్నించి కొంతవరకు విజయమును
సాధించారు. దానితో హిందూమతము క్షీణదశకు వచ్చినది. అలాంటిస్థితిలో హిందూ మతములోని శూద్రులందరూ
ఇతర మతములోనికి పోతే తమక్రింద ఎవరూ లేకుండా పోతారనీ, అలా జరిగితే తమ బ్రతుకుతెరువుకు ముప్పు
ఏర్పడుతుందనీ, తమ జీవనోపాధి దెబ్బతినకుండ ఉండుటకు ఉన్నవారిని ఇతర మతములలోనికి పోకుండా
చేయాలనీ, శూద్రులను కొందరిని గుంపు చేసి హిందూమత రక్షకులుగా చేసి, వారు చెప్పునట్లు ఇతర మతముల
మీద దాడిచేయునట్లు తీర్చిదిద్దుకొన్నారు. ఎవరైనా తమకు వ్యతిరేఖ బోధను చెప్పినా, భగవద్గీతను చెప్పినా వారికి
పరమత బోధకులని ముద్రవేసి, తాము ఏర్పాటు చేసియుంచుకొన్న మతరక్షకులతో దాడులు కూడా చేయించి
అణచివేయుచుందురు. ఈ విధముగా ఉన్నవారు ఇతర మతములలోనికి పోకుండునట్లు, హిందూ మతములోనే
ఎవరూ తమకు ఎదురు మాట్లాడనట్లు హిందూరక్షకులను ఉపయోగించుకొనుచున్నారు. ఈ విధముగా హిందూ
మతములో అగ్రకులమువారి పెత్తనము మొదటినుండి చెలామణీ అవుచున్నది. మొదటినుండి హిందూమతములో
కులవివక్ష ఉండుట వలన, ఎక్కువ శాతము శూద్రులు అణచివేయబడి దైవ గ్రంథమేదో, దైవ జ్ఞానమేదో
తెలియకుండాయుండుట వలన, హిందూ మతమునకు మేమే పెద్ద అని చెప్పుకొను బ్రాహ్మణులు కూడా వేదములనే
ఆశ్రయించి ఉండుటవలన, హిందూమతము కలియుగములో పూర్తి అజ్ఞాన దశకు వచ్చినది. అజ్ఞానులుగాయున్న
హిందువులను గుర్తించిన ఇతర మతములవారు వారి జ్ఞానమును చెప్పి కొందరినీ, ఉద్యోగముల ఎరచూపి కొందరినీ,
వేదములను బోధించి కొందరినీ, అనేకరకములుగా తమ మతములోనికి హిందువులను చేర్చుకోవడము జరిగినది.
ఈ విధముగా, క్షీణదశలోనికి వచ్చిన హిందూమతములో నేడు మేము భగవద్గీతా జ్ఞానమును చెప్పుచూ ప్రజలను
జ్ఞానవంతులుగా మార్చుటకు ఎంతో శ్రమించుచున్నాము.
మేము చేయు కృషిలో దేవుని జ్ఞానమునకు విలువ నిచ్చుచున్నాము గానీ, మత సాంప్రదాయములకు
విలువనివ్వడము లేదు. నేడు మూడు గ్రంథములలోనూ దైవజ్ఞానమే ఉండుట వలన, మూడు మత గ్రంథములుగా
చెప్పబడుచున్న భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథముల జ్ఞానము ఒక్కటే అయినందునా, నేను చదివిన భగవద్గీత
యొక్క జ్ఞానమూలములు మిగతా రెండు గ్రంథములలో ఉండుట వలన, నేను మూడు మతములవారికీ సమానమైన
దైవజ్ఞానమును అందించుచున్నాను. నాకు మూడు దైవ గ్రంథములు సమానముగా ఉండుట వలన, మూడు
మతముల జ్ఞానము సంపూర్ణముగా తెలిసిపోయినది. అలా మూడు దైవ గ్రంథముల జ్ఞానము తెలియుట వలన
వాటిలోని కాలుష్యము ఎక్కడున్నా తెలిసిపోవుచున్నది. దైవ గ్రంథములైన, మూడు మత గ్రంథములుగానున్న
భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్లలో జ్ఞానమునకు ఆ మతస్థులు పొరపాటుపడి మతద్వేషముతో తమ మత గ్రంథమును
గొప్పచేసి, మిగతా రెండు గ్రంథములను తక్కువ చేసినప్పుడు, మేము జోక్యము చేసుకొని మూడు గ్రంథములు
ఒకే దేవుడిచ్చిన వేననీ, ఆ మూడు గ్రంథములు ఒకే దేవున్ని తెలుపుచున్నవనీ, పొరపాటుగా ఏ మతస్థుడు కూడా
ఇతర మత గ్రంథములను గురించి తక్కువగా మాట్లాడ కూడదని చెప్పుచుందుము. మూడు మతములయందు
53

Page 54
ఇందువు-క్రైస్తవుడా?
సమాన భావమున్న మమ్ములను క్రైస్తవులు, ముస్లీమ్లు అర్థము చేసుకొని మమ్ములను గౌరవ భావముతోనే
చూస్తున్నారు. అయితే స్వమతమైన హిందూమతములోనే మాకు మిగతా మతములలో లభించిన గౌరవము
లభించలేదని అనుకొంటు న్నాము. దానికి ముఖ్యకారణము నేను బ్రాహ్మణున్ని కాదు గనుక వారి ప్రేరణతో, వారి
కనుసన్నలతో చలామణి అగుచున్న మత సంఘము వారికి జ్ఞానమంటే ఏమిటో తెలియకపోయిన దానివలన, వారందరూ
నన్ను హిందువులకు చెడు చేయువానిగానే లెక్కించుచున్నారు. మొదట పూర్తి వ్యతిరేఖముగాయున్న వారు కూడా
కొంత యోచించి, మేము చేయుచున్నది మంచిపనేనని తలచి కొంతకొంత దగ్గర కాజొచ్చారు.
మూడు దైవ గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానమున్నప్పుడు, మూడు మతములలో ఏ మతములోనున్నా,
మతమునకు ఒక గ్రంథమున్నప్పుడు దానిద్వారా ప్రతి మతస్థుడు దేవుని జ్ఞానము తెలుసుకొనుటకు అవకాశ
ముండగా, ఒక మతములో లేనిది మరొక మతములో ఉన్నదని, ఒక మతమును వదలి మరొక మతములోనికి
పోవడము నాకు ఏమాత్రము సరిపోదు. ఒక మతమును వీడి మరొక మతములోనికి పోతే వదలిపోయిన మతము
యొక్క గ్రంథమును కించపరచినట్లగును. కనుక మతమార్పిడి అంటే నాకు ఏమాత్రము సరిపోదు. మతమార్పిడులను
ప్రోత్సహించు వారిని చూస్తే నాకు పరమ అసహ్యము. ఒక మతములోయుండి, మరొక మతములోని జ్ఞానమును
తెలుసుకోవచ్చునుగానీ, మతమును మారకూడదని చెప్పుచుందుము. ఒక హిందూమతస్థుడు తన మత
గ్రంథముగానున్న భగవద్గీతను గురించి తెలుసుకోవచ్చును. అలాగే ఇతర మత గ్రంథముల లోని జ్ఞానమును
కూడా తెలియవచ్చును. అట్లు ఇతర మత గ్రంథములను చదవడముగానీ, వాటిలోని జ్ఞానమును తెలుసుకోవడము
గానీ చేయడములో తప్పులేదు. అట్లుకాకుండా మిగతా గ్రంథములలో లేనిది మా గ్రంథముల లోనే ఉన్నదని
చెప్పడముగానీ, మిగత మతములలో లేనిది మా మతములోనే ఉన్నదని చెప్పడముగానీ నాకు ఏమాత్రము సరిపోదు.
అయితే నేడు ప్రతి మతస్థుడు తన మతమును గొప్పగ చెప్పుకొనుచూ, ఇతర మతములను తక్కువగా చెప్పడము
జరుగుచున్నది. అలా చెప్పువారి మాటలనుగానీ, అటువంటి వారు వ్రాయు వ్రాతలను గానీ, ఖండించుచు ఇది
తప్పు అని చెప్పుచుందును. ఇంతవరకు ఈ గ్రంథములో చేసిన పని అదియేనని చెప్పుచున్నాను.
మనిషి పుట్టిన తర్వాత ముఖ్యముగా తెలియవలసినది దేవుని జ్ఞానమేగానీ, వేరుకాదు. అయితే మనిషి
దేవుని జ్ఞానమును ప్రక్కనబెట్టి తాను స్వయముగా తయారు చేసుకొన్న మతము అను మాయలో చిక్కు కొన్నాడు.
అలా మత మాయలోపడిన వానికి అదే మంచిగా కనిపిస్తుండును గానీ, మతములోని జ్ఞానము మంచిగా కనిపించదు.
నేడు బోధకులుగా యున్న ప్రతివారూ మతము యొక్క మాయలో పడిపోయారు. అందువలన వారు బోధకులైనా,
మతమునే బోధించుచూ, మతమును గురించే చెప్పు చుందురు. మత గ్రంథములలోని జ్ఞానమును మాత్రము
కొద్దిగయినా తెలియకున్నారు. క్రైస్తవులను పరిశీలించి చూస్తే బోధకులందరూ మతవ్యాప్తిలో మునిగిపోయారు
గానీ, బైబిలులో ఏసు చెప్పిన జ్ఞానమును మనము సరిగా అర్థము చేసుకొన్నామా లేదా అని వెనుతిరిగి చూచుకోలేక
యున్నారు. అలాగే ముస్లీమ్లు కూడా అక్కడక్కడ కొన్ని సంఘములను ఏర్పరచుకొని, మతవ్యాప్తి చేయాలని
ప్రయత్నించుచున్నారు తప్ప, తమ గ్రంథమైన ఖుర్ఆన్లోని జ్ఞానము వారికి ఎంతమటుకు అర్థమైనదని కొద్దిగా
కూడా చూచుకోలేకపోతున్నారు. ఇక హిందువుల విషయమునకు వస్తే మతవ్యాప్తి చేయాలని ప్రయత్నము ఏ
బోధకుడూ చేయడము లేదుగానీ, దేవున్ని అడ్డము పెట్టుకొని ధనార్జన చేయాలని చూస్తున్నారు. ఇందూమత
54

Page 55
ఇందువు-క్రైస్తవుడా?
ములోని బోధకులు, గురువులు, స్వాములుగా పేరుగాంచియుండి చూపంతయూ ధనార్జన మీద ఉంచుకోగా,
బోధకులు కానివారు, ఏమాత్రము జ్ఞానము తెలియనివారు సంఘములుగా ఏర్పడి స్వమత రక్షణలో పడి పోయారు.
అందువలన ధనార్జనలోనున్న బోధకులకుగానీ, స్వమత రక్షణలోనున్న మత రక్షకులకుగానీ, భగవద్గీతలోని జ్ఞానము
తెలియకుండా పోయినది.
నేడు స్వమత రక్షణలో పడిపోయిన హిందువులు ఉన్న ఈ దేశం, ఒకప్పుడు ప్రపంచమునంతటికీ
జ్ఞానమందించునదై, ప్రపంచ దేశములలో జ్ఞానుల దేశమని పేరుగాంచియుండేది. సృష్ట్యాదిలో దేవుడు తన జ్ఞానమును
ఆకాశములోని ఆత్మ ద్వారా చెప్పించాడు. ఆకాశము చెప్పిన జ్ఞానమును సూర్యుడు వినడము జరిగినది. సూర్యుడు
వినిన జ్ఞానమును భూమండలము లోని మానవులకు సూర్యుడు తెలియజేయడము జరిగినది. అలా తెలియ
జేసినప్పుడు భూమిమీదగల భారతదేశములో పూర్తి దక్షిణ భారతదేశమున, శ్రీలంకకు సమీపమునయున్న రామేశ్వరం
ప్రాంతములోయున్న మనువు అను వ్యక్తికి తెలుపడము జరిగినది. మనువు తెలుసుకొన్న జ్ఞానమును ఇక్ష్వాకుడు
అను రాజుకు తెలుపగా, ఆ రాజు ద్వారా పూర్తి భారతదేశమంతా వ్యాపించి పోయినది. అలా భారతదే శములో
అందరూ దైవజ్ఞానముకల వారైనారు. ప్రపంచ దేశములలో ఏ దేశములో లేని దైవజ్ఞానము భారత దేశములో
ఉండెడిది. కావున కృతయుగములోనే భారతదేశము జ్ఞానుల దేశమని పేరుగాంచినది. ప్రపంచములో ఏ దేశమునకూ
రాని బిరుదు భారతదేశమునకు వచ్చినది. దేవుని జ్ఞానము, దైవశక్తి భారతదేశములోనే ఉండుటవలన, ఆ కాలములోనే
భారతదేశమును ఇందూదేశము అనెడి వారు. 'ఇందూ' అనునది ప్రత్యేక పదము. 'ఇందు' అనగా చంద్రుడని
అర్థము. దైవజ్ఞానమునకు చంద్రుడు చిహ్నముగాయున్నాడు. జ్యోతిష్య శాస్త్రములో కూడా చంద్రున్నిబట్టి మనిషికి
ఏ జ్ఞానమున్నదో, ఎంత జ్ఞానమున్నదో చెప్పవచ్చును.
ఆధ్యాత్మిక విద్య ప్రస్తావన వచ్చినచోట జ్ఞానమునకు గుర్తుగా చంద్రున్ని చెప్పడము జరుగుచుండెడిది.
భగవద్గీతలో కూడా అక్షర పర బ్రహ్మయోగమున 25వ శ్లోకములో యోగి అయినవాడు కొద్దిపాటి కర్మ శేషము
వలన తిరిగి పుట్టవలసివస్తే “చాంద్రమసం జ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే” అని శ్లోకమున చెప్పారు. దానిభావము
ప్రకారము తిరిగి జన్మించు యోగి చంద్రతేజమును పొంది జన్మను పొందునని యున్నది. ఇక్కడ చంద్ర తేజము
అనగా సంపూర్ణ జ్ఞానము కలిగి అని అర్థము. ఈ విధముగా భారతదేశమంతా జ్ఞానముతో ప్రకాశించెడిది. అందువలన
జ్ఞానమునకు గుర్తుగాయున్న చంద్రున్ని ఆధారము చేసుకొని భారతదేశమును ఇందూ దేశము అనెడివారు. మొదటి
పేరు భారతదేశమైనా భారతదేశము ఇందూ దేశము అని (జ్ఞానుల దేశమని) ఇతర దేశముల చేత ప్రశంసింపబడెడిది.
ఇందూదేశము అని భారతదేశమును, ఇందువులని భారతదేశములో నివశించెడివారిని మూడు యుగములలో
పిలిచెడివారు. నాల్గవ యుగమైన కలియుగములో మూడువేల సంవత్సరములు గడుచువరకు అలాగే, ప్రజలను
ఇందువులనీ, దేశమును ఇందూదేశమని పిలిచెడివారు. రెండు వేల సంవత్సరముల పూర్వము క్రైస్తవ మతము
తయారైన తర్వాత, అంతవరకు ఇందువులని పిలువబడుచున్న ప్రజల ప్రక్కలోనికి, మతము అను పదము చేర్చబడినది.
అంతవరకు మతము అను ప్రసక్తే లేకుండా, ఆ పేరే తెలియకుండా వున్న ఇందువులు, వారు క్రైస్తవ మతస్థులైతే
మేము ఇందూ మతస్థులమని చెప్పడము మొదలు పెట్టారు. ఆ విధముగా మొట్టమొదట మతము అను పదము
ఇందువుల ప్రక్కన చేరిపోయినది.
55

Page 56
ఇందువు-క్రైస్తవుడా?
తర్వాత కొంతకాలమునకు బ్రిటీష్వారు భారత దేశమునకు వ్యాపార నిమిత్తము వచ్చినప్పుడు, వారికి
కొన్ని పదములను పలుకడము కష్టమైనందున, వారి నాలుక సులభముగా పలుకునట్లు కొన్ని పేర్లను మార్చుకొన్నారు.
అలా వారు మార్చుకోవడము వలన కొన్ని పదములు బ్రిటీష్వారు వచ్చిన తర్వాత మారిపోయాయని చెప్పవచ్చును.
ముంబాయి అను పదమును బొంబాయి అని మార్చుకొన్నట్లు, ఇందు అను పదమును హిందూ అని పలుకను
మొదలు పెట్టారు. ఇందూ అను పదమును మొదట హిందూగా పిలిచినవారు ఆంగ్లేయులని నేడు అందరికీ
తెలియ కుండాపోయినది. చెన్నపట్నమును మద్రాసు అను పేరుగా ఆంగ్లేయులే మార్చారు. వారు నోరు తిరిగేదానికి,
సులభముగా పలికే దానికి అనంత పురము అను పేరును అనంతపూర్ అని పిలిచారు. పురము అని ఉన్న పేర్లను
పూర్ అని మార్చినవారు, కడపను కుడప (Cuddapah) అని ఆంగ్లములో వ్రాసుకొన్నారు. ఇట్లు ఎన్నో పేర్ల
యొక్క రూపురేఖలను ఇంగ్లీషు వారు మార్చిన సంగతి కొందరికి గుర్తుండడము వలన, నేడు కొన్ని పేర్లను తిరిగి
యథాతథముగా చెప్పుకోవడము, వ్రాసుకోవడము జరుగుచున్నది. ఉదాహరణకు బొంబాయిగాయున్న పేరును
ముంబాయిగా, మద్రాస్ను చెన్నైగా, పూర్ అను దానిని పురముగా ఈ మధ్య 15 సంవత్సరములనుండి
మార్చుకున్నాము.
అయితే ఇందూ అను పదము హిందూగా మారియున్నదని మరచి పోయి, మధ్యలో వచ్చిన హిందూపదమునే
నేడు కూడా చెప్పుకొంటున్నాము. అయితే హిందూ అను పదము అర్థము లేనిదనీ, పూర్వము మనము ఇందువులమనీ,
మన దేశము ఇందూ దేశమని పిలువబడినదనీ, మేము గత ముప్పై సంవత్సరములనుండి చెప్పుచూనే వస్తున్నా, మా
మాటను వినడము లేదు. జ్ఞానమునకు నిలయమైన దేశమని ఆనాడు ఇతర దేశస్థులందరూ భారతదేశమును
ఇందూదేశమని ఎంతో గౌరవముగా పిలువగా, నేడు తమ చరిత్రను తామే మరచిపోయిన వారుగా భారతీయులు
నేడు హిందువులుగా పిలువబడుచున్నారు. బొంబాయిని ముంబాయిగా మద్రాసును చెన్నైగా మార్చుకొన్నవారు,
తమ చరిత్రనే మార్చివేసిన హిందూ పదమును తిరిగి ఇందూ పదముగా మార్చుకోలేకపోయారు. తాము గతములో
ఇందువులము అను మాటను పూర్తిగా మరచిపోయారు.
దేవుని ధర్మములు జ్ఞానరూపములో మొట్టమొదట భారత దేశములో ప్రవేశించి తర్వాత చుట్టుప్రక్కల
ప్రాకిన చరిత్రనుబట్టి నేటికినీ భారతదేశము ఇందూదేశమే, పూర్వము జ్ఞానరీత్యా చంద్రుని గుర్తుగా ఇందూ అని
పిలువబడిన ప్రజలు ఎంతోకాలము జ్ఞానులుగానే జీవనము సాగించారు. భారతదేశము ఇందూదేశముగా పిలువబడుట
చేత ఆ పేరు శాశ్వతముగా ఉండునట్లు భౌగోళికముగా కాశీమున్నగు నగరాలు చంద్రవంక ఆకృతిలో
నిర్మింపబడినాయి. అలహాబాద్లో గంగానది అద్భుతముగా చంద్రవంక ఆకృతిలో వంపు తిరిగినది. అంతేకాక
నేడు మనము పిలుస్తున్న హిందూ మహాసముద్రమును పూర్వము “ఇందూ సరోవరమని" పిలిచెడివారు. భారత
దేశ మొదటి ప్రధానిగాయున్న నెహ్రూ తన కూతురుకు ఇందిర ప్రియదర్శిని అనిపేరు పెట్టి, ముద్దుగా ఇందూ అని
పిలిచెడివాడు. మేము జ్ఞానరీత్యా కృతయుగము నుండి భారతదేశము ఇందూ దేశముగా, జ్ఞానమునకు చిహ్నమైన
చంద్రుని పేరుతో ఇందు అని పిలువబడుచున్నదని చెప్పు చున్నాము. ఈ దేశము ఇందూ దేశమని చెప్పుటకు
బలమైన ఆధారము కూడా కలదు. అదేమనగా! నేటికినీ హిమాలయములు భారతదేశమున ఉత్తర భాగమున ఉ
న్నట్లు అందరికీ తెలుసు. పూర్వము ఇందువుల పురాణములలో కైలాస పర్వతము హిమాలయములలో ఉన్నదనీ,
56

Page 57
ఇందువు-క్రైస్తవుడా?
ఈ
కైలాసములో శివుడు నివాసముండేవాడని చెప్పుకుంటున్నాము. కైలాసములో వున్న శివుడు తాను జ్ఞానిని అని
తెలుపు నిమిత్తము గుర్తుగా, తన తలలోని వెంట్రుకలముడిపై చంద్రవంకను ధరించాడు. అది తెలియునట్లు నేడు
ఎక్కడైనా శివుని ఫోటో కనిపిస్తే అతని తలమీద చంద్రవంక కనిపించును. భారతదేశమునకు ఎత్తైన హిమాలయ
పర్వతముల మీద చంద్రవంక గుర్తు శివుని తలమీద జెండావలె (పతాకమువలె) ఉండుట వలన, హిమాలయముల
నుండి క్రిందివరకున్న దేశమునంతటిని చంద్రుని పేరుతో ఇందూ దేశమని పిలిచెడివారని చెప్పవచ్చును.
విధముగా చరిత్ర ఆధారముతోనూ, పురాణముల సాక్ష్యముతోనూ, భౌగోళికముగా చంద్రవంక ఆకృతి ఉండుట
వలననూ, భారతదేశమును జ్ఞానుల దేశముగా గుర్తించి అందరూ ఇందూ దేశమని పిలిచెడివారు.
ఈ విధముగా భారతదేశము ఇందూ దేశము అనుటకు ఎంతో చరిత్ర కలదు. నేను ఎక్కువగా జ్ఞానరీత్యా
మనది ఇందూ దేశమనీ, మనము ఇందువులమనీ, 30 సంవత్సరములనుండి మేము చెప్పుచున్నా మా మాటను
పెడచెవిన పెట్టి, మేము ప్రత్యేకమైన ఇందూమతమును హిందూ మతమునకు పోటీగా తయారు చేస్తున్నామనీ,
ఇందూ అను పరమతమును బోధిస్తున్నామనీ చరిత్రగానీ, జ్ఞానముగానీ తెలియని హిందూమతరక్షకులు మమ్ములను
గురించి ఆరోపించడము జరిగినది. గొప్పవారి మాటలనే పరిగణనలోనికి తీసుకోవాలి, తక్కువ వారి మాటలను
లెక్కపెట్టకూడదను సూత్రము ప్రకారము, మేము చరిత్ర తెలియని హిందువుల మాటలను లెక్కించలేదు. అదే
సూత్రము ప్రకారము భారతదేశ తొలి ప్రధానిగా పనిచేసిన నెహ్రూ గారు, తన కూతురు ఇందిరాగాంధీ గారికి
వ్రాసిన లేఖను పరిగణనలోనికి తీసుకొని, దానినే మీకు చూపుచున్నాను చూడండి.
C.
త్రైత సిద్దా
57

Page 58
ఇందువు-క్రైస్తవుడా?
ప్రముఖుల లేఖ
సాక్షి న్యూస్ పేపరు, 21-01-2014
ఇందు దేశమే ఇండియా!
హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యా
వర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశ
పటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు
కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు
వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది.
రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం
పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో
చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన
కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు,
ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా
ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహా
గ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ
ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన
దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే
వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా
వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని
పెద్దలు అంటూ ఉండరు.
* నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి
58

Page 59
ఇందు
హిందు
హిందు
హిందు
II
II
||
ఇందూ - హిందూ
చందుడ్రు
అర్థరహితము
దొంగ
బేవకూఫ్
II
జ్ఞాని
ఇందువు-క్రైస్తవుడా?
జ్ఞానములేని
ప్రబోధానంద
యోగీశ్వరులు
దయానంద సరస్వతి
(గురూజీ సమగ్ర గ్రంథావలి)
నృసింహానంద భారతి
(హైందవ శంఖారావము)
చిన్నజీయర్ మొదలగు చాలామంది స్వామీజీలు హిందూ శబ్ధమును వాడకూడదన్నారు. ఆ పదమును
వాడితే మన తల మనమే నరుక్కున్నట్లని తమ ఉపన్న్యాసములో చెప్పారు. చాలామంది స్వామీజీలు ఈ శబ్దమును
విదేశీయులైన ముస్లీమ్లు మనకు అంటగట్టారన్నారు. వారి భావములో హిందు అంటే తెలివి తక్కువవారని
అర్థమట.
ఈ విధముగా భారతదేశము ఇందూ దేశముగా ఉన్నదనుటకు ఎన్నో సాక్ష్యములు గలవు. అయితే నేడు
ఇందువులు హిందూ మతస్థులుగా మారిపోవడము జరిగినది. మతము అను ఉచ్చులో చిక్కుకొన్న భారతీయు
లందరూ, తాము ఇందువులమను తమ చరిత్రను తెలియనివారై, అర్థములేని హిందూ పదమును పెట్టుకొని,
మేము హిందువులము అంటున్నారు. నేడు స్వమత రక్షణలో పడిన హిందూరక్షణ సంస్థలన్నీ మేము ఎందుకు క్షీణ
దశకు వచ్చి మమ్ములను మేము రక్షించుకోవలసి వస్తున్నదని ఏమాత్రము యోచించలేదు. ఒకడు ఏదంటే రెండవవాడు
అదే అంటూ పోతున్నాడు తప్ప ఇది నిజమా, అబద్ధమా అని ఏమాత్రము యోచించడము లేదు. తాము తప్పు
చేస్తున్నామనీ, మన గౌరవమును మనమే లేకుండా చేసుకుంటు న్నామని అనుకోకుండా, తప్పును సమర్థించుకొంటూ
హిందూమతము అను దానికి అర్థమును చెప్పుటకు సింధూనదిని జోడించుకొని చెప్పుచున్నారు. సింధూనదికీ
హిందూమతమునకు సంబంధము ఏమిటి? అని ఏమాత్రము ఆలోచించడములేదు. స్వమతరక్షణ అను
నినాదముతోయున్న వారు స్వమత మేదో, పరమతమేదో తెలియని స్థితిలో ఎవరు జ్ఞానమును చెప్పినా, వాడు ఇతర
మతమును బోధిస్తున్నాడని ఆరోపణ చేయడము మొదలుపెట్టారు. దానికి తార్కాణముగా (నల్గొండ జిల్లా)
భువనగిరిలో బ్రాహ్మణులందరూ పోలీస్ స్టేషన్కు పోయి త్రైత సిద్ధాంతమనునది క్రైస్తవులది, కావున త్రైత సిద్ధాంత
భగవద్గీతను చదవండి అని గోడలమీద వ్రాసినవారిమీద కేసు పెట్టండని ఆరోపించడము, అక్కడి సి.ఐ కూడా
కొంతయినా ఆలోచించ కుండా త్రైత సిద్ధాంత భగవద్గీతను మా భక్తులు చూపించినా, గ్రుడ్డిగా కేసు నమోదు
చేయడమును చూస్తే, ఇందువులు హిందువులుగా మారడమే కాకుండా పూర్తి గ్రుడ్డివారై నారని చెప్పవచ్చును.
59

Page 60
ఇందువు-క్రైస్తవుడా?
ఏ మతమూ లేని రెండువేల సంవత్సరముల పూర్వము, భారత దేశములో గౌతముడు గయలో బోధివృక్షము
క్రింద జ్ఞానోదయమైన తర్వాత, బుద్ధునిగా ప్రకటించుకొని కాషాయ వస్త్రములు ధరించి, గుండు కొరిగించు కొని,
పూర్తిగా సంసారమును త్యజించి అంతకుముందున్న మహర్షులకంటే కొంత భిన్నముగా, తాను అనుభూతి చెందిన
జ్ఞానమును చెప్పెడివాడు. హిందువులలో శూద్రకులమువాడైన బుద్ధుడు సన్న్యాసిగా మారి ఎక్కువగా భూత దయను
బోధిస్తూ, తనకు తెలిసిన జ్ఞానమును చెప్పడము ఆనాడు అగ్రకులమువారైన బ్రాహ్మణులకు సరిపోలేదు. కాషాయ
వస్త్రములు ధరించి సన్న్యాసిగాయున్న బుద్ధున్ని కూడా పరమతమువానిగా ప్రచారము చేసి బుద్ధుని జ్ఞానమువైపు
ఎవరినీ పోనీయకుండా చేయవలెనని, బుద్ధుని తర్వాత కొంత కాలమునకు వచ్చిన శంకరాచార్యున్ని సాక్షాత్తూ
ఈశ్వరుడన్నట్లు ప్రచారము చేసి, బౌద్ధ సూత్రములను అణచివేశారు. భారతదేశములో పుట్టిన బౌద్ధ సూత్రములకు
బుద్ధుని జ్ఞానమునకు చైనా, రష్యా, టిబెట్, జపాన్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ మొదలగు దేశముల ప్రజలు
ఎందరో ఆకర్షితులు కాగా, అది హిందూమతముకాదని ఆనాటి హిందువు లలోని బ్రాహ్మణులు చెప్పగా బుద్ధుని
సిద్ధాంతములు కాస్త బౌద్ధమతముగా మారిపోయినది. అలా బుద్ధున్ని వెలివేయకపోతే, శూద్రుడను అసూయతో
చూడక పోయివుంటే నేడు బౌద్ధమతముగా చెప్పబడునది హిందూమతముగానే ఉండెడిది.
ఈ విధముగా తమ స్వార్థముతో మేము తప్ప ఇతర కులముల వారు ఎవరూ జ్ఞానులుగా కనిపించకూడదని
అనుకోవడము వలన కొన్ని దేశములలో వ్యాపించిన బౌద్ధమతము హిందూమతము నుండి వీడిపోయి నది. అది
వీడిపోలేదు హిందువులే విడగొట్టారు. కాషాయములు ధరించి సన్న్యాసము తీసుకొన్న బుద్ధున్ని శూద్రుడను
అసూయతో, మా హిందూ మతమునకు సంబంధములేదని అది పరమతమని ప్రచారము చేసి, కేరళ బ్రాహ్మణుడైన
శంకరాచార్యున్ని గొప్పవానిగా ప్రచారము చేసి, అతనితో ఎవరూ బౌద్ధ సూత్రములను ఆచరించకుండునట్లు
అద్వైతమును ప్రచారము చేయించారు. ఈ విధముగా మన వ్రేలే తీసుకొని మన కన్నే పొడుచు కొన్నట్లయినది.
ఇట్లు రెండువేల సంవత్సరముల పూర్వమే హిందూమతము క్షీణించుటకు ప్రారంభించినది. తర్వాత క్రైస్తవము
భారతదేశములోనికి వచ్చి చాలా వేగముగా అభివృద్ధయినది. దానికి కారణము హిందువులలో అధిక శాతమున్న
శూద్రులలో బ్రాహ్మణుల వలన అసహనము పెరిగిపోయి, ఇతర మతములవైపు వేగముగా పోవుటకు మొదలు
పెట్టారు. నేడు హిందూమతము ఎంతో క్షీణించిన స్థితిలో కూడా త్రైత సిద్ధాంతముగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మయని
మూడు ఆత్మలను తెల్పుచూ, అదే భగవద్గీతలో చెప్పిన క్షర, అక్షర, పురుషోత్తముడను మూడు ఆత్మలను చెప్పుచున్నా
మమ్ములను కూడా బుద్ధున్ని వెలివేసినట్లు ప్రక్కకు పంపాలని, మమ్ములను పరాయి మతముగా లెక్కవేసి,
పరమతమును బోధిస్తున్నామని చెప్పుచూ, కేసులు కూడా పెట్టిస్తున్నారంటే నేటికి కూడా శూద్రులను వివక్ష అగ్రకులము
వారిలో పోలేదని తెలియుచున్నది.
గత కొంతకాలముగా మా మీద ఎన్నో ఆరోపణలు హిందూ మతములోనే వచ్చినా, ప్రజలు సత్యమును
గ్రహించి మేము చెప్పు జ్ఞానము వైపు రావడము జరుగుచున్నది. ఒక్క హిందువులే కాకుండా మిగతా అన్ని
మతములవారు కూడా మా జ్ఞానమునకు ఆకర్షితులైనారు. మావద్ద అన్ని మతములు సమానమైనవని మేము
చెప్పడము వలనా, ఇక్కడ మత మార్పిడులు లేనందువలనా, ఏ మతములోనున్న వారికి జ్ఞానమంతా ఒక్కటేననీ,
అందరికీ దేవుడు ఒక్కడేనని చెప్పడమువలనా మూడు మతముల వారు మా జ్ఞానమును తెలుసుకోగల్గుచున్నారు.
60

Page 61
ఇందువు-క్రైస్తవుడా?
మా గ్రంథములను అన్ని మతములవారు చదువుచున్నారు. నా జ్ఞానము విన్న ఏ హిందువు కూడా పరమతములోనికి
పోవాలని అనుకోవడము లేదు. అలాగే నన్ను చూచిగానీ, నా జ్ఞానమును చూచిగానీ ఇతర మతస్థులు ఎవరూ
అసూయ పడడములేదు. మతసామరస్యమునకు ఈ జ్ఞానము ఎంతో అవసరమని అందరూ అంటున్నారు.
నేను పుట్టుకలో హిందువుగా పుట్టినప్పటికీ, పూర్వపు ఇందూ (జ్ఞాన) లక్షణములు నాలోయుండుట వలన,
నేను స్వచ్ఛమైన ఇందువును అని చెప్పుచున్నాను. ఇందువు అంటే జ్ఞాని అని పూర్వమున్న అర్థమే నేడు కూడా
కలదు. మూడు మతములలో మూడు గ్రంథముల ద్వారా దేవుడు తన జ్ఞానమును తెలిపియున్నాడు. కావున ఏ
మతములోనివాడైనా వాని గ్రంథములోని జ్ఞానమును బాగా తెలియగలిగితే, వాడు ఆ మతములో జ్ఞాని అనబడును.
దేవుని జ్ఞానము తెలిసినవాడు ఏ మతములోనైనా జ్ఞానియే కావున, వానిని ఆ మతములోని ఇందువు అనవచ్చును.
జ్ఞాని అంటే ఇందువు అను అర్థము ప్రకారము, హిందూమతములో ఇందువులు ఉన్నట్లే, క్రైస్తవమతములో
ఇందువులుండవచ్చును. అట్లే ఇస్లామ్ మతములోని ఖుర్ఆన్ గ్రంథము యొక్క జ్ఞానమును సంపూర్ణముగా
తెలిసిన వానిని కూడా పద్ధతి ప్రకారము ఇందువే అని అనవచ్చును. ఈ విధముగా మూడు మతములలో ఇందువులు
(జ్ఞానులు) ఉండవచ్చును. మూడు మతముల జ్ఞానమును తెలిసినవానిని సంపూర్ణ జ్ఞాని అనవచ్చును. లేక
సంపూర్ణ ఇందువు అనవచ్చును. ఇందువు అంటే అతడు ఏ మతము జ్ఞానమునైనా తెలిసియుండవచ్చును. ఇందువు
అను పదము జ్ఞానమునకు సంబంధించినదిగానీ, మతమునకు సంబంధించినది కాదు. అందువలన ఏ మతములోనైనా
ఇందువులు ఉండవచ్చును.
ఒక మతమునకేగాక అన్ని మతములకు సంబంధించిన జ్ఞానము తెలిసిన వానిని సర్వమత జ్ఞాని అనియూ,
సంపూర్ణ ఇందువు అనియూ అనవచ్చును. ఒక విధముగా నేను మూడు మత గ్రంథముల జ్ఞానమును తెలిసియున్నాను.
కావున నేను నా లెక్కలోగానీ, మీ లెక్కలోగానీ స్వచ్ఛమైన ఇందువును అనియే చెప్పవచ్చును. ప్రపంచ విషయములలో
తనను గొప్పగ చెప్పుకోవడము గర్వమవుతుంది. అయితే జ్ఞాన విషయములో, దేవుని విషయములో గుణములుండవు.
దేవుని విషయములో ఏదీ దాచుకోకూడదు. ఉన్నదున్నట్లు చెప్పడము మంచిది. అందువలన మేము ఉన్నదున్నట్లు
చెప్పవలెనను ఉద్దేశ్యముతో నేను యోగీశ్వరున్ని అని చెప్పుచున్నాను. ఒక మనిషి యోగిగా మారాలంటే ముందు
సంపూర్ణ జ్ఞానిగా మారియుండాలి. మొదట సంపూర్ణ జ్ఞాని అయిన తర్వాత యోగిగా మారవచ్చును. అందువలన
యోగినైన నేను గతములోనే సంపూర్ణ జ్ఞానిని అని చెప్పుటకు సంశయించడములేదు. నేను సంపూర్ణ జ్ఞానిని
అయినందున మూడు మతముల జ్ఞానము నాకు తప్పనిసరిగా తెలిసియుండాలి. అలా జ్ఞానము తెలిసియుంటే
మూడు మతములు నా మతములే అను భావము కల్గియుండాలి. ఎవరైనా వారి ఇంటిలో ఒక వస్తువు ఉండవలసిన
చోట ఉండక క్రిందపడియుంటే తప్పనిసరిగా దానిని ఉండవలసిన చోట పెట్టుదురు. అలాగే వారి ఇంటిలో కసువు
పడి (చెత్తపడి)యుంటే తప్పని సరిగా శుభ్రముగా చేసుకొందురు. ఎవరి ఇంటిని వారు శుభ్రముగా ఉంచుకొన్నట్లు,
నాది అనుదానిలో ఉండవలసినది ఉండకపోతేనో, ఉండవలసిన రీతిలో ఉండక తలక్రిందులుగా యుంటేనో, తప్పక
దానిని సవరించవలసిన బాధ్యత నాకు ఉంటుంది కదా! అలాగే మూడు మతములను నా మతములుగా తలచినప్పుడు,
ఆ మూడు మతములలో ఏదైనా లోపము కనిపించితే, దానిని సవరించు బాధ్యత కూడా మామీద ఉంటుంది.
అటువంటి బాధ్యతను నేను కల్గియున్నాను కాబట్టి, క్రైస్తవ మతములో ఏసు చెప్పిన జ్ఞానమును వదలి క్రైస్తవులు
61

Page 62
ఇందువు-క్రైస్తవుడా?
వేదములను చెప్పుకోవడము మంచిదికాదనీ, ఏసు సంపూర్ణ జ్ఞానమును అందించగా, దానిని ఒక్క ముక్కయినా
చెప్పక ఒక గ్రంథమంతా వేదములను, పురాణము లను వ్రాసుకోవడము మాకు సరిపోలేదు. అందువలన వారు
చెప్పిన వేదముల వాక్యములన్నిటిని మేము ఖండించడము జరిగినది. అలాగే హిందూ మతము లోని భగవద్గీతలో
కలిసిన మానవ కల్పిత శ్లోకములను తీసివేసి స్వచ్ఛమైన భగవద్గీతను అందివ్వడము జరిగినది. అలాగే ఖుర్ఆన్లోని
వాక్యములు ముస్లీమ్లకు అర్థముకానివివుంటే, వాటికి కూడా శాస్త్రబద్ధముగా వివరము చెప్పడము జరిగినది. నేను
ఇందువును కాబట్టి వారి వారి మతములలోని వారిని ఇందువులుగా (జ్ఞానులుగా తీర్చిదిద్దడము నా కనీస బాధ్యత.
అందువలన మూడు మతములలోని కాలుష్యమును తొలగించుటకు నేను ప్రయత్నించవలెనని అనుకొన్నాను. ఆ
ప్రయత్నము లోని భాగముగా “ఇందువు-క్రైస్తవుడా?” అను గ్రంథము ద్వారా హిందూ మతములోని లోపములనూ,
అటు క్రైస్తవ మతములోని లోపములనూ సరి చేయు ప్రయత్నము చేశాము. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా
చెప్పాము. వేదములను హిందూమతములో గొప్పగా చెప్పుకొనుచున్నా, భగవద్గీతలో దేవుడు చెప్పిన వాక్యమునకు
విలువనిచ్చుచూ, పూర్తిగా వేదములను ఖండించి వేశాము. ఇది నా మతమని, ఇది పరమతమని బేధము లేకుండా
మూడు దైవ గ్రంథములను గురించి అందరికీ అర్థమగు లాగున చెప్పుచూ వచ్చాము. మూడు మతములలోని
వాడెవడైనా వాని గ్రంథముగాయున్న బైబిలులోగానీ, ఖుర్ఆన్లోగానీ, భగవద్గీతలోగానీ, జ్ఞానమును అర్థము చేసుకొని
జ్ఞానిగా మారియుంటే వానిని జ్ఞానిలేక ఇందువు అనాలి. జ్ఞాని అయిన తర్వాత ఎవడుగానీ నేను ఫలానా
మతస్థుడనని చెప్పుకొనే దానికంటే నేను ఫలానా దైవ గ్రంథము యొక్క ఇందువును అని చెప్పుకోవడము మంచిది.
ఇందువు అను పదము మతమును సూచించదు, ఇందువు అను పదము కేవలము జ్ఞానమును మాత్రమే సూచించును.
అందువలన ఏ మతస్థుడైనా నేను ఫలానా ఇందువునని చెప్పండి. క్రైస్తవుడు బైబిలు జ్ఞానమును అంతటినీ తెలిసిన
తర్వాత అతడు జ్ఞానిగా మారియుండును. కనుక అతడు నేను ఇందువునని చెప్పుకోవచ్చును. లేకపోతే మతము
పేరు చెప్పకుండా వారి గ్రంథము పేరు చెప్పి నేను భగవద్గీత ఇందువుననో, ఖుర్ఆన్ ఇందువుననో, బైబిలు ఇందువుననో
చెప్పవచ్చును. ఇంకా ముందుకుపోయి మూడు దైవ గ్రంథముల జ్ఞానమును సంపూర్ణముగా తెలియగలిగిననాడు
సంపూర్ణ జ్ఞానిగా చెప్పుకోవచ్చును. సంపూర్ణ జ్ఞాని అయిన తర్వాత తన మతమును గురించి గొప్పగా
చెప్పుకోవడముగానీ, తాను ఫలానా మతస్థుడననీ చెప్పుకోవడము మంచిదికాదు. అట్లు చెప్పుకోవడమువలన ఎవడూ
సంపూర్ణ జ్ఞాని అనిపించుకోడు.
మతము అనునది ఏ మనిషికైనా ప్రాథమిక అజ్ఞానమైనందున, మతమును చెప్పుకొను ఎవడుగానీ జ్ఞానికాలేడని
ముందే చెప్పుకొన్నాము. ఇంతకుముందు గ్రంథములలో కూడా వ్రాసుకొన్నాము. దేవుడిచ్చిన మూడు దైవగ్రంథములకు
మతము పేరు అంటగట్టడము కూడా పెద్ద నేరమే. దేవుడు మతము పేరు చెప్పి ఏ గ్రంథమూ ఇవ్వలేదు. ఏ
గ్రంథము ఇచ్చినా అది సకల జనులకు అని ఇచ్చాడు కానీ, ఫలానా మతము వారికేనని ఇవ్వలేదు. అందువలన
మతప్రసక్తి లేకుండా మూడు గ్రంథములలో నీ కిష్టమైన ఏ గ్రంథమును అనుసరించినా, అది మనిషిని దేవునివద్దకు
చేర్చ గలదు. చేతనైతే మూడు గ్రంథములను చదివి జ్ఞానమును గ్రహించుకొంటే మరీ తొందరగా దేవునివద్దకు
చేరవచ్చును.
62

Page 63
ఇందువు-క్రైస్తవుడా?
నేడు అన్ని మతముల వారు ఉదయము లేచింది మొదలు తిరిగి రాత్రి పడుకొనే వరకు బ్రతుకుతెరువు
కొరకు ప్రాకులాడడమే జరుగుచున్నది. అయితే కొందరు మాత్రము దేవుడు జ్ఞానము మీద కొంత ధ్యాస కల్గి
యున్నారు. వారి కొరకు కొందరు బోధకులు తమ గ్రంథములోని జ్ఞానమును బోధించుచుందురు. ఏ మతము
వారు ఆ మతములోని జ్ఞానమును చెప్పుచూ, ఇతర మతముల వారిని తమ మతములోనికి లాగుకొనుటకు
ప్రయత్నించు చుందురు. మేము చూచినంతలో క్రైస్తవులు, ముస్లీమ్లను తమ మతము లోనికి మార్చాలనుకోవడము
లేదు. అట్లే ముస్లీమ్లు క్రైస్తవులను మార్చాలనుకోవడము లేదు. ఎటొచ్చీ హిందూమతములోని మనుషులను
తమతమ మతములోనికి చేర్చాలని మిగతా రెండు మతముల బోధకులు ప్రయత్నించుచున్నారు. క్రైస్తవ బోధకులు,
ప్రచారకులు హిందువులను తమ మతములోనికి ఎక్కువశాతము మార్చుకొన్నారు. అలా మారినవారు అక్కడకుపోయి
బైబిలు గ్రంథమును చదివి జ్ఞానమును తెలుసుకొని జ్ఞానిగా మారితే ఫరవాలేదు. మతము మారినా తన లాభముకొరకు
అన్నట్లు, గ్రంథములోని జ్ఞానమును తెలుసుకోక కాలము గడుపువారు కూడా కలరు. వారు ఏ మతములోయున్నా
ఒక్కటే.
ఎవడైనా హిందూమతములో నాకు జ్ఞానము చెప్పువారు ఎవరూ లేరనియో, హిందూమతములో అగ్రకులముల
వారి వివక్ష చాలా ఉన్నది, అటువంటి వివక్ష లేని క్రైస్తవ మతములోనికి పోతాననియో, హిందూ మతములో భగవద్గీత
అర్థము కాలేదనియో, ఏదో ఒక విధముగా జ్ఞానము కొరకే మతమును మార్చుకొని క్రైస్తవులలో కలిసిపోయి, బైబిలు
గ్రంథమును చదివి బాగా అర్థము చేసుకొని బైబిలు జ్ఞానము ప్రకారము జ్ఞాని అయితే అప్పుడు నేను ఇందువును
(జ్ఞానిని) అని ప్రకటించుకోవచ్చును. అలా జ్ఞానిగా మారినవాడు తాను బైబిలు జ్ఞానమును గ్రహించుకొని జ్ఞానినైనానని
అనుకొనునుగానీ, క్రైస్తవ మతము వలన జ్ఞానినైనానని ఎవడూ అనుకోడు. అట్లు జ్ఞాని అయినవాడు క్రైస్తవుడా?
అంటే కాదని చెప్పవచ్చును. వాడు క్రైస్తవ మతములోని వాడే కదాయని ఎవరైనా అడిగితే బైబిలు జ్ఞానము
తెలియకముందు క్రైస్తవుడేగానీ, బైబిలు జ్ఞానము తెలిసిన తర్వాత జ్ఞాని అయిన తర్వాత క్రైస్తవుడు కాదు. అప్పుడు
వాడు ఇందువుగా తయారైనా డని చెప్పవచ్చును. అప్పుడు ఇందువు క్రైస్తవుడా? అని ప్రశ్నిస్తే క్రైస్తవుడు కాదు
ఇందువేనని చెప్పవచ్చును. బైబిలు చదివిన తర్వాత, అందులోని జ్ఞానమును గ్రహించుకొన్న తర్వాత, ఆ గ్రంథములో
క్రైస్తవము అను పేరు లేనిదానివలన, తనను క్రైస్తవునిగా చెప్పుకొనుటకు ఇష్టపడడు. తనను జ్ఞానిగానే చెప్పుకొనుటకు
ఇష్టపడును. అందువలన మతములకు అతీతముగాయుండు ఇందువునని చెప్పుకొనును.
మూడు దైవ గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథముల సారాంశము తెలిసినవాడు సంపూర్ణ
జ్ఞానియై చివరకు యోగిగా మారగలడు. అలా మారగలిగినవాడు మూడు దైవ గ్రంథములలోని జ్ఞాన విషయములను
సులభముగా వివరించి చెప్పగలడు, అని మేము చెప్పగా ఒక క్రైస్తవ బోధకుడు మా మాటలు విని అతడు ఇలా
అన్నాడు.
బోధకుడు :- నేను క్రైస్తవున్ని అని చెప్పుకొంటున్నాను. నాకు బైబిలు జ్ఞానమంతా తెలుసు. బైబిలు జ్ఞానమంతా
తెలిసివున్న నన్ను జ్ఞాని అని ఎవరైనా అనగలరు. జ్ఞానిని అయినంతమాత్రమున నేను పుట్టిన మతమును ఎలా
కాదనగలను? నేను పుట్టింది మొదలు యాభై (50) సంవత్సరములుగా క్రైస్తవ మతములో యుండి నేడు
63

Page 64
ఇందువు-క్రైస్తవుడా?
జ్ఞానినైనంతమాత్రమున క్రైస్తవున్ని కాదని ఎలా చెప్పగలను? అలా బలవంతముగా చెప్పినా, క్రైస్తవ వాసన నాలోనుండి
ఎలా పోగలదు? అందువలన నేను జ్ఞానినే అయినా క్రైస్తవున్నేనని చెప్పుచున్నాను.
నేను :- నేను క్రైస్తవున్ని అని చెప్పుచున్నావంటే బైబిలు జ్ఞానము నీకు తెలియదనియే చెప్పవచ్చును. నేను క్రైస్తవుడను
కాను అని అర్థమైనప్పుడే జ్ఞానివి కాగలవు. క్రైస్తవునిగా కాకుండాపోవడమే జ్ఞానిగా మారడము. అందువలన నీకు
ఇంకా బైబిలులోని జ్ఞానము తెలియదనియే చెప్పవచ్చును. బైబిలు తెలియదని నీకు తెలియుటకు నేను బైబిలు
గ్రంథములోని ఒక వాక్యమును అడుగుతాను. నేను క్రైస్తవుడినేనని చెప్పువాడు వాక్యమునకు సరియైన జ్ఞాన
వివరమును చెప్పలేడు.
బోధకుడు :- మీరు బైబిలు అని చెప్పి ఇతర గ్రంథములలోని ప్రశ్న అడుగ కూడదు. ఖచ్చితముగా బైబిలులోని
ప్రశ్ననే అడుగండి?
నేను :- అలాగే అడుగుచున్నాను. బైబిలు గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయమున 46వ వాక్యముయందు
ఇలా కలదు. "దేవుని వద్దనుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచియుండలేదు.” ఈ వాక్యమును
చూచారు కదా! దేవునివద్దనుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచాడు అని అర్థమగుచున్నది కదా!
దేవునివద్దనుండి వచ్చినవాడు ఎవడు?
బోధకుడు :- దేవునివద్ద నుండి వచ్చినవాడు ఏసుప్రభువు మాత్రమే. ఆయన వచ్చాడు కనుక ఆయన మాత్రము
తండ్రిని చూచాడు.
నేను :- ఏసు తండ్రి ఎవరు?
బోధకుడు :- మీరు తెలివిగా ప్రశ్నను అడుగుచున్నారు. ఫలానావాడు తండ్రి అని చెప్పితే నీవు చూడలేదు కదా!
ఏసు ఒక్కడే కదా చూచినది ఆయన తండ్రి నీకెలా తెలుసు? అని అడుగుతావు. చెప్పకపోతే బోధకుడై యుండి
ఏసును గురించి బోధించునప్పుడు ఆయన తండ్రి తెలియదా? అని అడుగుతావు.
నేను :- నీవు చూచావా? అని నేను అడుగలేదు. ఫలానా అని తెలుసా? అని అడుగుచున్నాను.
బోధకుడు :- యోహాను సువార్త ఆరవ అధ్యాయములోనే 27వ వాక్యమందు “తండ్రియైన దేవుడు ఆయనకు
ముద్రవేసియున్నాడు.” అని ఉన్నది కనుక. ఆయన తండ్రి దేవుడేనని చెప్పవచ్చును.
నేను :- మీ తండ్రి ఎవరు? ప్రపంచరీత్యా ఎవరైనాయుండవచ్చును. అయితే జ్ఞానరీత్యా నీ తండ్రి ఎవడు?
బోధకుడు :- మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యమునందు "ఒక్కడే మీ తండ్రి ఆయన
పరలోకమందున్నాడు” అని కలదు. కావున మా తండ్రి కూడా దేవుడేనని అందరమూ దేవునిబిడ్డలమేనని అందరికీ
దేవుడు ఒక్కడే తండ్రియని తెలుసు.
నేను :- అందరికీ తండ్రి దేవుడే అనినప్పుడు నీవు ఎవరి వద్దనుండి వచ్చావు? దేవునివద్దనుండి వచ్చావా?
సాతానువద్దనుండి వచ్చావా?
64

Page 65
ఇందువు-క్రైస్తవుడా?
బోధకుడు :- దేవునివద్దనుండియే వచ్చాను. అందరమూ దేవునివద్దనుండే వచ్చాము. అందరికీ ఆయనే సృష్టికర్త.
నేను :- అందరి విషయమునూ అడుగలేదు. నీ విషయమును మాత్రము అడుగుచున్నాను. నీవు దేవునివద్దనుండి
వచ్చియుంటే, దేవునివద్దనుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరునూ తండ్రిని చూచియుండలేదు అని ఏసు ప్రభువు
అన్నాడు కదా! ఆయన చెప్పినట్లు మీరు తండ్రియైన దేవున్ని చూచారా?
బోధకుడు :- అందరూ దేవునివద్దనుండి వచ్చినవారమే కనుక తండ్రిని చూచియే ఉందుము.
నేను :- నాలుగు ప్రశ్నలకు ముందు మీరే దేవునివద్దనుండి వచ్చినవాడు ఏసు ఒక్కడే అనీ, ఆయన మాత్రమే
తండ్రిని చూచాడని చెప్పారు. ఇప్పుడు అందరమూ దేవునివద్దనుండి వచ్చాము అంటున్నారు. అంతేకాక తండ్రిని
కూడా చూచాము అంటున్నారు. మీరు అలా చూచియుండలేదని మీరు అసత్యము చెప్పుచున్నారని మేము అనగలము.
దీనికి మీరేమంటారు?
బోధకుడు :- దేవునివద్దనుండి వచ్చినవారు తప్ప అని దేవుడు అన్నాడుగానీ, ఏసు ఒక్కడే నావద్దనుండి వచ్చాడని,
మిగతావారు ఎవరూ నావద్దనుండి రాలేదని చెప్పలేదే! మేము కూడా అక్కడనుండే వచ్చాము. మా తండ్రి కూడా
దేవుడు, కావున మా తండ్రిని మేము ఎరుగుదుము. మా తండ్రియైన దేవున్ని మేము చూడలేదని మీరెలా చెప్పగలరు?
నేను :- ఇదే యోహాను సువార్త ఐదవ అధ్యాయమున 37వ వాక్యము నందు “మీరు ఏ కాలమందైననూ, ఆయన
స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు" అని ఉన్నది కదా! దీనికేమంటారు. ఏసు చెప్పిన మాట
అసత్యమంటారా?
బోధకుడు :- ఏసు చెప్పినది అసత్యమని మేము చెప్పలేదు. ఆయన చెప్పినది వాస్తవమే. అయితే అర్థము
చేసుకోవడములో మనయందే లోపము ఉండవచ్చును కదా!
నేను :- మీరే చెప్పండి ఎలా అర్థము చేసుకోవాలో?
బోధకుడు :- ఎవరూ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అని చెప్పినది క్రైస్తవులను
గురించికాదు. క్రైస్తవులు కానివారిని గురించి చెప్పాడు. క్రైస్తవులకు తండ్రి ఎవరో, దేవుడు ఎవరో తెలుసును.
(ఇక్కడ బోధకుడు పూర్తి తప్పటడుగు వేశాడు. (మత్తయి సువార్త 28-19లో) సమస్త జనులకు తన
బోధయని ఏసు చెప్పియుండగా, ఈ మాట క్రైస్తవులకు చెప్పినదనియూ, ఆ మాట ఇతర మతముల వారికనియూ
చెప్పడము పూర్తి తప్పనీ, బైబిలు జ్ఞానము ప్రకారము బోధకుడు మాట్లాడలేక పోయాడనీ, అందువలన ఆయన
జ్ఞానికాదని నిరూపించబడినది.)
పై మాటలనుబట్టి దేవుడు ఎవరో, తండ్రి ఎవరో అర్థముకాని స్థితిలో బోధకులు కూడా ఉన్నారని
తెలియుచున్నది. బైబిలు గ్రంథములోని నాలుగు సువార్తలలో ఏసు ఏమి చెప్పినాడో తెలియని స్థితిలో నేటి
క్రైస్తవులు ఉండిపోయారు. అటువంటి స్థితిలో బోధకులుండి తాము బైబిలు గ్రంథము లోని జ్ఞానమును
తెలుసుకోవాలని ప్రయత్నించక, తమకున్న జ్ఞానముతోనే హిందువులను క్రైస్తవులుగా మార్చుటకు ప్రయత్నించు
65

Page 66
ఇందువు-క్రైస్తవుడా?
చున్నారు. ప్రతి క్రైస్తవ బోధకుని అంతరంగములో, నాకు బైబిలు అంతా తెలుసు అనే భావమే ఉన్నది తప్ప,
తెలియవలసినది ఎంతో ఉన్నదను భావము లేదు. పైగా ఎంత వలవేస్తే అన్ని చేపలు దొరుకునన్నట్లు, చెరువులోని
చేపలవలెనున్న హిందువులను క్రైస్తవులుగా మార్చుటకే చూస్తున్నారు తప్ప వేరు ఉద్దేశ్యము మాకు కనిపించడములేదు.
చివరకు హిందువులను తమ మతములోనికి మార్చుకొనుటకు, బైబిలు జ్ఞానమునుకూడా మార్చి చెప్పుటకు పూను
కొన్నారు.
భగవద్గీత భూమిమీదికి వచ్చిన ప్రథమ దైవ గ్రంథము. తర్వాత కొంత కాలమునకు ద్వితీయ దైవ గ్రంథముగా
బైబిలు వచ్చినది. ఆ తర్వాత కొంతకాలమునకు అంతిమ దైవ గ్రంథముగా ఖుర్ఆన్ గ్రంథము వచ్చినది. ముందు
వెనుక మూడు గ్రంథములు వచ్చినా వాటిలో దేవుడు తన జ్ఞానమునే చెప్పిపంపాడు. మూడు గ్రంథములలో
మానవ కల్పిత జ్ఞానము కొంత చేరియున్నా, దానిని ప్రక్కన పెట్టిచూస్తే మూడింటిలో దేవుని జ్ఞానము ఉన్నదని
తెలియుచున్నది. ఆ విషయము క్రైస్తవ బోధకులకు తెలియని దానివలన తమ బైబిలు మాత్రమే దేవున్ని గురించి
బోధించు చున్నదనుకొన్నారు. మిగతా రెండు గ్రంథములను వారు బైబిలుతో సమానముగా చూడలేదు. తమ
జ్ఞానమే గొప్పదనీ, తమ దేవుడే అసలైన దేవుడని అనుకొన్నారు. బైబిలు గ్రంథము భగవద్గీతను గొప్ప గ్రంథమని
సమర్థించుచున్నదనీ, మత్తయి సువార్తలో ఐదవ అధ్యాయమున 17, 18వ వచనములయందు కలదనీ క్రైస్తవులు
మరచిపోయారు. ఆ వాక్యములో ధర్మశాస్త్రమని చెప్పియుండగా, ధర్మశాస్త్రమంటే ఏమిటో వాస్తవముగా అర్థము
కాలేదు. ధర్మశాస్త్రము ఫలానిది అని తెలియలేకపోవడమువలనా, భగవద్గీత మరియు బైబిలు రెండింటియందు
ధర్మశాస్త్రము ఇమిడియున్నదని తెలియకపోవడము వలనా, మా గ్రంథము, మా జ్ఞానము గొప్పదను భావములోయుండి
మీ హిందూమతమును వదలి మా క్రైస్తవ మతము లోనికి రమ్మని బోధించుచున్నారు. పాతరోత, క్రొత్త వింతయన్నట్లు
హిందువులలో అగ్రకులములు విధించిన అంటరానితనమును భరించలేక చాలామంది హిందువులు క్రైస్తవమతములో
చేరిపోయారు. ఇప్పటికే ఎంతో మంది హిందువులు క్రైస్తవులుగా మారిపోగా, అదే దారిలో ఎంతోమంది హిందువులు
క్రైస్తవులుగా మారుటకు ప్రయత్నించుచున్నారని అనుకుంటున్నాను. అయితే ఆ విధముగా ఎవరూ మతమును
మారకుండా ఉండునట్లు మేము ఈ గ్రంథమును వ్రాయవలసివచ్చినది. ఈ గ్రంథము మతమార్పిడి మీద
బ్రహ్మాస్త్రములాగా పని చేయగలదు. ఈ గ్రంథమును చదివిన తర్వాత ఎవరూ తమ మతమును మార్చుకొనుటకు
ప్రయత్నించరు. అన్ని గ్రంథములూ సమానమనీ, అన్ని మతములూ సమానమనీ, అన్ని మతములకు ఒకే దేవుడనీ,
తెలిసిన తర్వాత ఎవరూ తమ మతమును వీడి మరొక మతములోనికి పోరు.
ఒకవేళ హిందూమతములో యున్న గ్రీకులమువారైన బ్రాహ్మణులు అంటరానితనమును తమకు అంటగట్టి
అవమానించుచున్నారని, దేవుని విషయములో తామే హక్కుదారులుగనున్నట్లు ప్రవర్తించుచున్నారని హిందువులు
ఆరోపించి, అందువలననే మేము మతము మారాలను కొన్నామని అంటే దానికి సమాధానముగా మేము ఇలా
చెప్పుచున్నాము. ఎలుకవచ్చి ఏటిలో పడితే, పిల్లివస్తుందని భయపడి చేపలు ఏరును వదలి పోతాయా? పోవు కదా!
పిల్లివస్తే తప్పించుకొనేదానికి నీళ్ళున్నాయి, నీటిలో దొరకకుండ పారిపోయే స్థోమత ఉందిలే అనుకొని ధైర్యముగా
ఉన్నట్లు, బ్రాహ్మణులు అంటరానితనమును తమకు అంటగట్టి నీచముగా చూస్తున్నారన్నప్పుడు వారివద్దకు
66

Page 67
ఇందువు-క్రైస్తవుడా?
మీరుపోకుండా వారినే మీరు వెలివేయవచ్చును కదా! వారివద్దకు మీరుపోతే అంటరానితనము, వారివద్దకు మీరు
పోకపోతే వారు మిమ్ములను అవమానించేది, నీచముగా చూచేది, ఏమీ ఉండదు కదా! ఒకవేళ దేవుని జ్ఞానము
తెలియాలంటే పూర్వము వారే చెప్పెడివారు. నేడు అలాకాకుండా అందరూ చదువుకొనునట్లు ఎన్నో ఆధ్యాత్మిక
గ్రంథములున్నవి. అంతేకాక అందరికీ అందుబాటులో భగవద్గీతా గ్రంథము అన్ని భాషలలోనూ ఉన్నది. ఏదైనా
స్వంతముగా చదువుకొని దైవ జ్ఞానమును తెలుసుకొనుటకు అందరికీ అనుకూలముగా మూడు దైవ గ్రంథములు
తెలుగు భాషలోనే కాకుండా ఎవరికి కావలసిన భాషలో వారికి లభ్యమగుచున్నవి. అలాంటప్పుడు అగ్రకులము
వారివద్దకు పోకుండా గ్రంథములు చదువుకొని దైవ జ్ఞానమును సంపూర్ణముగా తెలుసుకోవచ్చును. ఎక్కడైనా
అర్థముకాని విషయములుంటే మాలాంటి వారిని సంప్రదించి అడిగి తెలుసుకోవచ్చును. అట్లుకాకుండా బ్రాహ్మణులను
సాకుగా చూపి మతమును తమ ఆదాయముకొరకు గానీ, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరుగుతుందేమోననిగానీ,
మతమును మార్చుకోవద్దండని తెలుపుచున్నాము.
ముఖ్యముగా హిందువులకు దైవజ్ఞానము తెలియకుండాపోయినది, కావున ఇతరులు హిందువులను
సులభముగా తమ మతములోనికి మార్చు కొనుచున్నారని తెలిసిన మేము అలా జరుగకుండుటకు ముందు
హిందువులకు జ్ఞానమును తెలియచేయాలను ఉద్దేశ్యముతో, అందరికీ అర్థమయ్యేలాగున మేము భగవద్గీతను
వ్రాసి ఇచ్చాము. భగవద్గీతలో ముఖ్యముగా ఆత్మలను గురించి చెప్పడము జరిగినది. పురుషోత్తమ ప్రాప్తి యోగము
అను అధ్యాయములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు ఆత్మలను విడదీసి విపులముగా చెప్పాము. ఇంతవరకు
ఎవరూ తెలుపని విధముగా అనేక విషయములను విపులీకరించి చెప్పాము. అద్వైత సిద్దాంతము ఆధారముగా
శంకరాచార్యులు తన జ్ఞానమునుపయోగించి భగవద్గీతను అనువదించి శంకరభాష్య భగవద్గీత అన్నాడు. అలాగే
రామానుజాచార్యులువారు విశిష్టాద్వైత సిద్ధాంతము ప్రకారము భగవద్గీతను వ్రాశారు. ప్రస్తుతము మేము త్రైత
సిద్ధాంతము ప్రకారము మా జ్ఞానమును ఉపయోగించి భగవద్గీతను "త్రైత సిద్ధాంత భగవద్గీత” గా వ్రాయడము
జరిగినది.
మేము వ్రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అను పదములకు ఇంతవరకూ
ఏ భగవద్గీతలోగానీ, ఏ రచయితగానీ చెప్పని విషయమును మేము చెప్పడము వలన త్రైత సిద్ధాంత భగవద్గీత
సంపూర్ణ జ్ఞానముతో కూడుకొన్న భగవద్గీత అయినది. ద్వితీయ దైవ గ్రంథమైన బైబిలులోనూ, అలాగే అంతిమ
దైవ గ్రంథమైన ఖుర్ఆన్ లోనూ, ఆ రెండు గ్రంథములకంటే ముందు వచ్చిన గ్రంథము అయిన భగవద్గీతను
రెండు గ్రంథములు సమర్థించుచున్నవి. బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములు ముందువచ్చిన గ్రంథము యొక్క జ్ఞానము
గొప్పదని ధృవీకరించుచూ సాక్ష్యమునిచ్చుచున్నవి. ఖుర్ఆన్ గ్రంథములో 6వ సూరాలో 92వ వాక్యములోనూ,
బైబిలు గ్రంథము మత్తయి సువార్త ఐదవ అధ్యాయములో 17వ వాక్యములోనూ ముందువచ్చిన భగవద్గీతను
ధృవీకరించుటకలదు. అలా ధృవీకరించుటకు అసలైన కారణమేమంటే ఆ రెండు గ్రంథములలోనూ భగవద్గీతలోని
వాక్యములే కలవు. అయితే భగవద్గీతలోని ముఖ్య సూత్రములు బైబిలులోనూ, ఖుర్ఆన్ గ్రంథములోనూ కలవని
ఎవరికీ తెలియదు. మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్న విషయము కూడా మూడు మతములవారికీ తెలియకుండా
పోయినది.
67

Page 68
ఇందువు-క్రైస్తవుడా?
నేడు హిందూమత గ్రంథముగా భగవద్గీతను మనుషులు చెప్పుకోవడము జరుగుచున్నది. అలాగే క్రైస్తవులు
వారి మత గ్రంథముగా బైబిలును చెప్పుకోవడము జరుగుచున్నది. ముస్లీమ్లు కూడా ఖుర్ఆన్ను వారి గ్రంథముగా
చెప్పుకొంటున్నారు. బైబిలు, ఖుర్ఆన్ రెండు గ్రంథములు ముందు వచ్చిన భగవద్గీతను ధృవీకరించుచుండగా,
పైన క్రైస్తవులు, ముస్లీమ్లు హిందువులను తమ మతములో చేర్చుకొనుటకు ధృవీకరించు కొన్నారు. బైబిలు,
ఖుర్ఆన్ గ్రంథములు రెండూ భగవద్గీతలోని ముఖ్య సూత్రములను కల్గియుండి, మేము ఈ గ్రంథమువైపు
వారమేనని భగవద్గీతను బలపరుస్తున్నవి. ఆ విషయము తెలియని క్రైస్తవులు, ముస్లీమ్లు, భగవద్గీతలోని జ్ఞానమువేరు,
మా జ్ఞానమువేరు అంటున్నారు. వారికి తెలిసినా, తెలియకపోయినా, భగవద్గీతలోని జ్ఞానమే మిగతా రెండు
గ్రంథములలో ఉన్నది. భగవద్గీత జ్ఞానమే బైబిలులోనూ, ఖుర్ఆన్లోనూ ఉండుట వలన, ఒక మనిషి ఏ
మతములోయున్నా వాడు జ్ఞాని అయితే భగవద్గీత జ్ఞానమునకు సంబంధించియున్నాడనియే చెప్పవచ్చును.
అటువంటపుడు ఏ మనిషి ఏ మతములోయున్నా వాడు ప్రథమ దైవ గ్రంథమును అనుసరించిన జ్ఞానములో
యున్నాడనియే చెప్పవచ్చును. అన్ని మత గ్రంథములతో ప్రథమ దైవ గ్రంథముయొక్క జ్ఞానము ముడిపడియుండుట
వలన మనిషి ఏ మతములోయున్నా, ఏ గ్రంథము యొక్క జ్ఞానము కల్గియున్నా, అతనిని దైవజ్ఞాని అనియే
చెప్పవచ్చును. జ్ఞాని అంటే ఇందువు. కావున ఒక మనిషి ఏ మతములో జ్ఞాని అయినా, ఆ మనిషిని ఇందువుగానే
పరిగణించ వలెను. అట్టివానికి మతమును జోడించకూడదు. అందువలన ఇందువు క్రైస్తవుడా? అని అంటున్నాము.
అలాగే ఇందువు ముస్లీమా? అనియు, ఇందువు హిందువా? అనియు అడుగవచ్చును.
ఒక మనిషి ఇందువైతే అతడు తనకు సంబంధించిన జ్ఞానము మిగతా రెండు గ్రంథములలో యున్నదని
గ్రహించును. మిగతా రెండు గ్రంథములలోయున్న జ్ఞానమును గ్రహించిన తర్వాత ఆ మనిషికి అన్ని మతములు
తనవేనను భావమువచ్చును. ఒక మతములో యుండి కూడా జ్ఞానము తెలియకుండా మతస్థునిగా మాత్రము
ఉంటే, అతనికున్న అజ్ఞానము వలన మిగతా రెండుమతములూ అన్యమతములుగానే కనిపించును. అటువంటి
వానిని జ్ఞాని అని అనలేము. అలాగే ఇందువు అనీ అనలేము. అటువంటివాడు ఏ మతములోవుంటే ఆ మతస్థునిగానే
చెప్పవచ్చును. దేవుని జ్ఞానములేని వానిని ముస్లీమ్ అనియో, క్రైస్తవుడనియో, హిందువు అనియో మతము పేరుతో
పిలువవచ్చును. ఒక మతములోయున్నా అతడు ముందు తన గ్రంథములోని జ్ఞానమును తెలియగల్గితే, జ్ఞానిగా
(ఇందువుగా) మారిపోవును. తర్వాత మూడు దైవ గ్రంథములలోని జ్ఞానమును తెలియగల్గితే ఇందువునుండి
యోగిగా మారిపోవును. యోగిగా మారినవాడు మూడు దైవ గ్రంథములలోని సారాంశమును పూర్తిగా తెలిసియుండును.
అట్లని అతడు మూడు గ్రంథములలోని విషయములు కంఠాపాఠముగా చెప్పునని అనుకోకూడదు. జ్ఞాన భావములు
తెలిసియుండునుగానీ, దేనినైనా నోటికి చెప్పు జ్ఞాపకశక్తి యుండునని అనుకోకూడదు. దేనినైనా వివరించి చెప్పు
జ్ఞానశక్తి కల్గియుండునని తెలియాలి.
ప్రథమ దైవ గ్రంథము అయిన భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17 శ్లోకములలో ముగ్గురు
పురుషుల విషయము కలదు. ముగ్గురు పురుషులలో క్షరుడు, అక్షరుడు అనువారు ఇద్దరు కలిసియుందురు.
క్షరుడు, అక్షరుడు అను ఇద్దరు కాక మూడవ పురుషుడైన పురుషోత్తముడను వాడు ప్రత్యేకముగా ఉండును.
పురుషోత్తముడను మూడవ పురుషుడు ముల్లోకములలో వ్యాపించియుండును. వివరముగా చెప్పుకొంటే క్షరుడను
68

Page 69
ఇందువు-క్రైస్తవుడా?
ఒకటవది ప్రతి మనిషిలోనున్న జీవాత్మ అనియూ, అక్షరుడను రెండవది జీవాత్మతో పాటు కలిసి శరీరములోనున్న
ఆత్మ అనియూ, పురుషోత్తముడను మూడవది క్షరుడు, అక్షరుడు కంటే వేరుగా యుండి, శరీరములోనే కాకుండా
విశ్వమంతా వ్యాపించి యున్నది. ఈ మూడు ఆత్మల విషయము సాధారణముగా ఎవరికీ అర్థము కాలేదు.
వివరముగా చెప్పుకొంటే క్షరాత్మ అనగా నాశనమగునదని అర్థము. ఎప్పటికైనా జీవుడు నశించి దేవునిగా మారవలసిందే,
కావున శరీరములో జీవునిగానున్న ప్రతి ఒక్కడు క్షరాత్మగానే ఉన్నాడు. అక్షరుడు అనగా నాశనము లేనివాడని
అర్థము. ప్రతి శరీరములో జీవునితోపాటు వానితో కలిసి శరీరమంతా వ్యాపించియున్న ఆత్మను అందరినీ నడిపించే
ఆత్మ అంటున్నాము. ఇకపోతే మూడవ ఆత్మ రెండు ఆత్మలైన క్షరాక్షరులు అనువారికంటే ఉత్తముడు అయినందున
మూడవ ఆత్మను పురుషోత్తముడు అంటున్నాము. పురుషోత్తముడినే పరమాత్మ అనియూ, దేవుడు అనియూ
అంటున్నాము. పరమాత్మ అనునది విశ్వమంతా వ్యాపించియుండడమేకాక, అందరి శరీరములలో కూడా ఆవహించి
యున్నది. ఈ విధముగా శరీరములో మూడు ఆత్మలున్నాయను విషయము ఎవరికీ తెలియదు.
శరీరములోనున్న ఆత్మలు పురుష సంబంధమైనవికాగా, శరీరము ప్రకృతి సంబంధమైనది. సృష్టికి పూర్వము
దేవుడు విశ్వమును సృష్టించవలె నను తలంపుతో ముందు తనను నాలుగు భాగములుగా విభజించుకొన్నాడు.
అందులో ఒక భాగము ప్రకృతికాగా, మిగతా మూడు భాగములు మూడు ఆత్మలుగాయున్నవి. ప్రకృతిని స్త్రీ
తత్త్వముగా, మూడు ఆత్మలను పురుష తత్త్వముగా విభజించుకొన్న దేవుడు ఆత్మలలో మూడవదైన పురుషోత్తమ
అను మూడవ ఆత్మగా తాను వుంటూ, మిగతా రెండిటినీ శరీరములో ఉండునట్లు చేసి, మొదటిదైన జీవాత్మను
నడిపింపబడు వానిగా, రెండవదైన ఆత్మ నడిపించేదిగా ఉండునట్లు దేవుడే చేశాడు. శరీరములో తోలే ఆత్మ, లేక
నడిపించే ఆత్మ అక్షరుడుకాగా, తోలబడేవాడు లేక నడుపబడేవాడు క్షరుడైన జీవునిగా యున్నాడు. ఈ మూడు
ఆత్మలను గురించి భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున చెప్పడమేకాక, మిగతా సందర్భములలో అనేకమార్లు
చెప్పడము జరిగినది.
ఈ విధముగా దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడియున్నాడు. ఈ విషయము
భగవద్గీతలో ఎంతో విపులముగా యున్నా, హిందువులు తెలియలేకపోయారు.
ద్వితీయ దైవ గ్రంథమైన బైబిలులో మత్తయి అను సువార్తయందు 28వ అధ్యాయమున 19వ వాక్యములో
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను ముగ్గురిని గురించి చెప్పాడు. భగవద్గీతలో చెప్పిన ముగ్గురు పురుషులను
గురించి బైబిలులో కూడా చెప్పడమైనది. అయితే గీతలో క్షరాక్షర పురుషోత్తములని చెప్పియుండగా, బైబిలులో
కొంతమార్పుతో అక్షర క్షర పురుషోత్తమ అని చెప్పడమైనది. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడుగా చెప్పిన ముగ్గురు
పురుషులను, బైబిలు గ్రంథములో అక్షరుడు, క్షరుడు, పురుషోత్తముడని వరుస మార్చి చెప్పాడు. తండ్రి అక్షరుడు
కాగా, కుమారుడు క్షరుడుగాయున్నాడు. మిగిలిన పరిశుద్ధాత్మ పరమాత్మగా యున్నాడు. ఈ విధముగా కొంత
పేర్లు, కొంత వరుసక్రమము మార్చి చెప్పడము వలన, భగవద్గీతలో చెప్పిన విధానమే బైబిలులో చెప్పబడినదని
తెలియుచున్నది. భగవద్గీతలో క్షరాక్షరులు అనగా జీవాత్మ ఆత్మ ఇద్దరూ కలిసి కూటస్థులుగా ఒకే శరీరములో
యున్నారని చెప్పినట్లే, బైబిలులో తండ్రి కుమారుడుగా చెప్పబడు ఈ రెండు ఆత్మలు కలిసియున్నాయని, యోహాను
సువార్త 10వ అధ్యాయము 30వ వచనమునందు "నేనునూ తండ్రియు ఏకమై యున్నాము” అనియూ, యోహాను
సువార్త 14వ అధ్యాయమున 10వ వాక్యమునందు “తండ్రి యందు నేనునూ, నాయందు తండ్రియూ ఉన్నామని
69

Page 70
ఇందువు-క్రైస్తవుడా?
నీవు నమ్ముట లేదా?” అనియూ ఉన్నది. జీవాత్మగా ఏసువుంటూ తనను జీవాత్మగా సరిపోల్చి కుమారునిగా
చెప్పుకొన్నాడని తెలియవలెను. భగవద్గీతలో ఆత్మగా, జీవాత్మగా చెప్పుచూ రెండు ఆత్మలు కలిసి కూటస్థముగా
యున్నాయని చెప్పగా, బైబిలులో తండ్రిగా కుమారునిగా రెండు ఆత్మలు కలిసి ఏకముగా యున్నాయని చెప్పారు.
భగవద్గీతలో జోడు ఆత్మలుగా జీవాత్మ ఆత్మలున్నాయని చెప్పగా, బైబిలులో కూడా తండ్రి కుమారుడు ఇద్దరూ
కలిసియున్నారని చెప్పడమైనది. భగవద్గీతయందు గానీ, బైబిలుయందుగానీ చెప్పిన విషయము ఒక్కటే అయినా,
పేర్లు మార్చి ముందుది వెనుక, వెనుకది ముందు చెప్పడము వలన, రెండు గ్రంథములలో ఒకే సమాచారమును
చెప్పారని ఎవరూ గుర్తించ లేకపోయారు. భగవద్గీతయందు మూడవ ఆత్మను పురుషోత్తముడనీ, పరమాత్మయనీ
చెప్పియుండగా, బైబిలులో పరిశుద్ధాత్మయని చెప్పడమైనది. పరమాత్మనే పరిశుద్ధాత్మ అని చెప్పగా దానిని కూడా
ఇటు హిందువులుగానీ, అటు క్రైస్తవులుగానీ గుర్తించలేకపోయారు. ఈ విధముగా రెండు గ్రంథములలోని ఆత్మల
వివరమును రెండు మతములవారు తెలియలేకపోయారు. ఇంతవరకు తండ్రి ఎవరో క్రైస్తవులకు తెలియదు.
అలాగే ఆత్మ ఎవరో హిందువులకు తెలియదు.
అంతిమ దైవ గ్రంథమైన ఖుర్ఆన్లో ఖాఫ్ సూరా (50), ఆయత్ 21 లో “ప్రతి వ్యక్తి తనవెంట ఒక
తోలేవాడూ, ఒక సాక్ష్యము చెప్పేవాడూ ఉన్నస్థితిలో వస్తాడు" అని కలదు. ఈ వాక్యమును చూస్తే ఇది
భగవద్గీతలో చెప్పిన క్షరాక్షర పురుషోత్తములను గురించి చెప్పినదని ఎవరైనా గుర్తు పట్టగలరా? గుర్తుపట్టినా
పట్టకపోయినా ముమ్మాటికీ ప్రథమ దైవ గ్రంథమైన భగవద్గీతలో చెప్పిన సమాచారమే ఈ వాక్యములో కలదు.
భగవద్గీతలో ముగ్గురు పురుషులుగా చెప్పినవారే బైబిలు గ్రంథములో తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్మ అని చెప్పి,
కొంత తికమక చేసి ముందు గ్రంథములోని సారాంశమే రెండవ గ్రంథములో యున్నదని సులభముగా ఎవరూ
గుర్తుపట్టనట్లు చెప్పడము జరిగినది. మూడవ గ్రంథమైన ఖుర్ఆన్లో త్రోలేవాడు, త్రోలబడేవాడు, చూసేవాడు
అని చెప్పడము వలన మూడు గ్రంథములలో ఒకే విషయమున్నదని సులభముగా తెలియుటకు అవకాశము
లేకుండా పోయినది. నీ జ్ఞానము మాకు అర్థము కావలెనని కోరుకొని చూస్తే, మూడు గ్రంథములలోనూ మూడు
విధములుగా కనిపించు మూడు వాక్యములు ఒక్కటే సారాంశమును బోధిస్తున్నవని తెలియగలదు. భగవద్గీతలోను
బైబిలులోను మొదట ఇద్దరూ కలిసియున్నారనీ, మూడవ వాడు ప్రత్యేకముగా యున్నాడనీ తెలిసిపోయినది. ఇక్కడ
ఖుర్ఆన్ గ్రంథములో కూడా మొదట ఇద్దరు ఒకచోటవుండి ఒకరికొకరు సంబంధము కల్గియున్నట్లు తెలియుచున్నది.
త్రోలేవాడు ఆత్మ, త్రోలించుకొనువాడు జీవాత్మయని తెలిసిపోవుచున్నది. శరీరమునకంతటికీ అధికారియై,
శరీరమంతా వ్యాపించి అన్ని అవయవములను ఆడించి పని చేయించునది ఆత్మేనని భగవద్గీతలో చెప్పుకొన్నారు.
అదే విధముగా నిత్యము, ప్రతి నిమిషము, క్షణక్షణము మనిషిని తన చైతన్యముతో నడిపించునది ఆత్మయే
అయినందున ఇక్కడ త్రోలేవాడు అని చెప్పుచూనే అతనిని ఆత్మగా, రెండవ పురుషుడైన అక్షరునిగా
లెక్కించుకోవచ్చును. త్రోలబడేవాడు జీవాత్మయనీ లేక క్షర పురుషుడైన మొదటి పురుషుడనీ తెలియుచున్నది.
ప్రక్కనుండి సాక్షిగా చూచువానిని మూడవ పురుషుడైన పరమాత్మగా లెక్కించవచ్చును. ఈ విధముగా మూడు
రకములుగా మూడు గ్రంథము లలో చెప్పిన మూడు సమాచారములను ఒకే జ్ఞానముగా గుర్తించవచ్చును.
మేము ముందే చెప్పాము సంపూర్ణ జ్ఞానియైనవాడు యోగిగా మారగలడు అనియూ, యోగిగా మారినవాడు
70

Page 71
ఇందువు-క్రైస్తవుడా?
మూడు గ్రంథములలోని దైవ విషయములను గుర్తించగలడు అనియూ చెప్పాము. అలా గ్రంథము లలో దైవ
విషయములవలె మనుషులు చెప్పిన అజ్ఞాన విషయములు కలిసియుంటే, వాటిని కూడా గుర్తించగలడని చెప్పాము.
దైవ గ్రంథములన బడు మూడు గ్రంథములలో జ్ఞానమేకాక మధ్యలో కలిసిన అజ్ఞాన కాలుష్యము కూడ కొంతయున్నదని
తెలిసినది. అయితే కొందరు మనుషులు మరి కొందరు బోధకులు కాలుష్యమైన అజ్ఞాన విషయములనే తీసుకొని
చెప్పుకొనుచుందురు. అటువంటివారు ఎవరు చెప్పినా వినరు. వారికి దేవుడే ఆ విధముగా తీర్పు తీర్చియుంటాడు.
కావున వారు దైవ మార్గములో ఉన్నామనుకొని అజ్ఞాన మార్గములో పోవుచుందురు. అటువంటి వారికి జ్ఞాన
విషయములు కూడా వేరు విధముగా అర్థమగుచుండును. అటువంటి వారిని వారి కర్మకు వదిలివేసి, చివరిగా
మనము ఒక విషయమును చెప్పుకొందాము. మేము చెప్పు విషయమును చూచిన తర్వాత అంతవరకు రాని
ప్రశ్నలు కొందరికి వచ్చి, దాని జవాబు కొరకు ప్రయత్నించి, చివరకు జవాబును తెలుసుకొని, దానిద్వారా కొంత
జ్ఞానులుగా మారుటకు అవకాశము కలదు. అందువలన ప్రశ్న కలుగు ఒక విషయమును తీసుకొందాము.
బైబిలు గ్రంథమునందు యోహాను సువార్త 8వ అధ్యాయమున 16వ వచనములో ఈ విధముగా గలదు.
“నేను ఒక్కడనై యుండక నేనునూ, నన్ను పంపిన తండ్రియూ కూడా ఉన్నాము. కనుకనే నేను తీర్పు తీర్చిననూ
నా తీర్పు సత్యమే" అని ఏసు చెప్పినప్పుడు అక్కడున్న వారు ఆయన తండ్రిని గురించి అడిగారు (యోహాను
8.19) "నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడుగగా, ఏసు మీరు నన్నైననూ, నా తండ్రినైననూ ఎరుగరు.
నన్ను ఎరిగియుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను" ఈ వాక్యమును చూచారు
కదా! శరీరముతో తిరిగే ఏసును చూచినవారితోనే ఆయన మీరు నన్ను చూచియుంటే, నా తండ్రిని కూడా
చూచియుందురు అని అన్నారు కదా! ఒకవేళ అక్కడున్నవారు మేము నిన్ను చూస్తున్నాము అంటే అప్పుడు ఏసు
“నన్ను చూచినప్పుడు నా తండ్రిని కూడా చూచియుందురు కదా! అటువంటప్పుడు నా తండ్రి ఎవరు అని
ఎందుకు అడుగుచున్నారని” అడుగగలడు. అయితే తండ్రి కుమారుడు అని చెప్పినప్పుడు ఎవరైనా స్థూలముగా
కనిపించు వారినే లెక్కించియుందురు. ఏసు తండ్రి ఎక్కడున్నాడో తెలియదుగానీ, ఎదురుగా యున్న ఏసు
తెలుసునని అక్కడున్నవారు చెప్పగలరు. ఏసుప్రభువు ఫోటో చూచిన మనమైనా మేము ఏసును ఫోటోలో చూచామని
చెప్పుదుము. అయితే ఇప్పుడు ఏసు చెప్పిన మాటలో నన్నుగానీ, నా తండ్రినిగానీ చూడలేరు అనగా! అప్పుడు
ఎవరికైనా కనిపించే మనిషి ఏసు కాదా!యని ప్రశ్న రాగలదు.
మనము కొంత వివరముగా చెప్పుకొంటే తండ్రి అంటే పుట్టించు వాడు అనియూ, కుమారుడు అంటే
పుట్టినవాడు అనియూ అర్థము. కొడుకు యుంటే తండ్రి యుండును. కొడుకు ఎట్లుంటే తండ్రి కూడా రూపములో
కొంత అటు ఇటుగా కొడుకువలె ఉండును. అయితే ఇప్పుడు అందరికీ కనిపించే ఏసు మీరు ఎవరూ నన్ను
చూడలేరు అన్నాడు. అలా అన్నప్పుడు ఈయన కనిపించే మనిషే కదా! నన్ను చూడలేరు అంటాడేమిటి? అని
ఎవరికైనా ప్రశ్న వస్తుంది. ఏసు తనను చూడలేరు అంటే ఆయన కనిపించు శరీరము కాదు, కనిపించని జీవాత్మయని
అర్థమగుచున్నది. అలాగే తండ్రి అని పిలువబడువాడు కూడా కనిపించని ఆత్మయని తెలియుచున్నది. ఆత్మ
ఎల్లప్పుడు శరీరమును జీవాత్మను ఆక్రమించి అన్ని పనులు చేయుచున్నది. శరీరములోపల కదిలించెడి శక్తిగాయుండి
కదలించుచూ అన్ని పనులనూ ఆత్మయే చేయుటవలన, ఆ విషయము తెలిసిన ఏసు నేను మాట్లాడు మాట నాది
71

Page 72
ఇందువు-క్రైస్తవుడా?
కాదు నా తండ్రిది యన్నాడు. అలాగే కొన్ని సందర్భములలో "నేను చేయు ప్రతి క్రియ నా తండ్రి ఆజ్ఞవలన
చేసినదే గానీ నేను స్వయముగా చేయలేదు” అన్నాడు. ప్రతి విషయములోను తనమీద దేనినీ పెట్టుకోక అంతయు
తండ్రివలననే జరుగుచున్నదని చెప్పాడు అంటే కనిపించని తండ్రి కూడా ఏసుతో పాటు శరీరములో యున్నాడని
తెలియు చున్నది. భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగమున చెప్పినట్లే ఆత్మ జీవాత్మల విషయము కలదు.
పరమాత్మ, ఆత్మ జీవాత్మలకంటే వేరుగా యుండి ఏమియూ చేయక యున్నాడు కావున, ఏ విషయములోనూ
పరిశుద్ధాత్మయిన పరమాత్మను చెప్పకుండా, బైబిలులో ఎక్కువగా రెండవ ఆత్మయిన తండ్రిని గురించే చెప్పడము
జరిగినది.
ఏసు బైబిలు గ్రంథములో చెప్పిన రెండు ఆత్మల విషయమంతయు భగవద్గీతలో ముందే చెప్పడమైనది.
హిందువులకు ముఖ్య గ్రంథమైన భగవద్గీతలో ముందే చెప్పిన విషయములే, అవే ధర్మములే బైబిలులో ఉన్నప్పుడు
భగవద్గీతను అతిక్రమించి ఏదీ బైబిలులో లేనప్పుడు ఒక హిందువు క్రైస్తవుడుగా మారవలసిన అవసరమేమి వచ్చినది?
భగవద్గీతలో లేని జ్ఞానము బైబిలులో ఉంటే హిందువైనవాడు క్రైస్తవములోనికి పోవచ్చును. భగవద్గీతలో ఉన్నవన్నీ
బైబిలులో యున్నప్పుడు, బైబిలు భగవద్గీతలోని జ్ఞానమే నాలోయున్నది అని ధృవీకరించి సాక్ష్యమిచ్చునప్పుడు,
హిందువుగానున్న వాడు క్రైస్తవునిగా మారితే భగవద్గీతను అవమానించినట్లగును. భగవద్గీతను అవమానించినప్పుడు
దానిని అనుసరించియుండు బైబిలును కూడా కించపరచినట్లేయగును. అటువంటప్పుడు క్రైస్తవము లోనికిపోయినా
వానికి దేవుని జ్ఞానము ఏమాత్రమూ అంటదు. అదే విధముగా ఏ మతమువాడుగానీ, వాని మతమును వీడి
పరమతములోనికి పోతే వాని మత గ్రంథమునూ మరియూ చేరిన మత గ్రంథమునూ రెండిటినీ అవమానించినట్లగును.
దైవ గ్రంథములనే అగౌరవపరచినప్పుడు, అటువంటివానికి దైవజ్ఞానము ఏమాత్రము లభ్యముకాదు. అంతేకాక
అంతవరకు ఉన్న జ్ఞానము కూడా లేకుండా పోవును. ఏ మతములోని వాడు ఆ మతములోనేయుండి, ఆ మతమునకు
సంబంధించిన గ్రంథము లోనే జ్ఞానమును తెలుసుకొనుచూ జ్ఞానాభివృద్ధి చేసుకొంటే, అటువంటివాడు తొందరగా
జ్ఞానిగా (ఇందువుగా) మారగలడు. అలా జ్ఞానిగా మారినవాడు అనతికాలములోనే యోగిగా మారగలడు. యోగిగా
మారినవాడు మూడు దైవ గ్రంథములలో ఒకే జ్ఞానమును చూడగల్గును. క్షర, అక్షర, పురుషోత్తము లను మూడు
గ్రంథములలోను నేను చూపించినట్లు మిగతా జ్ఞానము నంతటినీ మూడు గ్రంథములలో చూడగలడు.
మూడు గ్రంథము లలో ఒకే జ్ఞానమును చూచినవాడు అదే జన్మలోనే జన్మ రాహిత్యమును పొంది దేవునియందు
ఐక్యమగును. అందువలన ప్రతి ఒక్కరూ తాము ఉన్న మతములోనే ఉంటూ జ్ఞానిగా, యోగిగా మారి మోక్షమును
పొందవలెనని ఆశిస్తూ ముగించుచున్నాను.
సమాప్తము
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది
సత్యము కాదు,
సత్యమును
వేయిమంది కాదనినా అది
అసత్యము కాదు.
72

----
Page 1
కలియుగము
(ఎప్పటికీ యుగాంతం కాదు)
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
సేవా
ప్రబోద
4
0990
సమితి
చక్రం
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞాన వేదిక (Regd.No. : 168/2004)
త్రైత శకము-33
ప్రథమ ముద్రణ : సం॥ 2012
1

Page 2
కలియుగము ఎప్పటికీ యుగాంతం కాదు
యుగములు నాలుగని బహుశా అందరికీ తెలుసు. అలాగే నెలలు పండ్రెండనీ, వారములు ఏడనీ, సంవత్సరములు
అరవై (60) అనీ తెలుసు. సంవత్సరములు వరుసగా 1) ప్రభవ 2) విభవ 3) శుక్ల 4) ప్రమోదూత 5) ప్రజోత్పత్తి
6) అంగీరస 7) శ్రీముఖ 8) భవ 9) యువ 10) ధాత 11) ఈశ్వర 12) బహుధాన్య 13) ప్రమాధి 14) విక్రమ
15) వృష 16) చిత్రభాను 17) స్వభాను 18) తారణ 19) పార్థివ 20) వ్యయ 21) సర్వజిత్ 22) సర్వధారి
23) విరోధి 24) వికృతి 25) ఖర 26) నందన 27) విజయ 28) జయ 29) మన్మథ 30) దుర్ముఖి 31) హేవళంబి
32) విళంబి 33) వికారి 34) శార్వరి 35) ప్లవ 36) శుభకృత్ 37) శోభకృత్ 38) క్రోథి 39) విశ్వావసు 40) పరాభవ
41) ప్లవంగ 42) కీలక 43) సౌమ్య 44) సాధారణ 45) విరోధికృత్ 46) పరీధావి 47) ప్రమాదీచ 48) ఆనంద
49) రాక్షస 50) నల 51) పింగళ 52) కాళయుక్తి 53) సిద్ధార్థి 54) రౌద్రి 55) దుర్మతి 56) దుందుభి
57) రుధిరోద్గారి 58) రక్తాక్షి 59) క్రోధన 60) అక్షయ. ఈ అరవై సంవత్సరములు కాలచక్రములో వర్తమాన
కాలములోనికి ఒక్కొక్కటిగా వచ్చి పోవుచుండును. ప్రభవ అను పేరుగల సంవత్సరముతో ప్రారంభమైన వర్తమాన
కాలము, చివరి అక్షయ సంవత్సరముతో అయి పోవడమేకాక, తిరిగి ప్రభవ సంవత్సరముతో ప్రారంభమగుచున్నది.
ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ, కాలచక్రముతోపాటు అరవై సంవత్సరములు తిరుగుచున్నవి. ఇప్పుడు
మనమున్న వర్తమానము ఖర నామసంవత్సరము. నేను పుట్టినది వికృతి నామ సంవత్సరము, కావున వికృతి గడచిపోయి
ఇప్పుడు ఖర జరుగుచున్నది. దీనినిబట్టి నా శరీరము వయస్సు 61 గడచిపోయి 62 జరుగుచున్నది. ప్రస్తుత
ఖరనామ సంవత్సరము కూడా రెండు నెలలు మాత్రమున్నది. తర్వాత నందన సంవత్సరము యుగాది పండుగతో
ప్రారంభముకానున్నది. అందువలన రెండు నెలలు గడచిపోతే ఖరనామ సంవత్సరము అయిపోతుంది. అప్పుడు
నాకు వయస్సు కూడా 62 సంవత్సరములు అయిపోయి నందన సంవత్సరముతో 63 ప్రారంభమగును. ఇలాగే
ఎవరైనా వారు పుట్టిన సంవత్సరమును బట్టి వారి వయస్సు లెక్కించుకోవచ్చును.
ప్రస్తుత కాలములో పూర్వము ఇందువులుగానున్న మనుషులు హిందువులుగా మారిపోయి, తమ మతము
పేరే మరచిపోవడమే కాక తమ కాలములోని సంవత్సరముల పేర్లనూ, నెలల పేర్లనూ మరచిపోయారు. చివరకు
క్రైస్తవ శక సంవత్సరములనూ, నెలలనూ చెప్పుకొంటున్నారు. మేము హిందూధర్మరక్షకులమని గొంతు చించుకొను
వారు కూడా జనవరి ఒకటవ తేదీని క్రొత్త సంవత్సరముగా చెప్పుకొంటున్నారు. హిందూ (ఇందూ) సంస్కృతితో
సంబంధములేని ప్రేమికుల దినమును వ్యతిరేఖించువారు, క్రైస్తవ సంస్కృతి ప్రకారము జనవరి ఒకటవ తేదీని క్రొత్త
సంవత్సరముగా హిందువులు లెక్కించుకోకూడదని ఎందుకు వ్యతిరేఖించలేదో? అలా వ్యతి రేఖించక పోవడమునకు
కారణము నేటి హిందువులకు వారి కాలమానము గానీ, అరవై సంవత్సరముల పేర్లుగానీ, పన్నెండు నెలలుగానీ
తెలియకుండా పోయినవనియే చెప్పవచ్చును. ఇందూ అను పవిత్ర శబ్దము అర్థరహితమైన హిందూ శబ్దముగా
మారిపోయినట్లు, యుగాది అను శబ్దము సృష్ట్యాదిని జ్ఞప్తి చేయుచుండగా, చివరికి ఆ పేరు అర్థములేని ఉగాదిగా
మారిపోయినది. మన సంస్కృతి ప్రకారము మనము మొదటినుండి ఇందువులము. ఇందువులను శబ్దము కాలక్రమములో
హిందువులు అను శబ్దముగా మారిపోయినదని మేము చెప్పితే, అర్థము చేసుకోలేని ప్రజలు కొందరు, మేము హిందూ
మతమును రక్షించుచున్నామని పేరు పెట్టుకొన్నవారూ, మమ్ములను పరాయి మతస్థులుగా వర్ణించి చెప్పుచున్నారు.
చివరకు ఇందువులను ఇందువులే గుర్తించలేని గ్రుడ్డివారై మీ ఇందూమతము వేరు, మా హిందూమతము వేరు
అంటున్నారు. ఇటువంటి దుస్థితి, మన సంస్కృతినే మనము మరిచి పోవునట్లు చేసినది. ఇటువంటి దుస్థితికి ఏడ్వాలో
2

Page 3
నవ్వాలో అర్థము కావడములేదు. ఈ విధమైన అజ్ఞానస్థితి నుండి మనిషి జ్ఞానస్థితిలోనికి వచ్చి, తన సంస్కృతియైన
ఇందుత్వమును గుర్తించి చివరకు యుగాదిని ఉగాది అనకుండా యుగాదే అనగలడనీ, అట్లే ఇందువును హిందువు
అనకుండా ఇందువుగా చెప్పగలడని ఆశిస్తూ, ఇప్పుడు "కలియుగము ఎప్పటికీ యుగాంతం కాదు” అను ఈ చిన్న
గ్రంథమును వ్రాయుటకు పూనుకొన్నాము.
ఇందూ సంస్కృతి ఒక మతముకాదు, అది యొక పథము. పథము అనగా మార్గము అని అర్థము. ఇది ఏ
మార్గము అని ఎవరైనా అడిగితే ఇది ఇందూపథమని ధైర్యముగా చెప్పవచ్చును. ఇందూ పథము అనగా జ్ఞానమార్గమని
చెప్పవచ్చును. ఇందూ అను శబ్దము దైవ జ్ఞానమునకు బదులుగా వాడు శబ్దము. ఇందు అనగా చంద్రుడని అర్థము.
చంద్రుడిని జ్యోతిష్యశాస్త్రము ప్రకారము జ్ఞానచిహ్నముగా చెప్పుచున్నాము. నేను జ్ఞానిని అని తెల్పుచు శంకరుడు తన
తలమీద చంద్రవంకను ఆభరణముగా ధరించి చూపించాడు. మీరు ఎక్కడైనా శంకరుని (శివుని) తలమీద చంద్రవంకను
చూడవచ్చును. అలాగే నేను యోగిని మరియు యోగీశ్వరుడనని అర్థము నిచ్చునట్లు, కృష్ణుడు తన తలమీద నెమలి
పింఛమును ధరించాడు. ఆ అర్థము తెలియని హిందువులు (ఇందువులు) నేడు ఉండుట వలన ఇందూ సంస్కృతి
అగమ్యగోచరముగా మారిపోయినది. ప్రపంచ దేశములన్నిటిలో ఒకే ఒక్క భారతదేశము మాత్రమే ఇందూదేశముగా
(జ్ఞానదేశముగా) లెక్కించబడినది. పూర్వము దైవజ్ఞాన నిలయమైన ఇందూదేశములోని ప్రజలు జ్ఞాన సంపన్నులైయుండి
జ్ఞానశక్తి కల్గియుండేవారు. జ్ఞానశక్తి కలవారిలో భారతదేశమొక్కటే పేరుగాంచియుండెడిది. అందువలన కొన్ని లక్షల
సంవత్సరముల పూర్వమునుండి భారతదేశము ఇందూదేశముగా పేరుగాంచి నది. అయితే నేడు భారతదేశము
యొక్క పూర్వ చరిత్ర తెలియని మనుషులు కొందరు మేము హిందువులమనీ, మేము హిందూమత సంరక్షకులమనీ, రక
రకముల పేర్లతో సంఘములను ఏర్పరచుకొని, ఏమాత్రము జ్ఞానము తెలియనివారై పూర్వమున్న ఇందుత్వమును
మరచిపోయి మేము హిందువులమని చెప్పుకొనుచున్నారు.
ఎవరెలా చెప్పుకొనినప్పటికీ, మేము ఇందువులము కాము హిందువులమే అనుకొన్నప్పటికీ, కేవలము పేరు
మార్పిడితో మనము నష్ట పోయింది ఏమీలేదు. కానీ చివరకు ఇందూ (హిందూ) సంస్కృతిలోని కాలము యొక్క
మాసముల పేర్లనూ, సంవత్సరముల పేర్లను తెలియకుండా నష్టపోవడము విచిత్రముగా ఉన్నది. పెద్దలకే తెలియనపుడు
ఇంటిలోని పిల్లలకు కూడా నెలల పేర్లుగానీ, సంవత్సరముల పేర్లుగానీ తెలియకుండా పోవుట విచిత్రమేమికాదు. నేడు
విదేశీ భాషల చదువులలో పడి, తెలుగు చదువునే తెలియకుండా పోయిన దానివలన చాలామందికి తెలుగు సంవత్సరాది
గానీ, తెలుగులో నెలలుగానీ, తెలుగులో సంవత్సరముల పేర్లుగానీ తెలియకుండా పోయినవి. ఇందూ (హిందూ)
సంస్కృతి హీనస్థితిలో లేకుండా ఉన్నత స్థితిలో ఉండాలంటే, మనము కాలగమనములోని పేర్లను తప్పకుండా తెలియాలి.
మొదటిలోనే సంవత్సరముల పేర్లు తెలుసుకొన్నాము. ఇప్పుడు నెలల పేర్లను గురించి తెలుసుకొందాము. నెలల పేర్లు
వరుసగా 1) చైత్రము 2) వైశాఖము 3) జ్యేష్టము 4) ఆషాఢము 5) శ్రావణము 6) భాద్రపదము 7) ఆశ్వీయుజము
8) కార్తీకము 9) మార్గశిరము 10) పుష్యము 11) మాఘము 12) ఫాల్గుణము. ఇవి మన తెలుగు భాష లోని హిందూ
నెలలుకాగా, నేడు చాలామందికి ఆంగ్లభాషలోని నెలలు బాగా తెలిసి పోయినవిగానీ, మన నెలలు మనకు తెలియకుండా
పోయినవి. జనవరి నుండి డిశంబరు వరకున్న నెలలు వరుసగా తెలిసినా, తెలుగు నెలలు మాత్రము ఒకటి కూడా
తెలియవనియే చెప్పవచ్చును.
3

Page 4
ఏది ఏమైనప్పటికీ ఇందూ (హిందూ) సంస్కృతి గొప్పదనుటకు తార్కాణముగా హిందూసంస్కృతిని అనుసరించే
విదేశీ నెలలు పన్నెండే ఉన్నాయి. అలాగే వారములోని దినములు ఏడే ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయమేమనగా!
ఆదివారము (భానువారము), సోమవారము అను దినముల పేర్లే విదేశీ వారముల పేర్లలో కూడా కలవు. ఆదిత్యుడు
అనగా సూర్యుడు అలాగే భానుడు అనగా సూర్యుడనియే అర్థము. సూర్యుని దినమైన ఆదివారమును ఇంగ్లీషు భాషలో
కూడా సన్దే అని చెప్పకోవడమూ, అలాగే సోమ (చంద్ర) వారమును మండే అని పిలవడము మనము గర్వింపదగిన
విషయము. నేడు మండే అని చెప్పుకొను పేరు పూర్వము మూన్డేగా ఉండెడిది. కాలక్రమముగా ఇందూ అనుపదము
హిందూగా మారిపోయినట్లు Moon Day (మూన్టే) అను పదములో “యమ్" ప్రక్కన గల రెండు సున్నలలో ('ఓ' లలో)
ఒక సున్న గాలికి పోయింది. చివరకు ఒక సున్నమాత్రము మిగిలివున్నది. అందువలన మూన్ కాస్త Mon Day
(మన్డే) గా మారిపోయినది. వాస్తవముగా సోమవారమును మూన్దే అనియే పిలవాలి. ఒక సున్న ఉన్నందున
ఇప్పుడు కూడా మూన్ అనియే పిలవాలి. కానీ పొరపాటుగా మూన్ ను మన్డే గా పిలుస్తున్నారు. కాలక్రమములో
జరిగిన పొరపాట్ల వలన కొన్ని పదములను వేరుగా పలుకుచున్నాము. తెలియనప్పుడు అర్థములేని పదముగా పలికినప్పటికీ,
తెలిసినప్పుడు అర్ధమున్న సరియైన పదముగా పలకవలెననీ, అదే విధానమును అనుసరించి సోమవారమును మూన్దేగా,
హిందువును ఇందువుగా పలకడము న్యాయమని తెలుపుచున్నాము.
ఇంతవరకు తెలుగులో ఇందువుల సంవత్సరముల పేర్లనూ, నెలల (మాసముల) పేర్లనూ తెలుసుకొన్నాము.
ఇప్పుడు వారములోని ఏడు దినముల పేర్లను తెలుసుకొందాము. వారములో వరుసగా దినముల పేర్లు ఇలా కలవు.
1) ఆదివారము 2) సోమవారము 3) మంగళవారము 4) బుధవారము 5) గురువారము 6) శుక్రవారము
7) శనివారము. ఈ ఏడు పేర్లు ఖగోళములోని గ్రహముల పేర్లని తెలియవలెను. ఏడు గ్రహములు సకల జీవరాసుల
కర్మలను పాలించుచున్నవి. వారి వారి కర్మముల ప్రకారము ప్రజలకు కష్టసుఖములను కలుగజేయుచున్నవి. అందువలన
ఈ ఏడు గ్రహములు అన్ని దేశములలోని ప్రజలకు సంబంధించినవి. ఈ గ్రహముల విషయము ఇతర దేశముల
వారికి కూడా తెలుసు. ఏడు గ్రహములలో నాయకుడైన సూర్యుని దినముతోనే అనగా సన్డే (Sun Day) తోనే వారము
ప్రారంభమగుచున్నది. అందరికీ తెలిసినట్లు అన్ని దేశములలో సన్డే, మూన్దే తొలి, మలి రోజులుగా ఉన్నాయి.
దీనినిబట్టి ఇందూ (హిందూ) సంస్కృతి ప్రపంచ వ్యాప్తముగా ఉన్నదని చెప్పవచ్చును. ప్రపంచ వ్యాప్తముగా సంవత్సరములో
పన్నెండు నెలలుండడమూ, వారములో ఏడు దినములుండడమూ, ఆదివారముతో వారము మొదలుకావడమూ, అందరికీ
తెలిసినట్లు సూర్యచంద్ర దినములు ప్రక్కప్రక్కనే ఉండడమును చూస్తే, మొదటి హిందూ (ఇందూ) సంస్కృతి ప్రపంచ
వ్యాప్తముగా ఉండెడిదని అర్థమగుచున్నది. ఇప్పటికాలములో హిందువులకే ఇందూ సంస్కృతి అంటే ఏమిటో, దాని
అర్థమేమిటో కూడా తెలియదు. ఇందూ (హిందూ) సంస్కృతి అను మాటనే వినని హిందువులు ఎందరో కలరు.
అటువంటి వారు ఇందూ సంస్కృతి అంటే ఏమిటి అని అడుగవచ్చును. వారికి మేము చెప్పు సమాధానము ఏమనగా!
హిందూ అను శబ్దము ఇందూ శబ్దముగా చెప్పుకొన్నపుడే హిందువు లకు తమ సంస్కృతిని గురించి తెలియగలదు.
సంస్కృతియే తెలియనపుడు సాంప్రదాయములు మొదటికే తెలియకుండా పోతాయి. అందువలన మనకు ఇప్పుడు
మన సంస్కృతిని గురించి తెలియాలంటే, మనము ఇపుడు పూర్వపు స్థితిలోనికి పోయి, ఇందూ అను పదమునే
ఉపయోగించి చెప్పుకోవాలి. ఇందూ అనగా జ్ఞానము అని అర్ధము. జ్ఞానములో ప్రపంచ జ్ఞానము ఒకటి, పరమాత్మ
జ్ఞానము మరొకటి కలవు. ఈ రెండిటిలో పరమాత్మ జ్ఞానమునకే ప్రత్యేకించి ఇందూ అనే పదమును వాడుదుము.
4

Page 5
ఇందువు అనగా చంద్రుడని అర్థముకాగా, ఇందువు నుండి పుట్టిన శబ్దము ఇందూ. జ్యోతిష్యశాస్త్రములో జ్ఞానమునకు
అధిపతి చంద్రుడుకాగా, ప్రపంచ జ్ఞానమునకు చంద్రుడు అను పేరుతో చందూ అనీ, దైవజ్ఞానమునకు ఇందువు అను
పేరుతో ఇందూ అని పిలిచెడివారు. అందువలన దైవజ్ఞానమును కలవానిని ఇందూ అనీ, ప్రపంచ జ్ఞానముకలవారిని
చందూ అనీ చెప్పుచున్నాము. ఈ మాట సత్యమనుటకు ఒక చిన్న ఆధారము కలదు. పెళ్ళి పెత్తనమునకు పోయినపుడు
పెళ్ళి కుమారుడు పెళ్ళి కూతురును చూచుట, చూచిన తర్వాత అమ్మాయి నచ్చినదనియో, నచ్చలేదనియో చెప్పడము
జరుగుచుండును. సర్వసాధారణముగా అమ్మాయి తనకు అందముగా కనిపించక పోతే అమ్మాయి నచ్చలేదనీ, అమ్మాయి
అందముగా కనిపించితే నచ్చినదనీ అమ్మాయిని చేసుకోబోవు యువకుడు చెప్పును. అమ్మాయి అందముగా లేకపోయినా,
అమ్మాయి మంచి తెలివైనదైతే, అమ్మాయికి అందము లేక పోయినా, చందముందిలే అని తమ పెద్దలు చెప్పితే,
అమ్మాయికున్న చందమును బట్టి అబ్బాయి చేసుకుంటానని ఒప్పుకొనెడి వాడు. అందముండి చందము లేకపోతే ఏమీ
ప్రయోజనము లేదనీ, చందము (తెలివి) ఉండి అందము లేకపోయినా ఫరవాలేదనీ, జీవితానికి అందముకంటే
ముఖ్యము తెలివి (చందము) అనీ పూర్వము చెప్పెడివారు. ప్రస్తుతకాలములో చందమంటే ఏమిటో ఎవరికీ తెలియకుండా
పోయినది. పూర్వము చందూ అనే పేర్లు కొందరికీ, ఇందూ అనే పేర్లు కొందరికీ పెట్టెడివారు. ఇప్పటి కాలములో
కూడా చందూ అని మగపిల్లలకూ, ఇందుమతియనీ, ఇందూ అని ఆడపిల్లలకు పేర్లుండడము అక్కడక్కడ చూస్తూనే
ఉన్నాము. ఇందుమతి అనగా దేవుని జ్ఞానముకలదని అర్థము. ఎక్కడైనా ఇందుమతి అని పేరుండునుగానీ, హిందుమతి
అని పేరుండదు. హిందు అనునది అర్థములేని పదము. అలాగే ఎక్కడైనా దేవుని జ్ఞానములో ధర్మముండును, కావున
ఇందూ ధర్మమని దైవజ్ఞానమును చెప్పవచ్చును. అయితే అట్లు కాకుండా హిందూ ధర్మమని చెప్పితే అది అర్థములేని
ధర్మమగును. ధర్మములు అధర్మములుగా మారునని గీతలో చెప్పినట్లు ప్రస్తుతము ఇందూ అను పదము హిందూగా
మారిపోయి ఉన్నది. మేము చాలామార్లు యదార్థము ఇదీయని చెప్పినా వినని స్థితిలో హిందువులున్నారు. మనము
పూర్వము దైవజ్ఞానముగల ఇందువులమనీ, అందువలన మన దేశమునకు పూర్వమే ఇందూదేశమని పేరుకలదనీ,
ఇందూదేశములోని వారంతా ఇందువులమేననీ, కాలగమనములో ఆంగ్లేయుల పరిపాలన సమయములో వారు వచ్చీరాని
భాషతో మనలను హిందువులనడము జరిగినదనీ, అప్పటినుండి మన గొప్పతనమును మనము మరచిపోయి, మన
చరిత్రను మనము తెలియనివారమై, మధ్యలో జరిగిన మార్పును గ్రహించలేకపోతున్నా మని చెప్పినా విననివారున్నారు.
అలా వినకపోవడమే కాకుండా హిందు అను పదము సింధూ అను పదము నుండి మార్పు చెందినదనీ, సింధూనది
మనదేశములో ప్రవహించుట వలన సింధూ అను పేరు బదులు హిందు అను పేరు వచ్చినదని కొందరూ, మనది
సింధూనది ప్రాంత నాగరికత అయినందున మనము హిందువులమని కొందరూ చెప్పుచున్నారు. అలాంటపుడు
సింధూనది, సింధూ నాగరికతయనిగానీ తెలిసినపుడు మేము హిందువులము కాదు సింధువులమని చెప్పుకోవచ్చును
కదా! అని మేము అడుగుచున్నాము.
విషయము తెలియనంతవరకు హిందువులుగా పిలుచుకొన్నవారు హిందువు అనుటకు కారణము సింధూనది
అనిగానీ, సింధూ నాగరికతయని గానీ తెలిసినపుడు, హిందూ అను అర్థములేని పదమును వదలి ఆధారమైన అర్థముతో
మనము సింధువులమని చెప్పుకోవచ్చుకదా! సింధూనది పాకిస్థాన్లో కూడా ప్రవహించుచున్నది. కావున ఆ దేశము
వారు తమ దేశములోని ఒక రాష్ట్రమునకు సింధూరాష్ట్రము అని పేరు పెట్టుకొన్నారు. మన దేశములో సింధూనదికంటే
పెద్దదీ, పవిత్రమైనదీ అయిన గంగానది పారుచున్నది. దానికంటే పెద్దదైన బ్రహ్మపుత్ర నది పారుచున్నది. అలాంటపుడు
5

Page 6
ముఖ్యమైన నదుల పేర్లను వదలి సింధూనది పేరును ఆధారముగా పెట్టుకోవడమేమిటని అడిగితే నేడు మేము
హిందూ ధర్మ రక్షకులమనువారివద్దే సమాధానము లేదు. సింధూనది పేరుకంటే గంగానది పేరు ముఖ్యము. ఎందుకనగా
సింధూనదికంటే గంగానదే మన దేశములో ఎక్కువగా ప్రవహించుచున్నది. అలాంటపుడు గంగాదేశమని పేరు పెట్టుకో
వచ్చును కదా! అని మేము అడిగితే, మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్ములను పరాయి మతస్థులన్నారు. మేము
స్వచ్ఛమైన ఇందూధర్మమును తెలిపితే, మమ్ములను నేటి హిందువులు కొందరు ఇందువులుగా గుర్తించలేక ఇతర
మతములవారిగా చెప్పడము ఎంత విచిత్రమో చూడండి. మేము భగవంతుడు చెప్పిన భగవద్గీతలోని పురుషోత్తమప్రాప్తి
యోగము అను అధ్యాయములోని 16,17 శ్లోకములను ఆధారము చేసుకొని క్షర, అక్షర, పురుషోత్తములను ముగ్గురు
పురుషుల విషయమును సిద్ధాంత సహితము చేసి శాస్త్రబద్దముగా త్రైతసిద్ధాంతమును ప్రకటించితే, చెప్పే విషయమేమిటో
గ్రహించలేని గ్రుడ్డివారై పోయి, త్రైతమును క్రైస్తవ మతములోని త్రిత్వముగా పోల్చుకొని మమ్ములను క్రైస్తవులన్న
కొందరు హిందువులు కలరు. మేము హిందువులము, మీరు ఇందువులు, మా మతము వేరు, మీ మతమువేరు
అనువారు కూడా కలరు. కుంటి కుందేలును పట్టుకొన్నవాడు, తాను పట్టుకొన్నది కుంటికుందేలని తెలియకపోవడమేకాక,
కుందేళ్ళన్నిటికీ మూడేకాళ్ళుంటాయని చెప్పడము పొరపాటనీ అది సత్యముకాదనీ, కుందేళ్ళకు మూడు కాదు నాలుగు
కాళ్ళుంటాయని చెప్పినా విననివారున్నారు. అటువంటి వానికి సత్యము తెలియాలంటే వానికి నాలుగుకాళ్ళ కుందేళ్ళను
రెండింటిని తెచ్చి చూపాలి. ఒకదానిని చూపినావాడు ఒప్పుకోడు. అది ఒక్కటి నాలుగుకాళ్ళతో తప్పుగా పుట్టిందంటాడు.
అందువలన రెండు కుందేళ్ళను చూపవలసిన అవసరమున్నది. మేము అలాగే రెండు కుందేళ్ళను చూపినట్లు పూర్వపు
చరిత్రనూ, పేర్లకు అర్థమును చెప్పినా వినకుండా నీవు హిందువేకావు ఇతర మతస్థుడని హిందువులు కొందరనడము
ఎట్లున్నదంటే, రెండు కుందేళ్ళను తెచ్చి వీటికి నాలుగు కాళ్ళున్నాయని సాక్ష్యము చూపినా ఇవి కుందేళ్ల జాతేకాదు,
ఇతర జాతి జంతువులన్నట్లున్నది.
మాకు జ్ఞానమున్నదని మాకంటే మించిన జ్ఞానిలేడనుకొని, మార్గమును పట్టుకోక, మతమును పట్టుకొన్నవారిని
వదలి, జ్ఞానమేమిటో తెలియాలనుకొను జిజ్ఞాసులకు చెప్పడము మంచిదనుకొన్నాము. మాకు తెలియదు, తెలుసుకోవాలను
ఆకాంక్ష కలవారికే మా రచనలు ఉపయోగపడు నని తెల్పుచున్నాము. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి ఇందూ
సంస్కృతిని గురించి చెప్పుకొందాము. ఇందూ సంస్కృతిని విడదీసి చూస్తే ఇందూ అన్నది ప్రత్యేక పదముగా ఉన్నది.
సంస్కృతి అను పదమును వీడదీస్తే సమ్+కృతి అని కలదు. సమ్ అనగా మంచి, కృతి అనగా చేయబడినది అని
అర్థము. ఇప్పుడు ఇందూ సంస్కృతి అనగా దైవజ్ఞానముతో మంచిగా చేయబడినది అని అర్ధము. ఇంకా వివరముగా
చెప్పుకొంటే దైవజ్ఞానమును అనుసరించి నిర్ణయించిన పని లేక పద్ధతి అని తెలియుచున్నది. నిర్ణయించిన పద్ధతిని లేక
పనిని చేయుటను సాంప్రదాయము అని అంటాము. సంస్కృతి వలన సాంప్రదాయము ఏర్పడుచున్నది. ఉదాహరణకు
గుడిలోనికి పోయి ప్రతిమ ముందర ఇలా కర్పూరమును వెలిగించాలి, అందులో దైవజ్ఞాన సంబంధముగా నిర్ణయించిన
ఉద్దేశముంది అని తెల్పడము ఇందూ సంస్కృతి, దానిని ఆచరించడము సాంప్రదాయము. ఇటువంటి సంస్కృతి
సాంప్రదాయములు ఇందూ పథములో ఎన్నో గలవు. ఇందూ అనగా జ్ఞానమును పొందినవాడు, దైవజ్ఞాని అని
చెప్పవచ్చును. దైవజ్ఞానము ఎక్కడుంటే అక్కడ ఇందూ అను పదమును ఉపయోగించి చెప్పవచ్చును. దేవుని మీద
విశ్వాసముకలవానిని ఇస్లామ్లో “ముస్లీమ్” అన్నట్లు, దేవుని జ్ఞానమునుకలవానిని దైవజ్ఞాని అనవచ్చును. భక్తి అనగా
విశ్వాసము అని అర్థము. దేవుని యొక్క భక్తికలవానిని ముస్లీమ్ అంటే, దేవుని యొక్క జ్ఞానముకలవారిని ఇందువు అని
6

Page 7
చెప్పవచ్చును. ఇక్కడ విడదీసి చెప్పితే భక్తి వేరు, జ్ఞానమువేరని చెప్పవచ్చును. దేవుని మీద విశ్వాసమునుకలవాడు
ఎవడైనా, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా ముస్లీమ్ అగును. అలాగే దేవుని జ్ఞానముకలవాడు ఎవడైనా, ఏ దేశస్థుడైనా,
ఏ మతస్థుడైనా ఇందువే అగును. ఈ సూత్రము ప్రకారము మతములను ప్రక్కన పెట్టి, మతాతీతముగా చూస్తే, ఇందూ
సమాజములో ఎందరో ముస్లీమ్లు కలరనీ, అలాగే ఇస్లామ్ సమాజములో కూడా ఎందరో ఇందువులుకలరనీ చెప్పవచ్చును.
ఇందూ సంస్కృతి అనునది సృష్ఠి మొదలైనప్పుడే చెప్పబడినది. జ్ఞానసంస్కృతి అనునది దేవుని జ్ఞానము
తెలుసుకొను ప్రతి మనిషితో సంబంధపడియున్నది. ఇందూ అనునది దైవజ్ఞానము. కావున దైవజ్ఞానము కలవారినందరిని
ఇందువులే అనవచ్చును. ఇందూ అనునది ఒక మతము కాదు, పథమనీ, దైవమార్గమనీ చెప్పవచ్చును. బైబిలులోని
దేవుని వాక్యము లను బాగా అర్థము చేసుకొని అందులోని జ్ఞానమును తెలుసుకొన్నవాడు జ్ఞానియే! లేక ఇందువే!
అలాగే భగవద్గీతలోని దేవుని జ్ఞానమును తెలుసుకొన్న వాడు జ్ఞానియే అగును, వానిని ఇందువు అనవచ్చును. ఒకవేళ
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన జ్ఞానము తెలియకుండా నేను ఇందువును లేక హిందువును అని చెప్పుకొంటే వాడు
ఇందూ సంఘములో నాయకుడైనా, ఇందూమత రక్షకుడని పేరు పెట్టుకొనినా, వాడు వాస్తవముగా ఇందువు కాడు.
నేడు ఇందువుకాని హిందువులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చును. ఇదే సూత్రము ప్రకారము ఇస్లామ్ సమాజములో
కూడా కొందరు జ్ఞానులూ ఉన్నారు, కొందరు విశ్వాసులూ ఉన్నారు. ఒక విధముగా క్రైస్తవములోనూ, ఇస్లామ్లోనూ
విశ్వాసులు ఎక్కువగలరు. జ్ఞానులు తక్కువ గలరు. ఇప్పటి ఇందూ సమాజము (హిందూసమాజము) లోనికి వచ్చి
చూస్తే చాలామందికి దేవుడు ఒక్కడే అను విషయము తెలియలేకపోయిన దానివలనా, బహు దేవతలను ఆరాధించుట
వలనా, దేవుని విశ్వాసులూ లేరు అలాగే దేవుని జ్ఞానము తెలిసినవారూ లేరనియే చెప్పవచ్చును. మేము జ్ఞానబోధకులము,
గురువులమని చెప్పుకొను వారందరూ, రకరకాల బోధలను బోధిస్తూ మా బోధలను విన్నవారు, అనుసరించిన వారు
దేవుడై పోగలడని చెప్పుచున్నారు. వారి బోధలను అనుసరించువారు మేము బ్రతికుండగనే దేవుడైపోయామని చెప్పు
కోవడమును చూస్తే దేవుని విధానము గానీ, దేవుని ధర్మముగానీ వారికి ఏమాత్రము తెలియదని స్పష్టమగుచున్నది.
నామ, రూప, క్రియారహితుడైన దేవున్ని తెలియకనే నామ, రూప, క్రియలున్న మనుషులు మేము
దేవుడైపోయామంటే, సూత్రము ప్రకారము వారు విశ్వాసులుగా గానీ, జ్ఞానులుగాగానీ లెక్కించబడరు. అన్ని మతములు
దేవునివైపే మార్గమును చూపుచున్నవి. అన్ని మతములు అందరికి ఒకే దేవుడని తెలుపుచున్నవి. పరమ భగవద్గీతలోగానీ,
పరిశుద్ధ బైబిలులోగానీ, పవిత్ర ఖురాన్లోగానీ ఒకే దేవున్ని ఆరాధించమనీ, అందరికి ఒకడే సృష్టికర్త యనీ జ్ఞానము
కలదు. ఆ సందేశముల ప్రకారము నడచుకొనువాడు ఎవడైనా జ్ఞాని అయినట్లే! వానినే ఇందువు అనవచ్చును. దేవుని
సమాచారమును తెలుపు గ్రంథములలోని దైవజ్ఞానము ప్రకారము అనుసరించని వాడు, మూల గ్రంథములలోని మూల
సూత్రములను తెలియని వాడు ఎప్పటికీ జ్ఞానికాలేడు, వానిని ఇందువు అనుటకు అవకాశము లేదు. మరొక ముఖ్య
విషయమేమనగా! ఆదిలో పుట్టిన పరమ భగవద్గీతలోగానీ, తర్వాత వచ్చిన పరిశుద్ధ బైబిలులోగానీ, ఆ తర్వాత వచ్చిన
పవిత్ర ఖురాన్లో గానీ మతము అను పేరు లేదు. మూడు మూల గ్రంథములలో సర్వ మానవులకు చెప్పుచున్నామనియే
ఉన్నది. కానీ మతము అను పేరు లేదు. మతము అను పేరు లేకపోతే, మాది ఫలానా మతమని ఆయా మతస్థులు
ఎందుకు చెప్పుకొంటున్నారని ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా!
7

Page 8
ఆట, పాట, పనీ లేని పనికిమాలిన (పని చేయని) వాడు దేవుడు. పని చేయని (పనికి మాలిన దేవుడు సృష్ఠి
ఆదిలోనే సృష్ఠి తయారు కాకముందే పని చేసి సమస్తమును సృష్టించడమే కాకుండా, తర్వాత వేరు వేరు కాలములందు
వేరు వేరు ప్రాంతములలో, వేరు వేరు వ్యక్తుల ద్వారా, వేరు వేరు రకములుగా తన (దేవుని) యొక్క జ్ఞానమును
బోధించునట్లు నిర్ణయించాడు. ఆయన (దేవుడు) నిర్ణయించినట్లే వేరువేరు కాలములలో, వేరువేరు ప్రాంతములలో,
వేరువేరు వ్యక్తుల ద్వారా దైవజ్ఞానము బోధించ బడినది. అయితే వేరువేరు రకములుగా బోధించబడినది. వేరువేరు
రకము లనగా దైవజ్ఞానములోనే వేరు పరిమాణములలో అని గ్రహించవలెను. ఒకే జ్ఞానమునే భగవద్గీతలో ఎక్కువ
పరిమాణములో బోధించబడినది. అదే జ్ఞానమునే బైబిలులో సంపూర్ణముగ బోధించినా, గీతకంటే పరిమాణము
తక్కువ ఉన్నది. అలాగే ఖురాన్ గ్రంథములో గీతలో, బైబిలులో బోధించిన సారాంశ జ్ఞానమునే చెప్పినప్పటికీ పరిమాణము
తగ్గినది. మీరు అర్థము చేసుకొనుటకు ఒక ఉదాహరణ చెప్పుచున్నాను చూడండి. ఒక తులము (పదిగ్రాముల)
బంగారును ఉపయోగించి ఒక కంసాలి ఒక వెడల్పయిన బిళ్ళను తయారు చేసి, ఆ బిళ్ళమీద ఒక బొమ్మను ముద్రించాడు.
తర్వాత కొంతకాలమునకు మరొక కంసాలి, మరొక ఊరులో ఒక తులము బంగారుతో ఒక బిళ్ళను తయారు చేసి
మొదటి బిళ్ళమీదనున్న బొమ్మనే ముద్రించాడు. ముందు తయారైన బిళ్ళకు తర్వాత తయారైన బిళ్ళకు విస్తీర్ణములో
మాత్రము కొంత తక్కువ ఉన్నది. కానీ బంగారం తులమే, దానిమీద బొమ్మ ఒకటే. మొదటి బిళ్ళను చూచినవాడు
రెండవ బిళ్ళను చూస్తే వాటిమీద ఒకే బొమ్మకలదని గ్రహించగలడు. తర్వాత కొంత కాలమునకు అదే తులము
బంగారుతో, పరిమాణములో రెండవదానికంటే చిన్నదిగానున్న బిళ్ళను మరొక కంసాలి తయారు చేసి, ఆ చిన్న
బిళ్ళమీద ముందు రెండు బిళ్ళల మీద ఉన్న బొమ్మనే ముద్రించాడు. తెలివైనవాడు ఎవడైన మూడు బిళ్ళలను చూస్తే
పరిమాణములో తేడా తప్ప ఒకే బొమ్మను చూపుచున్నవనీ, అన్నీ ఒకే తూకము గల బంగారు బిళ్ళలని తెలిసిపోయింది.
అలాగే గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో ఒకే దేవున్ని గురించి చెప్పడము జరిగినది. అయితే భగవద్గీత నూరు
శాతము వెడల్పయిన జ్ఞానమును చూపింది. అలాగే బైబిలు అరవై శాతము వెడల్పయిన జ్ఞానమును తెలిపింది. తర్వాత
పవిత్ర ఖురాన్ గ్రంథము కేవలము ఐదు శాతము వెడల్పయిన జ్ఞానమును చూపింది. అయితే సారాంశములోగానీ,
దేవుని విషయములోగానీ, మూడూ సమానముగా ఉన్నవి. దీనినిబట్టి గీత పలుచగా, బైబిలు గీతకంటే కొంత మందముగా,
ఖురాన్ గీత, బైబిలుకంటే మరికొంత మందముగా ఉండుట వలన, మూడూ సమానమైన బరువు కల్గియున్నవని,
బరువులో మాత్రము ఏ తేడా లేదని గ్రహించవచ్చును.
ఈ విధముగా దేవుడు తన గ్రంథములలో తన జ్ఞానమును బోధించాడు. మూడు మూల గ్రంథములలో ఒకే
దేవుని జ్ఞానము చెప్పుచూ, ఆ మూల గ్రంథములలో సర్వమానవులకు అందించు సమాచారములే చెప్పారు. కానీ
ఫలానా మతము అనీ, ఫలానా మత ప్రజలకనీ ఎక్కడా చెప్పలేదు. మూడు మూల గ్రంథములలో దేవుని మార్గమునే
తెలిపారు. కానీ ఎక్కడా ఎవరికీ మతమును గురించి చెప్పలేదు. దేవునివైపు పోవు పథమును (మార్గమును) గురించే
చెప్పారు. ఇప్పుడు కొందరు నన్ను ఒక ప్రశ్న ఇలా అడుగవచ్చును. "మీరు చెప్పినది బాగానే ఉన్నది. కానీ హిందూ
మతము, క్రైస్తవమతము, ఇస్లామ్ మతమని అందరూ వారివారి మతములను గురించి చెప్పుకొనుచున్నారు కదా!
హిందువులు బొట్టు పెట్టుకుంటే మిగత రెండు మతములవారు పెట్టుకోరు కదా! అలాగే ఇస్లామ్ మతమువారు లుంగీనిగానీ,
పైజామానుగానీ అర్థ అడుగు పైకి కట్టుకుంటే మిగత హిందూ, క్రైస్తవ మతముల వారు అలా కట్టుకోరు కదా! ఇలా
8

Page 9
ఆచార వ్యవహారముల లోనూ వేరువేరు మతములుగా అందరు చెప్పుకొంటున్నారు కదా! అయితే మతము అనేది,
దాని ఆచార వ్యవహారాలు ఎక్కడినుండి పుట్టాయి.” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ, ఖురాన్లోగానీ మతము అనునది లేదు. అయితే వారు మూడు మతములుగా
చెప్పుకోవడమూ, మతములోని ఆచార వ్యవహారములు అన్నియు ప్రక్క గ్రంథములలోనివని చెప్పవచ్చును. హిందువులు
పురాణములను, వేదములను ఆశ్రయించుట వలనా, అలాగే ఇస్లామ్్వరు హదీసు గ్రంథములను ఆశ్రయించుట వలన,
క్రైస్తవులు మిగత 62 సువార్తలను ఆశ్రయించుట వలనా వారిలో బేధములు, మతముల తేడాలు కనిపించుచున్నవి.
ముస్లీమ్లు లుంగీనిగానీ, పైజామానుగానీ పైకి కట్టుకోమని ఖురాన్ గ్రంథము చెప్పలేదు. హిందువులకు వేదములున్నట్లు
ముస్లీమ్లకు హదీసులున్నవని తెలియాలి. వేదముల వలన హిందువులలో కొన్ని ఆచార వ్యవహారములు వచ్చినట్లు,
ముస్లీమ్లలో కూడా హదీసుల వలన కొన్ని ఆచార వ్యవహరములు వచ్చినవి. దైవజ్ఞానము తప్ప హిందువుల ఆచార
వ్యవహారములు ఏవీ కూడా భగవద్గీతలో లేవు. అలాగే దేవుని జ్ఞానము తప్ప ముస్లీమ్ల ఆచార వ్యవహారములు ఏవీ
కూడా ఖురాన్ గ్రంథములో లేవు. మూడు మూల గ్రంథములలోనూ దైవపథమున్నది. కానీ మతము అను ప్రసక్తేలేదు.
అయితే మనిషి, దేవుడు చెప్పిన పథమును మతముగా మార్చుకొన్నాడు. పథము అనగా మార్గము అని అర్ధము.
దేవుడు చెప్పిన మూడు మతములలో మనిషి దేనిని ఇష్టపడునో దానిని మతము అంటున్నాము. మతము అనగా
ఒప్పుకోవడము లేక ఇష్టపడడము అని అర్థము. దేవుడు చెప్పిన మార్గములలో ఒక దానిని మనిషి ఒప్పుకొంటే అది
వాని మతమగును. ఒక దానిని ఒప్పుకొంటే మిగతా వాటిని ఒప్పుకోలేదని అర్థము కదా! అలా దేవుని మార్గములో
ఒక్క దానిని మాత్రము ఇష్టపడడము లేక ఒప్పుకోవడమును మతము అంటున్నాము. ఈ లెక్క ప్రకారము హిందూ
మతస్థులు మిగత రెండు మతములను ఒప్పుకోవడము లేదు. అలాగే క్రైస్తవుడు ఇస్లామ్నూ, ఇందూత్వమును ఒప్పుకోవడము
లేదు. ఒకదానిని ఒప్పుకొని మిగతా పథములను ఒప్పుకోనప్పుడు అప్పుడది ఒప్పుకొన్న మనిషికి మతమగును. ఈ
విధముగా మూడు గ్రంథములలోని విషయము, పరస్పర అవగాహన లేనప్పుడు, మూడు పథములు మూడు మతములుగా
మారిపోయినవి. మనిషి మూడు మూల గ్రంథములను సరిగా అర్థము చేసుకోక ఒకదానిని ఇష్టపడడము, మరొక
దానిమీద అయిష్టతను చూపడము వలన అతనికి సమ్మతమైనది ఏదో అది మతమైనది. అందువలన మతమునకు
అతీతుడు కావలెనంటే, ఏదైతే జ్ఞానమో దానిని మనిషి స్వీకరించుచుండవలెను. అప్పుడైతేనే మనిషి పథములో
పయనించి నట్లగును. అట్లుకాకపోతే అతడు మతములో చిక్కుకొన్నట్లగును. ప్రస్తుత కాలములో అందరూ వారికి
ఇష్టమైన మతములోనే ఉన్నారు. ఇష్టము కాని పథములను అసూయతో చూస్తున్నారు. దేవుడు తెల్పిన మార్గములలో
మనిషికి సమ్మతము, అసమ్మతము ఉన్నంత వరకు మతము ఉంటుంది. అన్నీ దేవుడు చెప్పిన జ్ఞానములు, ధర్మములు
అయినప్పుడు, అందరికి దేవుడు ఒక్కడే అయినప్పుడు పథము మాత్రమే ఉంటుంది. అట్లుకాకుండా మా జ్ఞానమూ,
మా ధర్మమూ వేరన్నప్పుడు, మా దేవుడు మీ దేవుడు వేరన్నప్పుడు పథము ఉండదు. అక్కడ మతము ఉంటుంది.
ముఖ్యమైన మూడు మత గ్రంథములలోనూ పథమునకు సంబంధించిన సమాచారముండగా, ప్రక్క గ్రంథము
లలో మతమునకు సంబంధించిన సమాచారమున్నది. మనిషి మూల గ్రంథములకంటే ప్రక్కనున్న గ్రంథములలోని
సమాచారమును చూచి మాయలో పడి మతమును సృష్టించుకొన్నాడు. అందువలన మతము అనునది మనిషిచేత
సృష్ఠింప బడినదేనని చెప్పవచ్చును. అట్లే పథమును దేవుడు నెలకొల్పాడని చెప్పవచ్చును. మతము పథము యొక్క
తారతమ్యములు తెలియనివాడు మతములోనే చిక్కుకొని దేవుని మార్గమునకు దూరముగా ఉండును. ప్రతి మతస్థులు
9

Page 10
మేము దేవునికి దగ్గరగానున్నామని భ్రమలో మునిగియున్నారు. దైవమార్గమును అనుసరిస్తేనే దేవునికి దగ్గరవుదుమని
తెలియక తాము ఒక మతమును అనుసరిస్తూ దేవునికి దగ్గరగానున్నామనుకోవడము భ్రమ కాక ఏమగును? ఇప్పటికైనా
అన్ని మతములవారు గ్రహించవలసిన ముఖ్యమైన విషయము, మతము ఎన్నటికి దేవుని దగ్గరకు చేర్చలేదనీ,
మతములకతీతమైన పథము మాత్రమే దేవుని దగ్గరకు చేర్చగలదని తెలియవలెను. తన మతమును సమర్థిస్తూ, ఇతరుల
మతమును విమర్శిస్తూ ఉండడము వలన ప్రయోజనములేదని, ఇతర మతములోని సత్యమును కూడా గ్రహించగలిగితే,
మిగతా మతములలో కూడా దైవజ్ఞానమున్నదని తెలియగలదు. అంటే మిగత మతములలో కూడా ఇందూ సంస్కృతికలదని
తెలియగలదు. మిగతా మతములలో కూడా జ్ఞానము తెలిసిన ప్రతి మనిషి కూడా ఇందువే అని తెలియగలదు.
దీనినిబట్టి ఇందూ సంస్కృతి ఒక్క మతమునకు పరిమితికాదనీ, అన్ని మతములకు సంబంధించినదనీ తెలిసిపోవుచున్నది.
ఏ మతములో పుట్టినవాడు ఆ మతములోనే ఉంటూ, దేవుడు చెప్పిన అన్ని మతములలోని జ్ఞానమును గ్రహించగలిగినప్పుడు
వాడు నిజమైన ఇందువగును. ఇక్కడ మతము మారితే ఇందువగుదువని చెప్పడములేదు. మతము మారకుండా
ఇందువగు (జ్ఞానియగు) విధానమును తెలిపాము. దైవ ధర్మములు గల అన్ని పథములలోనూ ఇందూత్వమున్నదనీ, ఏ
మతము (ఏ పథము) లోనైనా జ్ఞానము తెలిసినవాడు మిగతా మతములలోని జ్ఞానమును కూడ తెలియగల్గు ఇందువుగా
చలామణి అగుచున్నాడు. ఇందూ సంస్కృతిని దేవుడు తెలిపాడు, కావున అది అన్ని మతములలోనూ ఉన్నదని
చెప్పుచున్నాము. దానిని తెలియడమే ప్రతి మనిషి కర్తవ్యము.
భగవద్గీతలో భగవంతుడైన కృష్ణుడు, అర్జునునకు విశ్వరూపమును చూపినపుడు, దేవుని విశ్వరూపమును
చూచిన అర్జునునకు ఏమీ అర్థముకాక ఎవరు నీవు అని అడిగాడు. అప్పుడు విశ్వరూపములోనున్న దేవుడు దానికి
జవాబుగా చిన్న పదమును ఉపయోగించి “కాలోస్మి” అన్నాడు. కాలోస్మి అంటే కాలమునై ఉన్నానని అర్థము. కాలము
అనునది ఒక విధముగా పేరుకాని పేరే అయినా కాలమునకు రూపము లేదు. కాలము మన ముందరే ఉన్నా దానికి
రూపములేదు. కాలము ఎట్లున్నదో చెప్పమని అడిగితే దానిని గురించి ఎవరూ ఏ వివరము ఇవ్వలేరు. కాలము దైవ
స్వరూపమైనది, కావున అది ఇట్లున్నదని ఎవరూ చెప్పలేరు. రూపము లేనిది కాలము, అయినా కాలము గడచిన,
గడుస్తున్న, గడువబోవు అను మూడు భాగములుగా ఉన్నది. గడచిన కాలమును భూతకాలము అంటాము, గడస్తున్న
కాలమును వర్తమాన కాలము అంటాము. అలాగే గడువబోవు లేక రాబోవు కాలమును భవిష్యత్ కాలము అంటాము.
కాలము అంటే దేవుడు అని అర్థమైనది కదా! కాలము మూడు విధములుగా మనముందరే, మన కళ్లెదుటే ఉన్నా
దానిని అనుభవించలేక పోవుచున్నాము. కాలము చెప్పుకొనుటకు ఉన్నది, కానీ అనుభవమునకు రానిదని తెలియుచున్నది.
దేవుడు ఉన్నాడని చెప్పుటకు మాత్రమే కలడు, కానీ ఆయన ఎవరి అనుభవానికి రాడని ప్రత్యక్ష కాలమునుబట్టి తెలిసి
పోవుచున్నది. కాలము ప్రత్యక్ష సాక్ష్యముగా ఉండినా, అది ఏమిటో ఎవరూ చెప్పలేనట్లు, దేవుని ధర్మములు మనకు
తెలియుచున్నప్పటికీ, దేవున్ని ఎవరూ తెలియలేరు. దీనిని బట్టి దేవుడు ధర్మబద్ధుడు అనియూ మరియు దేవుడు
ధర్మాతీతుడనియూ రెండు రకముల చెప్పవచ్చును.
దేవుడు కాలస్వరూపుడు, కావున కాలమును గురించి వివరముగా తెలుసుకొంటే దేవుని జ్ఞానమును గురించి
తెలిసినట్లగును. అందువలన కాలమును గురించి వివరముగా చెప్పుకొంటే 60 సెకండ్లు ఒక నిమిషమనీ, 60
నిమిషములు ఒక గంటయనీ, 24 గంటలు ఒక దినమనీ, 30 దినములు ఒక నెలయనీ, 12 నెలలు ఒక సంవత్సరమనియు
10

Page 11
కాలమును కొలిచి చెప్పుచున్నాము. అయినా కాలము యొక్క నిజస్వరూపము ఎవరికీ తెలియదు. కాలము మూడు
రకములుగా ఉన్నదని చెప్పుకొన్నాము కదా! అలాగే దేవుడు మూడు రకములుగా ఉన్నాడని చెప్పవచ్చును. కాలము
భూత, వర్తమాన, భవిష్యత్ అను మూడు రకములుగా ఉన్నట్లే దేవుడు కూడా క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని
మూడు రకములుగా చెప్పబడుచున్నాడు. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16,17 శ్లోకములలో ముగ్గురు
పురుషులను గురించి చెప్పడము జరిగినది. కాలము దైవస్వరూపము అయినపుడు కాలము మూడు రకాలుగా ఉన్నది.
అలాగే దైవము మూడు రకములుగా ఉన్నాడు. కాలము యొక్క మూడు రకములు మనిషికి తెలియును. కానీ చాలామందికి
దైవము యొక్క మూడు రకములు ఏమిటో తెలియదు. మేము చెప్పుచున్న త్రైతసిద్ధాంతము, దైవము మూడు రకములుగా
ఉన్నాడని చెప్పుచున్నది. గీతలో దేవుడు ముగ్గురు పురుషులుగా క్షర, అక్షర, పురుషోత్తములుగా చెప్పబడియున్నాడు.
వివరముగ చెప్పుకొంటే క్షరుడు అనగా ఒక జీవుడు లేక జీవాత్మ అని చెప్పవచ్చును. క్షరుడు అనగా నాశనము చెందువాడని
అర్ధము. ఎప్పటికైనా జీవుడు నాశనము చెందువాడని అందువలన జీవున్ని క్షరుడు అన్నాము. అక్షరుడు అనగా
నాశనము చెందనివాడని అర్థము. నాశనము చెందు జీవాత్మగా మనము మన శరీరములో ఉన్నాము. నాశనముకాని
అక్షరుడు ప్రతి శరీరములోనూ జీవునితో పాటు ఉంటున్నాడు. క్షరుడైన జీవుడు శరీరములో ఒక్కచోట మాత్రముండగా,
అక్షరుడైన ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. మూడవ పురుషుడైన పురుషోత్తముడు (పరమాత్మ) విశ్వమంతా
అణువణువున వ్యాపించి ఉండడమే కాక శరీరములో కూడ వ్యాపించియున్నాడు. మూడు రకముల పురుషులలో
జీవాత్మ శరీరములో ఒక్కచోట, ఆత్మ శరీరమంతా, పరమాత్మ శరీరము బయటా, శరీరము లోపలాయున్నాడు.
కాలము దైవస్వరూపము కావున నేను కాలమును అని గీతలో దేవుడు చెప్పాడు. దీనినిబట్టి కాలమూ, దైవమూ
రెండు ఒక్కటేననీ, రెండూ మూడు భాగములుగా ఉన్నవని చెప్పుకొన్నాము. ఇప్పుడు కాలము యొక్క మూడు భాగములతో
దైవము యొక్క మూడు భాగములను అన్వయించి చూచితే మూడు కాలములకు మూడు ఆత్మలు సరిపోవును. మూడు
కాలములు మూడు ఆత్మలతో సరిపోవుట వలన, కాలము దైవస్వరూపము అనడమేకాక దైవము కాలస్వరూపము
అనీ, కాలము ఆత్మ స్వరూపమని కూడా చెప్పవచ్చును. భగవద్గీతలో జ్ఞానయోగమందు ఆరవ శ్లోకమున సర్వ
జీవరాసులకూ నేను ఈశ్వరున్ని (అధిపతిని) అని చెప్పుచూ “భూతానా మీశ్వరోపిసన్" అని అన్నాడు. అట్లే రాజవిద్యా
రాజగుహ్య యోగము అను అధ్యాయములో పదకొండవ శ్లోకమందు నేను జీవులందరికి మహేశ్వరున్ని అని చెప్పుచూ
"మమ భూత మహేశ్వరమ్" అని అన్నాడు. రెండు వాక్యములలోనూ జీవుళ్ళను భూతములని చెప్పడము జరిగినది.
దీనినిబట్టి భూతము అనగా జీవాత్మ అని తెలిసిపోవుచున్నది. మూడు కాలములలో భూతకాలమున్నట్లు, మూడు
ఆత్మలలో భూతాత్మ అనునది ఒకటున్నదనీ, అదియే జీవాత్మయనీ చెప్పవచ్చును. ఈ ఆధారముతో భూతకాలమునకు
జీవాత్మనూ, వర్తమాన కాలమునకు ఆత్మనూ, భవిష్యత్ కాలమునకు పరమాత్మను పోల్చి చెప్పవచ్చును.
12 నెలలు ఒక సంవత్సరము అయినట్లు 60 సంవత్సరములు ఒక ఉప యుగము అగుచున్నది. 7,200
ఉపయుగములు కలిసి ఒక యుగమగుచున్నది. అదియే కలియుగము. అలాగే 14,400 ఉపయుగములు ఒక
ద్వాపరయుగమూ, 21,600 ఉపయుగములు ఒక త్రేతాయుగము, 28,800 ఉపయుగములు కలిసి ఒక
కృతయుగమగుచున్నది. యుగములు మూడు పేర్లతో ఉన్నాయి. ఒకటి ఉపయుగము, రెండుయుగము, మూడు
మహాయుగమని చెప్పుచున్నాము. నాలుగు యుగములు కలిసి ఒక మహా యుగమగుచున్నది. కృతయుగము,
త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము నాలుగు యుగములు కలిసి మహాయుగము కాగా, 72,000
11

Page 12
ఉప యుగములు కలిసి ఒక మహాయుగము యొక్క కాలమగుచున్నది. కలియుగము 7,200 ఉపయుగములుకాగా
దానికి పదింతలు ఎక్కువ ఒక మహాయుగమగుచున్నది. యుగములను సంవత్సరములలో చెప్పుకొంటే కలియుగము
4,32,000 సంవత్సరములు. ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు. త్రేతాయుగము 12,96,000
సంవత్సరములు. కృత యుగము 17,28,000 సంవత్సరములు. నాలుగు యుగముల కాలము 43,20,000
సంవత్సరములు. కలియుగమునకు పదింతలు ఎక్కువ ఒక మహాయుగము అగుచున్నది.
కలియుగము = 7,200 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరములుకాగా మొత్తము
కలియుగము : 4,32,000 సం||
ద్వాపరయుగము = 14,400 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరముల ప్రకారము మొత్తము
ద్వాపరయుగము : 8,64,000 సం॥
త్రేతాయుగము = 21,600 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరముల ప్రకారము మొత్తము
త్రేతాయుగము : 12,96,000 సం||
కృతయుగము = 28,800 ఉపయుగములు. ఒక ఉపయుగము 60 సంవత్సరముల ప్రకారము మొత్తము
కృతయుగము : 17,28,000 సం||
||
4,32,000
కలియుగము
=
60x7,200
ద్వాపరయుగము
||
60x14,400
=
8,64,000
త్రేతాయుగము
=
||
60x21,600
=
12,96,000
60×28,800 =
17,28,000
60×72,000
43,20,000
కృతయుగము
ఒక మహాయుగము
భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయమందు 17,18 శ్లోకములలో ప్రపంచము యొక్క ఆయుస్సు
చెప్పబడినది.
17.శ్లో॥
సహస్రయుగపర్యన్త మహర్యద్భహ్మణో విదుః,
రాత్రిం యుగ సహస్రాన్తాం తేహూ రాత్ర విదో జనాః
ఈ శ్లోకములో వేయియుగములు దేవునికి ఒక పగలనీ, వేయి యుగములు ఒక రాత్రనీ చెప్పబడినది. తర్వాత క్రింది
శ్లోకములో
18. శ్లో॥
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవన్య హరాగమే,
రాత్రాగమే ప్రలీయన్తో తత్రైవావ్యక్త సంజ్ఞకే.
వేయియుగములు దేవుని పగలు కాలములో ఈ ప్రపంచమంతా జీవన విధానము సాగించుచుండును. అలాగే
వేయియుగముల రాత్రి కాలములో మొత్తము విశ్వమే ఉండదు. దేవుని పగలు ప్రారంభములో విశ్వము సృష్ఠించబడును,
దానినే ప్రభవము అంటాము. అలాగే దేవుని రాత్రి ప్రారంభములో సృష్టించబడిన విశ్వమంతా లేకుండా పోవును.
12

Page 13
దానినే ప్రళయము అంటాము. ఒకమారు విశ్వము సృష్టించబడి తర్వాత వేయి యుగములకు విశ్వము ప్రళయము
పొందడమును ఒక కల్పము అంటాము. ఒక కల్పము యొక్క పూర్తి కాలము రెండువేల యుగములని తెలియుచున్నది.
దేవుని యొక్క ఒక పగలు, ఒక రాత్రి రెండు రెండువేల యుగములు. ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక దినమగుచున్నది.
దేవునికి ఒక దినము పూర్తి అయితే దానిని ఒక కల్పము అంటాము. ఇదంతా కల్పిత కథగా చెప్పిన విషయము కాదు.
ఇదంతా పూర్తి శాస్త్రబద్ధమైన విషయము. ఇదంతా శాస్త్రబద్దమనుటకు ఇప్పుడు జరుగుచున్న కలియుగమే ప్రత్యక్ష
ప్రమాణము. సృష్ఠి ప్రభవ, ప్రళయములకు గీతలో భగవంతుడు చెప్పిన పై రెండు శ్లోకములే ఆధారము. అంతేకాక
ప్రతి జీవరాసి తల మధ్యభాగములో కనిపించని బ్రహ్మచక్రమొకటున్నది. ఆ బ్రహ్మచక్రము రెండు భాగములుగా విభజింపబడి
యున్నది. ఆ బ్రహ్మచక్రము కాలముతో పాటు తిరుగుచున్నది. ఆ చక్రము లోని రెండు భాగములు పూర్తిగా ఒక చుట్టు
తిరుగుటకు రెండు వేల యుగములు పట్టుచున్నది. బ్రహ్మచక్రములోని రెండు భాగములలో ఒక భాగము దేవుని
పగలుగా, మరియొక భాగము దేవుని రాత్రిగా గుర్తింపబడినది. బ్రహ్మచక్రము యొక్క గమనము ఒక భాగము
తిరుగుటకు వేయియుగములు పట్టుచున్నది. లెక్కప్రకారము నాలుగుయుగములు కలిసిన మహాయుగములు 250
మార్లు గడచితే వేయియుగములగును. వేయి యుగములు జరుగుటకు పూర్తిగా 108 కోట్ల సంవత్సరములగుచున్నది.
దీనిప్రకారము విశ్వము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములని శాస్త్రబద్దముగా తెలియుచున్నది. దేవునికి
పగటి కాలము 108 కోట్ల సంవత్సరములుకాగా, రాత్రి కాలము కూడా 108 కోట్ల సంవత్సరములేనని చెప్పవచ్చును.
మొత్తము 216 కోట్ల సంవత్సరముల కాలము దేవునికి ఒక దినమగునని బ్రహ్మవిద్యా శాస్త్రప్రమాణముగా చెప్పవచ్చును.
విశ్వమంతా సృష్టింపబడినది జీవులకొరకే. జీవుని నిమిత్తము దేవుడు చేసినదే విశ్వసృష్ఠి. విశ్వమునకు
ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములని చెప్పుకొన్నాము కదా! 108 కోట్ల సంవత్సరముల క్రమపద్దతి కొరకు
బ్రహ్మచక్రమనునది కలదని కూడా చెప్పుకొన్నాము. విశ్వము, విశ్వము యొక్క ఆయుషే కాకుండా జీవులు, జీవుల
గుణములు, జీవుల కర్మలు, కర్మలు అమలుకు వచ్చు కాలములు అన్నీ నిర్ణయింపబడి ఉన్నవి. శరీరములోనే జీవుడు
నివశిస్తున్నాడని అందరికీ తెలుసు. అయితే ఎక్కడ నివశిస్తున్నా డని మాత్రము పెద్ద ఆధ్యాత్మికవేత్తలకు కూడా తెలియదు.
దానిని వివరముగా తెలుసుకొంటే బ్రహ్మచక్రము క్రింద కాలచక్రమున్నది. కాలచక్రము క్రింద కర్మచక్రమున్నది.
కర్మచక్రము క్రింద గుణచక్రమున్నది. ఈ బ్రహ్మ, కాల, కర్మ, గుణ అను నాలుగు చక్రములు బ్రహ్మనాడిలోని ఆత్మను
ఇరుసుగా చేసుకొని ఒకదాని క్రింది ఒకటి అమర్చబడియున్నవి. నాలుగు చక్రముల సముదాయము మన తల
మధ్యభాగములో ఎలా ఉన్నది చిత్రరూపములో ప్రక్క పేజీలో చూడవచ్చును.
అన్నిటికంటే క్రింద గల గుణచక్రము మొత్తము నాలుగు భాగములుగా ఉన్నది. అందులో బయటి మూడు
భాగములందు గుణములుండును. మధ్యలోని భాగములో గుణములుండవు. అందులో ఆత్మయుండును. గుణ
చక్రములలోని నాలుగు భాగములను రెండు విధములుగా విభజించి చెప్పవచ్చును. ఒకటి గుణములున్న భాగములు,
రెండు గుణములులేని భాగము అని రెండు విధముల విభజించవచ్చును. గుణచక్రమును మాయచక్రమని కూడా
అనవచ్చును. అలా అనుటకు భగవద్గీతలోని విజ్ఞాన యోగమందు 14వ శ్లోకమున "గుణమయీ మమ మాయా" అను
వాక్యమే కారణము. ఆ వాక్యము ప్రకారము నా మాయ గుణములతో కూడుకొని ఉన్నదనీ, లేక మాయ గుణరూపములో
ఉన్నదనీ దేవుడు చెప్పాడు. అందువలన గుణచక్రములోని గుణములనే మాయ అంటున్నాము. గుణములను మాయ
అన్నపుడు గుణచక్రమును మాయచక్రమని చెప్పవచ్చును. గుణచక్రములోని నాలుగు భాగములలో జీవుడు
13

Page 14
బ్రహ్మచక్రము
కాలచక్రము
కర్మచక్రము
గుణచక్రము
დი.
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు
నివాసముండగలడు. అయితే శరీరమును ధరించినప్పటినుండి గుణములున్న మూడు భాగములలోనే ఉన్నాడు.
గుణములులేని భాగములోనికి జీవుడు గట్టి ప్రయత్నము చేస్తే పోగలడు. జీవుడు గుణరహిత భాగమైన, ఆత్మ నివాసమున్న
భాగములోనికి పోవాలని ఏమాత్రము అనుకోవడము లేదు. అందువలన జీవుడు గుణములున్న మూడు భాగములలోనే
ఏదో ఒక భాగములో ఎల్లకాలము నివశిస్తున్నాడు. గుణచక్రము మూడు మరియు ఒకటి మొత్తము నాలుగు భాగములుగా
ఉన్నదని చెప్పుకొన్నాము కదా! గుణములున్న మూడు భాగములు బయటినుండి వరుసగా, ఒకటి తామస గుణభాగము,
రెండు రాజస గుణభాగము, మూడు సాత్విక గుణభాగము అనుపేర్లతో కలవు. ఇక మధ్యలో మిగిలియున్న నాల్గవ
భాగము గుణరహితమైన భాగము. దానిని ఆత్మ భాగమనీ లేక యోగ భాగమనీ చెప్పుచున్నాము. జీవుడు నాల్గవ
భాగములోనికి వచ్చినపుడు యోగమగును. అందువలన దానిని యోగ భాగమనుచున్నాము. గుణచక్రము ఎలా
ఉన్నదీ క్రింది పటములో చూడవచ్చును.
ఆత్మ
తామసము
రాజసము
సాత్త్వికము
మాయచక్రము లేక గుణచక్రములో గుణములున్న ఒక్కొక్క భాగములో పన్నెండు గుణములు గలవు.
తామసములో 12, రాజసములో 12, సాత్వికములో 12 గుణములు రెండు రకములుగా కలవు. 12 గుణములలో
ఆరు ఒక రకముకాగా, మిగిలిన ఆరు మరొక రకముగా ఉన్నవి. మొదటి రకము ఆరు గుణములు జీవునికి పాపమును
అందించు చెడు గుణములు కాగా, మిగత ఆరు గుణములు జీవునికి పుణ్యమును అందించు మంచి గుణములుగా
ఉన్నవి. ఒకే గుణభాగములో ఇటు మాయ, అటు మాయ అన్నట్లు ఇటు మంచి అటు చెడు గుణములు రెండు
రకములు గలవు. గుణభాగములోని ఆరు చెడు గుణములను అరిషట్వర్గము అని అంటారు. అరి అనగా శత్రువు అని
14

Page 15
అర్థము. షట్ అనగా ఆరు అనీ, వర్గము అనగా గుంపు అనీ అర్థము. అరిషట్ వర్గము అంటే ఆరు శత్రువుల గుంపు
అని అర్థము. అలాగే మిగతా ఆరు గుణములను మిత్ర షట్వర్గము అంటారు. ఆరు మిత్రులగుంపు అని దాని అర్థము.
ఈ పన్నెండు గుణములు ఎవరికి మిత్రులు, ఎవరికి శత్రువులు అను ప్రశ్నకు జవాబుగా, జీవునకు ఆరు శత్రుగుణములు,
ఆరు మిత్రగుణములుగా ఉన్నవని చెప్పవచ్చును. మూడు గుణభాగములలోనూ మిత్ర శత్రు గుణములుండగా, నాల్గవ
భాగములో మాత్రము ఏ గుణములు లేవు. ఇదంతయు జీవుని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసి పెట్టిన యంత్రాంగము.
గుణచక్రములోని (మాయచక్రములోని) మూడు భాగములయందు ఒక్కొక్క భాగములో పన్నెండు
గుణములున్నాయని చెప్పుకొన్నాము కదా! పన్నెండులో ఆరు శత్రు గుణములు, ఆరు మిత్ర గుణములున్నాయని
కూడా చెప్పుకొన్నాము. వీటి వలననే పాపపుణ్యములు వస్తాయని కూడా చెప్పుకొన్నాము. ఈ విధానము బహు
రహస్యమైనది. ఏ మతమునందు కూడా ఇంతవరకూ ఎవరూ చెప్పనిది, కావున చాలా జాగ్రత్తగా వినవలెనని
తెలుపుచున్నాను. ఒక భాగము ఆరు శత్రు గుణములు వరుసగా ఇలా ఉన్నవి. 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ
5) మద 6) మత్సర అను పేర్లతో కలవు. వివరముగా చెప్పితే, కామ అనగా శృంగారమునకు సంబంధించినది, ఆడ
మగకు సంబంధించినదని అనుకోకూడదు. కామము అంటే ఆశ అని అర్థము. అది ఏ ఆశ అయినా కావచ్చును. ఏ
దాని మీద ఆశ అయినా కావచ్చును. డబ్బు కావాలనుకోవడము ఆశయే కదా! దానిని కామ గుణము అనవచ్చును.
అలాగే పలానా స్త్రీ సాంగత్యము కావాలను కోవడము కూడా ఆశయే అగును. కావున దానిని కూడా కామ గుణమే అని
చెప్పవచ్చును. ఈ విధముగా ఒక గుణములోని ఉద్దేశమును బట్టి అది మనిషి జీవితములో ఎక్కడ ఎలా
ఉపయోగపడుచున్నదో గుర్తించవచ్చును. మనిషి ప్రవర్తననుబట్టి ఆ ప్రవర్తన ఏ గుణమునకు సంబంధించినదో
తెలియవచ్చును. రెండవ గుణమైన క్రోధము అనగా కోపము. అది మనిషి శరీరములో ఎలా ఉన్నదో తెలియనప్పటికీ,
దాని కార్యాచరణ బయట మనిషిలో కనిపించును. అప్పుడు మనిషిలోని జీవుడు కోప గుణమునకు తగులుకొన్నాడని
అర్థము చేసుకోవచ్చును. ఈ విధముగా గుణములన్నిటిని గుర్తించవచ్చును. మూడవదైన లోభ గుణము జీవున్ని
తగులుకొన్నపుడు వాడు లోభిగా మారిపోవును. వానిలో పిసినారితనము పెరిగిపోవును. అటువంటి పిసినారి గుణమున్న
వారిని చాలాచోట్ల చూడవచ్చును. ఇక నాల్గవదైన మోహగుణము మనుషులలో నాది, నావారు, నా అను భావము
కల్గించుచున్నది. ఇది మనిషిలో గుర్తించలేనంతగా పని చేయుచుండును. భారతయుద్ధములో అర్జునునకు ఈ
మోహగుణము వచ్చిన దానివలన నేను యుద్ధము చేయను, నావారిని చంపను అన్నాడు. దీనిని చాలామంది అర్థము
చేసుకోలేక ప్రేమ గుణముగా భావించుకొనుచుందురు. ప్రేమ గుణమువేరు, దాని పనివేరు. అలాగే మోహగుణము
వేరు దాని పనివేరని తెలియవలెను. ఇక ఐదవ గుణము మదము. మదము అనగా గర్వము అని అర్థము. నేను
ఫలానా అని తన్నుతాను గొప్పగా అనుకోవడమును గర్వము అంటాము. చాలామంది మదము అంటే మనిషిలోని
క్రొవ్వు అని అనుకోవడము జరుగుచున్నది. ముఖ్య గమనిక ఏమంటే శరీరములోని ఏ భాగముతోను సంబంధము
లేకుండా ప్రత్యేకముగ ఉన్నవి గుణములు. శరీర భాగములు వేరు, గుణములువేరని తెలియవలెను. కొందరు
బోధకులు గురువులుగా చలామణి అగుచు ఆధ్యాత్మిక కోర్సులూ, క్లాసులూ ఏర్పాటు చేసి, అందులో ఒక బోర్డునందు
గుణములను గురించి వ్రాస్తు ఇలా వ్రాసియుంచారు. “గుణములు ఐదు. కామము, క్రోధము, లోభము, మోహము,
అహము” అని చార్టులో వ్రాసి గోడకు తగిలించారు. అహము అనునది గుణము కానే కాదు. అది శరీరములో 25
భాగములలో ఒక సూక్ష్మభాగము. పేరుపొందిన బోధకులు ఆధ్యాత్మికమును బోధించుచు అహమును గుణముగా
15

Page 16
చెప్పుచున్నారంటే ఎంత విచిత్రము.! మదము అనునది నేను ఫలానాయను భావమును కల్గించునది. దానినే గర్వము
అంటాము. ఇది ప్రతి మనిషిలోనూ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగ హెూదా ఉన్నవారు తన్నుతాను మరచిపోయి
తన హెూదాను తానుగా తలుస్తూ గర్వగుణముతో ప్రతి క్షణము నిండిపోయి ఉందురు. ఇవి పాపమును అంటగట్టు
గుణములని చాలామందికి తెలియదు. ఇక చివరి గుణము మత్సరము. దీనినే అసూయ అని చెప్పవచ్చును. ఇది
తనకు సంబంధములేని వానిమీద కూడా పనిచేస్తూ, ఇతరులను, ఇతరుల అభివృద్ధిని చూచి ఓర్వలేని తనమును
కల్గించును. ఈ అసూయ ఇతరులను చెడి పోవునట్లు, వారికి నష్టమును కష్టమును కల్గించునట్లు చేయుచున్నది.
మొత్తము ఈ ఆరు గుణములు జీవునకు శత్రువులతో సమానము. అందువలన వీటిని శత్రు గుణముల గుంపు
అన్నారు. లోపల గుణములే బయటి శత్రువులను తయారు చేయుచున్నవి. అంతేకాక ఈ ఆరు గుణములు జీవునికి
పాపమును అంటగట్టుచున్నవి.
జీవునికి శత్రు గుణములైన ఆరు గుణముల వివరము తెలుసుకొన్నాము. తర్వాత ఆరు మిత్రగుణములను
గురించి తెలుసుకొందాము. మిత్రగుణములను గురించి ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా ఇక్కడనుండే చెప్పుచున్నాము.
కావున సావధానముగా తెలుసుకోవలెనని చెప్పుచున్నాము. శత్రు గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద,
మత్సర అను గుణములకు పూర్తి వ్యతిరేఖమైనవే జీవుని మిత్ర గుణములు. ఆ లెక్క ప్రకారము కామము (ఆశ) అను
గుణమునకు వ్యతిరేఖమైన దాన గుణము మిత్ర గుణములలో మొదటి స్థానములో ఉన్నది. అదే విధముగా శత్రు
గుణములలో రెండవదైన క్రోధము (కోపము) అను గుణమునకు పూర్తి వ్యతిరేఖమైనది దయాగుణము. అట్లే లోభము
అను గుణమునకు వ్యతిరేఖమైనది ఔధార్యగుణము. మోహ గుణమునకు వ్యతిరేఖమైనది వైరాగ్యగుణము. మదము
అను గుణమునకు వ్యతిరేఖమైనది వినయము అను గుణము. చివరి మత్సర గుణమునకు వ్యతిరేఖమైనది ప్రేమ
గుణము. ఈవిధముగా జీవునకు పాపమును అంటగట్టు ఆరు గుణములకు పూర్తి వ్యతిరేఖమైన గుణములు వరుసగా
దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ గుణములు. వివరముగా వ్రాసుకుంటే కామము × దానము, క్రోధము
× దయ, లోభము X ఔధార్యము, మోహము X వైరాగ్యము, మదము × వినయము, మత్సరము X ప్రేమ. ఈ
విధముగా ఆరు శత్రుగుణములకు పోటీగా ఆరు మిత్రగుణములు గుణచక్రములో నెలకొల్పబడినవి. 1) దాన 2) దయ
3) ఔధార్య 4) వైరాగ్య 5) వినయ 6) ప్రేమలు పూర్తిగా జీవునికి పుణ్యమును చేకూర్చుచున్నవి. శత్రుగుణములు
జీవునకు పాపమును అంటగట్టితే, మిత్రగుణములు జీవునికి పుణ్యమును ఇచ్చుచున్నవి. పాపము ద్వారా కష్టములు,
పుణ్యము ద్వారా సుఖములు మనిషి జీవితములో కలుగుచున్నవి. రెండు రకముల గుణములను మాయగానే
లెక్కించుచున్నాము. మిత్ర,శత్రు గుణములతో మంచి చెడుగా కనిపించునది కూడా మాయయనియే చెప్పవచ్చును.
ఒక జీవున్ని వాని జీవితములో గుణముల మాయ కష్టసుఖములలో ముంచి దేవుని మీద ధ్యాస లేకుండా చేయుచున్నది.
జీవుడు గుణచక్రములోని ఏదో ఒక గుణభాగమునందు నివాసము చేయుచు అక్కడి గుణములతో కలిసియుండును.
మూడు గుణభాగములలో ఒక భాగము నందు నివసించు జీవుడు, మిగతా రెండు గుణభాగములలోనికి అప్పుడప్పుడు
పోయి కొన్ని నిమిషములుండి తిరిగి ముందున్న భాగములోనికే వచ్చు చుండును. జీవుడు తనపైనున్న కర్మప్రభావముచేత
కొన్ని నిమిషములపాటు ప్రక్క భాగములోనికి పోయినా, ఆ భాగములలో కూడ పన్నెండు గుణములు ఉండుటచేత
అక్కడకూడా ఆ గుణముల యోచనలు, ఆలోచనలు రావడమూ, ఆ గుణములకు సంబంధించిన పనులు జరగడమూ,
వాటికి సంబంధించిన కర్మరావడము జరుగుచున్నది. జీవుడు ఏ గుణభాగములో ఎక్కువ కాలముండునో ఆ గుణభాగము
16

Page 17
పేరును ఆ జీవునికి చేర్చి చెప్పవచ్చును. జీవుడు గుణచక్రములో నివాసమున్న చిత్రమును క్రింది పటములో చూడవచ్చును.
05
రాజస భాగములో జీవుడు.
గుణచక్రము
గుణచక్రములోని మూడు భాగములలో ఒక్కొక్క దానియందు 12 గుణముల ప్రకారము మూడు భాగములలో
మొత్తము 36 గుణములు కలవు. ఈ మాట నిజమని తెలియుటకు దేవుడు మననోటివెంట ఒక మాటను
పలికించుచుండును. ఎవడినైన ఉద్దేశించి మాట్లాడునపుడు “వానికి గంటకు ముప్పైఆరుగుణములు మారుతావుంటాయి”
అని అంటూ వుంటాము. ఒకమాట మీద నిలకడలేని మనిషిని గురించి మాట్లాడునపుడు ఈ మాట చెప్పడము
జరుగుతూవున్నది. ఈమాటను అనే మనిషికి తల లోపల గుణచక్రము, గుణముల భాగములూ, అందులో జీవుడుండుట
తెలియకుండినా అతను అలా మాట్లాడడమును చూస్తే మేము చెప్పుచున్న గుణముల విషయము సత్యమనీ, లోపలనున్న
ఆత్మే ఆవిధముగా సాక్ష్యము కొరకు పలికించినదనీ తెలియుచున్నది. గుణచక్రము బయటనుండి మొదటి భాగములోనున్న
జీవున్ని తామసుడు అంటాము. మొదటి గుణభాగము యొక్క పేరు తామసగుణ భాగము. కావున ఆ గుణభాగము
పేరే ఆ జీవునికి వర్తించుచున్నది. అట్లే రెండవ భాగములోని జీవున్ని రాజసుడు అని అంటాము. మూడవ భాగములోని
జీవున్ని సాత్వికుడు అని అంటాము. ఇక నాల్గవది మరియు మధ్యలోనిది ఆత్మభాగము, కనుక ఆ భాగములోనున్న
జీవున్ని యోగి అని అంటాము. అయితే నాల్గవ స్థానములోనికి జీవుడు రావాలంటే అతనికి ఎంతో ఆత్మజ్ఞానము
తెలిసివుండాలి. ఆత్మజ్ఞానము తెలియనిదే ఆత్మ భాగములోనికి ఎవ్వడూ పోలేడు. మూడు గుణములలో జీవుడుండుటకు
కారణము కర్మ ప్రభావమని చెప్పవచ్చును. కర్మకు అతీతమైనది ఆత్మ. అందువలన కర్మప్రకారము మధ్య భాగములోనికి
పోవడానికి వీలులేదు. జీవుని శ్రద్ధననుసరించి ఆత్మజ్ఞానము తెలిసినపుడు నాల్గవ భాగములోనికి పోవచ్చును,
యోగికావచ్చును.
గుణచక్రమును మాయచక్రము అనికూడ అనవచ్చును. ఆ చక్రములలో మూడు భాగములలోనున్న మాయను
ఒక రకముగా, నాల్గవ భాగములోనున్న మాయను మరొక రకముగా, రెండు విధముల విభజించి చెప్పవచ్చును.
మూడు భాగములలోనున్న మాయ ఎవనినైనా దేవుని మార్గము లోనికి పోకుండా, దేవుని ధ్యాస లేకుండా, దేవుని
జ్ఞానమును ఏమాత్రము తెలుసు కోకుండా చేయును. నాలుగు భాగములలో ఒకేమాయ ఆవహించి ఉండినా, ఒకే
మాయే రెండు విధముల పనిచేయుచున్నది. మూడు గుణ భాగములలోనున్న వానికి దేవుని జ్ఞానమును తెలియకుండా
చేసి, తనను దాటిపోవుట దుస్సాధ్యమనిపించును. అదే మాయే నాల్గవ భాగమైన గుణములులేని భాగములోనికి చేరిన
వానిని, వాని యోగమును కాపాడును. ఆ జీవున్ని యోగమార్గమునుండి తప్పిపోకుండా వాని యోగముయొక్క క్షేమమును
కాపాడును. దేవునికి ఇష్టుడైన వానిని, నాల్గవ స్థానములోనికి పోవుటకు ఆటంకము లేకుండా చేయును. దేవునికి
17

Page 18
ఇష్టము లేనివానిని తన గుణములను దాటనివ్వకుండా చేసి, తన మాయలోనే ముంచివేయును. దేవునికి ఎవడు
ఇష్టమైనవాడు అని అడిగితే, దేవుని మీద ఎవనికి ఇష్ట ముండునో వాడు దేవునికి ఇష్టమైనవాడని చెప్పవచ్చును.
అంతేకాక దేవుని మీద ఎవనికి ఎంత శాతము ఇష్టము (శ్రద్ధ) ఉండునో, దేవునికి కూడా వానిమీద అంతే శాతము
ఇష్టము కల్గియుండును. ఈ విషయమునే భగవద్గీతలో రాజవిద్యా రాజాగుహ్య యోగము అను అధ్యాయమున 22వ
శ్లోకమందు ఇలా అన్నారు.
అనన్యాశ్చిన్తయన్తో మాం యేజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్.
భావము : అన్యదేవతల ధ్యాస లేకుండా, ఇతరత్రాదేవతలను ఆరాధించకుండా ఎవడైతే నన్నే ఆరాధిస్తాడో,
ఎవడు నిత్యము నా ఆత్మ భాగములో నా ఆత్మతో కలిసియున్నాడో, అట్టివాని యోగము యొక్క క్షేమమును మాత్రము
నేనే వహించుచున్నాను అని అన్నాడు. నేనే వాని యోగమునకు ఎటువంటి అనారోగ్యము, ఆటంకములు కలుగకుండా
చూస్తాను అని అన్నపుడు ఆయన ప్రత్యక్షముగా ఏదీ చేయడు. ఆయన ఏమీ చేయనివాడు. పని లేని క్రియారహితుడు.
ఆయన చేస్తానని చెప్పిన పనినంత చేయునది ప్రకృతియే. ఒక భక్తునియొక్క యోగమును భంగము కాకుండా చూచునది
ప్రకృతియేనని తెలియవలెను. శరీరములో ఆత్మతో నిత్యము కలిసిన వానినీ, నాల్గవ గుణరహిత భాగములోనికి పోయిన
వానినీ, అక్కడే అదే చక్రములో స్థానము చేసుకొన్న మాయ అతని యోగమునకు ఆటంకము లేకుండా చేయును.
యోగము భంగము కాకుండ చేయును. యోగమునకు ఆటంకము కలుగజేయునది, యోగమును భంగము చేయునది
మాయయే. అదే మాయ దేవునికి ఇష్టుడైన వానికి ఏ ఆటంకము చేయదు. తన భర్తకు ఎవరు ఇష్టులో తనకు
(మాయకు) కూడా వారు ఇష్టులే అగుదురని తెలియుచున్నది. ఈ విషయమునే వేమన యోగి తన పద్యములో
వ్యక్తపరిచాడు. పద్యమును క్రింద చూడండి. ఈ పద్యము మా రచనలలో "నిగూఢ తత్త్వార్ధబోధిని” అను చిన్న
గ్రంథములోనిది.
పతియెప్పిన సతియొప్పును
పతి సతులొక్కటైన పరమ పావనమందున్
పతి సతి న్యాయమే మోక్షం
బతులిత పరమాత్మనైక్యమగురా వేమా.
భావము : పతి అనగా భర్త, సతియనగ భార్య అని అందరికి తెలుసు. పెళ్ళి అయితేనే పతి, సతులౌతారను
విషయము కూడ తెలుసు. పతి, సతులకు పిల్లలు పుడుతారని కూడ తెలుసు. ఈ విధానమంతా జ్ఞానులకు, అజ్ఞానులకు
అందరికి తెలిసినప్పటికీ చాలామందికి ఈ విషయము దైవికమైనదనీ, ఆ దైవిక విషయమే ప్రపంచములో ఇలా ప్రతి
బింబించి ఉన్నదనీ, ప్రపంచములో ప్రత్యక్షముగనున్న పతి, సతుల విధానము ను ఆధారముచేసుకొని పరోక్షముగనున్న
దైవ విధానమును అర్థము చేసుకోగలరనీ దేవుడే ఇలా ఉంచాడు. దైవికమైన పతి, సతి విధానమేదో ఇపుడు వివరించి
చూచుకొందాము.
భగవద్గీత గుణత్రయ విభాగ యోగమను అధ్యాయములో మొదటనే పరమాత్మను పతిగ, ప్రకృతిని సతిగ
చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారము జగతి మొత్తమునకు ప్రకృతి, పురుషులు సతి పతులుగ ఉంటూ ప్రతి
18

Page 19
జీవరాశికి వారే తల్లితండ్రులైనారు. ప్రపంచములోని మనుషజాతికే కాక క్రిమి, కీటక, పశు, పక్షి, వృక్షలతాదులన్నిటికి
తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అని తెలుపబడి ఉన్నది. జగతి మొత్తమునకు తల్లితండ్రులుగ ఉంటూ పతి, సతులుగ
ఒప్పు పరమాత్మ, ప్రకృతి ప్రపంచములో విభిన్నముగ ప్రవర్తించుచున్నారు. పతియైన పరమాత్మకు, సతియైన ప్రకృతి
విధేయురాలై నప్పటికీ, పరమాత్మ ఆదేశానుసారము జగతిపట్ల పరమాత్మ మార్గమైన దైవమార్గమునకు ప్రకృతియైన
మాయ ఎంతో వ్యతిరేఖముగనున్నది. దైవమార్గమును అనుసరించవలెననుకొను వాని యొక్క ఆ ప్రయత్నమును
భంగము చేసి విరమించుకొనునట్లు చేయుచున్నది. అంతయు దేవునికి తెలిసే జరుగుచున్నది. దేవుని గూర్చిన ప్రయత్నములో
మాయ ప్రభావమునకు తట్టుకొనలేక అందరూ వెనుదిరుగుచున్నారు. అయినప్పటికీ ఎన్నో లక్షల మందిలో ఏ ఒక్కడో
మాయను వ్యతిరేకించి అన్ని కష్టములకు ఓర్చుకొని దేవుని చేరుకోవాలని ప్రయత్నించుచున్నాడు. అటువంటి వానిని
దేవుడు, వాని మార్గమును సుగమము చేసి, మాయ ఆటంకమును తొలగించి, తనయందు కలుపుకొనును. బలమైన
మాయ కల్పించు పరిస్థితులన్నిటిని అనుభవిస్తు, పట్టువదలక దేవునికొరకు ప్రయత్నించు వానిని దేవుడు ఒప్పుకొనును.
దేవుడు ఒప్పుకొన్నపుడు మాయ వానిని ఆటంకపరచదు, అటువంటివాని యోగము యొక్క క్షేమమును దేవుడే పరిరక్షించును.
అపుడు వాడు దేవునియందైక్యమైపోవును.
ప్రపంచములో మాయ కలుగజేయు అనేక కష్టములను అతిక్రమించి, దేవుని మార్గమును వదలని వానిని,
దేవుడు తన మనిషిగ అంగీకరించును. అపుడు వెంటనే ప్రకృతియైన మాయ తాను వానిని ఒప్పుకొన్నదై వానికి
ఆటంకము కలుగజేయదు. కావున పై పద్యమందు పతియెప్పిన సతి యొప్పునన్నారు. ఆ విధముగ పరమాత్మ,
ప్రకృతి ఇద్దరు వానిపట్ల ఒకటై నడుచుకొన్నపుడు వాడు మోక్షమును పొందును. దానినే పద్యమందు వ్యక్త పరుస్తు
పతిసతులొక్కటైన పరమ పావనమందున్ అన్నారు. పతి, సతి ఇద్దరు ఒక మార్గమును నడుచుకోవడము న్యాయమగును.
పతికి సతి విరుద్ధముగ నడుచుకోవడము అన్యాయమగును. ప్రకృతి, పరమాత్మ భక్తుని పట్ల న్యాయమార్గమున చరించిన
భక్తునికి మోక్షము లభించును. కావున పై పద్య మందు పతి సతి న్యాయమే మోక్షము అన్నారు. పతి, సతి న్యాయముగ
చరించినపుడు భక్తుడు వెంటనే జన్మరాహిత్యము పొందును. కనుక బతులిత పరమాత్మనైక్యమగురా అన్నారు.
ప్రపంచములో ఒక భక్తునిపట్ల భార్యాభర్తలైన ప్రకృతి పరమాత్మలు మొదట అన్యాయముగ ప్రవర్తించుదురనీ
ఈ పద్యము ద్వార వేమన మనకు తెలియజేశాడు. పతి ఒప్పినపుడే సతియు ఒప్పుకొని ఇద్దరు న్యాయముగ ప్రవర్తించుదురు.
వారిద్దరు ఒకటై న్యాయముగ ప్రవర్తించినపుడే భక్తునికి మోక్షము లభించును. మాయ ఆటంకములను ఓర్చుకోలేక
నేనెంత భక్తిగ ఉన్న నాకే కష్టాలొస్తున్నవనీ, దేవునివద్ద న్యాయమే లేదనుకొన్నవాడు దేవుని మార్గములో భ్రష్టుడగును.
దేవుని గూర్చి ఏమీ అనుకోక అన్నిటికీ ఓర్చు కొన్నవాడు మొదట పరమాత్మచేత ఒప్పుదల పొంది ప్రకృతి, పరమాత్మలు
న్యాయముగ ప్రవర్తించగ భక్తుడు మోక్షము పొందును.
పతి సతుల విధానము ప్రపంచములో ప్రతిబింబించి ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. పతికి సతి వ్యతిరిక్తముగ
నడుచుకొనుట, పతిని తన మాటవినునట్లు చేసుకొనుటైన అన్యాయ విధానము భూమిమీద కలదు. అట్లే పతికి, సతి
అనుకూలముగ నడుచుకొనుట, పతి మాటయే తనమాటగ పతి చెప్పినట్లు సతి నడుచుకొను న్యాయమార్గమూ భూమిమీద
గలదు. మీ అనుభవములో న్యాయ అన్యాయ, పతి సతులను గూర్చి తెలిసినట్లయితే ఎవరైన సంపూర్ణ జ్ఞానులుకాగలరు.
దేవుని మార్గములో నడుచువారికి ఆటంకటములేర్పడిన, దేవుని దగ్గర న్యాయముందా? అని సహనము కోల్పోయి
మాట్లాడరు. ఎన్ని కష్టములొచ్చిన ఇది తల్లియైన మాయ పని అని ఎరుకకల్గి నడుచుకొందురు.
19

Page 20
దేవుడు ప్రపంచమును సృష్టించకముందు పనిచేసి, అంతటిని సృష్టించాడు. తర్వాత ఆయన క్రియారహితుడైనాడు.
సృష్టించి పాలించి అంతము చేయువాడు దేవుడే అయినా, ఆయన మూలకర్త మాత్రమే. ఆయన పనినంతటిని చేయునది
ప్రకృతి ఒక్కటేనని తెలియవలెను. దేవుడు కనిపించడు, ఆయన ఎంతటివాడో ఎవరికీ తెలియదు. అయితే ఆయన
కార్యములన్నిటిని నెరవేర్చుచున్న ప్రకృతి అందరికీ కనిపిస్తున్నది, వినిపించు చున్నది, అన్ని విధాల తెలియుచున్నది.
అయినా ప్రకృతిని కొంతవరకు అంచనా వేయవచ్చును. అంతేకానీ ప్రకృతిని కూడా పూర్తి తెలియలేము. ఆకాశము
హద్దే తెలియదు. దగ్గరున్న మేఘము యొక్క విషయమే పూర్తి ఎవరికీ తెలియదు. పొగరూపములోనున్న మేఘము
ఘనరూపములోనున్న ఎన్నో జీవరాసులను, ఎన్నో వస్తువులను, ఎన్నో నీళ్ళను, ఎన్నో జలచరము లను కనిపించకుండ
దాచియుంచుకొన్నదను విషయము ఎవరికీ తెలియదు. చిన్న మేఘము యొక్క విషయమే మనకు తెలియనపుడు
అంతపెద్ద ప్రకృతి విషయము ఎప్పటికీ తెలియలేము. ప్రకృతికంటే పెద్ద అయినవాడు, ప్రకృతికి భర్త స్థానములోనున్నవాడు
అయిన దేవుడు మాకు తెలుసు అనినా, దేవున్ని మేము చూచాము అనినా, మేము దేవుడైపోయాము అనినా
మాటలన్నిటిని విని నవ్వవలసిందే తప్ప ఏమీ చేయలేము. అలా అన్నవారిని చూచి ప్రకృతి కూడా నవ్వుకుంటుదనియే
చెప్పవచ్చును. ప్రకృతియే గుణరూపములో మాయ అను పేరుతో మనిషి శరీరములో ఉన్నది.
స్థూలముగా బయట కనిపించు ప్రకృతి, సూక్ష్మముగా కనిపించని మాయగా శరీరములో ఉంటూ, నన్నే తెలియలేని
వానివి నాభర్తను తెలియ గలవా? నన్ను దాటిపోవడమే ఎవరికీ సాధ్యముకాదే, అలాంటిది దేవున్ని చూచాను అంటావా?
అని వానికి దేవుని ధ్యాస, దేవుని జ్ఞానము తెలియ కుండా చేయును. వాని తలలో వానికి నాకు దేవుడు తెలుసునను
జ్ఞప్తినే యుంచి నాకు జ్ఞానముతో పనిలేదనుకొనునట్లు చేయును. శరీరము బయట ప్రకృతి రూపములో, శరీరము
లోపల గుణరూపములో మాయకలదు. ఈ సృష్ఠిని సృష్టించేది సృష్ఠికర్త దేవుడేకాగా, సృష్టించబడిన దానినంతటిని
నడిపించుచూ పాలించునది ప్రకృతి (మాయ). దేవుడు ఎప్పటికీ ఉండువాడే, అయితే ప్రకృతి మాత్రము దేవుని పగలు
మాత్రముంటూ, దేవుని రాత్రిలో మాత్రము అదృశ్యమై దేవునియందే అణిగిపోవును. ప్రకృతి ఉంటే జీవరాసులు వాటి
మనుగడ ఉంటుంది. జీవరాసులన్నిటిని ప్రకృతియే పాలించి, పోషించి, నడిపించుచున్నపుడు, ప్రకృతి లేని సమయములో
జీవరాసులన్ని నశించి ప్రకృతిలోనే కలిసిపోవును. సృష్ట్యాదిలో దేవుడు మొదట ప్రకృతిని మాత్రము సృష్టించాడు.
తర్వాత ప్రకృతియే అన్ని పనులు చేసి జీవరాసులనందరిని పుట్టించినది. అందువలన భగవద్గీతలో భగవంతుడు
సర్వజీవరాసులకు తండ్రి పరమాత్మ, తల్లి ప్రకృతియని చెప్పాడు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును,
అదేమనగా! దేవుడే కదా అందరిని పుట్టించినది, ఆయనే కదా సమస్తమునకు సృష్టికర్త, అలాంటపుడు దేవుడు ప్రకృతిని
మాత్రము సృష్టించగా, తర్వాత ప్రకృతియే సకల ప్రాణులను సృష్ఠించినదనీ, దేవుడు ఎవరినీ సృష్టించలేదని మీరు
చెప్పడము తప్పుకాదా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
బయటి ప్రపంచములో భార్యభర్తలను గమనించి చూస్తాము. భర్త భార్యతో సంగమించితే భార్య గర్భము
ధరించి పిల్లలనుకంటున్నది. పురుషుడు స్త్రీతో కలిసినది తెలియదు కానీ, స్త్రీ గర్భము ధరించి కొంత కాలమునకు
ప్రసవించడము అందరూ ప్రత్యక్షముగ చూస్తున్న విషయమే. పుట్టిన బిడ్డకు తండ్రి, తల్లియొక్క భర్తయే అయినా,
గర్భమును ధరించి కొంతకాలమునకు తల్లియే బిడ్డనుకంటున్నది. తండ్రి అయినంత మాత్రమున ఏ బిడ్డనూ తండ్రి
కనలేడు. బిడ్డను తల్లియే కన్నది. ఇదే మాదిరి భర్తగానున్న పరమాత్మ కర్తకాగా, సృష్ఠి కార్యమును తల్లిగానున్న ప్రకృతి
చేసినది. పుట్టిన బిడ్డకు ప్రకృతి అయిన తల్లియే పోషణనిస్తున్నది. శరీరమును గర్భములో తయారుచేసి కన్నది
20

Page 21
తల్లియేననీ, తండ్రి కర్త మాత్రమే నని తెలియాలి. ఇదే విధానము ప్రకృతి పరమాత్మ విధానములో కూడా జరుగుచున్నది.
సర్వజీవరాశులు ప్రకృతి (తల్లి) ద్వారానే పుట్టుచున్నవి. తల్లినే (ప్రకృతినే) మొదట చూస్తున్నవి. అందువలన మొదట
తల్లిమాత్రమే తెలియును. తండ్రి అయిన దేవుడు తెలియడు. సర్వజీవరాశులకు భౌతిక తల్లియే మొదట తెలియును.
తర్వాత తండ్రి తెలియును. ఒకబిడ్డ తల్లి గర్భములో పెరుగునప్పుడు, తల్లి శరీరములోని రక్తమాంసములను పంచుకొని
తయారైన శరీరముతో పుట్టుచున్నది. అలాగే ప్రకృతి గర్భములో పుట్టిన ప్రతి జీవరాశి, ప్రకృతియొక్క ఐదు భాగములను
పంచుకొని, ప్రకృతి భాగములచేత తయారైన శరీరముతో పుట్టుచున్నది. పుట్టిన ప్రతి బిడ్డకు మొదట తల్లియే తెలియుచున్నది.
తండ్రి తెలియడు. అట్లే సృష్ఠిలో తయారైన ప్రతి జీవరాసికి మొదట ప్రకృతియే కనిపిస్తున్నది పరమాత్మ కనిపించడు.
జీవరాసులకు మొదట తెలియునది స్త్రీతత్త్వమే, తర్వాత పురుషతత్త్వము తెలియును. అంతేకాక అందరూ స్త్రీతత్త్వము
నుండే పుట్టుచున్నారు. తరువాత కారణమైన పురుషతత్వము గోచరించును. ఈ సత్యమును తెలియుటకు ఎక్కడైన
ముందు స్త్రీతత్త్వమునే ఉచ్ఛరించునట్లు అమరిక చేయబడినది. జ్ఞానము తెలిసినవారు కాకపోయినా నా కర్మయని తన
చేతిని తలవైపు చూపునట్లు, ప్రకృతి పరమాత్మ విధానము తెలియకపోయినా ప్రతి మనిషి స్త్రీతత్త్వమును ముందు
ఉచ్ఛరించుచున్నాడు, తర్వాత పురుష తత్త్వమును చెప్పుచున్నాడు. ఉదాహరణకు కొన్ని మాటలను చూచిన ఈ విధముగా
గలవు. కైలాసములో పార్వతీపరమేశ్వరులు నాట్యమాడుచున్నారు, అన్నప్పుడు ఈ వాక్యములో ముందు స్త్రీతత్త్వమైన
పార్వతిని చెప్పి, తర్వాత పురుషుడైన ఈశ్వరున్ని చెప్పడము జరిగినది. అలాగే సీతారాముల వివాహము జరిగినదని
అన్నప్పుడు, ముందు సీతను చెప్పి తర్వాత రామున్ని గురించి చెప్పడము జరిగినది.
ఈ విధముగా ఎన్నో వాక్యములను చూచినప్పటికీ అందులో స్త్రీ తత్త్వమునే ముందు ఉంచి తర్వాత పురుషతత్త్వమును
ఉంచడము జరిగినది. అటువంటి కొన్ని పదములను చూస్తే ఇలా కలవు. తల్లితండ్రి, ప్రకృతి పురుషులు, భార్యాభర్తలు,
లక్ష్మీనరసింహుడు. అంతేకాక వీధిలో గంప నెత్తినపెట్టుకొని వంకాయలమ్మువాడు కూడా వంకాయలమ్మో అని స్త్రీ
పదమునే ఉపయోగించి చెప్పడము జరుగుచున్నది. ఈ విధముగా ప్రకృతి అందరికీ పరమాత్మకంటే ముందున్నదని
తెలియుచున్నది. కనిపించని దేవునికంటే ముందు కనిపించు ప్రకృతియే ఉన్నది. కావున అందరు అలా చెప్పడము
జరుగుచున్నది. ఎక్కడైనా స్త్రీ పేరును ముందు చెప్పుకోవడమునకు కారణము ఇప్పుడు కొంత అర్థమైనదనుకొంటాను.
మొదట ప్రభవములో పుట్టించినదీ ప్రకృతియే, అలాగే చివరిలో ప్రళయమందు అందరిని మరణించునట్లు చేయునదీ
ప్రకృతియే. బాగా జ్ఞాపకము పెట్టుకోవలసినదే మనగా! దేవుడు మొదట నిన్ను పుట్టించనూలేదూ, తర్వాత చివరిలో
చంపనూలేదు. అయినా అన్నిటికీ కారణభూతుడు మూలకారకుడు ఆయనే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణను
చెప్పుకొందాము.
భర్తకు విధేయతను చూపు భార్య, భార్యకు స్వతంత్రతను ఇచ్చిన భర్త, ఇరువురు కాపురము చేయుచుండగా
వారికి కొందరు మంచివారు, కొందరు చెడువారు సంతానమున్నారు. భర్త భార్యను పోషించగా, ఇంటిలోని భార్య తమ
పిల్లలకు అన్ని వసతులు కల్పించి, పిల్లల అన్ని పనులు చేయుచుండెను. ఒక ప్రక్క పిల్లలను సక్రమముగా చూచుకొంటూ,
మరొక ప్రక్క భర్తకు అనుకూలముగా అన్ని సేవలు చేయుచుండెను. రాత్రిపూట భర్త నిదురించు సమయమునకు
ముందే తమ పిల్లలను నిద్రపుచ్చుచుండెను. పిల్లల అల్లరి ఉంటే భర్తకు నిద్రపట్టదని, భర్తకు అసౌకర్యము కలుగకుండా
భర్త నిద్రకు ఉపక్రమించక ముందే పిల్లలను నిద్రపుచ్చి ఎవరినీ లేవకుండ చేయుచుండెను. అప్పుడు భార్య చేసిన
పనికి భర్త మెచ్చినవాడై, ఏ దిగులు లేకుండా నిద్రించుచుండెను. ఇదే విధముగనే ప్రకృతి భార్యగా, పరమాత్మ
21

Page 22
భర్తగావుంటూ విశ్వమను గృహములో కాపురము చేయుచున్నారు. భర్తయిన పరమాత్మ ఏదీ పట్టించుకోకుండా
సంసారముతో సంబంధములేనట్లు ఉన్నాడు. భార్య అయిన ప్రకృతి తమ సంతానమైన జీవరాసులను అన్నీ తానై
చూచుకొంటున్నది. పిల్లల యొక్క అన్ని పనులను ప్రకృతియే చూచుకొంటు పరమాత్మకు ఏ సంబంధములేనట్లు
పిల్లలను పోషించుచున్నది. భర్త ఇంటికి వచ్చి నిద్రపోయే సమయానికి అనగా పరమాత్మకు రాత్రి సమయము వస్తూనే
సకల జీవరాశులను ప్రకృతియే నిద్ర పుచ్చినట్లు లేకుండా చేయుచున్నది. ప్రకృతి తన సంతానమైన జీవరాసులను
అవ్యక్తము చేయుచున్నది. ప్రకృతి ప్రళయమును సృష్టించి జీవరాసులను అంత మొందించుచున్నది. ప్రళయములో
చనిపోయిన జీవులు తర్వాత జన్మకు పోకుండా అవ్యక్తముగా ఉండిపోవుదురు. దేవుని రాత్రిలో ప్రపంచము ఉండదు.
కావున మొదట ప్రకృతిలో పుట్టిన జీవరాసులన్ని చివరిలో ప్రకృతి లోనే చనిపోయి ప్రకృతిలోనే అణిగిపోవుచున్నవి.
ప్రళయములో జీవరాసు లన్ని ప్రకృతిలో కృశించిపోయి కనిపించకుండా పోతున్నవి. కానీ పూర్తి నాశనమైపోలేదు.
చనిపోయిన జీవులందరూ అవ్యక్తముగా ఉండాలంటే ప్రకృతి కూడా అవ్యక్తమైపోవాలి. కావున వేయియుగముల
కాలము దేవుని పగలు అయిపోయిన వెంటనే దేవుని రాత్రి మొదలవు సమయములో ప్రకృతి కూడా లేకుండా
కనిపించకుండా పోవుచున్నది. ప్రళయములో ఉన్నవి లేకుండా పోవుచున్నవి. అంతేకానీ పూర్తిగా నాశనమై పోయాయి
అనుకోకూడదు. ఏ జీవరాశి నాశనమైనా అది దేవునిలోనికి ఐక్యము కావలసివుంటుంది. ప్రళయము పొందిన జీవులు
తిరిగి ప్రభవములో పుట్టవలసిన పని ఉన్నది. కావున వ్యక్తముగానున్నవి అన్నీ అవ్యక్తముగా మార్పు చెందుచున్నవి,
పూర్తి లేకుండా పోలేదు. ఈ ప్రళయము ఒక విధముగా జీవునికి తాత్కాలిక మరణములాంటిదని చెప్పవచ్చును.
దేవునియొక్క పగలు కాలము వేయియుగములనీ, అట్లే రాత్రికాలము వేయియుగములని చెప్పుకొన్నాము.
దేవుని పగలు వేయియుగములు గడిచి పోయిన తర్వాత ప్రళయము జరిగి జీవరాశుల శరీరములన్నీ నాశనమై పోవుచున్నవి.
జీవులు మాత్రము మరణమును పొంది ప్రకృతిలోనే అణిగి పోవుచున్నారు. దేవుని రాత్రి వేయియుగములు పైన
ఆకాశముగానీ, క్రింద భూమిగానీ మధ్యలో గాలిగానీ, నీరుగానీ, నిప్పుగానీ ఏవీ ఉండవు. మనముందరున్న శూన్యము
కూడా ఉండదు. అటువంటి స్థితి ఎలా ఉండునో ఊహించుటకు కూడా వీలుకాదు. ఆ స్థితిని ఏ విధముగా కూడా
పోల్చుకోలేము. అటువంటి సమయములో మిగిలి ఉన్నది ఒకే ఒక పరమాత్మ. దేవుని రాత్రి వేయియుగములు
అయిపోయిన తర్వాత తిరిగి ప్రభవము మొదలగును. ప్రభవము అనగా తిరిగి సృష్ఠి ప్రారంభమగును. అప్పుడు
మొదట ప్రకృతిలోని పంచభూతములు అవ్యక్తమునుండి వ్యక్తము లోనికి వచ్చును. ప్రకృతి యొక్క పనివలన అంతవరకు
లేని జీవులు తిరిగి శరీరము ధరించి జన్మ తీసుకొని జీవితములను తిరిగి ప్రారంభింతురు. అదియే దేవుని పగలు
కాలము. ప్రకృతి చేత జరుగు ప్రళయముగానీ, ప్రభవముగానీ ఒక్క క్షణములో, ఒక్కమారుగా ఏదీ జరుగదు. ప్రళయము
జరుగునపుడు కొంత సమయము పట్టును. అలాగే తిరిగి జీవరాసులు అన్నీ పుట్టుటకు కూడా కొంత సమయము
పట్టును. దానినే ప్రళయ ప్రభవముల సంధికాలము అని అంటాము. దినమునకు సంధికాలమున్నట్లే ప్రళయమునకు
కూడా సంధికాలము కలదు. దినమునకున్న సంధి కాలమును సంధ్యకాలము అని అంటున్నాము. పూర్వము సంధికాలము
అనెడిమాట నేటికి సంధ్యవేళ అయికూర్చున్నది. ఒకరికొకరు కలుసు కొనుటను సంధి అంటాము. అలాగే రాత్రి
పగలు కలుసుకొను కాలమును సంధి కాలము అంటాము. సాధారణముగా తెల్లవారిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొ
విధముగా ముందూ వెనకా లేచినట్లూ, అలాగే రాత్రివేళ ముందువెనకా పడుకొన్నట్లు ప్రళయము యొక్క సంధ్య
(సంధి) కాలములో ముందు వెనకా జీవుడు లేకుండా పోవుట జరుగుచున్నది. అలాగే ప్రభవము యొక్క సంధ్య
కాలములో ముందు వెనుక పుట్టడము జరుగుచున్నది. ప్రళయ ప్రభవముల సంధ్యకాలము అందరికీ ఉన్నవని తెలియవలెను.
22

Page 23
మొట్టమొదట ప్రభవము లేక సృష్ఠి దేవుని చేత సృష్ఠించబడినపుడు ఆదివారముతోనే మొదలగును. అట్లే
ఇప్పుడు ఎన్ని కల్పములు మారినా మొదటి పగలు ఆదివారముతోనే ప్రారంభమగును, దానిలో ఏ తేడా ఉండదు. అట్లే
సృష్ఠి ప్రారంభము కృతయుగముతోనే మొదలగును. అలా ప్రారంభమైన మొదటి దినమును యుగాది అనడము
జరుగుచున్నది. యుగాది అనగా యుగము యొక్క ఆదిలో వచ్చు దినమని అర్ధము. యుగాది ఆదివారముతోనే
మొదలైనది. యుగమును సంవత్సరములతోనే లెక్కించు చున్నాము. అందువలన సంవత్సర మొదటి దినమునకు
యుగాది అని పేరు పెట్టాము. అయితే ధర్మములు అధర్మములుగా మారినట్లు, ఇందూ అను పదము హిందూ అను
పదముగా మారిపోయినట్లు, యుగాది అను పదమును నేడు ఉగాది అని ఉచ్చరించడమూ, వ్రాయడమూ జరుగుచున్నది.
హిందూ అను శబ్ధము అర్థము లేనిదైనా, ఇందూ అను శబ్దము అర్థముతో కూడుకొన్నదైనా, చెప్పినా వినకుండా మేము
హిందువులమే అని కొందరు మొండిగా అనినట్లు, ఉగాది అను శబ్దము అర్థములేనిదని చెప్పినా వినకుండా ఉగాదిగానే
చెప్పుచున్నారు. హిందూ (ఇందూ) ధర్మరక్షకులము అని పేరుపెట్టుకొన్న వారే ఏమాత్రము జ్ఞానమును ధర్మములను
తెలియనివారై మొండిగా మాట్లాడుచున్నారు. ధర్మము ప్రకారము పూర్వము హిందువు లందరూ ఇందువులుగా,
ఉగాదిని యుగాదిగా పిలిచెడివారు.
ప్రభవము మొదలుకొని ప్రళయము వరకు జీవరాసుల జీవన విధానమునంతటిని ప్రకృతియే తన పర్యవేక్షణలో
పెట్టుకొని చూస్తున్నది. దేవున్ని మాత్రము అన్నిటికి మూలపురుషుడని చెప్పవచ్చును. కానీ ఎక్కడా దేవునిపాత్ర కనిపించదు.
ఒక మనిషి జీవితములో జ్ఞానముగానీ, అజ్ఞానము గానీ, జనన మరణములనుగానీ, మోక్షమునుగానీ స్వయముగా
ప్రకృతియే ఇచ్చుచున్నది. ఇది కొందరికి విచిత్రముగా తోచినా ముమ్మాటికి సత్యము. ఆ విధమైన అధికారమును
దేవుడే ప్రకృతికి ఏర్పరచాడు. దేవుడు ఏ లెక్కకు దొరకడు. ఆయన తెలిపిన ధర్మములకు మాత్రమే ఆయన తెలియును.
దేవుని ధర్మములను ఆధారము చేసుకొని ప్రవర్తించువానికి మాత్రమే ముక్తి (మోక్షము) లేక పరలోకము లభించు
అవకాశము కలదు. దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన మాటలనుబట్టి వేయియుగముల కాలము దేవునికి ఒక
పగలనీ, రెండువేల యుగముల కాలము ఒక దినమని తెలిసినది. అయితే ఆయన ఆయస్సు ఎవరికీ తెలియదు.
యోచించి చెప్పితే ఆయనకు ఆయుస్సు అనునదే లేదు. ఎందుకనగా! ఆయన కాలస్వరూపుడు. కాలము అన్నిటిని
హరించునది, కానీ తాను హరించ బడునదికాదు. అందువలన ఆయన తన మాటలలో తనను అవ్యయునిగా చెప్పాడు.
వ్యయము అనగా నాశనము అనీ, అవ్యయము అనగా నాశనము లేనిదని అర్ధము. కావున ప్రకృతిలెక్కలోని 108 కోట్ల
సంవత్సరములు ఆయనకు ఒక పగలుగా, 108 కోట్ల సంవత్సరములు ఒక రాత్రిగా లెక్కించబడుచున్నది. ఇది ప్రకృతి
వైపునుండి చెప్పబడు లెక్కేగానీ, దేవునివైపు నుండి చెప్పునది కాదు. దేవుడు ఎప్పుడూ అవ్యయుడే మరియు అవ్యక్తుడే.
ఇప్పుడు దేవునికి ఒక పగలు కాలమైన 108 కోట్ల సంవత్సరము లను ప్రకృతివైపునుండే చూచి, ఎలా అంత
కాలము పగలుగా లెక్కించబడు చున్నదో తెలుసుకోవాలి. ప్రకృతిని బాగా తెలుసుకొంటే ప్రకృతి రెండు భాగములుగా
ఉన్నది. ఒకటి చరప్రకృతి, రెండు అచరప్రకృతి అను పేర్లతో గలవు. జీవరాసుల శరీరములుగా ఉండు ప్రకృతిని
మార్పు చెందు ప్రకృతియనీ, దానినే చర ప్రకృతియనీ చెప్పవచ్చును. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను
పంచభూతములుగా మనకు కనిపించు ప్రకృతిని మార్పుచెందని ప్రకృతియనీ, దానినే అచర ప్రకృతియనీ చెప్పవచ్చును.
అచర ప్రకృతియైన పంచభూతములు ప్రపంచములో చర ప్రకృతియైన శరీరములను ధరించిన జీవరాసులు బ్రతుకుచున్నవి.
అచర ప్రకృతిని అనుసరించి రాత్రి పగలు ఏర్పడుచున్నవి. చరప్రకృతిలోని జీవుడు రాత్రి పగలుకాలములో
23

Page 24
బ్రతుకగలుగుచున్నాడు. కర్మబంధములో చిక్కుకొన్న జీవున్ని శరీరము బయట అచరప్రకృతీ, శరీరము లోపల చరప్రకృతీ
ఆడించుచున్నవి. జ్ఞానము కావలసినది జీవునికి, మోక్షము కావలసినది జీవునికి, కావున దైవత్వమును తెలియవలసినవాడు
జీవుడే. ఇపుడు బయట ప్రకృతిలోని దినములను, సంవత్సరములను, యుగములను తెలియాలంటే జీవుడు లోపల
ప్రకృతినుండే తెలియవచ్చును. శరీరముగానున్న ప్రకృతిని విభజించితే పంచభూతములుగా విడిపోవుచున్నది. కావున
అది బయటి ప్రకృతిగానే తెలియుచున్నది. శరీరము మొత్తము చర ప్రకృతియే అయినా అందులోని భాగములు కూడా
పంచభూతములేనని తెలిసిపోయినది. పంచభూతములుగా కాకుండా మాయరూపముగానున్న ప్రకృతి జీవునకు
దగ్గరగానున్న ప్రకృతియని చెప్పవచ్చును. మాయరూపములోనున్న ప్రకృతి పంచభూతములుగా విభజింపబడక, ద్వాదశ
గుణములుగా విభజింపబడు చున్నది. ప్రపంచరూపములోనున్న అచర ప్రకృతి, శరీర రూపములోనున్న చర ప్రకృతి
రెండు పంచభూతములుగా విభజింపబడితే, మాయగా రూపాంతరము పొందిన ప్రకృతి మాత్రము పన్నెండు గుణములుగా
తెలియు చున్నది. లోపల పన్నెండు గుణములందే జీవుడు జీవించుచున్నాడు. అలాగే బయట మనిషి పంచభూతముల
ప్రపంచములోనే జీవించుచున్నాడు. తలలోగల గుణచక్రములోనే జీవుడు శాశ్వితముగా ఉంటున్నాడు. అలాగే బయట
మనిషి శాశ్వితముగా ప్రపంచములోనే బ్రతుకుచున్నాడు. ఎన్ని జన్మలు మారినా జీవుడు గుణచక్రమును వదలి
పోకుండా అక్కడే ఉన్నాడు. అట్లే ఎన్ని జన్మలు ఎత్తినా బయట మనిషి శాశ్వితముగా ప్రపంచములో ఉంటున్నాడు.
లోపల జీవుడు శరీరములు మారినా గుణ చక్రమును వదలిపోలేడు. అలాగే బయట మనిషి ఎన్నిమార్లు మరణించినా
అన్నిమార్లు ప్రపంచములోనే పుట్టుచు ప్రపంచమును వదలిపోలేడు. అందువలన బయట ప్రపంచములో 108 కోట్ల
సంవత్సరములు జీవనము సాగించుటకు లోపలే మూలమున్నట్లు తెలియుచున్నది. బయట ప్రకృతిలో మనిషిగానో,
జంతువుగానో ఇంకా ఏదో ఒక రకముగానో బ్రతుకుచున్న వాడు లోపల జీవునిగా మాయ అనబడు గుణములలో
బ్రతుకుచున్నాడు. కావున బయటి ప్రకృతికీ, లోపల మాయకూ సంబంధమున్నట్లు, బయట ప్రకృతి ఆయుస్సుకు
లోపల మాయ ఆయుస్సుకు సంబంధమున్నదని చెప్పవచ్చును. అన్నిటికీ లోపలే మూలమున్నదను సూత్రము ప్రకారము,
“ఊర్ధ్వమూల” అను గీతావాక్యము ప్రకారము పైన తలలోనే ప్రకృతి ఆయుస్సు కలదని అర్థమగుచున్నది. ప్రకృతి
ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములు దేవుని పగలు (కాలముగా) చెప్పుకొన్నాము. ఇప్పుడు లోపల గల ప్రకృతి
ఆయుస్సును గురించి పరిశోధించి తెలుసుకొందాము.
ప్రతి మనిషి యొక్క తలమధ్య భాగములో పాలభాగమునకు (నుదుటికి) సమానముగానున్న నాల్గుచక్రముల
సముదాయములో క్రింది చక్రము గుణచక్రము. ఆ గుణచక్రము నాలుగుభాగములుగా ఉన్నది. అందులో బయటనుండి
మొదట మూడు భాగములు గుణములతో నిండి యున్నవి. ఒక్కొక్క భాగమునందు పన్నెండు గుణములున్నట్లు తెలుసు
కొన్నాము. అందులో ఆరు చెడుగుణములూ, ఆరు మంచిగుణములని కూడా తెలుసు. ఇప్పుడు దేవుని ఒక పగలుకాలము
ప్రకృతి యొక్క ఆయుస్సుగా చెప్పుకొంటున్నాము కావున ఆ వివరమును తెలుసుకొనుటకు దేవునివైపునుండి దేవుని
సంఖ్యగా చెప్పబడుచున్న తొమ్మిది (9) సంఖ్యను తీసుకొందాము. అలాగే తలలోని మాయవైపునుండి గుణముల యొక్క
పన్నెండు (12) సంఖ్యను తీసుకొందాము. ఇపుడు 12 గుణములను 9 సంఖ్యతో గుణించుతాము. అలా గుణించగా
మొత్తము 108 సంఖ్య వచ్చినది. 12x9=108 ఈ విధముగా పన్నెండు గుణములు భాగించడము లేదు, గుణించబడినాయి.
దేవుని సంఖ్యచేత గుణించబడునవి కావున వాటికి గుణములని పేరు వచ్చినది. ఈ విధముగా ఎప్పటికైన దేవుని
సంఖ్యచే మాయ సంఖ్య గుణంచబడవలెనని ముందుగానే మాయ భాగములోని పన్నెండు భాగములకు 12 గుణములని
24

Page 25
పేరు పెట్టబడినదని అర్థము చేసుకోవలెను. ఏక సంఖ్యలో పెద్దది తొమ్మిది (9). తొమ్మిదిని దేవుని సంఖ్యగా ఎందుకు
పోల్చుచున్నామో బాగా అర్థము కావాలంటే మా రచనలలోని “సృష్టికర్త కోడ్ 963” అను చిన్న గ్రంథమును చదవవలెను.
గుణభాగములోని ఒక గుణము తొమ్మిది భాగములుగా విభజింపబడి, తొమ్మిది భాగములు సమానముగా లేకుండా
తొమ్మిది సంఖ్య ఒకటినుండి ఎలా పెద్దయినదో అలాగే తొమ్మిది భాగములు ఒకటి చిన్నదిగా ఉంటూ దాని తర్వాత
రెండవది మొదటి దానికంటే కొద్దిగా పెద్ద పరిమాణములో ఉండి, తర్వాత మూడవది రెండవదానికంటే పెద్దదయి,
తర్వాత నాల్గవది మూడవదానికంటే పరిమాణములో కొంత పెరిగియున్నది. ఇలా ఒకదాని కంటే ఒకటి పెద్దదవుచు
చివరకు తొమ్మిదవ భాగము మిగత ఎనిమిదికంటే పెద్దగా ఉన్నది. ఈ విధముగా 12 గుణములు 9 భాగములుగా
విభజింప బడి వరుసక్రమముగా చిన్నవి, పెద్దవి ఉన్నవి. గుణచక్రములో శత్రు గుణములు ఆరు ఉండగా, ఆరు మిత్ర
గుణములున్నవి కదా! ఒక శత్రు గుణము ప్రక్కనే దానికి వ్యతిరేఖమైన మిత్రగుణము, దానికి వ్యతిరిక్త దశలో
చీలిపోయివున్నది. అరిషట్ వర్గ గుణములకు వ్యతిరేఖముగా మిత్ర షట్ వర్గ గుణములు ఎలా చీలియున్నవో క్రింది
పటములో చూడవచ్చును.
xxx
అరిషట్వర్గ గుణములు
మిత్రషటవర్గ గుణములు
గుణచక్రము
XX
శత్రుగుణములు ఆరు (6) ఒక్కొక్కటి తొమ్మిది (9) భాగములుగా విడిపోగా శత్రుగుణములు అన్నీ కలిపి
మొత్తము 54 అయినవి. అట్లే మిత్రగుణములు ఆరు (6), అన్నీ తొమ్మిది భాగములుగా విడిపోగా మిత్ర గుణములు
మొత్తము 54 అయినవి. దీనిప్రకారము ఒక భాగములోని చీలిపోయిన మొత్తము గుణముల సంఖ్య 108 అని
తెలిసిపోయినది. ఉదాహరణకు కోపము (క్రోధము) అను గుణమును తీసుకొని చూస్తే కోపము చిన్న కోపము నుండి
పెద్ద కోపము వరకు తొమ్మిది భాగములుగా చీలిపోయి ఉన్నది కదా! జీవుడు కోపగుణముతో చేరినప్పుడు బయట
మనిషి కోపముతో ఉన్నట్లు కనిపించును. లోపల కోపము యొక్క పెద్ద భాగము జీవునికి తగులుకొంటే మనిషి
విపరీతమైన పెద్దకోపమును పొందివుండును. మధ్య రకము కోపమును గుణచక్రములో తగులుకొంటే ఒక రకమైన
ఎక్కువ కోపముకంటే కొంత తక్కువ కోపము మనిషిలో కనిపించును. తొమ్మిది భాగములలో అన్నిటికంటే చిన్న
కోపమును లోపల జీవుడు తగులుకొంటే బయట మనిషిలో కొద్దిమాత్రము కోపము కనిపించును. పెద్దదైన కోపము
నకు చిన్నదైన కోపమునకు ఎంతో తేడా బయటి మనిషిలో కనిపించును. ఇదే విధముగా మనిషి అన్ని గుణములను
హెచ్చుతగ్గులుగా పొందుచున్నట్లు ప్రత్యక్షముగా బయట కనిపిస్తున్నది. ఈ విధముగా ఒక గుణ భాగములోని జీవుడు
108 రకముల గుణములను పొందుచు బయట వాటి ప్రభావమునకు లోనగుచున్నాడు. 108 రకముల గుణముల
కార్యములు ప్రత్యక్షసాక్ష్యముగా బయట కనిపిస్తున్నవి. వీటిని ఎవరూ కాదనలేరు.
25

Page 26
బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము, ఏక సంఖ్యలో బ్రహ్మ అయినది తొమ్మిది (9). అందువలన దీనిని దేవుని
సంఖ్యంటున్నాము. బహు సంఖ్యలో పెద్దది కోటి కోటిని కూడ దేవుని సంఖ్యగా గుర్తించడము జరిగినది. ఏక సంఖ్య
అయిన 9, 12 గుణములను గుణించి 108 చేసినది. ఇక బహు సంఖ్యలోని కోటి (1,00,00,000) ముందే 9 చే
గుణించబడి 108 భాగములైన గుణములను బహుసంఖ్యలో పెద్దదైన (దేవుని సంఖ్య అయిన) కోటితో గుణించితే
మొత్తము 108,00,00,000 సంఖ్య వచ్చినది. 108,00,00,000 సంఖ్యను కాలములో పెద్దదైన మరియు ఆత్మ
గుర్తయిన సంవత్సరమునకు జోడించడము జరిగినది. అలా జోడించగా 108 కోట్ల సంవత్సరములైనవి. సంవత్సరము
ఆత్మ గుర్తన్నాము కదా! ఎలా చెప్పగలిగారని ఎవరైనా అడిగితే వారికి మేము చెప్పునదేమనగా! సంవత్సరములకు
అరవై పేర్లుండడము ముందే చెప్పుకొన్నాము. అందులో ప్రతిపేరు ఆత్మ గొప్పతనమును, ఆత్మ విధానమును తెలుపునదిగా
ఉండును. ఉదాహరణకు సర్వధారి అనునది సంవత్సరముల వరుసలో 22వది అయితే దాని అర్థమును చూస్తే
సర్వధారి అనగా సర్వ శరీరములను ధరించి యుండునది అని అర్థముకలదు. సర్వమును ధరించియుండునది ఒకే
ఒక ఆత్మ మాత్రమే. అందువలన ఆపేరు ఆత్మ ధర్మమును, విధానమును గుర్తు చేయునదిగా చెప్పవచ్చును. అలాగే
మిగత అన్ని పేర్లు కూడ ఆత్మ విధానమును, సామత్యమును, ధర్మమును తెలుపునవై ఉన్నవి.
మొదట ప్రకృతి జనిత గుణములను, దైవము గుర్తయిన ఏకసంఖ్య అయిన తొమ్మిది (9)చే గుణించగా 108
సంఖ్యవచ్చినది. అప్పుడు బహుసంఖ్యలో పెద్దదయిన కోటి సంఖ్యతో 108 సంఖ్యను గుణించగా 108,00,00,000
సంఖ్య అయినది. అప్పుడు ఆత్మధర్మమును సామత్యము ను చూపు సంవత్సరముతో కలుపగా 108 కోట్ల
సంవత్సరములైనవి. ఆత్మ దేవుని చేత సృష్ఠించబడినది కావున ఆత్మ పరమాత్మకు (దేవునికి) వత్స అగును. “వత్స”
అనగా కుమారుడు అని అర్థము. “సం” అనగా మంచి అని అర్థము. సంవత్సరము అనగా కుమారుడని అర్థము.
మొత్తానికి మంచి కుమారుడు అని అర్థము. దేవుని సృష్ఠిలో మొదట పుట్టినది స్త్రీ స్వరూపమైన ప్రకృతి. తర్వాత
పురుషస్వరూపమైన ఆత్మను పుట్టించాడు. ప్రకృతి ఆత్మలు అక్క తమ్ముడు అని అర్థము చేసుకోవలెను. తర్వాత ప్రకృతి
పరమాత్మలకు పుట్టినవాడు జీవాత్మ. ఆ లెక్క ప్రకారము జీవునికి ప్రకృతి తల్లికాగా, ఆత్మ మేనమామ అగుచున్నాడు.
దేవునికి మంచి పుత్రుడుగా, అక్షయునిగా పేరు గాంచిన వానిని సంవత్సరము అంటున్నాము. 108 కోట్ల సంఖ్యను
సంవత్సరములలో కలుపగా 108 కోట్ల సంవత్సరము లైనది. 108 కోట్ల సంవత్సరములు దేవుని పగలుగా గుర్తించారు.
జరగుచున్న కాలములో సర్వశరీరములను ధరించిన ఆత్మ ఆ శరీరములలోనున్న జీవాత్మను వాని కర్మానుసారము
ఆడించి నడిపించుచున్నది. ఆత్మ శరీరమును ధరించియుండి ఆ శరీరములోని జీవున్ని కర్మ ప్రకారము కష్టసుఖములను
అనుభవించునట్లు చేయుచున్నది. మాయ గుణములను ఉపయోగించుకొని కర్మప్రకారము ఖచ్చితముగా జీవున్ని
నడిపించునది ఆత్మ. అయితే అది ప్రకృతి గుణములను ఎంతకాలము వాడుకోవాలి, ఎంతకాలము జీవున్ని వెంటవుండి
నడిపించాలి అను ప్రశ్న వస్తే దానికి సమాధానము 108 కోట్ల సంవత్సరములని చెప్పవచ్చును. మాయరూపములో
గుణములూ, దేవుని ప్రతినిధిగా ఆత్మ శరీరములో పని చేయడము వలన, జీవాత్మ, మాయ మరియు ఆత్మల నడుమ
చిక్కుకొని బ్రతుకుచున్నాడు. వారు ఇద్దరు అక్క, తమ్ముడు కాగా జీవునికి మాత్రము అమ్మ, మామ అగుదురు. మాయ
ఆత్మ ఆధ్వర్యములో జీవాత్మ 108 కోట్ల సంవత్సరములు మనుగడ సాగించాలి. 108 కోట్ల సంవత్సరములలో మనిషి
ఎన్నో జన్మలు ఎత్తవలసినదే, ఎన్నో శరీరములు ధరించవలసినదే! అమ్మ, మామలను వదలి తండ్రిని చూడాలని,
తండ్రివద్దకు పోవాలని ప్రయత్నించడమే నిజమైన దైవమార్గమగును.
26

Page 27
మనిషి బయట ప్రపంచములోని ధ్యాసలో పడిపోయి, నేనెవరని గానీ, నేను శరీరములో ఎక్కడున్నాను? అని
గానీ, తనను నడిపించువారు ఎవరనిగానీ ఏమాత్రము యోచించడములేదు. ఇంతవరకు మనము చెప్పుకొన్న లోపలి
విధానము మనిషికి తెలియకుండా పోయినది. అందువలన తనకు మరణములో శరీరములు మారుచున్నవనీ, తాను
మాత్రము ఇదే భూమిమీద సృష్ట్యాదినుండి జీవితమును సాగించుచున్నాననీ తెలియలేక పోయాడు. అంతేకాక తాను
శరీరములో గుణముల మధ్యలో చిక్కుకొని ఉన్నానను విషయమును ఏమాత్రము తెలియలేకున్నాడు.
తెలియనంతవరకు జన్మలనుండి బయటపడాలంటే వీలుకాదు. గుణ చక్రములో గుణముల మధ్యలోనున్న జీవుడు
వాటి బంధమునుండి బయటపడుటకు విశేషమైన దైవజ్ఞానము కావాలి. దైవజ్ఞానము తెలియకపోతే 108 కోట్ల
సంవత్సరములు ఏదో ఒక శరీరములో బ్రతుకుచూ జీవితమును సాగించవలసిందే. ప్రపంచ ఆయుస్సు 108,00,00,000
సంవత్సరములనీ అదే కాలము దేవునికి ఒక పగలనీ తెలిసినది కదా! సృష్టి ప్రారంభమై ఎంత కాలమైనదని అడిగితే,
దానికి సమాధానము ఈ విధముగా గలదు. ఇది ప్రశ్నే అయినా మనకది అనవసర ప్రశ్న అగుచున్నది. మనకు
అవసరమైనది మన భవిష్యత్తు మాత్రమే. మనము కర్మనుండి విడుదల పొంది, దేవునియందు చేరిపోవడానికొరకు
పుట్టాము. జరుగబోవు కాలమును వినియోగించుకోవాలి. కానీ జరిగిపోయిన కాలమును గురించి విచారించుట వ్యర్థమైన
పనియగును. ఒకవేళ అట్లు విచారించినా సరియైన జవాబు దొరుకునా అని చూస్తే, అలా సత్యమైన జవాబు దొరుకుతుందని
నమ్మకము లేదు. మనము సృష్ట్యాదినుండి ఉన్నాము. అప్పటినుండి జరిగిన కాలములో జీవించాము. అయితే
మరణము తర్వాత ఆ జీవితములోనిదంతా జ్ఞాపకము లేకుండా పోవుచున్నది. తెలియకుండా పోయిన కాలమును
గురించి ఎవరూ చెప్పుటకు వీలులేదు. ఒకవేళ ఎవరైన చెప్పినా అది సత్యమగుటకు అవకాశము తక్కువ. కొందరు
జరిగిపోయిన కాలమును గురించీ, జరుగబోవు కాలమును గురించీ, మొత్తము సృష్ఠి కాలమును గురించి అసత్య
ప్రచారము చేయువారు కలరు. అటువంటి సమాచారము శాస్త్రబద్దము కాదు. అందువలన అది సత్యదూరమగును.
ప్రస్తుతము ప్రచారములోనున్న ఒక దానిని ఉదహరిస్తాను చూడండి. అది సత్యమో అసత్యమో మీరే యోచించి
నిర్ణయించుకోండి.
కృతయుగము
త్రేతాయుగము
ద్వాపరయగము
కలియుగము
నాలుగుయుగముల మొత్తము
II
II
|| || ||
సంవత్సరములు
17,28,000
12,96,000
"
8,64,000
"
4,32,000
"
43,20,000
సంవత్సరములు
నాలుగు యుగములను కలిపి ఒక మహాయుగము అంటారు, నాలుగు మహాయుగముల 71 మార్లు గడిస్తే ఒక
మన్వంతరమని అంటారు.
43,20,000×71=30,67,20,000 సంవత్సరములు ఒక మన్వంతరము.
ఇప్పటికి ఆరు మన్వంతరములు గడచి ఏడవ మన్వంతరములో 27 మహాయుగములు అయిపోయి, 28వ
మహాయుగములో కలియుగము 5145 వ సంవత్సరము జరుగుచున్నది అన్నారు. దాని ప్రకారము ఇప్పటికి
గడచిన కాలము = 196,08,53,145 సంవత్సరములు
జరుగవలసిన కాలము = 235,91,46,855 సంవత్సరములు సృష్ఠివుండే మొత్తము కాలము
=
432,00,00,000 సంవత్సరములు
27

Page 28
ఇక్కడ ఇతరులు చెప్పినది గమనిస్తే నాలుగుయుగముల కాలము అంతయు సరిపోయినది. నాలుగు యుగములను
ఒక మహాయుగము అని అనడమూ సరిపోయినది. 71 మహాయుగములు ఒకమన్వంతరము అనడము అశాస్త్రీయమైనది.
భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగములో 17వ శ్లోకమున వేయియుగములు బ్రహ్మకు (దేవునికి) ఒక పగలు అని భగవంతుడు
చెప్పగా, ఇతరులు నాలుగుయుగములను కలిపి ఒక మహాయుగమని చెప్పడమూ, అటువంటి మహాయుగములు వేయి
జరిగితే దేవునికి ఒక పగలని చెప్పడము పూర్తి అసత్యమైనమాట. అంతేకాక భగవద్గీతలో భగవంతుడు చెప్పినమాటకు
పూర్తి వ్యతిరేఖమైన మాటయగుచున్నది. అందువలన మన్వంతరము అనుమాట అశాస్త్రీయము అని చెప్పుచున్నాము.
భగవంతుడు చెప్పినట్లు సృష్టిమొత్తము కాలము 108 కోట్ల సంవత్సరములు కాగా దానికి నాలుగింతలు 432 కోట్ల
సంవత్సరములని చెప్పడము విడ్డూరము. ఇప్పటికి 196,08,53,145 సంవత్సరములు గడచిపోయాయని చెప్పడము
కూడా విచిత్రము. సృష్ఠికాలము దేవుడు చెప్పిన ప్రకారము 108 కోట్ల సంవత్సరములు కాగా, ఇప్పటికే 196 కోట్ల 8
లక్షల 53 వేల 145 సం॥ అయిపోయాయి అనడము పూర్తి తప్పగును. అందువలన ఎంత జరిగినది అను దానిమీద
ధ్యాసలేకుండా, జరుగబోయే కాలములో దేవుని జ్ఞానముమీద, దేవుని ధర్మము మీద ధ్యాస కల్గియుండడము మంచిది.
ఇప్పుడు కొందరు నన్నొక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! దేవుని జ్ఞానమును గురించి దేవుని ధర్మమును గురించి
మీరు చెప్పడము మంచిది కదా! అట్లు కాకుండా కలియుగము అని పేరుపెట్టి మీరెందుకు చెప్పుచున్నా రని అడుగవచ్చును.
దానికి మా జవాబు ఇలాకలదు.
మేము దేవునికి సంబంధించిన జ్ఞానమును తప్ప మిగతా దానిని చెప్పమనియే చెప్పుచున్నాము. ఇప్పుడు
చెప్పు కలియుగము అను సమాచారము కూడా దేవునికి సంబంధించిన జ్ఞానమేనని చెప్పుచున్నాము. మేము జరిగిపోయిన
కాలము మీద ధ్యాస లేకుండా, జరుగబోయే కాలములో దేవుని మీద ధ్యాసనుంచండి అని చెప్పాము. దేవుడే
కాలస్వరూపుడైనపుడు కాలమును గురించి తెలుసుకోవడము ముఖ్యమే అగును. అయితే ఎంతకాలము జరిగిపోయింది
అను ప్రశ్న అనవసరము అన్నాము. ఇప్పుడు జరుగుచున్నది కలియుగము అని అందరికీ తెలుసు. దీనికి ఒక పేరు,
కొంత పరిమాణ ఆయుస్సు కలదు. పేరు కలియుగము, ఆయుస్సు 4,32,000 సంవత్సరములు. అట్లే మూడు
మిగతా యుగములు కూడా కలవు. వాటికి కూడా పేర్లు, ఆయుస్సు కలదు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు
నాలుగు, నాలుగుయుగములే కానీ నాలుగు కలిసి ఒక యుగము కాదు. ఒకవేళ ఒక యుగము నాలుగు భాగములుగా
విభజింపబడి, ఆ భాగములకు పేర్లు పెట్టియుంటే అన్నీ సమాన ఆయుస్సుగ విభజన జరిగి ఉండేది. ఒక రూపాయిని
నాలుగు భాగములుగా విభజించినపుడు నాలుగు సమాన భాగములుగా విభజించి వాటికి నాలుగు పావలాలని పేరు
పెట్టాము. ఒక రూపాయి నాలుగు పావలాలుగా ఉన్నా, నాలుగు పావలాలు సమానముగా ఉన్నాయి. అలాగే ఒక
యుగమును నాలుగు భాగములుగా విభజించినపుడు ఒకే పరిమాణములో ఉండాలి. అలా లేవు అంటే అవి యుగములలోని
భాగములుకాదనీ, అవి వేరువేరు యుగములనీ తెలియబడును. అదే విధముగా నాలుగు యుగములు వేరువేరు
ఆయుస్సులు కలిగి, వేరువేరు పేర్లు కల్గియుండడము వలన అవి వేరువేరు యుగములనీ, ఒక యుగములోని
భాగములుకాదనీ తెలియుచున్నది.
ఆదిలో మొదట వచ్చినది కృతయుగము. తర్వాత వచ్చినది త్రేతా యుగము, ఆ తర్వాత మూడవది ద్వాపరయుగము,
నాల్గవది కలియుగము. ఈ నాలుగు యుగముల వరుస అయిపోతూనే తిరిగి మొదటిదైన కృత యుగము మొదలగును.
28

Page 29
తర్వాత వరుసగా త్రేతా, ద్వాపర, కలియుగములు వచ్చును. ఇట్లు నాలుగు యుగములు ఒకమారు జరిగితే ఒక
గుర్తుగా మహాయుగము అన్నారు. ఈ మహా యుగములు 250 మార్లు జరిగితే మొత్తము వేయియుగములు జరిగినట్లగును.
ఆ వేయియుగముల పరిమాణమును ప్రపంచ ఆయుస్సుగా, దానినే దేవుని పగలుగా గీతలో చెప్పబడినది. భగవద్గీతలో
వేయియుగములు దేవునికి ఒక పగలని చెప్పారు. కానీ ఒక యుగము నాలుగు భాగములని చెప్పలేదు. వేయియుగములు
108 కోట్ల సంవత్సరములగుచున్నవి. కావున 108 సంఖ్య చాలా ప్రాముఖ్య మైనది. అంత ప్రాముఖ్యమైన సంఖ్య
అందరికీ తెలియునట్లు ఎవరికైనా కానుకను ఇచ్చునపుడు 108 రూపాయలుగానీ, 108 వస్తువులును గానీ ఇవ్వవలెనని
పెద్దలు నిర్ణయించారు. పెళ్ళి సమయములో పెళ్ళి కొడుకుకు గానీ, పెళ్ళి కూతురుకుగానీ ఇచ్చు కానుకలను 108
సంఖ్యతో ఇవ్వడము పరిపాటిగా ఉన్నది. అంతేకాక ప్రపంచ ఆయుస్సు ఇదీ అని తెలియునట్లు ప్రతి జపమాలలోనూ
108 పూసలను ఉండునట్లు పెద్దలు నిర్ణయించారు. మనము మాయలోనే పుట్టి, మాయలోనే బ్రతికి, మాయలోనే
చనిపోవు చున్నాము. మాయను విభజించి చూచితే 12 గుణములుగా ఉంటూ, ఆ పన్నెండు గుణములు ఒక్కొక్కటి
తొమ్మిది భాగములుగా విభజింప బడి 108 గుణములుగా మారిపోయి ఉన్నవి. 108 గుణములలోనే జీవుడు జీవించునట్లు,
108 కోట్ల సంవత్సరములలోనే జీవుడు మనగలుగును అన్నట్లు, తలలోని గుణరూపమైన మాయ 108 గా
విభజింపబడినదని ముందే కొంత తెలుసుకొన్నాము. ఇట్లు అనేక విధముల 108 సంఖ్య దేవునికి సంబంధించిన
జ్ఞానముతో ముడిపడియున్నది. 108 సంఖ్యను కలిపితే మొత్తము 9 సంఖ్య అగుచున్నది.
మొత్తము సృష్ఠికాలము 108 కోట్ల సంవత్సరములు మాత్రమేననీ, 108 కి నాలుగింతలు ఎక్కువగానున్న 432
కోట్ల సంవత్సరములు కాదని మేము చెప్పగా! కొందరు వారిమాటను నెగ్గించుకొనేదానికి “ఈ విషయము వేదములలోనే
ఉన్నది” అని అంటున్నారు. అంతేకాక "వేదములు సృష్ట్యాదిలో పుట్టినవి. సృష్ఠి జరిగి ఇప్పటికి 196 కోట్ల 8 లక్షల 53
వేల 145 సంవత్సరములగుచున్నది” అని అంటున్నారు. వీరిమాట అబద్దము అనుటకు ఒక ఆధారము కలదు.
అదేమనగా! గడచిన ద్వాపరయుగములో వ్యాస మహర్షి ఉండెడివాడు. ఆయన అష్టాదశ పురాణములనూ, చతుర్
వేదములను వ్రాశాడు. నాలుగు వేదములకు కర్త వ్యాసుడే. కావున ఆయనను వేదవ్యాసుడు అని అంటారు. వేదములను
రచించినవాడు వేదవ్యాసుడు అయినపుడు, వేదములు ద్వారపయుగము యొక్క చివరిలో వ్యాసుడు వ్రాసినపుడు, ఇప్పటికి
దాదాపు ఆరువేల సంవత్సరముల క్రిందట పుట్టాయనుట సత్యమగును. అట్లు కాకుండా వేదములు పుట్టి 196 కోట్ల
సంవత్సరములనడము విచిత్రము కాదా! పూర్తి అసత్యము కాదా? మొదట వేదములను వ్రాసిన వ్యాసుడు, అవి
సృష్ట్యాదిలోనే పుట్టాయని నమ్మించుటకు కొన్ని కల్పిత కథలను వ్రాసి నమ్మించాడు. నాలుగు వేదములను వ్రాసిన
తర్వాత 18 పురాణములను వ్రాశాడు. అవన్నియు ఉదర గాథలు కాదు. పుక్కిడి పురాణములే! అనగా వాస్తవదూరమైన
కల్పిత కథలే. భాగవత పురాణములలో హిరణ్యాక్షుడు అను రాక్షసునినుండి వేదములను రక్షించుటకు విష్ణువు వరాహ
(పంది) అవతారమెత్తాడని చెప్పారు. అది సృష్ట్యాదిలోనే జరిగినట్లు చెప్పడము వలన, మరియు వేదములు కృతయుగములోనే
సృష్ట్యాదిలోనే తయారైనవనీ, వాటిని దేవుడే తయారు చేశాడని వ్రాయడము వలన అందరూ అదే నిజమని నమ్మారు.
వ్యాసుడు ద్వాపరయుగములో వ్రాశాడని ఎవరికీ తెలియకుండా పోయినది.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! “భగవద్గీత ను సృష్ట్యాదిలో దేవుడు సూర్యునికి
చెప్పాడు, సూర్యుని వలన భూమిమీద తెలిసినదని చెప్పారు కదా! దేవుడు చెప్పిన భగవద్గీతలో వేదములు గుణముల
విషయములనీ, మాయయనీ చెప్పినట్లున్నది కదా! అలాంటపుడు వేదముల ప్రస్తావన ఆదిలోనే గీతయందున్నప్పుడు
29

Page 30
వేదములు ఆదిలోనే పుట్టాయనడము సత్యమే కదా!” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
దేవుడు భగవద్గీతను ఆదిలోనే సూర్యునకు చెప్పినమాట వాస్తవమే. అప్పుడు గుణములను గురించి చెప్పినదీ, గుణములే
మాయ అని చెప్పినదీ అన్నీ వాస్తవమే. అయితే వేదములు అను పదము ఆ రోజు చెప్పబడలేదు. ద్వాపరయుగము
యొక్క అంత్యములో భారతయుద్ధము జరిగినపుడు కృష్ణుడు అర్జునునకు భగవద్గీతను ఆదిలో చెప్పినట్లే చెప్పాడు.
అదంతయు వినిన అర్జునుడు యుద్ధము తర్వాత ఒక దినము తాను కృష్ణుని ద్వారా విన్నదంతా వ్యాసునికి చెప్పడము
జరిగినది. అర్జునుడు చెప్పినదంతా వినిన వ్యాసునికి తాను చేసిన తప్పేమిటో తనకు తెలిసిపోయినది. తాను వేదములను
వాటికి అనుబంధముగ పురాణములను వ్రాసి గొప్ప తప్పు చేశానని అను కొన్నాడు. తన వేదములలో గీతలో చెప్పబడిన
మాయ తప్ప ఏమీ లేదనుకొన్నాడు. తాను అధర్మమునే ప్రచారము చేశానని బాధపడిపోయి, చివరకు ఒక నిర్ణయానికి
వచ్చాడు. భగవంతుడు చెప్పిన భగవద్గీతను గ్రంథ రూపములో వ్రాయాలనుకొన్నాడు. అలా వ్రాయుట వలన తన
పాపమునకు కొంత క్షమాపణ ఏర్పడునని అనుకొన్నాడు. అట్లు అనుకొన్న వెంటనే గీతను మొదలుపెట్టి పూర్తిగా
వ్రాసిపెట్టాడు. ఆనాడు వ్యాసుడు వ్రాసిన వేదములను చదివిన వారికి అదే వ్యాసుడు భగవద్గీతను వ్రాయడము
సరిపోలేదు. భగవద్గీతలో వేదములు వ్యతిరేఖత ఉన్నట్లు గ్రహించారు. తమకు, తమ వృత్తికి వ్యతిరేఖముగానున్న
భగవద్గీతలో తమకు అనుకూలమైన కొన్ని శ్లోకములను చేర్చాలని నిర్ణయము చేసుకొన్నారు. అంతలోనే వ్యాసుడు
చనిపోయిన వెంటనే గీతలోనికి సాధ్యమైన కొన్ని చోట్ల కొన్ని శ్లోకములను చొప్పించారు. అప్పటికి భగవద్గీత ప్రజలలోనికి
పూర్తిగా పోలేదు. ఆనాడు కొందరు పండితులు మాత్రమే భగవద్గీతను చదివారు. కావున ఆ పండితులే భవిష్యత్తులో
తమకు అనుకూలముగా ఉన్నట్లు కల్పిత శ్లోకములను గీతలోనికి వ్రాసిపెట్టారు. ఈ విధముగా భగవద్గీతలో కూడా
కొన్ని అధర్మయుక్తమైన శ్లోకములు, దేవుని మాటకు వ్యతిరేఖతను చూపు శ్లోకములు, ఆలోచించువానికి అనుమానమును
రేకెత్తించు శ్లోకములు కొన్ని ఉన్నాయి. వాటిని గ్రహించిన మేము మాచే రచింపబడిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”
యందు ఆ శ్లోకములను తీసివేసి వ్రాయడము జరిగినది. ఇవి దేవుడు చెప్పినవి కావు, కల్పిత శ్లోకములనీ, మధ్యలో
చొప్పించబడినవని కూడా చెప్పడము జరిగినది. ఇంతవరకు ఏ భగవద్గీతలో జరగని పని త్రైత సిద్ధాంత భగవద్గీతలో
జరిగినది.
మా ఉద్దేశము, మా కర్తవ్యము, స్వచ్ఛమైన దైవజ్ఞానమును ప్రజలకు అందివ్వడమే. కావున భగవద్గీతలో
"అక్షర పరబ్రహ్మయోగము” అను అధ్యాయములో కాలమును గురించిన కొన్ని శ్లోకములున్నాయి. అందులో 17, 18
శ్లోకములందు యుగములను గురించి, అట్లే 24, 25 శ్లోకములందు పగలు, రాత్రీ, కృష్ణపక్షము, శుక్లపక్షమూ,
ఉత్తరాయణము, దక్షిణాయణము లను గురించి చెప్పడము జరిగినది. ఈ పేర్లన్నియు కాలమునకు సంబంధించిన
భాగముల గుర్తులు. కాలము దైవస్వరూపము కావున కాలమునకు సంబంధించిన పూర్తి జ్ఞానమును అందివ్వాలనుకొన్నాము.
ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని సంచలనమైన విషయమును తెలియజేస్తాము సావధానముగా వినండి. కాలము
అంటే దేవుడని తెలిసిపోయినది. అయినా దైవస్వరూపమైన కాలము మన ఎదుటే ఉన్నా అది తెలియబడదు.
తెలియబడని కాలమును తెలుసుకొని దానియందు ఐక్యమైపోయి నీవు కూడా కాలస్వరూపునిగా మారిపొమ్మని పెద్దలు
తెలియజేశారు. నీవుకూడా కాలములోనికి కలిసిపొమ్మని కాలము యొక్క వివరములో చెప్పారు. కాలము దేవుడు అని
చెప్పుకొన్నాము కదా! కాలము దైవము అని అందరికి అర్థ మగుటకు కాలములో పెద్దవైన నాలుగు యుగములకు గల
పేర్లను దైవము యొక్క హెూదాను తెలుపునట్లు పెట్టారు. ఆ నాలుగుయుగముల పేర్లు నేటికిని మనముందరున్నా
30

Page 31
వాటిలో రెండు పేర్లు కొంత మార్పు చెంది ఉన్నవి. నాలుగు యుగముల పేర్లు ఎంతగొప్పవో, అందులో రెండు పేర్లు
ఎలా మారిపోయి పిలువబడుచున్నాయో వివరించుకొందాము.
ఒక
ఇంతవరకు వాడుకలోయున్నవి, చాలామందికి తెలిసినవి కాలము లో పెద్దవి నాలుగుయుగములు. అందులో
మొదటిది కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాల్గవది కలియుగము.
విధముగా చెప్పితే నాలుగుయుగముల పేర్లు వేరువేరుగా ఉండినా చివరిలో మాత్రము యుగములుగానే పిలువబడుచున్నవి.
చివరిలో యుగములను వదలిచూస్తే ఒకటి కృత, రెండు త్రేతా, మూడు ద్వాపర, నాలుగు కలి అని చెప్పవచ్చును. ఈ
నాలుగు పేర్లలో చివరి ద్వాపర, కలి అను రెండు పేర్లు పూర్వము పెద్దలు ఎలా నిర్ణయించారో అలాగే ఉన్నవి.
ముందున్న కృత, త్రేతా అను రెండు పేర్లు కొద్దిగా మార్పు చెందియున్నవి. మొదటి పేరైన కృత అను పేరు పూర్వము
కృత్ అను పేరుగా ఉండెడిది. కృత్ అనగా చేసినవాడు అని అర్థము రాగలదు. కృత అంటే చేయబడినది అని అర్థము
రాగలదు. ఇక్కడ విశ్వమును సృష్టించిన దేవున్ని ఉద్దేశించి పెట్టిన పేరు కృత్ అని తెలియుచున్నది. సర్వసృష్ఠిని
తయారు చేసిన వానిని కృత్ అంటాము. చేయబడిన విశ్వమును కృత అంటాము. ఇక్కడ పెట్టిన పేరు కాలమును
ఉద్దేశించి పెట్టినది, విశ్వమును ఉద్దేశించి పెట్టినది కాదు. అందువలన కృత్ అను పేరు వాస్తవమైనదని అర్థమగుచున్నది.
ఈ విధముగా కాలక్రమమున కృతయ్యుగము కాస్త కృతయుగముగా మారి పోయినది. అర్థము వివరము తెలియనివారు
గ్రుడ్డిగా కృతయుగము అంటున్నారు. సామాన్య ప్రజలే కాకుండా జ్యోతిష్యపండితులు కూడా అర్థ హీనమైన పేరుతోనే
వ్రాయుచున్నారు. ఈ విధముగా మాయ అందరిని మభ్యపెట్టినది. ఇది కాలమునకు పెట్టినపేరనీ, కృతియుగమే కానీ
కృతయుగముకాదనీ పండితులు కూడా గ్రహించలేకపోయారు.
ఇక రెండవ పేరు కూడా అర్థహీనమైపోయినదని చెప్పవచ్చును. దేవుడు భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి
యోగమున 16,17, శ్లోకములలో చెప్పినట్లు దేవుడు మూడు భాగములుగా ఉన్నాడు. దానినే ముగ్గురు పురుషులుగా
అక్కడ చెప్పడము జరిగినది. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అను ముగ్గురు పురుషులుగా దేవుడున్నాడు.
ఆ ముగ్గురు పురుషులనే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని మూడు ఆత్మలుగా కూడా చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన
జ్ఞానమును అనుసరించి దేవుని హెూదాకు తగినట్లు సూచన పదములను దేవునిపట్ల వాడెడివారు. కృత్ అనగా చేసిన
వాడని అర్థమునిచ్చు సూచన పదముగానీ అది ఒక పేరుకాదు. వాస్తవముగా దేవునికి పేర్లుండవు. క్షర, అక్షర
పురుషులకంటే ఉత్తమమైనవాడు అను సూచనతో పురుషోత్తముడు అన్నారు. అలాగే జీవాత్మ, ఆత్మలకంటే వేరైన వాడు
అను అర్థమునిచ్చు పదముతో పరమాత్మ అని అన్నారు. పురుషోత్తమ అనినా, పరమాత్మ అనినా అవి అర్థమునిచ్చునవే
గానీ పేర్లు మాత్రము కావు. అలాగే దేవుడు అనినా దేవులాడబడేవాడు (వెతకబడే వాడు) అని అర్థమేగానీ అది పేరు
కాదు. అట్లే రెండవయుగము ముందర దేవుని విధానమును తెలుపు పదమును ఉపయోగిస్తూ త్రైతా అన్నారు. త్రైతా
అనగా మూడవది. దేవుడు మూడవ పురుషుడు లేక మూడవ ఆత్మ కావున కాలమును త్రేతాయుగము అన్నారు.
అయితే కాలక్రమమున అజ్ఞానము పెరిగిపోయి, త్రేతాయుగము కాస్త త్రేతాయుగముగా మారిపోయినది. త్రేతా అంటే
అర్థములేదు. త్రైతా అంటే మూడవవాడు అని అర్థము గలదు. నేడు జ్యోతిష్యపండితులు, స్వామీజీలు, అందరూ
త్రేతాయుగమనియే చెప్పుచున్నారు. ఊరంతా ఉత్తరమంటే మేము ఒక్కరు దక్షిణమన్నట్లున్నది. అందరూ త్రేతాయుగము
అంటూవుంటే మేము ఒక్కరూ త్రేతా కాదు త్రైతా అని చెప్పినా బుర్రలేని మనుషులు వినే స్థితిలోలేరు. ఇప్పటికైనా
దేవుని గొప్పతనమునకు, విధానమునకు భంగము కలుగకుండా, అర్థహీనము కాకుండా కృతయుగమును వదలి కృత్
31

Page 32
యుగమనీ, అలాగే త్రేతాయుగమును త్రేతాయుగమని పిలుచునట్లు తెలుపుచున్నాము. కృత్ అను శబ్దముగానీ, త్రైత
అను శబ్దముగానీ కాలమునకు పూర్తిగా సరిపోవునని తెలియవలెను. కాలక్రమములో అజ్ఞానము పెరిగిపోయి కొన్ని
విషయములు తెలియక పోయినా, వాటిని గురించి వివరముగా తెలుపువారు వచ్చి తెలిపినపుడు, అందులోని సారాంశమును
గ్రహించి, ఏది సత్యమో ఆలోచించి దాని ప్రకారము నడుచుకోవడము విజ్ఞుల లక్షణము.
మూడవది ద్వాపర అని కలదు. ఇంతకు ముందే దేవున్ని పరమాత్మ అని అంటారని చెప్పుకొన్నాము. ఆత్మకంటే
వేరుగా ఉండేవాడు కనుక పరమాత్మ అని అంటాము. జీవాత్మ, ఆత్మకానివాడు పరమాత్మ. అలాగే క్షరపురుషుడు,
అక్షరపురుషుడు కానివాడు పురుషోత్తముడు. మూడు ఆత్మలలో మూడవ ఆత్మ అయిన దానిని త్రైతాత్మ అంటాము.
అట్లే మూడింటిలో రెండూ కానిది దేవుడు అనుటకు ద్వాపర అని అంటాము. ద్వా అనగా రెండు అనీ, పర అనగా
వేరైనది అని అర్థము. ద్వాపర అనగా రెండిటి కంటే వేరుగా ఉన్నదని అర్థము. దేవుని హెూదాకు తగినట్లు ఉన్న
శబ్దము ద్వాపర. కావున పూర్వము పెద్దలు కాలమునకు ద్వాపర అని సూచనగా పిలిచారు. దానినే ద్వాపరయుగము
అని అంటాము. ఇది పూర్వము పెద్దలు నిర్ణయించిన పదము. అదృష్టవశాత్తు ఈ పదము, దాని అర్థము మారకుండా
అలాగే ఉన్నది. ఇది దేవుని గుర్తని మేము చెప్పుటకు సాక్ష్యముగా నిలిచింది. ఇక నాల్గవది కలియుగము. ఇది కూడా
పూర్వము పెద్దలు నిర్ణయించినట్లే అర్థము చెడకుండా ఉన్నది. భగవద్గీతలో నీవు ఎవరు అని అర్జునుడు దేవున్ని
అడిగినపుడు దానికి జవాబుగా “కాలోస్మి లోకక్షయ" అని అనడము జరిగినది. దాని అర్థము "లోకమును నాశనము
చేయు కాలమును" అని గలదు. దీనిప్రకారము కాలము సర్వులను నాశనము చేయుచున్నదని అర్థమగుచున్నది.
దేవుడు అందరిని, అన్నిటిని సృష్టించు సృష్టికర్తయేకాక, తాను సృష్టించిన అందరినీ, అన్నిటినీ నాశనము చేయగలడు.
అందువలన తనను లోకక్షయునిగా చెప్పాడు. క్షయము అనగా నాశనము. దేవున్ని ఆయన హెూదాకు తగినట్లు
పిలువడము ధర్మమగును. కావున అదే ఉద్దేశముతోనే కాలమునకు కలియుగము అని సూచించారు. కలి అనగా
నాశనమును కల్గించుయుద్ధము అని అర్థము. యుద్ధము అంటే నాశనమే అని అర్ధము, కావున దేవున్ని కలిపురుషుడు
అన్నారు. అదే ఉద్దేశముతో కాలమును కలియుగము అని అన్నారు. పూర్వము కొందరు జ్ఞానులు ఒకచోట కూర్చొని
కాలమునకు పేరుకాని పదములను నిర్ణయించారు. ఆ పదములు దేవుని ధర్మములకు తగినట్లు ఏర్పరచారు. వారు
సక్రమముగా ఏర్పరచినవి 1) కృతియ్యగము 2) త్రేతాయుగము 3) ద్వాపరయుగము 4) కలియుగము. అయితే
ముందరున్న రెండు పెద్ద పేర్లు కొంతమారిపోయి కృతయుగము కృత యుగముగా, త్రేతాయుగము త్రేతాయుగముగా
మిగిలి ఉన్నాయి.
యుగముల పేర్ల విషయములో ఇప్పుడు సంచలనవార్త తెలిసి నట్లయినది. ఇప్పుడు చెప్పిన సత్యమును
కొందరు బాగా అర్థము చేసుకో గలిగినా, కొందరు మాత్రము జీర్ణించుకోలేకపోవచ్చును. అటువంటి వారు ఇప్పుడు
చెప్పబోవు మరొక విషయమును చూస్తే పూర్తిగా వాంతి చేసు కుంటారేమో అనిపిస్తుంది. సత్యాన్వేషులకు మేము చెప్పు
సత్యములు మంచి ఆహారముగా ఉండగా, అన్వేషణ లేనివారికి మేము చెప్పు విషయములు ఏమాత్రము జీర్ణముకావు.
మన ఆధ్యాత్మిక గ్రంథములలోని ఆధ్యాత్మిక విద్య అంతయు జీవుడు దేవునియందు ఐక్యమగు విధానమునే చూపాయి.
అలా ఐక్యమగుటనే ముక్తి పొందడము లేక మోక్షమును పొందడము అంటారు. దేవుని సమాచారము, జ్ఞానము
ధర్మములు ఎక్కడున్నాయో అక్కడంతా జీవ బ్రహ్మ ఐక్య విధానమే ఉంటుంది. బ్రహ్మవిద్యాశాస్త్రములో ముఖ్యగ్రంథమైన
భగవద్గీతలో దేవునియందైక్యమగు విధానములనే ముఖ్యముగా చెప్పారు. దేవున్ని చేరు విధానమునే యోగము అని
32

Page 33
గీతలో చెప్పారు. అటువంటి యోగములు ధర్మముల ప్రకారము చెప్పబడునవి రెండే రెండు గలవు. అందులో ఒకటి
బ్రహ్మయోగము, రెండవది కర్మ యోగము. ధర్మములకు అతీతమైన యోగము కూడా ఒకటి కలదు. దానిని భక్తియోగము
అంటాము. భక్తియోగము చాలాగొప్పది, అది అందరికీ అంత సులభముగా అర్థమగునది కాదు. ధర్మములతో
కూడుకొన్న బ్రహ్మ, కర్మయోగములను మనిషి అర్థము చేసుకోగలిగితే తర్వాత భక్తియోగము అర్థము కాగలదు. భగవద్గీతలో
దేవుని విధానమంతయు సంపూర్ణముగా కలదు. అక్కడే యోగముల వివరమంతయూ సంపూర్ణముగా కలదు. ఈ
విషయమంతా ఎందుకు చెప్పుచున్నామనగా! దైవస్వరూపము ఎక్కడైతే ఉన్నదో దానిలోనికి ఐక్యమైపొమ్మను విధానము
కూడా ఉండునని అర్థమగుటకు చెప్పవలసివచ్చినది.
యోగము అంటే కలయిక అని అర్థము. వియోగము అంటే కలిసివున్నది విడిపోవడము అని అర్థము.
యోగము అనుమాట దైవత్వమున్న చోటే చెప్పబడుతుందని చెప్పాము కదా! కాలము దైవస్వరూపము అన్నాము. అట్లే
కాలమునకు దైవమును సూచించు కృత్ అనీ, త్రైతా అనీ, ద్వాపర అనీ, కలి అనీ శబ్దములతో పిలుచుచున్నాము.
అటువంటి దైవస్వరూపమైన కాలముల ప్రక్కన యోగము అను శబ్దమును పెద్దలు జత చేసిచెప్పారు. ఇంతవరకు
మనము పిలుస్తున్న యుగములు పూర్వము యోగములుగా పెట్టబడినపేర్లు. వాస్తవానికి కృత్యాగము, త్రైతాయోగము,
ద్వాపర యోగము, కలియోగము అను పేర్లు సత్యమైనవి. ధర్మములు అధర్మములుగా మారిపోవునని దేవుడు గీతలో
చెప్పినట్లు ధర్మములైన యోగముల పేర్లే చివరకు యుగములుగా పిలువబడుచున్నవి. యోగము అంటే దేవునియందు
ఐక్యమై పొమ్మని అర్థముకాగా, యుగము అంటే ఏ అర్థములేదని చెప్పవచ్చును. కృత్, త్రైత, ద్వాపర, కలి అను దైవము
యొక్క స్థితిని తెలియజేయు పదముల ప్రక్కన యోగముంటే అందమూ, అర్థమూ సరిపోవును. అట్లుకాక అంతపెద్ద
పదముల ప్రక్కన అర్థములేని చిన్నపదములను పెట్టడము మంచిది కాదు. అలా అర్థములేని పదములను పెట్టడము
ఇంద్రుని ప్రక్కన ఎండిపోయిన ఎముకను కొరుకుచున్న కుక్కను పెట్టినట్లు ఉంటుంది. కుబేరుని ప్రక్కన గంజి కూడ
లేని బికారిని పెట్టి నట్లుంటుంది. అందువలన మేము చెప్పు సత్యమును తెలుసుకొని యుగమును యోగము అని
పిలుస్తూ సత్యము బయటపడునట్లు చేయుదురని అనుకొంటున్నాను. ఇప్పటికి కాలముల పేర్లలోని లొసుగులు పూర్తిగా
తెలిసిపోయాయి అనుకుంటాను.
భూమిమీద ఎన్నో మతములున్నవి. అన్నిటిపైకి రెండే రెండు మతములు చాలా పెద్దవి. క్రైస్తవమతము,
ఇస్లామ్మతములు రెండు పెద్ద మతములే. ఆ రెండు మతములకంటే హిందూమతము చిన్నదనియే చెప్పవచ్చును.
ఒకప్పుడు ఇందూ (హిందూ) మతము ప్రపంచ వ్యాప్తముగా నున్న ఏకైక మతముగా ఉండేది. తర్వాత ఎన్నో మతములు
పుట్టుక రావడము వలన, ఇందువులు తమ ఇందుత్వమనెడి దైవజ్ఞానమును తెలియకుండా పోవడము వలన, చివరికి
వెనుకన పుట్టిన మతములకంటే చిన్న మతముగా నేడు హిందూమతము కలదు. రెండువేల సంవత్సరముల పూర్వము
క్రైస్తవమతము పుట్టగా, పదునాలుగు వందల సంవత్సరముల పూర్వము ఇస్లామ్ మతము పుట్టినది. ఇందూ (హిందూ)
మతముకంటే ఎంతో వెనుకపుట్టిన క్రైస్తవ, ఇస్లామ్ మతములు రెండూ పెద్దవయిపోయాయి. సృష్ట్యాదినుండి ఉన్న
ఇందూ పథము చివరకు అజ్ఞానవశమున హిందూ మతముగా మారిపోయి ఇతర మతములకంటే చిన్నదైపోయినది.
ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తముగానున్న ఇందుత్వమునుండి ఎన్నో మతములు పుట్టుకొచ్చినవి. ఏ మతమునకైనా పుట్టినిల్లు
ఇందూపథమే. అందువలన ఇందుత్వములో పెద్దలు చెప్పిన స్వర్గ, నరకములు అన్ని మతములలోను చెప్పబడు
చున్నవి. అట్లే అన్ని మతముల వారికీ, అన్ని దేశముల వారికీ ఆదివారము ఉన్నది మరియు అది సెలవు దినముగా
33

Page 34
ఉన్నది. అంతేకాక ఇందుత్వము అనబడే ఆధ్యాత్మికత అన్ని మతములలోనూ ఉన్నది. వారు కూడా ప్రళయ ప్రభవములను
గురించి చెప్పుకొంటున్నారు. అందరిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడనీ, ఒక రోజున ప్రళయము వస్తుందనీ, అందరూ
ఆ దినమున చనిపోతామని చెప్పుకొంటున్నారు. అన్ని మతముల వారికి జరుగబోవు ప్రళయము మీద కొంత అవగాహన
ఉన్నదనియే చెప్పవచ్చును. కొందరైతే ప్రళయ దినమున స్వర్గనరకముల తీర్పు ఉంటుందని చెప్పుచున్నారు. ఎలా
గైతేనేమి అన్ని మతములలోను ప్రళయము అనునది ఒకటున్నదనీ, అది రాబోవు కాలములో వస్తుందనీ చెప్పడము
జరుగుచున్నది. ప్రళయమును గురించి గతములో కొందరు చెప్పుకొన్న విషయమును వివరించుకొందాము.
క్రీ.శ॥ 1994వ సంవత్సరము ఢిల్లీలో గన్లైసెన్సు తీసుకొని ట్రైన్లో వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగినాను.
అప్పుడు రాత్రి 9 గంటల సమయమైన దానివలన నాకు పరిచయమున్న రైల్వే మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాను.
మెజిస్ట్రేట్గారు బ్రహ్మకుమారి సమాజములో పూర్తిగా ఐక్యమైన భక్తుడు. అప్పుడు ఆయన నా గన్లైసెన్సు విషయమును
తెలుసుకొని ఇలా అన్నాడు “ఎందుకు గన్లైసెన్సు వృథా, ఈ సంవత్సరము చివరికి ప్రళయము వచ్చి మొత్తము
ప్రపంచమంతా పోతుంది" అని అన్నాడు. అప్పుడు ఈ మాటను మీరెలా చెప్పగలుగుచున్నారని నేను అడిగాను.
దానికి ఆయన “మా బ్రహ్మకుమారి సమాజము వారు చెప్పారు. 1994వ సంవత్సరము చివరిలో ప్రళయము వస్తుందని,
అందువలన నేను ఇల్లు కట్టించాలను పనిని కూడా మానుకొన్నాను. ప్రళయములో అన్ని నాశనమై, అందరూ లేకుండా
పోయేటప్పుడు ఇప్పుడు మేము కట్టించుకోవాలనుకొన్న ఇల్లు వృథానే, ఇప్పుడు మీరు తెచ్చుకొన్న గన్లైసెన్సూ వృథానే”
అన్నాడు. నేను ఆయనకు సాధారణ మనిషి మాదిరి పరిచయము. నేను ఆధ్యాత్మికవేత్తనని ఆయనకు తెలియదు.
ఎందుకనగా నేను ఎక్కడా సర్వసాధారణ వ్యక్తిగానే కనిపిస్తుంటాను. కొన్ని సంవత్సరముల పరిచయముండినా ఆయన
తనకే ఎక్కువ తెలుసుననీ, తానొక సంస్థలో జ్ఞానము తెలుసుకొంటున్నానని అనుకొనెడివాడు. అందువలన ఆయన
బ్రహ్మకుమారి సమాజమువారు చెప్పిన విషయమునే నాకు చెప్పడము జరిగినది. ఆయన ఆ విధముగా ప్రళయము
1994వ సంవత్సరము చివరిలో వస్తుందని చెప్పిన మాటలను మౌనముగ విన్నాను. అలా జరుగదని నాకు తెలిసినా
నేను మాత్రము ఏమీ చెప్పలేదు. తర్వాత కొంతకాలమునకు 1994వ సంవత్సరము పూర్తిగా అయిపోయినది. ఆయన
మాట అసత్యమని ఆయనకే అర్థమైపోయినది.
క్రీ॥శ॥ 1996వ సంవత్సరము, ఒక బుక్ ల్లో "కలియుగాంతము 1999” అను పుస్తకమును చూచాను.
దానిని వేదవ్యాస్ ఐ.ఎ.యస్. వ్రాసినట్లు తెలిసినది. ఆ కాలములో ఆ పుస్తకము కొన్ని లక్షల కాపీలు అమ్ముడైనట్లు
ప్రచారమైనది. ఆ పుస్తకమును నేను కూడా చదివాను. 1999 కి కలియుగము అంతము కాదని నాకు తెలిసినా,
దానిని గురించి ఎవరికీ నేనేమి చెప్పలేదు. తర్వాత కొంతకాలమునకు 1999 కూడా గడచిపోయినది. కానీ ప్రళయము
జరగలేదు, కలియుగము అంతమూ కాలేదు. ఇన్ని జరిగినా “సిగ్గన్నాకాక దారిన ఎదురాయె” అన్నట్లు ఇప్పుడు
మరియొక ఆధ్యాత్మిక సంస్థవారు 2012 సంవత్సరము డిశంబరు 21 నాటికి ప్రపంచము అంతమైపోతుందనీ, తర్వాత
కలియుగముండదనీ ప్రచారము చేయుచున్నారు. ఈ విషయమును ఒక ఆధ్యాత్మిక సంస్థే కాకుండా, కొందరు జ్యోతిష్యులు
కూడా అదే విషయమును చెప్పుచున్నారు. అంతేకాక కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా 2012 సం॥లో ప్రళయము
జరుగునని చెప్పుచున్నారు. ఈ మధ్యకాలములో 2011 డిశంబరు 20వ తేదీన, టీవీ9 ఛానల్లో “యుగాంతము 365
రోజులు" అను సమస్య మీద చర్చావేదిక ప్రసారము చేశారు. చర్చలో కొందరు యుగాంతము అవుతుందనీ,
కొందరు యుగాంతముకాదనీ మాట్లాడడము జరిగినది. ఇదంతా విన్న తర్వాత మరియు చూచిన తర్వాత మాకు
34

Page 35
విచిత్రమనిపించింది. ఆలు తెలియదు, సూలూ తెలియదు, కొడుకు పేరు మాత్రము సోమలింగము అన్నట్లు, యుగములంటే
ఏమిటో, వాటి వాస్తవపేర్లేమిటో తెలియదు. అట్లే యుగముల ముందరున్న పేర్లను ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో,
వాటి అర్థమేమిటో తెలియదు. ఇంకా యుగములు ఎప్పటినుండి ప్రారంభమైనవో, వాటి ఆయుస్సు ఎంతో తెలియదు.
కానీ ప్రళయము మాత్రము 2012 అనడము జరుగుచున్నది. 2012 ప్రళయమును గురించి చలనచిత్రాలు కూడా
వచ్చాయి.
ఆ
ఈ గందరగోళ పరిస్థితినుండి ప్రజలు బయటపడలాంటే అందరికి ఇంతవరకు తెలియని రహస్యములన్నిటిని
ఛేదిస్తూ ఒక గ్రంథమును వ్రాయాలనుకొన్నాము. ఇప్పుడు ఆ ఉద్దేశమును కార్యరూపములో పెట్టాము. ఈ గ్రంథములో
ప్రతి విషయము ఆధ్యాత్మికముతో ముడిపెట్టుకొని వివరించడము జరిగినది. కాలము, మనిషిలోని జీవాత్మ ఒకదానికొకటి
సంబంధపడియున్నవి. అందువలన మనిషిలోని గుణముల సంఖ్యనుండి యుగములు (యోగములు)ను గురించి
చెప్పుకొన్నాము. ఇప్పుడు యుగాంతమును కూడా మనిషినుండే ప్రారంభిస్తాము. యుగాంతము జీవుల కొరకే
నిర్ణయింపబడినది. కావున జీవమున్న మనిషినుండే వివరించు కోవలయును. మనిషి శరీరములలో తల మధ్యభాగమున
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాలుగు చక్రముల సముదాయము ఉన్నది. అన్నిటి కంటే పైనగల చక్రమును
బ్రహ్మచక్రము అని అంటాము. బ్రహ్మచక్రము రెండు భాగములుగా విభజింపబడివున్నది. ఈ చక్రము ప్రపంచ
ఆయుస్సుకు సంబంధించినది. బ్రహ్మచక్రములోని ఒక భాగము పూర్తిగా తిరుగుటకు వేయియుగములు (యోగములు)
పట్టును. రెండు భాగములు తిరుగుటకు రెండువేల యుగములు పట్టును. ఒకమారు సృష్ఠి తయారై అది కొంత
కాలముండి, తర్వాత కొంత కాలము లేకుండా పోయి, తర్వాత సృష్టి మొదలగుటకు ఒక కల్పము అంటాము. బ్రహ్మచక్రము
ఒక చుట్టు పూర్తిగా తిరుగుటను ఒక కల్పము అని చెప్పవచ్చును. క్రింద బ్రహ్మచక్రము యొక్క చిత్రమును చూడండి.
9
బ్రహ్మపగలు
1000 యోగములు
బ్రహ్మరాత్రి
1000 యోగములు
బ్రహ్మచక్రము
ఈ విధముగా ప్రపంచము వేయియుగముల (యోగముల) కాలము ఉండుటకూ, వేయియుగముల కాలము
లేకుండుటకు, మొత్తము రెండువేల యుగముల కాలము ఒక కల్పముగా నిర్ణయింపబడుటకు మూలము మనిషి తలలోనే
కలదు. మనిషి తలలో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు నాలుగు బ్రహ్మనాడిలోని శక్తిని ఇరుసుగా చేసుకొని
తిరుగుచున్నవి. బ్రహ్మనాడి శక్తిని పరిశీలించి చూడగా అందులో ఆత్మశక్తి పైకి తెలిసినా, దానిలో కూడ పరమాత్మ శక్తి
వ్యాపించియున్నది. ఇప్పుడు మూడు ఆత్మల స్థానములను వివరించుకొంటే, జీవాత్మ గుణచక్రములోని మూడు భాగము
లలో ఏదో ఒక దానియందు అతి స్వల్పమైన సూక్ష్మబిందువుగా ఉన్నది. రెండవదైన ఆత్మ బ్రహ్మనాడిని కేంద్రముగా
చేసుకొని నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించి ఉన్నది. ఆత్మ శరీరములో మాత్రమే ఉన్నది. శరీరము బయట లేదని
35

Page 36
జ్ఞాపకముంచుకోవలెను. మూడవదైన పరమాత్మ మాత్రము శరీరములోపలా, శరీరము బయటా అణువణువునా వ్యాపించి
యున్నది. ప్రతి శరీరములోనూ పరమాత్మశక్తి రెండువేల చైతన్య శక్తులుగా మారి ఆత్మయందు చేరిపోయినది. ఆత్మ
చైతన్యశక్తి పరమాత్మ శక్తియేనని తెలియవలెను. రెండువేల చైతన్యములుగానున్న శక్తి జీవశరీరములోనున్నది. రెండువేలలో
ఐదువందల (500) యూనిట్లశక్తి జీవాత్మలో చేరియున్నది. (ఒక చైతన్యశక్తిని ఒక యూనిట్గా చెప్పడమైనదని
గమనించవలెను.) రెండువేల యూనిట్లశక్తిలో 500లు జీవాత్మయందుండగా, బ్రహ్మనాడిలోని ఆత్మయొక్క ఏడునాడీ
కేంద్రములలో మొదటి స్థానమైన సహస్రారమునందు 500ల యూనిట్ల శక్తియుండగా, రెండవ స్థానమైన ఆగ్నేయ
నాడీకేంద్రమున ఆత్మశక్తి 500 యూనిట్లు ఉన్నది. తర్వాత మూడవ నాడీకేంద్రమైన విశుద్ధమందు 250 యూనిట్లు
ఉండగా, నాల్గవ స్థానమైన అనాహత స్థానమందు 125 యూనిట్ల శక్తి ఉన్నది. తర్వాత ఐదవ నాడీకేంద్రమైన
మణిపూరకమందు 62.1/2 యూనిట్లు ఉండగా, ఆరవ నాడీకేంద్రమైన స్వాధిష్ఠానమునందు 31.1/4 చైతన్యముల శక్తి
ఉన్నది. ఇక చివరి నాడీకేంద్రమైన ఆధారస్థాన మందు 31.1/4 యూనిట్లే ఉన్నది. ఈ విధముగా పరమాత్మశక్తి ఒక
సజీవ శరీరములో రెండువేల చైతన్యముల (యూనిట్ల) శక్తిగా ఉంటూ ఏడునాడీ కేంద్రములందు విభజింపబడి ఉన్నది.
శరీరములో పరమాత్మశక్తి ఆత్మ భాగములుగానున్న విధానములను చిత్రరూపములో ప్రక్క పేజీలలో చూడండి.
పరమాత్మ శక్తి ఆత్మశక్తిగా మారడము, ఆత్మనుండి జీవాత్మ విభజన, శరీరములో ఆత్మభాగములున్న విధానమును
చూచాము కదా! పరమాత్మ యొక్క అనువంతశక్తి రెండువేల (2000) చైతన్యశక్తులుగా మారడమూ, అలా మారిన
ఆత్మశక్తిలో కొంత జీవాత్మగా విడిపోవడమూ, ఐదువందల (500) చైతన్యశక్తులు (ఐదువందల యూనిట్లు) జీవాత్మగా
విడిపోగా మిగిలిన పదిహేనువందల (1500) చైతన్యశక్తులు శరీరములోని నాడీకేంద్రములందు ఉండి శరీరమంతా
ప్రాకడము జరుగుచున్నదని పై చిత్రముల ద్వారా తెలిసి పోవుచున్నది. ఈ విధముగా ఒక జీవ శరీరములో దైవశక్తి
రెండువేల చైతన్యములుగా ఉండుట వలన, రెండువేల యుగములు దేవునికి ఒక దినముగా లెక్కించబడుచున్నది. ఈ
సూత్రము ప్రకారము వేయియుగముల తర్వాత ప్రళయము, అట్లే వేయియుగముల తర్వాత ప్రభవము నిర్ణయించబడినది.
ఒక ప్రభవము (సృష్ఠి), ప్రళయము (నాశనము) రెండు కలిపి దైవము యొక్క ఒక దినముగా లెక్కించబడినది. దేవుడు
అనంతశక్తిమయుడు, అపారయుక్తిమయుడు. కావున ఆయన ఎవరో, ఎట్లుంటాడో, ఆయన ఆయుష్షంతో ఎవరికీ
తెలియదు. అంతేకాక ఆయన (దేవుడు) నిజముగా లేడు అబద్దముగా ఉన్నాడు. ఈ అర్ధము ప్రకారము ఆయనకు
ఆకారములేదు, పేరూలేదు, క్రియాలేదు. కావున ఆయుస్సు కూడా లేదు. ఆయనే అందరినీ తయారు చేయువాడు
(సృష్టికర్త). అలాగే ఆయనే అందరినీ నాశనము చేయువాడు (లయకర్త). సృష్ఠి, లయములు దేవునివే, కావున మన
తలలోని నాలుగుచక్రములలో పైన గల చక్రము పేరు బ్రహ్మచక్రమని చెప్పబడినది. అంతేకాక బ్రహ్మచక్రము రెండు
భాగములుగా విభజింపబడి, అందులో ఒకటి సృష్ఠికి, మరొకటి లయకు గుర్తుగా ఉన్నవి.
కొందరు జ్యోతిష్యులు, కొందరు వేదాంతులు సృష్ట్యాదినుండి ఇంత కాలము గడచిపోయినదనీ, ఇన్ని
మన్వంతరములు గడచిపోయినవనీ, ఇంకా ఇంత గడువవలసియున్నదనీ చెప్పుచున్నారు. 196 కోట్ల 8 లక్షల 53 వేల
145 సంవత్సరములు గడచిపోయినవనీ, ఇంకా గడువలసినవి 235 కోట్ల 91 లక్షల 46 వేల 855 రోజులు ఉన్నవని
ఒక ప్రక్క చెప్పుచూ, మరియొక ప్రక్క ప్రళయము ఈ సంవత్సరమే వస్తున్నదని చెప్పుచున్నారు. వీరు చెప్పే మాటలన్నీ
వాస్తవమేనా అని ఆలోచించి చూస్తే, మా బుర్రకు తెలియునది ఏమనగా! నాలుగు యోగములు (యుగములు)
36

Page 37
పరమాత్మ నుండి ఆత్మ విభజన చిత్రము
2000 పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ
1000
1000 మొదటి ఆత్మ భాగము.
500
500 రెండవ ఆత్మ భాగము.
250
250 మూడవ ఆత్మ భాగము.
125
-12
62 1/1/10
311.
125 నాల్గవ ఆత్మ భాగము.
622 > ఐదవ ఆత్మ భాగము.
317 ఆరవ ఆత్మ భాగము.
37
31111
ఏడవ ఆత్మ భాగము.

Page 38
పరమాత్మ నుండి ఆత్మ, ఆత్మనుండి జీవాత్మ విభజన చిత్రము
(2000) పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ
1000
1000
500
జీవాత్మ
500 - ఆత్మ మొదటి భాగము.
500
500 → ఆత్మ రెండవ భాగము.
250
250 ఆత్మ మూడవ భాగము.
125
125 ఆత్మ నాల్గవ భాగము.
621
62 ఆత్మ ఐదవ భాగము.
314.
317 ఆత్మ ఆరవ భాగము.
38
311 ఆత్మ ఏడవ భాగము.

Page 39
శరీరములో ఆత్మ భాగములున్న విధానము
జీవుడు
500
క్షరుడు
500
250
125
-సహస్రారము 1)
ఆగ్నేయము 2)
అక్షరుడు
విశుద్ధము (3)
అక్షరుడు
అనాహతము (4)
'అక్షరుడు
62
(31
31/
మణిపూరకము (5)
'అక్షరుడు
స్వాదిష్టము 6)
ఆధారము 7)
అక్షరుడు
ఒకదాని తర్వాత ఒకటి రావడము వాస్తవమే. గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారము వేయి యుగములు దేవునికి
పగలు, అట్లే వేయియుగములు దేవునికి రాత్రిగ ఉండడము వాస్తవమే. దేవునికి పగలు, రేయి అని చెప్పినట్లు మనిషికి
కూడా పగలు రేయి కలవు. దేవుని పగలులో జీవరాసుల సృష్ఠి, స్థితి లయలు గలవు. తర్వాత దేవుని రాత్రిలో మొత్తము
సృష్ఠియే లేదు. తిరిగి దేవుని పగలు మొదలవగానే సృష్ఠి తయారగును. అలాగే మనిషి పగలు కాలము మొదలైనపుడు
మనిషి నిద్రనుండి లేస్తున్నాడు. నిద్రనుండి లేచినప్పుడే ప్రపంచమూ, ఇతర జీవరాసులూ తెలియుచున్నవి. మనిషికి
పగలు కాలము అయిపోయిన తర్వాత రాత్రి కాలము నిద్రకు ఉపక్రమించు చున్నాడు. అప్పుడు మనిషికి ఏమీ
తెలియకుండ పోవుచున్నది. మనిషి పగలు మెలుకువలో ఉన్నప్పుడు కాలము గడచినట్లే, రాత్రి నిద్రలో ఉన్నప్పుడు
కూడా కాలము గడచిపోవుచున్నది. బాగా యోచిస్తే మనిషికి నిద్ర మరణములాంటిది, మెలుకువ పుట్టుకలాంటిది.
మేల్కొన్నవాడు నిద్రించక తప్పదు, నిద్రించినవాడు మేల్కొనక తప్పదు. గీతలో పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు
పుట్టక తప్పదు, అని భగవంతుడు చెప్పినట్లు మనిషి చావు పుట్టుకలకు సమానమైన నిద్ర మెలకువలను పొందుచున్నాడు.
నిద్ర మెలకువలు మనిషికి నిత్యము ప్రత్యక్ష అనుభవము.
39

Page 40
క్షణక్షణము కాలము గడచిపోతున్నది. క్షణమును సెకండుగా చెప్పుచున్నాము. మనిషి తన జీవితమును
సాగించుకొలదీ కాలము గడచి పోవుచున్నది. ప్రతి సెకండు గడచిపోవుకొలది మనిషి మరణానికి దగ్గరవుతున్నాడని
అర్థమగుచున్నది. మనిషి ఎదిగేకొద్దీ, దినములు గడచి పోవుచున్నవి, మరణము సమీపిస్తున్నది. కాలమును సెకండ్లలో
కొలిస్తే అరవై (60) సెకండ్లు ఒక నిమిషము. అలాగే అరవై (60) నిమిషములు ఒక గంట, పన్నెండు (12) గంటలు
ఒక పగలుగ ఉన్నది. వీటినే సెకండ్లలో చెప్పితే...
ఒక గంటకు
(60 నిమిషములకు)
3,600 సెకండ్లు
12 గంటలకు
(ఒక పగలుకు)
=
43,200 సెకండ్లు
60X60=3600
3,600X12=43,200
10 పగళ్ళకు
(120 గం॥)
=
4,32,000 సెకండ్లు
43,200X10=4,32,000
20 పగళ్ళకు
(240 గం॥)
=
8,64,000 సె॥
43,200X20=8,64,000
30 పగళ్ళకు
(360గం||)
=
12,96,000 II
43,200X30=12,96,000
40 పగళ్ళకు
100 పగళ్ళకు
(480 M0II)
=
II
17,28,000 సె॥
43,200×40=17,28,000
(1200 M011)
II
43,20,000 సె||
43,200X100=43,20,000
25,000 పగ॥
(3,00,000 గం॥)
=
108,00,00,000 II
43,200X25,000=108,00,00,000
కాలములో పెద్దది సంవత్సరము, అలాగే చిన్నది క్షణము (సెకండు). దేవుడు పెద్దవాడు కాబట్టి 108 కోట్ల
సంవత్సరములను ఆయనకు ఒక పగలుగా చెప్పాము. మనిషి చిన్నవాడు కావున 108 కోట్ల సెకండ్లను ఒక కర్మ
పగలుగా చెప్పుచున్నాము. దేవునికి మొదలులేదు, తుదయులేదు. కావున ఆయనకు ఆయుష్షు అనునదే లేదు. 108
కోట్ల సంవత్సరములు ఒక పగలుగా లెక్కించబడుచున్నది, అయితే ఇన్ని దినములకు ఆయుష్షు అయిపోవునని చెప్పలేదు.
అలాగే మనిషికి 69 సంవత్సరముల, 5 నెలలా, 10 రోజులు (108 కోట్ల సెకండ్లు) ఒక కర్మపగలుగా చెప్పబడుచున్నది.
అంతేగానీ జీవుని యొక్క ఆయుష్షు ఇంత అని ఎవరూ చెప్పలేరు. దేవునికి కర్మలేదు, కావున 108 కోట్ల సంవత్సరములు
ఆయనకు ఒక పగలుకాగా, మనిషికి కర్మవున్నది, కావున 108 కోట్ల సెకండ్లకు జీవునకు ఒక కర్మ పగలుగా
చెప్పబడుచున్నది. దేవునికి ఆయుషూలేదు, అంతమూలేదు. అలాగే జీవునికి ఆయుష్షులేదు, కానీ అంతమున్నది.
జీవునియొక్క అంతము అతని కర్మనుబట్టి ఉండును. కర్మ అయిపోతే జీవుడు అంతమైపోవును. అందువలన జీవున్ని
క్షరుడు అని భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమున చెప్పారు. కర్మ అయిపోనంతవరకు జీవుడు నశించక, జీవితమును
సాగిస్తూనే ఉండును. జీవుడు ధరించిన శరీరము నశించినా అది శరీరముయొక్క నాశనమేగానీ, జీవుని నాశనముకాదు.
అతిచిన్న కాలమైన క్షణము (సెకండు) నుండి జీవున్ని లెక్కించవచ్చును. అలాగే అతిపెద్ద కాలమైన సంవత్సరము
నుండి దేవున్ని లెక్కించవచ్చును. అందువలన కోట్ల సంవత్సరములు దేవుని పగలుగా, కోట్ల సెకండ్లు జీవుని కర్మపగలుగా
లెక్కించుచున్నాము. ఇప్పుడు కొందరు కర్మపగలంటే ఏమిటి అని ప్రశ్న అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఇలా కలదు. జీవుడు నిత్యము కర్మను అనుభవిస్తూ, కర్మను సంపాదించుకొనుచున్నాడు. అనుభవించే కర్మ ప్రారబ్ధము
అయితే, సంపాదించబడే కర్మను ఆగామికర్మ అంటాము. సంపాదించబడే క్రొత్త కర్మ కాకుండా, అనుభవిస్తున్న
ప్రారబ్ధము కాకుండా, మిగులు నిలువయున్న కర్మను సంచిత కర్మ అంటాము. క్రొత్తగా సంపాదించబడే ఆగామికర్మ
ఒకమారు సంచితముగా మారిపోవును. సంచిత కర్మనుండి జన్మ సమయములో ప్రారబ్ధకర్మ కేటాయించబడుచుండును.
40

Page 41
ఇది ఆగామి, సంచిత, ప్రారబ్ద కర్మల సమాచారము. ముఖ్యముగా ఇక్కడ గమనించవలసిన విషయమే మనగా!
జీవుడు సంపాదించుకొను ఆగామికర్మ జీవుని లెక్కలో 108 కోట్ల సెకండ్లకు (69 సం||,5 నెలల, 10 దినముల)కు
ఒకమారు సంచిత కర్మలోనికి చేరిపోయి సంచితకర్మగా మారిపోవుచున్నది. ఒకమారు ఆగామి కర్మ సంచితకర్మలో
కలిసిపోతే, అప్పటినుండి క్రొత్తగా సంపాదించబడు అగామికర్మ తిరిగి 108 కోట్ల సెకండ్లు జరుగు వరకు ఆగామిగానే
ఉంటూ, 108 కోట్ల సెకండ్లు జరిగినప్పుడు కర్మపగలుగా పేరుపెట్టబడిన ఆ సమయములో సంచితకర్మగా మారిపోవును.
ఆగామికర్మ సంచితకర్మగా మారు సమయమును “కర్మపగలు” అని అంటున్నాము. ప్రతి జీవునికి కర్మ పగలు 69
సంవత్సరముల 5 నెలల 10 రోజులకు ఒకమారు వచ్చును.
దేవుడు పురుష చిహ్నముకాగా, ప్రకృతి స్త్రీ చిహ్నముగా ఉన్నది. అలాగే జీవుడు, స్త్రీపురుష సమ్మేళనముతో
పుట్టినవాడై నపుంసకుని చిహ్నముగా ఉన్నాడని చెప్పుచున్నాము. ఆ విధానమే బయట ప్రపంచములో ప్రత్యక్షముగా
కనిపించునట్లు పురుషజన్మ శరీరములు ఉన్నాయి, స్త్రీ జన్మ శరీరములు ఉన్నాయి, నపుంసక జన్మ శరీరములు
ఉన్నాయి. అదే విధముగా దేవునికి పగలు రాత్రి ఉందని చెప్పినట్లు, మనిషికి కూడా రాత్రి పగలు ప్రత్యక్ష ప్రమాణముగా
ఉండునట్లు ఏర్పాటు చేయబడినది. దేవునికి లేనిది జీవునకు ఉన్నది కర్మయే. కర్మయే అన్నిటికి కారణమైనది.
ఆగామికర్మ సంచితముగా మారి, సంచితమునుండి ప్రారబ్ధము వస్తున్నది. సంచితము ప్రారబ్ధముగా శరీరము మారునప్పుడు
వస్తుండగా, ఆగామికము 69 సం॥ 5 నెలల, 10 పగలులకొకమారు సంచితముగా మారుచున్నది. ఆగామికర్మ
సంచితకర్మగా మారు కాలమును కర్మపగలు అంటున్నాము. దేవునికి సహస్రయుగములు ఒక పగలు, అట్లే
సహస్రయుగములు ఒక రాత్రి అని భగవద్గీతలో చెప్పబడినది. దేవుని పగలులో ప్రపంచమున్నదనీ, దేవుని రాత్రి
సమయములో ప్రపంచములేదనీ చెప్పబడినది. దేవుని పగలు రాత్రిని గుర్తించుటకు మన తలలోని నాలుగుచక్రముల
సముదాయములో పైన బ్రహ్మచక్రమనునది అమర్చబడియున్నదని చెప్పుకొన్నాము. బ్రహ్మచక్రము రెండు భాగములుగా
విభజింపబడి ఉన్నదని కూడా చిత్రపటములో చూచాము. ఇంతకు ముందు ఈ బ్రహ్మచక్రమునూ, దాని గమనమునూ
గురించి చెప్పుకొనినా, దానిలో అర్థము చేసుకోవలసిన జ్ఞానము ఎంతో ఉన్నదనీ, తెలుసుకొన్నదంతా సత్యమే అయినా
మనకు అవగాహనలోనికి వచ్చినది కొంత శాతమేనని చెప్పవచ్చును. ఇప్పుడు కలియుగమును గురించి చెప్పుకొనుచున్నాము
కావున ప్రళయమును ప్రభవమును గురించి చెప్పుకోవడమేకాక, ఇంతవరకు అర్థముకాని దానినంతటిని వివరించు
కొందాము.
ఈ విశ్వమంతయు ప్రళయకాలములో లేకుండా పోతుందనీ, విశ్వములేనప్పుడు పంచభూతములులేవనీ, ఆ
స్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదనీ, ఏమీలేని స్థితి ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరనీ, అటువంటి అన్నీ లేని
స్థితిలో కూడా దైవము ఉన్నాడనీ, విశ్వములేని స్థితినే దేవుని రాత్రిగా చెప్పబడుచున్నదనీ, ఆ విధముగా వేయియుగములు
గడచిపోగా తిరిగి వేయియుగములు విశ్వము ప్రభవమును పొంది జీవించియుండుననీ, ఆ కాలమునే దేవునియొక్క
పగలనీ చెప్పుకొన్నాము. ఇదంతా శాస్త్రబద్దముగా నూటికి నూరుశాతము సత్యమే. అయితే కొందరు ఇక్కడ ఒక
ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! "వేయియుగములు పగలుగా, వేయియుగములు రాత్రిగా, రెండువేలయుగములు
దేవునికి ఒక దినమైనప్పుడు, దేవుడు ఒక లెక్కకు కట్టుబడి ఉన్నాడనీ, ఆయన ఆయుష్షు ఎంతో ఎవరికీ తెలియకున్నా
ఆయన జీవితములో రెండువేలయుగములకు ఒక దినము పూర్తిగా గడచి పోయినట్లే కదా!” అని ప్రశ్నించవచ్చును. ఈ
41

Page 42
ప్రశ్న చాలామంది తలలో పుట్టునదీ మరియు ఇది హేతుబద్ధమైన ప్రశ్న. అందువలన దీని జవాబును జాగ్రత్తగా
గమనించవలసిన అవసరమున్నది.
దేవునికి ఒక దినము గడచినా అది ఆయన ఆయుష్షులో కొంత గడచిపోయినట్లే అగును. దేవుని ఆయుస్సు
ఎంత అని తెలియకున్నా, ఆయనకు ఎంతో కొంత ఆయుస్సు ఉందని చెప్పవచ్చును. ఈ ఆధారముతో దేవునికి కూడా
ఆయువు ఉన్నదని చెప్పుట హేతుబద్ధమే అగును. అయితే మొదటికే మోసమన్నట్లు దేవుడు దేనికీ బద్ధుడు కాడు.
అందువలన ఆయనను అబద్ధుడు అని అన్నారు. దేవున్ని శాస్త్రబద్దముగా నిరూపించలేము. కానీ ఆయన జ్ఞానమూ,
ధర్మములు అన్నియూ శాస్త్రబద్దమే అగును. ఆయన ధర్మము శాస్త్రబద్ధమైనపుడు ఆయన శాస్త్రబద్ధుడైనట్లే కదా! అని
అనుకొంటే అది పొరపాటే అగును. దేవుడు కొంతవరకే ధర్మబద్ధుడు, తర్వాత ఆయన ధర్మాతీతుడు. దేవుని
ధర్మములను దేవుడే తెలియజేశాడు. ఆయన తెలియ జేసిన ధర్మముల ప్రకారము ఆయనయొక్క గొప్పతనము మాత్రము
తెలియును, కానీ ఆయన తెలియడు. అందువలన ఇంతవరకు భూమిమీద పుట్టిన ఏ మనిషిగానీ, ఎంతటివాడైనా గానీ
దేవున్ని ఎవరూ చూడలేదు. ఎవడూ చూడనప్పుడు దేవుడు అనేవాడు లేనేలేడు అని చెప్పవచ్చును కదా! అంటే అట్లు
చెప్పుటకు కూడా వీలులేదు. దేవుడు ఉన్నాడనుటకు ఎంతో శాస్త్రబద్ధత ఉన్నది. దేవుని ధర్మములు అన్నియు దేవుడున్నాడని
నిరూపించు చున్నవి. కానీ దేవున్ని చూపలేవు. అందువలన దేవున్ని గురించి మేము ఒక వాక్యము చెప్పాము “దేవుడు
నిజముగా లేడు, దేవుడు అబద్ధముగా ఉన్నాడు" అని మేము చెప్పిన మాటలో నిజముగా, అబద్ధముగా అను పదములను
తీసివేస్తే దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు అనుమాటలు మాత్రము మిగులును. ఈ మాటలు కూడ వాస్తవమే. దేవుడు
లేడు అనే వారికీ, దేవుడు ఉన్నాడు అనే వారికీ, ఇరువురికీ ఈ మాటలు సరిపోతాయి. దేవుడు ఉన్నాడా, లేడా? అను
రెండు మాటలలో ఏది సత్యము అంటే విశేషముగా చూడవలసినవి నిజ, అబద్ద అను పదములు. ఈ పదములలోనే
విశేషతయున్నది. జ అనగా పుట్టుట అని అర్థము. ని అనగా లేదు అని అర్థము. నిజ అనగా పుట్టనివాడని అర్థము.
ఇదే మాటనే భగవద్గీతలో జ్ఞానయోగమునందు ఆరవ శ్లోకమున “అజోపి” పుట్టుకలేనివాడను అని చెప్పడము జరిగినది.
అట్లే అబద్ద అను పదములో “బద్ద” అనగా కట్టబడి యున్నది అని అర్థము. “అబద్ద” అనగా దేనికి కట్టబడి లేదు
అనియు లేక దేని చేత బంధింపబడి లేదనియూ అర్ధము. దీనినిబట్టి దేవుడు పుట్టలేదు. దేవుడు దేనికీ కట్టబడిలేడు అని
చెప్పవచ్చును.
దేవుడు పుట్టనపుడు ఆయనకు ఆయుష్షుంది అని చెప్పడము సత్యము కాదుకదా! అట్లే “నవ్యయాత్మ” అని
శ్లోకములో చెప్పినట్లు ఆయనకు మరణము కూడా లేదు. అందువలన చావుపుట్టుకలు లేని దేవునికి పగలు రాత్రిని
ఆయుష్షుగా నిర్ణయించుటకు అవకాశములేదు. అందువలన పగలు రాత్రి జీవున్ని గురించి చెప్పినవేననీ, అవి దేవునికి
వర్తించవనీ తెలియవలెను. స్థూలముగా జీవునికి వర్తించు విషయములనే సూక్ష్మముగా దేవుని విధానములో చెప్పబడి
ఉన్నవి. ఉదాహరణకు ప్రకృతి పరమాత్మలు భార్యా భర్తలుగా ఉన్నారని చెప్పుచున్నాము. అయితే ఆ విషయము
సూక్ష్మముగా జ్ఞాన సమాచారముగా ఉన్నది. అదే విషయమే స్థూలముగా ఒక పురుషుడు, ఒక స్త్రీ భార్యాభర్తలుగా
ఉండడముగా కనిపిస్తుంది. ప్రకృతి పురుషులకు జీవులు సంతతిగా ఉన్నారని చెప్పడము సూక్ష్మముగా ఉన్న జ్ఞాన
సమాచారము కాగా, అదే సమాచారము ప్రత్యక్షముగా స్థూలముగా భూమిమీద అందరికి తెలియునట్లు కలదు. ప్రకృతి
ఒక్కటే, దేవుడు ఒక్కడే, వారికి పుట్టిన జీవులు అనేకము (ఒక్కటి కాదు.) అదే విధముగా తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కడే.
జంటకు పుట్టిన బిడ్డలు ఎక్కువమంది అని బయటప్రపంచములో ప్రత్యక్షముగా కనిపిస్తున్నది. ఈ విధముగా కొన్ని
42

Page 43
దేవున్ని ఉద్దేశించి చెప్పిన జ్ఞాన విషయములు అందరికీ అర్థమగునట్లు ప్రత్యక్షముగా ఉన్నాయనీ, వాటిని ఎవరూ
కాదనలేరనీ చెప్పవచ్చును. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. వేయియుగములు దేవునికి ఒక పగలుగా, వేయి
యుగములు ఒక రాత్రిగా భగవంతుని (దేవుని) చేతనే చెప్పబడినది, అట్లే దేవుని పగలు సమయములో ప్రపంచమున్నదనీ,
ప్రపంచము సృష్టింపబడుచున్నదనీ, దేవుని రాత్రి సమయములో ప్రపంచములేదనీ, అంతా ప్రళయము చెందుచున్నదనీ,
భగవంతుని చేతనే చెప్పబడినది. ఇక్కడ ముఖ్యముగా అందరూ గమనించ వలసిన విషయమేమనగా!
దేవుని పగలు, రాత్రి అని చెప్పబడినట్లే, జీవునికి కూడా పగలు రాత్రి ప్రత్యక్షముగా ఉన్నవి. దేవుని పగటి
కాలములో ప్రపంచమున్నట్లే, జీవుని పగటి కాలములో ప్రపంచమున్నది. దేవుని రాత్రి కాలములో ప్రపంచములేదని
చెప్పినట్లు జీవునికి కూడా రాత్రి సమయములో (నిద్రలో) ప్రపంచము లేదు. జీవునికి పగలు సమయమైన మెలకువలో
జీవుడు ఉన్నాడు, అతనితో పాటు ప్రపంచమూ ఉన్నది. అయితే జీవుని రాత్రి సమయమైన నిద్రలో జీవునికి తెలిసి
జీవుడూ లేడు, జీవుడు తెలుసుకొను ప్రపంచమూ లేదు. జీవుని రాత్రి సమయములో (నిద్రలో) జీవుడూ, ప్రపంచమూ,
అన్నీ ఉండినా వానికి మాత్రము తెలియకుండా పోవుచున్నవి. ప్రపంచమూ, జీవుడూ, ఆత్మ అన్నీ ఉండినా జీవునికి
తెలిసినట్లు జీవుడు గానీ, ప్రపంచముగానీ తెలియకుండా పోవుచున్నవి. అందువలన ఆ సమయమును ఆ జీవునికి
ఉన్నవన్నీ లేకుండా పోయినవనీ, అన్నీ ప్రళయము చెంది పోయినవని చెప్పవచ్చును. ప్రళయము అనగా పుట్టినవన్నీ
లేకుండా పోవడము అని అర్థమగుట వలన జీవుని రాత్రి సమయమును ప్రళయ మనియే చెప్పవచ్చును. ప్రళయము
అంటే భూమి ముక్కలైపోతుందనీ, అగ్ని ప్రేలిపోతుందనీ, సముద్రము భూమిమీద పాయలుగా, అలలుగా వచ్చి
(సునామీలుగావచ్చి) ప్రజలను చంపుతుందనీ, సుడిగాలి అన్నిటినీ నాశనము చేస్తుందనీ అనుకోకూడదు. ఆ విధముగా
జరుగడము ప్రళయము కాదు. మనిషికి పగలు కాలములో (మనిషికి మెలుకువ కాలములో) జీవునికి (మనిషికి)
తెలియునట్లు జరుగు ప్రకృతి బీభత్సములు ప్రళయములు కావు. మనిషికి ప్రకృతి అంతయూ లేకుండాపోవడమూ,
అట్లే తానుకూడా లేకుండా పోవడము ప్రళయమగును. తనకు (జీవునికి) తెలియబడు ప్రకృతి అంతయూ లేకుండా
పోవడమును ప్రళయము అంటాము. జీవునికి తెలియ కుండా పోయినదంతా తిరిగి తెలియడమును ప్రభవము
అంటాము. అందరూ ప్రళయములుగా ఊహించుకొను ప్రకృతి బీభత్సరములన్నియు మనిషి జీవించి ఉన్న సమయములోనే
జరుగుచున్నవి. ప్రకృతి ఉదృతము వలన కలిగెడి భూకంపములూ, సునామీలూ, అగ్ని ప్రేలి భూమిమీదున్న జీవరాసులను
కాల్చడమూ, సుడిగాలుల బీభత్సము అన్నీ మనిషిని బాధించుటకేగానీ అవి లేకుండా పోవడానికి కాదు. ప్రకృతి
మనిషి యొక్క దృష్ఠిలో లేకుండా పోవుటను ప్రళయమనీ, ప్రకృతి మనిషి యొక్క దృష్ఠిలోనికి రావడమును ప్రభవమనీ
చెప్పవచ్చును. ఇక్కడ బాగా జ్ఞాపకము పెట్టుకోవలసిన విషయమేమనగా! మనిషి (జీవుడు) తనకు తాను తెలియకుండా
పోయినపుడు, తనకు తెలిసినవన్నీ లేకుండా పోవడమును ప్రళయము అని అంటున్నాము. మనిషి తనకు తాను
తెలియబడినపుడు, అంతవరకు తనకు తెలియకుండా పోయినవన్నీ తిరిగి తెలియబడడమును ప్రభవమనీ అంటున్నాము.
ఇక్కడ ప్రళయ విషయములో మనుషులందరూ చాలాపొరపాటు పడిపోయారు. అలాగే ప్రభవము అను
విషయములో కూడా పొరబడి పోయారు. సత్యమును తెలుసుకొంటే అన్ని సమయములలోనూ పగలుగానీ, రాత్రిగానీ
ఏదో ఒకటి జరుగుచున్నది. పగలు సమయములో మెలుకువ, రాత్రి సమయములో నిద్ర అనునవి నిర్ణయింపబడి
ఉన్నవి. మెలుకువ నిద్ర రెండు మనస్సునుబట్టియుండును. మనస్సు అణిగిపోతే అది మనిషికి రాత్రిగా, మనస్సు
అణిగిపోకుండా పనిచేయునపుడు ఆ సమయమును పగలుగా లెక్కించి చెప్పవచ్చును. శరీరములోని మనస్సు బయటి
43

Page 44
ప్రపంచ విషయములను గ్రహించగలిగినపుడు, బయటవున్న ప్రకృతిలోని పంచ భూతములు జీవునికి తెలియబడుచున్నవి.
శరీరములోని జీవుడు తన మనస్సు వలన బయటవున్న పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమిని
గ్రహించగలుగుచున్నాడు. శరీరము యొక్క బయటవున్న పంచభూతములు శరీరములోపలనున్న జీవుడు వేరువేరుగా
ఉన్నాయి. శరీరము లోపలనున్న జీవునికి బయటనున్న ప్రపంచము పగలుకాలములో తెలియబడుచున్నది, రాత్రి
కాలములో తెలియబడడము లేదని ఎవరైనా చెప్పవచ్చును. శరీరములోని జీవునికి పగలు కాలములో ప్రకృతి ఎలా
ఉన్నదో, అలాగే రాత్రి కాలములో ప్రకృతి జీవునికి తెలియనప్పటికీ, ప్రకృతి మాత్రము పగలు కాలములో ఎట్లున్నదో
రాత్రికాలములో కూడ అట్లే ఉన్నది. పగలు రాత్రి అనునవి శరీరములో జీవునికి మాత్రమేగానీ, బయట ప్రపంచమునకు
కాదు. ప్రకృతికి రాత్రి పగలు అనునవి వర్తించవు. రాత్రి పగలు జీవునికి మాత్రము వర్తించును. పగలులోనున్న జ్ఞప్తి
రాత్రిపూట శరీరములో లేనిదానివలన మనిషి తనను తాను మరచిపోవుచున్నాడు. నిద్రలో తనకు ఏమాత్రము ఎరుక
(జ్ఞప్తి) లేనిదానివలన జీవునకు తాను ఉన్నట్లుగానీ, బయట ప్రపంచమున్నట్లుగానీ ఏమాత్రము తెలియదు. అప్పుడు
మెలకువలో ఉన్నవన్నీ లేకుండా పోయినట్లే, కావున అలా ప్రపంచము జీవాత్మ దృష్ఠిలో లేకుండా పోవడమును
ప్రళయము అంటాము. ఎప్పుడైతే ఉన్నవన్నీ తిరిగి తెలియబడుచున్నవో, ఆ సమయమును ప్రభవము అంటున్నాము.
ప్రళయములోగానీ, ప్రభవములోగానీ ప్రపంచము ఎలా ఉన్నది అలాగే ఉన్నది. అంతేగానీ ప్రభవములోనున్న ప్రకృతి
ప్రళయములో స్థూలముగా నాశనము చెందుననీ, నాశనమైపోయిన ప్రకృతి ప్రభవములో తిరిగి దేవునిచేత తయారు
చేయబడునని అనుకోకూడదు.
జీవునికి మెలకువ సమయము పగలు, జీవునికి నిద్ర సమయము రాత్రిగా చెప్పుకొన్నప్పుడు, జీవుని పగలు
సమయములో బయటి ప్రపంచ మంతా వ్యక్తముగా ఉన్నది. అలాగే రాత్రి సమయములో పగలు వ్యక్తముగానున్న
ప్రపంచమంతా అవ్యక్తముగా మారిపోవుచున్నది. వ్యక్తమును (తెలియబడడమును) ప్రభవమనీ, అవ్యక్తమును (తెలియకుండా
పోవడమును) ప్రళయమనీ అంటున్నాము. ప్రళయ సమయములో జీవునికి ప్రపంచము తెలియకుండాపోవడము
తప్ప, స్థూలముగా ఎటువంటి నాశనము కాలేదు. మనము చూస్తున్నట్లే సముద్రములో సునామీలు, భూమిలో కంపనములు,
గాలిలో సుడులు, అగ్నిలో ప్రేలుళ్ళు ఎన్ని సంభవించినా నీరుగానీ, భూమి గానీ, గాలిగానీ, అగ్నిగానీ, ఏదీ నాశనమైపోలేదు.
ప్రకృతి యొక్క పంచ భూతముల బీభత్సములు ఎన్ని జరిగినా వాటిచేత మనిషి బాధింపబడుచున్నాడుగానీ, అవి
మాత్రము ఏ ఒక్కటీ నాశనముకాలేదని జ్ఞాపకముంచుకోవలెను. ప్రకృతికి నాశనమనునది లేదు. అందువలన
వేయియుగములు గడచిన తర్వాత లేక కలియుగము 250 మార్లు గడచిన తర్వాత 250వ మారు చివరిగా వచ్చు
కలియుగముతోనే ప్రళయము వస్తుందనీ అనుకోవడము పొరపాటగును, అజ్ఞానమగును. ప్రకృతి స్థూలముగా నాశన
మవడము అసంభవము. ప్రకృతి ప్రళయములో అవ్యక్తమూ, ప్రభవములో వ్యక్తము అగుట మాత్రము సంభవము.
ఇదే విషయమును భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగమున 17,18,19 శ్లోకములందు ఇలా చెప్పబడినది.
17) శ్లో॥
సహస్రయుగపర్యన్త మహర్య దృహ్మణో విదుః
రాత్రిం యుగ సహస్రాన్తాం తేహెూ రాత్రవిదో జనాః॥
18) శ్లో॥
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవన్యహరాగమే,।
రాత్రాగమే ప్రలీయన్తో తత్రైవా వ్యక్త సంజ్ఞకే II
44

Page 45
19) శ్లో॥
భూతగ్రామస్స ఏవాయుం భూత్వాభూత్వా ప్రలీయతే,
రాత్రాగమే వశః పార్థ! ప్రభవ త్యహరాగమే.
17వ శ్లోక భావము :- వేయియుగములు ఒక పగలుగా, అలాగే వేయి యుగములు ఒక రాత్రిగా పెద్ద అయిన
దేవునికి లెక్కించబడుచున్నవని ఏ జనులైతే తెలియగలరో అట్టివారు తన రాత్రిని పగలును తెలియగలరు.
18వ శ్లోక భావము :- పగలు రాత్రిని గురించి తెలిసినవారికి పగలు కాలములో సమస్త ప్రపంచము
వ్యక్తమగుచున్నట్లు తెలియుచున్నది. అట్లే రాత్రి కాలములో వ్యక్తమగుచున్న ప్రపంచమంతయు అవ్యక్తమగు చున్నట్లు
తెలియుచున్నది. ప్రపంచము యొక్క వ్యక్తావ్యక్తములు జీవుని యొక్క రాత్రి పగలునుబట్టి కలుగుచున్నవి.
19వ శ్లోక భావము :- సకల జీవరాసులు పగలు జీవించుచున్నవి, రాత్రి అయిన వెంటనే ప్రళయమును
పొందుచున్నవి. తిరిగి పగలైన వెంటనే ప్రభవమును పొందుచున్నవి. ఈ విధముగా సకల జీవరాసులు ప్రళయ
ప్రభవములను పొందుచున్నవి. ఇట్లు రాత్రి పగల్లు ప్రళయమునూ, ప్రభవమునూ కర్మవశమున సకల జీవులు
పొందుచున్నవి.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగుటకుల అవకాశము గలదు. అదేమనగా! మనిషి పగలు మెలకువలో,
రాత్రి నిద్రలో ఉండడము సహజమే అయినా, కొందరు మాత్రము రాత్రి సమయములో ఎక్కువసేపు మేల్కొని పనిని
చేయుచుందురు. అప్పుడు వారు మేల్కొని ఉన్నారు. కావున ఆ సమయమును రాత్రిక్రిందికి లెక్కించుకోవలెనా? లేక
పగలు క్రిందికి జమ వేసుకోవలెనా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దేవుని రాత్రి పగలు
యొక్క విధానమంతా ఎవడు తెలియగలడో వానికి వాని యొక్క రాత్రిపగలు వివరమంతా తెలియునని నాశనముకాని
దేవుని యోగమను ఈ అధ్యాయములో 17వ శ్లోకమందు చెప్పబడియున్నది. తర్వాత 18వ శ్లోకములో చెప్పినట్లు
పగలు ప్రపంచము వ్యక్తమగుచున్నది, రాత్రి ప్రపంచము అవ్యక్తమగుచున్నది. వ్యక్తము అనగా మేల్కొన్నపుడు తెలియు
చున్నది. అవ్యక్తమనగా నిద్రపోవునపుడు తెలియనిది అని అర్థము. ఈ సూత్రము ప్రకారము మనిషి ఎంతసేపు
మేల్కొన్నాడో, దానిని ప్రపంచము వ్యక్తమగు పగలుగా వానికి లెక్కించవలెను. అలాగే ఒక మనిషి ఎంతకాలము
నిద్రపోయాడో, ఆ సమయములో ప్రపంచము అవ్యక్తముగా ఉండును. కనుక నిద్రపోయిన సమయమునంతటిని
రాత్రిగానే లెక్కించవలెను. ఒక మనిషి బయట కనిపించు రాత్రిలో మేల్కొనినా అది వానిలెక్కలో పగలుగా లెక్కించబడును.
అట్లే ఒక మనిషి బయట అందరికి తెలియు పగలులో నిద్ర పోయినా అది వానిలెక్కలో రాత్రిగానే లెక్కించబడును.
దేవుని పగలు రాత్రిని ఆధారము చేసుకొని మనిషియొక్క పగలు రాత్రిని గుర్తించవచ్చునని భగవంతుడు అక్షరపర
బ్రహ్మయోగములో 17వ శ్లోకమందే తెలిపాడు.
ఇప్పుడు కొందరు మరియొక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! మన తలలో పాలభాగమునకు సమానముగా
తలమధ్యలోనున్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములందు పైనగల బ్రహ్మచక్రము రెండు భాగములుగా ఉన్నదనీ, బ్రహ్మచక్రము
యొక్క ఒక భాగము తిరుగుటకు వేయియుగముల కాలము పట్టుననీ, రెండు భాగములు కలిసి ఒక చుట్టు తిరుగుటకు
రెండు వేలయుగముల కాలము పట్టుననీ, ఒక భాగము యొక్క సహస్రయుగముల కాలము దేవునికి ఒక పగలనీ,
మరియొక భాగముయొక్క వేయియుగముల కాలము దేవునికి ఒక రాత్రని మీరే చెప్పారు కదా! అంతేకాక దేవుని
యొక్క పగలు కాలమైన వేయియుగములు ప్రపంచమున్నదనీ, అలాగే దేవుని యొక్క రాత్రి కాలమైన వేయియుగములు
45

Page 46
ప్రపంచములేదని చెప్పారు కదా! అలాంటపుడు దేవుని రాత్రి అయిన బ్రహ్మచక్రములోని సగభాగము తిరుగునపుడు
వేయియుగములు ప్రపంచము లేదనియేగా అర్థము. మీరు అప్పుడు కూడా ప్రపంచము నాశనముకాదనీ, జీవులు ఎలా
ఉండువారు అలాగే ఉందురనీ, మనుషులు లేకుండా పోయే ప్రసక్తే లేదని చెప్పుచున్నారు. మీరు చెప్పుమాట
బ్రహ్మచక్ర గమనమునకు సరిపోదు. బ్రహ్మచక్రములో సగభాగమునందు ప్రపంచములేదు అని దేవుడే చెప్పినపుడు
సగ భాగములో కూడా ప్రపంచమున్నదని మీరు చెప్పడము తప్పుకాదా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఇలా కలదు.
ఆ
బ్రహ్మచక్రము మనిషి తలలో ఉన్నది. బ్రహ్మచక్రములోనే దేవుని పగలు రాత్రి భాగములు రెండూ కలవు.
మనిషికి ఎప్పుడైతే జ్ఞప్తి (మెలకువ) కలదో ఆ కాలమును పగలనియూ, అలాగే మనిషికి ఎప్పుడైతే జ్ఞప్తి లేకుండా పోయి
మరుపు అయిన నిద్ర వస్తుందో ఆ కాలమును రాత్రి అనియూ చెప్పుకొన్నాము. బ్రహ్మచక్రములోని పగలు
వేయియుగములూ, రాత్రి వేయి యుగములు మానవుని కొరకు లెక్కించబడినవేనని చెప్పుకొన్నాము. దేవుని వేయియుగముల
పగలు కాలమును మనిషికి ఒక కర్మపగలుగా గుర్తించి కూడా చెప్పాము. దేవుని నమునాలోనే జీవుడు మనగలగుచున్నాడు.
దాని ప్రకారము జీవునికి (మనిషికి) కూడా పగలు రాత్రి ఏర్పడుచున్నది. దేవుని పగలు ప్రపంచమున్నట్లు, జీవుని
పగలు కాలములో కూడా ప్రపంచమున్నదనీ చెప్పుకొన్నాము. అయితే ఇక్కడ ముఖ్యముగ తెలియవలసిన సమాచారము
ఒకటి కలదు. అదేమనగా! ఒక మనిషికి పగలు కాలము జరుగుచున్నప్పుడు ఆ మనిషి యొక్క తలలోని బ్రహ్మచక్రమునందు
గల సగభాగమైన పగలు మాత్రమే తిరుగుచుండును. అదే ప్రకారము ఒక మనిషికి రాత్రి కాలము జరుగుచున్నప్పుడు
ఆ మనిషి యొక్క బ్రహ్మచక్రములోని రాత్రి సగభాగములో చలనము వచ్చి తిరుగును. దేవుడు నిర్ణయించిన దానిప్రకారమే
శరీరములో జరుగుచున్నది. అందువలన మనిషియొక్క పగలు సమయములో బ్రహ్మచక్రములోని ఒక భాగములో
చలనము వచ్చి తిరుగును. బ్రహ్మచక్రము లోని పగలు భాగము తిరుగుచున్నప్పుడు, రాత్రి భాగము చలనములేకుండా
నిలిచియుండును. అలాగే రాత్రిభాగము తిరుగుచున్నప్పుడు, పగలు భాగము ఏమాత్రము కదలకుండా వుండిపోవును.
ఇప్పుడు కొందరిలో మరియొక ప్రశ్న పుట్టవచ్చును. అదేమనగా! బ్రహ్మచక్రములో రెండు భాగములున్నాయని
మీరే చెప్పారు కదా! అందులో ఒక భాగము కదిలితే చక్రమంతా కదిలి రెండవభాగము కూడా కదులును కదా!
అటువంటపుడు ఒక భాగము కదిలి తిరుగునప్పుడు రెండవ భాగము కదలకుండా ఉండిపోవునని చెప్పడము తప్పుకదా?
అని అడుగవచ్చును. ఈ ప్రశ్నకు మా జవాబు ఇలా కలదు. మామాట పూర్తిగా అర్థము కానప్పుడు ఎవరికైనా తప్పుగా
కనిపించడములో విచిత్రమేమీలేదు. ఇక్కడ బ్రహ్మచక్రమును గురించి పూర్తిగా తెలుసుకొంటే మా మాట తప్పుగా
కనిపించదు. మేము చెప్పినది సత్యమేనని తెలియును. బ్రహ్మచక్రము రెండు భాగములుగా ఉండుట నిజమే, అయినా
రెండు భాగములు ఒకదానితో ఒకటి అను సంధానము చేయబడి లేవు. ఆ రెండు భాగములు విడివిడిగా ఉన్నవి.
బ్రహ్మచక్రములోని పగలు, రాత్రి భాగములు వేరువేరుగా ఉండుట వలన మనిషి జీవితములో ఖచ్చితముగా సగము
పగలు, సగము రాత్రి అనునది లేకుండా పోయినది. ఒకడు పగలును ఎక్కువ అనుభవించితే, రాత్రిని తక్కువ
అనుభవించుచున్నాడు. అలాగే మరియొకడు రాత్రిని ఎక్కువ అనుభవించితే, పగలును తక్కువ అనుభవించుచున్నాడు.
ఎవని జీవితములో కూడా రాత్రి పగలు సమానముగా లేవు. దానికి కారణము, బ్రహ్మచక్రములోని పగలు రాత్రి
46

Page 47
భాగములు రెండు ఒకదానితో ఒకటి అనుసంధానమై లేకుండుటే కారణమని చెప్పవచ్చును. బ్రహ్మచక్రములోని రెండు
భాగములు వేరువేరుగా ఎలా ఉన్నవో క్రింది చిత్రములలో చూడవచ్చును.
పగలు భాగము
బ్రహ్మచక్రము పటము (1)
రాత్రి భాగము
పగలు భాగము
రాత్రి భాగము
బ్రహ్మచక్రము పటము (2)
ఈ చక్రములో పగలు కాలము రాత్రికాలమును కూడా ఆక్రమించినట్లున్నది. కావున మనిషి ఎక్కువ కాలము
మేల్కొని తక్కువ కాలము నిద్రించువాని చక్రములోని నమూనా విధానమిట్లుండునని తెలియవచ్చును.
పగలు భాగము
రాత్రి భాగము
బ్రహ్మచక్రము పటము (3)
ఈ చిత్రములో రాత్రి కాలము పగలు కాలమును ఆక్రమించుకొన్నది. కావున మనిషి ఎక్కువకాలము నిద్రపోయి
తక్కువ కాలము మేల్కొను వాని చక్రములోని నమూనా విధానమిట్లుండునని తెలియవలెను.
బ్రహ్మచక్రము దేవుని విధానములో సగభాగము తిరుగుటకు వేయి యుగముల కాలము పట్టును. అంతపెద్ద
బ్రహ్మచక్రమును జీవుని విధానములోనికి మార్చుకొని మనిషి యొక్క పగలు రాత్రికాలములను లెక్కించి చూడవలెనని
తెలుపుచున్నాము. ఒక సంవత్సర కాలమును ఒక సెకనుగా మార్చుకొంటే ఎంత చిన్నదగునో, అంతచిన్నదిగా
47

Page 48
బ్రహ్మచక్రమును మనిషి విధానములో చిత్రించుకొని చూడవలెనని తెలుపుచున్నాము. ఒక సంవత్సరమును ఒక
సెకనుగా మార్చుకొని చూచు నమూనాను మాత్రము పై చిత్రములో చూపించానని తెలియవలెను. మనిషి పగలు
ఎక్కువ జీవించి రాత్రి తక్కువ జీవించిన విధానమును, అట్లే రాత్రి ఎక్కువ కాలమును వినియోగించుకొని పగలు
తక్కువ కాలమును వినియోగించుకొనిన విధానమును పై చిత్రములలో చూపించానని అర్థము చేసుకోవలెను.
మనిషి తన జీవితములో రాత్రి పగళ్ళను ఎక్కువ తక్కువలుగా కర్మనుబట్టి అనుభవించుచుండును. అలా ఒక
జన్మకు కేటాయించబడిన ప్రారబ్ధకర్మను అనుభవించి, ప్రారబ్ధకర్మ అయిపోయిన వెంటనే ఆ జన్మలో మరణించి
అంతవరకున్న శరీరమును వదలివేసి తన సంచితము నుండి క్రొత్త ప్రారబ్ధకర్మను తీసుకొని తిరిగి క్రొత్త శరీరమును
ధరించి జన్మించు చుండును. ఈ విధముగా జీవుడు జన్మలు మారుచుండును. చివరకు సంచితకర్మ అంతయు
అయిపోయి ప్రారబ్దముగా మారుటకు లేనప్పుడు ఆ జీవుడు దేవునియందైక్యమై పోవును. జన్మలనుండి విడుదలయై
కర్మనుండి ముక్తి పొందును. అంతవరకు తెలియని దేవుడు అప్పుడు మాత్రమే తెలియును. అంతవరకు జన్మలెత్తుచున్న
ఎవనికీ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎవరూ దేవున్ని చూడలేరు. కర్మనుండి ముక్తి పొందిన జీవుడు దేవునియందైక్య
మైపోవును. అప్పుడు జీవుడు, దేవుడు అను బేధముండదు. అంతవరకు ఏ జీవుడైనా భూమిమీద జన్మలు ధరిస్తూ
కర్మను అనుభవిస్తూ కాలమును గడుపవలసిందే. కర్మలు అయిపోనివాడు జన్మలు ఎత్తుతూ ఎంతకాలము జీవించాలి?
ఈ జన్మలకు అంతులేదా? కొంతకాలమైనా ఈ కాలచక్రము ఆగిపోదా? ప్రళయములో అన్నీ అంతమైపోయి 108 కోట్ల
సంవత్సరముల తర్వాత తిరిగి పుట్టునను మాట అసత్యమా? దేవునికి జీవుల మీద దయా దాక్షిణ్యములుండవా?
ఎంతకాలము మేము జీవించాలి? ఖగోళమునుండి వచ్చు ఆస్ట్రాయిడ్స్ భూమిని గుద్దుకొని, భూమి ధూళిగా మారిపోవుననీ,
భూమిమీద జీవరాసులన్నీ లేకుండా పోవునని చెప్పుచున్న శాస్త్రజ్ఞుల మాట అసత్యమా? ప్రళయ ప్రభవములు అసత్యమా?
అని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు.
మీ ప్రశ్నలకు తర్వాత జవాబులను చెప్పెదను. దానికంటే ముందు కొంత సమాచారమును చెప్పెదను వినండి.
1994 సంవత్సరము ఏప్రిల్ చివరి దినములలో నేను ఢిల్లీనుండి రైలులో ప్రయాణము చేసి వచ్చి సికింద్రాబాద్
స్టేషన్లో దిగి అక్కడే దగ్గరున్న రైల్వే మెజిస్ట్రేట్ గారి ఇంటికి పోవడము జరిగినది. ఆయన నాకు బాగా తెలిసినవాడు,
కనుక నా కారును వారి ఇంటివద్ద ఆపివుండుట వలన నేను వారి ఇంటికి పోవలసి వచ్చినది. ఆ మెజిస్ట్రేట్ గారు
బ్రహ్మకుమారి సమాజములో పాల్గొని జ్ఞానమును తెలుసుకొనెడివాడు. నేను గన్లైసెన్సును తీసుకొన్నానని తెలిసి
ఆయన నాతో ఇలా “గన్లైసెన్సు ఎందుకు అనవసరముగా? 1994 సంవత్సరము చివరికంతా ప్రళయము వచ్చి
ప్రపంచమంతా లేకుండా పోతుందని, మా బ్రహ్మకుమారి సమాజములోని పెద్దలు తెలిపారు. ఇది వారికి దైవమునుండి
వచ్చిన సందేశము. అందువలన ఇక ఆరు లేక ఏడు నెలలలో అంతాపోతుంది. అందరమూ పోయేటప్పుడు గన్లైసెన్సు
ఎందుకు” అని అన్నాడు. ఆయన పెద్దమనిషి అయిన దానివలన, మరియు పెద్ద జ్ఞానసంస్థ అయిన బ్రహ్మకుమారి
సమాజము వారు చెప్పిన దానివలన ఆ మాట సత్యమే అవుతుందేమోనని నేను కూడా కొంత అనుకోవడము జరిగినది.
అదే విషయమునే నేను కూడా నాకు తెలిసిన కొందరికి చెప్పడము జరిగినది. చివరికి ఆ సంవత్సరములో డిశంబరు
నెలకూడా రావడము, పోవడము జరిగినది. తర్వాత 1995 సంవత్సరము ప్రారంభమైనది. దానితో 1994 సంవత్సరము
ప్రళయము వస్తుంది అనుమాట అసత్యమై పోయినది.
48

Page 49
ఆ తర్వాత కొంతకాలము గడచిపోయి 1996 సంవత్సరము వచ్చినది. అప్పుడు "కలియుగాంతము 1999”
అను పుస్తకమును చూడడము జరిగినది. ఆ పుస్తకమును తీసి చూస్తే దాని రచయిత వేదవ్యాస్ ఐ.ఎ.యస్. అనివుంది.
ఒక విద్యావేత్త మరియు గొప్పజ్ఞాని అని పేరుగాంచిన వ్యక్తి వ్రాసిన పుసక్తములోని సమాచారము సత్యమే అయి
ఉంటుందనుకొని నేను ఆ పుస్తకమును తీసుకోవడము జరిగినది. తర్వాత ఆ పుస్తకమును చదివితే 1999 సంవత్సరము
తప్పనిసరిగా కలియుగాంతమగునని ఎన్నో ఆధారములు చెప్పబడివున్నది. అవన్నియు చూచిన తర్వాత ఒకప్రక్క అది
అసత్యమని తెలిసినా నేను కూడా తప్పనిసరిగా యుగాంతము అవుతుందేమో నని అనుకొన్నాను. చివరికి 1999
గడచిపోయి 2000 సంవత్సరము వచ్చి వేదవ్యాస్ వ్రాసినమాటను తుస్సు మనిపించింది. ఈ విధముగా కలియుగాంతము
అనుమాట రెండుమార్లు అబద్దమైనది. ప్రస్తుతము ఇప్పుడు రెండు సంవత్సరములనుండి, 2012 కలియుగాంతము
అనుమాట బయటకు వచ్చినది. ఈ మారు నెల, దినము నిర్ణయముచేసి 2012 డిశంబరు, 21వ తేదీన కలియుగము
అంత్యమగునని చెప్పడము జరుగు చున్నది. ఇప్పుడు ఒక ప్రక్కన జ్యోతిష్యశాస్త్రజ్ఞులు, మరొకప్రక్క ఖగోళ శాస్త్రజ్ఞులు,
ఇంకొక ప్రక్క మరొక ఆధ్యాత్మిక సంస్థవారు, ఇంకా పేరుపొందిన విదేశీ క్యాలెండరు 2012 సంవత్సరముతో
అయిపోతుందని, తర్వాత ఆ క్యాలెండరును వ్రాయలేదనీ అందువలన తప్పనిసరిగా యుగాంతము జరిగిపోవునని
కొందరు చెప్పడము జరుగుచున్నది. ఇదంతయుకాక టీవి9 ఛానెల్వారు 2011 డిశంబరు 20వ తేదీన “యుగాంతము
365 దినములు" అను పేరుమీద చర్చావేదిక నిర్వహించారు. ఆ చర్చలో పాల్గొన్నవారు తప్పనిసరిగా యుగాంతము
అవుతుందని కొందరు చెప్పగా, వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము తరపున వచ్చిన వ్యక్తి మాత్రము బ్రహ్మముగారు చెప్పిన
సంఘటనలు కొన్ని మాత్రము జరిగాయనీ, ఇంకా జరుగవలసినవి ఎన్నో ఉన్నాయనీ, అందువలన 2012 డిశంబరు,21
దినమున యుగాంతము జరగదనీ వాదించడము జరిగినది. ఈ మారు మేము కూడా యుగాంతము అసత్యమని
చెప్పువారి మాటనే ఒప్పుకోవలసి వచ్చింది. మామాట ప్రక్కన పెడితే సామాన్య ప్రజానీకము కలియుగాంతమును
గురించి రకరకములుగా చెప్పుకోవడము జరుగుచున్నది.
కలియుగాంతమును గురించి గతములో 1994 లోనూ, 1999 లోనూ చెప్పినవారుగానీ, ప్రస్తుతము
చెప్పుచున్నవారుగానీ బ్రహ్మవిద్యా శాస్త్రమును ఆధారము చేసుకొని చెప్పలేదు. ఇప్పుడు ప్రజలలో నెలకొని యున్న
యుగాంత విషయమును షట్శాస్త్రములలో పెద్దదైన బ్రహ్మవిద్యా శాస్త్రము చేత అన్వేషించి, అది సత్యమో అసత్యమో
తేల్చాలనుకొన్నాము. నాకు ఇష్టమైన శాస్త్రము, జీవుల విషయములో ఎప్పటికీ సత్యమునే ప్రకటించు బ్రహ్మవిద్యా
శాస్త్రమును ఉపయోగించి చూస్తే ప్రళయము, యుగాంతము సత్యమో కాదో తెలిసిపోతుందని అనుకొని అన్వేషించి
వ్రాసినదే ఈ చిన్న గ్రంథము. ఈ జన్మలకు అంతులేదా? కొంతకాలమైనా జీవులకు విశ్రాంతి లేదా? అను ప్రశ్నలకు
జవాబు లేదా అను ప్రశ్నలకు జవాబులను చెప్పు కొంటే, అన్ని మతములలో చెప్పుకొన్న ప్రళయమున్నది, కానీ ప్రళయము
అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రళయమంటే సర్వనాశనమైపోవడమే అని అందరు అనుకోవడము జరుగుచున్నది.
ఇప్పుడు మేము చెప్పుచున్న సంచలన రహస్య సమాచారమునుబట్టి చూస్తే ప్రళయమనునది ఉన్నది. కానీ దాని
స్వరూపమువేరని తెలియుచున్నది. ప్రభవము అంటే అందరూ అనుకొన్నట్లు క్రొత్తగా సృష్టింపబడడమని అనుకోవడము
పొరపాటని తెలియుచున్నది. జీవులు అందరూ చనిపోవడము ప్రళయమనీ, అందరూ తిరిగి పుట్టడమును ప్రభవమని
అనుకోవడము దేవుని ధర్మమునకు విరుద్ధమగును. దైవధర్మము ప్రకారము దేవుడు ఒకమారే విశ్వమునంతటిని
సృష్ఠించాడు. విశ్వమును సృష్టించకముందు ఆయన సృష్టికార్యమును చేశాడు. సృష్టే లేనప్పుడు ఆయన (దేవుడు) ఎలా
49

Page 50
పని చేసినది ఎవరికీ తెలియదు. మనము లేనప్పుడు ఆయన ఎలా చేసినా పని చేసినట్లు మనము చెప్పలేము. మనము
సృష్ఠింపబడిన తర్వాత దేవునికున్న ధర్మము ప్రకారము ఆయన పని చేయడు. అందువలన ఆయనను క్రియారహితుడు
అని అన్నాము. ఆయన పని చేయనివాడు, ఆయన ఏ పనికీ పనికిరాని వాడు అని చెప్పుచున్నాము.
దేవునికి వేయియుగములు ఒకపగలు, వేయియుగములు ఒక రాత్రి అయినప్పుడు రాత్రిని ప్రళయముగా,
పగలును ప్రభవముగా చెప్పుకొంటే, ప్రతి ప్రభవములోనూ దేవుడు క్రొత్తగా సృష్టిని తయారు చేయుచున్నాడని అనుకొంటే,
ఆయన ప్రతి దినము పని చేసినట్లగును. దేవుడు ప్రతి దినము పని చేస్తున్నాడనడము దేవుని ధర్మమునకు వ్యతరేఖమగును.
అందువలన అధర్మముతో కూడుకొన్న మాటలను మనము చెప్పకూడదు. దేవుని ధర్మములనూ, జ్ఞానమునూ
మాట్లాడునపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడ వలసియుంటుంది. అట్లుకాకుండా దేవుని ధర్మములకు వ్యతిరేఖముగా
మాట్లాడితే పాపమును మూటగట్టుకోవలసి వస్తుంది. అందువలన మనము దేవుని ఎడల భయముకల్గి మాట్లాడితే,
దేవుడు ఒక్కమారే సృష్ఠిని సృష్టించాడు. అప్పుడు ఎట్లు తయారు చేసినది ఎవరికీ తెలియదు అని చెప్పవచ్చును.
అప్పుడు మనము లేము కాబట్టి అప్పటి విషయమును మనము లెక్కించలేము. మనము సృష్టింపబడిన తర్వాత అప్పటి
నుండి ఇప్పటి వరకు దేవుడు ఏ కార్యమూ చేయలేదు. అందువలన ఆయన క్రియారహితుడు అనుట ధర్మము. దేవుని
ధర్మమును అనుసరించి చూస్తూవస్తే, ఎప్పటికీ కాలము ఆగిపోదు. నాలుగుయుగములు అయిపోతూనే తిరిగి కృతాయుగము
మొదలగుచుండును. చచ్చినవాడు వానివాని కర్మనుబట్టి తిరిగి పుట్టుచుండును. చావుపుట్టుకలు అంతులేని ప్రక్రియగా
కొనసాగుచుండును. దేవుడు కాల స్వరూపుడు, కావున దేవునికి అంతులేదు. అట్లే కాలమునకు అంతులేదు. ఈ
సూత్రము ప్రకారము, బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము, కలియుగమునకు ఎప్పటికీ అంతులేదు. కలియుగము 250
మార్లువస్తే 108 కోట్ల సంవత్సరములైనా, తిరిగి వెంటనే కృతియ్యగము మొదలగును. ఇట్లు ఎడతెరపిలేని కాలములో
ఒక్క కలియుగమునకే కాదు, ఏ యుగమునకు కూడా అంతులేదు. సృష్టి అంతముకాదు, తిరిగి దేవుడు సృష్ఠిని
తయారు చేయడు. దేవుడు ఒక్కమారు తయారు చేసిన సృష్ఠి ఎప్పటికీ నాశనము కాదు. అది నాశనమంటూ జరిగితే
మోక్షమందే జరగాలి. అంతవరకు నాశనమగుటకు వీలులేదు. ఏ జీవరాశి అయినా ఇటు ప్రకృతిలోనైనా ఉండాలి
లేకపోతే దేవునియందైనా ఐక్యమైపోవాలి. అంతతప్ప ఏ జీవుడు ఎటువంటి స్థితి పొందుటకు వీలులేదు, ఇది శాసనము.
కావున జగతిని సృష్టించిన దేవుడు, జీవుడు జననమరణములనుండి బయటపడి తనయందు ఐక్యమైపోవునట్లు తన
జ్ఞానమును కూడా సృష్ఠి ఆదిలోనే తెలియజేశాడు.
ఆ
సృష్టింపబడిన ప్రతి జీవరాసి ఆదినుండి నేటి వరకు జన్మలు మారుతూనే వస్తున్నది. మనము కూడా ఆదిలోనే
సృష్ఠించబడినాము. తర్వాత జనన మరణములను పొందుచున్నాము. నేటికి ఈ స్థితిలో ఉన్నాము. ఈ జన్మకూడా
శాశ్వితమైనది కాదు. గతములో ఎన్నో జన్మలు మారినట్లే ప్రస్తుతమున్న జన్మను కూడా మారవలసిందే. ఈ సృష్ఠి
ఎప్పుడు తయారైనదో ఖచ్చితమైన లెక్క ఎవరివద్దా లేదు. ఇంతకాలము గడచినదని కొందరు చెప్పుచుండినప్పటికీ,
మాటలు శాస్త్రబద్ధమైనవి కావు. అందువలన అది సత్యము కాదు. జరిగిన దానిని వదలి, జరుగబోవు దానిని చూచినా
అది ఎవరికీ అర్థముకాని అగమ్యగోచరము. జీవుడు మోక్షము పొంది దేవునియందైక్యమగు వరకు ప్రపంచము
కొనసాగుతూనే ఉంటుంది. జగతికి అంతు అనునది లేదు. అంతు అనునది ఒక్క మోక్షములోనే జరగాలి. ప్రళయములో
జరుగదు. మోక్షమనునది దేవుడు చెప్పిన జ్ఞానము వలన లభిస్తుంది. నేడు దేవుని జ్ఞానము మీద ఆసక్తిగలవారు
అరుదైపోయారు. అంతేకాక దేవుని జ్ఞానము ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయినది. అందువలన దేవునియందు
50

Page 51
కలిసిపోవువారు లేకుండా పోవుట వలన సృష్ఠిలో పుట్టిన జగతి స్థిరస్థాయిగా జన్మలు మారుచూ సాగిపోవల సిందే.
జనన మరణములను పొందు మనిషి, కాలములోనే బ్రతకాలి. కావున కాలములో ఏ యుగమునకు అంతులేదు.
కలియుగము అంతకూ అంతము కాదు. ఇంకా గట్టిగా చెప్పితే “కలియుగము ఎప్పటికీ అంతముకాదు” అని చెప్పవచ్చును.
మనిషి ప్రళయము ప్రభవము అను మాటలను వింటున్నాడు. కానీ అవి ఎట్లుంటాయో, వాటియొక్క వాస్తవరూపము
ఏమిటో పెద్ద స్వామీజీలకు కూడా ఇంతవరకు తెలియదు. మనుషులకు అందరికీ తెలిసినది మరణమొక్కటే. ప్రళయము
అంటూనే దానిని మనిషి మరణముగా లెక్కించు కొనుచున్నాడు. ప్రళయము మరణములాంటిదే, కానీ మరణము
కాదని ఎవరికీ తెలియదు. ప్రళయమునకు, మరణమునకు కొంత తేడావున్నది 1) మరణములో జీవునియొక్క శరీరము
మారిపోవుచున్నది. ప్రళయములో జీవుడు శరీరమును మారడు. 2) మరణము చెందిన జీవుడు ఒక్కక్షణము కూడా
ఆలస్యము లేకుండా రెండవ శరీరమును చేరి జన్మించుచున్నాడు. ప్రళయమును పొందిన జీవుడు వెంటనే ప్రభవమును
పొందలేడు. ప్రళయము నకు ప్రభవమునకు మధ్యలో కొంత సమయము గడచిపోవుచున్నది. 3) మరణములో
స్థూలశరీరముతోపాటు సూక్ష్మశరీరమును కూడా జీవుడు కోల్పోవుచున్నాడు. ప్రళయములో స్థూల, సూక్ష్మశరీరములు
రెండు లేకుండా పోతున్నవి. తర్వాత ప్రభవములో అదే సూక్ష్మ, స్థూలశరీరములను జీవుడు పొందుచున్నాడు.
4) మరణములో మనిషి జ్ఞాపకాలను కోల్పోతున్నాడు. ప్రళయములో మనిషి కోల్పోయిన జ్ఞాపకమును ప్రభవములో
తిరిగి పొందు చున్నాడు. 5) మరణములో ప్రారబ్ధకర్మ అయిపోయి మరుక్షణము జరుగు జన్మలో క్రొత్త ప్రారబ్ధకర్మ
ఏర్పడుచున్నది. ప్రళయములో పాత ప్రారబ్ధకర్మ అయిపోదు. ప్రభవములో క్రొత్త ప్రారబ్ధ కర్మరాదు. 6) మనిషి
చనిపోయినప్పు డున్న సంచితకర్మనుండి, మరుక్షణములో జరుగు జననములో ప్రారబ్ధకర్మ ఏర్పడుచున్నది. 7) ప్రళయములో
ఎటువంటి కర్మమార్పిడి జరుగదు. మనిషి (జీవుడు) ఏ ప్రాంతములో, ఏ స్థలములో మరణిస్తే అదే ప్రాంతములో, అదే
స్థలములో తిరిగిపుట్టునను నమ్మకము లేదు. అయితే మనిషి ఏ ప్రాంతములో, ఏ స్థలములో ప్రళయమును పొందితే
అదే స్థలములో, అదే ప్రాంతములో ప్రభవము చెందును. 8) మరణములో జీవుడు మోక్షము పొందుటకు అవకాశము
గలదు. ప్రళయములో అటువంటి అవకాశము ఏమాత్రము లేదు. ఈ విధముగా చెప్పుకుంటూపోతే ప్రళయమునకు
మరణమునకు ఎన్నో విధముల భేదములున్నవి.
మరణము-జననము
1) మరణములో జీవుని పాత
1)
శరీరముపోయి, జననములో క్రొత్త
శరీరము వస్తున్నది.
2) మరణములో ఒక్కక్షణము కూడా
ఆలస్యము లేకుండా జననమును
2)
పొందుచున్నాడు. మరణమునకు,
జననమునకు మధ్యలో ఒక్కక్షణము
కూడా గడువులేదు.
3) మరణములో స్థూలశరీరముతో
ప్రళయము-ప్రభవము
ప్రళయములో జీవుని పాత
శరీరము పోదు, ప్రభవములో
క్రొత్తశరీరము రాదు.
ప్రళయమును పొందిన జీవుడు
వెంటనే ప్రభవమును పొందలేడు.
ప్రళయమునకు ప్రభవమునకు
మధ్యలో కొంత సమయము గడచి
పోవుచున్నది.
3)
ప్రళయములో స్థూల, సూక్ష్మ
పాటు సూక్ష్మశరీరమును కూడా
51
శరీరములు రెండూ లేకుండా

Page 52
జీవుడు వదలిపోవుచున్నాడు.
జననములో పాతవి కాకుండా క్రొత్త
వాటిని పొందుచున్నాడు.
4) మరణములో మనిషి జ్ఞాపకాలను
కోల్పోవుచున్నాడు.
4)
5) మరణములో పాత ప్రారబ్ధకర్మ
అయిపోయి, వెంటనే జరుగు జన్మలో
5)
క్రొత్త ప్రారబ్ధకర్మ ఏర్పడుచున్నది.
6) మరణములోనున్న సంచితకర్మ
నుండి మరుక్షణములో జరుగు
6)
జననములో ప్రారబ్ధకర్మ ఏర్పడుచున్నది.
7) మరణములో మనిషి ఏ ప్రాంతంలో, 7)
ఏ స్థలములో ఉంటే అదే
ప్రాంతములో అదే స్థలములో తిరిగి
పోవుచున్నవి. తర్వాత ప్రభవములో
అదే స్థూల, సూక్ష్మ శరీరములను
పొందుచున్నాడు.
ప్రళయములో మనిషి
కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి ప్రభవములో పొందుచున్నాడు.
ప్రళయములో పాత ప్రారబ్ధ
కర్మ అయిపోదు. ప్రభవములో
క్రొత్త ప్రారబ్ధకర్మ రాదు.
ప్రళయములోనున్న సంచిత
a
కర్మనుండి ప్రభవములో ప్రారబ్ద
కర్మ ఏర్పడదు.
ప్రళయములో మనిషి ఏ
ప్రాంతములో, ఏ స్థలములో
ఉండునో, ప్రభవములో అదే
పుట్టునను నమ్మకము లేదు.
ప్రాంతములో అదే స్థలములో ఉండును.
8) మరణములో జీవుడు మోక్షమును
8)
ప్రళయములో జీవుడు మోక్షమును పొందు అవకాశము
పొందుటకు అవకాశము కలదు.
ఏమాత్రము లేదు.
9) మరణము పొందిన వాడు
9)
ప్రళయము పొందినవాడు
పుట్టక తప్పదు.
ప్రభవము చెందక తప్పదు.
ఈ విధముగా వివరించుకొని చూస్తే చావు పుట్టుకలువేరనీ, ప్రళయ ప్రభవములువేరనీ, ఒక జీవునికి వాటి
అనుభవములువేరనీ తెలిసి పోవుచున్నది. ప్రస్తుతము సజీవముగానున్న మనిషికి చావుపుట్టుకలలో పుట్టుక జరిగిపోయినది,
ఇక జరుగవలసినది చావుమాత్రమే. అలాగే ప్రళయ ప్రభవములలో ప్రభవము గడిచిపోయినది, ఇక ప్రళయము
మాత్రమే జరుగవలసియున్నది. మనిషికి జరుగబోవు మరణములోగానీ, ప్రళయములో గానీ ఎన్నో వేరువేరు మార్పులున్నా,
రెండిటియందు జీవునికి అనుభవము మాత్రము ఒకే విధముగా ఉండును. మరణసమయముగానీ, ప్రళయ సమయముగానీ
జీవునికి ఏమి జరుగుచున్నదో వివరించి చెప్పితే, ఏ జీవునికి గానీ మరణము వరకు ఉన్న అనుభవము తెలియును.
అయితే మరణము పొందు సమయములో జీవునికి ఏ అనుభవము ఉండదు. అట్లే ఏ జీవుడైనా ప్రళయము వరకు
ఉన్న అనుభవమును అనుభవించియుండవచ్చును. కానీ ప్రళయము పొందు సమయములో జీవునికి ఏ అనుభవమూ
ఉండదు. అందువలన మరణము, ప్రళయము రెండూ ఒకే విధముగా జీవుని అనుభవానికి అందవు అని చెప్పవచ్చును.
అదే విధముగా జననము గానీ, ప్రభవముగానీ ఎవరి అనుభవానికి రావు. అలా జనన మరణములు, ప్రళయ సంభవములు
రెండు అనుభవానికి రాకపోవడానికి కారణము ఏమనగా! చావుపుట్టుకలు, ప్రళయ సంభవములు రెండు కర్మకు అతీత
మైనవి. కర్మ అయితేనే జీవుని అనుభవానికి వస్తుంది. కానీ కర్మ కానిది ఏదీ జీవుని అనుభవానికి రాదు. అందువలన
అనంత విశ్వములో ఏ జీవరాసి ఇటు జనన మరణములను గానీ, అటు ప్రళయ సంభవములను గానీ అనుభవించలేదు.
52

Page 53
అనుభవానికి వచ్చిన విషయము మాత్రమే జీవునికి తెలియును. అనుభవానికి రాని విషయమును జీవుడు ఏమాత్రము
చెప్పలేడు. అయితే ఇప్పుడు కొందరు తెలివైనవారు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! "ప్రపంచములో
అందరితోపాటు మీరు కూడా ఒక జీవుడే కదా! అటువంటపుడు చావుపుట్టుకలుగానీ, ప్రళయ ప్రభవములు గానీ మీ
అనుభవానికి కూడా రావుకదా! మీ అనుభవానికి రాని విషయమును మీరు ఎలా వ్రాయగలిగారు” అని అడుగవచ్చును
దానికి మా జవాబు ఏమనగా!
గాలివాటము సుడిగుండములో ఇరికించిందన్నట్లు, చివరకు మేము ప్రశ్నల పాటమునకు బడిబందములో
ఇరుక్కొన్నట్లయినది. నేను ఇప్పుడు మీవలె జీవున్ని అని అంటే 1980లోనే వ్రాసిన “జనన మరణ సిద్ధాంతము” గానీ,
ఈ మధ్య కాలములో వ్రాసిన “మరణ రహస్యము”, పునర్జన్మ రహస్యము”, “త్రైతాకార రహస్యము”, “సమాధి” మరియు
ప్రస్తుతము వ్రాసిన "కలియుగము ఎప్పటికీ అంతము కాదు” అను ఈ ఆరు గ్రంథములలో చెప్పిన జ్ఞానమంతా అందరి
దృష్ఠిలో అసత్యముగా కనిపించును. నాకు తెలియకున్నా, నా అనుభవమునకు రాకున్నా నేను మిమ్ములను మోసగించి
వ్రాసినట్లగును. లేదు నేను సత్యమునే చెప్పుచున్నాను అంటే దానికంటే ముందు నేను జీవున్ని కాదు అని చెప్పాలి.
నేను జీవుడనని చెప్పితే ఇంతవరకు ఎవరికీ తెలియవని చెప్పిన రహస్యములు అన్నీ అందరికీ అసత్యములుగా కనిపించును.
చెప్పిన జ్ఞానమంతా అసత్యము కాదు సత్యమే అంటే, నేను జీవుడను కాదు అని చెప్పవలసివస్తుంది. ఇటువంటి కష్ట
పరిస్థితిలో దారి తెలియక ఇబ్బందిపడకుండుటకు కొన్ని నిమిషములు ఆలస్యమైనా నా నుండి సరియైన జవాబే
బయటకు వచ్చింది. ఆ జవాబు ఇలా కలదు. ప్రతి మనిషిలోనూ జీవాత్మ, ఆత్మ రెండు గలవు. జీవాత్మ అన్నిటిని
శరీరములో అనుభవించువాడుకాగా, అనుభవింపజేయునది ఆత్మ కలదు. జీవునికి శరీరములో అనుభవమునకు
వచ్చిన విషయములే తెలుసు. అయితే ఆత్మకు శరీరములో జీవుని అనుభవమునకు రాని అన్ని పనుల వివరము
తెలుసు. వివరముగా చెప్పితే మరణములోగానీ, జననములోగానీ, అట్లే ప్రళయ ప్రభవములలోగానీ, జీవునికి తెలియనిది
ఏదైనా అన్నీ శరీరములోని ఆత్మకు తెలుసు. ఇంతవరకు చెప్పిన జ్ఞానమంతా మేము చెప్పినదే, కానీ నేను చెప్పినది
కాదు. నా ఆత్మ చెప్పితే నాకు తెలిసింది, కానీ నాకు స్వయముగా తెలియదు. అందువలన వ్రాసిన గ్రంథములు,
చెప్పిన జ్ఞానము అంతా నాదికాదనీ, నా ఆత్మదనీ తెలియవలెను. మీ శరీరములో కూడా ఆత్మ కలదు. దానికి కూడా
అన్నీ తెలుసు. అయితే మీ ఆత్మను మీరు ఏమీ అడగలేదు. మీ శరీరములో మీతోపాటు ఒక ఆత్మ ఉందని మీకు
తెలియదు. మీ శరీరములో ఆత్మ ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో, దాని పనేమిటో, దానితో ఎలా మాట్లాడాలో నీవు
తెలియగలిగితే నాకు నా ఆత్మ చెప్పినట్లే, నీతో కూడా నీ ఆత్మ చెప్పగలదు. నీవంటే ఎవరో నీకే తెలియదు.
అటువంటపుడు నీ ప్రక్కనే ఉన్న ఆత్మ ఎలా తెలుస్తుంది? నాకు తెలిసినట్లు ఆధ్యాత్మిక రహస్యములు తెలియాలంటే
ముందు నిన్ను నీవు తెలుసుకో, శరీరములో నీవు ఎక్కడున్నావో తెలుసుకో, అక్కడ నీ పనేమిటో తెలుసుకో, ఆ తర్వాత
నీ ఆత్మ నీకు తెలుస్తుంది. అప్పుడు నా అంతటివానివి నీవు కూడా కావచ్చును.
అనుభవ
ప్రస్తుత కాలములో అందరూ మనుషులే అయినా, అందరికీ ఒకే దేవుడున్నా, మనిషి అజ్ఞానము చేత మతములుగా
విడిపోయి, ఒకేజాతి మనుషులను వివిధ రక మతస్థులుగా చెప్పుకోవడము జరుగుచున్నది. అట్లే వారివారి మతముల
విధానమునుబట్టి ఉన్న ఒకే దేవున్ని మీ దేవుడు మా దేవుడు అని విడదీసుకొన్నారు. మనిషి అజ్ఞానముచేత మతములలోను
దేవుళ్ళలోనూ వేరువేరు భావములు కల్గియుండినా, అందరికి మరణము జననము ఒకే విధముగా ఉన్నవి. ప్రళయము
ప్రభవము కూడా ఒకే విధముగా ఉండినా, వారివారి మతములనుబట్టి వేరువేరుగా అర్థమును చేసుకొన్నారు. కొన్ని
53

Page 54
మతములలో మరణమును ప్రళయము అని అను కోవడము జరుగుచున్నది. ఒకమారు పుట్టినవాడు ఒకమారే ప్రళయము
చెందుననీ, తిరిగి పుట్టడనీ చెప్పడము కూడా జరుగుచున్నది. వారి మత మూలగ్రంథములలో ఆ విషయము లేకున్నా
వారి అవగాహన లోపము వలన తప్పుగా చెప్పుకోవడము జరుగుచున్నది. పుట్టినవాడు ప్రళయము చెంది తిరిగి
పుట్టడని చెప్పినప్పుడు, వారు మరణమును ప్రళయముగా లెక్కించుకొనుచున్నారని అర్థమైపోవుచున్నది. ఈ విధముగా
మరణమును ప్రళయమును ఒకటేనని పొరపడడమేకాక, స్వర్గమును, పరలోకమును కూడా ఒకటేనని లెక్కించుకొన్నారు.
స్వర్గము, పరలోకము వేరువేరని తెలియనట్లు మరణమును ప్రళయమును వేరువేరని అనుకోలేదు. మరణము ఒక
జీవితమును అంతము చేయుచున్నది, ఒక జీవున్ని కాదు. అట్లే ఒక ప్రళయము ఒక పగలును అంతము చేయుచున్నది,
ఒక జీవితమును కాదు. జీవునికి జీవితమునకు, జీవితమునకు పగలుకు తేడా తెలియనివానిని జ్ఞాని అనుటకు ఏమాత్రము
అర్హుడు కాడు.
మరణమును జీవుని చివరి ఘట్టముగా లెక్కించకూడదు. మరణము జీవితము యొక్క చివరి ఘట్టమగును.
అలాగే ప్రళయము జీవుని నాశనము కాదు. ప్రళయము తీర్పు దినమూ కాదు. మరణము మనిషికి తర్వాత జన్మ
ఇలాగ ఉండవలెనని తెలుపు తీర్పు దినముగా ఉన్నది. మరణము తీర్పు మరియు మార్పు దినముగా ఉన్నది. ప్రళయము
ఎవరికీ తీర్పుదినము మార్పుదినము కాదు. మరణము కర్మకు అతీతముగా ఉన్నది. కావున మరణ విషయమునూ,
ప్రళయ విషయమునూ జాగ్రత్తగా తెలియగలిగితే, మొదట మనిషి ప్రళయమును జయించగలుగుతాడు. తర్వాత మరణమును
జయించగలుగుతాడు. ప్రళయమును గురించి తెలియనిదే, మరణమును గురించి తెలియలేడు. మరణమును గురించి
తెలియనిదే, చివరిదైన మోక్షము లేక పరలోకమును గురించి తెలియలేడు. పుట్టిన ప్రతి మనిషి ఏ మతస్థుడైనా వాడు
దేవునియందు ఐక్యమైపోవలసినవాడే. దేవునియందు చేరకపోతే వాడు గత్యంతరము లేక జనన మరణములు, ప్రళయ
ప్రభవములు పొందుచూ ఉండవలసిందే. అందువలన మనిషి మరణించుటకు పుట్టకూడదు. దేవున్ని తెలియుటకే
పుట్టాలి. దేవుడు మతములకు అతీతుడైన కాల స్వరూపుడు. కావున కాలముతో మొదలుపెట్టి చివరిదైన కలియోగము
యొక్క అంతులేని స్థితిని గురించి తెలుసుకొందాము. నాశనము చేయువాని యందు కలిసిపోదాము అను అర్థమునిచ్చునదే
కలియోగము అనీ, కలియోగము నాశనముకానిదనీ తెలుసుకొందాము.
ఇట్లు
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
54


----
Page 1
30
స్వర్గము ఇంద్ర లోకమా!
నరకము యమ రాజ్యమా!!
అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ (హిందూ) ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
చక్రం
కాల
చక్రం
కర్మ
చక్రం
చక్రం
ఇందూ
-బ్రహ్మనాడి
“జ్ఞానవేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞానవేదిక
(Regd.No. : 168/2004)
1
Date : 29-09-2014

Page 2
స్వర్గము ఇంద్ర లోకమా!
నరకము యమ రాజ్యమా!!
స్వర్గము అను పేరు విననివారుండరని చెప్పవచ్చును. ఎందుకనగా! ప్రతి మతములోనూ, వారి మత
గ్రంథములలోనూ స్వర్గమును గురించి ఎంతో చెప్పడము జరిగినది. అంతేకాక ప్రతి బోధకుడూ, ప్రతి స్వామీజీ
స్వర్గమును గురించి చెప్పడము జరుగుచున్నది. మూల గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో
స్వర్గము మరియు నరకము అని రెండు పేర్లు ఉండడము వాస్తవమే అయినా, అక్కడ స్వర్గమును గురించి, నరకమును
గురించి ఏమి సమాచారమును చెప్పారో తెలియక, అక్కడ చెప్పినదానిని గ్రహించక, గ్రంథములలో చెప్పిన దానికంటే
భిన్నముగా వ్రాసుకోవడము జరిగినది. ఒకరు వ్రాసిన విషయమును పది మంది చదివి వారు మరికొంత తప్పుగా
అర్థము చేసుకోవడము జరుగుచున్నది. ఇట్లు వాస్తవ విషయము మరుగున పడిపోయి క్రొత్త విషయము అందరి
తలలో చేరిపోయినది.
గ్రంథములలో చెప్పిన విషయమును వదలి తప్పు సమాచారమును ఎలా అర్థము చేసుకొనుచున్నారో ఉదాహరణగా
ఒక విషయమును తీసుకొని చూస్తాము. వెంకయ్య అనువాడు ఉన్న ఊరు ఏది అని వ్రాయబడి ఉన్నదనుకొనుము.
అప్పుడు దానిని చదివినవారందరూ వెంకయ్య అను వ్యక్తి ఉండు ఊరు ఏదోయనీ, అతని ఊరు పేరు తెలియదనీ
చెప్పడము జరుగుచున్నది. అందరూ ఆ విధముగా అనుకొనుటకు అవకాశము గలదు. అయితే వెంకయ్య అనువాడు
ఉన్న ఊరు పేరే “ఏది” అయినప్పుడు “ఏది” అనుమాట ఊరి పేరని ఎంతమంది గ్రహించగలరు? “ఏది” అనునది ఒక
పేరని అర్థము చేసుకోక, చెప్పేవాడు కూడా ఊరుపేరు తెలియక అడుగుతున్నాడనుకుంటే, వెంకయ్య నివసించు
ఊరుపేరు “ఏది” అనునదేనని తెలియకుండా పోవును. 'ఏది' అను శబ్దము ఒక ఊరు పేరని గ్రహించనివారు, అది
యొక ప్రశ్నయని అనుకోవడము జరుగు చున్నది. వెంకయ్య ఊరు ఏది? అని ప్రశ్నగా అర్థము చేసుకొన్నప్పుడు, ‘ఏది’
అను పేరుగల ఊరే వెంకయ్యదని ఎవరూ అనుకొనుటకు ఎలా అవకాశము లేదో, అలాగే స్వర్గము అనుమాటకు
అర్థము తెలియకపోతే, స్వర్గమనుదానిని అందరూ వేరే లోకముగానో, వేరే దేశముగానో అర్థము చేసుకొను అవకాశము
గలదు. స్వర్గము అను విషయములో కూడా అవగాహనా లోపము వలన అందరూ స్వర్గమును వేరే లోకమను
కొంటున్నారు. అలాగే నరకమును కూడా వేరే లోకమని చెప్పుకోవడము జరుగుచున్నది.
‘ఏది’ అనుమాట ప్రశ్నించబడు ప్రశ్నయని తెలిసినప్పుడు, దానిని జవాబుగా ఎవరూ లెక్కించరు. అట్లే స్వర్గము,
నరకము కనిపించని వేరే లోకములని అర్థము చేసుకొన్నప్పుడు, వాటిని కనిపించే లోకములని ఎవరూ గుర్తించరు.
స్వర్గము అంటే వాస్తవము ఏమిటి? నరకము అంటే సత్యము ఏమిటి? అని గ్రహించనివారు ఆ రెండిటినీ ఇతర
లోకములుగా అర్థము చేసుకొన్నారు. తప్పుగా అర్థము చేసుకోవడము వలన
చేసుకొంటున్నారు. స్వర్గానికి పోతే దేవునివద్దకే పోయినట్లు భ్రమించువారు,
దారిపట్టిపోయి, మేము మంచి దారిలో ప్రయాణిస్తున్నామని అనుకొని, జీవితమునే నరక భూయిష్టము చేసుకొంటున్నారు.
ఆ విధముగా ఎందరో తమ జీవితమును పూలబాటగా పోల్చుకొని, ముళ్ళబాటలో నడుచుచున్నారు. దానికి తార్కాణముగా
కొందరు తమ జీవితములనే వ్యర్థము
స్వర్గము కొరకు ప్రాకులాడుచూ తప్పు
2

Page 3
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
జూలై 30వ తేదీ 2014న టీవీ9లో వచ్చిన వార్తను, అందులో వచ్చిన ఉత్తరమును చూస్తే కొందరు ఏ విధముగా
తప్పుడు అవగాహనలో పడిపోవుచున్నారో తెలియగలదు.
66
కొంతమంది ‘జీహాద్' పేరిట టెర్రర్ బాట
నేను ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళుతున్నాను. అల్లాకోసం నేను యుద్ధభూమికి వెళ్ళాలి. అందుకే
వెళ్ళుతున్నాను. ఒకవేళ ఇరాక్లో జరిగే అంతర్యుద్ధంలో నేను పాల్గొనకపోతే, మరణ సమయములో అల్లా
భూమికి వెళ్ళలేదనే బాధ నన్ను వెంటాడుతుంది.
ఇప్పుడు నాకు ఎలాంటి విషయం గురించీ అపరాధభావం లేదు. మీ అందరినీ స్వర్గంలో కలుస్తాను.”
(Who is ISIS next target? - Tv9, Published on Jul 30, 2014)
అంతేకాక 2014 సెప్టెంబరు 7,8 తేదీలలో వచ్చిన వార్తల ప్రకారము, పదిహేనుమంది యువకులు స్వర్గము
వస్తుందని ఇరాక్లో జరిగే యుద్ధములో పాల్గొనుటకు ఇళ్ళు వదిలిపోతూ, కలకత్తా ఎయిర్పోర్టులో పట్టుబడిన విషయము
అందరికీ తెలుసు. బయటికి తెలిసిన వీరే కాకుండా, బయటికి తెలియని ఎందరో దేవుని అడ్రస్ (చిరునామ) స్వర్గమని
అనుకొని మేము నేరుగా దేవునివద్దకే పోతున్నామనీ, అక్కడ స్వర్గములో కలుసుకుందా మని చెప్పడము జరుగుచున్నది.
పైన వ్రాసిన ఉత్తరమును (జాబును బట్టి దేవునిది యుద్ధభూమియని కొంత అర్థమగుచున్నది. అందులో వ్రాసిన
మాటలనుబట్టి "నేను అల్లా (దేవుని) కోసము యుద్ధభూమికి వెళ్ళాలి. ఒకవేళ ఇరాక్లో జరిగే అంతర్యుద్ధములో నేను
పాల్గొనకపోతే, మరణ సమయములో అల్లా భూమికి వెళ్ళలేదనే బాధ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు నాకు ఎలాంటి
విషయము గురించీ అపరాధ భావము లేదు. మీ అందరినీ స్వర్గములో కలుసుకుంటాను” అని వ్రాయడము చూస్తే
ఎవరికి ఎట్లున్నదోగానీ, నాకు మాత్రము వ్రాసినవారు ఎంతగానో మోసపోయారని వారిమీద కొంత సానుభూతి
ఏర్పడుచున్నది. బాగా ఆలోచిస్తే తప్పులో కాలువేసినది ఒక్క యువకులే కాదు, యువకులవద్దనుండి వృద్ధులవరకు
అందరూ స్వర్గము యొక్క విషయములో మోసపోయారని తెలియుచున్నది. తప్పుమార్గములో (తప్పు భావములో) వారు
ప్రవేశించడమేకాక అదే నిజమైన మార్గమని నమ్మి ఏకంగా పరుగెత్తుచున్నారు. మేము అజ్ఞానమార్గములో ఏమైనా
పోతున్నామా! అని ఏమాత్రము వెనుతిరిగి ఎవరూ చూచుకోవడము లేదు.
పై జాబులో ముఖ్యముగా గుర్తించిన వాక్యములను బట్టి చూస్తే వ్రాసినవారిది సక్రమమైన భావమో కాదో
తెలియగలదు. అందులో ఒక వాక్యము “నేను అ కొరకు (దేవుని కొరకు) యుద్ధభూమికి వెళ్ళాలి" అని ఉంది గదా!
దానిని గురించి యోచించి చూస్తే, మనుషులు దేవున్ని గురించి తెలుసుకొనేదానికి గానీ, దేవునిలోనికి కలిసిపోవుటకు
గానీ, దేవుని సన్నిధానములోనికి చేరుటకుగానీ, దేవుని జ్ఞానమును, ధర్మమును తెలియుటకుగానీ, మానవులందరికీ
మూడు గ్రంథములను దేవుడు ఇచ్చాడు. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును అదేమనగా! తెలుసుకోవలసినది ఒకే
దేవున్ని అయినప్పుడు దేవుడు ఒకే గ్రంథమును ఇవ్వాలి కదా! అట్లు కాకుండా మూడు పేర్లతోయున్న మూడు
గ్రంథములను ఎందుకిచ్చాడు? అలా మూడు గ్రంథములను మూడు పేర్లతో, మూడు దేశములలో, మూడు కాలములలో
3

Page 4
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఇవ్వడము వలన ప్రజలు దేవుడు ఒక్కడేనను ఏకత్వమును వదలి ముగ్గురు దేవుళ్ళు, మూడు విధముల జ్ఞానములు అని
భిన్నత్వము లోనికి పోవు అవకాశమున్నది కదా! ఒక విధముగా నేడు హిందూ, క్రైస్తవ, ఇస్లామ్ అను మూడు
మతములున్నాయి అంటే, అవి భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు గ్రంథముల వలననే ఏర్పడినవని చెప్పుటకు
అవకాశము కలదు కదా! అట్లుకాకుండుటకు దేవుడు మొదటనే ఒకే గ్రంథము ఇచ్చి దానిని మాత్రమే అనుసరించమని
చెప్పియుంటే బాగుండేది కదా!యని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు.
మనుషుల ప్రవర్తననుబట్టి, వారిలోని భావమునుబట్టి దేవునికి ఇష్టమైనవారు, దేవునికి ఇష్టములేనివారు అని
రెండు రకముల మనుషులు భూమిమీద గలరు. దేవుడు తనకు ఇష్టమైనవారు వీరు, ఇష్టములేని వారు వీరు అని
చెప్పకపోయినా ఆయన ఉద్దేశ్యమును ప్రకృతి గ్రహించగలదు. దేవునికి ఎల్లప్పుడూ భక్తురాలిగాయున్న ప్రకృతి దేవుడు
తన భావమును తెలుపకున్నా గ్రహించుశక్తి ప్రకృతికి ఒక్క దానికే గలదు. అలా గ్రహించ గలుగు ప్రకృతి, దేవునికి
ఎవరు ఇష్టులో వారికి మాత్రమే దేవుని జ్ఞానము తెలియునట్లు చేయగలదు. దేవునికి ఎవరు ఇష్టములేరో వారికి దైవ
జ్ఞానమును ఏమాత్రము తెలియకుండా చేయగలదు. ప్రకృతి తన గుణము లచేత మనిషిని దేవునివైపయినా పంపగలదు,
లేక దేవునికి వ్యతిరేఖ దిశ వైపయినా పంపగలదు. జరుగబోవు కాలములో మాయ ప్రభావము కొందరి మీద పనిచేయుటకు
అనుకూలముగా దేవుడు తన జ్ఞానమును మూడు గ్రంథముల రూపములో ఇచ్చాడు. ఎవడయితే పైకి జ్ఞానిగా
నటించుచూ, లోపల దేవునిమీద అనుమానము కల్గియుండునో అటువంటివాడు మూడు గ్రంథములలోని జ్ఞానము
వేరువేరని తలచి, దేవుడు కూడా వేరువేరుగా యున్నాడని అనుకొనును. ఆ విధముగా అనుకొనునట్లు ప్రకృతి తన
గుణముల మాయచేత చేయించును. తలలోని బుద్ధి వక్రీకరించినప్పుడు ఆ మనిషి వక్రమార్గము పట్టిపోవును. మీ
మతము వేరు, మా మతము వేరను భావములోనికి వచ్చును. అలాగే మీ దేవుడు వేరు, మా దేవుడు వేరని చెప్పుచూ,
తన దేవునిమీద తన మతముమీద ఇష్టమును ప్రకటించుచూ, ఇతర మతములమీద, ఇతర దేవునిమీద అయిష్టతను,
కోపమును ప్రదర్శించును. నేడు ఒకడు స్వమతమును అభిమానించుచూ, పరమతమును అవమానించుచున్నాడంటే
వానికి ప్రకృతి జనితమయిన మాయ ప్రభావము పనిచేసినదనియే అర్థము. వాస్తవానికి సృష్టిని సృష్టించిన సృష్టికర్త
ఒక్కడే. అతనే సర్వప్రపంచమునకూ దేవుడు.
దేవుని మీద శ్రద్ద (ఇష్టము) ఉన్న వానికి మాయ ఏ ఆటంకమునూ కలుగజేయకుండా దేవుని జ్ఞానము
అర్థమగునట్లు చేయును. అటువంటి వానికి దేవుని జ్ఞానము సంపూర్ణముగా అర్థమయి, మూడు గ్రంథములలోని
జ్ఞానము దేవుని జ్ఞానమేననీ, వాటిలో ఏమాత్రము తేడా లేదని తెలియగల్గును. అంతేకాక మొదట వచ్చిన భగవద్గీతా
గ్రంథమును దృఢపరచుటకు మిగతా రెండు గ్రంథములు వచ్చినవని తెలియగల్గును. అటువంటప్పుడు మూడు
గ్రంథముల సారాంశము ఒక్కటేనను భావములోనికి మనిషి వచ్చును. ఈ విధముగా శ్రద్ధలేని మనిషికీ, శ్రద్ధయున్న
మనిషికీ తేడాయుండును. మనిషిలోని శ్రద్ధనుబట్టి మనిషి జ్ఞానమువైపు లేక అజ్ఞానమువైపు పోవునట్లు ప్రకృతి ద్వారా
చేయుటకు, దేవుడు తన జ్ఞానమును వ్యూహరచన చేసి మూడు గ్రంథములుగా మనిషికి ఇచ్చాడు. ముందే ఒక
వ్యూహరచనతో భూమిమీదికి పంపిన గ్రంథములైన దానివలన భగవద్గీతలోని జ్ఞానమునకు తర్వాత వచ్చిన బైబిలు,
ఖుర్ఆన్ గ్రంథముల జ్ఞానము వ్యతిరేఖముగా లేదు. మొదటి గ్రంథమైన భగవద్గీతలోని జ్ఞానమును దృఢపరుస్తూ
అందువలన మూడు గ్రంథములలో ఏ గ్రంథమునుండయినా
మిగతా రెండు గ్రంథములలోని జ్ఞానము చెప్పబడినది.
ఒకే దేవుని జ్ఞానమును గ్రహించ వచ్చును. మనిషి తన శ్రద్ధాలోపమువలన మూడు గ్రంథములను వేరువేరుగా అర్థము
4

Page 5
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చేసుకొని, వాటిని అనుసరించి వేరువేరు మతములు సృష్టించు కొనినా, వాస్తవానికి మూడు గ్రంథములలో మతముల
ప్రసక్తేలేదు. మూడు గ్రంథములు సమస్త మానవుల కొరకు తయారుచేసి ఇవ్వబడినవిగానీ, ఒక వర్గమువారికనిగానీ,
ఒక మతము వారికనిగానీ చెప్పబడినవి కావు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము, ఒక మనిషిని వెదకి పట్టుకొనే దానికి ఆ మనిషికి సంబంధించిన
సమాచారమును అంతటినీ మొదట సేకరిస్తాము. సేకరించిన సమాచారమునుబట్టి కావలసిన మనిషిని సులభముగా
గుర్తించవచ్చును. అదే విధముగా దేవుని కొరకు లేక దేవున్ని తెలియుట కొరకు దేవునికి సంబంధించిన మొత్తము
సమాచారమును స్వీకరించవలసియుంటుంది. దేవునికి సంబంధించిన సమాచారము మూడు గ్రంథములలో సంపూర్ణముగా
కలదు. అందువలన దేవుని కొరకు మూడు గ్రంథములలో వెదకాలి. మూడు గ్రంథములలో ఏ ఒక్క గ్రంథము
ద్వారానైనా దేవుని సమాచారమును తెలిసి చివరకు దేవున్ని తెలియవచ్చును. అంతేగానీ దేవుని కొరకు యుద్ధభూమికి
పోనవసరములేదు. యుద్ధభూమిలో వెదకవలసిన అవసరమూ లేదు. దేవుడు తన గ్రంథములలో ఏ ఒక్క గ్రంథమందయినా
నేను యుద్ధభూమిలో తెలియబడతానని చెప్పాడా? నా కొరకు యుద్ధభూమికి రండని చెప్పాడా? అట్లు ఎక్కడా చెప్పలేదు.
కావున “నేను అల్లా కొరకు (దేవుని కొరకు) యుద్ధభూమికి వెళ్ళాలి" అను మాట పూర్తి అసంబద్ధతతో కూడుకొన్నది,
సంపూర్ణముగా అసత్యమైనది. దేవుడు ఎక్కడ తెలియబడునో అక్కడ వెదకాలిగానీ, దేవుడు తెలియబడనిచోట వెదకుట
వృథాప్రయాస అగును. అందువలన దేవుని కొరకు నేను యుద్ధ భూమికి వెళ్ళాలి అనుమాట దేవుని జ్ఞానమునకుగానీ,
దేవునికిగానీ సరిపోని మాట.
ఇతరులు చెప్పడము వలన విని దేవుడు యుద్ధభూమిలో లభిస్తాడని అనుకొనియుంటే అలా విన్నవాడు
పూర్తిగా మోసపోయినట్లేనని చెప్పవచ్చును. మూడు గ్రంథములలో దేవుడు ఒకే జ్ఞానమును చెప్పి యుండగా, దానిని
చదివే వారియొక్క అవగాహనా లోపము వలన చదివిన దానిని ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరు భావములో కొందరు
అర్థము చేసుకొనియుండవచ్చును. అటువంటి వారి బోధలలోగానీ, రచనలలోగానీ దైవజ్ఞానము కొంత
కలుషితమయివుండవచ్చును. మూల గ్రంథములలో దేవుడు చెప్పిన వాక్యములుండగా మనుషులు చెప్పిన వాటిలో
కొంత కాలుష్యముండవచ్చును. అయితే ఆ కాలుష్యమును మనిషి గ్రహించి కలుషితమును వదలి స్వచ్ఛమైన జ్ఞానమును
స్వీకరించవలసియుంటుంది. ఉదాహరణకు పండిన గింజలు, పండిన పంట స్వచ్ఛముగాయున్నా దానిని మనిషికి
ఉపయోగపడునట్లు చేసిన చోట కొంత కలుషితముండవచ్చును. ఏ విధముగా పప్పులలో కనిపించే పొట్టు కలిసియున్నదో,
ఏ విధముగా బియ్యములో కనిపించని తవుడు కలిసియున్నదో, అదే విధముగా జ్ఞానములో కూడా గుర్తించగలిగిన
తప్పులు కొన్ని, గుర్తించలేనంతగాయున్న తప్పులు కొన్ని కలిసియుండవచ్చును. పప్పులను చేటతో చెరిగి శుభ్రము
చేసుకొన్నట్లు, బియ్యమును నీటిలో కడిగి తవుడును శుభ్రము చేసినట్లు, మనము ఇతరుల ద్వారా తెలుసుకొనుచున్న
జ్ఞానమును విచక్షణ అను బుద్ధితో పరిశీలించి స్వచ్ఛమయిన జ్ఞానమును తెలియవలసియుంటుంది. అట్లుకాకుండా
విన్నదంతా సత్యము అనుకొంటే తప్పక మోసపోవలసి వస్తుంది. మనిషిలోని విచక్షణా బుద్ధి బియ్యములోని కనిపించు
రాళ్ళను వేరుచేయు జల్లెడలాంటిది. అలాగే కనిపించని తవుడును తీసివేయు నీటిలాంటిది. బుద్ధి విచక్షణ లేనివారు
హేతుబద్ధముగా దేనినీ ప్రశ్నించలేరు, శాస్త్రబద్ధముగా దేనినీ గ్రహించలేరు.
దేవున్ని తెలియాలంటే ఎంతోకాలము ఆయన జ్ఞానమును తెలుసు కొని, తెలుసుకొన్న జ్ఞానము ప్రకారము
నడుచుకొంటే, దేవుడు తెలియ బడుటకు అవకాశమున్నది. అట్లు కాకుండా యుద్ధభూమికి పోయినంత మాత్రమున
5

Page 6
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
దేవుడు తెలియబడును అనడము పూర్తి అసత్యమగును. ఒక గ్రంథములో “నేను తయారుచేసిన గుణములతో కూడుకొన్న
మాయ దుస్సాధ్యమైనదనీ, దానిని దాటి నావద్దకు రావడము దుర్లభమనీ” దేవుడే స్వయముగా చెప్పియుండగా,
బజారుకుపోయి బెల్లము తెస్తానన్నంత సుళువుగా, యుద్ధభూమికి పోయి దేవున్ని చూస్తానని చెప్పడము హాస్యాస్పదము.
మనము ఎట్లనుకొన్నా ఫరవాలేదుగానీ, అంత సులభముగా దేవుడు తెలియబడడు. దేవుడు బయటి ప్రపంచములో
తెలియువాడు కాదనీ, శరీరములోపల అంతర్ముఖముగా చూచుకొన్నప్పుడు శరీరములోనే యున్న దేవున్ని తెలియవచ్చుననీ
భగవద్గీత సూచిస్తున్నది. దేవున్ని తెలియాలంటే దేవునికి సంబంధించిన ధర్మములను తెలియవలసియుండగా, అవి ఏవీ
తెలియకనే నేను దేవునికొరకు పోవుచున్నానని చెప్పడము విడ్డూరము. జ్ఞానము తెలిసినవాడు ఎవడూ అలా చెప్పడు.
మనము సక్రమముగా ఉండాలంటే, దేవుని మార్గములో నడువాలంటే, ఇతరులు చేసిన తప్పులను చూచి మనము
అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చును. అందువలన ఇక్కడ ఇతరులు చేసిన తప్పులను చూపుట
కొరకు నాకు దొరికిన ఉత్తరములోని తప్పులను వెలుగెత్తి చూపవలసి వచ్చినది. అలా చేయుట వలన ఇతరులెవ్వరూ
దేవుని విషయములో మోసపోకుందురని తలచుచున్నాము. ఆ లేఖలో దొరికిన విచిత్రమైన విషయములు ఇంకా రెండు
గలవు. అందులో రెండవ తప్పిదమును ఇప్పుడు వివరించుకొని చూస్తాము.
“యుద్ధములో పాల్గొనకపోతే మరణ సమయములో అల్లా భూమికి నేను వెళ్ళలేదనే బాధ నన్ను వెంటాడుతుంది”
అని వుంది. ఈ వాక్యములో 'అల్లా భూమికి' అను పదమునకు వివరమును చూస్తే, దేవునికి ప్రత్యేకమైన భూమి ఏదీ
భూమండలములో లేదు. దేవుడు విశ్వమంతా అణువణువునా వ్యాపించియున్నాడు. కావున సమస్త భూమి దేవునిదే
అవుతుంది గానీ, ప్రత్యేకించి యుద్ధభూమిని మాత్రమే దేవుని భూమి అని చెప్పడము తప్పగును. స్థూలముగా కనిపించక,
సూక్ష్మముగా భూమండలమంతా వ్యాపించియున్న దేవునికి ఇది మంచి భూమి, ఇది చెడు భూమియని ఏమాత్రము
బేధముండదు. అట్లే ఇది దేవుని భూమియనీ, ఇది మాయకు సంబంధించిన భూమియనీ చెప్పుటకు వీలులేదు.
అలాంటప్పుడు దేవుని (అల్లా) భూమికి నేను వెళ్ళవలెను అని చెప్పడము పెద్ద పొరపాటగును. ఒక విధముగా చెప్పితే
దేశమంతా దేవుని భూమియే అగును. అటువంటప్పుడు కూడా ప్రత్యేకించి యుద్ధభూమిని దేవుని (అల్లా) భూమి
అనడము అవివేకమగును. ఈ లేఖలో ముఖ్యమైన మూడవ తప్పు గలదు. దానిని వివరించుకొని చూస్తాము.
"మీ అందరినీ స్వర్గములో కలుసుకొంటాను” అని వ్రాసిన మాటను బట్టి చూస్తే దేవుని కొరకు పోరాడువానికి
లేక దేవుని కొరకు యుద్ధము చేయువానికి మరణము తర్వాత స్వర్గము లభించుతుందను నమ్మకముతో అలా మాట్లాడడము
జరిగినది. ఇస్లామ్ గ్రంథమయిన ఖుర్ఆన్లో దేవునికొరకు భక్తితో ఏమి చేసినా, దానివలన మరణానంతరము స్వర్గము
లభించుతుందని దేవుడు చెప్పినట్లు మనుషులే వివరమును వ్రాసుకొన్నారు. అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్
గ్రంథములో దేవుడు చెప్పినమాటను అర్థము చేసుకోలేకపోయిన దానివలన, కొందరు మోక్షమును స్వర్గము అని
వ్రాసుకొన్నారు. అంతేకాక దేవుడిచ్చిన స్వర్గములో ద్రాక్షతోటలు, జలజల పారే మంచినీటి సెలయేళ్ళు గలవని, ఎంతో
హాయిని చేకూర్చు గాలి గంధము ఉండడమే కాకుండా, మంచి సుఖములను అందించు అందమైన స్త్రీలు పరిచర్యలు
చేస్తూ ఉందురని కూడా కలదు. స్వర్గము అంటే ఎంతో సుఖముగా ఉంటుందన్నట్లు వ్రాసియుంచారు. ఇదంతయూ
చూస్తే దేవుని కొరకు కాకున్నా, స్వర్గములోనున్న సుఖముల కొరకైనా దేవునికి భక్తిగాయుండి స్వర్గమునకు పోవాలను
ఆశ కల్గించునట్లు స్వర్గమును గురించి వ్రాయడము జరిగినది. అటువంటి స్వర్గములో కలుస్తామని లేఖలోని వ్యక్తి
స్వర్గము అను పేరును ప్రస్తావించాడు.
6

Page 7
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
స్వర్గము అనుమాట ఒక్క ఖుర్ఆన్ గ్రంథములో మాత్రమున్నదని మేము చెప్పడములేదు. ప్రపంచములో అన్ని
మతముల ప్రజలయందు 'స్వర్గము' అను పదము పలుకబడుచున్నది. ముఖ్య గ్రంథములయిన ఇస్లామ్, క్రైస్తవ,
హిందూమతములలో స్వర్గమును గురించిగలదు. స్వర్గమును గురించి మిగతా మతములనటుంచి ఒక్క హిందూమతములో
ఏమనుకొనుచున్నారంటే, మనిషి జీవితములో సంపాదించుకొను పుణ్యమును అనుభవించుటకు మరణించిన తర్వాత
ఇంద్రుడు పాలించు స్వర్గలోకమునకు పోయి, అక్కడ తన పుణ్యమునకు సంబంధించిన సుఖములన్నిటినీ అనుభవించి,
పుణ్యము అయిపోయిన వెంటనే యముడు పాలించు నరకలోకమునకు పోయి, అక్కడ పాపమునకు తగినట్లు బాధలను
అనుభవించి, అక్కడ పాపము అయిపోయిన వెంటనే సత్యలోకములోని చతుర్ముఖ బ్రహ్మవద్దకు పోయి క్రొత్త జన్మకు
కావలసిన ప్రారబ్ధకర్మను వ్రాయించుకొని వచ్చి, తల్లిగర్భములో చేరి శిశువుగా పెరిగి తిరిగి జీవుడు జన్మను పొందుచున్నాడని
ఒక కథలాగ చెప్పడము జరుగుచున్నది. ఇంచుమించు మిగతా కొన్ని మతములు కూడా ఇదే విషయమునే చెప్పుచున్నవి.
అయితే ఇస్లామ్ మరియు కొన్ని మతము లందు చనిపోయినవాడు స్వర్గమునకో, నరకమునకో పోవుననీ, అక్కడే శాశ్వతముగా
ఉండుననీ, వాడు వచ్చి తిరిగి జన్మించడము అనునది లేదని చెప్పుచున్నారు. మనిషి ఒకమారే పుట్టుననీ, ఒకమారే
చనిపోవుననీ, వాడు పూడ్చబడిన గుంతలోనే శాశ్వతముగా ప్రళయము వరకు ఉండుననీ, ప్రళయ దినమున పూడ్చిపెట్టబడిన
సమాధులనుండి మనుషులనందరినీ దేవుడు లేపి వారు బ్రతికినప్పుడు చేసుకొన్న పాపమునుబట్టి, దైవమార్గమునుబట్టి
నరకమునకో, స్వర్గమునకో పంపడము జరుగునని, అలా పంపబడిన వాడు స్వర్గమునకు పోయివుంటే అక్కడే శాశ్వతముగా
సుఖములను అనుభవించుచూ ఉండునని చెప్పడము జరుగుచున్నది. స్వర్గము విషయములోగానీ, నరకము
విషయములోగానీ, ఒక్కొక్క మతము ఒక్కొక్క విధముగా చెప్పుచున్నా మొత్తానికి స్వర్గములో సుఖములు, నరకములో
బాధలు అనుభవించుదురని చెప్పుచున్నారు.
ప్రతి మతములోని ఏ మనిషికీ స్వర్గమును గురించిగానీ, నరకమును గురించిగానీ సంపూర్ణముగా తెలియదనియే
చెప్పవచ్చును. సర్వ సాధారణముగా స్వర్గములో అన్ని రకముల సుఖములూ ఉంటాయని చెప్పు చుందురు. హిందువులైతే
స్వర్గము ఇంద్రుని లోకమనీ, అక్కడ ఇంద్రుని సభలో నాట్యము చేయు రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలగు
అప్సరసలతో ఆడి పాడవచ్చుననీ, వారి సంగమము లభించుననీ చెప్పుకొను చుందురు. ఇస్లామ్ మతములోనయితే
స్వర్గములో మంచి అందముతో యున్న నలుగురు యువతులు అనేక సుఖములను కలుగజేతురనీ, సున్నితమైన, అందమైన
ఆడవారిపొందు లభించుననీ, అక్కడ ఎంతో చల్లగానుండు తోటలు, రుచిగాయున్న పానీయములు, హాయిగానుండు
పడకలు లభించడమే కాకుండా ఎల్లప్పుడు యవ్వనముగాయుండి స్త్రీలతో సాంగత్యము కల్గియుందురని గొప్పగా
చెప్పుకోవడము జరుగుచున్నది.
అనుభవించే కాలము, అనుభవించే లోకమును వదలి చూస్తే ఇంచుమించుగా అందరూ చెప్పునది “స్వర్గము
సుఖములకు నిలయము, నరకము బాధలకు నిలయము” అనునదే కనిపించుచున్నది. దేశములో ఎవరూ ఏమి చెప్పినా
ఆధ్యాత్మిక జ్ఞానరీత్యా మేము కూడా సుఖములతో కూడుకొన్నదానిని స్వర్గము అనియూ, బాధలతో కూడుకొన్న దానిని
నరకము అనియూ చెప్పుచున్నాము. “స్వర్గ, నరకములు సుఖదుఃఖములకు నిలయములు" అను ఒక్కమాటను తప్ప
మిగతా విషయములన్నిటిలో స్వర్గ, నరకములను గురించి విబేధించుచున్నాము. ఒక్క విషయములో మాత్రము
ఒప్పుకొనుచూ, మిగతా అన్ని విషయములలో ఒప్పుకోక పోవడానికి కారణము ఏమంటే, ఇంతవరకు స్వర్గ, నరకములందు
సుఖ దుఃఖములు కలవనుట తప్ప మిగతా విషయములేవిగానీ ఎవరికీ తెలియ వనియే చెప్పవచ్చును. దేవుడు
7

Page 8
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
మానవులకు ఇచ్చిన మూడు గ్రంథములలో స్వర్గ నరకముల ప్రస్తావన ఉన్నప్పటికీ, అక్కడ చెప్పిన పూర్తి సమాచారము
ఎవరికీ అర్థముకాక పోవడము వలన, స్వర్గ నరకములను తమ ఇష్ట మొచ్చినట్లు వర్ణించి వ్రాసుకొన్నారు. అలా వారు
వ్రాసుకొన్నదానికీ, చెప్పుకొన్నదానికీ, గ్రంథములలోనున్న సత్యమునకూ ఎంతో తేడా కలదని చెప్పవచ్చును. సత్యమేమిటని
చూడకపోయినందున, స్వర్గ, నరక విషయములు ఊహాగానమైనాయిగానీ, ఇది సత్యమని శాస్త్రబద్ధముగా చెప్ప
లేకపోవుచున్నారు. చెప్పినది ప్రశ్నించకుండా వింటూవుంటే సరిపోతుంది. ఒకవేళ ఎవరయినా ప్రశ్నించితే హేతుబద్ధమైన
జవాబు ఉండదు.
ఎలా జవాబుండదో ఉదాహరణకు ఒక విషయమును చెప్పుకొందాము. ఒక మతమువారు తమ మత ప్రచార
నిమిత్తము అక్కడక్కడ సభలు ఏర్పాటు చేసి, ఆ సభలకు వచ్చిన మనుషులతో తమ మతమును గురించి ఎక్కువగా
చెప్పుచూ, తమ మతమే అన్ని మతములకంటే గొప్పదనీ, తమ మతములో దేవున్ని గురించి ప్రార్థన చేయువానికి, దేవుని
విషయములో భక్తిగలవానికి మరణము చివరిలో స్వర్గము లభించుననీ, అతడు శాశ్వతముగా స్వర్గములోయుండి అనేక
సుఖములు అనుభవించుచుండుననీ, అటువంటివానిని అన్ని విధముల సుఖపరుచుటకు సున్నితమైన శరీరము గల
అందమైన నలుగురు ఆడవారు స్వర్గములో ఉందురు అని చెప్పి తమ మతమువైపు ఆకర్షించాలని చూచారు. అప్పుడు
అక్కడ ఒక వ్యక్తి లేచి తన అనుమానమును ప్రశ్నరూపముగా అడిగాడు అదేమనగా!
ప్రశ్న :- మగవారు స్వర్గమునకు పోతే అన్ని సుఖములు అక్కడయున్నట్లే వారిని సుఖపరుచుటకు అందమైన యువతులు
(స్త్రీలు) కూడా కొందరుంటా రని చెప్పుచున్నారు కదా! అట్లయితే స్వర్గానికి ఒక్క మగవారే కాకుండా దైవభక్తి గల,
దేవుని మీద విశ్వాసమున్న ఆడవారు కూడా మరణించిన తర్వాత స్వర్గానికి పోవుచుందురు కదా! అటువంటప్పుడు
స్వర్గములో మగవారిని సుఖింపజేయుటకు కొందరు అందమైన స్త్రీలు అక్కడ యున్నట్లు, ఆడవారిని సుఖింపజేయుటకు
అందమైన మగవారు కొందరు అక్కడ ఉంటారా?
వారి జవాబు :- ఆడవారికి స్వర్గముంటుందని మేము చెప్పలేదు కదా! మేము చెప్పినది మగవారిని గురించే, అందువలన
ఆడవారిని గురించి అడగవద్దండి. దేవుడు ఆడవారిని గురించి ఎక్కడా చెప్పలేదు.
ప్రశ్న :- దేవుడు తన జ్ఞానమును సమస్త మానవులకు అని తన గ్రంథములలో చెప్పాడు గానీ, ఇది మగవారికి
అనిగానీ, ఇది ఆడవారికి అనిగానీ ప్రత్యేకించి చెప్పలేదు. అటువంటప్పుడు చెప్పిన జ్ఞానము అందరికీ వర్తించి తీరాలి.
అట్లుకాకుండా స్వర్గము ఒక్క మగవారికేనని స్త్రీలకు లేదని మీరెందుకు చెప్పుచున్నారు?
వారి జవాబు :- మా మతములో స్త్రీలకు విలువలేదు. అన్నిటిలో ప్రవేశము లేదు. ప్రార్థనా మందిరాలకు (మజీద్లకు)
మగవారుపోయి దేవుని ప్రార్థన చేసుకొంటాము. ఆడవారు ప్రార్థనామందిరాలకు పోయి ప్రార్థన చేయకూడదు. దేవుని
ప్రార్థనా మందిరములలోనికే ప్రవేశము లేనప్పుడు నేరుగా స్వర్గములోనికి ప్రవేశముండదు. అంతేకాదు మాలో
ఎవరైనా చనిపోతే శవాన్ని మగవారే స్మశానానికి తీసుకపోయి భూమిలో పూడ్చి పెట్టుతాము. అప్పుడు శవము వెంటగానీ,
స్మశానములోనికిగానీ ఆడవారు ఎవరూ రాకూడదను నియమము కలదు. స్మశానములోనికి కూడా ప్రవేశము లేనప్పుడు
స్వర్గములోనికి ప్రవేశము ఎలా ఉండగలదు! అందువలన స్వర్గము పురుషులకు మాత్రమే స్త్రీలకు లేదని చెప్పుచున్నాము.
8

Page 9
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ప్రశ్న :- మీరు చెప్పునది మాకు జవాబు కాదు. మీరు స్వార్థముతో ఆడవారిని అణచివేసే నిమిత్తము చెప్పియుండవచ్చును.
మాకు శాస్త్రబద్ధమైన జవాబు కావాలి. దేవుడు తన గ్రంథములు మూడింటిలో ఏ ఒక్కదాని యందైనా స్త్రీలకు స్వర్గములో
ప్రవేశము లేదనిగానీ, అట్లే స్మశానములోనికి ప్రవేశము లేదనిగానీ చెప్పాడా?
వారి జవాబు :- మా జీవన విధానములు వ్రాయబడిన హదీసు గ్రంథము లలో ఈ విషయములు వ్రాయబడియున్నాయి.
ఎక్కడాలేనిది మేమెందుకు చెప్పుతాము.
ప్రశ్న :- నేను సూటిగా అడుగుచున్నదేమనగా! దైవగ్రంథమైన పవిత్ర ఖుర్ఆన్ గ్రంథములో ఏమైనా వ్రాశారా! అని
అడుగుచున్నాను. మీరు చెప్పునది హదీసు గ్రంథములో వ్రాశారు అని చెప్పుచున్నారు. హదీసు గ్రంథములో వ్రాసినది
దైవవాక్కు కాదు. దైవగ్రంథము ఖుర్ఆన్ మాత్రమేనని మరచిపోవద్దండి. ఖుర్ఆన్ మాత్రమే శాస్త్రబద్ధమైనది. హదీసులను
శాస్త్రబద్ధమని చెప్పుటకు వీలులేదు.
వారి జవాబు :- ముహమ్మద్ ప్రవక్తగారే కదా హదీసులను చెప్పినది. ప్రవక్తగారు ఖుర్ఆన్ గ్రంథమును చెప్పినట్లే
హదీసు గ్రంథమును కూడా చెప్పాడు. అటువంటప్పుడు ఖుర్ఆన్ గ్రంథముతో సమానమైనవి హదీసులని మేము
నమ్ముచున్నాము.
ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథమును ప్రవక్తగారు చెప్పినా అది మహా జ్ఞాని జిబ్రయేల్ చెప్పినది. జిబ్రయేల్ తెరచాటున
వుండి ప్రవక్తకు చెప్పినదే ఖుర్ఆన్ గ్రంథము. ఖుర్ఆన్ గ్రంథము దైవగ్రంథము. దానికి సమాన మైన గ్రంథము
మరొకటి ఏదీలేదు. అంతిమ దైవగ్రంథమైన ఖుర్ఆన్ గ్రంథముతో సమానముగా ఏ గ్రంథమునూ పోల్చకూడదు.
ఇతర మతస్థులు ఖుర్ఆన్ విషయము తెలియక దానిని ఇతర గ్రంథములతో పోల్చినా ఫరావాలేదు కానీ, ముస్లీమ్
అయినవాడు దైవ గ్రంథముతో సమానముగా ఏ గ్రంథమునూ పోల్చి చెప్పకూడదు. హదీసు గ్రంథములను ముహమ్మద్
ప్రవక్త పేరును చెప్పి మనుషులే వ్రాశారు. ప్రవక్తగారు చెప్పిన మాటలను మా తాత విన్నాడు, మా తాత విన్న మాటలను
మా నాన్నకు చెప్పాడు, మా తాత చెప్పిన మాటలను మా నాన్న నాకు చెప్పాడనీ ప్రవక్త చనిపోయిన తర్వాత రెండు
వందల సంవత్సరములకు వ్రాసిన గ్రంథమును ఖుర్ఆన్తో సమానమని చెప్పడము సరియైన పద్ధతి కాదు. అందువలన
మేము ఖుర్ఆన్లు ఇచ్చిన విలువను హదీసులకు ఇవ్వము. ఖుర్ఆన్ గ్రంథము శాస్త్రబద్ధమైనది, హదీసులు శాస్త్రబద్ధమైనవి
కావు అని చెప్పుచున్నాము.
వారి జవాబు :- మీరు హదీసులను నమ్మకపోయినా, ఖుర్ఆన్ గ్రంథమును నమ్ముచున్నారు కదా! ఖుర్ఆన్ గ్రంథములో
స్వర్గమును, నరకమును గురించి చెప్పారు కదా! అటువంటప్పుడు స్వర్గమును గురించి మీరు ఎందుకు విబేధించుచున్నారు?
ప్రశ్న :- స్వర్గమును ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినది వాస్తవమే, దానిని మేము తప్పు పట్టడములేదు. దానిని వేరు
విధముగా అర్థము చేసుకొన్నవారిని మేము తప్పు పట్టుచున్నాము. స్వర్గము, నరకము రెండూ వాస్తవమే అయితే అవి
ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి అని తెలియడములో చాలామంది విఫలమైనారని చెప్పుచున్నాము. దేవుడు చెప్పిన స్వర్గము,
నరకమునకు అర్థము కూడా తెలియని స్థితిలో మనిషి ఉన్నాడని చెప్పుచున్నాము. అన్ని మతములవారు స్వర్గ, నరకములను
అర్థము చేసుకోక వాటి విషయములో తప్పటడుగు వేస్తున్నారని అంటున్నాము.
9

Page 10
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
వారి జవాబు :- ప్రపంచములో అందరికీ అర్థముకాని సమస్యగాయున్న స్వర్గము, నరకము అనువాటిని గురించి మీకు
ఏమి అర్థమయినదో తెలుప గలరా?
ప్రశ్న :- నాకు అర్థమయినది సత్యమయిన భావము. కావున నేను జంకు బొంకు లేకుండా ధైర్యముగా తెలుపగలను.
నేను నా భావమును చెప్పకముందే మిమ్ములను ఒకమాట అడుగుచున్నాను. దానికి మీ జవాబు ఏమిటో చెప్పగలరా?
వారి జవాబు :- మాకు తెలిసినది ఏదయితే వుందో దానిని మాత్రము తెలుపగలము. అయితే మా మాట సరియైనదో
కాదో, శాస్త్రబద్ధమైనదో కాదో మీరే చెప్పాలి. (ఇట్లు వారి సంవాదము జరిగినది.)
ఖుర్ఆన్ గ్రంథములో కొన్నిచోట్ల స్వర్గ, నరకములను గురించి చెప్పినప్పుడు మనిషి మరణించిన తర్వాత,
చచ్చినవానిని పూడ్చిపెట్టిన తర్వాత, ప్రళయకాలమువరకూ చనిపోయినవారు వారివారి సమాధులలో ఉండి,
అంతిమదినమున సమాధులనుండి లేపబడి, వారు బ్రతికినప్పుడు చేసుకొన్న పాపపుణ్యములను బట్టి లెక్కించి స్వర్గమునకో,
నరకమునకో పంపడము జరుగుతుందని వ్రాశారు. ఆ మాట ప్రకారము ప్రళయము వచ్చువరకు స్వర్గనరకములు
ఎవరికీ రావనీ, అంతవరకు చనిపోయిన వారు వారివారి సమాధులలోనే ఉందురని కొందరు చెప్పుచున్నారు.
దానిప్రకారము స్వర్గనరకములను ఇప్పుడు ఎవరూ పొందలేదనీ, స్వర్గ నరకములు ప్రళయ కాలమున మనుషులను
సమాధులనుండి లేపబడిన తర్వాత, దేవునిచే తీర్పు తీర్చబడిన తర్వాత వచ్చునవనీ తెలియుచున్నది. అయితే ఇంతవరకు
ప్రళయము రాలేదనీ, ఇంతవరకు చనిపోయిన వారందరూ ప్రళయ కాలమువరకు సమాధిలో ఉండవలసిందేననీ,
అంతిమ ప్రళయ దినమున దేవుడు ప్రతి ఒక్కరినీ సమాధినుండి లేపి వాని పాప పుణ్యములను విచారించి వానికి
తగినట్లు వాడు స్వర్గమునో, నరకమునో పొందునట్లు తీర్పు తీర్చునని (జడ్జిమెంట్ చేయునని) ముస్లీమ్ సమాజము
చెప్పుచున్నది. ఇది ఇట్లుండగా, “మహా ప్రవక్త (సం) జీవిత చరిత్ర" అను గ్రంథములో 224వ పేజీలో "ఇస్రా మరియు
మేరాజ్" అను శీర్షికలో వ్రాసిన విషయమును చూస్తే స్వర్గనరకముల మీద కొంత అనుమానము రాక తప్పదు.
అనుమానము తీర్చుకొనుటకు కొన్ని ప్రశ్నలను అడగక తప్పదు. అలా వచ్చిన ప్రశ్నలకు జవాబులు దొరకడము
కష్టముగా యున్నది. అంతకు ఆ సమాచారము ఏమిటో, మేరాజ్ దినమున ముహమ్మద్ ప్రవక్తకు ఏమి జరిగినదో ఆ
గ్రంథములో వ్రాసిన విషయమునే ఇక్కడ పొందుపరుస్తున్నాము చూడండి.
ముహమ్మద్ (స) మహా ప్రవక్తగారిని ఆయన భౌతిక శరీరముతో సహా బురాఖ్ (తెల్లని గుర్రము) పై ఎక్కించుకొని
హజ్రత్ జిబ్రయేల్ (అ.స) మక్కాలోని కాబా గృహమునుండి పాలస్తీనా దేశములోవుండే బైతుల్ మల్టిస్ వరకు తీసుకువెళ్ళారు.
అక్కడకు చేరిన తర్వాత ముహమ్మద్ ప్రవక్త దైవ ప్రవక్తలందరికీ నాయకత్వము వహిస్తూ నమాజు చేయించారు.
బురాఖు ఆ మస్జీద్ ద్వారానికి ఉన్న కడియానికి కట్టివేశారు. తర్వాత అదే రాత్రి జిబ్రయేల్, ముహమ్మద్ ప్రవక్తగారిని
అక్కడనుండి మొదటి ఆకాశము వరకూ తీసుకువెళ్ళడము జరిగినది. జిబ్రయేల్ ఆకాశద్వారాన్ని తెరిపింపగా
ద్వారము తెరుచుకోవడము జరిగినది. అక్కడ ముహమ్మద్ ప్రవక్తగారు మానవాళికి తండ్రి అయిన హజ్రత్ ఆదమ్ను
చూచాడు. ఆయనకు ప్రవక్తగారు సలామ్ చేయగా, ఆదన్గారు మర్హిబా అంటూ ప్రతి సలామ్ చేశారు. ఆదమ్కు
కుడి ప్రక్కన అదృష్టవంతుల ఆత్మలూ, ఎడమ ప్రక్కన దురదృష్టవంతుల ఆత్మలూ ఉన్నట్లు ప్రవక్త చూచాడు.
ఆ తర్వాత మహా ప్రవక్తను జిబ్రయేల్ రెండవ ఆకాశము పైకి తీసుకొని పోయి, అక్కడ ఆకాశ ద్వారాన్ని
తెరిపించడము జరిగినది. రెండవ ఆకాశముపై ఆయన హజ్రత్ యహ్యాబిన్ జకరియ్యానూ, హజ్రత్ ఈసాబిన్ మరియమ్న
10

Page 11
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చూశాడు. వారిద్దరినీ చూచి వారికి సలామ్ అందివ్వగా ఇద్దరూ ప్రతి సలాము చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన దైవ దౌత్యాన్ని ధృవీకరించారు. ఆ పిదప మూడో ఆకాశము పైకి వెళ్ళడము జరిగినది. అక్కడ ఆయన హజ్రత్
యూసుఫ్ను చూశాడు. తర్వాత జిబ్రయేల్ ప్రవక్తగారిని నాల్గవ ఆకాశముపైకి తీసుకపోయారు. అక్కడ హజ్రత్
ఇద్రీసు చూచాడు. తర్వాత ఐదవ ఆకాశముపైకిపోయి అక్కడ ఆకాశద్వారాన్ని తెరిపించుకొని అక్కడున్న హజ్రత్
హరూన్బిన్ ఇమ్రాన్ న్ను చూచారు. ఆ తర్వాత ఆరవ ఆకాశము పైకిపోయి అక్కడ హజ్రత్ మూసా బిన్ ఇమ్రాన్ ను
చూచి సలామ్ చేసి ప్రతి సలామ్ పొంది, అక్కడినుండి ముందుకు పోగా మూసా ఏడ్వను ఆరంభించారు. మీరెందుకు
ఏడుస్తున్నారని ప్రవక్త అడుగగా ఆయన “ నా తర్వాత ఒక యువకుడు ప్రభవింప జేయబడ్డాడు. అతని సమాజము నా
సమాజముకంటే సంఖ్యలో అధికముగా యుండి స్వర్గ ప్రవేశము చేస్తుంది. ఆ కారణముగా నాకు ఏడుపు ఆగలేదు”
అని అన్నారు.
ఆ తర్వాత ప్రవక్తగారిని జిబ్రయేల్ ఏడవ ఆకాశమువైపు తీసుక పోయాడు. అక్కడ ముహమ్మద్ ప్రవక్త తాను
అల్లాకు (దేవునికి) రెండు దనువులు లేదా అంతకంటే తక్కువ దూరములో ఉన్నారని గ్రహించాడు. ఆ తర్వాత అల్లా తన
దాసునిపై దివ్యావిష్కృతిని అవతరింపజేశాడు. ఆ దివ్యావిష్కృతితో రోజుకు యాభై పూటలు నమాజును విధిగా
నిర్ణయించడము జరిగినది. తర్వాత ఆయన వెనక్కు తిరిగి ఆరవ ఆకాశములోనున్న హజ్రత్ మూసా దగ్గరకు వచ్చాడు.
అప్పుడు మూసా “అల్లా మీకు ఇచ్చిన ఆదేశము ఏమిటి?" అని అడిగాడు. దానికి ప్రవక్తగారు “యాభై పూటల
నమాజు” అని బదులిచ్చాడు. ఆ మాటవిన్న మూసా “మీ సమాజానికి అంత శక్తి లేదు. మీరు దైవము వద్దకు తిరిగివెళ్ళి
మీ సమాజముకొరకు ఇంకా కొన్ని నమాజుల్ని తగ్గించమని ప్రార్థించండి” అని చెప్పారు. అప్పుడు మహా ప్రవక్త
ముహమ్మద్గారు జిబ్రయేల్ వైపు ఆయన సలహాపొందే దృష్ఠితో చూచాడు. ఆ తర్వాత జిబ్రయేల్ ప్రవక్తగారిని తిరిగి
అల్లాహ్ సన్నిధికి తీసుకుపోయాడు. అల్లాహ్ అప్పుడు కొన్ని నమాజులను తగ్గించాడు. తర్వాత ప్రవక్త క్రిందికి
తీసుకరాబడ్డాడు. రెండవమారు ఆరవ ఆకాశములో నున్న మూసావద్దకు రాగా, తిరిగి వెనక్కుపోయి మరికొన్ని
నమాజులను తగ్గించమని దైవాన్ని వేడుకోండని చెప్పాడు. ఇలా మూసా మరియు అల్లాహ్కు మధ్య ప్రవక్తగారి రాకపోకలు
జరిగాయి. కొన్నిమార్లు వెనక్కి ముందుకు పోయి అడిగిరాగా దేవుడు (అల్లాహ్) నమాజులను తగ్గించు కొంటూ
వచ్చాడు. అలా పోయి రాగా చివరకు ఐదు నమాజులు మాత్రమే మిగిలాయి. అప్పుడు కూడా మూసా అవి కూడా
ఎక్కువే ఇంకాకొన్ని తగ్గించుకోండని సలహా ఇచ్చాడు. దానికి ప్రవక్తగారు "నేను తిరిగి అక్కడకు పోయి అడగడానికి
నాకు సిగ్గేస్తోంది. నేను ఈ ఐదు పూటల నమాజుకు సంతృప్తుణ్ణి, ఆయన (దేవుని) ఆదేశాలను శిరసా వహిస్తాను” అని
ముందుకు కదిలారు. కొంత దూరము వెళ్ళగా “నేను ఈ క్రియను నా దాసులపై విధిగా చేశాను. నా దాసులకు
వెసులుబాటును కలిగించాను” అనే శబ్ధము ఆకాశము నుండి వినిపించింది.
ఇదంతా ఎందుకు చెప్పుచున్నానంటే ప్రవక్తగారు ఆకాశ ప్రయాణము చేసిన సంఘటనను “మేరాజ్” అని
చెప్పడము జరిగినది. ఇదంతయూ ఆయన జీవితచరిత్రలో చెప్పిన విషయము. మేరాజ్ సందర్భములో ప్రవక్తగారు
దేవునివద్ద నుండి క్రిందికి వచ్చే సమయములో స్వర్గమునూ, నరకమునూ రెండిటినీ చూచాడని వ్రాసియుంది. స్వర్గ,
నరక విషయములు చెప్పుటకు ముందు జరిగినదంతా చెప్పవలసివచ్చినది. మహా ప్రవక్త ముహమ్మద్ గారు నరకమునకు
కాపలాదారునిగాయున్న మాలికను సహితము చూచాడు. అనాధల సొమ్మును బలవంతముగా కాజేసిన పాపమును
నరకములో అనుభవించు వారిని సహితము ప్రవక్తగారు చూచారు. అనాధల సొమ్మును కాజేసిన వారి పెదాలు ఒంటె
11

Page 12
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పెదాలలాగా వాచియున్నాయి. నోట్లో నిప్పు కణికలు పెట్టి కుక్కు కుంటున్నారు. ఆ నిప్పు కణికలు రెండోవైపునుండి
మలద్వారము ద్వారా బయటకు వస్తున్నాయి.
ప్రవక్త వడ్డీవ్యాపారులను కూడా చూడడము జరిగినది. నరకములో వారి పరిస్థితి ఎలా ఉందంటే, పెద్ద పెద్ద
పొట్టలు కలిగి వారు కదలలేని స్థితిలోయున్నారు. అటువంటి వారిని ఇతరులు త్రొక్కుకుంటూ వెళ్ళడము చూచాడు.
ఆయన అక్కడ వ్యభిచారులను కూడా చూచాడు. నరకములో వారిముందు శుభ్రమైన తాజాగాయున్న బలిసిన మాంసాన్ని
ఉంచారు. అట్లే దానిప్రక్కనే కుళ్ళిపోయి కంపుకొడుతున్న మాంసాన్ని కూడా ఉంచడము జరిగినది. వ్యభిచారులు
అక్కడున్న తాజా మాంసమును వదలి, మురిగిపోయి కంపుకొడుతున్న మాంసాన్నే భుజిస్తున్నారు. బ్రతికి యున్నప్పుడు
భర్తలకు ఇతరుల సంతానాన్ని అంటగట్టినవారిని కూడా నరకములో ఆయన చూచాడు. (ఇతరుల చేత గర్భము కలిగి
అది భర్తవలన కలిగినదని నమ్మించినవారిని చూచాడు. అటువంటి వారి స్థానములలో వంకర తిరిగిన పెద్ద గాలాలను
గ్రుచ్చి వ్రేలాడగట్టిన దృశ్యములను ప్రవక్తగారు చూచారు.
మేరాజ్ సమాచారము అనగా ప్రవక్తగారు ఆకాశ ప్రయాణము చేసినది ఖుర్ఆన్ గ్రంథములో ప్రస్తావించకున్నా
ఆయన జీవితచరిత్రలో చెప్పబడినది. ఎవరు ఎట్లు చెప్పినా! ఈ విషయము శాస్త్రబద్ధత కల్గినదని పించుకోదు.
అందువలన దీనిని ఖుర్ఆన్లో చెప్పలేదనుకొంటాను. అయినా కొందరు ఇది సత్యమే అని నమ్మపలుకుచున్నారు.
అటువంటి వారిని నేను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ప్రళయము వచ్చినప్పుడు, అందరికీ అంతిమ దినమైనప్పుడు,
అంతవరకు భూమిలో పూడ్చిపెట్టబడిన వారందరూ సజీవులుగా లేచి నిలబడగా, వారు చేసిన తప్పుఒప్పులకు దేవుని
చేత స్వర్గము, నరకము నిర్ణయించబడునని చెప్పియుండగా, ప్రళయము రాకముందే, అందరికీ అంతిమదినము రాకముందే,
భూ సమాధులనుండి ఎవరూ లేవకముందే, దేవుడు తీర్పు తీర్చి స్వర్గ నరకములను నిర్ణయించకముందే ప్రవక్తగారు
మేరాజ్ ప్రయాణములో తిరిగి వస్తూ నరకమునూ, నరకములో బాధపడువారినీ ఎలా చూచాడు? అని ప్రశ్న రాకతప్పదు.
ప్రవక్తగారు నరకమును చూచినది నిజమైతే, ఆయనే చెప్పిన ప్రళయదినము అసత్యమవుతుంది. ప్రవక్తగారు
ప్రళయదినమును గురించి, అంతిమ దినమును గురించి చెప్పినది నిజమైతే, ఆయన జీవితములో 52వ సంవత్సరము
జరిగిన మేరాజ్ యాత్ర అసత్యమవుతుంది. ఇక్కడ విజ్ఞులైన వారు ఏది సత్యమో తేల్చి చెప్పగలరా? అని అడుగుచున్నాను.
ఏది సత్యమో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడినది కాబట్టి స్వర్గ నరకములు లేవంటామా? ప్రవక్తగారు
చెప్పినది అసత్యమంటామా? అని ప్రశ్నించుకొని చూస్తే, ప్రవక్తగారు చెప్పినది ఏమాత్రము అసత్యము కాదు గానీ,
ఆయన చెప్పినదానిని అర్థము చేసుకోవడములో మనమే పొరపడి యుంటాము అనక తప్పదు. ఎందుకనగా! ఖుర్ఆన్
గ్రంథములో అంతిమ దినమును గురించి ఉంది. అలాగే స్వర్గ నరకములను గురించి కూడా ఉంది. దీనినిబట్టి
అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లోని చాలా విషయములు చాలామంది మనుషులకు అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
అలా అర్థము కాకుండాపోవడానికి ముఖ్యకారణము ఏమనగా! ఖుర్ఆన్ గ్రంథములోని సూక్ష్మమైన ఎన్నో విషయములను
మనిషి స్థూలముగా అర్థము చేసుకోవడములో పొరపాటు జరుగుచున్నదని చెప్పవచ్చును. ఉదాహరణకు దేవుడు
సూక్ష్మమైనవాడు. అలాగే దేవుని విషయములు కొన్ని సూక్ష్మమైనవి కలవు. మనిషి శరీరము స్థూలమైనా శరీరములోని
బుద్ధి, చిత్తము, అహము, మనస్సు సూక్ష్మముగాయున్నట్లు, దేవుని విషయములలో కూడా కొన్ని స్థూల విషయములున్నా
అనేకముగా సూక్ష్మ విషయములున్నవి. అయితే నేడు ఖుర్ఆన్ చదువువారు సూక్ష్మ విషయములను కూడా స్థూలముగానే
చూస్తున్నారు. ఈ విషయమై ప్రత్యేకించి ఖుర్ఆన్ గ్రంథములో అలీ ఇమ్రాన్ అను మూడవ సూరాయందు ఏడవ
12

Page 13
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఆయత్లో (3సూ-7ఆ)లో ముహ్కమాత్ అను పేరుతో స్థూల విషయములున్నాయనీ, ముతషాభిహాత్ అను పేరుతో
అయితే ఆ విషయమును మరచిపోయిన మనుషులు అన్ని
సూక్ష్మ విషయములు ఉన్నాయనీ చెప్పడము జరిగినది.
విషయములను స్థూలముగా చూడను మొదలు పెట్టారు.
అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
అందువలన ఖుర్ఆన్లోని చాలా విషయములు చాలామందికి
దేవుడు తన అంశతో మనిషిని తయారు చేసి “మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః” అని గీతలో
పురుషోత్తమప్రాప్తి యోగమున 7వ శ్లోకములో అన్నాడు. ఆ మాటనుబట్టి దేవుని అంశయే జీవుడు అని తెలియుచున్నది.
దేవుని అంశతో తయారయిన జీవుడు ఒక మనిషిగా భూమిమీద మనగలుగుచున్నాడు. శరీరము ధరించిన ఏ జీవరాశిని
చూచినా, దేవుడు ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు ముహ్కమాత్ (స్థూలము), ముతషాభిహాత్ (సూక్ష్మము) రెండూ
వాటిలో కనిపించుచున్నవి. ఉదాహరణకు ఒక మనిషి శరీరమును విభజించి చూడగా పది భాగములు స్థూలముగా
ఉండగా, పదిహేను భాగములు సూక్ష్మముగాయున్నవి. మనిషి దేవుని అంశతో పుట్టాడు కాబట్టి, దేవున్ని కూడా అదే
అంశను అనుసరించి లెక్కించి చూస్తే పదిరెట్లు (10) స్థూల విషయములతో కూడుకొనియుండగా, పదిహేనురెట్లు(15)
సూక్ష్మవిషయములతో కూడుకొనియున్నదని కొంతవరకు తెలియుచున్నది. దేవుడు ఎవరికీ తెలియబడడు కాబట్టి ఇక్కడ
దేవుని జ్ఞానమును గురించి చెప్పుకొంటే నూటికి నలభై శాతము స్థూల అర్థములతో కూడుకొనియుండగా, అరవై
శాతము సూక్ష్మ అర్థములతో కూడుకొని యున్నది. అయితే మనిషి దైవ గ్రంథమయిన భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్
గ్రంథముల నుండి తెలియబడు జ్ఞానమును నూటికి నూరుపాళ్ళు స్థూలముగా లెక్కించుట వలన దేవుడు తెలియజేసిన
జ్ఞానము మనిషికి తెలియకుండా పోయినది. ఇదే కారణమున భగవద్గీత హిందువులకూ, బైబిలు క్రైస్తవులకూ, ఖుర్ఆన్
గ్రంథము ముస్లీమ్లకూ అర్థము కాలేదనియే చెప్పవచ్చును.
C.
భగవద్గీతలో స్వర్గ, నరకములను గురించి చెప్పబడినది. అలాగే బైబిలులోనూ, ఖుర్ఆన్ గ్రంథములోనూ స్వర్గ,
నరకములను ప్రస్తావించడము జరిగినది. అయితే వాటిలోని సూక్ష్మత తెలియని దానివలన వాటియొక్క వాస్తవస్థితి
మనిషికి తెలియకుండా పోయినది. మూడు మతములవారు స్వర్గ, నరకములను ఉన్నాయని ఒప్పుకొంటున్నారు.
అయితే వాటి నిజస్థితి తెలియని దానివలన స్వర్గ, నరకములు ఎక్కడున్నాయి? ఎప్పుడున్నాయి? ఎట్లున్నాయి? అను
విషయములు తెలియకుండా పోయినవి. ఈ మూడు ప్రశ్నలకు జవాబు లేనందున స్వర్గ, నరకములు రెండూ
ఇంతవరకూ ఎవరికీ అర్థము కాలేదనియే చెప్పవచ్చును. అందువలన స్వర్గ, నరకముల జ్ఞానము దారి తప్పిన
గమ్యమయిపోయినది. ఎవరికి తెలిసినది వారు సత్యమనుకొంటున్నారు. ఇంతకుముందు ప్రవక్త ఆకాశ ప్రయాణమైన
మేరాజ్ను గురించి ఒక కథలాగ ప్రవక్త జీవిత చరిత్రలో చెప్పారు. వారు చెప్పినదంతా గమనించితే చివరికది
అశాస్త్రీయమనీ, అసత్యమనీ చెప్పుటకు అవకాశము గలదు. అప్పుడే ఆ కాలములోనే ఆ విషయమును కొందరు
ఆ
సత్యమన్నారు, కొందరు అసత్యమన్నారు. ఇక్కడ మనము కూడా అశాస్త్రీయము, అసంబద్దము అంటున్నాము. అట్లు
అనుటకు కారణము వారు స్థూలముగా జరిగినదని చెప్పడము వలన అలా చెప్పవలసి వచ్చినది. ఇక్కడ స్థూలము,
సూక్ష్మము అను రెండిటినీ అర్థము చేసుకోవడములో మనిషి పూర్తి పొరపడడము జరుగుచున్నది. ఇదే విషయమునే
(మేరాజ్ విషయమునే) సూక్ష్మముగా చెప్పుకొనినా, అర్థము చేసుకొనినా దానిని అశాస్త్రీయమనుటకు వీలులేదు. అట్లే
అసత్యమనుటకు వీలులేదు. సూక్ష్మముగా లెక్కించితే అంత సులభముగా దానిమీదయున్న విమర్శలన్నీ పటాపంచలైపోయి
సత్యమనుటకు అవకాశము ఏర్పడుచున్నది.
13

Page 14
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ప్రవక్తగారు తన యాభైరెండవ ఏట మేరాజ్ (గగన ప్రయాణము) చేసినట్లు ఆయన జీవిత చరిత్రలో చెప్పబడినది.
మహాజ్ఞాని జిబ్రయేల్ ప్రవక్తను పిలుచుకొనిపోయినట్లు చెప్పుచున్నారు కదా! వాస్తవానికి ప్రవక్తగారు ప్రత్యక్షముగా
జిబ్రయేల్ను తన జీవితములో చూడలేదు. అటువంటప్పుడు జిబ్రయేల్ ఎలా పిలుచుకపోయాడని ప్రశ్న రాగలదు.
అంతేగాక ప్రవక్త ఏడవ ఆకాశమునకు పోయినప్పుడు అక్కడ అల్లాను చూచినట్లు, అల్లా చెప్పిన మాటలను విన్నట్లు
వ్రాసుకొన్నారు కదా! వాస్తవానికి అల్లా ఎవరికీ కనిపించువాడు కాడు. ఎవరితో ప్రత్యక్షముగా మాట్లాడువాడు కాడు.
ఖుర్ఆన్ గ్రంథములోనే 42వ సూరా 51వ ఆయత్నందు "అల్లా ఎవరితోనూ ప్రత్యక్షముగా మాట్లాడడు" అనివుంది.
అంతేకాక దేవుడు రూప, నామ, క్రియారహితుడని ముందునుంచి చెప్పు కొంటున్నాము. ప్రథమ దైవగ్రంథమైన
తౌరాత్ (భగవద్గీత)యందుగానీ, ద్వితీయ దైవగ్రంథమైన ఇంజీలు (బైబిలు) యందుగానీ, అంతిమ దైవ గ్రంథమైన
ఖుర్ఆన్ గ్రంథమునందుగానీ ఎక్కడయినా దేవుడు ప్రత్యక్షముగా కనిపించి మాట్లాడునని లేదు. అటువంటప్పుడు
ఏడవ ఆకాశమందు దేవుడు ప్రవక్త గారితో మాట్లాడినాడని చెప్పడము పూర్తి అసత్యమగును. ఇక్కడ స్థూలముగా ఈ
పనులు జరిగాయంటే అంతా విడ్డూరమగును, అంతా అసత్యమగును. అదే సూక్ష్మముగా స్వప్నములో జరిగిందని
చెప్పియుంటే దానిని అసత్యమనుటకు వీలులేదు. సూక్ష్మముగా స్వప్నములో ప్రత్యక్షముగా జరుగని ఎన్ని పనులయినా
జరుగునని అందరికీ తెలుసు. మనిషి స్థూలముగా ఆకాశములో పక్షిలాగా ఎగిరిపోవడము విడ్డూరమగును. అదే
స్వప్నములో అయితే మెలుకువలో జరగని పనులు జరుగుటకు అవకాశము గలదు. అట్లే స్వప్నములో ప్రవక్తగారు
మేరాజ్ ప్రయాణము చేసియుండవచ్చునని ఎందుకు అనుకోకూడదు? అలా స్వప్నములో జరిగిన సంఘటనలో పది
సంవత్సరముల క్రిందట చనిపోయినవారు కనిపించడము జరుగుచుండును. వాస్తవముగా లేనివాడు స్వప్నములో
కనిపించుట అందరికీ తెలిసిన సత్యమే. అలాగే లేని జిబ్రయేల్గానీ, లేని దేవుడుగానీ కనిపించి మాట్లాడినట్లు
జరిగియుండవచ్చును. అయితే వీరే జిబ్రయేల్ అనిగానీ, వీరే దేవుడని చెప్పుటకుగానీ వారు ప్రత్యక్షముగా మెలుకువలో
కనిపించరు. కాబట్టి ఫలానావారు కనిపించారని చెప్పుటకు మాత్రమే స్వప్నము పనికివస్తుంది. వీరు ఫలానావారని
చూపించుటకు స్వప్నము పనికిరాదు. అట్లే ప్రవక్తగారికి స్వప్నములో కనిపించలేదు అని చెప్పుటకు కూడా ఎవరివద్దా
ఏ ఆధారముండదు. స్వప్నములో జరిగిన అసాధారణ విషయములను ఎవరూ ఖండించలేరు. అందువలన ప్రవక్తగారికి
యాభై రెండవ ఏట జరిగిన మేరాజ్ యాత్రను మనము కాదనలేము.
స్వప్నములో జరిగినది ఎవరికయినా వారి అనుభవములో ప్రత్యక్షముగా జరిగినట్లేయుండును. అందువలన
ప్రవక్తగారు తన మేరాజ్ ప్రయాణమును ప్రత్యక్షముగా వర్ణించి చెప్పియుండవచ్చును. అయితే దానిని విన్నవారు ఇది
స్థూలముగా జరిగినదికాదు, సూక్ష్మముగా స్వప్నములో జరిగి యుండవచ్చునని ఎందుకు అనుకోకూడదు? ఒక విషయము
అవగాహన చేసుకొనేదానినిబట్టి అర్థమగును. అట్లే స్వర్గ, నరకముల విషయములో కూడా అర్థము చేసుకోవలసియున్నది.
ఇకపోతే దేవుడుగానీ, దేవుని విషయ ధర్మములుగానీ, ఇటు మెలుకువకు అటు స్వప్నమునకు సంబంధించినవి కావు.
దేవుని జ్ఞానమంతయూ కేవలము అంతరంగమునగల బుద్ధితో గ్రహించవలసియుంటుంది. మెలుకువలో అయినా
స్వప్నములో అయినా జీవునికి ప్రత్యక్ష అనుభవముగా అక్కడి విషయములుండును. అయితే దేవుని జ్ఞానము కేవలము
బుద్ధి ఒక్కటే గ్రహించగలుగునది. అందువలన అది మెలుకువలోగానీ, స్వప్నములోగానీ తెలియునని చెప్పుటకు వీలులేదు.
మెలుకువలోనేగాక, స్వప్నములోనేగాక రెండూ కానటువంటి యోగములో అంతర్ముఖ దృష్ఠిచేత కూడా బుద్ధికి తెలియును.
ఈ మూడవ విధానము చాలా అరుదుగా ఏర్పడునది. అందువలన అందరికీ మూడవ విధానముండునని చెప్పలేము.
14

Page 15
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఈ మూడవ విధానముచేత మనిషి ఇటు దేవునివైపు అయినా రావచ్చును, లేక అటు మాయవైపు అయినా పోవచ్చును.
ఈ విధానము చేతనే మనిషిని దేవునిమాయ దేవునివైపయినా పంపగలదు లేక ప్రపంచమువైపయినా పంపగలదు. ఈ
విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో 74వ సూరా, 31వ ఆయత నందు "అల్లా తాను కోరినవారిని మార్గభ్రష్టత్వము
పొందునట్లు చేస్తాడు. మరియు తాను కోరినవారిని మార్గదర్శకత్వము చేస్తాడు.” అనగా దేవుడు అనుకొంటే జ్ఞానిగానయినా
మార్చగలడు. అట్లే తాను అనుకొంటే అజ్ఞానిగానయినా మార్చగలడు. అలా మార్చుట స్వయముగా దేవుడు చేయకున్నా,
దేవుని కనుసన్నలలో మెలుగు ప్రకృతి జనిత మాయ వాని బుద్ధిని ఆవహించి ఎటయినా పంపగలదు. అటువంటి
వానికి దేవుడు వచ్చి ప్రత్యక్షముగా చెప్పినా వాడు వినడు. స్వప్నములో తనది తప్పని తెలిసినా వాడు మారడు. లోపల
బుద్ధి ఎటు సూచిస్తే అటుపోగలడు. వానిబుద్ధిని గుణముల మాయ మార్చడము వలన మేము మా గ్రంథములలో బుద్ధి
గుణానుసారిణి, చిత్తము కర్మానుసారిణి అని అనేకమార్లు చెప్పాము.
చెప్పాడు.
19వ శ్లో॥
భగవద్గీత దైవాసుర సంపద్విభాగ యోగమున 19,20 శ్లోకములలో కూడా జ్ఞానమునకు దూరముచేతుననియే
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్।
క్షిపామ్యజస్ర మశుభా నాసురీ ష్వేవ యోనిషు॥
20వ శ్లో॥॥
ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మనిజన్మని।
మా మప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్||
భావము :- క్రూరులను, ద్వేషులను మంచికి దూరముగాయున్న నరులలో అధములైనవారిని అసురయోనులయందే
పుట్టించి సంసార దుఃఖములను పొందునట్లు చేయుచుందును.
అసుర గర్భములందు పుట్టిన అట్టి జనులు జన్మజన్మకూ అజ్ఞాను లగుచూ, నన్ను (దేవున్ని) తెలియు జ్ఞానమును
తెలియలేక, జన్మజన్మకూ అధోగతిపాలగుచుందురు.
ఈ విధముగా దేవుడు తనకిష్టములేని వారిని తన మాయచేత వాని బుద్ధియందు మార్పు కల్గించి తన
జ్ఞానమునకు దూరముగా పోవునట్లు చేయగలడు. ఇది బయట ప్రత్యక్షముగా కాకుండా, స్వప్నములో పరోక్షముగా
కాకుండా అంతరంగమున బుద్ధి ద్వారా చేయు కార్యమని తెలియవలెను. దేవుని జ్ఞానముకల్గి దైవమార్గములో పోవుటకు
కూడా లోపల బుద్ధియే ఆయుధముగా పనిచేయుచున్నది. మాయ అనుకొంటే బుద్ధి గ్రహింపుకు సరియైన జ్ఞానమునందించి
జ్ఞానమార్గములోనికి కూడా పంపగలదు. ఇప్పుడు మనము చర్చించు స్వర్గ, నరకములు కూడా అంతరంగమందు బుద్ధి
గ్రహించుకొను దానినిబట్టి అర్థము కాగలదు. యుద్ధరంగములో దేవుడుంటాడనుకొని అక్కడికిపోయి దేవుని కొరకు
యుద్ధము చేస్తే మరణము తర్వాత స్వర్గమునకు పోతానని ఒకడు అనుకోవడము జరుగుచున్నదంటే, అది వాని
అంతరంగమున బుద్ధికి కల్గిన భావము కాకపోయినా, అది ఇతరులు ప్రత్యక్షముగా చెప్పడము వలన, బోధించడము
వలన దానినే బుద్ధి గ్రహించి అతడు ఆ విధముగా అనుకోవడము జరిగినది. కొందరికి ప్రత్యక్ష బోధల వలనగానీ,
స్వప్నములో తనకు తన ఆత్మే తెల్పిన దానివలన గానీ, ఈ రెండూ కాకుండా అంతరంగమున మాయ బుద్ధికి చెప్పడము
వలన గానీ ఒక భావములోనికి రావడము జరుగుచున్నది. ముస్లీమ్లందరూ ప్రత్యక్ష బోధల వలన స్వర్గమును గురించి
అదొక లోకమనీ, అక్కడ అన్నీ సుఖములున్నాయనీ అనుకోవడము జరుగుచున్నది. అట్లే నరకము కూడా ప్రత్యేకమైన
15

Page 16
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
లోకమనీ, అక్కడ అనేకమైన శరీరబాధలుకలవనీ అనుకొంటున్నారు. మనిషి మరణించినప్పుడు స్థూలశరీరమును
చనిపోయిన స్థలములోనే వదలి జీవుడు పోవడము జరుగుచున్నది. చనిపోయిన వానికి శరీరమే లేనప్పుడు, శరీరము
భూమిలో కుళ్ళిపోయి మన్నుగా మారిపోవు చుండగా, మరొక నరకలోకమున శరీరముతో జీవుడు బాధలు అనుభవించు
చున్నాడని అనుకోవడము జరిగేపనేనా, శరీరము లేనిది ఎలా శరీర బాధలు అనుభవించనగునని ఎవరూ కొద్దిగయినా
ఆలోచించే ప్రయత్నమే చేయలేదు.
అదే విధముగా మరణించినవానికి శరీరము లేదు కదా! శరీరము లేనిది స్వర్గ లోకమున స్త్రీలతో సుఖములను
ఎట్లు అనుభవించునను యోచన ఎవరూ చేయలేదు. అట్లు ఆలోచించకుండా అందరూ గ్రుడ్డిగా నమ్ముటకు వారి
బుద్ధికి ఆ విధముగా అర్థమయినది. దానివలన వాడు తిరిగి దానిని యోచించదలచుకోకుండా, ప్రతి ఒక్కచోట మొదట
బుద్ధి తెల్పిన విధముగానే పోవుచుండును. స్వర్గ నరకముల గురించి ప్రత్యక్ష బోధకులు చెప్పిన విషయము చాలామంది
బుద్ధికి అంటుకోవడము వలన, బోధకుల బుద్ధి ప్రకారమే శిష్యులు లేక అనుచరుల బుద్ధి కూడా మారియుండును.
అందువలన మా గురువులు ఇలానే చెప్పారనిగానీ, మా పెద్దలు చెప్పునదే సత్యమనిగానీ వాదించుచుందురు. అయితే
తమ పెద్దలుగానీ, బోధకులు గానీ చెప్పినది సత్యమా కాదాయని యోచించు స్థితిలో ఉండరు. అటువంటి అవివేకుల
ముందర సత్యమును చెప్పినా వినకపోవడమేకాక, చెప్పిన వానిని దూషిస్తారు.
స్వర్గనరకములను గురించి అందరికీ అవగాహన అయినట్లు మాకు కాలేదు. దానికి కారణము మేము ఎక్కడా
బయటి బోధలను వినలేదు. స్వప్నములో వాటిని గురించి తెలియలేదు. మొత్తానికి నాకు అంతర్ముఖముగ బుద్ధికి కల్గిన
భావమే ముఖ్యమైనదిగా తెలియడము వలన, దానినే నేను అనేకమార్లు బయట మనుషులకు చెప్పాను. నా బుద్ధికి
స్వర్గనరకముల మీద మంచి అవగాహనయుండునట్లు ప్రకృతి చేసిందని చెప్పక తప్పదు. పరమాత్మకు నేను
ఇష్టుడనయినందున ప్రకృతి నాకు అసలయిన జ్ఞానమును అందించినది. నేను ముందే చెప్పాను ప్రకృతి అంతర్
రూపమయిన మాయ ఎవని బుద్ధిని ఎటయినా త్రిప్పగలదనీ, నాకు పరమాత్మ ఇష్టుడు అయినందున నేను ప్రకృతికి
కూడా ఇష్టుడనగుదును. నన్ను సరియైన దైవమార్గములో నడిపించుటకు మాయ నా బుద్ధికి అసలయిన వాస్తవమైన
జ్ఞానమునందించి, స్వర్గనరకముల యొక్క రహస్యమును తెలిపినది. స్వర్గ నరకములను గురించి బైబిలులో చెప్పినదానికంటే
ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కువగా చెప్పారు. హిందూ సమాజములో స్వర్గనరకములను వివరించి చెప్పుటకు కొన్ని
పురాణములే తయారు చేయబడినాయి. అందులో గరుడ పురాణమనునది ప్రత్యేకించి నరకమును గురించి చెప్పుటకే
తయారు చేయబడినది. వాటిలోయున్న దానికంటే మించి చెప్పు ఎందరో ఉద్దండ బోధకులు కూడా ఉన్నారు. అందరికీ
తెలిసినది రహస్యము కాదు. ఎవరికీ తెలియనిదే రహస్యమగును. భూమిమీద ఎన్ని గ్రంథములు స్వర్గనరకములను
గురించి చెప్పినా, ఎంతమంది బోధకులు ఆ లోకములోనికి పోయి తాము చూచివచ్చినట్లు చెప్పినా, వాస్తవానికి
స్వర్గనరకములు రెండూ ఎవరికీ తెలియనివిగానేయున్నాయి. అందువలన స్వర్గనరకములను నేను రహస్యములని
చెప్పాను.
హిందూసమాజములో కొందరు పెద్దలు తమకు తెలిసిన జ్ఞానము ప్రకారము స్వర్గమును ఒక లోకమని
చెప్పారు. మొదట స్వర్గమును ఒక లోకమని చెప్పినవారిలో హిందువులే మొదటివారు. తర్వాత వచ్చిన క్రైస్తవులుగానీ,
ఆ తర్వాత వచ్చిన ముస్లీమ్లుగానీ స్వర్గమును లోకమనియే చెప్పడము జరిగినది.
వారందరూ దానికి వ్యతిరేఖమయిన నరకమును కూడా మరొక లోకమని చెప్పారు. ఈ విధముగా దాదాపుగా అన్ని
16
స్వర్గమును ఒక లోకమనిన

Page 17
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
మతముల యొక్క దృష్ఠిలో స్వర్గ నరకములు రెండూ రెండు లోకములేనని కలదు. స్వర్గనరకములను గురించి మిగతా
రెండు మతములలో హిందూమతముకంటే తక్కువే చెప్పారని చెప్పవచ్చును. ఆ రెండు మతములలో స్వర్గ నరకమును
గురించి ప్రత్యేకమైన గ్రంథములు లేవుగానీ, హిందూమతములో స్వర్గలోకమును గురించి, నరకలోకమును గురించి
ప్రత్యేకమయిన గ్రంథములే గలవు.
మిగతా మతముల మూలగ్రంథములయిన బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో మాత్రము స్వర్గ నరకములను
గురించి చెప్పడము జరిగినది. హిందూ గ్రంథమయిన భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయమున
రెండు శ్లోకములలో స్వర్గమును, నరకమును గురించి చెప్పడము జరిగినది. 20వ శ్లోకమున స్వర్గమును గురించి,
21వ శ్లోకమున నరకమును గురించి చెప్పిన విషయముగలదు.
205 5611
21వ శ్లో॥
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే
తే పుణ్య మాసాద్య సురేంద్రలోకమ్ అన్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్II
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి।
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే॥
భావము :- వేదపారాయణులు, యజ్ఞము చేయువారు, దేవతా ఉపాసకులు పాపమును పొందక పుణ్యమును పొందినవారై,
పుణ్య ఫలితముగా ఇంద్రలోక మయిన స్వర్గమును పొంది, అక్కడ మంచి హోదాలో మంచి సుఖములు
అనుభవించుచుందురు.
ఇంద్రలోకములోని స్వర్గములో పుణ్యఫలముగా సుఖములను అనుభవించి, పుణ్యము అయిపోయిన వెంటనే
పాపమును అనుభవించుటకు తగ్గులోకమయిన నరకలోకమునకు వచ్చుచుందురు. ఈ విధముగా మంచి చెడు కర్మలను
సంపాదించుకొన్నవారు శాశ్వత సుఖములను అనుభవించక, పుణ్యము అయిపోయిన వెంటనే పాపమును అనుభవించుటకు
నరకమునకు పోవుచుందురు.
గీతలోని ఈ రెండు శ్లోకములలో స్వర్గమును, నరకమును లోకములని వర్ణించి చెప్పడము జరిగినది. ప్రథమ
దైవ గ్రంథములోనే స్వర్గనరకములను లోకములని చెప్పినప్పుడు మిగతావారు కూడా మిగతా గ్రంథములలో
స్వర్గనరకములను ధైర్యముగా లోకములని చెప్పారు. ఇట్లు ప్రపంచములోని మనుషులందరూ స్వర్గనరకములను ప్రత్యేక
లోకములుగా భావించను మొదలుపెట్టారు. అక్కడ సూక్ష్మమైన అర్థమేమయినా ఉన్నదేమో నని ఏమాత్రము ఎవరూ
అనుకోలేదు. ఇంతవరకు ఎందరో చెప్పుచున్నా లోకము అను శబ్ధమునకు అర్థమేమయినా ఉన్నదేమోనని ఎవరూ
చూడలేదు. మనము నివసించునది భూలోకమని ఎవరో చెప్పినప్పుడు, భూలోకమనునది ఎట్లున్నదో అట్లే ప్రత్యేకముగా
స్వర్గలోకము మరియు నరకలోకము ఉంటుందని అందరూ అనుకొన్నారు. అప్పటినుండి నేటివరకు అదే భావముతోనే
అందరూ ఉండడము జరిగినది. ఆ భావము ప్రకారమే భూలోకమునకు పైన ఊర్ధ్వలోకమని పిలువబడు స్వర్గలోకమున్నదనీ,
అలాగే భూలోకమునకు క్రిందగల మర్త్యలోకమని పిలువబడు నరకలోకమున్నదనీ అందరూ అనుకోవడము జరుగుచున్నది.
అంతేకాక భూలోకమును గత చరిత్రలో ఎందరో రాజులు పాలించినట్లు, స్వర్గలోకమును ఒక రాజు, నరకలోకమును
మరొక రాజు పాలించుచున్నారని కూడా హిందూమత పురాణములలో చెప్పుకోవడము జరిగినది. భూలోకమునకు
17

Page 18
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పైన గల స్వర్గలోకమును ఇంద్రుడను రాజు పాలించుచున్నాడనీ, క్రింద గల నరక లోకమును యముడను రాజు
పాలించుచున్నాడని పురాణగ్రంథములలో చెప్పడమైనది.
పురాణములను అందులోని స్వర్గనరకలోకములను గురించి బోధించు బోధకులను మేము ఒక ప్రశ్న అడిగాము.
అదేమనగా! "భూలోకములాంటిదే స్వర్గలోకము, నరకలోకమని చెప్పుచున్నారు కదా! అట్లే భూలోకమును పాలించినట్లు
స్వర్గనరకములను ఇంద్రుడు, యముడు పాలించుచున్నారని చెప్పుచున్నారు కదా! అదే నిజమని మేమనుకొనినా మాకు
ఒక ప్రశ్న రాకతప్పదు. భూలోకమును ఎందరో రాజులు ఒకరి తర్వాత ఒకరు పాలించిపోయారని అందరికీ తెలుసు.
అయితే స్వర్గ లోకమును పూర్వమునుండి నేటివరకు ఇంద్రుడే పాలించుచున్నాడని చెప్పుచున్నారు. అట్లే నరకలోకమును
ఆదినుండి యముడే పాలించు చున్నాడని చెప్పుచున్నారు. భూలోకములో ఇంతవరకు ఎవరుగానీ శాశ్వతముగా ఒక్కరే
పాలించలేదు. అటువంటప్పుడు స్వర్గమును ఒకే రాజు ఎలా పాలించుచున్నాడు? వారికి పదవీ విరమణ ఉండదా?
భూమి మీద రాజులు ముసలివారై మరణించిన తర్వాత వారి సంతతి వారసులుగా రాజులయినారు. ఆ విధముగా
స్వర్గనరకములలో ఇంద్రునికీ యమునికీ వారసులు లేరా? ఇంద్రుడు యముడు ముసలివారు కాలేదా? వారికి
మరణముండదా?” అని నేను ప్రశ్నలడిగాను. దానికి పురాణ పండితులు చెప్పిన జవాబు ఇలాగున్నది.
“భూలోకములోయున్నది మానవులు, స్వర్గలోకములోనున్న ఇంద్రుడూ, యమలోకములోనున్న యముడూ
మరియు ఆ లోక వాసులందరూ మనవలె మనుషులుకాదు. వారందరూ దేవతా జాతివారు. వారు అమృతమును
త్రాగియుండుటవలన మనవలె వారికి జనన మరణములుండడముగానీ, వృద్ధాప్యము రావడముగానీ ఉండదు. అందువలన
వారు శాశ్వతముగా ఒకే విధముగా ఉందురు. అట్లుండుట వలన పూర్వమునుండి స్వర్గమునకు ఇంద్రుడు, నరకమునకు
యముడు శాశ్వత రాజులుగా యున్నారు” అని పురాణపండితులు చెప్పడము జరిగినది. ఈ విధముగా హిందూమతములోని
పురాణముల సారాంశ ముండగా, మిగతా మతములలో నరకము, స్వర్గము రెండూ రెండు లోకములుగా చెప్పబడుచున్నా
వాటికి రాజులున్నట్లు చెప్పడము లేదు. ఏది ఏమయినా, ఎవరు ఎట్లు చెప్పుకొనినా అందరి తలలలో స్వర్గము,
నరకమూ భూలోకమువలె రెండు లోకములుగా యున్నాయని అనుకోవడము జరుగుచున్నది. ఇదంతయూ విన్న
తర్వాత కూడా మాకు అందరివలె స్వర్గనరకముల మీద నమ్మకము ఏర్పడక ఇంకా అనేకముగా ప్రశ్నలు ఉద్భవించాయి.
వాటికి సరియైన సమాధానము బయట ప్రపంచములో ఎవరూ ఇవ్వనందున లోపలి ప్రపంచమయిన, శరీర అంతర్భాగమున
అధిపతిగా, రాజుగాయున్న ఆత్మనే ఆశ్రయించి అడుగవలసివచ్చినది. అప్పుడు శరీరమున చైతన్యమూర్తిగాయున్నవాడు,
నాకు స్నేహితునిగా యున్నవాడు, నా ప్రక్కనేయున్న నా పొరుగువాడు అయిన ఆత్మ తెలియ జేసిన సారాంశమును
చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యమయినది. మనకు ఏ కోశములో రాని ప్రశ్నలను ఆత్మే ప్రశ్నించి, వాటికి ఎవరూ
ఊహించని జవాబులను అందించినప్పుడు, మనకు ఇంతవరకు తెలియని రహస్యములు ఉన్నాయా!యని ఒకింత
ఆశ్చర్యము కలుగకమానలేదు. అంతరంగమున తెలిసిన సత్యమును గురించి, అందరూ సత్యమును తెలియాలను
ఉద్దేశ్యము నాలో కల్గినది. అందువలన నాకు తెలిసినది తెలుపుచున్నాను.
లోకము అంటే తెలుగులో సరియైన అర్థము ఇంతవరకు తెలియదనియే చెప్పవచ్చును. తెలుగు పండితులు
తెలిపిన అర్థములు నిఘంటువులో పొందుపరచినా, అందులో ఆధ్యాత్మిక విద్యకు సరిపోవు అర్థములు లేవనియే
చెప్పవచ్చును. నిఘంటువులోని అర్థములు ఇలా గలవు చూడండి. లోకము అనగా జగము అని చెప్పడమేకాక
లోకములు మూడు రకములని చెప్పారు. అవి ఇలా ఉన్నవి. 1) స్వర్గలోకము (ఇంద్రలోకము), 2) మర్త్యలోకము
18

Page 19
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
(మధ్యలోకము), 3) పాతాళలోకము (నరకలోకము). మర్త్య లోకము మనుషులు నివసించునదికాగా, దానికి పైనగల
స్వర్గమునకు సంబంధించినవి ఏడు లోకములు గలవు. అట్లే మర్త్యలోకమునకు క్రింద ఏడు లోకములు గలవు. అవి
క్రింద చెప్పినట్లు కలవు.
1)
భూలోకము
2)
భువర్లోకము
స్వర్గమునకు 3)
సువర్లోకము
ఈ ఏడు పైనుండు
సంబంధించిన 4)
మహర్లోకము, ఊర్థ్వ లోకములు
లోకములు 5)
జనలోకము
ఏడు
6)
తపోలోకము
7)
సత్యలోకము
మర్త్య లోకము (1)
మధ్యలోకము
(మనుషులు నివసించు లోకము)
తము
1)
అతలము (అతలలోకము)
2)
వితలము (వితలలోకము)
నరకమునకు 3)
సుతలము (సుతలలోకము)
సంబంధించిన 4)
రసాతలము (రసాతలలోకము) అథో
3
ఈ ఏడు
లోకములు 5)
మహాతలము (మహాతలలోకము) లోకములు
ఏడు
6)
తలాతలము (తలాతలలోకము)
7)
పాతాళము (పాతాళలోకము)
నిఘంటువు ప్రకారము మొత్తము లోకములు పదిహేను అవుతున్నవి. ఇందులో చెప్పినవి చదువుకోవడానికిగానీ,
లెక్క చెప్పు కోవడానికి గానీ బాగుంటుంది. అంతేతప్ప ఏదీ శాస్త్రబద్ధము కాదని తెలియుచున్నది. మర్త్యలోకము
అనునది భగవద్గీతలో చెప్పబడినది. మనుషులు పుణ్యమయిపోయిన వెంటనే మర్త్యలోకములోనికి పోవలసిందేనని
చెప్పారు. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి” అని రాజవిద్యా రాజగుహ్య యోగమున చెప్పడమయినది కదా! దానిప్రకారము
మనుషులు నివసించు లోకము మర్త్య లోకమని తెలిసిపోయినది. దానినే మధ్యలోకమని అంటున్నాము. ఇంతవరకు
ఎవరికయినా కొంత అర్థము కాగలదు. మిగతా ఏడు ఏడు పదునాలుగు లోకములు ఇటు జ్ఞానమునకుగానీ, అటు
విజ్ఞానమునకు గానీ సంబంధించినవి కావనియే చెప్పవచ్చును. దేవుని జ్ఞానమంతయు విజ్ఞానమునకు సంబంధించినదే
అయితే, ఆ విషయము చాలామందికి తెలియక భక్తి, జ్ఞానము మూఢనమ్మకములతో కూడుకొన్నదని చెప్పుచుందురు.
వారన్నట్లు భక్తి, జ్ఞానము మూఢనమ్మకమైనది కాదు. అది సైన్సులలోకెల్ల పెద్ద సైన్సని చెప్పవచ్చును. దానినే మేము
మా గ్రంథములందు చాలాచోట్ల సూపర్సైన్సని వర్ణించి చెప్పాము. మా గ్రంథములయిన "త్రైతాకార రహస్యము”లో,
“పునర్జన్మ రహస్యము”లో, “మరణ రహస్యము”లో, “జనన మరణ సిద్ధాంతము”లలో సూపర్సైన్సు బాగా కనపడగలదు.
19

Page 20
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
దైవజ్ఞానము ఏదైనా విజ్ఞానము (సైన్సు) తో కూడుకొని యుండవలయును. అట్లు కాని దానిని దైవజ్ఞానమని చెప్పుటకు
వీలుపడదు. దానిని బ్రహ్మవిద్యా శాస్త్రము ఒప్పుకోదు. భగవద్గీతలోని విజ్ఞాన యోగమందు రెండవ శ్లోకమున శ్రీకృష్ణుడు
ఇట్లు చెప్పాడు "జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్య శేషతః" శేషము లేకుండా జ్ఞానమును విజ్ఞాన సహితముగా
తెలియజేస్తానని భగవంతుడు చెప్పినప్పుడు, ఏ ఇందువయినా భగవద్గీత నుండి సంపూర్ణ జ్ఞానమును శాస్త్రబద్ధముగా
తెలుసుకోవచ్చును. మనుషులు వ్రాసిన గ్రంథములలోని విషయములనూ, మనుషులు చెప్పిన మాటలనూ వదలి,
దేవుడు భగవంతునితో చెప్పించిన జ్ఞానమును తెలియగలిగితే జ్ఞానము సంపూర్ణముగా తెలియగలదు. అంతేకాకుండా
సంశయములకు తావులేని జ్ఞానము తెలియును.
సంశయరహితమైనది ఏ జ్ఞానమయితే కలదో, ప్రశ్నలు ఉద్భవించని జ్ఞానము ఏదయితే కలదో దానినే నిజమైన
జ్ఞానమనవచ్చును. అటువంటి జ్ఞానము ప్రకారము “లోకము” అనుమాటకు అర్థమును చూచిన నిజమైన అర్ధము
అగుపడగలదు. ఇప్పుడు లోకము అనుమాటకు అర్థమును చూచుటకు లోకమును ప్రక్కన పెట్టి, ముందు “ఏకము”
అనుమాటకు అర్థమును చూచిన, ఏకము అంటే ఒక్కటి అని తెలియగలదు. మనకు బాగా అర్థమగుటకు నాలుగు
వస్తువులను తీసుకొందాము. ఇప్పుడు ఒక త్రాడునూ, ఒక గుడ్డనూ, ఒక ఈకనూ, ఒక పుస్తకమునూ తీసుకొన్నాము.
ఈ నాలుగు వస్తువులు ఒక్కొక్కటిగాయున్నాయి. అందువలన ఏక త్రాడు, ఏక గుడ్డ, ఏక ఈక, ఏక పుస్తకము అని
వాటిని అనవచ్చును. ఏకము అంటే ఒకటి అనేగా అర్థము. ఒక గజము పొడవున్న త్రాడును తీసుకొని ఇది ఒక త్రాడు
అని చూపితే దానిని ఎవరూ కాదనరు. అట్లే గజము పొడవున్న నారను చూపితే దానిని నారనియే అందరూ ఒప్పుకొందురు.
అయితే అదే నారను కలిపి, పేడి, త్రాడును చేసి చూపితే దానిని త్రాడు అంటారుగానీ నార అని అనరు. త్రాడులో నార
కనిపించలేదా అంటే, నార కనిపిస్తున్నది, అయినా అప్పుడు దానిని నార అనము. ఎందుకనగా అనేకముగాయున్న
నారపీసులన్నీ ఏకముగా మారియున్నాయి. అనేకముగా యున్న నార ఏకముగా మారుట వలన నార ఏకత్వమును
త్రాడు అని అనవలసి వచ్చినది.
ఇంతకుముందు నాలుగు వస్తువులలో ఒక త్రాడును తీసుకొన్నాము కదా! దానిని పూర్తి పురివిప్పి తాడునంతటినీ
విడి నారపోగులుగా చేయవచ్చును. అప్పుడు దానిని త్రాడు అనుటకు వీలులేదు. అంతకు ముందు ఏకముగాయున్న
త్రాడును అనేక నారపోగులుగా చూస్తున్నాము కావున దానిని నార అనియే అనాలి, త్రాడు అని అనకూడదు. సమిష్టిగా
యున్నదానిని త్రాడు అంటున్నాము, సమిష్టిగా లేనిదానిని నార అంటున్నామని అందరికీ బాగా అర్థమయివుంటుంది.
ఇందులో అర్థము కానిది ఏదీలేదు. ఏకత్వము, అనేకత్వము అనునవి రెండు మాత్రమే ఇక్కడ కలవు. ఏకత్వమునకు
ఒకపేరు ఉంటే, అనేకత్వమునకు మరొక పేరు యున్నది. అలాగే ఈ సూత్రము ప్రకారమే నూలుపోగుల (దారముల)
సమిష్ఠి దృశ్యమును గుడ్డ అంటున్నాము. అదే గుడ్డను విడదీసి దారములుగా (నూలు పోగులుగా) చేస్తే దానిని నూలు
అంటున్నాము, అట్లే ఒక ఈకలో అనేక వెంట్రుకలు కలిసియున్నాయి. అనేక వెంట్రుకలు కలిసి గాలిని నిరోధించు
ఒక వస్తువుగా మారియుండుటవలన దానిని ఈక అంటున్నాము. వెంట్రుకల ఏకత్వమును ఈక అంటే ఈక
అనేకత్వమును వెంట్రుకలు అంటున్నాము. అదే విధముగా ఒక పుస్తకమును తీసుకొని చూస్తే అందులో వందపేపర్లు
కలిసికట్టుగా యుండుట వలన నూరు పేపర్ల ఏకత్వమును పుస్తకము అంటున్నాము. అదే పుస్తకమును చించి విడివిడిగా
నూరు పేపర్లుగా మార్చివేస్తే, ఏకత్వము పోయి అనేకత్వము వచ్చిన దానివలన అప్పుడు దానిని పుస్తకము అనుటకు
వీలులేదు. ఆ సమయములో దానిని పేపర్లుగా బహువచనముతో చెప్పవలసివచ్చినది. అదే పేపర్లనే ఒక కట్టగా పెట్టి
20

Page 21
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
కుట్టి ఒకచోట చేర్చితే ఏకత్వముగా మారుట వలన దానిని పుస్తకము అనవచ్చును. దానినే అనేకత్వముగా చీల్చి
అనేకముగా చేసినప్పుడు దానిని పుస్తకము అనుటకు వీలులేదు. అప్పుడు దానిని విడి పేపర్లుగానే చెప్పాలి.
ఇంతవరకు చెప్పినది అందరికీ సులభముగా బాగా అర్థమయి వుంటుంది. ఇదే పద్ధతి ప్రకారము కొంతమంది
మనుషులను కలిపి ఒక సంఘము అంటున్నాము. ఒక ఊరిలో కొందరు చెత్తను శుభ్రము చేయుటకు ముందుకు వచ్చి
వారమునకు ఒకమారు స్వచ్ఛందముగా బజార్లు ఊడ్చి శుభ్రము చేయుచున్నారనుకొనుము. ఇరవైమంది ఒక గుంపుగా
ఏర్పడి స్వచ్ఛందముగా సేవచేయుట వలన ఆ ఇరవైమందిని కలిపి స్వచ్ఛంద సేవాసంఘము అంటున్నాము. ఇప్పుడు
సంఘము అనునది ఒకటే అయినా అందులో ఉన్నది ఇరవైమంది. ఇరవైమంది కలిసినప్పుడు వారిని సంఘము అని
అనవచ్చును. అట్లుకాక విడిగా ఒక్కొక్క మనిషిని సంఘము అనలేము. ఈ విధముగా ఎన్నో సంఘములు కలవు.
నీళ్ళకొరకు పోరాడు మనుషుల గుంపును నీటిసంఘము, ఒక ఫ్యాక్టరీలో పనిచేయు కార్మికులనందరినీ ఒక కార్మికసంఘము
అంటాము. అట్లే ఒక గుంపుగా ఏర్పడిన రైతులనందరినీ కర్షక సంఘము అంటాము. అదే విధముగా జ్ఞానుల
నందరినీ కలిపి జ్ఞాన సంఘము అంటాము. గుంపుగా ఏర్పడిన విద్యార్థులనందరినీ విద్యార్థి సంఘము అంటున్నాము.
ఈ విధముగా ఒకే దేశములో ఎందరో మనుషులున్నా వారు చేయు పనులనుబట్టి కొన్ని సంఘములుగా
విభజింపబడియున్నారు. ఏ సంఘమును చూచినా అందులో కొంతమంది కలిసి యుండుట అందరికీ తెలిసిన విషయమే.
ఈ విధముగా మనుషులలోగానీ, వస్తువులలోగానీ ఏకత్వమునకు ఒక పేరు, అనేకత్వమునకు మరొక పేరుండడము
అందరికీ తెలిసిన విషయమే. అట్లే ఒక త్రాడును త్రాడు అంటున్నాము ఎక్కువయున్నప్పుడు వాటినే త్రాళ్ళు అంటున్నాము.
ఇక్కడ కొంత పేరు మారి బహువచనమగుచున్నది. అదే విధముగా వస్తువులను కాకుండా మనుషుల విషయములోనికి
వస్తే, ఒక పాఠశాలలోయున్న విద్యార్థులను విద్యార్థిసంఘము అనవచ్చును. దేశములోని పాఠశాలలోనున్న
విద్యార్థులనందరినీ కలిపి విద్యార్థిలోకము అని అంటున్నాము. అన్ని దేశములలోయుండు ఒక విభాగమునకు చెందిన
మనుషులందరినీ కలిపిన ఏకత్వమునకు ప్రత్యేకించి లోకము అని పేరు పెట్టబడినది. అనేక దేశములలోని ఒకే
విధానమునకు సంబంధించిన అందరినీ కలిపి లోకము అనడములో ఒక అర్థము గలదు. కొన్ని కలిసి ఒకటిగా
ఏర్పడినప్పుడు దానికి పేరుమారినట్లు కొందరు మనుషుల సమూహములన్నిటినీ కలిపి ఏకము చేసి లోకము అంటున్నాము.
అనేకముగాయుంటూ ఏకముగా చెప్పబడు దానికి లోకము అని అర్థము. ఏకమునకు ఒక్క అక్షరము మారి లోకము
అగుచున్నది.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. లోకము అనగా దానిలో అనేకమున్నాయని అర్థము. విద్యార్థిలోకములో
విద్యను నేర్చుకొనువారు, లేక విద్యను అర్థించువారందరూ గలరు. భూమండలమంతా అన్ని దేశములలోని విద్యార్థుల
విభాగమునకు సంబంధించిన వారందరినీ ఏకము చేసి విద్యార్థి లోకము అంటున్నాము కదా! అట్లే ప్రపంచములోని
కార్మికులను అందరినీ కలిపి ఏకత్వముగా కార్మికలోకము అంటున్నాము. ప్రపంచములో వ్యయసాయము చేయు
రైతులందరినీ కలిపి కర్షకలోకము అని అంటున్నాము. అదే విధముగా ప్రపంచములో సుఖములను అనుభవించు
మనుషులందరినీ కలిపి స్వర్గలోకము అంటున్నాము. అట్లే ప్రపంచములో బాధలు అనుభవించు వారందరినీ కలిపి
ఏకముగా నరకలోకము అంటున్నాము. ఇట్లు అనేక లోకములు ఒకే ప్రపంచములోనే ఉన్నాయి తప్ప అవి వేరువేరు
ప్రపంచములుగా లేవు. ఈ సూత్రము ప్రకారము అనేక లోకములు కలిసి ఒక ప్రపంచమవుచున్నది. మనకున్నది ఒక
ప్రపంచమే, ఆ ప్రపంచము అందరికీ తెలియునట్లు కనిపించుచున్నది, వినిపించుచున్నది, ప్రత్యక్ష అనుభవములో యున్నది.
21

Page 22
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ప్రత్యక్షముగాయున్న ప్రపంచములో విచక్షణతో చూడగలిగితే అన్ని లోకములూ మనమున్న ఈ ప్రపంచములోనేయున్నవని
తెలియగలవు.
ఏ
ప్రత్యక్షముగాయున్న ప్రపంచమును అందరమూ చూస్తున్నాము. ప్రపంచములోని లోకములన్నిటినీ చూస్తున్నాము.
అయినా ఎదురుగాయున్న లోకములను గ్రహించలేక అవి ఎక్కడో ఉన్నాయనుకోవడము గ్రుడ్డితనము కాదా! యని
అడుగుచున్నాను. వాస్తవముగా అనేక సుఖములను అనుభవించు స్వర్గలోకమునకు సంబంధించినవారినీ చూస్తున్నాము.
అలాగే అనేక బాధలను అనుభవించు నరకమునకు సంబంధించిన వారినీ చూస్తున్నాము. అయినా మన అజ్ఞాన
గ్రుడ్డితనము చేత ఎవరినీ, ఏ లోక వాసులనూ గుర్తించలేకపోవుచున్నాము. అజ్ఞానులు ఎటూ గుర్తించలేరు. అయితే
మేము జ్ఞానులము, మేము ధర్మరక్షకులము, మేము పరమ హంసలము అని గుర్తింపుగా పేర్లు పెట్టుకొన్నవారు కూడా
స్వర్గలోకము పైన ఉంది, దానికి ఒక రాజున్నాడు అని చెప్పడము విడ్డూరము కాదా! అలాగే నరకలోకము క్రిందయుంది,
దానికి యముడు రాజని చెప్పడము అజ్ఞానము కాదా! ఏమీ తెలియని మనుషులు పెద్దలు చెప్పినదే సత్యమని నమ్ముట
వలన పెద్దలనువారు పాడినపాటనే అందరూ పాడడము జరుగుచున్నది. ఎవరిని అడిగినా స్వర్గము, నరకములున్నవని
చెప్పుచున్నారు గానీ, మీరు చూచారా? అంటే చనిపోయిన తర్వాత పుణ్యమును అనుభవించేదానికి స్వర్గమునకూ,
పాపమును అనుభవించేదానికి నరకమునకూ పోవలసి యుంటుంది. అక్కడకు పోయిన తర్వాత చూడవచ్చునని
ఆధ్యాత్మిక వేత్తలమనువారు కూడా చెప్పుచున్నారు.
ఆధ్యాత్మికవేత్తలమని పేరు పెంచుకున్న గుర్తింపుపొందిన గురువులు కూడా స్వర్గనరకముల విషయములో గ్రుడ్డిగా
మాట్లాడుచున్నారు. అనేక కథలను తయారు చేసి యమలోకము ఒక నదీతీరమున ఉన్నదని చూచి వచ్చినట్లు
చెప్పుచున్నారు. 'సతీసావిత్రి' కథను తయారు చేసి అది నిజముగా జరిగిన కథయని అందరినీ నమ్మించారు. ఆ
కథలో సావిత్రి తన భర్త ప్రాణములను తీసుకొనిపోవుచున్న యముని వెంట పడినదనీ, తన భర్త ప్రాణములను అడుగుచూ
యమునివెంట కొన్ని ఆమడల దూరము నడిచి పోయిందనీ, ఆమెను వదిలించుకొనుటకు యముడు రెండు వరములిస్తాను
గానీ నీ భర్త ప్రాణములివ్వనని చెప్పినట్లు వ్రాశారు. అప్పుడు సావిత్రి అతి తెలివిగా యమున్ని తనకు సంతతి
కావలెనని కోరిందనీ, యముడు ఆ కోర్కెను మన్నించి వరమునిచ్చి పోవుచుండగా, భర్త లేకుండా సంతతి ఎట్లు కలుగుతుందని
ప్రశ్న అడిగిందనీ, అప్పుడు యముడు చేయునది లేక సావిత్రికి ఆమె భర్త ప్రాణములను ఇచ్చి ఒంటరిగా యమపురికి
పోయాడని చెప్పారు. ఈ కథయొక్క ఉద్దేశ్యము నరకలోకము ఎక్కడోయున్నదనీ, దానికి యముడు రాజుగాయున్నాడని
చెప్పడము తప్ప ఏమీ లేదని తెలియుచున్నది. జ్ఞానదృష్టి లేనివారికి 'సతీసావిత్రి' కథ గొప్పగా కనిపించినా, జ్ఞానదృష్టియున్న
వారికి ఇదియొక కల్పిత కథగా కనిపించుచున్నది. ఇటువంటి పురాణగాథల వలన మనిషి సత్యమును వీడి ఆత్మజ్ఞానమునకు
దూరముగా పోవుచున్నాడు తప్ప దగ్గరగుటకు అవకాశమే లేకుండా పోవుచున్నది.
ఆ
సతీసావిత్రి పురాణము వలన నరకలోకమూ, నరకమునకు రాజు అయిన యమధర్మరాజు మాత్రమే మనుషులకు
పరిచయమయినారు, అయితే అష్టాదశ పురాణములలో గల “గరుడ పురాణము” వలన పూర్తి యమలోకము అక్కడ
జరిగే హింసలు, హింసలు పెట్టే యమభటులు మొదలగున వన్నీ తెలిసిపోయినవి. ఇటువంటి పురాణములను
చదివినవారందరూ యమలోకము ప్రత్యేకముగాయున్నదని తప్పక చెప్పుదురు. ఈ విధముగా పురాణగాథలవలన,
పురాణగాథలను పనిగట్టుకొని బోధించు బోధకులవలన, ఏమీ తెలియని ప్రజలు కూడా అజ్ఞానమువైపుకు పోవుటకు
22

Page 23
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
అవకాశమేర్పడుచున్నది. మేము ఒకమారు, పురాణములను బోధించుచూ గురువులుగా చలామణి అగుచున్న ఒక
వ్యక్తితో కలిసి మాట్లాడడము జరిగినది. అప్పుడు జరిగిన సంభాషణను క్రింద వివరముగా చూడండి.
నా ప్రశ్న :- స్వామీజీ మీరు చతుర్వేదములను, అష్టాదశపురాణములను తెలిసిన జ్ఞానులు కదా! మీరు ప్రజలకు
గురువుగాయుండి కొంత జ్ఞానమును బోధిస్తున్నారు కదా! మీ బోధలలో ఎక్కువగా వేదములను బోధిస్తున్నారా? లేక
పురాణములను బోధిస్తున్నారా?
జవాబు :- కొంత జ్ఞానమున్న బ్రాహ్మణులకు వేదములను బోధిస్తుంటాము. ఏ జ్ఞానమూలేని శూద్రులయిన వారందరికీ
పురాణములను బోధిస్తుంటాము. శూద్రులకు పురాణములు బాగా రుచిస్తాయి. అందువలన పురాణములనే వారు
బాగావింటారు. అందువలన ఎక్కువగా అందరికీ పురాణములనే చెప్పుచుంటాము.
నా ప్రశ్న :- శూద్రులకు కూడా వేదములను బోధించవచ్చును కదా! అట్లు కాకుండా శూద్రులకు పురాణములనే
ఎందుకు చెప్పుచున్నారు?
జవాబు :- వేదములు బ్రాహ్మణులకొరకే తయారు చేయబడినవి. శూద్రుల కొరకు పురాణములు తయారు చేయబడినవి.
అందువలన శూద్రులకు పురాణములను చెప్పుచున్నాము.
నా ప్రశ్న :- శూద్రుల కొరకు పురాణములనే ఎందుకు తయారు చేశారు?
జవాబు :- శూద్రులు ఎక్కువగా పాపపు పనులు చేయుచూ, పాపమును మూటగట్టుకొనుచుందురు. అటువంటివారికి
మీరు చేయు పనులయందు ఎన్నో పాపపుపనులున్నాయనీ, పాపము వలన నరకమునకు పోయి చిత్రహింసలు
అనుభవించవలసియుంటుందనీ, యమధర్మరాజువద్ద ప్రతి మనిషి చరిత్ర యుంటుందనీ, దాని ప్రకారము యమలోకములో
శిక్షలు తప్పవనీ చెప్పుచుందుము. అప్పుడు పాపము వలన నరకము తప్పదని తెలియుట వలన, అటువంటి పాపపు
కార్యములను భవిష్యత్తులో చేయకుందురు. అంతవరకు చేసిన పాపము పోవుటకు రుద్రాభిషేకము, సత్యనారాయణ
వ్రతములు మొదలగునవి చేయుటకు అలవాటు పడుదురు. అభిషేకముల వలన, వ్రతక్రతువుల వలన చేసుకొన్న
పాపము పరిహారమయి పోగా, జరుగబోవు కాలములో పాపపుపనుల జోలికి పోకుందురు. అందువలన ప్రత్యేకించి
శూద్రులకు పురాణములను బోధిస్తుంటాము.
నా ప్రశ్న :- స్వర్గ, నరకములకు చనిపోయిన తర్వాత మనుషులు పోవలసి యుంటుందని మీరు చెప్పుచున్నారు కదా!
స్వర్గమునకు ఎక్కువగా ఎవరు పోవుచున్నారు? నరకమునకు ఎవరు పోవుచున్నారు?
జవాబు :- పుణ్యము చేసినవారు స్వర్గానికీ, పాపము చేసినవారు నరకానికీ పోవుచున్నారు. శూద్రులు ఎక్కువగా
పాపకార్యములనే చేయడము వలన ఎక్కువగా వారే నరకమునకు పోవుచున్నారు. స్వర్గమునకు అధికముగా బ్రాహ్మణులు
పోవుచుందురు.
నా ప్రశ్న :- పాపమును చిత్రహింసల రూపముగా అనుభవించడమును నరకమనీ, పుణ్యమును సుఖముల రూపములో
అనుభవించడమును స్వర్గమని అంటున్నాము కదా! స్వర్గమున్న దానిని స్వర్గలోకమనీ, నరకమున్న దానిని నరకలోకమనీ
అంటున్నారు కదా! అట్లు కాకుండా స్వర్గమును ఇంద్రలోకమనీ, నరకమును యమలోకమనీ చెప్పవచ్చును కదా! దీనికి
మీరేమంటారు?
23

Page 24
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
జవాబు :- ఎందుకు చెప్పకూడదు? ఇంద్రలోకము, యమలోకమని చెప్పవచ్చును. అయితే అట్లు చెప్పుట వలన
ఇంద్రలోకమన్నప్పుడు ఇంద్రుడు, ఇంద్రుని పాలనలోని అష్టదిక్పాలకులు, ఇంద్రసభ, ఆ సభలో నాట్యమాడు రంభ,
ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలగు అప్సరసలు జ్ఞాపకము వస్తారుగానీ, అక్కడికి పోయినవారు అనుభవించు సుఖములు
జ్ఞాపకము రావు. అట్లే యమలోకము అంటే అక్కడున్న యముడూ, యముని వాహనము దున్నపోతూ, పాపపుణ్యములను
నమోదు చేసుకొను చిత్రగుప్తుడూ, యమభటులూ మొదలగు యముని పరిపాలన జ్ఞాపకము వచ్చునుగానీ, అక్కడ
పాపులు అనుభవించు బాధలు, యమకింకరులు మనుషులను హింసించు చిత్రహింసలు జ్ఞాపకము రావు. అందువలన
యమలోకము అనుటకంటే నరకలోకము అనడమే మంచిది. అట్లే ఇంద్రలోకము అనుట కంటే స్వర్గలోకము అనుటయే
మంచిది.
నా ప్రశ్న :- మీరు ఎంతో గొప్ప జ్ఞానులు, వేదవేదాంగ పారాయణులు, ఆధ్యాత్మికవేత్తలు, ఎందరికో గురువుగాయున్నవారు.
నరకమును, స్వర్గమును గురించి ఎంతో విడదీసి చెప్పుచున్నారు. ఇటువంటి మీరు ఎంతో జ్ఞాన దృష్టి కూడ కల్గియుంటారు.
అందువలన మిమ్ములను నేను అడుగునది ఏమనగా! సామాన్య మానవులు ప్రత్యక్షముగా చూడని స్వర్గమునుగానీ,
నరకమునుగానీ మీరు చూచారా? లేక ఎవరైనా చూచారా?
-
జవాబు : – నేను ప్రత్యక్షముగా చూడలేదుగానీ, నా జ్ఞానదృష్టితో స్వర్గమును, నరకమును రెండిటినీ చూచాను. అందువలన
స్వర్గము ఇట్లేయున్నదనీ, నరకము ఇట్లేయున్నదనీ చెప్పుచున్నాను. ఇతరుల విషయానికి వస్తే నచికేతుడు యమలోకమునకు
పోయి యమలోకమును ప్రత్యక్షముగా చూచివచ్చాడు. అతనే కాకుండా ధర్మరాజు కూడా యుద్ధరంగములో చిన్న
అబద్ధమును చెప్పి ద్రోణుని మరణమునకు కారణమయినందున, ఆ పాపము అనుభవించుటకు ఒకరోజు రాత్రంతయు
యమలోకములో ఉండవలసి వచ్చినది. ఒక దినము యమలోకములో గడిపిన ధర్మరాజు తిరిగివచ్చి స్వర్గలోకమునకు
పోయాడు. ఇట్లు గతచరిత్రలో అనేకమంది పోయివచ్చిన వారున్నారు.
నా ప్రశ్న :- స్వర్గనరకములకు పోయివచ్చినవారు మనముందర లేరు. జ్ఞానదృష్టితో పరోక్షముగా చూచిన మీరు ఇక్కడే
ఉన్నారు కదా! యమలోకము మనకు ఎంత దూరములో ఉంటుంది?
జవాబు :- దానిని నేను చెప్పినా నీకు అర్థము కాదు. దానికి మైళ్ళు, కిలోమీటర్లు పనికిరావు. దానికొలత వేరే
పరిమాణములో ఉంటుంది.
(ఇక్కడ సూటిగా జవాబు చెప్పలేక, వారికే జవాబు తెలియక జవాబును దాటవేయుటకు అలా చెప్పారని అర్థము
చేసుకోండి.)
నా ప్రశ్న :- స్వర్గలోకము యొక్క దూరమునయినా చెప్పగలరా?
జవాబు :- దానిని తెలుసుకొనుటకు నీవు అర్హుడవుకావు. అందువలన స్వర్గము యొక్క దూరమును నాకు తెలిసినా
చెప్పను.
(స్వర్గము యొక్క దూరము ఆయనకే కాదు ఎవరికీ తెలియదు. అయినా తన పెద్దరికమును ప్రకటించుకొనుటకు
నాకు తెలిసినా చెప్పనంటున్నాడు. సత్యము తెలిస్తే ఆయన ఎంత అజ్ఞానో ఆయనకే అర్థమవుతుంది.)
24

Page 25
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
నా ప్రశ్న :- ప్రపంచములోని విద్యార్థులనందరినీ విద్యార్థుల లోకము అన్నట్లు, కార్మిక, కర్షకులను కార్మికలోకము,
కర్షకలోకము అన్నట్లు ఇంద్రలోకమును సుఖాలలోకమనీ, యమలోకమును కష్టాలలోకమనీ పేరుపెట్టి పిలువకుండా,
ఇంద్రలోకమునకు స్వర్గలోకమనీ, యమలోకము నకు నరకలోకమనీ ఎందుకు పేరు పెట్టారు? దయచేసి చెప్పండి.
వారి జవాబు :- సుఖాలలోకము, కష్టాలలోకమని పేరుపెట్టి పిలిస్తే అక్కడి రాజు కూడా అట్లే ఉండునేమోనని
అనుకోవచ్చును. స్వర్గలోకమును సుఖాలలోకము అంటే అక్కడ రాజుగాయుండే ఇంద్రుడు అతని పరివారము అందరూ
సుఖాలు అనుభవించేవారని ఎవరైనా అనుకొనుటకు అవకాశము గలదు. అట్లే నరకమును కష్టాలలోకము అంటే
అక్కడ రాజుగాయున్న యమధర్మరాజు ఆయన పరివారము అందరూ కష్టాలు అనుభవిస్తున్నారేమో, అందుకే కష్టాలలోకమని
పేరు పెట్టారేమో అని అనుకొనుటకు అవకాశము కలదు. అందువలన సుఖాలలోకమని స్వర్గమునకు, కష్టాలలోకమని
నరకమునకు పేరుపెట్టలేదు.
నా ప్రశ్న :- నేనుగానీ, నాలాంటి ప్రజలుగానీ స్వర్గనరకములను గురించి ఇతరులు చెప్పుచుంటే వినడమేగానీ మేము
ఏమాత్రము చూడలేదు. మీలాంటివారు ఎవరయినా చూచియున్నా అవి ఎట్లున్నాయో, ఎక్కడున్నాయో, ఎంత దూరములో
యున్నాయో మాకు అర్థమయ్యేలాగా చెప్పరు. స్వర్గనరకముల గురించి శాస్త్రబద్ధముగా, హేతుబద్ధముగా, ప్రశ్నరాకుండు
నట్లు, అనుమానము లేకుండా పోవునట్లు ఖచ్చితమైన సమాచారమును ఎవరూ అందివ్వడము లేదు. అలాంటప్పుడు
మాలోని అనుమానముకొద్దీ కొన్ని ప్రశ్నలను స్వర్గ నరకములను గురించి అడుగవలసి వస్తుంది. అడిగితే ఎక్కడా
జవాబు దొరకడము లేదు. అలాంటప్పుడు స్వర్గనరకములు అబద్దమేమోనను అనుమానము కూడా వస్తున్నది. ఒకవేళ
అవి యుంటే వాటిని అర్థము చేసుకోవడములో ఏమయినా మనుషులు పొరపాటు పడినారాయని మరొక ప్రక్క అనుమానము
కల్గుచున్నది. ఈ విధముగా స్వర్గనరకములు రెండూ సంశయాల నిలయముగా తయారయి నవి. మా సంశయములు
ఈ జన్మలో తీరవా, మా ప్రశ్నలకు జవాబులు దొరకవా?
వారి జవాబు :- ఇంతవరకూ గంటనుండి నీతో మాట్లాడుచునేయున్నాను. నీవు అడిగిన ప్రశ్నలకన్నిటికీ జవాబును
చెప్పాను. ఇంకా నీ దగ్గర ప్రశ్నలేమి మిగిలియుంటాయి? ఒకవేళయుంటే అడుగు దేనికయినా జవాబు చెప్పుతాను.
నా ప్రశ్న :- ఇంతకుముందు నేను అడిగిన ఒక ప్రశ్నకు నీకు చెప్పినా అర్థము కాదు అని ఒకమారు చెప్పారు. తర్వాత
రెండవ ప్రశ్నను అడిగాను, అప్పుడు నన్ను జవాబు తెలుసుకొనే అర్హతే లేదని చెప్పారు. ఒకమారు అర్థము చేసుకోలేని
వాడినయినాను. రెండవమారు పూర్తి అనర్హుడనైనాను. తర్వాత ఇంకా ప్రశ్నలడిగితే మనిషినే కాకుండా జంతువునయిపోతానే
మోనను భయముతో ప్రశ్నలడగడము మానుకొన్నాను. శ్రద్ధయున్నవానికి జ్ఞానము తెలియునని భగవద్గీత
జ్ఞానయోగమునందు 39వ శ్లోకములో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” అని అన్నారు కదా! తెలుసుకోవాలను శ్రద్ధయున్న
మాకు ఈ స్వర్గ నరకముల జ్ఞానము తెలియదా?
వారి జవాబు :- అన్ని ప్రశ్నలకూ అందరివద్దా అన్ని జవాబులూ ఉండవు. నాకు తెలిసినవి నేను చెప్పాను. నాకు
తెలియనివి కూడ ఉండవచ్చును కదా! అందువలన ఇంకా కొంతమందిని అడుగుతూపోతే, మిగతా ప్రశ్నలకు కూడా
జవాబులు దొరకవచ్చును. అందువలన నిరుత్సాహపడక అడిగి తెలుసుకొనే ప్రయత్నము చేయండి. మీకు కావలసిన
స్వర్గనరకముల సమాచారము కావాలంటే నేను చెప్పినదానికంటే ఎక్కువగా చెప్పువారు ఎవరూ ఉండరు. వాటిని
గురించి ఆలోచించువారు గానీ, తెలుసుకొను వారుగానీ ఎవరూ లేరు. నీ ప్రశ్నలకు శాస్త్రబద్ధమైన జవాబులు దొరుకుట
25

Page 26
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
దుర్లభమనియే చెప్పవచ్చును. ఎందుకనగా ఇంతవరకూ స్వర్గనరకములను గురించి పురాణములలోనే గలదు. ఎక్కడా
శాస్త్రములలో ఎక్కువగా యున్నట్లు లేదు. పురాణముల మాటలు నిజమూ కావచ్చు, అబద్దమూ కావచ్చును. అందువలన
నీ ప్రశ్నలకు ఖచ్ఛితమైన జవాబులు దొరుకుతా యని మేము చెప్పలేము. నీ పరిశోధననుబట్టి నీకు తెలియవలసిందే.
(ఈ విధముగా మా సంభాషణ కొనసాగిన తర్వాత జవాబు చెప్పు బోధకుడు స్వర్గనరకములను గూర్చి పూర్తిగా
చేతులు ఎత్తేసినట్లు చెప్పి ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేము అని అన్నాడు.)
బయటి ప్రపంచములోని మనుషులు గురువులుగా, స్వామీజీలుగా, బోధకులుగాయున్నవారు స్వర్గనరకముల
గురించి ఏ విధమైన అవగాహనతో యున్నది, పాఠకులైన వారందరికీ తెలియాలను ఉద్దేశ్యముతో, వారితో మాట్లాడిన
విషయములను వ్రాయాలని వ్రాశాము, హిందూ బోధకుడితో మాట్లాడిన తర్వాత ఒక ముస్లీమ్ పండితుని వద్దకు
పోయి, మనిషి చనిపోయిన తర్వాత స్వర్గనరకములకు పోవడము వాస్తవమేనా? మనిషిని స్వర్గానికిగానీ, నరకానికిగానీ
ఎవరు తీసుకుపోతారు? అని అడిగాను. దానికి వృద్ధుడయిన ముస్లీమ్ పండితుడు “నీవు ఖుర్ఆన్లోని 86వ సూరా
(అత్ తారిఖ్) ను పూర్తిగా చదువుకో, అప్పుడు నీవు అడిగిన దానికి జవాబు బాగా అర్థమవుతుంది. మేము చెప్పేదానికంటే
అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్లో వుండే సమాచారమును తెలుసుకోవడము మంచిది” అని చెప్పాడు. అప్పుడు
"దివ్య ఖుర్ఆన్ సందేశము" అను ఒక తెలుగు అనువాద గ్రంథమునూ, "అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్” అను
గ్రంథమును తెప్పించుకొని అందులోని "అత్ తారిఖ్" అను (86) సూరా మొత్తము చూచాను. అందులో మొత్తము
పదిహేడు (17) వాక్యములున్నాయి. వాటిని మొత్తము క్రింద మీరు కూడా చూడవచ్చును. 86వ సూరా మొదట
పరిచయ వాక్యములనుండి మొదలుపెట్టి రెండు గ్రంథములలోని 17 ఆయత్లను (వాక్యములను) వ్రాసి చూపించుచున్నాము
చూడండి.
G.
అత్ తారిఖ్ (ప్రభాత నక్షత్రము)
(పరిచయము)
ఇందులో ముఖ్యముగా ప్రస్తావించిన విషయాలు-ప్రళయము, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడమూ,
దైవవాణి అవతరించడమూ, మొదటి ఆయత్లో (వాక్యములో) వచ్చిన తారిఖ్ (ప్రభాత నక్షత్రము) అన్న ప్రస్తావనే ఈ
సూరాకు పేరు పెట్టడము జరిగినది. మనిషి ఏ విధముగా వీర్య ద్రవమునుండి సృష్టించబడినది తెలుపుతూ, అల్లాహ్
మరణించిన ప్రతి ఒక్కరినీ తీర్పు దినాన మళ్ళీ లేపి నిలబెట్టగలడనీ, ఆ రోజు యావత్తు మానవాళి తుది తీర్పు కోసము
దేవుని ముందు హాజరవుతారని చెప్పడము జరిగినది. ఆ రోజు ప్రతి ఒక్కరి మంచీ లేదా చెడు పనులు బట్టబయలవు
తాయి. దివ్యఖుర్ఆన్ దేవుడు పంపిన సత్యమనీ, ఇది మంచిని చెడునుంచి వేరు చేస్తుందనీ, ఇవి వ్యర్థమైన ప్రసంగాలు
కావని నొక్కి చెప్పింది.
26

Page 27
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభము.
అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్
దివ్యఖుర్ఆన్ సందేశము
ము
1) ఆకాశము సాక్షిగా! రాత్రి చీకటిలో
ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా!
1)
ఆకాశము మరియు రాత్రివేళ
వచ్చే నక్షత్రము సాక్షిగా!
2) రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో
2)
రాత్రివేళ వచ్చేది అంటే ఏమిటో
నీకు తెలుసా?
నీకు ఎలా తెలుస్తుంది?
3) అది ప్రకాశించే నక్షత్రము.
3)
అదొక అత్యంత ప్రకాశవంత
4) తనను కనిపెట్టుకొనియుండే దూత
4)
లేకుండా ఏ ప్రాణీపుట్టలేదు.
మైన నక్షత్రము.
కనిపెట్టుకొని ఉండేవాడు
(దేవదూత) లేకుండా ఏ వ్యక్తీ
కూడా లేడు.
5) ఇక మానవుడు తాను దేనితో
5)
కావున మానవుడు దేనితో
పుట్టించబడ్డాడో చూచుకోవాలి.
6) అతను ఎగిసిపడే నీటితో
6)
అతడు విసర్జింపబడే
పుట్టించబడ్డాడు.
పుట్టించబడ్డాడో గమనించాలి.
ద్రవపదార్థముతో సృష్ఠించ
బడ్డాడు.
7) అది వెన్నెముక, ఛాతి మధ్య
భాగములోనుండి వెలువడుతుంది.
7)
అది వెన్ను మరియు రొమ్ము
8) నిశ్చయముగా ఆయన అతన్ని
తిరిగి రప్పించుకునే శక్తిని కూడా
కల్గియున్నాడు.
9) ఆ రోజు లోగుట్టులన్నీ రట్టయి
8)
9)
ఎముకల మధ్య భాగమునుండి
బయటికి వస్తుంది.
నిశ్చయముగా ఆయన
(సృష్టికర్త) అతనిని మరలా
బ్రతికించే సామర్థ్యముగలవాడు.
ఏ రోజయితే రహస్య విషయాల
విచారణ జరుగుతుందో.
పరికించబడుతాయి.
10) అప్పుడు అతనికంటూ ఏ
10)
అప్పుడు అతనికి (మనిషికి)
అధికారముగానీ, ఏ బలము
గానీ ఉండదు. ఏ
సహాయకుడూ ఉండడు.
ఎలాంటి శక్తి యుండదు.
మరియు ఏ సహాయకుడూ
ఉండడు.
11) వర్షము గల ఆకాశము సాక్షిగా!
11)
వర్షమును కురిపించే ఆకాశము
సాక్షిగా!
27

Page 28
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
12) బీటలువారే భూమి సాక్షిగా!
12)
13) నిశ్చయముగా ఇది (ఈ ఖుర్ఆన్)
నిర్ణయమైన వాక్కు.
13)
(చెట్లు మొలకెత్తేటప్పుడు)
చీలిపోయే భూమి సాక్షిగా!
నిశ్చయముగా ఇది (ఈ ఖుర్
ఆన్) సత్యాసత్యములను వేరు
పరచేవాక్కు (గీటురాయి)
14) ఇదేదో అషామాషీ విషయము
14)
మరియు ఇది వృథా
కాదు.
15) వీళ్ళు (అవిశ్వాసులు) కొన్ని
15)
పన్నాగములు పన్నుతున్నారు.
16) నేను కూడా ఒక పన్నాగం
పన్నుతున్నాను.
16)
17) కాబట్టి (ఓ ప్రవక్తా) నువ్వు
17)
అవిశ్వాసులకు కాస్త
కాలక్షేపానికి వచ్చినది కాదు.
(ఓ ముహమ్మద్) నిశ్చయముగా
వారు నీకు విరుద్ధముగా
కుట్రను పన్నుతున్నారు.
మరియు నేను కూడా
పన్నాగము పన్నుతున్నాను.
కనుక నీవు సత్యతిరస్కారులకు
తము
కొంత వ్యవధినివ్వు.
విడుపు ఇవ్వు, కొన్నాళ్ళపాటు
వారిని వదలిపెట్టు.
వారిపట్ల మృదువుగా
వ్యవహరించు.
86వ సూరాలోయున్న మొత్తము 17 ఆయత్లను రెండు గ్రంథము లలో ఉన్నవాటిని తీసి వ్రాయడము జరిగినది.
86వ సూరాలోగల పదిహేడు వాక్యములకు వేరువేరుగా ఇద్దరు పండితులు వ్రాసిన తెలుగు అనువాదము లను చూచాము.
పదిహేడు ఆయత్లలో చెప్పిన విషయమును ఇద్దరు పండితులు ఇంచుమించు ఒకే భావముతో వ్రాయడము జరిగినది.
మొదట వ్రాసిన పరిచయములో దేవుడు మరణించిన ప్రతి ఒక్కరినీ తీర్పు దినమున వారివారి సమాధులనుండి తిరిగి
సజీవులుగా శరీరముతో లేపి నిలబెట్టి, ఆ రోజు మొత్తము మానవాళికి దేవుడు తీర్పు చెప్పి స్వర్గ, నరకములకు
పంపుతాడని చెప్పడము జరిగినది. 86వ సూరా మొదటి పరిచయములో వ్రాసినది కొంత అర్థమయినది గానీ,
సూరాలోని పదిహేడు ఆయత్లలో పూర్తి ఆ అర్థమున్నట్లు నాకు కనిపించ లేదు. మొత్తము పదిహేడు వాక్యములలో 8,
9, 10 మూడు వాక్యములు మాత్రము పరిచయ భావమునకు దగ్గరగా తీర్పు దినమును గురించిన అర్థము నిచ్చుచున్నవి.
మిగతా పదునాలుగు వాక్యములలో పరిచయములో చెప్పిన తీర్పు భావము లేదనుకుంటాను. మిగతా పదునాలుగు
వాక్యములలో నాలుగవ వాక్యము మాత్రము మంచి సారాంశము కల్గిన వాక్యమయినా, అది తీర్పు దినమునకు
సంబంధించినది కాదు. ఈ సూరాను గురించి నేను అడిగిన ముస్లీమ్ పండితునకు ఏమి తెలిసిందోగానీ నన్ను 86వ
సూరా చూడమన్నాడు. ఇక్కడ 86వ సూరాలోని పదిహేడు వాక్యములను మీరు కూడా చూచారు కదా! తీర్పు
దినమును గురించి చనిపోయిన వారిని బ్రతికించి తీర్పు తీర్చు శక్తి దేవునకున్నదని ఎనిమిదవ వాక్యములో ఉండగా,
తొమ్మిదవ వాక్యములో మనిషి చేసుకొన్న పాపపుణ్యములన్నీ బయటపడగలవని యున్నది. ఇక పదవ వాక్యములో
దేవుడు మనిషి కర్మలను బయటపెట్టి శిక్షను వేయు రోజు, శిక్షను వద్దని వారించుటకు మనిషికి ఏ బలమూ ఉండదు.
అట్లే ఎవరూ సహాయపడరని కలదు. 8, 9, 10
8, 9, 10 ఈ మూడు ఆయత్లు తప్ప మిగతా పదునాలుగు ఆయత్లు
చనిపోయిన వానిని సజీవునిగా స్మశానము నుండి లేపు విషయము గానీ, తీర్పు దినమున మనిషి చేసుకొన్న కర్మలన్నీ
28

Page 29
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
బట్టబయలగుటగానీ, ఆ దినము మనిషికి ఏ బలము, సహాయము ఉండదనిగానీ చెప్పలేదు. ఈ మూడు విషయములు
8, 9, 10 సంఖ్యగల మూడు వాక్యములలోనే గలవు.
86వ సూరాలోని నాలుగవ వాక్యము మాత్రము ఉన్నతమైన భావము నిచ్చుచూ “తనను కనిపెట్టుకొనివుండేవాడు
లేకుండా ఏ ప్రాణీ పుట్టలేదు” అని ఉన్నది. ఈ వాక్యమునకు అర్థమును తెలియగలిగితే ఎంతో సారాంశమైన జ్ఞానము
కలదు. అయినా నాల్గవ సంఖ్యలోని వాక్యమును (ఆయత్ను) ఏ ముస్లీన్గానీ యోచించి తెలుసుకోలేదు. కనిపెట్టుకొని
ఉండువాడు ఒకడు అని వుంటే నాల్గవ వాక్యమునకు వివరము చెప్పు ముస్లీమ్ పండితులు ఏకవచనముగాయున్న
దూతను బహువచన దూతలుగా మార్చివేశారు. ఈ వాక్యములో ఎంతో మహోన్నతమైన జ్ఞానముయుంటే దానిని
ఏమాత్రము గ్రహించలేక వారి ఇష్టమొచ్చినట్లు వారు వ్రాసుకోవడము జరిగినది. అంతకూ ఈ నాల్గవ వాక్యమునకు
వివరమును ఏమి వ్రాశారో ఒకమారు చూస్తాము. “అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్" అను గ్రంథములో వ్రాసిన
విషయమునే ఇక్కడ వ్రాసి చూపు చున్నాము చూడండి.
“ప్రతి ప్రాణి (ప్రతి మనిషి) పై దేవదూతలు నియమించబడి యున్నారు. వారు మనిషియొక్క సత్కర్మలతోపాటు,
దుష్కర్మలను కూడా నమోదు చేయుచున్నారు. మరికొంతమంది విద్వాంసుల ఉద్దేశ్యము ప్రకారము ఇక్కడ కనిపెట్టుకొనివుండే
దూతలంటే మనిషిని కాపాడే దూతలని అర్థము. ఉదాహరణకు పదమూడవ అర్రాద్ సూరా 11వ వచనము ప్రకారము
"మనిషిని కాపాడడానికి దేవుని తరుపున నియమితులైన దైవదూత లుంటారు. వారు మనిషిని ముందూ వెనుకా
అంటిపెట్టుకొని ఉంటారు.”
86వ సూరాలోని నాల్గవ ఆయత్లో 'ఒక దూత' విషయమును చెప్పగా దానిని వివరించి చెప్పు బోధకులు,
పండితులు వారి వివరములో 'ఇద్దరు దూతలను' గురించి చెప్పడము జరిగినది. ఆ విషయము పైన కనపరచిన
వివరములో తెలిసిపోయినది. వివరణ ఇచ్చు పండితుడు నాల్గవ ఆయత్కు పదమూడవ (13) సూరాలోని 11వ
వాక్యమును (ఆయత్ను) చూపుచూ అక్కడ బహువచనములోయున్న దేవదూతలను చూపించారు. 'ముందూ వెనుకా
దేవదూతలు అంటిపెట్టుకొని ఉన్నారని' చెప్పాడు. 86వ సూరా నాల్గవ ఆయత్లో 'తనను కనిపెట్టుకొనియుండే దూత’
అని ఏకవచనముగా చెప్పిన విషయమును ఎందుకు బహువచనముగా మార్చు కొన్నారో వారికే తెలుసు. 50వ సూరా
21వ ఆయత్నందు "ప్రతి మనిషి ఒక తోలేవాడు లేక నడిపించేవాడు, ఒక సాక్షిని (చూచే వానిని) కల్గివస్తాడు" అని
యున్నది. సాక్షిగాయున్నవాడు ఏమీ చేయువాడు కాడు, వాడు నడుపబడే మనిషినీ, నడిపించే వానినీ ఇద్దరినీ సాక్షిగా
చూస్తున్నాడు తప్ప ఇతరము ఏదీ చేయనివాడు కావున మూడవ వానితో మనకు పనిలేదు. అతనిని గురించి
చెప్పుకోవలసిన అవసరములేదు. ఒకడు మనిషికాగా, రెండవవాడు వానిని తోలేవాడు అని కలదు. త్రోలబడేవాడు
గొర్రె అనుకొనుము తోలేవాడు వానిని కనిపెట్టుకొనివుండేవాడు అని అర్థమగు చున్నది. అదే విషయమునే
తోలేవాని విషయమునే 86వ సూరా నాల్గవ వాక్యములో కూడా వ్రాయడము జరిగినది. ఈ విధముగా 50, 86 రెండు
సూరాలలో 50-21 యందు, 86-4 యందు ఒకే దూత విషయము వ్రాసియుండగా పూర్తిగా ఏకవచనమును వదలి
బహు వచనముతో వివరమును వ్రాసుకోవడము తప్పు భావము కాదా!యని అడుగుచున్నాము. ఇక్కడ నేను కల్పించి
చెప్పినది ఏమీలేకుండా ఉన్నది ఉన్నట్లు వారు వ్రాసినదే వ్రాసి చూపించాము కనుక ఇక్కడ చదువు వారందరికీ వ్రాసిన
వారిది తప్పు అని తెలిసిపోవుచున్నది.
29

Page 30
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఇదే విధముగా ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు ఒక విధముగా తెలిపియుంటే మనుషులు దానిని మరొక
విధముగా అర్థము చేసుకోవడము జరిగినది. అట్లు మరొక విధముగా అర్థము చేసుకోవడము వలన దేవుడు తెల్పిన
భావము (జ్ఞానము) మనుషులకు అందలేదని చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథములో ఎంతో ఉన్నతమైన జ్ఞానమున్నది.
అయినా అది ఇంతవరకు కొంతతప్ప అంతా లభించలేదు. కొన్నిచోట్ల చాలామందికి ఖుర్ఆన్ గ్రంథమునుండి కొంత
జ్ఞానము కూడా అవగాహనకు రాలేదనియే చెప్పవచ్చును. మేము ఇదే గ్రంథములోనే ఒకమాట చెప్పాము. కొందరు
చదివి గ్రహించుకొంటారు, మరికొందరు విని గ్రహించుకొంటారు. అయితే కొందరు శరీరములోపల బుద్ధికి అర్థమయిన
దానినే గ్రహించుకొంటారని చెప్పాము. ఒక మనిషి దేవుని జ్ఞానములోనికి పోవాలన్నా, దేవుని జ్ఞానమునకు దూరముగా
యుండాలన్నా ఏది కూడా దేవునికి తెలియకుండా జరుగదు. ఒక మనిషి జ్ఞానమార్గములోనికి రావాలన్నా అది దేవుని
ఇష్టాయిష్టము మీద ఆధారపడియుంటుంది. దేవుని ఇష్టముననుసరించి దేవుని చేత నిర్మింపబడిన మాయయే మనిషి
శరీరములోని బుద్ధికి గ్రహించుకొను భావమును ఇచ్చుచున్నది. మాయ మనిషి బుద్ధిని ఎటైనా మార్చగలదు. దేవునికి
ఇష్టమైనవానికి దేవుని జ్ఞానమును గ్రహించుకొను శక్తి నిచ్చి అసలయిన జ్ఞానమును తెలియునట్లు చేయును. అప్పుడు
గ్రంథములో చెప్పిన విషయమునకు సరియైన అర్థమును మనిషి గ్రహించు కోగలడు. సంపూర్ణమైన జ్ఞానికాగలడు.
దేవునికి ఇష్టములేనివాని బుద్ధికి గ్రహించుకొను శక్తిని మార్చి, ఉన్నది ఉన్నట్లు అర్థము కాకుండా, ఉన్నది వేరొక
విధముగా అర్థమగునట్లు మాయ చేయుచున్నది. మాయ ఉన్న ఒక దూతను అర్థము కాకుండా చేసి, పండితులను
కూడా, మభ్యపరచి తప్పుదారిపట్టించి, ఒక దూతను అనేక దూతలుగా అర్థమయినట్లు చేసి, 86వ సూరాలో తప్పు
భావమును వ్రాయించిన విషయము ఇక్కడ చదివిన వారందరికీ అర్థమైవుంటుంది. అందువలన దేవుని జ్ఞానము
సక్రమముగా అర్థమగునట్లు చేయమని దేవున్ని కోరుకొందాము.
“అత్ తారిఖ్” అను 86వ సూరాలో మొత్తము పదిహేడు వాక్యములుండగా అందులో నాల్గవ వాక్యము మంచి
సారాంశ జ్ఞానమునకు సంబంధించినదైనా దానివిలువ, దాని అర్థము ఇప్పటి వరకు ఎవరికీ అర్థము కాలేదను
విషయము ఎవరూ నమ్మక పోయినా, నేను చెప్పుమాట నూటికి నూరు పాళ్ళు నిజము. మా మాట కొందరికి
బాధకలిగించినా, మాకు తెలియదా! అనిపించినా, ఈ మాట చెప్పినందుకు మా మీద కోపమొచ్చినా, మేము అన్నిటికీ
ఓర్చుకొని ఇది దేవుని విషయమైనందున సత్యమును చెప్పక తప్పలేదు. ఈ నాల్గవ వాక్యమును అటుంచి ఇదే సూరాలో
8, 9, 10 వాక్యములను చూచినట్లయితే, ఈ మూడు వాక్యములు కూడా ఎంతో జ్ఞానమునకు సంబంధించినవని
చెప్పవచ్చును. ఖుర్ఆన్ గ్రంథములో ఈ వాక్యములు అందరికీ సుపరిచయమున్న వాక్యములుగా, బాగా అర్థమయిన
వాక్యములుగా యున్ననూ, ఈ మూడు వాక్యములు కూడా ముస్లీమ్లలోని పెద్ద పండితులకు కూడా అర్థము కాలేదనియే
చెప్పవచ్చును. ఈ మూడు వాక్యములకు సమానమైన వాక్యములు ఖుర్ఆన్లో అక్కడక్కడయున్నా, వాటిని చదివిన
వారిలో అందరికీ కాకున్నా కేవలము ఒకరికి లేక ఇద్దరికయినా అర్థమయినాయా అంటే, వాటిలోని నిజభావము
ఒక్కరికి కూడా అర్థము కాలేదనియే చెప్పవచ్చును. నేను ఎంతోమంది ముస్లీమ్ బోధకులతో, పండితులతో కలిసాను.
ఎవరు చెప్పినా నిజభావమును వదిలి ప్రక్క భావమునే చెప్పుచున్నారు. దానినిబట్టి దేవుడు తన మాయచేత అట్లు
అర్థమయ్యేటట్లు చేసి, అదే సత్యమని నమ్మునట్లు చేశాడు. అందువలన మనిషి చావు విషయములో, తిరిగి లేపు విషయములో,
కర్మలు విధింపబడు విషయములో ముస్లీమ్ సమాజమంతా ఒకే భావము కల్గియున్నది. అందరిదీ ఒకే భావమైనందున
దానినే సత్యమని అందరూ నమ్ముచున్నారు. మాయ ఆ విధముగా మనిషిని నమ్మించి తన ఆధీనములో పెట్టుకొన్నది.
అయినా ఆ విషయము ఏ మనిషికీ తెలియకుండా మాయ చేయగలిగింది.
30

Page 31
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! "ఎల్లప్పుడూ ఖుర్ఆన్ గ్రంథములో మునిగి
తేలుచూ, ప్రతి ఆయత్ను (వాక్యమును) కంఠా పాటము చేసుకొన్న ముస్లీమ్ పండితులకే నిజభావము తెలియదని మీరు
చెప్పుచున్నారు కదా! ముస్లీమ్లలో పెద్ద పండితులకే తెలియని ఖుర్ఆన్లోని వాక్యముల నిజభావము, ఒక హిందువయిన
నీకు తెలుసా? వారికి తెలియదని నీవు ఎలా చెప్పగలుగుచున్నావు?” అని అడుగవచ్చును. దానికి నా సమాధానమును
కూడా మీరు చూడండి. స్వర్గనరకముల గురించి, చావుపుట్టుకల గురించి, కర్మల నిర్ణయము గురించి పండితులకు
కూడా తెలియదని చెప్పుటకు, ఆ విషయముల సత్యము నాకు తెలుసు గనుక వారికి సత్యము తెలియదని చెప్పుచున్నాను.
ఇప్పుడు నన్ను మరొక ప్రశ్న అడుగవచ్చును అదేమనగా! ఏ మనిషికీ తెలియని సత్యము నీకెలా తెలియబడుతుంది?
నీవు కూడా ఒక మనిషివే కదా! అలాంటప్పుడు మనుషులందరికీ తెలిసినదే నీకు కూడా తెలియాలి గదా! అట్లు
కాకుండా ఏ మనిషికీ తెలియని జ్ఞానవిషయము నీకెలా తెలిసింది? అని అడుగవచ్చును. ఈ ప్రశ్నకు నా సమాధానము
ఏమనగా!
నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మరొకమారు చెప్పు చున్నాను చూడండి. నేను మనుషులు చెప్పిన
మాటలనుగానీ, వ్రాతలనుగానీ చూచి జ్ఞానమును తెలుసుకోలేదు. నాలోనున్న నా పొరుగువానిని అడిగి తెలుసుకొన్న
విషయములయిన దానివలన ఎవరికీ తెలియని సత్యము తెలిసింది. నన్ను కనిపెట్టుకొని, నా శరీరములోయుంటూ, నా
శరీరమున కంతటికీ రాజుగా, అధిపతిగాయున్నవాడు ఎవడయితేయున్నాడో, వాడు సర్వత్ర జ్ఞాని అయినందున అతడు
తెలిపిన జ్ఞానమును చూచిన తర్వాత ఈ జ్ఞానము ఎవరివద్దా లేదని తెలిసిన తర్వాత ఇప్పటికయినా సత్యమును
తెలుసుకొందురను మంచి ఉద్దేశ్యముతోనే నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడ మైనది. ఒక ముస్లీమ్ సమాజమునకే గాదు
మొత్తము మానవాళికి తెలియని జ్ఞానము ఎంతోయున్నదని చెప్పుచున్నాను. ఖుర్ఆన్ గ్రంథమును అటుంచి భగవద్గీత
విషయానికి వస్తే ఇందువులలో ఏ పండితునికయినా, ఏ స్వామీజీకయినా భగవద్గీతలోని కొన్ని శ్లోకములకు నిజ
భావము తెలుసునా? అని అడుగుచున్నాను. నేను అడిగితే అన్ని శ్లోకములకు నిజ భావము తెలుసునని అందరూ నన్ను
బుకాయించి మాట్లాడవచ్చును. అయినా అందరికీ తెలియదను విషయము నాకు బాగా తెలుసు. ఇట్లు చెప్పుకుంటూ
పోతే బైబిలు విషయములో క్రైస్తవుల జ్ఞానము కూడా భావము తప్పిపోయి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పకపోతే
ఇంకెవ్వరూ చెప్పరను ఉద్దేశ్యముతో నన్ను అందరూ చెడుగా అనుకొన్నా ఫరవాలేదని, నా మాటతోనయినా మానవజాతి
అసలయిన దేవుని జ్ఞానము తెలియగలదని తలచి ఎంతో ఓర్పుతో ధైర్యముతో చెప్పుచున్నాను.
ఈ 86వ సూరాలో 8, 9, 10 ఆయత్లు (వాక్యములు) చావుపుట్టుకలకు, స్వర్గనరకములకు దగ్గర సంబంధమున్న
వాక్యములు. అందువలన వీటిని కొంత విశధీకరించి చెప్పవలసివచ్చినది. ఎనిమిదవ (8) వాక్యము "నిశ్చయముగా
ఆయన అతన్ని తిరిగి రప్పించే శక్తిని కూడా కల్గియున్నాడు” (మరొక గ్రంథములో) "నిశ్చయముగా ఆయన (సృష్టికర్త)
అతనిని మరలా బ్రతికించే సామర్థ్యముగలవాడు” అని కలదు. ఈ విషయమును గురించి ఖుర్ఆన్ గ్రంథములో
మరికొన్నిచోట్లయున్నా అది అందరికీ అర్థమయినదేమంటే! సృష్ట్యాదినుండి మరణించిన వారందరినీ భూమిలో
పాతిపెట్టుకొంటూ వచ్చాము కదా! అలా చనిపోయిన వారందరూ భూమిలో పాతిపెట్టిన చోటే ప్రళయము వరకు
యుందురని ముస్లీమ్ల విశ్వాసము. ఎప్పుడో ఒకప్పుడు అంతా నాశనమైపోవు ప్రళయము వచ్చిన రోజు అది
ప్రపంచమునకు అంతిమ దినమనీ, అంతిమ దినమైన ప్రళయ దినమున దేవుడు అంతవరకు చనిపోయిన వారందరినీ
భూగర్భములోని సమాధులనుండి లేచివచ్చునట్లు చేస్తాడని, అలా సమాధులనుండి లేచివచ్చిన వారందరికీ వారు
31

Page 32
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
బ్రతికినప్పుడు చేసుకొన్న పాప పుణ్యములను, మంచిచెడులను విచారించి గుట్టుగాయున్న కర్మలన్నిటినీ బహిర్గతము
చేసి, వారి కర్మలకు తగినట్లు పాపము ఎక్కువ చేసియుంటే నరకమునకూ, పుణ్యము ఎక్కువ చేసియుంటే స్వర్గమునకూ
దేవుడు పంపుతాడని చెప్పుచుందురు.
ఇక్కడ ఎనిమిదవ వాక్యములో అంతిమదినమున గతములో చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించుశక్తి
దేవునకున్నదని తెలుపుచూ "నిశ్చయముగా ఆయన (దేవుడు) అతనిని (మనిషిని) తిరిగి రప్పించే శక్తిని కల్గియున్నాడు”
అని ఈ వాక్యములో చెప్పడము జరిగినది. ఈ వాక్యమును గురించి ముస్లీమ్లందరూ ఒకే భావము కల్గియున్నారు.
అయితే నేను మాత్రము ఆ భావముతో ఏకీభవించడము లేదు. ఇక్కడ చెప్పిన ఖుర్ఆన్ గ్రంథములోని వాక్యమును నేను
కాదు అనడము లేదు. దానిని మనుషులు అర్థము చేసుకొన్న విధానమును నేను కాదంటున్నాను. ఈ వాక్యమునకు
సంబంధించి కొన్ని ప్రశ్నలను అడుగుచున్నాను. దానికి మీ వద్ద సరియైన సమాధానము ఉన్నదో లేదో
చూచుకోమంటున్నాను. ప్రశ్న 1) అంతిమ దినము అంటే అది నీకా? లేక నీవు నివసించు ప్రపంచమునకా?
2) దేవుడు చనిపోయిన వానిని రప్పిస్తాడు లేక బ్రతికిస్తాడు అని వాక్యములోయున్నది. చనిపోయినవాడు పోయి
ఎక్కడున్నాడు? వానిని దేవుడు ఎక్కడినుండి రప్పిస్తాడు? 3) సృష్ట్యాదినుండి పుట్టి చచ్చినవారంతా ఒక్కమారుగా లేచివస్తారా?
4) దేవుడు కార్యమును చేస్తే కార్యమునకు కారణమయిన కర్మ ఉండవలయును కదా! దేవుడు మనిషిని బ్రతికించే పని
చేస్తాడా? దేవునికి కూడా కర్మ కార్యములున్నవా? 5) ప్రళయదినమున మనిషిని బ్రతికించి తీర్పు తీర్చవలసిన అవసరము
దేవునికేమున్నది? 6) ఒకవేళ చేయవలసిన పని ఏమయినా వుంటే దేవుని సేవకులయిన దేవదూతలు చేయలేరా, దేవుడే
స్వయముగా చేయవలయునా? ఈ విధముగా ఎనిమిదవ వాక్యముననుసరించి ప్రశ్నలను అడుగవచ్చును. తొమ్మిదవ
వాక్యముననుసరించి 7) మనిషి చేసుకొన్న పాపములను అంతిమదినమున మనిషే చెప్పవలయునా లేక మనిషి చెప్పకున్నా
దేవుడే చెప్పగలడా? 8) మనిషి చేసుకొన్న లోగుట్టు కర్మలన్నీ విచారణకు ఎలా వస్తాయి? రహస్య కర్మలను బయటికి
ఎవరు చెప్పుతారు? పదవ వాక్యమును అనుసరించి 9) కర్మలను దేవుడు తీర్పు తీర్చు రోజు మనుషులకు ఏ బలమూ
ఎందుకుండదు? ఏ సహాయమూ అతనికి ఎందుకు అందదు? 10) బలము లేకుండాపోవడము, సహాయకులు
లేకుండాపోవడము పాపము చేసినవారికుండునా? లేక పుణ్యము చేసిన వారికి కూడా ఉండునా? ఇన్ని ప్రశ్నలకు
జవాబులు తెలియగలిగితే ఈ సూరాలోని 8, 9, 10 వాక్యములకు వివరము సులభముగా తెలియును.
86వ సురాలోని 8, 9, 10 వాక్యములు ఎంతో జ్ఞానముతో కూడుకొన్నవనుటలో సంశయము లేదు. అయితే
దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము అర్థము చేసుకోగలిగితే అందులో ఒక్క ప్రశ్నకూడా ఉద్భవించదు. ఉన్న సత్యమును
అర్థము చేసుకోలేకపోతే పై ప్రశ్నలన్నీ అడుగవలసి వస్తుంది. ఆ ప్రశ్నలకు ఎవరివద్దా జవాబులుండవు. వాటికి
జవాబులు చెప్పినా అవి ఏమాత్రము ఎవరికీ ఒప్పుదలకావు. జ్ఞానమునకు ఏమాత్రము సరిపోవు. ఆ మాటలన్నీ
అశాస్త్రీయముగా ఉండును. ఆ జవాబులన్నీ వారు అల్లుకొన్న కథలలాగాయుండును. దానికి ఆధారమేమి? అని
అడిగితే ఏమాత్రము సత్యమని నమ్ముటకు ఆధారమే ఉండదు. గతములో దాదాపు ఐదు సంవత్సరముల క్రిందట
ఒకపేరు పొందిన ఇస్లామ్ సంస్థను నడుపుచున్న, అమితమైన మేథాశక్తి గల ఇద్దరు ముస్లీమ్ పండితులతో కలిసి
స్వర్గనరకములను గురించి అడిగి తెలుసుకోవడము జరిగినది. మాకు ఎంత తెలిసినా మేము ఎదురు మాట్లాడక
వింటూ, అప్పుడప్పుడు ప్రశ్నలను అడిగి వాటికి జవాబును చెప్పించుకొంటూయుంటాము. ఎదుటివారు ఏమి చెప్పినా
32

Page 33
వింటుంటాము.
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
కావున చెప్పువారు కూడా ఆటంకము లేకుండా చెప్పుచుందురు. అప్పటి మా మాటల వరుస
ఎలాగున్నదో చూడండి.
నేను :-
వారు :-
నేను :-
స్వర్గము నరకము అంటుంటారు ఇస్లామ్ ధర్మము ప్రకారము ఇవి ఉన్నాయా?
ఉన్నాయి.
ఇప్పుడున్నాయా? ఎప్పుడో ఉంటాయా?
వారు :-
ఇప్పుడు లేవు. భవిష్యత్తులో ఉంటాయి.
నేను :-
వారు :-
నేను :-
వారు :-
నేను :-
వారు :-
నేను :-
భవిష్యత్తులో అంటే మనము చనిపోయిన తర్వాతనా?
మనము చనిపోయిన తర్వాత వెంటనే స్వర్గ, నరకములు రావు. స్వర్గ నరకములు ప్రళయము తర్వాత
ఉంటాయి.
ప్రళయము అంటే ఏమిటి?
ప్రళయము అంటే పుట్టినదంతా లేకుండాపోతుంది. ప్రపంచమంతా లేకుండా పోతుంది.
ప్రపంచమంతా లేకుండా పోయినప్పుడు ప్రపంచములో భాగమైన మనుషులు కూడా లేకుండా
పోతారు కదా!
ప్రళయము తర్వాత స్వర్గము, నరకము మాత్రము మిగిలి ఉంటాయి. ఎందుకంటే స్వర్గము, నరకము
ప్రళయము తర్వాతనే ప్రారంభమవుతాయి.
ఇప్పుడు లేని స్వర్గము, నరకము అప్పుడెందుకు వస్తాయి?
వారు :- మనుషులు బ్రతికియున్నప్పుడు చేసిన తప్పులకు పాపము లెక్కించ బడియుంటుంది. అలాగే మనుషులు
చేసిన మంచి పనులకు పుణ్యము లెక్కించి వ్రాయబడియుంటుంది. చనిపోయిన తర్వాత ప్రళయ కాలమున అంతిమ
దినమున గతములో చనిపోయిన వారందరినీ దేవుడు వారి భూసమాధుల నుండి లేపి, వారు వారి జీవితములో
చేసుకొన్న మంచిచెడుల పాపపుణ్యములను లెక్కించి, దేవుడు వారికి తీర్పు చెప్పి నరకమునకో, స్వర్గమునకో పంపును.
నేను :- మనిషి బ్రతికియున్నప్పుడు చేసిన మంచి పనులకు పుణ్యమునూ, చెడు పనులకు పాపమునూ లెక్కించబడియుండును
అన్నారు కదా! అప్పుడు ఆ పాపపుణ్యములను ఎవరు లెక్కించి వ్రాస్తారు?
వారు :- ఖాప్ అను 50వ సూరాలో 17, 18 వాక్యములలో చెప్పబడినట్లు ఇద్దరు దూతలు ప్రతి మనిషికీ ఒకరు
కుడిప్రక్కన మరొకరు ఎడమ ప్రక్కన యుంటారు. మనిషి నోటిలో మాట వెలువడిన వెంటనే ఆలస్యము లేకుండా
వానివద్దయున్న ఒక పర్యవేక్షకుడు దానిని నమోదు చేసిపెట్టడానికి (వ్రాసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు.
నేను :- సృష్ట్యాదినుండి చనిపోయిన వారందరినీ బ్రతికించి లేపుతాడని చెప్పుచున్నారు కదా! చనిపోయిన వారు
ప్రళయములో అంతిమ దినమున దేవునిచే లేపబడువరకు వారు ఎక్కడున్నట్లు?
33

Page 34
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
వారు :-
వారి వారి సమాధులలోనే ఉంటారు.
నేను :-
వారు :-
నేను :-
వారి వారి సమాధులలో ఊరకనే ఎంతకాలమని ఉంటారు?
ప్రళయము వచ్చేంతవరకు ఉండవలసిందే.
చనిపోయిన వారందరూ సమాధులలో వుంటే, పుట్టేవారందరూ ఎక్కడి నుండి వస్తున్నారు? ఇలా
ప్రపంచము మొదటినుండి పుట్టి చనిపోయిన వారందరినీ ఒక్క దినము, ఒక్కమారు బ్రతికించి శరీరముతో లేపితే
అంతమందికి భూమిమీద జాగా తక్కువవచ్చును కదా!
వారు :-
అటువంటి సమస్య రాకుండా ఉండుటకు ఒకనినిలేపి, వానికి తీర్పు చెప్పి స్వర్గమునకో, నరకమునకో
పోవునట్లు చేసి తర్వాత మరొకనిని లేపును. అట్లు ఉదయమునుండి సాయంకాలము లోపల అందరినీ
దేవుడు స్వర్గ నరకములకు పంపగలడు.
నేను :-
వారు :-
సృష్ట్యాదినుండి పుట్టువారంతా చనిపోయి సమాధులలో ఉంటే క్రొత్తగా పుట్టువారు ఎక్కడినుండి
వస్తున్నారు?
ఎవరు ఎప్పుడు పుట్టాలని నిర్ణయము చేసిన మనుషులను ఒక మైదానములో తయారు చేసియుంచాడు.
అలా తయారు చేసి ఉంచబడిన మనుషులు దేవుడు వారికిచ్చిన కాలము ప్రకారము వచ్చి భూమిమీద పుట్టుచున్నారు.
నేను :-
ప్రస్తుత కాలములో పుట్టినవారే దాదాపు ఏడువందలకోట్ల జనాభా యున్నారు. ప్రళయకాలము వరకు
పుట్టువారిని అందరినీ కలిపి లెక్కించ గలిగితే ఇటువంటి భూమండలములు వేయి అయినా జాగా తక్కువ వచ్చునని
అర్థమగుచున్నది. అంత జాగా ఎక్కడున్నది. అంతమందిని ఎక్కడ ఎలా నిలుపగలిగియుంటాడు?
వారు :- దేవుడు అనుకుంటే ఏమయినా చేయగలడు. దేవుని మీద అనుమానము పెట్టుకోకూడదు.
నేను :- దేవుడు చెప్పినది ఒకే జ్ఞానము. అది భగవద్గీత రూపములో మొదట వచ్చినది. అదే జ్ఞానమును ధృవీకరించుచూ
బైబిలు వచ్చినది. ఆ తర్వాత కొంత కాలమునకు దేవుడు మొదట చెప్పిన జ్ఞానమును సత్యమని దృఢపరచుటకే ఖుర్ఆన్
గ్రంథము వచ్చినది. ఈ మూడు గ్రంథములలో దేవుడు ఈ మాటను చెప్పియుంటే నమ్మేవారము. దేవుడు చెప్పిన
మాటయని అనుమానము పెట్టుకొనేవారము కాకుండా ఉందుము. అయితే మీరు చెప్పినమాట మూల దైవగ్రంథములయిన
మూడు గ్రంథములలో ఎక్కడా లేదు. అటువంటప్పుడు దేవుడు చెప్పని మాటను మనుషులు చెప్పిన మాటగా
లెక్కించవలసియుంటుంది. శాస్త్ర ప్రమాణము లేని మనుషుల మాటను నమ్మకూడదనీ, అలా నమ్మితే అజ్ఞానము
అవుతుందని మీలాంటి పెద్దలే చెప్పారు. దీనికేమంటారు?
వారు :- అన్నీ మూల గ్రంథములలోనే ఉండాలంటే ఎట్లగును? కొన్ని విషయములు ఎక్కడా వ్రాసిపెట్టబడియుండవు.
అయినా తెలిసినవారు చెప్పిన విషయములను నమ్మితేనే సంపూర్ణ జ్ఞానులవుతారు నమ్మనంత కాలము అసంపూర్ణ
జ్ఞానులుగానే యుంటారు.
34

Page 35
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
(ఈ విధముగా ఒక ఆధ్యాత్మిక సంస్థకు పెద్దగాయున్న ముస్లీమ్ పండితులతో మాట్లాడడము జరిగినది. అయితే
వారి మాటలలో ఒక్కమాట కూడా సత్యము లేదు. ముస్లీమ్లకు ప్రమాణ గ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములో కూడా
ఎక్కడా వ్రాయని విషయములను వారే స్వయముగా కల్పించి చెప్పుచున్నారు. పైగా మేము చేయునది తప్పు అనుకోకుండా
వారు చెప్పిన మాటలను నమ్మాలనీ, నమ్మినప్పుడే సంపూర్ణ జ్ఞానులుకాగలరనీ చెప్పుచున్నారు. అట్లు చెప్పి ఎంతోమంది
అజ్ఞానులగుటకు కారణమైనారనీ చెప్పవచ్చును. దేవుడు అందరికీ సమానమైనవాడు, అలాగే దేవుని జ్ఞానమూ అందరికీ
సమానమైనది. ఏ అసూయా భావము లేకుండా మేము మూడు మతములకు సంబంధించినవని అందరూ అనుకొను
భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలోని జ్ఞానమును ఒకే దేవుని జ్ఞానముగా చూస్తున్నాము. ఆ మూడు గ్రంథములలోని
మాటలనే నమ్మగలము. ఎవరూ ఏమి చెప్పినా వాటిని నిర్ముఖమాటముగా ఖండించుచున్నాము. అందువలన పెద్ద
పేరున్న ఆ ఇద్దరి ముస్లీమ్ పండితుల మాటలను మేము జ్ఞానముగా లెక్కించలేదు.)
నేను ఇందూ (హిందూ) సమాజములో పుట్టినవాడిని. అయితే ఇందూ గ్రంథములని చెప్పిన అన్ని గ్రంథములను
నేను నమ్మలేదు. దేవుడు భగవంతుడుగా వచ్చి తెలియజేసిన ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతనూ, భగవద్గీతను
దృఢపరచు బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలోని శాస్త్రీయమైన మాటలనే నేను నమ్ముచున్నాను. వేదములు, ఉపనిషత్తులు
హిందువుల గ్రంథములని పేరుగాంచినా, చతుర్వేదములనూ, అష్టాదశ పురాణములనూ హిందువులు పెద్దగా
చెప్పుకొంటున్నా, నేను మాత్రము మనుషులు చెప్పిన వాటిని నమ్మక భగవంతుడు చెప్పిన భగవద్గీతను మాత్రము
విశ్వసిస్తున్నాను. ఆధ్యాత్మికమునకు శాస్త్రప్రమాణముగా ఒప్పుకొంటున్నాను. ఇంతకుముందు పురాణములలో పదునాలుగు
లోకములున్నాయని వ్రాసినా వాటిని కాదని వెనుక పేజీలలో వ్రాశాము. అంతే కాకుండా అవి మా హిందూ గ్రంథములని
విమర్శించకుండా ఉండలేదు. అజ్ఞానము ఏ మతములోయున్నా ఖండించవలసిందే, జ్ఞానము ఏ మతములోయున్నా
సమర్థించవలసిందే. దేవుడు ఒక్కడే అయినప్పుడు, దేవుని జ్ఞానము సమస్త మానవులకు ఒక్కటే వుంటుంది. జ్ఞానమునకు
మతము అనునది ఉండదు. అందువలన దేవుని జ్ఞానమున్న మూడు మూల గ్రంథములను సమానముగా చూస్తున్నాము.
జ్ఞానములేని ఏ గ్రంథమునయినా, అందులోని ఏ మాటనయినా ఒప్పుకోము. అందువలననే నేడు హిందువులయిన
వారు పురాణములు చూపి నమ్మమని చెప్పితే, నమ్మకుండా పదునాలుగు లోకములను ఖండించాను.
పురాణములలోనున్న ఊర్థ్వ, మర్త్య, అథోలోకములను మూడు లోకములుగా విభజించి చెప్పవచ్చునని చెప్పి,
ఊర్థ్వలోకములు (పైన గల లోకములు) ఏడున్నాయని వాటిని వరుసగా 1) భూలోకము, 2) భువర్లోకము,
3) సువర్లోకము, 4) మహర్లోకము, 5) జనలోకము, 6) తపోలోకము, 7) సత్యలోకము అన్నారు. అవి సత్యము కాదు
అనుటకు అనేక ఆధారములు గలవు. మర్త్యలోకమయిన మధ్యలోకములో అనగా భూలోకములో మనము
నివసించుచుండగా, ఊర్థ్వలోకములలో మొదటిదయిన భూలోకము ఎక్కడి నుండి వచ్చినదని అడుగుచున్నాము. అంతేకాక
ఐదవ సంఖ్యలోయున్న జనలోకము అనునది జనులు నివసించు లోకమేకదా! జనులు నివసించునది జనలోకమయినప్పుడు
ఒకటవ సంఖ్యలోనున్న భూలోకములో ఎవరు నివసిస్తున్నారని అడుగుచున్నాము. అంతేకాక భూలోకమునకు స్వర్గలోకము
పైనగలదనీ, నరకలోకము క్రిందగలదనీ అంటుంటారు. అయితే ఇక్కడ చెప్పిన పదునాలుగు లోకములలో పైన
ఏడులో స్వర్గలోకము పేరు లేదు.
క్రింద ఏడులో నరకలోకము పేరు లేదు. పైన క్రింద గల పదునాలుగు లోకములలో
స్వర్గము, నరకము రెండూ లేనప్పుడు
ఒక్కమాటకు కూడా జవాబు దొరకదు.
ఈ రెండు లోకములు ఎక్కడున్నాయని చెప్పగలరు? ఇట్లు ప్రశ్నించుతూ పోతే
అందువలన పదునాలుగులోకములు అన్నమాటే పూర్తి అశాస్త్రీయము అని
35

Page 36
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చెప్పవచ్చును. అంతేకాకుండా పురాణములలో చెప్పు స్వర్గ నరకములు కూడా పూర్తి శాస్త్రబద్ధత లేనివని చెప్పవచ్చును.
ఈ విధముగా ఇందుత్వములోగానీ, ఇస్లామ్లోగానీ శాస్త్రబద్ధము కాని మాటలను వదలి శాస్త్రీయతగల వాక్యములనే
స్వీకరించమని మేము చెప్పుచున్నాము.
కొందరు హిందువులలో బోధకులుగాయున్నవారు, పురాణముల లోనున్న వారికి అనుకూలమైన విషయములను
చెప్పి, శాస్త్రము ఇట్లు చెప్పు చున్నది అంటుంటారు. వారు ఏమిచెప్పినా శాస్త్రమిట్లు చెప్పుచున్నదని శాస్త్రమును
ఊతపదములాగా వాడుకొనుచుందురు. సాధారణ ప్రజలకు శాస్త్రమంటే ఏమిటో కూడా తెలియదు. అటువంటప్పుడు
ఏదో శాస్త్రములో ఉందట అని వారు చెప్పు ప్రతిమాటనూ నమ్ముచుందురు. ఉదయము లేచింది మొదలు తమబుద్ధిని
బ్రతుకుతెరువు కార్యములలో ఉపయో గించుచూ సాధారణ జీవితము గడుపువారికి గ్రంథముల యొక్క తారతమ్యము
తెలియదు. ఏ గ్రంథము శాస్త్రమో, ఏ గ్రంథము పురాణమో, ఏ గ్రంథము వేదమునకు సంబంధించినదో తెలియదు.
ప్రతి పుస్తకమునూ శాస్త్రమేనని అనుకోవడము జరుగుచున్నది. గ్రంథములు మూడు రకములని ప్రతి మనిషీ
జ్ఞప్తికుంచుకోవలెను. వివరించి చెప్పితే శాస్త్రములు ఆరు, వేదములు నాలుగు, పురాణములు పద్దెనిమిది గలవు.
వాటినే షట్శాస్త్రము లనీ, చతుర్వేదములనీ, అష్టాదశ పురాణములనీ చెప్పడము జరుగుచున్నది. ఇంతకుముందు
మూడు మతములలోనూ, మూడు మూల గ్రంథములున్నవని చెప్పుకొన్నాము కదా! ఆ మూడు భగవద్గీత, బైబిలు,
ఖుర్ఆన్ గ్రంథములు శాస్త్రములకు సంబంధించినవని తెలియవలెను. అదియూ ఆరు శాస్త్రము లలో చివరిది లేక
మొదటిదయిన బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవి మూడు గ్రంథములని తెలియవలెను. శాస్త్రములు సత్యమైనవి
కావున వాటిని తప్పక విశ్వసించవలెను. స్వర్గలోకము, నరకలోకము ఎక్కడో ఉన్నాయని వర్ణించి చెప్పిన విషయములు
“సావిత్రి పురాణము”, “గరుడ పురాణము” నకు సంబంధించినవని తెలియవలెను. అట్లే మంత్రములతో కూడుకొన్న
లియవలెన
గ్రంథములు వేదములకు సంబంధించినవని తెలియవలెను.
స్వర్గ నరకముల కథలు పురాణములలో ఉండుట వలన వాటిని నమ్మవలసిన పనిలేదు అని చెప్పుకొంటున్నాము.
అయితే స్వర్గలోకము అనుమాట శాస్త్రమయిన భగవద్గీతలో రాజవిద్యారాజగుహ్య యోగమున 21వ శ్లోకమున “తేతం
భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యేమర్త్యలోకం విశన్తి" అని ఉన్నది కదా! ఈ మాట బ్రహ్మవిద్యా శాస్త్రమునయుండుట
వలన తప్పక నమ్మవలసియున్నది కదా! శాస్త్రములో చెప్పినవన్నీ సత్యము లయితే స్వర్గలోకము, నరకలోకము నిజముగా
ఉండవలెను కదా!యని ఎవరయినా అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! స్వర్గము నరకము అనునవి
ఉండడము వాస్తవమే అయితే, వాటిని మనము శాస్త్రము ప్రకారము అర్థము చేసుకోలేదు. పురాణముల ప్రకారమే
అర్థము చేసుకొన్నాము. కావున వాటి యొక్క నిజతత్త్వము మనుషులకు తెలియకుండా పోయినది. ఇంతకుముందు
వ్రాసిన పేజీలో లోకముల ప్రసక్తి వచ్చినప్పుడు లోకము అను పదము "ఏకము” అను పదమునుండి పుట్టినదని
చెప్పాము. అదే సూత్రముతో ఒక కోవకు చెందిన వారందరినీ ఏకము చేసి (కలిపి) ఒక లోకము వారని అనడము
జరుగుచున్నదని కూడా చెప్పాము.
ఇంతవరకు స్వర్గనరకములను గురించి పురాణములు ఏమి చెప్పినా, వాటిని లెక్కచేయక శాస్త్రపద్ధతిలో
“లోకము” అను పదమునకు అర్థమును తెలుసుకోగలిగాము. నేను ముందే చెప్పాను, శ్రద్ధవుంటే తెలియని విషయమంటూ
లేదని ఇప్పుడు కూడా చెప్పుచున్నాను. నాకు శ్రద్ధయుంది కావున నాకు అంతరంగమున తెలిసిన విషయములనే
36

Page 37
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పొందుపరచి చెప్పడము జరుగుచున్నది. లోకము అను పదమునకు వివరము బయటి వారు చెప్పితే ఎట్లున్నదో, లోపలి
వారు చెప్పితే ఎట్లున్నదో తెలిసింది కదా! బయటివారు ఎంత చెప్పినా అందులో తృప్తిగానీ, ఆనందముగానీ లేకుండా
సందిగ్ధములో పడిపోవడము తప్ప ఏమీ లేదు. “ఏకము నుండి లోకము” పుట్టుచున్నదని ఒక రహస్యమును
తెలియగలిగాము. అదే విధానముతో గ్రహించగలిగితే “స్వర్గము” అను పదమునకు అర్థము, అలాగే నరకము అను
పదమునకు అర్థము ఏమని తెలియగలదో ఇప్పుడు చూస్తాము. భగవద్గీతలో చెప్పిన త్రైత సిద్ధాంతమును ఖుర్ఆన్
గ్రంథములో కూడా చెప్పారు. త్రైత సిద్ధాంతమును బైబిలులో కూడా చెప్పారు. భగవద్గీతను, బైబిలును అటుంచి
ఖుర్ఆన్లోని వాక్యమును గమనించితే అక్కడ ముగ్గురిని గురించి చెప్పారు. "త్రోలబడేవాడు, త్రోలేవాడు, చూచేవాడు”
అను ముగ్గురిలో ప్రతి మనిషీ త్రోలబడేవాడుగాయున్నాడు. ప్రతి మనిషినీ త్రోలేవాడుగా లోపలగలవాడు ఒకడున్నాడు.
ఇకపోతే త్రోలబడేవానినీ, త్రోలేవానినీ ఇద్దరినీ చూచేవాని (సాక్షి)గా దేవుడున్నాడు. దేవుడు ఏమీ చేయడుగానీ త్రోలేవాడు
మనిషిని జ్ఞానులలోనికో, అజ్ఞానులలోనికో త్రోలును కాబట్టి కొందరికి అజ్ఞానమూ, కొందరికీ జ్ఞానమూ బోధించుచున్నాడు.
లోపలయున్న సారథి (త్రోలేవాడు) ఎలా చెప్పాడు అని ఎవరికీ తెలియకుండానే ఎవరికయినా, ఏమయినా చెప్పగలడు.
ఇటు అజ్ఞానమునూ బోధించగలడు, అటు జ్ఞానమునూ బోధించగలడు. వినేవానికి ఎలా చెప్పాడో కూడా తెలియకుండా
చెప్పు నైపుణ్యము చెప్పేవానికి కలదు. లోపలయున్నవాడు కనిపించడు, తెలియడు కాబట్టి, వాడే తెలియకుండా చెప్పుచున్నాడు
కాబట్టి, ఒక విషయము తెలిసినవాడు కూడా తాను ఫలానావాడు చెప్పితే తెలియగలిగానని చెప్పలేదు. తనకు తానే
తెలుసుకొన్నట్లు భావించుకొనుచుండును.
ఎవరు ఏమనుకొనినా! నేను మాత్రము నాకు తెలిసిన విషయము నాలోనే నాకు తోడుగాయున్నవాడు, తెలిపితేనే
తెలిసిందని చెప్పుచున్నాను. స్వర్గమును గురించి నాకు తెలిసినది ఇలా ఉన్నది. నీటిని తీసుకొని వేడి చేసిన, వేడిని
పొందిన నీరు పైకి చల్లనీరు క్రిందికి పోవుచుండును. అలాగే గాలిని వేడిచేస్తే వేడిగాలి పైకీ, చల్లనిగాలి క్రిందికీ
చేరగలదు. గాలి ఒక్కటే అయినా వేడిగాలి పైన, చల్లనిగాలి క్రింద యున్నట్లు, అదే విధముగా నీరు ఒక్కటే అయినా
వేడినీరు పైన, చల్లని నీరు క్రిందయున్నట్లు, కర్మ ఒకటే అయినా పాపము పుణ్యము అను రెండు భాగములుగా కలవు.
నీరు ఒకటే అయినా వేడినీరు, చల్లనినీరు అని పేర్లు పెట్లబడినట్లు, కర్మయను నది ఒకటే అయినా అందులో పాపకర్మ,
పుణ్యకర్మయని రెండు పేర్లతో యున్నది. వేడినీరు పైన చల్లని నీరు క్రింద చేరినట్లు, వేడిగాలి పైకి చల్లనిగాలి క్రిందికి
చేరినట్లు కర్మ నిలయమైన కర్మచక్రములో పుణ్యకర్మ పైన పాపకర్మ క్రింద చేరుతున్నది. కర్మచక్రములో పన్నెండు
భాగములందు బేసి సంఖ్యలయిన 3, 7, 11 స్థానములలో పాపము చేరుచుండును. అలాగే బేసి సంఖ్యలయిన 1, 5,
9 స్థానములలో పుణ్యము చేరుచుండును. మిగతా సరిసంఖ్యలయిన 2, 4, 6, 8, 10, 12 స్థానములందు పుణ్యము,
పాపము రెండూ చేరుచుండును. అలా చేరిన పుణ్యకర్మ, స్థానములో పై భాగమున చేరుచున్నది. అలాగే పాపకర్మ,
స్థానములో క్రింద చేరుచున్నది. కర్మచక్రములో పాపపుణ్యములు క్రింద పైన ఎలా చేరుచున్నవో క్రిందగల చిత్రపటములో
నమూనా చూడవచ్చును.
కర్మచక్రము మన తలయందే వున్నదనీ, ఎవడు చేసుకొన్న కర్మ వాని తలయందుగల కర్మచక్రములో వాని
పొరుగువానిచేత వ్రాయబడు చున్నదనీ, ముందే కొన్ని గ్రంథములందు మరియు “కర్మపత్రము” అను గ్రంథములోనూ
చెప్పుకొన్నాము. అలా కర్మచక్రములో చేరు కర్మలో పుణ్య కర్మచక్రములో పై భాగమున పాపముకంటే పైన నిలువవుండగా,
37

Page 38
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పాపము క్రింది భాగమున చేరుచున్నదని చిత్రపటము ద్వారా కూడా ఇప్పుడు తెలుసు కొన్నాము. ఎవడు చేసుకొన్న
పాపపుణ్యములను వాడే అనుభవించడము జరుగుచున్నది. కర్మచక్రములో అగ్రస్థానములోయున్న పుణ్యమును అనేక
సుఖాల రూపములో మనిషి అనుభవించడము జరుగుచున్నది. వాడు చేసుకొన్న పుణ్యమును వాడే స్వయాన
అనుభవించుచున్నాడు. కాబట్టి అటువంటి పుణ్య సుఖములను అనుభవించడమునకు ప్రత్యేకమైన పేరు పెట్టారు.
అగ్రమున నున్న పుణ్యమును స్వయముగా అనుభవించడమును గుర్తు చేయుచూ “స్వ+అగ్రము” అను రెండు
శబ్ధములను కలిపి “స్వగ్రము” అని అనడము జరిగినది. “స్వగ్రము” అను పదము తక్కువ కాలములోనే “స్వర్గము”
అను పదముగా పలుకబడి అదే వాడుక పదముగా నిలిచి పోయినది. స్వగ్రము అను పదములో రెండు ద్వంద్వాక్షరములు
కలవు. స+వ= స్వ అనునది ఒకటికాగా, గ+ర=గ్ర అనునది రెండవది. అయితే రెండవ అక్షరములో “గ” నూ మరియు
“ర” నూ ఉండడము జరిగినది. “ర” అను శబ్ధము నాశనమునకు బీజాక్షరముగా ఉండుట వలన “గ్ర” అను శబ్ధములో
“ర” అనునది చివర పలుకడము కొందరికి (భాషా పండితులకు) ఇష్టము లేదు. చివరిలో నాశన శబ్దము ఉండకూడదని
తలచిన పండితులు “ర” అను శబ్ధము ముందు పెట్టి “గ” అను శబ్ధమును వెనుక ఉంచడము జరిగినది. గ+ర=గ్ర
అనుట పోయి ర+గ=ర్గ అను శబ్ధముగా మారి పోయినది. “స్వకు “ర్గ” శబ్ధమును చేర్చి “స్వర్గ” అనియు పూర్తి
పదముగా “ము” చేర్చి “స్వర్గము” అని చెప్పడము జరిగినది. ఈ విధముగా “స్వగ్రము” అను పదము చివరకు భాషా
పండితుల జోక్యముతో “గ్ర" అను అక్షరమును “ర్గ" అను అక్షరముగా మార్చడము జరిగినది.
పుణ్యఫలితము సుఖములు, పాపఫలితము కష్టములు అయినప్పుడు మనిషి సుఖములలో అభివృద్ధి చెందడమూ,
కష్టములలో క్షీణించి పోవడమూ జరుగుచుండును. ఒక మనిషికి సుఖములు కల్గినప్పుడు ఉల్లాసముగా ఉండడమూ,
సుఖముల వలన కల్గు సంతోషమునకు శరీరము లావు కావడము లేక కాంతిగా ఉండడము జరుగుట మనకు తెలిసిన
విషయమే. పుణ్యము వలన అభివృద్ధి జరుగుచున్నదిగానీ ఏదీ క్షీణించడము గానీ, నాశనముగానీ జరుగడములేదు.
స్వగ్రము అను పదములో చివరిలో “ర” శబ్దము ఉండడము వలన “ర” అనునది నాశనముకు గుర్తుగాయున్న
శబ్ధమయిన దానివలన ఆ అక్షరమును చివరిలో ఉంచడము కొందరికి సరిపోలేదు. అగ్రములోయున్న పుణ్యమును
స్వయముగా అనుభవించుట అను అర్థముకంటే స్వయముగా నాశనము చెందుట అను అర్థము ఎక్కువగా
కనిపించుచున్నదనీ, అటువంటి అర్థము లేకుండా పోవుటకు ఉన్న పదములోనే “గ”ను వెనుకకు “ర”ను ముందుకు
పెట్టితే చివరిలో నాశనమును సూచించు “ర” లేకుండా పోయినట్లు ఉండడమేకాక అక్షరములు రెండు ముందుది
వెనకకు, వెనుకది ముందుకు ఉంటుందని, దానితో అక్షరములను పూర్తి తొలగించకుండా ఉంచినట్లుంటుందని తలచి
ఆ విధముగా స్వగ్రమును స్వర్గము అను పదముగా మార్చిపెట్టారు. స్వర్గము అను పదమునకు అర్థము మారనట్లు
వాని పుణ్యమును వాడు స్వయముగా అనుభవించడము అనియే చెప్పారు. ఇట్లు పూర్వము నుండి స్వర్గము అను
పదము సుఖముల అనుభవము అను అర్థమునిచ్చునదై ఉన్నది. అయితే స్వర్గలోకము అనడములో కొందరు పురాణములను
ఆశ్రయించి అక్కడ తెల్పిన కథల ద్వారా స్వర్గలోకము ప్రత్యేకమైన ఇంద్రుని రాజ్యముగా లెక్కించుకొన్నారు. ఇంద్రుడు
దేవతలరాజని, ఇంద్రలోకము ఆకాశము పైన కలదని, ఆ ఇంద్రలోకమే స్వర్గలోకముగా చెప్పబడుచున్నదని అందరూ
అనుకోవడము జరిగినది. పురాణములు పుక్కిడినుంచి పుట్టినవనీ, అసత్యములతో కూడుకొన్న కథలనీ తెలియనివారు
పురాణముల మాటే సత్యమని నమ్మారు. అంతేకాక పెద్ద పెద్ద స్వామీజీలు సహితము పురాణములు గురించి తమ
ఉపన్యాసములలో చెప్పడము వలన స్వామీజీల మాటలనే ఎక్కువగా నమ్మవలసి వచ్చి ఇంద్రుడు ఇంద్రలోకము
ప్రత్యేకముగా యున్నదనీ, చనిపోయినవారు పుణ్యములను అనుభవించుటకు ఇంద్ర లోకమయిన స్వర్గలోకమునకు
38

Page 39
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పోయి అచట అనేక సుఖములను అనుభవించి, పుణ్యము అయిపోయిన వెంటనే నరకలోకమునకు పోయి అక్కడ
బాధలు, చిత్రహింసలు అనుభవించి పాపము కూడా అయిపోయిన వెంటనే మర్త్యలోకమయిన మనుషులలోకమున లేక
భూలోకమున వచ్చి పుట్టుచున్నారని చెప్పుకోవడము జరుగుచున్నది. ఒకమారు ఏది బుర్రకు ఎక్కితే అదే నిజమని
నమ్మువారు కలరు.
అటువంటి వారికి ఏమాత్రమూ విచక్షణ ఉండదు. వారికి సత్యమును చెప్పినా వినే స్థితిలో
ఉండరు. వారికి తెలిసినదే సత్యమని వాదించుచుందురు. అటువంటి వారిని వారి కర్మకు వదలివేయడము తప్ప
మనము ఏమీ చేయలేము.
స్వర్గము అను పదము ఎట్లు తయారయినదో, దాని అర్థము ఏమిటో తెలుసుకోగలిగాము. పుణ్యకర్మను
స్వయముగా అనుభవించుటను స్వర్గము అంటున్నాము కదా! పుణ్యమునకు వ్యతిరేఖమయిన పాపమును కూడా ఎవడు
చేసుకొన్నదానిని వాడు అనుభవించవలసిందే కదా! అప్పుడు దానికి కూడా అర్థమయిన పేరు ఉందా అని కొందరు
అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! స్వర్గము అను పదమునకు వ్యతిరేఖమయిన పదము నరకమే
అని చెప్పగలము. ఎక్కడ స్వర్గము అంటున్నామో దానిప్రక్కనే నరకము అని అంటున్నాము. స్వర్గ నరకములని రెండు
పదములను కలిపి చెప్పడము కూడా జరుగుచున్నది. పాపపుణ్యములలో మొదటిది లేక పైనగలది పుణ్యము. దానిని
స్వయాన చేసుకొన్నవాడే అనుభవిస్తున్నాడని చెప్పినప్పుడు పుణ్యముకంటే క్రిందవున్న పాపమును కూడా చేసుకొన్నవాడే
అనుభవించవలసియుండును. అందువలన పుణ్యము వద్ద వాడిన “స్వ" అను అక్షరమును నరకమువద్ద వాడవలసిన
పని లేకుండా పోయినది. ఎవని పుణ్యమును వాడు అనుభవించినట్లు, ఎవని పాపమును కూడా వాడే అనుభవించునను
విషయము అందరికీ తెలిసినదే కావున నరకము ముందర “స్వ” అను అక్షరమును చెప్పడము లేదు.
అయినా
స్వర్గమును ఒక అర్థముతో కూడిన పదముగా ఏర్పరచిన పండితులే పాపకార్యములను అనుభవించడములో
కూడా ప్రత్యేక అర్థమును ఏర్పరచి చెప్పిన పదమే నరకము. నరకము అను పదము మనకు బాగా అలవాటైన పదమే
అందులోని అర్థము మనకు తెలియనిదేనని చెప్పవచ్చును. నరకము అను పదము కూడా రెండు
భాగములుగాయున్నదని చెప్పవచ్చును. నరకము అను శబ్దమును విడదీసి చూస్తే అందులో మొదటి అక్షరము అయిన
“న” ప్రత్యేకమయినదని రెండవ భాగము 'రకము' అని తెలియు చున్నది. "న" అను అక్షరమునకు ప్రత్యేకమయిన
అర్థము కలదు. “న” అంటే 'కాదు' లేక 'లేదు' అని రెండు రకముల అర్థమును చెప్పుకోవచ్చును. భూత, భవిష్యత్లు
అను పదములకు అర్థమును చూస్తే భూత అనగా సందర్భమునుబట్టి జరిగిపోయిన కాలమని అర్థము. అలాగే
భవిష్యత్ అనగా జరుగబోవు కాలమని అర్థము గలదు. జరిగిపోయిన కాలములోగానీ జరుగబోవు కాలములోగానీ లేదు
అనడానికి “న భూతో, న భవిష్యత్" అని చెప్పుచున్నారు. ఇక్కడ లేదు అనుటకు “న” అను అక్షరమును ఉపయోగించారు.
అలాగే “రకము” అను పదము ముందర “న” అను అక్షరమును ఉపయోగించడము వలన ఒక రకము కాదు అని
అర్థము వచ్చుచున్నది. రకము అంటే ఒక విధానము అని అర్థము. పాపమును అనుభవించువాడు ఒక రకము
కాకుండా అనేక రకములుగా బాధలు, హింసలు అనుభవించవలసియుండును. అందువలన వీడు (పాపాత్ముడు)
అనుభవించే కష్టాలు, హింసలు ఒకరకమైనవి కాదు, అనేక రకములుగా అనుభవములుండును అని తెలుపుచూ
న + రకము = నరకము అని అన్నారు.
39

Page 40
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పాపమును కష్టాలరూపములో, హింసలరూపములో అనుభవించు వాడు తనమాటలతో ఇతరులకు చెప్పునప్పుడు
“నేను ఒకరకమైన కష్టాలను అనుభవించలేదు. చెప్పుకుంటే తీరనన్ని బాధలను అనుభవించాను” అని అంటున్నాడు.
ఈ మాటనుబట్టి వాడు అనుభవించినది నరకము అని చెప్పవచ్చును. నరక బాధలు అని అంటే ఒకరకమైన బాధలు
కాదు అని అర్థమగుచున్నది. నరకము అను పదమును పలుకునప్పుడు ఒకరకము కాదు అని అర్థము తెలిసి
పలుకకున్ననూ, పలికిన మాటను గురించి, దాని అర్థమును గురించి తెలుసుకొంటే ఒకరకము కాదు అనియే
తెలియుచున్నది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి ఒక ప్రశ్నను వేసుకొందాము. మనము అనేకరక బాధలను
భూమండలములోనే అనుభవిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకొని చూస్తే, పుట్టినప్పటినుండి ప్రతి మనిషీ రకరకముల
బాధలను అనుభవించుచున్నాడనియే చెప్పవచ్చును. నేను ఒకేరకమైన బాధను అనుభవిస్తున్నాను అని చెప్పువాడు
భూమిమీద ఎవడూ ఉండడు. ఉదయము కడుపునొప్పితో బాధపడినవాడు కొద్దిసేపటికే వాంతులతో బాధపడును,
తర్వాత కొద్దిసేపటికే తలనొప్పి వచ్చిందనుకో దానితో కూడా బాధపడును. ఉదయమునుండి మధ్యాహ్నము వరకు
కడుపునొప్పి, వాంతులు, తలనొప్పితో బాధపడినవాడు సాయంకాలమునకు జ్వరము వొళ్ళునొప్పులతో బాధపడినాడు.
అప్పుడు వాడు ఒక దినమే ఐదు లేక ఆరు బాధలతో బాధపడుట వలన దానినే పాప అనుభవము ఒకరకము కాదని
తెలుపుటకు “నరకము” అని చెప్పడము జరిగినది.
ఆ
ఈ విధముగా ప్రపంచములో పాపఫలితమును ప్రతి మనిషీ అనేక రకములుగా అనుభవించడమువలన
పాప అనుభవమును నరకము అని అన్నారు. ఈ అర్ధము ప్రకారము నరకము ప్రతి మనిషి అనుభవములో యున్నదని
తెలియుచున్నది. అలాగే స్వర్గము అనునది కూడా మనిషి యొక్క అనుభవములోనే యున్నది. మనిషి భూమిమీద
ఎక్కడుంటే అక్కడ స్వయాన కష్టసుఖములను అనుభవించుచున్నాడు కావున పుణ్య అనుభవము లయిన సుఖములను
అనుభవించడమును స్వర్గము అని అనవచ్చును. అట్లే పాప అనుభవములయిన బాధలను, కష్టములను, హింసలను
అనుభవించడమును నరకము అని అనవచ్చును. మనిషి స్వయాన అనుభవించు అనుభవములను స్వర్గనరకములంటే
సరిపోతుందిగానీ, స్వర్గ నరకములు ప్రత్యేకమయిన లోకములు అంటే సరిపోదు. అది అర్థములేని మాటయగును.
అర్థములేనిదే కాదు అజ్ఞానపు మాటకూడా యగును. సత్యమును తెలుసుకొని చూడగలిగితే ప్రపంచములో ఎక్కడున్నవారు
అక్కడే కష్టములనూ మరియు సుఖములనూ అనుభవించుచున్నారు. అంటే ఎక్కడి వారు అక్కడే స్వర్గమునూ, నరకమునూ
అనుభవించుచున్నారని తెలియు చున్నది. జ్ఞానముతో సత్యమును చూడగల్గితే స్వర్గనరకములనునవి ప్రత్యేక లోకములు
కాదనీ, ప్రపంచమంతాయున్న జీవరాశులన్నీ నిత్యము స్వర్గ నరకములను అనుభవించుచున్నవనీ తెలియుచున్నది.
స్వర్గనరకములు రెండూ ప్రత్యక్షముగా యున్నవనీ పరోక్షముగా లేవనీ అర్థమగుచున్నది.
ఒక మనిషి ఉదయము లేచింది మొదలు అతనికి స్వర్గముతోనో, నరకముతోనో ప్రారంభమగుచున్నది.
మనిషి నిద్రలోనికి పోవువరకు వాడు బయట సంఘటనల ద్వారాగానీ, శరీరములోపల రోగముల వలనగానీ బాధపడడము
నరకము అనుభవించినట్లే యగుచున్నది. అదే మనిషి లేచింది మొదలు నిద్రపోవువరకు బయట మనుషులద్వారాగానీ,
సంఘటనల ద్వారాగానీ, లోపల కలుగు ఊహల వలనగానీ, సుఖములను అనుభవించ డము స్వర్గమును అనుభవించినట్లే
యగుచున్నది. ఈ విధముగా స్వర్గ నరకములు ఎల్లప్పుడూ ఎక్కడుంటే అక్కడ అమలు జరుగుచున్నవి. అయితే మనిషి
అనుభవించు బాధలలో యమబాధలు కొన్ని, యమకింకరుల బాధలు కొన్ని గలవు. అట్లే మనిషి అనుభవించు సుఖములలో
ఇంద్ర సుఖములు కొన్ని, అప్సరసలు అందించు సుఖములు కొన్ని గలవు. మనిషి అనుభవించు కష్టములలో ఏవి
40

Page 41
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
యమబాధలో, ఏవి యమకింకరుల బాధలో తెలియగలిగితే సుఖములలో కూడా ఇంద్రసుఖములనూ, అప్సరసల
సుఖములనూ తెలియ వచ్చును.
నరకమును అనుభవించడములో స్వయముగా యమధర్మరాజే కలుగుజేయు బాధలను యమబాధలు అనవచ్చును.
ఇక్కడ యముడు అంటే ఎక్కడో ఏదో రాజ్యమునకు రాజు అని అనుకోకూడదు. అట్లు అనుకుంటే మనము కూడా
పురాణములలోనికి పోయినట్లగును. ఇక్కడ శరీరములో మనిషి బాధలు అనుభవిస్తున్నాడు కదా! బాగా అర్థము
చేసుకుంటే శరీరము ఒక ఎల్లలు గల రాజ్యములాంటిది. శరీరమను రాజ్యమునకు ఒక అధిపతి గలడు. అతనినే
శరీరమునకు రాజు అని కూడా అనవచ్చును. శరీరమునకు రాజు లేక అధిపతి ఎవరు అని ఆలోచిస్తే, నీ శరీరములో
నీవు మాత్రము రాజువు కావు. ప్రతి శరీరమునకూ ఒక అధిపతి గలడు. అతనిని ప్రస్తుతానికి (మిస్టర్ ఎక్స్)
అనుకుందాము. శరీరములో ఎవడు అధిపతి అయినది తెలియనప్పుడు అతనిని మిస్టర్ ఎక్స్ గానే లెక్కించవలెను.
ఇప్పుడు మనము మిస్టర్ ఎక్స్ చెప్పుకొను వాడే శరీరమునకు అధిపతిగా లేక రాజుగాయున్నాడు కావున, ఆయన
కొన్ని సమయములలో మనము చేసుకొన్న తప్పునుబట్టి కఠినముగా వ్యవహరించి శిక్షించును. మరికొన్ని సమయములలో
మనిషి చేసుకొన్న మంచినిబట్టి మనిషి మీద దయగలిగి మనిషికి అనుకూలముగా ప్రవర్తించి సంతోషింపజేయును.
ఈ విధముగా మనిషిని వాని శరీరములోనే శిక్షించి బాధించునపుడు అతని అధిపతిని యముడు అంటున్నాము.
అధిపతి పెట్టు బాధలను యమబాధలు అంటున్నాము. శరీరములో ఏదో ఒక రోగము వచ్చి మనిషి ఆ రోగము ద్వారా
బాధపడుచున్నాడంటే, అది నిజముగా యమబాధేనని చెప్పవచ్చును. ఈ కాలపు డాక్టర్లు ఈ మాట వింటే నవ్వుకొని
వీరు ఎంత తెలివితక్కువవారని అనుకోవడము ఖాయముగా జరుగును. రోగము వచ్చి బాధపడుచుంటే ఎవడో
యముడు బాధపెట్టుచున్నాడని అనుకోవడము మూర్ఖత్వము కాదాయని అనుకోవడము జరుగుచున్నది. ఇంకా కొందరు
విజ్ఞానులు సైన్సు ఎంతగానో అభివృద్ధి అయిన ఈ కాలములో వీరు ఇంకా రాతియుగములోని వారు మాట్లాడినట్లు
మాట్లాడుచున్నారని హేళనగా చూడవచ్చును.
ఒక విధముగా వారిమాట వారికి గొప్పగాయున్నా వారిది విజ్ఞానమే అయినా, శరీరమునకు అధిపతియున్నాడని
చెప్పిన వారి మాటలలో వారికి తెలియని విజ్ఞానముకలదని వారికి తెలియదు. నేటి విజ్ఞానులకు సైన్సు మాత్రము
తెలుసు, అయితే శరీరములో మిస్టర్ ఎక్స్ను గుర్తించిన వారికి “సూపర్సైన్సు” తెలియునని వారికి తెలియదు.
శరీరములోని రోగము క్రిములవలన వచ్చినదని చెప్పుచున్నవారు సామాన్యశాస్త్రమును మాత్రమే చదువగలిగారు.
అయితే శరీర అధిపతిని గుర్తించినవారు అసమాన్య శాస్త్రమును సహితము చదివియుందురని సామాన్యశాస్త్రము
(సైన్సు) చదివిన వారికి తెలియదు. డాక్టర్లకు శరీరములో రోగము ఎట్లు ప్రవేశించినదో తెలుసు, అలాగే ఆ రోగము
యొక్క నివారణకు ఏ మందులు వాడాలో కూడా వారికి తెలుసు. అయితే శరీరములోని అధిపతికి తెలియకుండా
రోగము శరీరములోనికి రాలేదని వారికి తెలియదు. అధిపతియైన మిస్టర్ ఎక్స్ అనుమతితోనే శరీరములోనికి రోగము
ప్రవేశించినదనీ, తర్వాత శరీరాధిపతి ఆజ్ఞలేనిది అది బయటికి పోదనీ కూడా వారికి తెలియదు.
శరీరములో ఏమి జరిగినా అది శరీర అధిపతియైన వానికి తెలియకుండా జరుగదు. శరీరము మిస్టర్ ఎక్స్
ఆధీనములో ఉండగా జీవుడు అనువాడు శరీరములో ఒక పరిమితియైన స్థలములో నివసించు చున్నాడు. శరీరములోని
జీవుడు శరీరమునకు ఒక అధిపతి యున్నాడని తెలియక అజ్ఞానముతో శరీరములో తాను తప్ప మరెవ్వరూ లేరను
కొనుచుండును. నేడు ప్రపంచములో ఉండు మనుషులు మొత్తము అలాగే అనుకొనుచుందురు. కొందరు
41

Page 42
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
జ్ఞానులుగాయున్నవారు, స్వామీజీలు మొదలగువారు శరీరములో జీవుడుకాక దేవుడు కూడా యున్నాడని చెప్పు చుందురు.
ఆ మాట వాస్తవమే అయినా, దేవుడు దేహములందే కాకుండా దేహముల బయట కూడా ఉన్నాడు. అందువలన
ఆయన సర్వమునకు అధిపతియైనవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ శరీరము బయట కాకుండా, శరీరములోపల
శరీరమునకు మాత్రమే అధిపతిగాయున్నవారు ఎవరు అని ప్రశ్నించితే జీవుడూకాడు, దేవుడూకాడు అని చెప్పవచ్చును.
జీవునికంటే పెద్దవాడు, దేవునికంటే చిన్నవాడు అయినవాడు
దేవునికంటే చిన్నవాడు అయినవాడు శరీరమునకు అధిపతిగా యున్నాడని చెప్పవచ్చును.
జీవునికీ దేవునికీ మధ్యలోయున్న మిస్టర్ ఎక్స్ మేము పెద్ద జ్ఞానులము అనుకొన్న వారికి కూడా తెలియడు. అందువలన
తెలియని వానిని మేము కూడా మిస్టర్ ఎక్స్ అని పేరుపెట్టి చెప్పుచున్నాము. మిస్టర్ ఎక్స్ అని చెప్పబడినవాడే
సందర్భానుసారము రెండు పేర్లతో తెలియబడును. రెండు పేర్లతో సందర్భానుసారము చెప్పవలసియుంటుంది, కావున
రెండు పేర్లలో ఏ పేరునూ పెట్టి చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తిగా మిస్టర్ ఎక్స్ అని శరీరాధిపతిని చెప్పచున్నాము.
సందర్భానుసారము ఇంతకుముందే శరీరాధిపతికి యముడు అని పేరు పెట్టారు. శరీరములోని జీవున్ని హింసించు
శక్తి, అధికారము “యముడు" అని పేరుపెట్టబడిన అధిపతికి మాత్రమే కలదు. శరీరము లోపల జీవుడు ఎన్ని
బాధలను అనుభవించినా, అవన్నిటినీ శరీరమునకు అధిపతిగాయున్న వాడే కలుగజేయును. అటువంటి బాధలనే
యమబాధలనీ, యముడు స్వయముగా విధించు బాధలనీ చెప్పవచ్చును. శరీరము బయటినుండి కాకుండా శరీరములోపలనే
జరుగు సంఘటనకు, విధించబడు బాధలకు కారకుడు లోపలనున్న యమధర్మరాజేనని తెలియవలెను. ఇప్పుడు
చెప్పండి యముడు ప్రత్యేకమైన రాజ్యములో యున్నాడా? ప్రత్యేకమైన లోకము, రాజ్యము బాహ్యముగా ఏదీ లేదుగానీ,
శరీరమే యముని రాజ్యము అనుకుంటే అన్నీ సరిపోతాయి, అన్ని ప్రశ్నలకూ జవాబులు దొరుకుతాయి. నరక బాధలను
అనుభవించడము రెండు రకములుగా విభజించి చెప్పుకొంటూ, శరీర అధిపతియైనవాడు స్వయముగా బాధపెట్టడము
ఒకరకము కాగా, అధిపతి క్రింద అధిపతి ఆజ్ఞతో పని చేయు సేవకులను లేక కింకరులను యమకింకరులు బాధపెట్టడము
మరొక రకమగును. ఎప్పుడయితే శరీరములో కాకుండా శరీరము బయటనుండి బాధలు వస్తున్నాయో, అప్పుడు
వాటిని యమభటులు పెట్టు బాధలుగా తలచవలెను. “నానా రూపేణ కాలకింకరః” అను వాక్యము ప్రకారము అనేక
విధములుగా బయటినుండి వచ్చు బాధలన్నిటినీ యమకింకర బాధలు అని అనవలెను. బయటినుండి వచ్చు బాధలను
యమబాధలని అనకూడదు. అట్లే లోపల కల్గుబాధలను యమకింకరబాధలు అని అనకూడదు.
నరకము అనునది యమబాధలుగా, యమకింకరబాధలుగా రెండు విధముల చెప్పబడినదని తెలియవలెను.
ఈ విధముగా
ఉదాహరణకు మనుషులు అనుభవించిన బాధలను తీసుకొని చూస్తాము. సమీప అడవికి పోయి కట్టెలను
తెచ్చి వాటిని అమ్ముకొని జీవనము చేయువారు అడవి సమీప ప్రాంతములలో చాలామందియున్నారు. నంద్యాల నుండి
గిద్దలూరు పోవు మార్గములో నల్లమల అడవికి సమీపమున గాజులపల్లి అను చిన్న పల్లె కలదు. ఆ పల్లెలోని వారు
చాలామంది సమీప అడవిలోనికి పోయి కట్టెలను తెచ్చి జీవనము సాగించుకొను చుందురు. అటువంటి ఊరినుండి
కొందరు గుంపుగా అడవిలోనికి పోయి కట్టెలను కొట్టుచుండగా, ఒక మనిషికి తేలుకుట్టడము జరిగినది. అడవి
మృగములు దాడి చేయకుండుటకు పదిమంది గుంపుగా అడవిలోనికి పోవడము జరిగెడిది. మనుషుల గుంపును చూచి
కౄరమృగము దూరముగా పోవునని వారికి తెలుసు. అలాగే అడవిలోనికి గుంపుగా పోయినవారిలో ఒకనికి తేలుకుట్టగా
కుట్టించుకొన్నవాడు విపరీతముగా బాధపడుచుండెను. అప్పుడు గుంపులోని వారందరూ తేలు విషమును హరించు
మూలిక కొరకు వెదకను ఆరంభించారు. మూలికను వెదుకు ధ్యాసలో ఒక గుంపుగాయున్న వారు తలా ఒక ప్రక్కకు
42

Page 43
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చెల్లాచెదురుగా పోయి వెదుకుచుండగా, చెట్టుపొదల చాటున పడుకొనియున్న అడవిపంది ఒక మనిషిమీద దాడిచేసింది.
అప్పుడు అతను గట్టిగా కేకపెట్టగా, సమీపమునయున్న మిగతావారందరూ వచ్చి పందిని తరిమివేయడము జరిగినది.
అంతటితో వారు ఆ దినము పనిని ఆపివేసి అందరూ ఇళ్ళకు వచ్చారు. ఇక్కడ వారిలో ఇద్దరికి బాధలు అనుభవములోనికి
వచ్చాయి. అయితే ఈ బాధలను యమబాధలు అనవచ్చునా లేక యమకింకరుల బాధలు అనవచ్చునాయను ప్రశ్న
వచ్చినది. దానికి సమాధానము ఇలా కలదు.
ఒకరికి తేలుకుట్టిన బాధ, మరొకరికి పంది కరచిన బాధకల్గినవి. ఈ రెండు బాధలూ శరీరములో తయారయినవి
కావు. శరీరము బయట జరిగిన సంఘటనల ద్వారా వచ్చిన బాధలు అయినందున వాటిని యమ బాధలు అనుటకు
వీలులేదు. ఆ రెండు బాధలనూ యమకింకరుల నుండి వచ్చిన బాధలని చెప్పవచ్చును. ఇక్కడ యమకింకరులుగా
ఒకటి తేలు, రెండు పంది ఉన్నవి. తేలు, పంది యమకింకరులగునాయని కొందరు ఆశ్చర్యమును వ్యక్తము చేయవచ్చును.
యమకింకరుల రూపములో ఏమయినా కావచ్చును. అందులో ఆశ్చర్యపడవలసిన అవసరములేదు. “నాన రూపేణ
కాలకింకరః” అనుమాట ప్రకారము కాలకింకరులు (యమ కింకరులు) ఏ రూపములోనయినా ఉండవచ్చును.
అడవికిపోయిన ఇద్దరు మనుషులకు ముందువెనుక జరిగిన సంఘటనలలో సంభవించిన బాధలు యమకింకరులు
విధించినవని చెప్పవచ్చును. ఈ సూత్రము ప్రకారము శరీరములోనే ఉత్పన్నమగు బాధలను యమబాధలనీ, శరీరము
బయటి నుండి వచ్చు బాధలను యమకింకరబాధలనీ సులభముగా చెప్పవచ్చును.
స్వర్గ సుఖములను కూడా ఇదే విధముగా విభజించి చెప్పవచ్చును. శరీరములో జరిగే సుఖములు ఇంద్రుని
ద్వారా వచ్చు సుఖములనీ, శరీరము బయటనుండి వచ్చు సుఖములు ఇంద్రుని క్రింద పనిచేయు ఇంద్రసేన అయిన
దేవతల ద్వారా కలుగుచున్నవనీ చెప్పవచ్చును. ఇక్కడ ముఖ్యముగా చెప్పవలసిన సమాచారము ఏమంటే! శరీరములో
కలిగే సుఖములు శరీరమునకు అధిపతిగాయున్న మిస్టర్ ఎక్స్ ద్వారానే కలుగుచున్నవి. అయితే ఇక్కడ మిస్టర్ ఎక్స్ను
రెండు పేర్లతో పిలుస్తున్నాము. పాప ఫలితములయిన కష్టాలను అనుభవింప చేసినప్పుడు, శరీరమునకు అధిపతియైన
మిస్టర్ ఎక్స్ను 'యముడు' అన్నాము. ఇక్కడేమో పుణ్య ఫలితములయిన సుఖములను అనుభవింప చేయునప్పుడు, అదే
మిస్టర్ ఎక్స్ను 'ఇంద్రుడు' అని అంటున్నాము. ఒకే ఎక్స్ను ఒకచోట యముడనీ, మరొక చోట ఇంద్రుడనీ పిలువడములో
ఆంతర్యమేముంది? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా కలదు. ఎవడయితే శరీరమునకు అధిపతిగా
యున్నాడో, వానినే ఖుర్ఆన్ గ్రంథములో "శరీరములో కాపలాదారుడు” అని 86వ సూరా 4వ ఆయత్లో చెప్పగా,
అతనినే 50వ సూరాలో 21వ ఆయత్లో “మనిషిని త్రోలువాడు” అని చెప్పారు. బైబిలులో యోహాన్ సువార్త 19వ
అధ్యాయము, 11వ వచనములో "నీ అధికారి నీకు ఆజ్ఞ ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదనెను.
అక్కడ చెప్పిన అధికారే మిస్టర్ ఎక్స్ భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమను పదిహేనవ అధ్యాయమున 16వ
శ్లోకములో అక్షరుడు (నాశనము కానివాడు) అని చెప్పారు. అదే అక్షరున్నే మనము శరీరమునకు అధిపతియని
చెప్పాము. అతనినే ఒక సందర్భములో యముడనీ, మరొక సందర్భములో ఇంద్రుడనీ చెప్పాము. ఇన్ని విధముల
చెప్పబడిన వాని అసలు పేరు చెప్పకుండా మిస్టర్ ఎక్స్ అని చెప్పి సందర్భానుసారము ఒక్కొక్క విధముగా పిలుస్తున్నాము.
అంతకీ శరీరమునకు అధిపతియైన వాని అసలు పేరు ఏమిటి? అని అడిగితే ఇంతవరకూ మనము చెప్పుకొన్న పేర్లలో
ఒకటి కూడా అసలుపేరు కాదు. సందర్భమునుబట్టి పెట్టిన బిరుదులలాంటి పేర్లు తప్ప అవి ఏవీ అసలు పేరు కాదు.
43

Page 44
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
అసలు పేరు ఎవరికీ తెలియకుండ 'అణిగియున్నవాడు' అని అర్థము వచ్చు “ఆత్మ” అనుపేరు కల్గియున్నాడు.
ఆత్మ శరీరములో అధిపతిగా యుంటూ అనేక కార్యములను నిర్వర్తించుచున్నది. ఆత్మ శరీరములోనే మనిషికి (జీవునికి)
పాపములను అనుభవింపచేయుచున్నది. అలాగే పుణ్యములను కూడా అనుభవింపజేయుచున్నది. శరీరములో లోపల
తాను స్వయముగా చేయడమేకాక, తన పరివారము చేత శరీరము బయటనుండి కూడా మనిషితో పాపపుణ్యములను
అనుభవింపజేయుచున్నదని ఇంతకుముందు చెప్పుకొన్నాము. ఇంతవరకు ఆత్మకు చిన్నదైన జీవాత్మను గురించి కొందరు
చెప్పుకోవడము జరుగుచున్నది. అట్లే ఆత్మకు పెద్దదయిన పరమాత్మను గురించి చెప్పుకొనువారు కూడా యున్నారు.
అయితే రెండిటికీ మధ్యలో నున్న ఆత్మను గురించి చెప్పుకొనువారు ఎవరూ లేరు. ఆత్మ అను మాటను చాలామంది
చాలామార్లు పలికినా, అది ఊతపదములాగ పలుకబడుచున్నదే గానీ, అర్థముతో కూడుకొన్నదానిగా గానీ, అధిపతిగా
యున్నదనిగానీ, యమునిగా గానీ, ఇంద్రుడుగా గానీ ఎవరూ అనుకోవడము లేదు. ఆత్మంటే ఏమిటో, ఎట్లుంటుందో,
దాని పనేదో, దాని స్థానమేదో, దాని పుట్టు పూర్వోత్తరమేమో ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. మూడు మూల
గ్రంథములలో ఆత్మను గురించి దేవుడు చెప్పియున్నా అది ఏమిటో ఎవరికీ అవగాహనకు రాలేదు.
అంతమందికి తెలియని దానిని నేను ఒక్కమారుగా చెప్పితే బాగుండదని అందరి ధ్యాస ఆత్మమీదికి రావలయుననీ,
శరీరములో అధిపతిగానున్న ఆత్మను మిస్టర్ ఎక్స్ అనీ చెప్పాను. నేను అలా క్రొత్త పేరు చెప్పడమువలన మిస్టర్ ఎక్స్
అంటే ఎవరని తెలుసుకొనుటకు కొందరయినా ప్రయత్నిస్తారని అలా చెప్పడము జరిగినది. శరీరమున అనేక కార్యములకు
కారణమైన ఆత్మ పాపపుణ్య కర్మలను అనుభవింప జేయడములో ఒకచోట “యమ” అని పిలువబడినది. మరొకచోట
“ఇంద్ర” అని పిలువబడినది. అలా ఒక సందర్భములో 'యమ' అని పిలువబడుటకు, మరొక సందర్భములో 'ఇంద్ర'
అని పిలువబడుటకు కారణమేమయినా ఉన్నదేమో కొంత వివరించుకొని చూస్తాము.
భూమిమీద సమస్త సృష్ఠి, సమస్త జీవజాలము కనిపించుచున్నది. మనము మానవజాతి అయినందున మనిషిని
తీసుకొని చూస్తాము. మనిషిని రెండు భాగములుగా విభజించవచ్చును. సజీవ మనిషిలో ప్రకృతి ఒక భాగము కాగా,
ఆత్మలు ఒక భాగముగా యున్నవి. ప్రకృతిని విడదీసి చూస్తే ప్రకృతి ఐదు భాగములుగా యున్నది. ఆత్మలను విడదీసి
చూస్తే మూడు ఆత్మలు గలవు. ఒక మనిషి మొత్తము ఐదు ప్రకృతులుగా, మూడు ఆత్మలుగా యున్నాడని చెప్పవచ్చును.
మనిషి శరీరములో ఐదు ప్రకృతులు నిత్యము పనిచేయుచున్నవి. ఆత్మల విషయమునకువస్తే, మూడు ఆత్మలలో రెండు
ఆత్మలు నిత్యము పనిచేయుచున్నవి. ఒక ఆత్మ మాత్రము పని చేయడము లేదు. మూడు ఆత్మలలో జీవాత్మ అనునది,
ఆత్మ అనునది పనిచేయగా దేవుడు లేక పరమాత్మ అనునది పనిచేయక ఊరకయున్నది. ఊరకయున్నదంటే సాక్షిగా
యున్నట్లేనని చెప్పుకోవచ్చును. శరీరములో పరమాత్మ అనునది చేయవలసిన పనిలేదు. కావున అది లేకున్నా సరిపోతుంది
కదాయంటే, సరిపోతుంది. అయితే పరమాత్మ లేకుండాపోతే మిగతా రెండు ఆత్మలుగానీ, మిగతా ఐదు ప్రకృతులుగానీ
పని చేయవు. పరమాత్మ ఉంటేనే శరీరములోని ఏడూ పనిచేయును. అందువలన పనిలేని పరమాత్మ అన్నిటికీ తోడుగా
శరీరములో ఉన్నాడు. ప్రకృతి స్థూలమైనది కావున ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములు శరీర
భాగములుగా తయారయినవి. ఐదు ప్రకృతి భాగములు కలిసి 24 శరీర భాగములుగా తయారుకాగా, అది ఒక
శరీరముగా కనిపించుచున్నది. ప్రకృతికి కదిలేశక్తి లేదు, కావున 24 భాగముల శరీరము స్వయముగా కదలలేదు.
ప్రకృతి శరీరమును కదిలించుటకు మిగిలిన మూడు ఆత్మల మీద ఆధారపడవలసి వచ్చినది. అయితే మూడు ఆత్మలలో
ఒకటి దేవుడు, మరొకటి జీవుడుకాగా మధ్యలోని ఆత్మ మాత్రము యమునిగా ఉన్నది. దేవుడు పనిచేయువాడు కాడు.
44

Page 45
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
అందువలన ఆయన శరీరమును కదిలించడు. ఇకపోతే జీవుడు పనిచేయువాడుకాడు, జీవుడు గ్రుడ్డివాడు, చెవిటివాడు,
మూగవాడు, కుంటివాడు అయినందున వాడు శరీరమును కదలించలేడు.
ఈ విధముగా మనిషి శరీరమున్నా, అందులో జీవుడూ, దేవుడూ యున్నా, శరీరము మాత్రము పనిచేయని
స్థితిలో ఉండును.
అటువంటి శరీరమునకు అధిపతిగాయుంటూ దానిని కదిలించి, పని చేయించువాడు ఒక్కడే
ఒక్కడు. అతడే యముడు, అతడే ఇంద్రుడు. ఈ రెండు పేర్లు గలిగి శరీరమును కదలించువాడు మూడు ఆత్మలలో
మిగిలిన మధ్యలోని ఆత్మ. ఇంతకుముందు మనము మిస్టర్ ఎక్స్ అని ఎవరినయితే పిలుచు కొన్నామో అతడే జీవునికీ,
దేవునికీ మధ్యలోగల ఆత్మ. మూడు ఆత్మలలో ఒకటి జీవాత్మకాగా, రెండవది ఆత్మకాగా, మూడవది పరమాత్మగా
యున్నది. మధ్యలో ఆత్మగాయున్నవాడే సందర్భనుసారము ఒకప్పుడు యముడుగా, మరొకప్పుడు ఇంద్రునిగా
చెప్పబడుచున్నాడు. శరీరమును కదిలించి జీవుని చేత పాపకర్మలను అనుభవింపజేయునప్పుడు యమునిగా చెప్పించుకొన్న
వాడు, జీవుని చేత పుణ్యకర్మలను అనుభవింపజేయునప్పుడు ఇంద్రునిగా పిలిపించుకొంటున్నాడు. శరీరమునకంతటికీ
కదిలే ఆత్మ ఒక్కటే అయినందున దానిని చైతన్య ఆత్మ అని కూడా అంటున్నాము. మూడు ఆత్మలలో మధ్యలోని ఆత్మ
ఒకమారు యమునిగా, మరొకమారు ఇంద్రునిగా చెప్పించుకొనునప్పుడు పులింగముగా చెప్పబడుచున్నాడు. కేవలము
ఆత్మగా చెప్పబడునప్పుడు స్త్రీలింగముగా చెప్పబడుచున్నది. అంతకూ ఆత్మ పులింగమా, స్త్రీలింగమా అని కొందరు
అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఆత్మనునది పులింగమేనని చెప్పవచ్చును. అట్లే మిగతా జీవాత్మ,
పరమాత్మలు కూడా పురుషులుగానే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తియోగమున 16, 17 శ్లోకములలో చెప్పబడినారు.
ద్వావిమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ |
క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ॥
16వ శ్లో॥
17వ శ్లో॥
G
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః ।
యో లోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః ॥
భావము :- "రెండు రకముల పురుషులు లోకములో గలరు. అందులో ఒకడు క్షరుడనీ, రెండవవాడు అక్షరుడనీ
పిలువబడుచున్నారు. సర్వ జీవరాసులలో క్షరుడు అనువాడు గలడు. క్షరుడు ఎక్కడున్నాడో వానితోపాటు కలిసి
అక్షరుడనువాడు గలడు.”
"క్షరునికంటే, అక్షరునికంటే ఉత్తమమైన పురుషుడు మరొక డున్నాడు. అతనినే పరమాత్మయని అంటున్నాము.
అతడు అంతటా వ్యాపించినవాడై నాశనములేని దేవునిగా యున్నాడు.”
ఇక్కడ భగవద్గీతలో మూడు ఆత్మలను ముగ్గురు పురుషులుగా చెప్పారు. అందువలన ఆత్మనునది పురుషుడేననీ,
అందువలననే ఒకమారు యముడనీ, మరొకమారు ఇంద్రుడనీ పురుషుల పేర్లనే చెప్పుచున్నాము. ముగ్గురు పురుషులు
శరీరములో ఎవరికీ కనిపించకుండా, తెలియకుండా అణిగియున్నారు కావున వారిని ఆత్మలు అని అంటున్నాము. ఆత్మ
అంటే తెలియకుండా అణిగియున్నదని ఇంతకుముందు కూడా చెప్పుకొన్నాము. ఆత్మ పురుషుడే అయినా తెలియనివాడని
ఆత్మకు పేరునుంచాము. శరీరములో జరిగే పనులను అన్నిటినీ ఆత్మే చేయుచున్నది, లేక కదిలించి చేయిస్తున్నది. అన్ని
మాటలనూ అదే మాట్లాడుచున్నది. శరీరములో ఆత్మ చేయని పనంటూ లేదు. ఒకమారు జీవునిగా నటించుచున్నది.
మరొకమారు దేవునిగా కూడా నటించుచున్నది, మాట్లాడుచున్నది. జీవుడు, దేవుడు ఇద్దరూ ఉలుకువారూ కాదు,
45

Page 46
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పలుకు వారుకాదు. అయినా జీవుడు దేవుడుయొక్క ఉనికిని తెలియజేయు నిమిత్తము ఆత్మే జీవునిగా మాట్లాడుచున్నది.
అట్లే దేవునిగా కూడా మాట్లాడుచున్నది. వారు చేసినట్లే అందరినీ నమ్మించి పనులను చేయుచున్నది. శరీరములో
అణిగియున్న ఆత్మ ఎవరికీ అంతుబట్టనిదై, ఎవరికీ అర్థముకానిదై జీవునిగా, దేవునిగా నటించుచున్నది. అందువలన
దానిని “నటించే ఆత్మ”యని ఒకమారు ఉపన్యాసములలో చెప్పాము. మరొక మారు “ఆడించే ఆత్మ”యని చెప్పాము.
ఇప్పుడు “యముడు”, “ఇంద్రుడు” ఎవరో కాదు శరీరములోని ఆత్మేనని చెప్పుచున్నాము.
ఇప్పుడు నరకలోకమునకు చెందిన యముడు, స్వర్గలోకమునకు చెందిన ఇంద్రున్ని గురించి తెలుసుకొందాము.
ఇంద్రున్ని “ఇంద్ర” అని అనవచ్చును. అలాగే యమున్ని “యమా” అని అనవచ్చును. యమా, ఇంద్రా కంటే ముందు
కొంత విషయము తెలుసుకొందాము. ఎందుకంటే ఆత్మను ముందు యమా అని పిలువాలా లేక ఇంద్రాయని పిలువాలా
అని చూచుకొనుటకు ముందు తెలియవలసినది ఏమంటే! మనిషి తన జీవితములో మంచి చెడు పనులు చేయుచూ,
చెడు కార్యమునకు ఫలితముగా పాపమునూ, మంచి కార్యమునకు ఫలితముగా పుణ్యమునూ పొందు చుండును. ఒక
మనిషి తన జీవితములో చెడు కార్యములను ఎక్కువ చేసి, మంచికార్యములను తక్కువ చేశాడనుకొనుము. అప్పుడు
దాని ఫలితముగా పాపమును ఎక్కువ పొందును, పుణ్యమును తక్కువగా పొందును. అటువంటివాడు చనిపోయినప్పుడు
జీవితములో చేసుకొన్న కర్మను ప్రారబ్ధకర్మగా తీసుకొనిపోయి మళ్ళీ జన్మను పొందుచున్నాడు. రెండవ జన్మలో పాపమును
ఎక్కువగా, పుణ్యమును తక్కువగా అనుభవించవలసి యుండును. పాపమును అనుభవింపజేయువాడు ఆత్మేనని
తెలుసుకొన్నాము. మనిషి జీవితములో ఎక్కువ కాలము జీవున్ని బాధలకు గురిచేసి హింసించవలసిన వాడు దేహములో
ఒక్కడే కలడు. అతడు ఆత్మే అయినా జీవున్ని తన ధర్మము ప్రకారము హింసించి బాధపెట్టు చున్నాడు. శరీరములో
సాక్షిగా యున్న దేవుని ముందర తన ధర్మమును తాను నిర్వర్తించుచూ, ఎవరికీ అర్థముకాని మాయగా ఉన్నాడు కాబట్టి,
ఆత్మకు యమధర్మరాజు అని పేరు వచ్చినది. ఇందులో యమా అంటే పెద్దయని అర్థము. ధర్మ అంటే ధర్మము అని
అర్థము. అలాగే రాజు అంటే అధిపతియని అర్థము. తప్పుకు తగిన శిక్ష, అన్నట్లు ఎంత తప్పు చేసినవానికి అంతే
శిక్ష వేయడములో పద్ధతిగా, శాస్త్రీయతగా వ్యవహరించు వాడు అయినందున ధర్మమును ఆచరించడములో పెద్దయనీ,
కర్మలకన్నిటికీ అధిపతియనీ తెలియునట్లు యమధర్మరాజు అని ఆత్మను అన్నారు. అంతేగాక ఆత్మ శరీరములో
జీవుడున్నచోటే వుంటూ జీవునికి తెలియకుండా మసలుచూ, తాను పని చేయుచున్నా జీవుడే చేయునట్లు భ్రమింపచేసి,
ప్రతి పనినీ తానే చేశానని జీవుని చేత అనిపించుటవలన ఆత్మను మాయకు ప్రతినిధిగాయున్నదని 'యమా' అని కూడా
అన్నారు.
శరీరములో ప్రకృతి చేత తయారయిన పన్నెండు గుణములను మాయ అంటున్నాము. శరీరములోని ఆత్మ
ఎప్పుడు ఏ గుణమును ప్రేరేపించాలో దానినే ప్రేరేపించి, గుణమాయ చేత మనిషిని కార్యముల వశమై చేయునట్లు
చేయుచుండుట వలన, శరీరములోని మాయను ఉపయోగించుటకు అధిపతియైన దానివలన 'మాయ' అను పదమును
త్రిప్పి ఆత్మను “యమా” అని అనడము జరిగినది. యమాను త్రిప్పి చూచితే మాయ అగును. అందువలన శరీరములో
దేవునిగానే కాకుండా, మాయగా నున్నవాడు కూడా ఆత్మే కనుక ఆత్మను యమా అని చెప్పడము జరిగినది. “మాయ”
అంటే గుణములగును “యమా” అంటే గుణములను ఉపయోగించు వాడని అర్థమగునట్లు యమా అను పేరుంచడము
జరిగినది. పాపకార్యములు జరుగు సమయములో, ఆ కార్యములను ఆత్మ స్వయముగా శరీరములో చేయునప్పుడు,
ఆత్మకు యమ అను పేరును తగిలించు చున్నాము. భగవద్గీతలో విభూతి యోగమను అధ్యాయమందు 29వ శ్లోకమున
46

Page 47
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
“యమ స్సంయమతా మహమ్” “దండనాధికారులలో నేను యముడను అగుదును” అని ఆత్మను ఉద్దేశించి చెప్పడమైనది.
పాపకార్యము లకు శిక్షను వేయునప్పుడు శరీరములో జరుగు బాధలకు ఆత్మ యముడై హింసించుచున్నాడు.
పుణ్యకార్యములయిన సుఖములను అనుభవింపజేయువాడు కూడా, ఆత్మేనని చెప్పుచున్నాము. శరీరములో ఏ
పని చేసినా ఆత్మ చేయవలసిందే. ఆత్మ మినహా చేసేవారు ఎవరూ లేరు. అందువలన చిన్నపని మొదలుకొని పెద్దపని
వరకు ఆత్మ చేయవలసిందేనని తెలియవలెను. పాపమును అమలు చేయునప్పుడు గుణములను ఉపయోగించి మాయను
ప్రయోగించి ‘యమా' అను పేరుతో చలామణి అయిన ఆత్మ, పుణ్యకార్యాలయిన సుఖములను అనుభవింపచేయునప్పుడు
కూడా గుణమాయను ఉపయోగించే మనిషికి సుఖములను అందించుచున్నది. దానివలన స్వర్గ సుఖములను అందించు
నప్పుడు కూడా ఆత్మను న్యాయముగా యముడే అనాలి. అయితే పుణ్య సంబంధ స్వర్గ సుఖములను అందించు ఆత్మను
ప్రత్యేకమయిన పేరుతో 'ఇంద్ర' అని పిలుచుచున్నాము. పాపకార్యములలో ఉపయోగించు మాయనే పుణ్యకార్యములలో
కూడా ఉపయోగించి ప్రేరేపించునప్పుడు ఆత్మను పాపకార్యములలో 'యమా' అన్నట్లే, పుణ్యకార్యములలో కూడా అదే
పేరును ఉపయోగించక 'ఇంద్ర' అని ఎందుకు అనవలసి వచ్చినదను ప్రశ్నకు జవాబు ఈ విధముగా కలదు.
చెడుపనులను పాపపుపనులు అని అంటున్నాము కదా! అట్లే మంచి పనులను పుణ్యపు పనులు అని అంటున్నాము.
పాపపు పనులు రెండు రకములు గలవు. అందువలన వాటిలో వచ్చు పాపము కూడా రెండు రకములుగా ఉండును.
ప్రపంచ సంబంధమైన చెడు పనులన్నిటికీ వాటికి తగిన పాపము రావడము తెలిసిన విషయమే. దాని ఫలితముగా
కష్టములు, బాధలు, హింసలు అనుభవిస్తున్నాము. ఇదంతయూ ఇంతవరకు చెప్పుకొన్న విషయమే. అయితే ఇక్కడ
కొంత తెలియని విషయము కూడా ఉన్నది దానిని ఇప్పుడు గమనిస్తాము. పాపపు పనులలో ప్రపంచ సంబంధ
కార్యములే కాకుండా, దైవిక సంబంధమైన కార్యములు కూడా కలవు. దైవమునకుగానీ, దైవజ్ఞానమునకుగానీ
వ్యతిరేఖమయిన పనులు చేసినా, మనస్సునందు లేక భావమునందు వ్యతిరేఖతను చూపినా, తలచినా అటువంటివానికి
పాపమే వచ్చునుగానీ, ఆ పాపము క్షమించరాని లేక క్షమించబడని పాపముగా ఉండును. ప్రపంచ కార్యములో వచ్చు
పాపము క్షమించబడుటకు అర్హమై ఉండును. దానిని మనిషి అనుభవించకుండా తప్పించుకొనుటకు వీలుకలదు.
అయితే క్షమించబడని పాపమును తప్పక అనుభవించవలసివచ్చును. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును.
అదేమనగా! "క్షమించబడే కర్మంటే ఏమిటి? ఎలా క్షమించబడును?" అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలా
కలదు. భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమందు 37వ శ్లోకము ఇలా కలదు చూడండి.
యథైధాంసి సమిద్ధోగ్ని ర్భస్మసాత్కురు తేర్జున
జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా॥
భావము :- “ఏ విధముగా అగ్నిలోపడిన ఎన్ని కట్టెలయినా కాలి బూడిద యైనట్లు, జ్ఞానమను అగ్నిలో పడిన కర్మలు
ఏవయినా కాలిపోవును.” ఇక్కడ చెప్పిన విషయమునుబట్టి మనము చేసుకొన్న ప్రపంచ సంబంధ కర్మలు ఏవయినా
పుణ్యమయినా, పాపమయినా జ్ఞానమను అగ్నిలో కాలిపోవునని తెలియుచున్నది. దైవజ్ఞానము సంపాదించుకొన్న వాని
శరీరములో గల కర్మలు వాడు తెలిసిన జ్ఞానముచేత నిర్వీర్యమై పోవుచున్నవి. అలా కాలిపోయిన కర్మలు అనుభవమునకు
రావు. అందువలన అటువంటి కర్మలను క్షమించబడు కర్మలు అంటాము. మనిషిలో దైవజ్ఞానము లేకపోతే కర్మలన్నిటినీ
47

Page 48
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
అనుభవించవలసిందే. జ్ఞానముంటే కాలిపోవుటకు అర్హత కల్గియున్న కర్మలను (పాపములను, పుణ్యములను) క్షమించబడు
పాపములు, క్షమించబడు పుణ్యములు అని అంటాము.
క్షమించబడని పాపమును గురించి ఒక మూలగ్రంథములో కలదు. అక్కడ పాపమును గురించి చెప్పారు.
ఇక్కడ పుణ్యమును గురించి కూడా మేము చెప్పుచున్నాము. మంచి చెడు రెండు కర్మలు అగ్నికి కాలిపోవునని
ఉన్నప్పుడు, అట్లే కాలిపోనివి కూడా రెండూ ఉండును. బైబిలు గ్రంథములో మత్తయి సువార్త 12వ అధ్యాయము, 31వ
వాక్యములో “మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమించబడును గానీ, ఆత్మ విషయమైన (దైవ
సంబంధ విషయములలో) దూషణకు పాప క్షమాపణ లేదు.” అని చెప్పబడినది. భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగ
యోగమున 9వ శ్లోకమున మరియు 19, 20వ శ్లోకములలో క్షమించబడని పాపమును గురించి భగవంతుడు చెప్పాడు.
వీటినన్నిటినీ గ్రహించిన తర్వాత క్షమించబడే కర్మలు, క్షమించబడని కర్మలు అని రెండు రకములు గలవని తెలియుచున్నది.
అనుభవింపబడే పాపపుణ్యములకు ఆడించేవాడు ఒకే ఆత్మకాగా, దానిని పాపకర్మలను అనుభవింపజేయునప్పుడు 'యమా'
అనడమూ, పుణ్య కర్మలు అనుభవించునప్పుడు 'ఇంద్ర' అని చెప్పుకొన్నాము. అలా రెండు రకములు చెప్పుటకు
కారణము కలదు, అదేమనగా!
పుణ్యములు, పాపములున్నట్లే రెండు రకములు గలవు. ప్రపంచ సంబంధ పాపములు పుణ్యములు
అనుభవమునకు వస్తాయి, అయిపోతాయి. దైవ సంబంధమైన జ్ఞానముంటే అనుభవమునకు రాకుండానే కాలిపోతాయి.
దైవమునకు వ్యతిరేఖముగా సంపాదించిన కర్మలు ఏవయినా అనుభవించి తీరవలసిందే అవి జ్ఞానమునకు కాలిపోవు.
వాటినే క్షమించరాని పాపములు అంటాము. అలాగే దైవమునకుగానీ, దైవ జ్ఞానమునకుగానీ ప్రత్యక్షముగా గానీ,
పరోక్షముగా గానీ సేవ చేసినవారికి పుణ్యఫలము వచ్చును. అయితే అటువంటి పుణ్యము జ్ఞానాగ్ని చేత కాలిపోదు.
అందువలన దానిని క్షమించ రాని పుణ్యము అని అంటున్నాము. జ్ఞాన సంబంధ పుణ్యము జ్ఞానాగ్నిలో కాలిపోకుండా
మిగిలినప్పుడు దాని ఫలితమును కూడా తప్పక అనుభవించ వలసియుండును. క్షమించబడని దైవసంబంధ పాపము
ఒకే జన్మలో అయిపోక, అనేక జన్మలు అనుభవించుచూ, జన్మజన్మకూ అథోగతిపాలు చెందినట్లు, దైవ సంబంధ పుణ్యము
కూడా ఒకే జన్మలో అయిపోక జన్మ జన్మకు దైవజ్ఞానము వైపు పంపుచూ చివరికి ఉన్నతమైన జ్ఞానమునకు చేర్చగలదు.
ఇంతకుముందే చెప్పాను ఏ పనిని చేసినా ఆత్మే చేయునని. పాపమును అనుభవింపజేయడములో 'యమా' అని
(యముడు అని) పేరు పొందిన ఆత్మయే, దైవ సంబంధ ఫలితమునుబట్టి మనిషికి జ్ఞానమును అందించునప్పుడు
జ్ఞానమునకు అధిపతియైన చంద్రునివలె ప్రవర్తించు చున్నది. కావున ఇంద్ర అని అన్నాము. చంద్రుని పేరు 'ఇందు’
అని కలదు, కావున చంద్రుని పేరయిన 'ఇందు' శబ్ధము ప్రకారము ఆత్మను 'ఇంద్ర' అంటున్నాము.
జ్ఞానమునకు
దైవ సంబంధ జ్ఞానమునకు సేవచేసినప్పుడు దేవునికి సేవ చేసినట్లేయగును. అటువంటి దైవకార్యములలో
వచ్చునది క్షమించబడని పుణ్యము అని ఇక్కడ అంటున్నాము కదా! 'కార్యము వలన వచ్చునది కర్మ' అను సూత్రము
ప్రకారము జ్ఞానసేవ కార్యములో క్షమించబడని పుణ్యము వచ్చినదని చెప్పుచున్నాము. ఇక్కడ దైవసంబంధ పుణ్యమును
కర్మ క్రిందికి చేర్చకూడదు. ఎందుకనగా 'కార్యము వలన వచ్చునది కర్మ' అను సూత్రము ఎట్లున్నదో అట్లే 'కర్మ వలన
వచ్చునది కార్యము' అనికూడా కలదు. అయితే జ్ఞాన సంబంధమైన ఫలితము పుణ్యమును కర్మ అని అనకూడదు.
ఎందుకనగా మనిషి అనుభవములోని కార్యముగా ఈ కర్మ మారదు. కావున జ్ఞానసేవ వలన వచ్చిన పుణ్యమును కర్మ
అని అనకుండా ఫలితము అని మారు పేరుతో చెప్పవచ్చును. లేకపోతే సంస్కార బలము అని మరియొక పేరుపెట్టుకొని
48

Page 49
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చెప్పుకోవచ్చును. జ్ఞాన సంబంధ పుణ్యములు స్వర్గ సుఖములకు ఉపయోగపడవు. కావున వాటిని కర్మలు అనిగానీ,
పుణ్యములు అనిగానీ అనుటకు వీలులేదు. జ్ఞానసంబంధ పుణ్యము కార్యరూపము లోనికి రాదు. 'కార్యమును చేయించునదే’
కర్మ అను సూత్రమును అనుసరించి కార్యరూపము కాని దానివలన, జ్ఞానసంబంధమైన వాటిని ఫలితములు లేక
సంస్కారములు అని అనవచ్చును. జ్ఞానమార్గమునకు “జ్యోతిష్య శాస్త్రము” ప్రకారము అధిపతి చంద్రుడు. చంద్రున్ని
ఇందువు అని, ఇంద్ర అని చెప్పవచ్చును. అందువలన ప్రపంచ సంబంధ కర్మలను పాపములను అనుభవింపజేయునప్పుడు
‘యమా' అని ఏ ఆత్మనయితే అంటున్నామో, అదే ఆత్మనే దైవసంబంధ ఫలితములను మరియు పుణ్యములను అనుభవింప
జేయునప్పుడు 'ఇంద్ర' అని పిలుస్తున్నాము. కనిపించని ఆత్మ వెనకాల ఇంతటి వివరము కలదు కావున, ఒకే ఆత్మనే
‘యమా’ అని ఒక సందర్భములో అంటున్నాము. అట్లే మరియొక సందర్భములో 'ఇంద్ర' అని అంటున్నాము. అంతేగానీ
అజ్ఞానము చేత యముడెవరో, ఇంద్రుడెవరో తెలియనివారు, యమునిది నరకలోకమనీ, ఇంద్రునిది స్వర్గలోకమనీ
చెప్పడము చాలా పొరపాటగును. పూర్తి అసత్యమగును, పూర్తి అజ్ఞానమగును.
దైవసంబంధ ఫలితములనుగానీ, ప్రపంచ సంబంధ కర్మలనుగానీ, మనిషి చేసినప్పుడు వాటిని కర్మచక్రములో
నమోదు చేయువాడు ఆత్మయే. రెండు రకముల కర్మలను అనుభవింపజేయువాడు ఆత్మయని ఇంతకు ముందు
చెప్పుకొన్నాము. అయితే మనిషి చేసిన పాపపుణ్యములను వ్రాసిపెట్టుకొనువాడు కూడా ఆత్మయేనని తెలియవలెను.
ఆత్మ మనిషి శరీరములో కాపలాదారుడుగాయున్నాడు అని చెప్పినమాట ఖుర్ఆన్ గ్రంథములో 86వ సూరా, నాలుగవ
ఆయత్నందు కలదని మరువకూడదు. కాపలాదారునిగాయుండి దేనిని కాపలా కాస్తున్నాడు అని అంటే, ప్రతి మనిషీ
చేయు చిన్నతప్పును సహితమూ, అట్లే చిన్న ఒప్పును సహితమూ వ్రాసిపెట్టుచున్నాడు. కర్మ పత్రములో వ్రాసిపెట్టుచున్నాడని
చెప్పవచ్చును. వాస్తవముగా శరీరములోని తలయందుగల కర్మచక్రములో ఆత్మ చేతనే కర్మ నమోదు చేయబడుచున్నది.
ఆత్మ కర్మలను వ్రాసిపెట్టుటకు ఎల్లప్పుడూ కాచుకొనియున్నాడు. ఇట్లు అహర్నిశలు పాపపుణ్యములను ఒక్క దానిని
కూడా వదలకుండ ఒకచోట వ్రాసిపెట్టుట వలన ఆత్మకు ప్రత్యేకమయిన పేరు కూడా కలదు. శరీరములో యుంటూ
ఎవరికీ తెలియకుండా రహస్యముగా యుండుట వలన “గుప్తుడు” అని పేరు వచ్చినది. అంతేకాక శరీరములో ఒకమారు
యమునిగా, మరొకమారు ఇంద్రునిగా, మరొకమారు కాపలాదారునిగా, ఎల్లప్పుడూ చిత్ర విచిత్ర పనులు చేయుచుండుట
వలన ఆత్మను "చిత్రగుప్తుడు" అని కూడ అనవచ్చును.
శరీరములో దైవసంబంధ సేవలకు వచ్చు ఫలితమును గుర్తించుకొని దానికి ప్రతిఫలితముగా మనిషికి
దైవజ్ఞానమును ఆత్మ అందించుచున్నది. ప్రపంచ సంబంధముగా అన్ని కర్మలను మనిషిచేత అనుభవింపచేసినా, అన్నిటికంటే
గొప్పగా మనిషి దైవసంబంధముగా చేసుకొన్న ఫలితమునకు తగినట్లుగా తనకు సంబంధించిన ఆత్మజ్ఞానమును
తెలియజేయుచున్నది. ఆత్మజ్ఞానమునకు అనుబంధముగా ఇటు జీవాత్మ విషయము అటు పరమాత్మ విషయము
ఉండుట వలన మొత్తము మూడు ఆత్మల జ్ఞానమును ఆత్మ తెలియజేయుచున్నది. ప్రపంచములో ఏ మానవునికీ
తెలియని జ్ఞానము ఆత్మకు తెలియును కనుక, జ్ఞానమును బోధించడములో ఆత్మ స్వయాన గురువుగా వ్యవహరిస్తుంది.
ఈ విధముగా పరమాత్మ జ్ఞానము ప్రపంచమునకు ఆత్మ ద్వారా తెలియబడుచున్నది. ఎవరికి ఎంత జ్ఞానమును
తెలుపవలెనో అంతే జ్ఞానమును ఆత్మ తెలియజేయును. పరిమితికి మించిన జ్ఞానమును ఎవనికీ తెలియజేయదు.
ఎవడు చేసుకొన్న సేవా ఫలితమునకు సంబంధించిన జ్ఞానమునే ఆత్మ బోధించుచున్నది. దైవజ్ఞానమును తెలియజేయుట
వలన ఇందువు (చంద్రుడు) అను బిరుదుతో ఇంద్ర అని పిలువబడుచున్నది. 'ఇంద్ర' అనగా దైవజ్ఞానమును తెలిసినవాడు
49

Page 50
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
మరియు తెలుపువాడని అర్థము. ప్రపంచములో గొప్ప పేరయిన ఇంద్ర అను పేరును జ్ఞానము తెలుపు సమయములో
తనకు వర్తింపచేసుకొన్నది.
నేడు ప్రపంచములో ఒక వ్యక్తి గురువుగానో, స్వామిగానో, పీఠాధిపతిగానో, పరమహంసగానోయుంటూ జ్ఞానమును
బోధించు చున్నాడంటే, వానిలోన ఆత్మ తెలిపిన జ్ఞానమునే తెలుపుచున్నాడని అర్థము చేసుకోవలెను. అయితే దేశములోని
ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క రకముగా బోధిస్తున్నారు కదా! ఒకరు చెప్పిన సిద్ధాంతమును మరొకరు ఒప్పుకోవడము లేదు
కదా! ఒకే ఆత్మ చెప్పినప్పుడు అందరివద్దా ఒకే జ్ఞానము ఉండవలయును కదా! అట్లెందుకు లేదు అని ఎవరయినా
ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! పోయిన జన్మలో ఎవడు ఎంత సేవ చేసియుంటే అంతే జ్ఞానమును
ఆత్మ కొలతపెట్టి అందించును. వాని స్థోమతకంటే కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగ తక్కువకాని అందివ్వదు. ఎవడు ఏ
భావముతో ఎంత సేవ చేసియుండునో అంతే జ్ఞానమును, అంతే భావములో ఆత్మ అందించుట వలన, భూమిమీద
అనేకులు వారికి తెలిసిన భావము ప్రకారమే బోధించుట వలన, జ్ఞానములో ఒకే విధానము కనిపించక అనేక
విధానములు కనిపించుచున్నవి. తెలిపిన వాడు ఒకే ఆత్మే అయినా మనుషుల భావములనుబట్టి ఆత్మ తెలిపియుండుట
వలన క్రైస్తవులది ఒకరకమైన జ్ఞానముకాగా, ముస్లీమ్లది మరొక జ్ఞానముగా యున్నది. అలాగే హిందువులది
(ఇందువులది) మరొక జ్ఞానముగా యున్నది. ముగ్గురికీ చెప్పినవాడు ఆత్మే అయినా వారి వారి భావములను బట్టి
వారికి తెలియజేశాడు. ఈనాడుగానీ ఏనాడుగానీ మనుషుల పాపపుణ్య ములను స్వర్గనరకములుగా అమలు చేయువాడు
ఆత్మే కదా! అటు వంటప్పుడు స్వర్గ నరకములు ఎక్కడున్నవో, ఎట్లున్నవో ఆత్మకు తెలియ కుండా ఏమీ లేవుకదా!
స్వర్గనరకములకు అధిపతి ఆయనే (ఆత్మే) అయినప్పుడు ఆత్మకు అన్నీ తెలుసుకదా! అటువంటప్పుడు స్వర్గ నరకములు
ఎక్కడో ఉన్నాయి అని చెప్పినవాడు కూడా ఆత్మే, అలా చెప్పుటకు కారణము మనుషులలోని శ్రద్ధా
భావములనుబట్టియుండునని తెలియు చున్నది. మనిషిలోని శ్రద్ధనుబట్టి వాని భావమునుబట్టి ఎంత జ్ఞానము తెలుపాలి,
ఎటువంటి జ్ఞానము తెలుపాలియని ఖచ్చితమైన లెక్కవేసి అంతే జ్ఞానమునూ, అటువంటి జ్ఞానమునే తెలుపును.
అందువలననే భూమిమీద దైవ జ్ఞానము అంతటా ఒక విధముగా లేక అనేక విధముల కనిపించు చున్నది.
కొందరికి ఇక్కడొక ప్రశ్న రావచ్చును. అదేమనగా! మనుషుల సేవలు, భావములు ఒకే విధముగా ఉండక
అనేక విధములుగా ఉండడము సహజమే. వారికి తగినట్లే ఆత్మ తన జ్ఞానమును అందించుట వలన భూమిమీద
భిన్నమైన జ్ఞానములు కనిపిస్తున్నవి. అట్లు భిన్నమైన జ్ఞానములు మనుషులకు తెలియుట వలన, ఆత్మ తెలుపుట వలన
అసలయిన దేవుని జ్ఞానము భూమిమీద తెలియకుండా పోగలదు కదా! అటువంటప్పుడు భూమిమీద మనుషులకు
అసలయిన దైవజ్ఞానము ఎలా తెలియగలదు? అని అడుగవచ్చును దానికి మా జవాబు ఇలా కలదు చూడండి.
భూమిమీద మనుషుల శ్రద్ధనుబట్టి ఎంత జ్ఞానము తెలుపాలియనీ, భావమునుబట్టి ఎటువంటి జ్ఞానమును తెలుపాలనీ
ఆత్మ నిర్ణయించి తెలుపుచున్నది. మనుషుల భావములు అనేక విధములుగా ఉండును కావున అనేక జ్ఞానములు
భూమిమీద తెలియజేయబడినాయి, అవే ప్రచారములో ఉన్నాయి. స్వచ్ఛమయిన దైవజ్ఞానము కావాలనుకొనువారికి,
కల్మషములేని భావమున్న వారికి అసలయిన జ్ఞానము తెలియు అవకాశము కూడా కలదు. అటువంటి వారికి ఆత్మ
స్వచ్ఛమయిన దైవజ్ఞానమును తెలుపు నిమిత్తము దేవుని అంశ భూమిమీద మనిషిగా పుట్టుచున్నది.
దేవుడు లెక్కలేనన్ని అంశలతో ప్రపంచమంతా వ్యాపించి, సర్వ వ్యాపిగాయున్నాడు. అంతటా వ్యాపించిన అనేక
అంశలలో ఒక అంశ మానవ రూపముగా భూమిమీద పుట్టుచున్నది. అలా దైవాంశతో పుట్టిన మానవాకారమును
50

Page 51
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
భగవంతుడు అని అనవచ్చును. అలా వచ్చిన శరీరములో జీవాత్మ ఉండదు. ఉన్నది పరమాత్మ మాత్రమే. భగవంతుని
శరీరములో జీవాత్మయూ దానికి తోడుగాయున్న ఆత్మయూ రెండూ వుండవు. ఒకే పరమాత్మ ఆ శరీరములో ఉన్నదని
చెప్పవచ్చును. అయితే పైకి కనిపించునది మానవ శరీరమే కావున దానిలో మూడు ఆత్మలు ఉండి తీరవలెను.
అప్పుడు పరమాత్మే జీవాత్మగా, ఆత్మగా తయారగుచున్నది. భగవంతుని శరీరములోని పరమాత్మ అంశ మొదట ఆత్మగా
మారిపోవును. అలా మారిన ఆత్మ అందరిలో ఉన్నట్లే వుంటూ జీవాత్మగా, పరమాత్మగా నటించుచున్నది.
నటించడము శరీరమును నడుపడము అన్ని శరీరములలో జరుగుచున్న పనియే. అన్ని శరీరములలోవలె భగవంతుని
శరీరమునకు కూడా ఆత్మ అధిపతిగాయుంటూ ఆ శరీరమును నడుపు చున్నది.
అలా
అందరి శరీరములలో యున్నట్లు భగవంతుని శరీరములో కర్మయుండదు. అందువలన అందరినీ కర్మప్రకారము
నడిపినట్లు నడుపుటకు అవసరమునుబట్టి శరీరమును నడుపుచుండును. అలా నడుపు శరీరము ప్రత్యేకమయినదనీ,
భగవంతునిగా పుట్టిన శరీరమనీ ఎవరికీ తెలియనట్లు ఆత్మ నడుపగలదు. అందువలన భగవంతుని శరీరమును
భూమిమీద ఎవరూ గుర్తించలేరు. ఇతను దైవాంశతో పుట్టినవాడుయనిగానీ, భగవంతుడనిగానీ ఎవరూ గుర్తించనట్లు
ఆత్మ భగవంతుని శరీరమును వర్తింపజేయగలదు. అలా ప్రపంచములో ఎటువంటి గుర్తింపు లేకుండా యున్న భగవంతుని
శరీరమునుండి ఆత్మ స్వచ్ఛమయిన పరమాత్మ జ్ఞానమును తెలియజేయగలదు. ప్రపంచములో ఏ మనిషి శరీరములో
తెలుపని జ్ఞానమును ఆత్మగాయున్న పరమాత్మ అంశ భగవంతుని శరీరము నుండి సంపూర్ణ జ్ఞానమును తెలియజేయును.
ఇదే విధానముతో ద్వాపర యుగమున శ్రీకృష్ణుని శరీరమునుండి భగవద్గీతను ఆత్మే తెలియజేసినది. ప్రపంచములో
ఎక్కడయినా, ఎప్పుడైనా సంపూర్ణ జ్ఞానమును ఆత్మే తెలియ జేయాలి. శ్రీకృష్ణుని శరీరమునుండి జ్ఞానమును తెలియజేసిన
ఆత్మయే మరియొకమారు కలియుగములో మరొక శరీరమునుండి జ్ఞానమును తెలియ జేసినా మనిషి
జ్ఞానములు ఒక్కటేయనిగానీ, ఒక్కడే తెలియజేశా డనిగానీ నేటికీ గుర్తించలేకున్నాడు.
ణ
ఆ రెండు
మనుషుల భావమునుబట్టి జ్ఞానము తెలియునను సూత్రము ప్రకారము, మంచి భావమున్నవానికి భగవంతుడు
చెప్పిన జ్ఞానము సులభముగా అర్థముకాగలదు. భావము సరిలేనివానికి భగవంతుడు చెప్పిన జ్ఞానము ఏమాత్రము
అర్థముకాదు. సంపూర్ణ జ్ఞానము భూమిమీద లేదు అనకుండా, దేవుడు తన అంశతో పుట్టించిన భగవంతుని శరీరములోని
ఆత్మద్వారా జ్ఞానమును తెలియజేయును. ఆత్మ అన్ని శరీరములలోనున్నా ఎవరికీ తెలియకుండా ఎట్లు మసలుతున్నదో,
అట్లే భగవంతుని శరీరములోని ఆత్మ ఇతను భగవంతుడని ఏమాత్రము తెలియకుండా నటింపజేయును. ప్రతి మనిషిలోనూ
జీవాత్మ, ఆత్మ అను జోడు ఆత్మలున్నా, దేవుని అంశయైన భగవంతుని శరీరమందు జోడు ఆత్మలు వుండవు. అందులో
ఒకే పరమాత్మ అంశ మాత్రమువుండును. ఆ పరమాత్మ అంశయే ఆత్మగా మారిపోయి భగవంతుని శరీరమును
నడుపుచుండును. భగవంతుని శరీరములోని ఆత్మ జీవాత్మగా నటించుచూ అప్పుడప్పుడుగానీ, ఎప్పుడో ఒకప్పుడుగానీ,
ఆత్మగాయుంటూ సంపూర్ణ జ్ఞానమును బోధించును. ఈ విధముగా నిజమైన గురువుగా భగవంతుని శరీరములోని
ఆత్మకలదనీ, దానినిగానీ, భగవంతున్నిగానీ, ఎవరూ గుర్తించలేరని తెలుపుచున్నాము.
స్వర్గము నరకము అనునవి ప్రత్యేకమయిన లోకములు కాదు, ప్రత్యేకమయిన దేశములు కాదు, వాటికి
ప్రత్యేకమయిన ఇంద్రుడు, యముడు అను రాజులు లేరని ఇంతవరకు చదివిన వారికి ఎవరికయినా అర్థమయి
వుంటుంది. ప్రతి మనిషికీ అర్థము కావలసిన జ్ఞానము, అవసరమైన జ్ఞానము స్వర్గము నరకము యొక్క విధి విధానములు.
అయితే మనిషికి స్వర్గ నరక విషయములు ఏమాత్రము తెలియని దానివలన, పాపము అంటే భయము లేకుండా
51

Page 52
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పోయినది. పుణ్యము అంటే ఆసక్తి లేకుండా పోయినది. జ్ఞానమంటే శ్రద్ధ లేకుండా పోయినది. నిత్యము మనిషి
పాపపుణ్యముల నడుమ బ్రతుకుచున్నాడు. అయినా పాపపుణ్యముల గురించి తెలియ కుండానే బ్రతుకుచున్నాడు.
మనిషియొక్క బుద్ధి అంతయూ పైకి కనిపించే ప్రపంచ విషయములలోనే లగ్నమైపోయినది. కర్మను అనుభవించకుండా,
కర్మను ఆచరించకుండా భూమిమీద ఎవడుగానీ లేడు. ప్రతి నిమిషము, ప్రతి సెకండు (ప్రతి క్షణము) ప్రతి మనిషి,
ప్రతి జీవి కర్మను ఆచరించు చున్నది మరియు అనుభవించుచున్నది. ఈ విషయమును దృఢపరుచుటకు భగవద్గీత
యందు కర్మయోగమను అధ్యాయమున ఐదవ శ్లోకములో ఇలా కలదు.
శ్లో॥ :
నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః
భావము :- ఏ కార్యమునూ చేయకుండా ఎవడుగానీ ఒక క్షణము కూడ ఊరకవుండలేడు. ప్రకృతి జనిత గుణములకు
కట్టుబడి మనుషులందరూ పాపపుణ్య కర్మల వశులై మంచి చెడు కార్యములను చేయుచుందురు.
భగవంతుడు పైన చెప్పిన మాటప్రకారము ప్రతి మనిషీ కర్మబద్ధుడై యుండి, కార్యములను చేయుచునే యున్నాడు.
మనిషి ఏ కార్యము చేయకుండా ఒక్క క్షణమైననూ ఊరక ఉండుటకు వీలులేదు. కాలము గడుస్తున్నదంటే కర్మ
జరుగుచున్నదని అర్ధము. కార్యములు బయటి ప్రపంచములో ప్రత్యక్షముగా జరుగుచున్నా, ఆ కార్యములకు కారణమైన
కర్మ శరీరములోపల తలయందు కర్మచక్రములో నిక్షిప్తమైయున్నది. మనిషి తల కనిపించినా తలలోని కర్మచక్రము
ఎవరికీ కనిపించదు. కర్మచక్రమే కనిపించనప్పుడు దానిలోని కర్మకూడా ఎవరికీ తెలియదు. అందువలన ఏ కార్యమునకు
ఏ కర్మ కారణమో ఎవరికీ తెలియని రహస్యమైనది. బయట కనిపించే ప్రపంచమునకంతటికీ, ప్రపంచములో జరుగు
క్రియలన్నిటికీ కనిపించని కారణమున్నదని తెలియని మనిషి అంతర్ముఖముగా ఏనాడూ చూడలేదు. తనదృష్టినంతటినీ
బాహ్య వ్యవహారముల మీదనే లగ్నము చేసి అన్ని పనులకూ డబ్బే కారణమనుకొంటున్నాడు. ఆ డబ్బు సంపాదన
కొరకు బయటి విద్యలు నేర్చుకొనుచున్నాడు. బయటి విద్యలు నేర్వడానికి జీవితములో ముఫ్పై సంవత్సరముల
కాలమును వినియోగించుకొంటున్నాడు. బయట ప్రపంచములో ఎన్ని విద్యలు నేర్చినా చివరకు కర్మప్రకారమే జరుగుననీ,
కర్మప్రకారమే డబ్బు లభించుననీ, కర్మప్రకారమే ధనికుడుగా గానీ, పేదవాడుగాగానీ భూమిమీద బ్రతుకవలసి వచ్చునని
తెలియలేక పోవుచున్నాడు.
బయట ప్రపంచములో బ్రతుకుటకు లోపలికర్మ కారణమని తెలియని మనుషులు, తమ బుద్ధి ప్రకారమే బయట
పనులు జరుగుచున్నవనీ, తెలివున్నవాడు (బుద్దిగలవాడు) బాగా బ్రతుకగలడనీ, బుద్ధిలేనివాడు ప్రపంచ ములో బాగా
బ్రతుకలేడని అనుకొనుచుందురు. బయట ప్రపంచములో బుద్ధి ఉపయోగపడుచున్న మాట వాస్తవమే అయినా,
బుద్ధి కర్మనుబట్టియే ఉండుననీ, ఎవని కర్మనుబట్టి వాని బుద్ధియుండుననీ తెలియదు. ప్రపంచములో అందరికీ ఒకే
బుద్ధి లేకుండా వేరువేరు బుద్ధులుండుటకు కారణము వాని కర్మ వేరువేరుగా యుండడమనే చెప్పవచ్చును. బ్రతుకు
తెరువుకు తలలోని బుద్ధే కారణమనుకొను మనుషులు, బ్రతుకుతెరువుకు సంబంధించిన అన్ని కార్యములకు కర్మే
కారణమనీ, బుద్ధి కారణము కాదనీ తెలియలేకపోవుచున్నారు. తమ బ్రతుకుతెరువు, తమ ఇష్టము, తాము ఏ పనయినా
చేసి బ్రతుకుతాము, కర్మాలేదు గిర్మాలేదు అనువారు కూడా కలరు. అటువంటివారు ఒక మతములోనే కాకుండా,
మూడు మతములలో యున్నారు. పూర్వము ఎంతో జ్ఞానమునుకల్గియున్న హిందువులే (ఇందువులే) నేడు అజ్ఞానముగా
52

Page 53
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
మాట్లాడుచున్నారు. కర్మసిద్ధాంతమును చెప్పుకొను హిందువులే, నేడు అజ్ఞాన దిశవైపు ప్రయాణిస్తూ, కర్మను పూర్తి
మరచిపోయి అన్ని కార్యములకు మనిషి తెలివే కారణమని అంటున్నారు. మనిషి బుద్ధిని ఉపయోగించి రైళ్ళు,
విమానములను, కంప్యూటర్లనూ, రోబోలనూ, టెలివిజన్లనూ, సెల్ఫోన్లనూ కనుగొనడమేకాక చంద్రగ్రహము మీద
దిగడము, కుజగ్రహమునకు పోవడము జరుగుచున్నదనీ, ఇంటర్ నెట్ను స్థాపించి ప్రపంచమునంతటినీ ఒక్కచోట వుండి
చూస్తున్నాడని చెప్పు చున్నారు. అయితే బయట ఎంత అభివృద్ధి అయినా, ఎంత గొప్ప కార్యములను చేసినా అవన్నియూ
మనిషి తెలివివలననే జరిగినా, ఏ మనిషికి ఏ తెలివి ఉండాలని నిర్ణయించునదీ, ఏ మనిషి దేనిని కనిపెట్టవల యునో
నిర్ణయించునదీ, మనిషి వెనుకాలవున్న బుద్ధికాదనీ, బుద్ధివెనుకాల యుండు కర్మనీ, కర్మను అనుసరించే భూమిమీద
ప్రతి కార్యమూ జరుగు చున్నదనీ, అన్నీ కార్యములు కర్మనుబట్టి జరిగినవనీ మనిషి గ్రహించలేక పోయి, అన్నిటికీ తన
బుద్ధే కారణమని అనుకొంటున్నాడు.
మనిషి బ్రతుకుటకు బయట ప్రపంచములో ఎన్నో వ్యవస్థలు, ఎన్నో వ్యాపారములు, ఎన్నో ఉద్యోగములు, ఎన్నో
కర్మాగారములు ఉన్నట్లు, మనిషి శరీరములో కూడా ఎన్నో వ్యవస్థలు గలవు. బయట అన్ని వ్యవహారములకు డబ్బే
కారణమైనట్లు, శరీరములోని అన్ని వ్యవహారములకు కర్మే కారణమైవున్నది. శరీర బాహ్యయంత్రాంగము ఎన్నో విధముల
ఉన్నట్లు, శరీర అంతరంగమున శరీర యంత్రాంగము కూడా ఎన్నో విధముల గలదు. బయటి వ్యవహారములన్నియు
డబ్బుతో నడచినట్లు లోపల శరీర యంత్రాంగమంతయూ కర్మతో నడుచుచున్నది. శరీర యంత్రాంగములోని కర్మనుబట్టి
వాని బుద్ధి, మనస్సు, చిత్తము, అహము పనిచేయును. మనస్సు, చిత్తము, అహము యొక్క పని అందరికీ తెలియకున్నా,
బుద్ధి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా పనిచేయునని అందరికీ తెలుసు. అయితే బుద్ధి వారి వారి మేధస్సునుబట్టి
పనిచేయుచుండునని మనిషి అనుకొంటున్నాడు. మనిషిలోని మేధస్సు (బుద్ధి కుశలత) కూడా అతనిలోని కర్మనుబట్టియుండు
నని తెలియకుండాపోవడమునే అజ్ఞానము అంటున్నాము.
అజ్ఞానము వలన మనిషి తాను ఏమి చేయుచున్నానని ఏమాత్రము ఆలోచించడు. అంతేకాక తాను చేయు
పనియంతయూ సక్రమమైనదేనని అనుకోవడము జరుగుచున్నది. తనకు తెలిసినదే జ్ఞానమనుకొన్న మనిషి తాను
అక్రమమైన పనిని చేయుచున్నా, తాను చేయునది సక్రమమే ననుకొనుటకు కారణము, తనకు తెలిసినదే సరియైనదని
నమ్మడము. మనిషి నిత్యము తాను స్వర్గమునో, నరకమునో అనుభవించుటకు కదిలి పని చేయుచున్నాడు. తాను
చేయు పని వలన తనకు సుఖమో, దుఃఖమో కల్గుచున్నా, సుఖదుఃఖములు తెలియుచుండినా, వాటిని స్వర్గనరకములుగా
లెక్కించలేదు. అంతేకాకుండా తాను ఏదో ఒకటి అనుభవిస్తూ ఇతరుల పాపపుణ్యములను అనుభవింపజేయుచున్నానని
అనుకోవడములేదు. తాను బాధను (నరకమును) అనుభవిస్తూ ఇతరులకు సుఖమును (స్వర్గమును) అందించుచున్నానని
అనుకోవడము లేదు. అట్లే తాను సుఖమును (స్వర్గమును) అనుభవిస్తూ ఇతరులకు నరకమును (కష్ట, నష్ట, బాధలను)
చూపిస్తున్నానని తలచడము లేదు. తాను స్వయముగా ఏదో ఒక సమయములో స్వర్గమునో, నరకమునో అనుభవిస్తూ
అదే సమయములో ఇతరులకు స్వర్గమును అనుభవింపజేయు దేవబంటునిగానో (గంధర్వుని గానో) లేక నరకమును
అనుభవింపజేయు యమకింకరునిగానో ఉన్నానని కూడా మనిషికి తెలియదు.
భూమిమీద ఒక మనిషి తాను బాధపడుచూ ఇతరుల పాలిట దేవ బంటుగానో, లేక తాను సుఖమును పొందుచూ
ఇతరుల పాలిట యమ కింకరునిగానో ఉన్నానని ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఉదాహరణకు కొన్ని సంఘటనలను
చూస్తే ఆ విషయము పూర్తి అర్థము కాగలదు. ఒక వ్యక్తిని ఒక కిలోమీటరు దూరము రిక్షాలో తీసుకొనిపోవుటకు పది
53

Page 54
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
రూపాయలు కూలి ఉందనుకొనుము. రిక్షావాడు ప్యాసింజరు కోసము చూస్తున్నాడు. మధ్యాహ్నానికి తన కుటుంబము
అన్నము తినాలంటే అంత లోపల రిక్షాలాగి వచ్చిన డబ్బులను ఇంటివద్ద ఇవ్వాలి. దానికొరకు ఉదయము ఆరుగంటలకే
బస్టాండుసెంటరులో ఎవరయినా రిక్షాను అడుగు తారేమోనని రిక్షావాడు చూస్తున్నాడు. దురదృష్టముకొద్దీ అందరూ
ఇతరుల రిక్షాలు ఎక్కుచున్నారు గానీ తన రిక్షావద్దకు ఒక్కరు కూడా రాలేదు. ఉదయము ఎనిమిది గంటలయినది.
అంతలో ఆకాశమున మేఘములు రావడమూ, చిన్నగా వర్షము రావడము మొదలయినది. వర్షములో ఎవరూ రిక్షా
ఎక్కరు అని రిక్షావాడు నిరాశగా యున్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి రిక్షావస్తావా! అని అడిగాడు. రిక్షావాడు
వస్తానన్నాడు. ఎంత ఇవ్వాలి? అని వచ్చిన వ్యక్తి అడిగాడు. అప్పుడు రిక్షావాడు వచ్చిన వ్యక్తి క్రొత్తవాడని తలచి, అతనికి
రేటు గురించి తెలియదని ప్యాసింజరు పోవలసిన కిలోమీటరుకు దూరమునకు వందరూపాయలను అడిగాడు. న్యాయముగా
కిలోమీటరు పదిరూపాయల రేటు ఉండగా, వర్షము వస్తున్నదని ఇంకొక ఐదురూపాయలను ఎక్కువ అడుగవచ్చును.
అట్లుకాకుండా క్రొత్తవాడు దొరికాడు డబ్బు ఇస్తాడులేయని ఏకంగా వందరూపాయలడిగాడు. ప్యాసింజరు “అంతనా!
వందరూపాయలంటే ఎక్కువ కాదా!” అని అడిగాడు. దానికి వర్షములో పోవాలి కదా! మీరు రిక్షా గూటిలో తడువకుండా
కూర్చుంటారు. నేను బయట తడుస్తూ రిక్షాను త్రొక్కాలి కదా!యని అడిగాడు. సరేనని ప్యాసింజరు వందకు ఒప్పుకొన్నాడు.
అంతలో ప్యాసింజరుకు తనమూట జ్ఞాపకమువచ్చి, బస్టాండులో 25 కేజీల రాతిబొమ్మ ఉంది దానిని తీసుకొని పోవాలన్నాడు.
దానికి రిక్షావాడు రిక్షా లోపలికిరాదు సార్, నేను వచ్చి తెచ్చుకొనుటకు ఇక్కడ కూలీలకు నేను యాభైరూపాయలు
ఇవ్వాలి. వారే తెచ్చుటకు వందరూపాయలు అడుగుతారని చెప్పి తానే ఆ బొమ్మను తెచ్చి రిక్షాలో పెట్టుకొని రిక్షాను
వర్షములోనే లాగుచూ పోవుచున్నాడు.
ఇదంతయూ మీకు మాకు తెలిసినట్లు బయట జరిగిన సమాచారము. అయితే మనకు తెలియకుండా
రిక్షావాని శరీరములో జరిగిన విషయము ఏమనగా! రిక్షావాడు శరీరములో డబ్బు ఆశతో డబ్బుకొరకు బస్టాండు
దగ్గరయున్నాడు. వాడు అక్కడ కాచుకొని ఉండడమునకు కారణము ఆశ అను గుణము ప్రేరణవలన అతను అక్కడ
ఉన్నాడు. దానికంటే ముందు తన భార్య పిల్లలకు డబ్బు ఇవ్వాలను మోహగుణము చేత ఇంటివద్దనుండి బయలుదేరివచ్చాడు.
తన భార్యా పిల్లలకొరకు పని చేయాలనుకోవడము మోహగుణముకాగా, వారికొరకు డబ్బు కావాలనుకోవడము ఆశ
అను గుణము (కామమను గుణము) పని చేసినదని చెప్పవచ్చును. ఈ విధముగా రెండు గుణములచేత ప్రేరేపింప
బడినవాడై బస్టాండులో పనిచేయుటకు సిద్ధముగాయున్న వానికి ఎనిమిది గంటలవరకు నిరాశే మిగిలినా, నా భార్యా
పిల్లలు పస్తులుంటారే యను మోహగుణము ఒకవైపు పీడించుచుండగా, చివరకు ఒక ప్యాసింజరు దొరికాడు. అంతవరకు
బయట పనిని చేయకున్నా, బయట సుఖదుఃఖము లను అనుభవించకున్నా లోపల మాత్రము జీవుడు ఒకవైపు మోహగుణము
తోనూ, మరొకవైపు కామ (ఆశ) గుణముతోనూ బాధపడడము జరిగినది. అంతవరకు అనగా ఎనిమిది గంటల వరకు
రిక్షావాని శరీరములో జీవుడు ఒక విధమైన నరకమును అనుభవించాడనియే చెప్పవచ్చును. అప్పుడు వాని శరీరములోని
ఆత్మయే గుణముల ప్రేరణ చేసి వాటితో బాధించినది. అంటే ఆ బాధలను శరీరములోని ఆత్మే స్వయముగా గుణములచేత
కల్గించినది, కావున దానిని స్వయముగా యముడే విధించిన బాధయని చెప్పవచ్చును. రిక్షావాడు శరీరములో అనుభవించిన
కొద్దిపాటి బాధను నరకమనీ, దానిని యముడే అమలు చేశాడని చెప్పవచ్చును.
ఇదంతయూ లోపల జరిగిన విషయముకాగా, ఇప్పుడు బయటి విషయానికి వస్తాము. రిక్షావాడు వర్షములోనే
రిక్షాను త్రొక్కుచున్నాడు, ప్యాసింజరు మాత్రము రిక్షాలోపల ఏమాత్రము తడువకుండా కూర్చొని యుండగా, రిక్షావాడు
వర్షములో చమటలు వచ్చేలాగా రిక్షాను లాగుచున్నాడు. వర్షముతోపాటు గాలి ఎక్కువగా ఉండడము వలన, ఆ గాలి
54

Page 55
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
రిక్షాకు ఎదురుగా వీస్తుండడము వలన, రిక్షాను బలముగా త్రొక్కవలసి వచ్చినది. కూర్చున్న మనిషి బరువు దాదాపు
వంద (100) కేజీలుండగా అతనితో పాటున్న బొమ్మ బరువు 25 కేజీలు మొత్తము 125 కేజీల బరువును రిక్షాలో
పెట్టుకొని ఎదురు గాలికి వర్షములో రిక్షాను లాగడమును చూస్తే మాకు ప్రత్యక్ష నరకము కనిపించుచున్నది. రిక్షావాడు
వర్షములో ఎదురు గాలికి 125 కేజీల బరువును పెట్టుకొని ఆ సమయములో పని చేయడము లోపలి గుణముల
ప్రభావమేననీ, ఆ గుణములను ఆత్మే ప్రేరేపించినదనీ తెలియుచున్నది. పోయిన జన్మలో రిక్షావాడు చేసుకొన్న పాపము
కొంత ఆ రూపములో అమలు జరుగుచున్నదని తెలిసినది. ఆత్మ ప్రేరేపించగా రిక్షాలో కూర్చున్నవాడు ఆ సమయమునకు
యమకింకరుడుకాగా, అప్పుడు జరుగుచున్నది నరక బాధయేనని అర్థమయినది. ఒకవేళ రిక్షాను ఆపి ప్రక్కన నిలబెట్టుకొంటే
యమకింకరుడుగాయున్న ప్యాసింజరు 'పోనీ! నేను తొందరగా పోవాలి' అంటాడు. 150 రుపాయలు డబ్బులిస్తున్నా
కదా! నన్ను తీసుకపోవలసిందే! అంటాడు. ఆలస్యమయితే 100 రుపాయలే ఇస్తాను అంటాడు. వచ్చే డబ్బును
పోగొట్టుకోలేక డబ్బు మీద ఆశతో భార్యాపిల్లల మీదున్న మోహముతో అతడు రిక్షాలాగుచూ పాపమును ఆ రూపములో
అనుభవిస్తుండగా, రిక్షాలో కూర్చున్నవాడు ఆ సమయములో ఎటువంటి బాధలేకుండా సుఖమునే అనుభవిస్తున్నాడని
చెప్పవచ్చును.
ఒకే సమయములో ఒకే సంఘటనలో ఒకడు రిక్షానులాగుచూ బాధపడుచుంటే, ఒక విధముగా నరకమును
అనుభవిస్తుంటే, రిక్షాలో కూర్చున్నవాడు సుఖమును అనుభవిస్తున్నాడు. అంటే ఒక విధముగా స్వర్గమును
అనుభవించుచున్నాడు. ఒకే సంఘటనలో ఒకడు నరకమును, ఒకడు స్వర్గమును అనుభవించునట్లు కనిపించడమేకాక,
నరకమును అనుభవించు రిక్షావానికి ఆ సమయములో ప్యాసింజరే యమకింకరుడుగా యున్నాడని అర్థమగుచున్నది.
ఇట్లు భూమిమీద ఆత్మే అనేక సంఘటనలను గుణ ప్రేరణచే కల్గించి, జరుగునట్లు చేసి, మనుషులనే యమకింకరులుగా,
ఇంద్ర భటులుగా చేసి ఒకరి చేత మరొకరు పాపపుణ్యముల ఫలితము లయిన స్వర్గనరకములను అనుభవించునట్లు
చేయుచున్నది. కొన్ని సందర్భములలో ఆత్మ గుణములచే బయటి పనులు చేయించకుండా లోపలనే బాధపడునట్లు
చేయుచూ తానే యమధర్మరాజుగాయున్నది. కొన్ని సందర్భములలో బయటినుండి వచ్చు రోగక్రిములను శరీరములోనికి
ప్రవేశించునట్లు చేసి, ఆ రోగక్రిముల చేత రోగమును కల్గించి తానే రోగమునకు బలమునిచ్చి శరీరములోని జీవున్ని
బాధించునట్లు చేసి యముని పాత్రను పోషించుచున్నాడు. మనిషి చేసుకొన్న పాపములను అనేక బాధలచేత, అనేక
కష్టములచేత, అనేక హింసలచేత, అనేక రోగముల చేత ఆత్మే స్వయముగా హింసించుచూ యమునిగా, ఇతరుల చేత
హింసించుచూ వారిని యమకింకరులుగా చేయుచున్నది.
23-09-2014 మంగళవారము ఉదయము దాదాపు పదిగంటల ప్రాంతములో ఢిల్లీ జూపార్కులో ఒక సంఘటన
జరిగినది. ఆ సంఘటన కెమెరాలో రికార్డయినది. దానినే అన్ని టీవీ ఛానళ్ళలో ప్రసారము చేసి చూపించారు.
వాస్తవముగా అక్కడ జరిగిన సంఘటన ఇలాగున్నది. ఢిల్లీ జూపార్కులో ఒక సందర్శకుడు తనవద్దయున్న కెమెరాతో
తెల్లపులిని ఫోటో తీయాలని పులి ఆవరణమునకు దగ్గరగా పోయి ఫోటోలు తీయుచున్న సమయములో కాలు జారిందో,
చేయిజారిందో తెలియదుగానీ మొత్తము మీద పులి యొక్క ఆవరణములోనికి పడిపోవడము జరిగినది. పులి ఆవరణమునకు
పెద్దగోడ ఎత్తుగావుండి ఆవరణము అంచున నీటితో నింపిన గుంతయుంటుంది. బయటగోడ మూడడుగుల ఎత్తుండి
దానిమీద ముళ్ళకంచె కూడా ఉంటుంది. మొత్తము మీద బయట కంచెతోపాటు ఏడు అడుగులుండగా లోపల పదిహేను
అడుగుల వరకు గుంతయుంటుంది. అటువంటి స్థలములో లోపల పడినవాడు బయటికి వచ్చు అవకాశమే ఉండదు.
55

Page 56
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
పులిని ఫోటో తీయాలను ఉద్దేశ్యముతో కంచెకు దగ్గరగా ఎక్కి ఫోటో తీయునపుడు లోపలికి పడిపోవడము జరిగినది.
అప్పుడు తెల్లపులి అతనికి దగ్గరగా వచ్చినది. అతను ఎటూ పోలేక గోడవద్ద కూర్చొని ఏడుస్తూ నన్ను ఏమీ చేయవద్దని
చెప్పుచూ ఒకవైపు చేతులెత్తి మ్రొక్కుచున్నాడు. అలాపడిన యువకున్ని పులి నిలబడి గమనిస్తున్నది. ఒకవైపు బయట
గోడవద్ద జూపార్కును చూడవచ్చిన జనము అరుస్తుండగా పది నిమిషములు అతని ముందరే ఆగియున్న పులి చివరకు
అతని మెడను పట్టుకొని లోపలకు లాగుకొని పోయింది. అందరూ చూస్తుండగానే ఆ పని జరిగిపోయింది. చివరకు
ఆ యువకున్ని పులి మెడకొరికి చంపివేసింది.
ఈ సంఘటన యదార్థముగా ప్రత్యక్షముగా జరిగినది. అయితే స్వర్గ నరకముల సమాచారమునుబట్టి చూస్తే,
పులియొక్క ఆవరణములోనికి పడిన యువకుడు భయముతో వణికిపోతూ కొద్దిసేపు నరకమును అనుభవించాడనీ, ఆ
సమయమునకు పార్కులోని పులియే యమకింకరుని పాత్రలోయున్నదని చెప్పవచ్చును. పులి ఆవరణ లోపల పడినవానికి
ఆ సమయము నరకముకాగా, పులికి మాత్రము మంచి రుచికరమైన ఆహారము, వేడి రక్తమును రుచి చూచి సుఖమును
అనుభవించినది. ఆ సంఘటన అతనికి నరకముకాగా, పులికి స్వర్గమయినదని చెప్పవచ్చును. ఈ విధముగా
విశ్లేషించుకుంటూపోతే, భూమిమీద అనేక సంఘటనల రూపములో స్వర్గ నరకములు జరుగుచున్నవని తెలియుచున్నది.
మనిషికి ఎన్ని ప్రపంచ విద్యలు వచ్చినా, అన్ని విషయములలో ఎంతో తెలివియున్నా, అదంతయూ బయటదయిన
దానివలన లోపలి శరీరములో ఏమీ జరుగుచున్నదీ తెలియలేకపోవుచున్నాడు. శరీరాంతర్గత యంత్రాంగమును తెలియ
గల్గినవాడు జ్ఞానియగును. భగవద్గీతలో ప్రతి శ్లోకము శరీర అంతర్గత విషయములను గురించియే చెప్పారు. మనిషి
దైవజ్ఞానమును చౌకగా చేసుకొని హేళనగా మాట్లాడుచున్నాడు తప్ప, జ్ఞానము అంటే తన శరీర ములోని విషయములను
తెలియడమేనని గ్రహించలేకపోయాడు.
శరీరము లోపల జరుగు అంతరంగముల పనిని గూర్చి తెలియనివాడు. లోపల గుణములనుగానీ,
అంతరంగములనుగానీ, అంతరంగము లను నడుపు ఆత్మనుగానీ తెలియలేడు. అంతరంగములో జరుగు కార్యములను
గురించి తెలియనిదే, బయట జరుగు సన్నివేశముల విచక్షణ గానీ, వివరముగానీ తెలియదు. అట్లుండుట వలన
బయట ప్రపంచములో మనముందరే జరుగు నరకమునుగానీ, స్వర్గమునుగానీ తెలియకున్నాము. బయట ప్రత్యక్షముగా
జరుగు ప్రతి కార్యమునకు కర్మ కారణమనీ, కర్మనునది శరీరములో తలయందు కర్మచక్రములో నిక్షిప్తమై యున్నదనిగానీ,
ప్రతి శరీరములోని ఆత్మ తలలోని కర్మను అనుసరించి గుణములను ప్రేరేపించుచున్నదనిగానీ, గుణముల మాయవలననే
ప్రపంచములో అందరూ అన్ని పనులలో లగ్నమై పనిచేయుచున్నారనిగానీ, ఆ పనులే కొందరికి నరకముగా, కొందరికి
స్వర్గముగా పరిగణించబడుతున్నా యనిగానీ ఎవరికీ తెలియకుండా పోయినది.
భూమిమీద అన్ని విధముల జ్ఞానమును మనుషులు తెలియుటకు మూడు గ్రంథముల రూపములో దేవుడు
జ్ఞానమును ఇచ్చాడు. మొదట ద్వాపర యుగములోనే భగవద్గీతను ఇచ్చిన దేవుడు, దానిని ధృవీకరించుటకు లేక
ముందు చెప్పిన జ్ఞానము గొప్పదని చెప్పుటకు, మిగతా రెండు గ్రంథములను ఇచ్చి ఆ రెండు గ్రంథములలో కూడా
ముందు చెప్పిన గ్రంథములోని జ్ఞానమునే చెప్పాడు. అయితే మనిషి ముందర నేడు మూడు గ్రంథము లున్నా మనుషులు
మాత్రము తాను పుట్టిన సమాజమిదియనీ, ఈ సమాజము వారు ఈ గ్రంథమునే చదువవలెననీ నియమమును
ఏర్పరుచుకొనీ, ఒక్కొక్క మతమువారు ఒక్కొక్క గ్రంథమును ఎన్నుకొని ఇది మా గ్రంథము అంటున్నారు. గ్రంథములను
వేరుచేసినవారు వారి మతములను కూడా వేరు చేసుకొని, వారి జ్ఞానమును కూడా వేరు చేసుకొని, చివరకు వారి
56

Page 57
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
దేవున్ని కూడా వేరు చేసుకొన్నారు. మా మతము ప్రత్యేక మైనది, మా గ్రంథము ప్రత్యేకమైనది, మా జ్ఞానము కూడా
ప్రత్యేకమైనదని చెప్పుచున్నారు.
ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడు, ఒకే జ్ఞానమున్నదనీ, ఒక్కొక్క మతమునకు, ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క
దేవుడు లేడని మేము అనేకమార్లు చెప్పాము. మేము వ్రాసిన గ్రంథములలో కూడా వ్రాశాము. అయినా ఎవరి
అజ్ఞానము ప్రకారము వారు మాట్లాడుచునేయున్నారు. ఉదాహరణకు క్రైస్తవులు “మా ప్రభువుతప్ప దేవుడే లేడు, మా
ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు అలా ఏ దేవుడైనా తిరిగి లేచాడా” అని అడుగుచున్నారు. చనిపోయి తిరిగి లేచినవాడు
దేవుడని ఏసు చెప్పలేదు. బైబిలు గ్రంథములోనూ లేదు. అయినా గ్రంథములోలేని విషయమును, దేవుడు చెప్పని
విషయమును పట్టుకొని చనిపోయి తిరిగి లేచినవాడు దేవుడు అని మొండిగా వాదిస్తే దానికి ఎవరూ ఏమీ చెప్పలేరు.
అదే నిజమైనమాట అయితే ఏసు సమక్షములోనే చనిపోయినవారు తిరిగి లేచారు.
అనాలా? అట్లు అనుటకు వీలులేదు. మొత్తానికి “చనిపోయి లేచిన వాడు దేవుడు” అను సూత్రమే తప్పగును. కొందరు
ఈ విధముగా గ్రంథములో లేని విషయమును చెప్పుకొనుచుందురు. మరికొందరు గ్రంథములో ఉన్న విషయమును
అవగాహన చేసుకోలేక తప్పుగా భావించి వేరుగా చెప్పుకొనుచుందురు. ఉదాహరణకు ఖుర్ఆన్ గ్రంథములో ఆరవ
సూరా రెండవ ఆయన్ను చూస్తాము.
అప్పుడు వారిని దేవుళ్ళు అని
(6-2) “ఆయన మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్ధారించాడు. మరో నిర్ణీత గడువు
మాత్రము అల్లాహ్ వద్దనే యున్నది. అయినా మీరు సంశయానికి లోనైయున్నారు” అని ఉన్నది. ఈ వాక్యము చివరిలో
మీరు సంశయానికి గురైయున్నారు అని వుంది. ఆ మాటకు అర్థము ఈ వాక్యము మీకు సరిగా అర్థము కాలేదని
చెప్పినట్లున్నది. అంతేకాక మీరు నేను చెప్పినమాటను గ్రహించక నా మాటమీద అనుమానము కల్గియున్నారని
చెప్పినట్లు కలదు. చివరిమాటను అటుంచి ఆ వాక్యములోని ముఖ్యమైన సమాచారమును చూస్తే, అక్కడ చావుపుట్టుకల
విషయమును గురించి ఈ వాక్యము చెప్పారని తెలియుచున్నది. అక్కడ చెప్పిన దానిని వివరించుకొని చూస్తే ఇలా
కలదు. దేవుడు మనుషులను పంచభూతములయిన ప్రకృతితో చేశాడు. ఆ విషయము అందరికీ అర్థమగుటకు
మిమ్మల్ని మట్టితో చేశాడని వాక్యములో చెప్పారు. దేవుడు మనిషిని ప్రకృతితో చేసిన తర్వాత ఇతను ఇంతకాలమే
బ్రతకాలి తర్వాత చనిపోవాలని ఒక గడువును నిర్ణయించాడు. అనగా ఆయుష్షును నిర్ధారించి పెట్టాడు. ఒక మనిషిని
పుట్టించి మరణమును నిర్ణయించినట్లే, అతని మరొక మరణము యొక్క నిర్ధారణ దేవునికి తెలుసు అని చెప్పారు. ఇక్కడ
ఒక గడువు మరణము అయినప్పుడు, మరొక గడువు కూడా మరణమే అగును కదా! రెండు మరణముల గడువులు
దేవునివద్దయున్నాయి అన్నప్పుడు రెండవ పుట్టుక కూడా ఉన్నదనియేగా అర్థము. ఇక్కడ ఈ వాక్యములో ఒక జన్మ
తర్వాత రెండవ జన్మను కూడా దేవుడు నిర్ణయించిపెట్టాడు అని నాకు స్పష్టముగా తెలియుచున్నది. అయితే ముస్లీమ్లందరూ
మనిషి ఒకమారే పుట్టి ఒకమారే చనిపోతాడు. రెండవ జన్మ మనిషికి లేదు అంటున్నారు. నాకు రెండవ జన్మ ఉన్నదని
గ్రంథములోకలదనీ, దేవుడు చెప్పాడనీ అర్థమవుచుండగా, ముస్లీమ్లకు ఈ వాక్యములో రెండవ జన్మ లేనట్లు, రెండవ
మరణము లేనట్లు అర్థమయినది.
ఈ వాక్యము మనుషులకు అందులో ముఖ్యముగా ముస్లీమ్లకు అర్థము కాలేదు కనుక ముందే మీరు సంశయానికి
గురైయున్నారని కూడా చివరిలో చెప్పడము జరిగినది. ఇదే విధముగా ఖుర్ఆన్లోని చాలా వాక్యములకు అర్థము
తెలియక అపార్థము చేసుకోవడము జరిగినది. అట్లే స్వర్గనరకముల విషయములో కూడా ముస్లీమ్లు ఖుర్ఆన్లో
దేవుడు చెప్పిన విధానమును అర్థము చేసుకోలేదు. మనిషి చనిపోయిన తర్వాత, తిరిగి సమాధినుండి లేపబడిన
57

Page 58
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
తర్వాత, స్వర్గ నరకములు అనుభవిస్తాడని అనుకొన్నారు. ఒకరి తలలో అర్థమయిన విషయమును వారు ముస్లీమ్
లందరికీ బోధించగా, ముస్లీమ్లందరూ అదే విషయమును నమ్మియున్నారు. వారి నమ్మకము ప్రకారము స్వర్గము
దేవునివద్దయుందనీ, మంచి ప్రవర్తన కల్గినవాడుగానీ, దేవుని ప్రార్థనలలో పాల్గొన్నవాడుగానీ, దేవుని కొరకు యుద్ధము
చేసి చనిపోయినవాడుగానీ, దేవునివద్దయున్న స్వర్గమునకు పోవుననీ, స్వర్గములో అనేక సుఖములు అనుభవించుచూ
ఎల్లకాలము అక్కడేయుండవచ్చుననీ, స్వర్గములో అందమైన ఆడవారు వీరికోసము కాచుకొనియుందురనీ అందరూ
అనుకోవడము జరుగుతున్నది.
ఏ జ్ఞానమూలేని ముస్లీమ్ యువకునికి స్వర్గము పేరుచెప్పి, “అక్కడ సుఖములుంటాయి. హాయిగా బ్రతుకవచ్చు,
ఎందరో సేవచేయువారు కూడా ఉంటారు. అందమైన ఆడవారు నీకోసముంటారు” అని సుఖముల గురించి చెప్పి
సుఖముల ఆశచూపి మేము చెప్పినట్లు వింటే, నీవు చనిపోతే అల్లాహ్ నిన్ను స్వర్గానికి పంపుతాడు అని ప్రలోభ పెట్టి
మరణమును సహితము లెక్కచేయకుండా చావుకు సిద్ధపడునట్లు చేయుచున్నారు. వారికి దేవుడు చెప్పిన ఏ జ్ఞానమూ
తెలియకున్నా దేవునికొరకు చనిపోతే దేవునివద్దకు పోతాము అక్కడ స్వర్గముంటుంది. స్వర్గములో బ్రతుకుతెరువు
చింతయే ఉండదు. త్రాగేదానికి ద్రాక్షరసము, తినేదానికి మంచి తిండి, కాలము గడచుటకు మంచి అందమైన ఐదారుమంది
స్త్రీలు ఉంటారన్నది మాత్రము తెలుసు. భూమిమీద బ్రతుకు బరువైనవారు, ధనములేనివారు, ఆహారము లేనివారు
పైనగల స్వర్గముకొరకు ఏమయినా చేస్తారు. ఒకమారు దేవుని కొరకు చనిపోతే శాశ్వతముగా స్వర్గములోయుండి
సుఖాలమధ్యలో జీవించవచ్చు, అందమైన ఆడవారితో కాలము గడుపవచ్చు అనుకొన్నవారు చావుకు సిద్ధపడి దేవునికొరకు
ఏదో ఒకటి చేసి తొందరగా చనిపోవాలని అనుకొనుచుందురు.
స్వర్గము కొరకు చనిపోవాలని నిర్ణయించుకొన్న యువకులను పదిమందిని గుంపు చేసి ఇకపోయి చనిపోండని
చెప్పి పంపిన ఒక సంఘటన ఈ మధ్యకాలములో జరిగింది. స్వర్గము కొరకు పదిమంది చనిపోయారు. ఆ పదిమంది
కేవలము స్వర్గము కొరకే చనిపోయారని అర్థమగుచున్నది. ముస్లీమ్లలో తెలివైనవారు తాము చావకుండా ఇతరులకు
స్వర్గము ఆశచూపి, స్వర్గముకొరకు ప్రలోభపెట్టి, అదేపనిగా చనిపోవు కార్యక్రముల లోనికి దింపుచున్నారు.
ఖుర్ఆన్ఆగ్రంథములో 'జీహాద్' అను పదముకలదు, జీహాద్ అంటే 'పవిత్రయుద్ధము' అని అర్థము. పవిత్ర యుద్ధము
అంటే దేవునిమార్గములో పోరాటము అని అర్థము. దేవుని మార్గములో పోరాటము అంటే దేవుని జ్ఞానము
తెలుసుకోవడములో కృషి చేయడము అని అర్థము. యుద్ధము అంటే పోరాటము అని అర్ధముగానీ మనుషులను
చంపమని కాదు. మనకున్న చెడు గుణములతో పోరాడి, దేవుని జ్ఞానమును తెలుసుకోవడమే పవిత్రయుద్ధము. అట్లు
చెప్పకుండా, ఏమీ తెలియని యువకులకు, బ్రతుకుతెరువులో విసిగిపోయిన యువకులకు స్వర్గ సుఖముల ఆశచూపి,
స్వర్గము దేవునివద్దేయుందని స్వర్గమునకూ దేవునికీ లింకు ఏర్పరచి, స్వర్గము కావాలనుకొనువారు దేవునికొరకు
చనిపోవాలనీ, ముస్లీమ్లు కానివారిని చంపడము, దేవునికొరకు పోరాడడమనీ అదే పవిత్రయుద్ధమని చెప్పి ముస్లీమ్లు
కానివారిని విచక్షణ లేకుండా చంపమనీ, ఎంతమందిని చంపితే దేవునికి అంతదగ్గరవారగుదురని చెప్పడము వలన
పదిమంది యువకులు ఇతరులను చంపి తాము చచ్చుటకు నిర్ణయించుకొని పాకిస్థాన్ నుండి సముద్రమార్గములో
దొంగగా ముంబాయికి రావడము జరిగినది.
వచ్చిన యువకులందరూ చనిపోయి స్వర్గానికి పోవాలను ఉద్దేశ్యముతో వచ్చినవారేగానీ, తిరిగి తప్పించుకొని
పోవాలని ఒక్కరు కూడా అనుకోలేదు. వారి ఉద్దేశమంతా తాము చనిపోవులోపల ఎంతమందిని వీలయితే అంతమందిని
చంపాలనివుంది. పంపినవారు కూడా వారిని బాగా నమ్మించి, వారి చేత పని చేయించుకోవాలని పంపారు తప్ప,
58

Page 59
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఆ దినము
వారికి స్వర్గమొస్తుందని మాత్రము కాదు. అంతగ్యారంటీగా స్వర్గము వస్తుందని తెలిసియుంటే వారే వచ్చి చనిపోవచ్చు
కదా! అట్లు జరుగడములేదు. కొంతమంది స్వార్థవరులు, మతఛాందసవాదులు ఇతర మతములవారిని చంపుటకు,
ఏ జ్ఞానమూ తెలియని అమాయక యువకులను చావుకు సిద్ధము చేసి పంపుచున్నారు. స్వర్గము మీద ఆశతో, అందమైన
ఆడవారు దొరుకుతారను భ్రమతో, ఎప్పుడెప్పుడు చనిపోవాలాయని తొందరపడు వారిని ఎంచుకొని, ఆత్మాహుతిదాడులలో
పాల్గొనునట్లు చేసి, వారి ఇష్టముగా వారు చనిపోవునట్లు చేయుచున్నారు. ముంబాయిలో దాడిచేసిన పాకిస్థాన్ యువకులు
అదేపనిగా చనిపోయి అర్జంటుగా స్వర్గమునకు పోయి సుఖములు అనుభవించాలనుకొన్నారు.
మారణాయుధములతో దాడిచేసి చాలామందిని చంపగానే ముంబాయి పోలీసులు వారిని ఎదుర్కొనుటకు వచ్చారు.
అప్పటికే టీవీ ఛానళ్ళలో ఆ విషయమంతా ప్రసారమవుతుండగా యువకులను ప్రలోభపెట్టి ప్రేరేపించి పంపినవారు
జరిగే తతంగమునంతటినీ పాకిస్థాన్లో వుండి టీవీలో చూస్తూ యువకులతో ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో మాట్లాడుచూ,
పోలీసుల కదలికలను యువకులకు చెప్పుచూ, మారణ హోమమునకు పాకిస్థాన్నుండే డైరెక్షన్ చేస్తున్నారు. అప్పటికే
చాలామంది చనిపోవడము పోలీసులు, దేశభద్రతాదళములు చుట్టుముట్టడము జరిగినది. వచ్చినవారు చావుకు సిద్ధపడి
తొందరగా స్వర్గానికి పోవాలని వచ్చినవారు కావున, వారి కోర్కె మేరకే పోలీసుల దాడులలో వచ్చిన యువకులు
కొందరు చనిపోగా, ఒక ఉగ్రవాది కాలికి బుల్లెట్ తగిలి కుప్పకూలిపోయి ప్రాణము పోవు స్థితిలో ఫోన్లో మాట్లాడిన
మాటలు రికార్డయినాయి. ఉగ్రవాది కాలికి గాయము కాకముందునుండీ ఫోన్ కనెక్షన్లో యున్న వారితో గాయపడిన
యువకుడు “నాకు కాలికి గాయమయినది నేను లేవలేని స్థితిలో యున్నాను. నేను కొన్ని నిమిషములలో చనిపోతాను.
నేను స్వర్గానికి పోయేటట్లు దేవున్ని ప్రార్థించండి" అని అంటుండగా, పాకిస్థాన్ నుండి మాట్లాడువారు “మేము నీ కొరకు
అల్లాహ్ ను ప్రార్థించుచున్నాము. నీవు అల్లాహ్ కొరకు చనిపోతున్నావు కావున నేరుగా స్వర్గానికే పోతావు” అని అన్నారు.
ఇదంతా చూస్తే ఆ యువకులు ఘోరంగా మోసపోయారని ఆశ అను గుణముతో ఇతరుల మాటలను అడ్డంగా
విన్నారనీ, వారు విన్నట్లు, వారు అనుకొన్నట్లు దైవ గ్రంథమైన ఖుర్ఆన్లో లేదని అర్థమగుచున్నది. ఇతరులను
ప్రేరేపించి ఇక్కడ డబ్బు ఆశ చూపి, పైన స్వర్గము ఆశ చూపి మోసము చేయుచున్నారు. అలా ప్రేరేపించువారు
మాత్రము ఎక్కడా బయటికి రారు. మిగతావారంతా చనిపోయినా తాము మాత్రము తెలివిగా ప్రక్కన ఉంటారు. మీరు
స్వర్గమునకు పోవాలని దేవున్ని ప్రార్థించుచున్నామని చెప్పుచున్నారు. ముంబాయిలో చనిపోతూ స్వర్గము మీద ఆశగా
మాట్లాడిన యువకుడు చనిపోయాడుగానీ స్వర్గమునకు పోలేదు. అలా చనిపోయిన వారు స్వర్గమునకు పోతారని
దేవుడు ఎక్కడా చెప్పలేదు. అయితే ఆ యువకులు స్వర్గము మీద అక్కడి సుఖములమీద ఆశ పడి వచ్చారు గానీ వారు
స్వర్గముకు పోలేదు. వారిచావు అకాలమరణము క్రిందికి వస్తుంది కావున వారందరూ దయ్యాలయి బ్రతికేయున్నారు.
వారు చనిపోయిన తర్వాత తాము ఎంత మోసపోయినది వారికి అర్థమయినది. స్వర్గము మీద ఆశతో చనిపోవాలని
చనిపోయినా వారికి స్వర్గము రాలేదుగానీ, వారు దయ్యాలయి నిత్యము నరకమును అనుభవిస్తున్నారు. చనిపోయిన
తర్వాత ఏమి తెలిసినా ముందు జీవితము రాదు కదా! అటువంటివారి జీవితము ఉట్టికీ స్వర్గానికి రెండిటికీ
లేకుండాపోయినది.
ఈ విధముగా దేవుని జ్ఞానము తెలియనివారందరూ అజ్ఞానముతో కూడుకొని తమకిష్టమొచ్చినట్లు అనుకొని,
అదే దైవజ్ఞానము అనుకొంటే ఏమీ ప్రయోజనముండదు. స్వర్గము, నరకము ఉన్నాయిగానీ ముస్లీమ్లు అనుకొన్నట్లుగాలేవు.
ఖుర్ఆన్ గ్రంథము ముస్లీమ్ పెద్దలకే సరియైన భావములో అర్థము కాలేదని ఈ సంఘటనతో తెలిసింది. స్వర్గ
నరకములను గురించి మేము సత్యము చెప్పితే ఇతర మతములవారికంటే ముందు ఇందువులే (హిందువులే) మా మీద
59

Page 60
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
వ్యతిరేఖముగా మాట్లాడడము జరిగినది. హిందువులలో ఎన్నో కులములుంటే ఒక్క అగ్రకులము వారే మమ్ములను
వ్యతిరేఖముగా మాట్లాడడము జరిగినది. భగవద్గీతలోని ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞమును గురించి మేము వివరించి
చెప్పితే సరిపోలేదు. అలాగే మనము హిందువులము కాదు, ఇందువులము అని చెప్పితే నన్ను పరాయి మతమువాడని
అగ్రకులమువారే ఆరోపించడము జరిగినది. అద్వైత, ద్వైత సిద్ధాంతములవలె నేను "త్రైత సిద్ధాంతము”ను ప్రతిపాదించితే
త్రైతము అంటే క్రైస్తవులదని నేను క్రైస్తవ మతమును బోధించినట్లు నన్ను నిందించడము జరిగినది. నేను ఇప్పటివరకు
54 గ్రంథములను వ్రాసి ఎంతో సంచలనమైన జ్ఞానమును ప్రకటిస్తే, ఇది గొప్పజ్ఞానమని అందరూ అనుచుండగా,
అగ్రకులముల వారు మాత్రము నన్ను శత్రువువలె చూస్తూ మేము చేయు జ్ఞానప్రచారమునకు అడ్డుతగలడము
జరుగుచున్నది. ఇదంతయూ అసూయతో చేయు పనులని అర్థమయినది.
ఇంతవరకు ఎవరూ చేయని విధముగా మేము ఇందూ ధర్మములను గురించి బోధించుచున్నాము. మేము
బోధించు బోధ అన్ని సమాజ ప్రజలకు సరిపోవునదిగా యున్నది. మూడు మత గ్రంథములలోని సారాంశమును
తెలియజేస్తూ, ఏ మతస్థుడయినా వారి గ్రంథములోని జ్ఞానమును సరిగా అర్థము చేసుకోకపోతే, మీరు గ్రహించుకొన్నది
తప్పని చెప్పుచూ దానికి నిజమైన అర్థమును కూడా తెలియజేశాము. ఇతర మతములలో లేని వ్యతిరేఖత
హిందూమతములోనే, అదియూ ఒక అగ్రకులము వారిలోనే వచ్చిందంటే, అది వారి ఓర్వలేనితనమని మాకు అర్థమయినది.
ఇప్పుడు స్వర్గ నరకములను గురించి చెప్పాము. అన్ని మతములవారిని మందలించి ఇది తప్పనీ, ఇది సరియైనదనీ
చెప్పడము జరిగినది. వాస్తవముగా చెప్పితే ఇంతకాలనికి సరియైన జ్ఞానము లోపలయున్న ఆత్మే చెప్పుచున్నది. ఇది
దేవుడు ప్రజలకు ఇచ్చిన అవకాశము. ఇప్పుడు జ్ఞానమును తెలియకపోతే మరి ఎప్పుడూ తెలియలేరు. ఈ జ్ఞానము
ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పుచున్న జ్ఞానమని అనుకోవద్దండి. నేను కూడా మీలాగే తెలుసుకొనే వాడినే, నేను
చెప్పేవాడినికాదు.
అగ్రకులము వారు ప్రబోధానందయోగీశ్వరులయిన నన్ను క్రైస్తవ మతమువాడని అన్నందుకు, ఇందూ పదము
పరాయి మతమన్నందుకూ, ఆర్యసాంప్రదాయములోనున్న అగ్రకులమువారు ద్రావిడ సాంప్రదాయములో నున్న నన్ను
విమర్శించుట వలన ఒక మనిషిగా నేను కూడా వారిమీద ప్రతివిమర్శ చేయడమైనది. ఆ ప్రతివిమర్శను ఈ గ్రంథములోనే
పొందు పరుస్తునాము. అంతేకాక "హిందూ” అను శబ్ధము అర్థములేనిదనీ, భారతీయులైన మనము ఆదినుండీ
ఇందువులమని చెప్పాము. అదే విషయమునే హిందూ అను శబ్ధమును చెప్పుకొంటే తప్పగునని మిగతా స్వామీజీలు
చెప్పిన విషయమును కూడా పొందుపరిచాము చూడండి.
ఇట్లు
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది
సత్యము కాదు,
సత్యమును
వేయిమంది కాదనినా అది
అసత్యము కాదు.
60

Page 61
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
"హిందూ" పదం పై చినజీయర్స్వమి వారి అభిప్రాయము
(Maa Tv Channel Programme)
వాల్మీకి, వ్యాసులు ఇచ్చింది కేవలం మీరు ఇండియా చరిత్ర అనుకోకండి, భారతదేశచరిత్ర అనుకోకండి,
కేవలం భారతదేశానికి మాత్రమే అది పనికొచ్చేది అని అనుకోకండి. అందుకనే మనము "హిందూ” అనే పదాన్ని
వాడమండి. ఈ మధ్యన మనవాళ్ళు, ఫీడ్బ్యాక్ కోసం కొన్ని పేపర్లు ఇస్తే పాపం చాలామంది వ్రాశారు దాంట్లో మాకు
సూచనలు "స్వామీ! మీరు అసలు హిందూపదం చెప్పట్లేదు. గర్వించాల్సిన పదం దానిని మీరు వాడటం లేదు. మాకు
చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధగా వుంది" అని వ్రాశారు కొందరు. తమ అభిప్రాయానికి సంతోషం అనుకోండి. అంటే
అలవాటయిన పదం కనక అది వాడకపోతే, అది చెప్పకపోతే, ఏమిటో... కొరత, లోటు ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ
అసలు ఆ పదమే చేసినటువంటి అన్యాయం, ఆ పదం చేసినటువంటి హాని, ఈ జాతికి మానవ జాతికి మరొక పదం
చేయలేదు. బ్రిటీష్వాడు చాలా కనిపెట్టి ఆ పదాన్ని మనమీద చాలా చక్కగా పెట్టారు. అయితే గతిలేకపోయినది కనుక
వివేకానందుడు ఆ పదాన్ని గట్టిగా చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ మన జాతి ఆ పదంతోటి చెప్పుకోవటానికి పనికి
రాదండి. ఆ పదంతో చెప్పుకున్నామంటే మన పీకను మనమే కోసుకున్నామన్నమాట. ఆ పేరు మీద ఈ వేళ చాలా
(organisations) ఏర్పడ్డాయి కనక, ఆ పదం వదిల్తే, వదిలేస్తే తమ ఉనికి పోతుందేమో అనే భయం, పోతుందనేటటువంటి
ఒక విశ్వాసంతోటి ఆ పదం వాడాలని పట్టుపడుతున్నారు. ఈ వేళ ఆ పదంతోటి హిందుత్వ ఎజెండాలు తయారు
చేస్తున్నారు కాని, but ఆ పదం చేసినటువంటి హాని, మనకు ప్రపంచములో ఇవాళ ఏ రకమైనటు వంటి గౌరవాన్ని,
గొప్పతనాన్ని లేకుండా చేసుకున్న స్థితి దానివల్లే ఏర్పడింది. ఎందుకో తెలుసునా! దాన్ని కొన్ని రకాలుగా చెప్తారండి
మనవాళ్ళు. ఒకటి ఒక దేశానికి పేరుగా చెబుతారు దాన్ని కదండీ హిందూ అనేటటువంటిది దేన్నిబట్టి మీరు
చెబుతున్నారు. “సింధూ” నాగరికత నుంచి వచ్చిందని అనేనా మీరు చెబుతున్నారు, అంటే సింధూ నాగరికత తప్ప
ఇంకా మన ఈ భారతదేశములో మిగతాచోట్ల ఎక్కడ నాగరికతల్లేవా? 2500 BC అంటే 5000 సంవత్సరాలకిలోపు
ఆ నాగరికత వచ్చినట్లు చెబుతున్నారు చరిత్రకారులు ఇప్పుడు ఈవేళ ప్రామాణికంగా అంటే ఆ 5000 సంవత్సరాల
క్రితం మీకు దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఎవరూ భాషల వాళ్ళుకానీ ఇక్కడ ఎవరూ మనుషులు కానీ లేరా? కేవలం
కోతులే వుండేవా? అంతకుముందు అసలు నాగరికతల్లేవా? ఈ దేశానికి ఈ జాతికి నాగరికత లేదా? ఆలోచించాలి
చదువుకున్న వాళ్ళంతా. చదువుకోక పోయినా, బుర్రవున్న వాళ్ళయినా ఆలోచించాలండి, ఆ ఆలోచన 5000 సం॥ల
క్రితం ఇక్కడ జాతిలేదా? లేదు అనేది మీమీద ఆరోపించడానికి సింధునాగరికతను పట్టుకొచ్చారు. మనం “సింధు”లోంచి
వచ్చామా? పోనీ అది అలా ప్రక్కన పెడదాం ఇప్పుడు మీరంతా సింధునాగరికత ప్రక్కన పుట్టారా? సింధునదిలోంచి
వచ్చారా మీరు? గోదావరి దగ్గరో, కృష్ణదగ్గరో మీరు పుట్టుంటారు. మరి ఇపుడు ఆ నదిపేరుతోటి మిమ్మల్ని గుర్తు
పెట్టుకోవాలి. ఆ లోయలోంచి వచ్చిన నాగరికతతోటి మీరు (recognise) కావాలి. ఇది ఒకటి. రెండవది ఆ నాగరికత
పూర్వం ఎప్పుడో కొంతకాలం ఉండి, అక్కడ నాగరికత నుండి వచ్చింది అదీ, కానీ దానికంటే ముందరది రోమన్
నాగరికత, దానికంటే ముందరిది గ్రీస్ నాగరికత, దానికంటే ముందరది ఏదో మెసపటోమియా, బాబిలోనియా నాగరికత.
ఈ బాబిలోనియా నాగరికత ఏదో ఒక 8000 సంవత్సరాల క్రితానికి వెళుతుంది. అంతకుముందు అసలు భూమిమీద
61

Page 62
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
మనుషులు లేరు ఉన్నవన్నీ కూడా కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, ఇంతే. ఇపుడు ఈ నాగరికతలు
చెప్పేవాళ్ళంతా వచ్చిన పదం అలా వచ్చిందండి "హిందూ” పదాన్ని అక్కడ మధ్యలో పట్టుకొచ్చి మీకు సింధూనదితోటి
(link up) చేసిపెట్టారు. “స”, “హ” కింద మారిందండి. అందుచేత “సింధూ”, “హిందూ” అయ్యింది అని అన్నారు.
ఇది వాస్తవమా? అనేది మీరు ఆలోచించుకోండి. అంతకు ముందు లేదా ఏమండి, ఇది మీరు ఆలోచించుకోవాలి. కానీ
భారతంలో ఇచ్చినటువంటి వంశాలు ఉందండి, పరంపర ఉందండీ. మరి ఆ పరంపరలో చూస్తే వెనుకాల కొన్నివేల
సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళున్నారు. వాల్మీకి కథ కూడా వ్యాసుడు దాంట్లో
చెపుకున్నాడు. తొమ్మిదవ స్కంధం, భాగవతంలో మీరు చదివినట్లయితే వంశాల గురించి (History), మొట్టమొదట
సూర్యవంశాన్ని ఆ తర్వాత చంద్రవంశాన్ని, యదువంశాన్ని ఇట్లా వర్ణించాడండి ఆయన. అందులో సూర్యవంశాన్ని
వర్ణించేటపుడు ఇక్ష్వాకు దగ్గర్నుంచి మధ్యలో పుట్టినటువంటి అనేకమందిలో రాముడు కూడా ఒకడు అని రామకథను
కూడా (brief)గా ఆయన (mention) చేశాడు మొత్తం భాగవతంలో. ఆయన చెప్పిన దానిప్రకారమే రామచంద్రుడు
పదకొండు వేల సంవత్సరాల పైచిలుకు ఉన్నాడు అని ఆయన కూడా చెప్పాడు దాంట్లో. మరి ఆయన చెప్పిన దాని
ప్రకారం ఉండే వంశాలు అవన్నీ కూడా వర్ణించింది మనం గమనిస్తే కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది.
యుగాల కాలాన్ని ఇచ్చాడు ఆయన. అందులో ద్వాపరయుగానికి కాలం ఇచ్చాడు 8,64,000 సంవత్సరాలు. దానికి
ముందర త్రేతాయుగం అన్నాడు ఆయన. దానికంటే ముందర కృతయుగమన్నాడు. అలాంటి నాలుగు యుగాలు,
ఇంకొక నాలుగు యుగాలు, ఇంకొక నాలుగు యుగాలు వెనకాల రాముడి కాలమని చెప్పాడు. అంటే కోట్ల సంవత్సరాలలోకి
వెళ్ళిందది. కోట్లు కాకపోయిన లక్షల సంవత్సరాలు 43, 43, 43 యా! కోటి దాటింది. ఇచ్చట వ్యాసభగవానుడు
మనకు చెప్పిన నియమం ప్రకారం మనం గమనించినట్లయితే రాముడి కాలం (almost one crore years) ముందర.
మరి సింధులోయలోంచి వచ్చారా మీరు ఇంకొకటి సింధు అనే దానికి హిందు అనే దానికిని ఏదో పాపం వేరే
నిర్వచనాలు చెబుతూ “అలా కాదండీ! ఇది హిమాలయల్లోంచి హిందూ సరోవరందాకా ఉండేదంతా కూడా "హిందూ
రిత్య విలీయతే" అంటూ దానికొక సంస్కృతంలో ఒక శ్లోకం కూడా తయారు చేశారు. అదే అయితే నువ్వు కేవలం ఒక
చిన్న ప్రాంతానికి పరిమితమైపోయాం ఆ ప్రాంతంలో ఎవడుంటే వారు అలా ఆ పేరుతో చెప్పుకోవాలి. అలా వాడటం
లేదు నువ్వు. ఒక ధర్మానికి తగినట్టుగా దానిని వాడుతున్నావు. ఒక ఆచారానికి చెప్పే పదంగా నువ్వు దాన్ని వాడుతున్నావు.
అనొచ్చా అప్పుడు అట్టాగ దాన్ని. లేదంటే ఒక విశ్వాసం కల్గినవాడు అంతా వుండేది, అంటే ఏ వేదవిశ్వాసం అలా అలా
అంటున్నారో, అందులో ఎక్కడా అంతా, ఆ పదంతోటి చెప్పుకున్నట్టు గా కనపడటం లేదు మనకి. అస్సలు వెయ్యి
సంవత్సరాల క్రితం ఈ పదం అసలు (existence) లో లేనేలేదు. విగ్రహారాధనంటే పనికి రాకుండా వుండేటటువంటి
పార్శీస్ లాంటి వాళ్ళంతా, విగ్రహారాధకులైనటువంటి వాళ్ళంతా కూడా 'ఖాఫిర్స్' అని చెప్పడానికి వాడిన పదమది. సరే
వాళ్ళు అలా వాడితే వాడుకోనివ్వండి కానీ మనకోపదం ఉండచ్చు కదా! అని మీరనచ్చు. కానీ ఈ పదం అట్లా
రాలేదండి ఇది కేవలం (wanted) గా, మననందరిని చరిత్ర హీనులని చెయ్యడానికి ఏర్పడ్డ పదం క్రింద వచ్చిందది.
చరిత్ర హీనులు చెయ్యడానికి వచ్చిన పదం క్రిందవచ్చింది. రామాయణ, భారతాల్ని అన్నిటిని కూడా (smash) చేయాలి.
వాటన్నిటిని కూడా (sack) చేసి పారెయ్యాలి అంటే, వాటన్నిటిని మూటకట్టి సముద్రంలో తొక్కేయ్యాలంటే, ఏం చేస్తే అని
ఆలోచించి జాగ్రత్తగా ఈ పదాన్ని పెట్టారండి మనమీద. దురదృష్టంకొద్దీ, ఇవాళ ఆ పదం తెలిసిన, ఎలా వచ్చిందో
మీకు (etymology) మీకు చెపుతున్నప్పటికి కూడా దానిమీద మీకు అసలేమాత్రం దృష్ఠిలేకుండా ఈ పదాన్నే మేము
పట్టుకుని ప్రాకులాడతాం అని వాదించేటటువంటి పెద్ద మనుషుల ప్రభావం చేత ఇవాళ ఆ పదం చాలా (force) గా
62

Page 63
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
మనమీద వాడబడుతోంది. వేదాలలో ఎక్కడా ఆ పదం లేదు, ఇతిహాసములలో ఎక్కడాలేదు, శంకరాచార్యులవారు
వాడలేదు. రామానుజాచార్యుల వారు వాడలేదు, మధ్వాచార్యుల వారు వాడలేదు. వారి (commentators) ఎవ్వరూ
వాడింది కాదు. నీకొక చరిత్రవుంది. నీ చరిత్ర నువ్వు చెప్పుకోవాలంటే నీకొక వంశం వుంది. ఆ వంశాన్ని చెప్పుకో.
నీ వంశం పేరు “భరతవంశం”. నీ జాతికి పేరు "భరతజాతి”. నీకొక ప్రమాణంవుంది అది "వేదాలు”. yes ఆ వేదాల్లో
నువ్వు ఏ దేవతని పూజచెయ్యి, నువ్వు శివున్ని పూజచెయ్యి, కృష్ణున్ని పూజచెయ్యి, అమ్మవారిని పూజచెయ్యి లేదంటే
ఇతరమైనటువంటి దేవతలను అగ్ని, వరుణ, వాయు, ఇంద్ర, కుబేర ఎంతోమంది దేవతలున్నారు నీకే దేవత ఇష్టమయితే
ఆ దేవతని పూజ చేయ్యవోయ్! ఎవరొద్దన్నారు నిన్ను. ఇందులో రకరకాలైనటువంటి, విష్ణు భక్తుల్ని వైష్ణవులంటాం.
శివ భక్తుల్ని శైవులంటాం. శక్తి భక్తుల్ని శాక్తేయులంటాం. ఇతరమైనటువంటి దేవతల్ని పూజచేస్తే గానాపంక్త్యులంటాం
yes ఇలాంటి వాళ్ళు కొన్ని వందల దేవతలున్నారు. నీకిష్టమైన దేవతను పూజచేసుకో అన్నిటినీ కూడా వేదం దీన్ని
అంగీకరించింది కనక, ఆ వేదమార్గములో వచ్చేవాడివే నీవు అవుతావ్. అపుడు వేదం నీకు పరమ ప్రామాణిక గ్రంథం
అవుతుంది. దాన్ని ఆచరించిన వంశాలున్నాయి. అదే భరతవంశాలు అని అంటున్నాం అందులోవాడే రామచంద్రుడు.
అందులో వాడే కృష్ణుడు. వాళ్ళెంతెంత కాలం ఎలాఎలా ఉన్నారో చెప్పిన గ్రంథాలున్నాయి. ఇప్పుడు నువ్వు కనుక ఈ
'హిందూ' అనే పదం వాడావంటే మొత్తం అదంతా పోయింది. అంతా మొత్తం జీరో. మొత్తం అంతా సున్నా సుమారుగా
పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి వాడాలా ఆ పదాన్ని మీరు? నిన్ను నీవు చరిత్ర హీనున్ని చేసుకోవడానికి వాడుతున్న
పదాన్ని వదలడానికి ఇష్టపడకపోతే మరి వాన్ని (తలను చూపిస్తూ) మెదడు ఉన్నవాడనాలో లేనివాడనాలో మీకే
వదిలేస్తున్నా దాన్ని. ఇదంతా తెలుసు. ఈ మధ్యన ఒకాయన అన్నారండీ! "స్వామీజీ మీరు ఆ పదం వాడకపోతే
ఎలాగండీ. చాలా తప్పండి. అసలు మనందరినీ కలిపే ఇంక వేరే పదమేలేదండీ” అదేమిటయ్యా! పదం లేకపోవడమేమిటి?
“భారత” పదం అందరినీ కలుపదా! "అబ్బెబ్బె లేదండీ! ఆ పదం వాడితే మిగతావాళ్ళందరినీ, అది secular పదమండీ”
secular పదం, సెక్యులరేమిటసలు. అంటే “మనల్ని (specific) గా చెప్పే పదం వేరే ఇంకోటేమీలేదు స్వామీజీ" ఇదేంటి
లేకపోవడమేమిటి! "భారత్" అనేది ఉన్నది కదా! "అబ్బెబ్బే! మిగతావాళ్ళు కూడా దాన్ని వాడుకొంటున్నా రండీ”
మంచిదే కదా! వాడుకోనీ! ఎవరిది కాదు. భూమిమీద ఉండే ప్రతి మనిషికీ చెందిన పదమే అది. ఎందుకంటే మన
జాతి భరతజాతి. కేవలం ఒకచోటికి పరిమితం కాదండీ "పృథివ్యాం సర్వమానవా: స్వంస్వ చరిత్రం చిత్చిత్ క్షేలన్”
అని వ్యాసుడు చెప్పాడు. భూమిమీద ఉండే మానవులంతా ఇక్కడినుంచి వెళ్ళినవాళ్ళే. అంతా మొత్తం భరతవంశం
వాళ్ళవాళ్ళే. అంతా భారతీయులే. ఈ వేళ తాము ఏవో, కొన్ని రకరకా లైనటువంటి ఏదో వ్యక్తులను ఆధారం
చేసుకుని, ఆరాధిస్తూ కొందరు తమని క్రిష్టియన్లని అనుకుంటున్నారు. కొందరు తమని ముస్లిమ్స్ అని అనుకుంటున్నారు.
కొందరు తమని జొరాస్ట్రియన్స్ అని అనుకుంటున్నారు. కొందరు తమని ఇంకొక పేరుతో చెప్పుకొంటున్నారు. కానీ
వాళ్ళు మన తమ్ముళ్ళు, మన అన్నలు అంతే. వాళ్ళూ భరతవంశంలోంచి వెళ్ళినవాళ్ళే. (సభలో అందరూ చప్పట్లు
కొట్టారు). వారిని ఎందుకు విడదీసే ప్రయత్నం చేస్తున్నావ్. వాళ్ళకి వాస్తవం ఎందుకు చెప్పవ్. వాళ్ళు తెలియక
అమాయకంగా వాళ్ళు ప్రవర్తిస్తే నువ్వూ అలానే వుంటావా! ఇవాళ అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం
ఇది. అది ఆ! ఏదో “అది ఒక పదమండీ! దాన్ని మనం అలా అర్థం చెయ్యొద్దు! దాన్ని తీసుకుందాం”. ఎందుకు
తీసుకోవాలి నువ్వు అలాగా! ఏమండీ నీది జింబో అని పేరు పెడతాను. నీది జింబోమతం. దీని అర్థమెందుకండి
మనకీ, దాన్ని అట్లా పేరు తీసుకోండి, తీసుకోండి మరి ఇవాళ్లుంచి సర్టిఫికేట్లో. మాది జింబోమతం. అంతా ఒప్పుకుంటారా?
ఏవండీ అవసరమేమిటి? ఇపుడు నాకు తిండిపెట్టే అమ్మలేకపోతే, అపుడు నేను అడుక్కోవడానికి బయలు దేరాలి. నాకు
63

Page 64
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఒక అమ్మవుంది. అది అమ్మ నాకు తెలివైన అమ్మ. నాకు అన్నం పెట్టగల్గిన అమ్మ. సంస్కారం ఇవ్వగల్గిన అమ్మ. అన్నీ
వున్నటువంటి అమ్మ నాకుంటూంటే, నేను ఇంకొకల్నెవల్నో పట్టుకోవాల్సిన అవసరమెందు కయ్యా! ఆలోచించాల్సిన
అవసరమేమిటి, లేనిపోనిదానిని పట్టుకొచ్చి. “అబ్బెబ్బే! అది మతం కాదండీ, అది ఒక, ఒక ఆచారాన్ని చెప్పేది.” నాకు
వైదిక ఆచారముందయ్యా! వైదిక ఆచారమంటారు మాది. ఏమండి, మీది వైదిక ఆచారం కాదా! మీది అవైదికమా
మీది? మరి మీదీ వైదికం. నువు శివున్ని పూజచేసుకో, నేను వద్దంటంలేదు. శివున్ని వేదం చెప్పకపోతే కదా నువు
వాదపడాలి. నాస్తికాన్ని కూడా వేదం చెప్పిందండీ. తమాషా తెలుసునా మీకు. “అబ్బబ్బో ఏమండీ స్వామీజీ! మనం
అలాగ, ఈ హిందూపదం వాడకపోతేనండీ, ఇవాళ వైదికం అని అన్నామంటే చాలా ప్రమాదమండీ, మనదాంట్లోంచి
బౌద్ధులంతా పోతారండీ, జైనులంతా పోతారండీ, ఇంకోళ్ళంతా పోతారండీ". అయ్యో! వేదం నాస్తికాన్ని చెప్పిందయ్యా!
వేదం ఆస్తికాన్ని చెప్పింది. నువ్వు నాస్తికుడవైనా దాంట్లో వాడివే, ఆస్తికుడవైనా దాంట్లోవాడివే. నువ్వు ఏ దేవతను పూజ
చేసినా దాంట్లోవాడివేనని అంటూంటే. "అబ్బెబ్బే! హిందూ అనేది ఆలోచనాధార మండీ" ఆలోచనా ధార నీ భార్యకు
వేరు, నీకు వేరు అప్పుడు మీరిద్దరు వేరువేరువాళ్ళవుతారా? (it is so sad and
Portunate) చదువుకున్న వాళ్ళంతా
కనుక మాది రామానుజ మతమంటాం. మీరు
ఈ వేళ సమాజాన్ని చాలా తప్పుదారి పట్టిస్తున్నారు. ధర్మం పేరు చెప్పి లోకాన్ని ఉద్దరిస్తామన్న వాళ్ళంతా సమాజాన్ని
చాలా తప్పుదారి పట్టిస్తున్నారు. ఆలోచించుకోవాలి. మనం కూడా ఆలోచించుకోవాలి. అందుకే మనం మీకు ఒక
ఆచార్యుల వారిని మీరు ఆశ్రయించి వారి మార్గంలో మీరు నడుస్తుంటారనుకోండి, వారి మతం అని చెప్పుకోండి.
ఇప్పుడు మేము రామానుజాచార్యుల వారిని follow అవుతాం.
శంకరాచార్యుల వారిని follow అవుతారు. అప్పుడు మీది శంకరమతం అంటాం. ఇంకొకాయన మధ్వాచార్యుల వారిని
follow అవుతారు. వారిది మధ్వ మతం అని అంటాం ఇది వారి అభిప్రాయాన్ని మనం follow అవుతున్నాం. కనక అది
ఆ మతం. నువ్వొక ఋషిని follow అవుతున్నావ్. ఆ ఋషి మతం నీ మతం అని అంటాం. ఆ స్వాతంత్ర్యం నీకు ఉ
ంది. yes ఎందుకంటే అందరు ఆచార్యులు కూడా ఒక్కొక రకమైనటువంటి ఆలోచన కల్గినవాళ్ళది ఏది అవసరమో
దాన్ని వాళ్ళిచ్చారు. నీది అందులో ఏదో ఒకటి తీసుకో! ఏం! తప్పేంలేదు. నువ్వు ఏది తీసుకున్నా అందులో ఒక
మంచి నువ్వు సాధించగల్గుతావు. ఇది నిజంగా తెల్సుకుందాం అని జిజ్ఞాసకల్గితే మిగతా వాటిలో ఉండే మంచిని
గ్రహించే ప్రయత్నం చెయ్. that's fine లేకపోతే నువ్వు ఒక ఆచార్యున్ని విశ్వసించు, ఆ మతాన్ని చక్కగా అవలంబించు.
that's good. that's pretty good. ఇది మతం అని అంటాం. జాతి ఏమిటి? అది మన వంశాన్ని బట్టి వస్తుంది. మనది
భరతవంశం. కనక మనది భరతజాతి అంటాం. ఇవాళ క్రిష్టియన్ అని పేరుపెట్టుకొని నేను భరత జాతీయుడినే.
ఇవాళ నేను ఇస్లాం అని పేరు పెట్టుకున్న, నువ్వూ భరత జాతీయుడివే. మరచిపోకండి. ఇవాళంటే నువ్వు ఏదో మారి,
పైన ఒక ముసుగు వేసుకుని కనిపిస్తున్నావ్ కానీ, ఎవ్వడూ ఇందులోంచి బహిర్గుతుడు కాడు. భూమిమీద వున్న
మనుషులందరూ ఇందులోంచి వచ్చిన వారే. మరిచిపోయి వాళ్ళు తిరిగితే, నువ్వు వాళ్ళను వదలి పెట్టేసుకుని, నిన్ను
నువ్వు కూడా మార్చేసుకుని, నువ్వు బతుకుతానంటే నువ్వేం మనిషివి? నువ్వేం మార్గదర్శకుడివి సమాజానికి? కానే
కాదది. మనకందరికీ ఒక ప్రమాణం ఉంది. మనది వైదికధర్మం, ధర్మం అంటే ఆచారాన్ని చెప్పేది అని అర్థం. మనకు
వేదం చెప్పిన ఆచారం మన ఆచారం. దానిని ఆచరించిన వారి చరిత్ర మనకు ఉంది. అది ఇతిహాసం అంటాం. అది
రెండు రకాలుగా వుంది. అది ఒకటి రామయణం, ఒకటి భారతం. రామాయణంలో రాముడికి ముందు
వుండేదటువంటిదంతా కూడా record చేసి వాల్మీకి ఇచ్చాడు. అయితే ఆయన సంక్షిప్తంగా ఇచ్చాడు. ఆ తర్వాత
వేదవ్యాసుడు రామున్ని కూడా అతని దాంట్లో చూపిస్తూ, రాముడికి ముందువుండే ప్రక్రియని, రాముడి తర్వాత తనదాకా
64

Page 65
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
సాగినటువంటి ప్రక్రియని కూడా ఆయన స్పష్టంగా చూపించాడు. అయితే ఆయన ఋషి. కనక రాబోయే తరాలెలా
వుంటాయో కూడా చెప్పాడు. అది కూడా తన ఒక పురాణం క్రింద రచించి దాన్ని కూడా మనకిచ్చాడు. అంటే తను,
ఆ! మనకిక కనిపించని స్థితిలోనికి వెళ్ళేటపుడు, ద్వాపరయుగం పూర్తయి, కలియుగ ఆరంభం అయిన తర్వాత సాగే
వంశాలు కూడా ఇచ్చాడండాయన. ఎలా ఉంటాయో, ఎట్లా progress జరుగుతుందో కూడా ఇచ్చాడు. దాన్ని ఇవాళ
మనవాళ్ళు అదేమిటిది, ఆ... అదో వీరబ్రహ్మంగారి ఆ.. కాలజ్ఞానం, సారీ! యా! “కాలజ్ఞానం” అనేపేరుతోటి దాన్ని
లోకంలో కొంతమంది పాడుకున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే అసలు పాడినవాడి పాట పోయింది.
"హిందూ" పదం పై
శ్రీ పుష్పగిరి మహాసంస్థాన్ పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహభారతీ స్వామి
వారి అభిప్రాయము (భక్తి టీవి ఛానల్లో “భక్తి ధార్మిక సమ్మేళనం" కార్యక్రమం సందర్భంగా)
ఈనాడు ఇక్కడ అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో శ్రేయస్కరం, శుభదాయకం. దీనివల్ల మన
ఆంధ్రరాష్ట్రం ఎంతగానో ఆనందిస్తుంది, హర్షిస్తుంది. మనం ఇంతసేపు హిందువులనీ, హిందూ ధర్మమని మనల్ని
మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మనదేశం ఏది? ఏం దేశం, హిందూ దేశమా? ఈ విషయాన్ని పరిశీలించితే మన
శాస్త్రం, మన సాంప్రదాయం మనయొక్క శాస్త్రీయమైనటువంటి పురాణాలు, ఏం చెప్పాయంటే మీరు హిందువులు
కారు, హిందువులని మీరు అనుకోవడం, అది మీ పొరపాటు. మీరు భారతీయులు, ఇది భారత దేశం. (సభలో
అందరూ చప్పట్లు కొట్టారు.)
ఈ భారతదేశంలోని సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఈ హిందూ అనేటటువంటి పేరు, ఎక్కడినుండి వచ్చింది,
ఎలా వచ్చిందీ అంటే తురుష్కులు మన దేశాన్ని పరిపాలించే సమయంలో వాళ్ళు మనకిచ్చినటు వంటి బిరుదు “హిందువని”.
(old persian dictionary) దానిలో “హింద్" అనేటటువంటి శబ్దాన్ని వివరణ ఇస్తూ "హింద్” అంటే “బేవకూఫ్”,
“చోర్”. ఇది మనయొక్క ఘనత. మనకు వాళ్ళు పెట్టినటువంటి ముద్దుపేరు “హింద్” అని పేరు. చాలా ముద్దుగా
పెట్టారు వారు. మనం ఆనందంగా స్వీకరించాం. దాన్నే మనం, నిరంతరం మనల్ని మనం చెప్పుకుంటా ఉన్నాం.
ఎక్కడ (applications) పెట్టాల్సివచ్చిన (what is your religion) అని అంటే హింద్, హిందు, నేను ఇండియన్ ను, హిందువును
అని చెప్పు కుంటున్నాం. కానీ మనం హిందువులం కాదు, మనం భారతీయులం (సభలో అందరూ చప్పట్లు కొట్టారు.)
పురాణం “అత్రాబి భారతం శ్రేష్ఠం, జెంబూ ద్వీపే మహాముని, యతోహి కర్మభూరేశా యతోజ్ఞ భవభూభయహ:”
భారతం అత్యంత శ్రేష్ఠమైందనీ, ఇతరమైనటువంటి ప్రదేశాలలోనటువంటివన్నీ భవభూలని. ఇది కర్మభూమి, కర్మల
ఆచరించి, కర్మల ద్వారా తన్ను తాను సంస్కరించు కోవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి లోకాలను
చేరుకోవచ్చు. దానికి అనుగుణంగా, అనుకూలంగా మనకు అనేక విధాలుగా దారులు చూపినటువంటిది మన యొక్క
సంప్రదాయం.
65

Page 66
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
"ఉత్తరం యతా భూరస్య హిమాద్రశ్చే దక్షిణం వర్షం తద్ భారత జ్ఞామ భారతీ యత్ర సంతతీ:" ఉత్తరాన
హిమాలయాలు, దక్షిణాన సముద్రము ఈ రెంటికీ మధ్య ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి
సంతతి అంటే ప్రజలు, జనులు వీళ్ళు భారతీయులు, ప్రజా: భారతీయులు. అందువల్ల మనం భారతీయులమే కానీ
మనం హిందువులం కాదు. అటువంటి భావన, దృష్ఠి మనలో రావాలి. మనం భారతీయులం అనేటటువంటి ప్రజ్ఞ
మనలో కలగాలి. భారతీయమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాల్ని మనం మరచిపోకుండా నిరంతరం పాటిస్తూ
రావాలి. ఆ విధంగా పాటిస్తూ వస్తే మన జీవితం ధన్యం. భారతీయ సంస్కృతి అంటే పవిత్రమైనటువంటి, వైదిక
మైనటువంటి కర్మ, భక్తి ఆ తర్వాత జ్ఞానం. మనయొక్క సంస్కృతిదే. ఈ సంస్కృతిలో మనం పయనిస్తూ వచ్చామంటే,
మనం చివరికి చేరబోయేది, అఖండమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో చేర్తే, “నశపునరావర్తతే
నజపునరావర్తతే”. భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడై అలాంటి కర్మ, భక్తి, జ్ఞానములు కలవాడై, వాడు మెల్లిగా
ఆ పరమపదాన్ని చేరుకోవాలి. దానికి దారిని చూపించేటటువంటి సాంప్రదాయమే మన సాంప్రదాయం.
సాంప్రదాయంలో ఉన్నందుకు మనం ఆనందపడాలి, హర్షించాలి.
హిందూ రక్షణా! హిందూ భక్షణా!!
భగవద్గీతయే చదవనివాడు హిందూ రక్షకుడా?
హిందూ ధర్మమే తెలియనివారు హిందూ రక్షకులా?
హిందువులు నేడు కులాలుగా చీల్చబడి, అందులో హెచ్చుతగ్గు కులములుగా వర్ణించబడియున్నారు అనుట
అందరికీ తెలిసిన సత్యమే. దేవుడు మనుషులందరినీ సమానముగా పుట్టించితే కొందరు మనుషులు తమ స్వార్థ
బుద్ధితో హిందూ (ఇందూ) సమాజమును ముక్కలు ముక్కలుగా చీల్చి బలహీనపరచి హిందూసమాజమునకంతటికీ
తామే గొప్పవారమనీ, తాము చెప్పినట్లే అందరూ విని అన్ని కార్యములు చేసుకోవాలనీ ప్రచారము చేసుకొన్నారు. ఎన్నో
కులములుగా యున్న హిందూ సమాజములో తమ కులమే అగ్రకులమని చెప్పుకోవడమే కాకుండా, ఇతర కులముల
వారందరికీ తామే మార్గదర్శకులమనీ, గురువులమనీ ప్రకటించుకొన్నారు. భవిష్యత్తులో తమకు ఎవరూ
అడ్డురాకుండునట్లు, అన్ని కులములను అంటరాని కులములను చేసి, హిందూ సమాజమునకు తీరని అన్యాయము
66

Page 67
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చేశారు. అంతటితో ఆగక నేటికినీ హిందూ సమాజ రక్షకులుగా చెప్పుకొనుచూ, హిందూ సమాజమును సర్వనాశనము
చేయుచూ, హిందూ సమాజము ఇతర మతములుగా మారిపోవుటకు మొదటి కారకులగుచున్నారు. అటువంటి వారు
హిందూ సమాజమునకు చీడ పురుగులుగాయున్నా, మిగతా కులముల వారందరూ వారి నిజ స్వరూపమును తెలియక
వారు చెప్పినట్లే వినుట వలన, హిందూ సమాజమును పూర్తిగా అజ్ఞాన దిశవైపుకు, అధర్మ మార్గమువైపుకు మళ్ళించి,
ప్రజలకు ఏమాత్రము దైవజ్ఞానమును తెలియకుండా చేసి, తాము చెప్పునదే దైవబోధయని నమ్మించారు.
అటువంటి స్థితిలో నేడు త్రైత సిద్ధాంతకర్తగా ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు అజ్ఞాన దిశవైపు నిలిచి
పోయిన హిందూసమాజమును సరియైన దారిలో పెట్టుటకు, భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను అధ్యాయమున
బోధింపబడిన క్షర, అక్షర, పురుషోత్తమ అను ముగ్గురు పురుషుల విషయమును "త్రైత సిద్ధాంతము” అను పేరుతో
ప్రతిపాదించి దైవజ్ఞానమును అందరికీ అర్థమగులాగున గ్రంథరూపములో వ్రాయడము, బోధించడము జరుగుచున్నది.
దానివలన నేడు ప్రజలు అసలైన జ్ఞానము తెలియుచున్నదని సంతోషపడుచున్నారు. అగ్రకులముగానున్న వారిలో
కూడా ఎందరో తమ అజ్ఞాన చీకటులను వదలి, ఇంతవరకూ తమకు తెలియనిజ్ఞానము యోగీశ్వరుల ద్వారా ఇప్పుడు
తెలియుచున్నదని సంతోషపడి శిష్యులుగా చేరిపోవుచున్నారు. అయితే అగ్రకులములో కొందరు మాత్రము యోగీశ్వరులు
తెలియజేయు జ్ఞాన విషయములను చూచి ఈ జ్ఞానము వలన ప్రజలు జ్ఞానములో చైతన్యులై, జ్ఞానము తెలియని
తమను గౌరవించరని భావించి, దానివలన సమాజము మీద తమ ఆధిపత్యము లేకుండా పోవునని తలచి, యోగీశ్వరులు
తెలుపుచున్న త్రైత సిద్ధాంతము గానీ, త్రైత సిద్ధాంత భగవద్గీతగానీ హిందువుల జ్ఞానమే కాదనీ, అది క్రైస్తవ మతమునకు
సంబంధించినదనీ, దానిని ఎవరూ చదవకూడదని ప్రచారము చేయను మొదలుపెట్టారు. అంతేకాక తాము
హిందూధర్మరక్షకులమని, కొంత రాజకీయరంగు పూసుకొని, మా జ్ఞాన ప్రచారమునకు అక్కడక్కడ అడ్డుపడడము
జరుగుచున్నది. తమ మాట విను ఇతర కులముల వారికి కూడా ప్రబోధానందయోగీశ్వరులు చెప్పు జ్ఞానము హిందూ
జ్ఞానము కాదు, క్రైస్తవుల జ్ఞానమని హిందువుల ముసుగులో క్రైస్తవ మత ప్రచారము చేయుచున్నారని చెప్పడమేకాక,
అటువంటివారిని ప్రేరేపించి మా ప్రచారమునకు అడ్డు తగులునట్లు చేయుచున్నారు.
యోగీశ్వరులు నెలకొల్పిన హిందూ (ఇందూ) జ్ఞాన వేదిక ఇటువంటి ఆగడాలను కొంతకాలముగా ఓర్పుతో
చూడడము జరిగినది. మాలో ఓర్పు నశించి మమ్ములను అన్యమత ప్రచారకులుగా వర్ణించి చెప్పు అగ్రకులము వారిని,
వారి అనుచరులను మేము ఎదురుదిరిగి ప్రశ్నించడము జరిగినది. మేము ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా వారు
సరియైన సమాధానము ఇవ్వలేదు. ఆ జవాబులు ఎలా ఉన్నాయో పాఠకులుగా మీరు చూడండి.
మా ప్రశ్న :- ఇంతవరకు ఏ హిందువూ చేయని విధముగా ఊరూరు తిరిగి, ఊరులో ఇల్లిల్లూ తిరిగి హిందూ
ధర్మములను ప్రచారము చేయుచున్నాము కదా! అటువంటి మమ్ములను మీరు అన్యమత ప్రచారకులుగా ఎందుకు
చెప్పుచున్నారు?
67

Page 68
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
వారి జవాబు :- హిందూమతములో ఎందరో స్వామీజీలు ఉన్నారు. వారు ఎవరూ ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయలేదు.
హిందువులు అట్లు ఎవరూ ప్రచారము చేయరు. క్రైస్తవులయితేనే బజారు బజారు, ఇల్లిల్లూ తిరిగి ప్రచారము చేస్తారు.
మీరు హిందువుల ముసుగులో ఇల్లిల్లూ తిరిగి క్రైస్తవమును ప్రచారము చేయుచున్నారు.
మా ప్రశ్న :- మేము క్రైస్తవులమయితే భగవద్గీతను ఎందుకు ప్రచారము చేస్తాము?
వారి జవాబు :- మీరు ప్రచారము చేయునది త్రైత సిద్ధాంత భగవద్గీత. అది క్రైస్తవులది. బైబిలుకే మీరు అలా పేరు
పెట్టారు.
మా ప్రశ్న :- క్రైస్తవులు తమను క్రైస్తవులుగానే చెప్పుకుంటారు. అలాగే బైబిలును బైబిలుగానే చెప్పుకొంటారు. వారి
ప్రచారము క్రైస్తవము, బైబిలు అయినప్పుడు అదే పేరుమీద ప్రచారము చేస్తారు తప్ప హిందువులుగా భగవద్గీత
పేరుతో ఎందుకు ప్రచారము చేస్తారు? ఇంతవరకు అట్లు ఎక్కడా జరుగలేదు. ఏ మతమువారు ఆ మతము పేరు
చెప్పుకొంటారు గానీ ఇతర మతముపేరు చెప్పరు. అంతెందుకు మీరు మా భగవద్గీతను తెరచి చూచారా? అందులో
భగవద్గీత శ్లోకములున్నాయా? బైబిలు వాక్యము లున్నాయా?
వారి జవాబు :- త్రైత సిద్ధాంతమని యున్నది కదా! త్రైతము అంటే త్రిత్వము అని త్రినిటి అని మాకు బాగా తెలుసు.
మా ప్రశ్న : :- హిందూ ధర్మములలో అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరా చార్యుడు ప్రతిపాదించాడు. విశిష్టాద్వైతమును
రామానుజాచార్యులు ప్రతిపాదించాడు, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. ఇప్పుడు ఆచార్య ప్రబోధానంద
యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. సిద్ధాంతకర్తలు, సిద్ధాంతములు వేరయినా అందరూ హిందువులని
మీరు ఎందుకు అనుకోలేదు?
వారి జవాబు :- మీ త్రైతసిద్ధాంత భగవద్గీతలో యజ్ఞములను చేయకూడదని వ్రాశారు కదా! నిజముగా భగవద్గీతలో
అలా లేదు కదా!
మా ప్రశ్న :- మీరు హిందువులలో ముఖ్యులుగా వుండి అంత మూర్ఖముగా మాట్లాడితే ఎలా? ప్రపంచమునకంతటికీ
ఒకే భగవద్గీతయుంటుంది గానీ, మీ భగవద్గీత, మా భగవద్గీతయని వేరుగా ఉండదు. భగవద్గీతకు వివరము ఒక్కొక్కరు
ఒక్కొక్క విధముగా వారికి అర్థమయినట్లు చెప్పియుండవచ్చును గానీ, అందరికీ భగవద్గీత మూల గ్రంథమొక్కటేనని
గుర్తుంచుకోండి. త్రైత సిద్ధాంత భగవద్గీత అన్నిటికంటే సరియైన భావముతో యున్నదని చదివిన జ్ఞానులందరూ
పొగడుచూయుంటే, మీ కులములో ఎందరో ప్రశంసించు చూయుంటే, మీకు కొందరికి మాత్రము వ్యతిరేఖముగా
కనిపించిందనడము అసూయతోనే అని మాకు అర్థమగుచున్నది. యజ్ఞములు చేయవద్దని మేము ఎక్కడా చెప్పలేదు.
యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది, స్వర్గము వస్తుంది అని చెప్పాము. యజ్ఞముల వలన మోక్షము రాదు, దేవుడు
68

Page 69
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
తెలియడని చెప్పాము. అంతెందుకు మీరు మేము అన్ని కులములకంటే స్వచ్ఛమయిన హిందువులమని చెప్పుకొంటున్నారు
కదా! భగవద్గీతలో చెప్పిన ఒక్క హిందూ ధర్మమును చెప్పండి.
వారి జవాబు :- అవన్నీ మాటలు వద్దు... మీరు హిందువులు కాదు.
మేము
మా ప్రశ్న :- మొండిగా మాట్లాడవద్దండి మీరు అగ్రకులమువారమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి.
హిందువులము కాము అనుటకు ఆధారము ఏమైనా చూపగలరా? మా కథ అట్లుంచి మీరు సరియైన హిందువులే
అయితే భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ
భగవంతుడు ఏమి చెప్పాడో మీరే చెప్పండి.
వారి జవాబు :- మేము ఇంతవరకు భగవద్గీత చదువలేదు. మీకు కావలసి వస్తే సంపూర్ణానందస్వామితో చెప్పిస్తాము.
మా ప్రశ్న :- కనీసము భగవద్గీతను కూడా చదువని మీరు యోగీశ్వరులయిన ప్రబోధానందస్వామిని దూషించడము
మంచిదా? ఒక్క హిందూ ధర్మమును కూడా తెలియని మీరు హిందూ ధర్మ రక్షకులమని చెప్పడము మంచిదా?
యోగీశ్వరులవారు వ్రాసిన ఒక్క గ్రంథము కూడా చదువకుండ మేము తప్ప పూజ్యులుగా, గురువులుగా ఎవరూ
ఉండకూడదను అసూయతో ఇలాగ మాట్లాడితే దేవుడు ఓర్చుకోడని చెప్పుచున్నాము.
వారి జవాబు :- హిందూ మతములో ఎందరో దేవుళ్ళున్నారు. శివుడు దేవుడే, శివుని కొడుకు గణపతి దేవుడే, రాముడు
దేవుడే, రాముని సేవకుడు ఆంజనేయుడు దేవుడే. అలాంటి హిందూ మతములో దేవుడు ఒక్కడే అని చెప్పడము మీది
తప్పు కాదా?
మా మాట :- మేము మతమును గురించి చెప్పలేదు. హిందూ మతములో ఎందరో దేవుళ్ళుండడము నిజమే, అయితే
హిందూ జ్ఞానములో, హిందూ ధర్మము ప్రకారము విశ్వమునకంతటికి ఒకే దేవుడని చెప్పాము. భగవద్గీతలో దేవుడు
చెప్పినదే చెప్పాము తప్ప మేము దేవతలను గురించి లేరని చెప్పలేదే! దేవతలకందరికీ అధిపతియైన దేవుడు ఒక్కడున్నాడని,
ఆయనే దేవదేవుడనీ, అతనిని ఆరాధించమని చెప్పాము.
రాముని పేరు
వారి జవాబు :- మీరు రాముని పేరు చెప్పరు, శివుని పేరు చెప్పరు, వినాయకుని పేరు చెప్పరు. ఎవరి పేరూ
చెప్పకుండా దేవుడు అనీ, సృష్టికర్తయనీ అనేకమార్లు పేర్కొన్నారు. దేవుడు అను పదమునుగానీ, సృష్టికర్తయను
పదమునుగానీ క్రైస్తవులే వాడుతారు. హిందువులు వాడరు. అందువలన మిమ్ములను హిందువులు కాదు క్రైస్తవులు
అంటున్నాము.
మా ప్రశ్న :- క్రైస్తవ మతము పుట్టి రెండువేల సంవత్సరములయినది. సృష్ఠిపుట్టి ఎన్ని కోట్ల సంవత్సరములయినదో
ఎవరూ చెప్పలేరు. సృష్ట్యాది నుండి సృష్టికర్త అను పదమును దేవుడు అను పదమును హిందూ సమాజము వాడుతూనే
యున్నది. మొదటినుండి హిందూసమాజములో యున్న దేవుడు, సృష్ఠికర్త అను పేర్లను హిందువులు క్రైస్తవులకేమయినా
69

Page 70
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
లీజుకిచ్చారా? లేక పూర్తిగా వారికే అమ్మేశారా? అని అడుగుచున్నాము. సృష్టికర్త అనిగానీ, దేవుడు అనిగానీ
హిందువులయినవారు అనకూడదని ఎక్కడయినా ఉన్నదా అని అడుగుచున్నాము?
వారి జవాబు :- మీరు హిందూమతమును కాకుండా అన్యమతమును బోధించుచున్నారనుటకు, మిమ్ములను మీరు
హిందువులుగా చెప్పుకో లేదు. హిందువులుగా కాకుండా ఇందువులుగా చెప్పుకొంటున్నారు. అటువంటప్పుడు మీరు
హిందూమతమును చీల్చినట్లు కాదా! ప్రత్యేకించి ఇందూ మతము అను దానిని ప్రచారము చేసినట్లు కాదా! మీరు
హిందువులే అయినప్పుడు మీ గ్రంథములలోగానీ, మీ బోధలలో గానీ ప్రత్యేకించి ఇందువులు అని ఎందుకు చెప్పుచున్నారు?
మా మాట :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము జవాబు చెప్పండి. హిందువు, ఇందువు అను పదములో
కొద్దిపాటి శబ్ధము తప్ప ఏమి తేడాయుందో మీరే చెప్పండి. తెలుగుభాషను వ్రాసే వారందరూ హిరణ్యకశ్యపున్ని
చంపినది నరశింహస్వామి అని చెప్పుచుందురు అలాగే వ్రాయుచుందురు. ప్రస్తుతకాలములో నరశింహులు అని
పేరున్నవాడు కూడా వాని పేరును నరశింహులు అని వ్రాయడము అందరికీ తెలుసు. అయితే ఆ మాట తప్పు అలా
వ్రాయకూడదు దానిని నరసింహ అని వ్రాయవలెను అని చెప్పుచున్నాము. అడవిలో మృగరాజును సింహము అని
అంటాము తప్ప శింహము అని అనము అనికూడ చెప్పుచున్నాము. 'సింహము' అంటే అర్థమున్నది గానీ, 'శింహము’
అంటే అర్థము లేదు అని కూడా చెప్పాము. అలా ఉన్నది ఉన్నట్లు చెప్పితే ఇందువు అనే దానికి అర్థమున్నదిగానీ
హిందువు అనే దానికి అర్థములేదు అని చెప్పాము. సృష్ట్యాదిలో పుట్టినది ఇందూ సమాజమనీ, అది మధ్యలో పేరుమారి
దృష్ఠి జిష్ఠి అయినట్లు ఇందూ అను శబ్ధము హిందూ అని పలుకబడుచున్నదని చెప్పాము. ఇందూ పదము ఎందుకు
వాడాలి హిందూ పదమును ఎందుకు వాడకూడదని కూడా వివరముగా మా గ్రంథములలో గలదు. ఉన్న సత్యము
మీకు తెలిసినా మీరు మాకంటే పెద్ద ఎవరూ ఉండకూడదను అసూయతో మాట్లాడుచున్నారు.
అగ్రకులములో ఎందరో పెద్దలు మా జ్ఞానమును తెలిసి సంతోషించుచుండగా, కొందరు మాత్రము వీధి
రౌడీలలాగా తంతాము, పొడుస్తాము, కాలుస్తాము మీరు ప్రచారము చేయవద్దండని చెప్పడము మంచిది కాదు. మా
గ్రంథములు ఏదీ చదువకుండా మాట్లాడడమూ, మేము చెప్పిన మాటలను వినకుండా ఇవన్నీ డ్రామాలు, నాటకాలు
అనడము మంచిది కాదు. మీరు ఎవరైనా మా గ్రంథములలో ఇతర మతములను ప్రచారము చేసినట్లుగానీ, ఫలానా
మతములోనికి చేరమని చెప్పినట్లుగానీ ఉంటే నిరూపణ చేయండి, అలా నిరూపించినవారికి ఇందూ జ్ఞానవేదిక
తరపున పది లక్షల రూపాయలను ఇవ్వగలము. నిరూపించ లేకపోతే మీరు లక్ష రూపాయలు ఏ ఊరిలో శ్రీకృష్ణుని
గుడికయినా ఇవ్వవలెను. ఈ షరతుకు ఎవరైనా ముందుకు వస్తారా? అని అడుగుచున్నాము.
ఇట్లు
ఇందూ జ్ఞానవేదిక
70

Page 71
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
చరిత్రలో జరిగిన అన్యాయము
హిందువులలో జరుగుచున్న యదార్థము
నాలుగువందల సంవత్సరముల క్రిందట ఆధ్యాత్మిక రంగములో మెరిసిన వజ్రము వేమనయోగి. ఆధ్యాత్మికమను
పాలను చిలికి దైవజ్ఞానము అనే వెన్నను తీసి ఇచ్చినవాడు వేమన. వేమన తన పద్యములలో చెప్పిన ఒక్కొక్క జ్ఞాన
విషయము విపులముగా వ్రాసుకొంటే ఒక్కొక్క గ్రంథము కాగలదు. వేమన స్వచ్ఛమైన తెలుగు భాషలో పద్యమును
వ్రాసి చెప్పాడు. సంస్కృతము జోలికి పోలేదు. ఒక ప్రక్క పద్యములు వ్రాసి కవిగా కనిపించినా, ఒక ప్రక్క అంతు
తెలియని ఆధ్యాత్మికవేత్త వేమనయోగి. అయితే ఆయన పుట్టినది రెడ్డి కులమున. చరిత్రలో మాకంటే ఎవరూ పెద్దగా
ప్రశంసింపబడకూడదని గర్వములోయున్న అగ్రకులములోని కొందరు పనిగట్టుకొని వేమన యోగిని పిచ్చివానిగా
జమకట్టి, అతను చెప్పింది జ్ఞానమేకాదని ప్రజలలో ప్రచారము చేశారు. పిచ్చివాని మాటలు పిచ్చివారే వింటారు అని
హేళనగా మాట్లాడడము జరిగినది. అనేక కులములుగాయున్న హిందువులకు జ్ఞాన విషయములో పరిచయము
లేనిదానివలన, అగ్రకులము వారు వేమన చెప్పినది జ్ఞానమే కాదనడము వలన, వేమన తన జ్ఞానమునకు తగినట్లుగా
ప్రకాశింప లేకపోయాడు. తాము అగ్రకులము వారమనీ, మిగతా వారందరూ తగ్గు కులము వారనీ విభజించి, తాము
చెప్పినట్లు వినవలెననీ, అట్లు వింటేనే మిగతా కులముల వారందరూ సుఖముగా బ్రతుకగలరనీ, అగ్ర కులమువారు
ప్రచారము చేసుకొన్నారు. అలా తమను తాము గొప్పగా ప్రకటించుకోవడమేకాక హిందువుల ఇళ్ళలో జరుగు ప్రతి
మంచి పనికీ, చెడు పనికీ, చావుకూ పుట్టుకకూ, పెళ్ళికీ పేరంటానికీ ప్రతి కార్యమునకూ తాము చెప్పునట్లు చేయాలనీ,
తాము నిర్ణయించు కాలములోనే చేయాలనీ, అట్లు చేయకపోతే నష్టము, కష్టము కలుగుతుందని భయపెట్టడము
వలన, భయముతో జ్ఞానము తెలియని మిగతా కులముల వారందరూ వారు చెప్పిన దానిని నమ్మడము జరిగినది. ఈ
విధముగా హిందూమతములో అగ్రకులము వారు భయము అను బ్లాక్మెయిల్ చేసి, తగ్గు కులము వారందరినీ
తమమాట వినునట్లు చేసుకొన్నారు. ఆనాటినుండి హిందూ సమాజమును మోసము చేస్తూ ఎవరికీ హిందూ జ్ఞానమును
తెలియకుండా చేసి, తాము హిందూ సమాజమును అనేక పేర్లతో దోచుకొంటూ బ్రతకడమే కాక, మిగతా కులములలో
ఎవరు జ్ఞానులుగా పుట్టినా, వారిని హేళన చేయడమూ, అజ్ఞానిగా వర్ణించడమూ జరిగినది.
చరిత్రలో నాలుగు వందల సంవత్సరముల క్రితము వచ్చిన వేమనను పిచ్చివానిగా వర్ణించి శాస్త్రము తెలియనివాడని
వర్ణించారు. తర్వాత ఇప్పటికి మూడు వందలయాభై సంవత్సరముల క్రిందట వచ్చిన పోతులూరు వీరబ్రహ్మముగారు
గొప్ప జ్ఞానిగా తయారై, భవిష్యత్తు కాలములో జరుగు సంఘటనలను ముందే తెలియజేసి గొప్ప కాలజ్ఞానమునే వ్రాశాడు.
ఆయన వ్రాసిన భవిష్యత్తు కాలక్రమమున నేటికినీ జరుగుచునేయున్నది. అంతటి గొప్ప జ్ఞాని అయిన వీరబ్రహ్మముగారు
71

Page 72
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
ఆ
అగ్రకులమువాడు కాకపోవుట వలన, విశ్వకర్మ (ఆచారుల) కులమున పుట్టుట వలన, అగ్రకులము వారు బ్రహ్మము
గారు బ్రతికియున్న కాలములోనే, తమ ఊరిలోనికి రాకుండా, ఆయన జ్ఞానమును ప్రచారము చేయకుండా అడ్డుకొన్నారు.
ఆ రోజు ఇతరులు జ్ఞానులు కాకూడదను అసూయ అను గుణముతోనూ, మేమే తెలిసిన వారమను గర్వముతోనూ
పని చేశారు. హిందూ సమాజములో ఇటువంటి వారుండుట వలన విసిగిపోయిన హిందువులు హిందూ మతమును
వీడి ఇతర మతములోనికి పోవుచున్నారు. ఇందూమతములో దేవునికి గుడికి అంటరాని వారిగా ఉండలేని వారందరూ
కొందరు జ్ఞానము కొరకు, కొందరు కులవివక్ష లేని స్వతంత్రము కొరకు మతమును మారజొచ్చారు. ఈ విధముగా
హిందూమతములోని వారు ఇతర మతములోనికి పోవుటకు మొదటి కారకులు హిందూమతములోని అగ్రకులములవారేనని
అనుమానము లేకుండా చెప్పవచ్చును.
తమ వలననే హిందువులు ఇతర మతములలోనికి పోవుచున్నారని అగ్రకులమువారికి కూడా తెలుసు. అయితే
తమ తప్పును ఎవరూ గుర్తించనట్లు తాము హిందూమతమును ఉద్ధరించువారిగా, హిందూధర్మ రక్షకులుగా వర్ణించుకొని
హిందూ ధర్మ భక్షకులుగా నేటికినీ సమాజములో కొనసాగుచున్నారు. వారిని హిందూ ధర్మ భక్షకులు, హిందూ ధర్మ
నాశకులు అని చెప్పుటకు అనేక ఆధారములు గలవు. అటువంటి వాటిని పరిశీలించితే, హిందువులలోని మిగతా
కులమువారివద్ద భగవద్గీతను బోధించు కృష్ణుడు అర్జునుడు యున్న చిత్రపటము (ఫోటో) యుంటే దానిని ఇంటిలో
ఉంచుకోకూడదనీ, ఆ పటము ఇంటిలో ఉంటే ఇంటిలో కూడా యుద్ధాలు వస్తాయనీ, అనేక కష్టాలు వచ్చి పాండవులు
అరణ్యవాసము పోయినట్లు బాధపడవలసివస్తుందనీ అగ్ర కులమువారు నేటికినీ చెప్పుచునే యున్నారు. అటువంటి
భగవద్గీత ఫోటోలను గుడులలో ఉంచవలెననీ లేకపోతే ఏటిలోని నదీ ప్రవాహములో పారవేయాలనీ చెప్పడము,
చేయించడము కూడా జరిగినది. అంతేకాక భగవద్గీతను ఇంటిలో ఉంచు కోకూడదని భగవద్గీతను ఎవరూ చదువకూడదనీ,
చదివితే కష్టాలు వస్తాయనీ, భగవద్గీతను ఎవరి ఇంటిలోనూ లేకుండునట్లు చేయుచున్నారు. భగవద్గీత అర్జునునికి
యుద్ధరంగములో యుద్ధము చేయుటకు చెప్పినది, అందువలన చదువకూడదు, చదివితే చదివినవారు కూడా అనేక
తగాదాల లోనూ, కోర్టు వ్యవహారములలోనూ చిక్కుకోవలసి వస్తుందని చెప్పడము జరుగుచున్నది. ఇంకనూ హిందువులకు
వేదములు ముఖ్యమైనవనీ వాటిని అన్ని కులముల వారు చదువకూడదనీ, వేదములను తామే చదువవలెననీ చెప్పడము
కూడా జరుగుచున్నది. ఈ విధముగా భగవద్గీతకు వ్యతిరేఖముగా మాట్లాడువారు
ఈ హిందూ సమాజమునకు
చీడపురుగులుకాక ఏమవుతారో మీరే ఆలోచించండి.
ఇదంతయూ గతములో జరిగిన విషయములు, అవి చాలక ప్రస్తుత కాలములో వీరి ఓర్వలేనితనము, మేమే పెద్ద
అను గర్వము ఎలాగుందో చూడండి. వేమనయోగిని, పోతులూరి వీరబ్రహ్మముగారిని అగ్రకులము వారు ఎంత హేళన
చేసినా వేమనయోగిని రెడ్డి కులస్థులు వేమారెడ్లుగా గుర్రముల నెక్కి ప్రచారము చేయుట వలన, వీరబ్రహ్మముగారిని
విశ్వకర్మ (ఆచారి) కులమువారు కాలజ్ఞానమును ప్రచారము చేయుట వలన, వేమన సంఘములు, విశ్వకర్మ సంఘములు
తయారై వేమనను, బ్రహ్మముగారిని ప్రచారము చేయుట వలన, కొంతమంది ప్రజలకు వేమనయోగి పద్యములు,
72

Page 73
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
వీరబ్రహ్మము గారి కాలజ్ఞానము కొంతవరకు తెలియును. వేమనయోగి ఆ కాలములోనే తన పద్యములలో అగ్రకులమువారు
చేయు తప్పులను ఎండబెట్టడము జరిగినది. వీరబ్రహ్మముగారి చరిత్రలో కూడా బ్రహ్మము గారికి అగ్రకులము వారు
చేసిన ఆటంకములను వ్రాయడము జరిగినది.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానముకలది అని మూడువందల
యాభై సంవత్సరములప్పుడే వ్రాసియుంచాడు. కాలజ్ఞానములో ప్రబోధాశ్రమము యొక్క పేరుండడము ఈ మధ్యన
ఐదు సంవత్సరముల క్రితము మాకు తెలిసినది. తర్వాత బ్రహ్మము గారు వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమునకు,
ప్రబోధానంద యోగీశ్వరులకు సంబంధించిన చాలా విషయములు వ్రాసినట్లు తెలిసినది.
ఎంతో గొప్ప జ్ఞాని,
కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మముగారు ప్రబోధా శ్రమాధిపతియైన ప్రబోధానందయోగీశ్వరులు వారిని గొప్పగా
చెప్పుచూ "ప్రబోధాశ్రమము వారు శయనాధిపతి గుణములు కల్గియున్నారు. శయనాధిపతియే ఆనందగురువు.
ఆనంద గురువే నాకు గురువు, మీకు గురువు" అని వ్రాయడము జరిగినది. ప్రబోధానందయోగీశ్వరుల జ్ఞానమేమిటో
ఎంత శక్తివంతమైనదో జ్ఞాన జిజ్ఞాసులకు కూడా తెలియుచున్నది. ఎందరో జ్ఞానులయిన వారు యోగీశ్వరులు చెప్పుచున్న
జ్ఞానము ఎంతో గొప్పదని ప్రశంసించుచున్నారు. బ్రహ్మముగారే స్వయముగా తన గురువుగా చెప్పుకొన్న వ్యక్తి ఎంతటి
వాడయివుంటాడో మనము కూడా ఆలోచించవలసియున్నది. అయినా ప్రబోధానందయోగీశ్వరుల వారు ఒక్క దైవ
జ్ఞానములో తప్ప మిగతా అన్నిటిలో సాధారణ వ్యక్తిగానే కనిపిస్తాడు. ఎదురుగా చూస్తే ఇతనికి జ్ఞానము తెలియునా!
అన్నట్లు కనిపించినా, అవును ఆయన ఎవరికీ తెలియని గొప్పవాడే అన్నట్లు ఆయన వ్రాసిన గ్రంథములే గొప్ప
శక్తులుగా నిరూపించుకొన్నాయి. ఒక గ్రంథము దగ్గరకు వస్తూనే కొందరిలో మార్పు కనిపించడమూ, కొందరు గ్రంథమును
చదివిన వెంటనే అంతవరకు నయముగాని రోగములు పోవడము జరుగుచున్నది.
పైకి కనిపించని శక్తి యోగీశ్వరులలో నిక్షిప్తమైయుండుట బయటికి కనిపించకపోయినా ఆయన చెంతకు
పోయినవారికి దేహములో నయము కాని, మందులులేని ఎయిడ్స్, క్యాన్సర్, డెంగీ జ్వరములు సహితము శాంతించి
పోవడము జరుగుచుండుట వలన యోగీశ్వరులు ఎంతటివారో ఎవరికయినా సులభముగా అర్థమయిపోగలదు.
వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో ఆనంద యోగిని దూషించిన వారు చాలా ఇబ్బందుల పాలవుతారని
వ్రాయడము జరిగినది. అలాగే ఆయనను గానీ, ఆయన గ్రంథములనుగానీ దూషించినవారు ఇంతవరకు ఎవరూ
సురక్షితముగాలేరు. తెలియని రోగములతో, అర్థముకాని బాధలతో కొందరుండగా, కొందరు చిత్రహింసలపాలై
చనిపోవడము జరిగినది. అలా ఎందుకు జరుగుచున్నదో తెలియనివారు, పాపమును మూటగట్టుకొనుటకు యోగీశ్వరుల
వారి జ్ఞానమునకు అక్కడక్కడ ఆటంకము లను కలుగజేయుచున్నారు. హిందూమతములో ఆదిశంకరాచార్యులు అద్వైత
సిద్ధాంతమును ప్రతిపాదించాడు. తర్వాత కొంతకాలమునకు విశిష్టాద్వైత సిద్ధాంతమును రామానుజాచార్యులు
ప్రతిపాదించాడు. మరికొంత కాలమునకు ద్వైత సిద్ధాంతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. వీరు ముగ్గురూ
73

Page 74
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
అగ్రకులము వారు కావడము విశేషము. గత ముఫ్ఫైఆరు సంవత్సరముల నుండి త్రైత సిద్ధాంతమును ఆచార్య
ప్రబోధానంద యోగీశ్వరులవారు, ప్రకటించి ఆ సిద్ధాంతమునే ప్రచారము చేయుచూ త్రైత సిద్ధాంతము ప్రకారము
భగవద్గీతను వివరించి వ్రాయడము జరిగినది. హిందూమతములోని సిద్ధాంతముల వివరము తెలియని ప్రజలకు,
అగ్రకులమువారు "త్రైతము అంటే క్రైస్తవులకు సంబంధించినదనీ, త్రైత సిద్ధాంత భగవద్గీతయని పైకి చెప్పుచూ లోలోపల
క్రైస్తవ మతమును బోధించుచున్నారని” యోగీశ్వరులకు, యోగీశ్వరుల జ్ఞానమునకు వ్యతిరేఖముగా చెప్పడము జరిగినది.
హిందుత్వమును ఒక వైపు సర్వ నాశనము చేయుచున్న అగ్రకులములవారు హిందూమతమును కాపాడువారి వలె
నటించుచూ యోగీశ్వరుల జ్ఞానమునకు కొన్నిచోట్ల ఆటంకము కల్గించడము జరిగినది. మూడుచోట్ల అన్యమతప్రచారమని
భగవద్గీతను ప్రచారము చేయు యోగీశ్వరుల శిష్యుల మీద కేసులు పెట్టడడము కూడా జరిగినది. కొన్నిచోట్ల ప్రత్యక్ష
దాడులకు దిగడము జరిగినది. అయినా ప్రబోధానంద శిష్యులు అన్నిటికీ ఓర్పు వహించి జ్ఞానప్రచారము చేయు
చున్నారు. ఈ మధ్యకాలములో నల్గొండ జిల్లా భువనగిరిలో దేవేంద్ర అను మా సంఘ సభ్యునిమీద అన్యమత ప్రచారము
చేయుచున్నాడని ఆరోపించి కేసు పెట్టడము జరిగినది. అంతేకాకుండా మా ప్రచార వాహనము భువనగిరిలోనికి
పోయినప్పుడు మా ఊరిలో ప్రచారము చేయవద్దని అడ్డుపడి పంపించడము జరిగినది. కరీంనగర్లో గోడమీద త్రైత
సిద్ధాంత భగవద్గీతను చదవండి అని వ్రాస్తే, అగ్రకులము వారువచ్చి ఇది క్రైస్తవ మతప్రచారము దానిని తుడిపివేయమని
చెప్పడము జరిగినది. రెండు రోజుల క్రిందట ఆరగడ్డలో ప్రచార వాహనముండగా అక్కడికి ఒక అగ్ర కులస్థుడు వచ్చి
ఇది క్రైస్తవ ప్రచారము, ఈ ప్రచారమును నిలిపివేయండని ఘర్షణపడగా ఆ సమయానికి మా గ్రంథములు చదివిన
వారు అక్కడుండుట వలన వారే అగ్రకులమువారికి బుద్ధిచెప్పి పంపడము జరిగినది. అక్కడున్న ప్రజలు అనిన మాటలు
“ఇది ఎంతో గొప్ప జ్ఞానము. ఇంతకాలానికి గొప్ప జ్ఞానము దొరికిందని మేము సంతోషపడుచుంటే, సమాజాన్ని
సర్వనాశనము చేసిన మీరు దీనిని జ్ఞానము కాదంటారా? ఇట్లే మాట్లాడితే ఊరిలో లేకుండా మిమ్ములను మేమే
పంపుతాము” అని అనడము జరిగినది. ఈ విధముగా ప్రజలే తిరగబడి బుద్ధిచెప్పు సమయము అన్నిచోట్లా వస్తుంది.
గౌతమబుద్ధుడు జ్ఞానము చెప్పితే అతను అగ్రకులము వాడు కాదని ఆయనది వేరు మతమని ప్రచారము
చేశారు. ఆ దినము గౌతముడు హిందువే కదా! తమ ఆధిపత్యము కొరకు హిందూమతమునుండి బుద్దున్ని చీల్చి
అతనిది బౌద్ధమతమని చెప్పి హిందూమతమునుండి వేరు చేశారు. ఈ దినము బౌద్ధమతము విదేశాలలో వ్యాపించియున్నా
స్వదేశములో లేకుండా చేసినది అగ్రకులము వారు కాదా! ఈ దినము బుద్ధుడు మావాడే బౌద్ధము హిందూమతమే అని
చెప్పుకోలేని పరిస్థితి మనకు ఏర్పడినది. అలాగే ప్రబోధానంద యోగీశ్వరులు చెప్పు త్రైత సిద్ధాంతమును హిందూ
మతములోని భాగము కాదనడమూ, త్రైత సిద్ధాంత భగవద్గీతను భగవద్గీతే కాదనడమును ఒకవైపు ప్రజలు గమనిస్తున్నారు.
ప్రబోధానంద యోగీశ్వరులు గత 36 సంవత్సరములుగా బోధించుచున్న బోధ హిందుత్వములోనే ఎంతో గొప్పదని అన్ని
మతములవారు ఒప్పుకొనుచుండగా, తగ్గుకులము వారని అగ్రకులముచే అనబడినవారందరూ హిందూ (ఇందూ)
74

Page 75
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
జ్ఞానమును తెలుసుకొని చైతన్యవంతులై అగ్రకులము వారికి తిరగబడి జ్ఞానము చెప్పు స్థితికి ఎదిగారు. తగ్గుకులము
వారిమీద ఆధారపడి బ్రతుకుచున్న అగ్రకులమువారిని తగ్గుకులము వారందరూ ఒక్కమారు వెలివేస్తే, మీతో మాకు
సంబంధము వద్దు అంటే ఏమవుతుందో చెప్పనవసరము లేదు. అటువంటి స్థితి రాకుండుటకు మా జ్ఞానమునకు
అడ్డురావద్దని అగ్రకులము వారికి మరీమరీ చెప్పుచున్నాము.
ఇట్లు
ప్రబోధ సేవాసమితి
**
ఇట్లు
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది
సత్యమును
సత్యము కాదు,
వేయిమంది కాదనినా అది
అసత్యము కాదు.
75

Page 76
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
సాక్షి
సోమవారం 22-9-2014 | www.sakshi.com
11
హిందూ ఓ అశబ్దం: మొయిలీ
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్
నేత వీరప్ప మొయిలీ హిందూ మతాన్ని ఉద్దే
శించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆదివారమ్కిడ ఓ ధార్మిక కార్యక్రమంలో
ఓ
మాట్లాడుతూ హిందూ పదాన్ని అశబ్దంగా అభి
వర్ణించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా ఆ
పదం లేదన్నారు. ముస్లింలను, మిగిలిన వర్గాల
వారి నుంచి వేరుచేయడానికే అటువంటి పదా
లను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అనంతరం ప్రముఖ కన్నడ సాహితీవేత్త జవరే
గౌడ మాట్లాడుతూ పురోహితులు ఉన్నంత
వరకూ దేశంలో శాంతి ఉండదన్నారు.
76

Page 77
ప్రముఖుల లేఖ
స్వర్గము ఇంద్రలోకమా! - నరకము యమారాజ్యమా!!
సాక్షి న్యూస్ పేపరు, 21-01-2014
ఇందు దేశమే ఇండియా!
హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యా
వర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశ
పటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు
కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు
వచ్చింది. ఇందు దేశమే హిందూదేశమయింది.
రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం
పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో
చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన
కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు,
ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా
ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహా
గ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ
ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన
దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే
వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా
వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని
పెద్దలు అంటూ ఉండరు.
* నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి
77



----
Page 1
ॐ
ప్రతిమ x విగ్రహ
దైవము X దైయ్యము
రచయిత
త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, అర్ధ శతాధిక గ్రంథకర్త
ఇందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
కాల
చక్రం
చక్రం
కర్మ
చక్రం
చక్రం
-బ్రహ్మనాడి
ఇందూ
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞానవేదిక
(Estd in 1978 - Regd. No.: 168/2004)
త్రైత శకము-37
ప్రథమ ముద్రణ : సం॥ 2015
ప్రతులు : 1000
వెల : 90 /-

Page 2
02 యోగీశ్వరుల వారి సంచలనాత్మక రచనలు
ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు
1) త్రైత సిద్ధాంత భగవద్గీత.
2) ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
3) ధర్మము-అధర్మము.
4) ఇందుత్వమును కాపాడుదాం.
5) యజ్ఞములు (నిజమా-అబద్ధమా?).
6) దయ్యాల-భూతాల యదార్థసంఘటనలు.
7) సత్యాన్వేషి కథ.
8) మంత్రము-మహిమ (నిజమా అబద్దమా)
9) శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
10) గీతా పరిచయము (తెలుగు, ఇంగ్లీషు)
11) కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు).
12) జనన మరణ సిద్దాంతము.
13) మరణ రహస్యము.
14) పునర్జన్మ రహస్యము.
15) త్రైతాకార రహస్యము (తైతాకార బెర్ముడా)
16) కథల జ్ఞానము.
17) సామెతల జ్ఞానము.
18) పొడుపు కథల జ్ఞానము.
19) తత్త్వముల జ్ఞానము.
20) తిట్ల జ్ఞానము-దీవెనల అజ్ఞానము.
21) గీతం-గీత (పాటల జ్ఞానము).
22) తత్త్వార్థ బొమ్మల జ్ఞానము.
23) దేవాలయ రహస్యములు.
24) ఇందూ సాంప్రదాయములు.
25) మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?)
26) జ్యోతిష్యశాస్త్రము (శాస్త్రమా-అశాస్త్రమా?)
27) తల్లి తండ్రి.
28) గురు ప్రార్థనామంజరి.
29) త్రైతారాధన.
30) సమాధి.
31) ప్రబోధ.
32) సుబోధ.
33) ప్రసిద్ధి బోధ.
34) సుప్రసిద్ధి బోధ.
35) సిలువ దేవుడా?
36) మతాతీత దేవుని మార్గము.
37) దేవుని గుర్తు - 963.
38) మతము-పథము.
39) ప్రబోధానందం నాటికలు.
40) ఇందువు క్రైస్తవుడా?
41) నిగూఢ తత్త్వార్థ బోధిని.
42) ఆత్మలింగార్ధము.
43) నాస్తికులు-ఆస్తికులు.
44) హేతువాదము-ప్రతివాదము.
45) గుత్తా.
46) ప్రబోధ తరంగాలు.
47) త్రైత సిద్ధాంతము.
48) రూపము మారిన గీత.
49) ఉపనిషత్లలో లోపాలు.
50) ప్రథమ దైవగ్రంథము భగవద్గీత.
51) మధ్యమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
52) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు.
53) అంతిమ దైవగ్రంథములో జ్ఞానవాక్యములు
(రెండవ భాగము)
54) ద్రావిడ బ్రాహ్మణ.
55) తీర్పు.
56) కర్మ పత్రము.
57) ప్రవక్తలు ఎవరు?
58) ధర్మశాస్త్రము ఏది?
59) మత మార్పిడి దైవద్రోహము.
60) త్రైతశక పంచాంగము.
61) త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు.
62) స్వర్గము ఇంద్రలోకమా! -
నరకము యమరాజ్యమా!!
63) జీహాద్ అంటే యుద్ధమా?
64) మూడు గ్రంథములు, ఇద్దరు గురువులు.
65) దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది.
66) అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు.
67) వార్తకుడు-వర్తకుడు.
68) దేవుని చిహ్నము.
69) ఏది నిజమైన జ్ఞానము?
70) ప్రతిమ విగ్రహ-దైవము దెయ్యము

Page 3
యోగీశ్వరుల వారి సంచలనాత్మక ప్రసంగాలు
01. సంతకము.
02. సాంప్రదాయము.
03. త్రైతశకము.
04. కోడిపుంజు-పాదరసము.
05. యుగము-యోగము
06. నైజం-సహజం.
07. ఆత్మకు వెంట్రుక గుర్తు.
08. పైత్యం-సైత్యం.
09. శైవము-వైష్ణవము.
10. ఇందూమహాసముద్రము.
11. సృష్ఠి-సృష్టికర్త.
12. కాయ-పండు-కాయ.
13. జ్ఞానము-విజ్ఞానము.
14. వార-మాస-వత్సర.
15. సేకూవలి-కూలిసేవా.
16. ధర్మము-అధర్మము.
17. ఏక్ నిరంజన్-అలక్
నిరంజన్.
18. గురువులేని విద్య గ్రుడ్డివిద్య.
19. బట్టతల.
20. భగవంతుడు.
21. ద్రావిడులు-ఆర్యులు.
22. ప్రభువు-ప్రభుత్వం.
23. భూతం-మహాభూతం.
24. ప్రభు-ప్రజ.
25. యాదవ్.
26. పుస్తకము-గ్రంథము.
27. వెలుగుబంటు.
DVD'S
28. ప్రకృతి-వికృతి.
29. మాట-మందు.
30. ఏకత-ఏకాగ్రత.
31. హరికాలు-హరచేయి.
32. పుట్టగోసి-మొలత్రాడు.
33. 1 2 3 గురుపౌర్ణమి.
34. చమత్కార ఆత్మ.
35. క్షమించరాని పాపము.
36. మాయకుడు-అమాయకుడు.
37. మరణము-శరీరము
03
38. ఎదమీదముద్ర-తల్లి తండ్రి గుర్తు.
39. ద్వితీయుడు-అద్వితీయుడు
40. బయటి సమాజం-
41. సేవా శాతము.
లోపలి సమాజం.
42. ప్రపంచ శ్రద్ధ-పరమాత్మ శ్రద్ధ.
43. శ్రీకృష్ణాష్టమి.
44. దేవునిజ్ఞానము-
మాయమహత్యము
45. తల్లి తండ్రి.
46. తల్లి తండ్రి- గురువు దైవము.
47. సమాధి.
48. మతము-పథము.
49. కలియుగము
50. దివ్యఖురాన్-హదీసు.
51. పుట్టుట-గిట్టుట.
52. తల్లి.
53. గోరు-గురు.

Page 4
04
యోగీశ్వరుల వారి సంచలనాత్మక ప్రసంగాలు
54. కర్మ మర్మము.
55. ఆత్మ.
56. తాత.
57. గురుపౌర్ణమి.
58. ఇందువు-హిందువు.
59. శ్రీకృష్ణజన్మ మధుర.
60. ఆత్మపని.
61. కర్మ లేని కృష్ణుడు-
కర్మ ఉన్న కృష్ణుడు.
62. త్రైత సిద్ధాంతము
63. సహజ మరణం-
తాత్కాలిక మరణం.
64. స్త్రీ-పు / లింగము
65. దేశం మోసం-దేహం మోహం
66. యోగీశ్వరుల జన్మదిన సందేశము.
67. జీర్ణ+ఆశయము
68. మేఘం ఒకభూతం-
రోగం ఒకభూతం.
69. దేవునికి మతమున్నదా?
70. ఇచ్ఛాధీన కార్యములు-
అనిచ్ఛాధీన కార్యములు.
71. ఏది ధర్మము
72. అధర్మ ఆరాధనలు.
DVD'S
73. మూడు పుట్టుకలు-రెండు జాగాలు
74. పుట్టినరోజు ఎవ్వరికీ రాదు.
75. నిదర్శ - నిరూప
76. నటించే ఆత్మ
77. సంచిత కర్మ
78. గురువు ఎవరు?
79. శ్రీకృష్ణుడు ఎవరు?
80. సుఖము-ఆనందము
81. టక్కుటమారా, ఇంద్రజాల
మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ.
82. భయం
83. దశ-దిశలు.
84. ఆడించే ఆత్మ
85. స్వార్థ రాజకీయం (స్వ+అర్థ రాజకీయం)
86. మూడు నిర్మాణాలు-ఒక పరిశుభ్రత
87. ఏది శాస్త్రము?
88. తెలుగులో మూడు-ఆరు-తొమ్మిది.
89. 6-3=6.
90. గుర్తింపబడనివాడు గురువు.
91. జ్ఞానము దగ్గర జాగ్రత్త!
92. చంద్రాకారము (బట్టతల).
93. మతములలో పవిత్రయుద్ధము.
94. మూడు గ్రంథములు.
95. ఏడు ఆకాశములు.
96. దైవగ్రంథము
97. జ్ఞానము కబ్జా అయ్యింది.
98. భక్తి-భయము.
99. జ్ఞానశక్తి.
100. కాలజ్ఞాన వాక్యములు.
101. అర్థము-అపార్థము.
102. తోలేవాడు.
103. గురు చిహ్నం.
104. భక్తి-శ్రద్ధలు
105. దేవుడు ఇద్దరా! ఒక్కరా!!
106. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
-: యూ ట్యూబ్ వీడియోలు :-
http://www.youtube.com/channel/UCkrD6R8nEU0-07gNn46Ktfw

Page 5
ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు లభించు చిరునామా
ప్రబోధాశ్రమము (శ్రీకృష్ణమందిరము)
చిన్నపొడమల (గ్రా), తాడిపత్రి (మం), అనంతపురం (జిల్లా) A.P.
Cell : 9866512667, 9951675081, Fax : 08558-225966.
05
ఇందూ జ్ఞానవేదిక (Head Office) కె.లక్ష్మినారాయణాచారి (ప్రెసిడెంట్)
దిల్సుఖ్నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మార్కెట్ స్ట్రీట్, ధర్మవరం, అనంతపురం (జి)
Cell:9491040963, 9032963963, 9848590172.
*****
షఫీ షేక్ (Vice President, K.I.S.S)
చెన్నై, తమిళనాడు రాష్ట్రం
Cell : 09445554354.
*****
షేక్ ఇబ్రహీం (K.I.S.S Member)
కర్నూల్ టౌన్, ఆం.ప్ర. Cell : 70950 08369
*****
యం. అల్లీపీర్ (K.I.S.S Member)
మడకశిరా, అనంతపురం జిల్లా, ఆం.ప్ర.
Cell : 8978058081
*****
షేక్ అమీర్ అలీ (President, K.I.S.S)
నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
Cell : 9505768181
*****
అనమల మహేశ్వర్ (ప్రెసిడెంట్)
చవటపాల్యం (గ్రా), నెల్లూరు జిల్లా.
Cell: 9494631664,9490809181, 8106065300.
*****
బాలం లక్ష్మీనరసింహులు (ప్రెసిడెంట్)
మదనపల్లి, చిత్తూరు జిల్లా.
Cell: 9440825533, 8519938999.
*****
పోటు వెంకటేశ్వర్లు (గురూజీ)
ప్రెసిడెంట్)
హుజూర్ నగర్, నల్గొండ జిల్లా.
Cell : 9848574803, 9866423853.
*****
పి. ఆదినారాయణ (ప్ర.సభ్యుడు)
ముద్దిరెడ్డి పల్లి (గ్రా॥), అనంతపురం (జిల్లా).
Cell: 9440745800, 7259851861.
Cell:9440556968,9290012413,9440601136.
*****
ఇందూ జ్ఞానవేదిక శాఖ
అనంతపురము టౌన్, A.P.
Cell : 9705959390, 9985580099
*****
MD (acu)
డా॥యం. వెంకటేశ్వర రావు (ప్రెసిడెంట్)
శాంతినగర్, నెల్లూరు జిల్లా.
Cell: 9440615064, 9246770277.
*****
టి. వీరనారాయణ రెడ్డి (ప్ర.సభ్యుడు)
బట్టేపాడు గ్రా॥ ఆత్మకూరు మం॥, నెల్లూరు జిల్లా
Cell: 9494618322, 8374923363
*****
బి. ఆదిశేషయ్య (టీచర్) (ప్రెసిడెంట్)
గుత్తి, అనంతపురం జిల్లా
Cell: 9491362448, 7382986963.
*****
కె.అశోక్ బాబు (టీచర్) (ప్రెసిడెంట్)
రామాపురం (గ్రా), వి.కోట (మం).
చిత్తూరు జిల్లా Cell : 9440305700,
*****
కె.వెంకటేశ్వర్లు (ప్ర.సభ్యుడు)
నందికొట్కూరు, కర్నూలు జిల్లా
Cell:9440047256, 9701956599
*****
ఇందూ జ్ఞానవేదిక శాఖ
విశాఖపట్టణము, ఆంధ్రపప్రదేశ్
7674979663, 9440042763, 8977713666, 9247826253

Page 6
06
ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు లభించు చిరునామా
చెన్న ఆంజనేయులు (కరస్పాండెంట్)
జ్ఞానోదయ హైస్కూల్, ఇటిక్యాల,
రాయికల్ మంII, కరీంనగర్ (జిల్లా)
Cell : 95507 97782
*****
డా॥బి. ధర్మలింగాచారి (ప్ర.సభ్యుడు)
శ్రీ కనక మహాలక్ష్మి క్లినిక్,
(S కోట), విజయనగరము (జిల్లా).
Cell: 08966-275208, 9704911737
*****
వి. శంకర రావు (టీచర్) (ప్రెసిడెంట్)
అశోక్ నగర్, విజయనగరము (జిల్లా).
Cell: 9703534224, 9491785963.
*****
ఎ. నాగేంద్ర (ప్రెసిడెంట్) : 9493622669 |
క్రొత్త చెరువు (గ్రా, మం) అనంతపురం జిల్లా.
9959316410, 9949995090.
*****
రౌతు శ్రీనివాసరావు (ప్రెసిడెంట్)
ఏటుకూరు రోడ్, దర్గామాన్యం,గుంటూరు (జి)
Cell: 9948014366, 9052870853
*****
డి. బాలాజీ (వైస్ ప్రెసిడెంట్)
బంగారు పాళ్యం (గ్రా), చిత్తూరు జిల్లా.
Cell: 9985483241, 7396077408.
*****
వై. రేణుక దేవి (ఇ.సభ్యులు)
పద్మావతినగర్, తిరుపతి టౌన్
Cell: 9491773455, 9032903955.
*****
పి. నాగయ్య (ప్ర.సభ్యుడు)
వీకర్ సెక్షన్ కాలనీ, కర్నూలు టౌన్
Cell: 9440244598, 9849303902,
వి.సి.వర్మ (గురూజీ) ఆనందాశ్రమము
మజ్జివలస (గ్రా, పోస్టు), భీమిలి (మం),
విశాఖపట్నం (జిల్లా), 9441567394, 9502172711.
*****
ఎన్.బి. నాయక్ (ప్ర.సభ్యుడు)
పెదమడక, అగనంపూడి, విశాఖపట్నం (జిల్లా)
Cell: 7396492239, 9248315309, 7386212589.
*****
ఇందూ జ్ఞానవేదిక శాఖ
కొత్తకోట (మం), వనపర్తి (తా)
మహబూబ్ నగర్ (జిల్లా).
Cell: 8790558815, 9440655409, 9701261165.
*****
ఎన్.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
బొద్దాం (గ్రా), రాజాం (మం), శ్రీకాకుళం
Cell: 9494248963, 9959779187.
*****
టి. ఉదయకుమార్ (ప్రెసిడెంట్)
భీమవరం 1టౌన్, ప.గో.జిల్లా
Cell: 9948275984, 7386433834.
*****
టి.వి. రమణ (ప్రెసిడెంట్)
ముదిగుబ్బ (గ్రా) అనంతపురం జిల్లా
3
Cell : 9440980036, 8185020272.
*****
వి. రామక్రిష్ణన్ (వైస్ ప్రెసిడెంట్)
నేతాజిరోడ్డు కుప్పం, చిత్తూరు జిల్లా.
Cell : 9652755110,
*****
ఘడియం. పెద్దరెడ్డి (ప్ర.సభ్యుడు)
నరసరావుపేట, గుంటూరు జిల్లా
Cell: 9989204097, 9849555738
www.thraithashakam.org | Email : info@thraithashakam.org

Page 7
07
ప్రతిమ X విగ్రహ - దైవము X దైయ్యము
ప్రపంచములో ఎవరి ఊహకు అందని దేవుడు ఆయన బిరుదుకు
తగినట్లు ఎవరికీ తెలియనివాడై యున్నాడు. అందువలన ఆయనను
“దేవులాడబడేవాడు దేవుడు" అని అంటున్నాము. దేవులాడడము అనగా
వెతకడము అని అర్థము. వెదకినా తెలియడు కావున ఆయనను అర్థమునకు
తగినట్లు 'దేవుడు' అని అన్నారు. దేవునకు పేరులేదు కనుక దేవుడు
అనునది పేరు కాదనీ, అది అర్ధముతో కూడుకొన్న బిరుదు మాత్రమేయని
తెలియవలెను. పేరు అందరికీ సర్వసాధారణముగా ఉండును. బిరుదు
అందరికీ ఉండునది కాదు. ఉన్న ప్రత్యేకతను గుర్తించి దానికి తగినట్లు
ఆ ప్రత్యేకతను సూచించులాగున చెప్పబడిన దానిని బిరుదు అంటారు
గానీ పేరు అనరు. పేరు మనిషిలోని ప్రత్యేకతను చూపునది కాదు.
'రామ' అను రెండు అక్షరముల పేరు 'కర్మను నశింపజేయువాడు' అని
అర్థముతో కూడుకొని ఉన్నది. అయితే రామ అని పేరు పెట్టుకొన్నవాడు
అంతటి స్థోమత లేనివాడైయుండును. అందువలన మనుషులకున్న పేర్లు
వారిలోని ప్రత్యేకతను చూపలేవు. బిరుదు అయితే ప్రత్యేకతనుబట్టి పెట్టినదై
ఉండును. ఆట ఆడువానిని 'ప్లేయర్' అని అంటారు. ప్లేయర్ అనగా
అతని ప్రత్యేకతనుబట్టి, అతను ఆడు వాడని అర్థమునిచ్చుచూ చెప్పునదిగా
ఉన్నది. అందువలన ప్లేయర్ అనునది పేరు కాదు. ప్లేయర్ అనునది
బిరుదు మాత్రమే. అలాగే దేవుడు అనునది పేరుకాదు, అది ఆయన
ఉన్న విధానమును తెలుపు శబ్దము మాత్రమే.
దేవునికి పేరు ఏమాత్రము లేదు. ఎవరయినా పేరు ఎందుకు
లేదు? అని ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
రూపమున్న దేనికయినా పేరుండును. దేవునికి రూపము లేదు కదా!

Page 8
08
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
అందుకు పేరులేదు. రూపమునకు పేరుకు అవినాభావ సంబంధముండును.
రూపముంటే పేరుండును, పేరుంటే రూపముండును రెండూలేనివాడు
ప్రపంచములో ఒక్కడే ఒక్కడు గలడు, వాడే దేవుడు. రూపము, పేరు
రెండూ లేనివాడు బయటికి తెలియునట్లు స్థూలముగా ఉండడు.
అందువలన దేవుడు చేయు పనులు కూడా స్థూలముగా ఉండవు.
అందువలన దేవునికి పనిలేదు అని చెప్పవచ్చును. దేవుడు తెలియబడడు
అని అంటున్నాముగానీ ఆయన అసలుకు లేడు అని మనము చెప్పలేదు.
అలాగే ఆయన పని కనిపించదు కావున ఆయనకు పని లేదు అంటున్నాము.
ఈ విధముగా దేవున్ని రూప, నామ, క్రియారహితుడు అని అన్నారు.
దేవుని రూపము కనిపించదు, దేవుని పేరు వినిపించదు. దేవుని పని
(కార్యము) తెలియదు. దీనినిబట్టి దేవుడు స్థూలముగా లేడు, సూక్ష్మముగా
ఉన్నాడు అని తెలియగలదు. ఇది దేవుని ప్రాథమిక ధర్మము. అదే
శాసనము, దీనిని ఎవడూ మార్చుటకు వీలులేదు. ఎవడయినా నేను
దేవున్ని చూచాను అని అంటే అది పూర్తి అసత్యము.
దేవుడు సూక్ష్మముగాయుండి స్థూలమైన ప్రపంచమును నిర్మించాడు.
స్థూలమైన ప్రపంచమునకు, సూక్ష్మమైన ప్రపంచమును కూడా జోడించాడు.
కనిపించే మనుషులను సృష్టించినట్లే, కనిపించని భూతములను,
గ్రహములను దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన తన సృష్ఠియంతయూ
స్థూల, సూక్ష్మమని రెండు భాగములుగాయున్నది. కనిపించని సూక్ష్మ
భాగమునకు తాను కనిపించని వాడుగాయుండి వాటిని నడుపుచున్నాడు.
అదే విధముగా కనిపించే వాటితో కూడా దేవుడు కనిపించే వానిగానే
సంబంధపడి వాటికి తన జ్ఞానమును తెలియజేయవలసి యుంటుంది.
దేవుని సృష్ఠి రెండు రకములుగా ఉండుట వలన దేవుడు కూడా స్థూల,

Page 9
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
09
సూక్ష్మ అను రెండు రకములుగా ఉన్నాడు. దేవుడు సూక్ష్మముగా నామ,
రూప, క్రియారహితునిగా ఉన్నాడు. అట్లే స్థూలముగా నామ, రూప,
క్రియా సహితునిగా కూడా ఉండవలసిన అవసరమున్నది. ఇక్కడ దేవుడు
నామ రూప క్రియారహితుడని చెప్పి క్రిందనే నామ, రూప, క్రియాసహితు
డని ఎలా చెప్పగలరని? ఎవరయినా ప్రశ్నించవచ్చును. అలా చెప్పడము
వలన వాక్యములో శాస్త్రబద్దత లేకుండాపోయి అసత్యముగా కనిపించును
కదా!యని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఈ విధముగా
కలదు.
దేవుడు సూక్ష్మమైనవాడు, నామ, రూప, క్రియారహితుడు అని
చెప్పి ఇది శాసనము, దేవుని ప్రాథమిక ధర్మము అని చెప్పిన తర్వాత
దానికి వ్యతిరేఖముగా ఏమి చెప్పినా అది అసత్యమగును, అశాస్త్రీయమగును.
అందువలన దేవుడు అలా నామ, రూప, క్రియలు కల్గియున్నాడని చెప్పడము
పూర్తి తప్పగును. అందువలన ఈ సమస్యను దేవుడే పరిష్కరిస్తూ ఆయనే
తన స్థూల, సూక్ష్మముల వివరమును గురించి తెలియజేశాడు. దేవుడు
ఎప్పటికీ సూక్ష్మముగానే ఉండును. స్థూలముగా ఎప్పుడైనా కొంత
సమయములో ఉండు ఆయనను అప్పుడు దేవుడు అని అనకూడదు.
స్థూలముగా వచ్చినవాడు దేవుడే అయినా, అప్పుడు ఆయనను దేవుడు
అని చెప్పకూడదు. దేవుడు ఎప్పటికీ సూక్ష్మమైనవాడే కనుక దేవుని
స్థూలరూపమునకు దేవుడను మాట వర్తించదు. స్థూలముగాయున్న
సమయములో భగవంతుడని చెప్పవచ్చును లేక 'గురువు' అని చెప్పవచ్చును.
దేవుడే ఆ విధముగా తన విధానమును నిర్ణయించుకొన్నాడు. ఇప్పుడు
స్థూలముగాయున్న దేవున్ని భగవంతుడు లేక గురువు అని చెప్పడమేకాక,
సూక్ష్మముగాయున్న వానిని దేవుడు అని పిలువవచ్చును అని తెలిసిపోయింది.

Page 10
10
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఈ విధముగా దేవుడు రెండు రకములుగా కలడు. సూక్ష్మముగాయున్నప్పుడు
దేవుడు అని చెప్పబడిన వాడు స్థూలముగాయున్నప్పుడు భగవంతునిగా
చెప్పబడుచున్నాడు. దీనినిబట్టి ఏ విధముగా స్థూలము, సూక్ష్మములు
రెండు వేరు వేరుగా ఉన్నవో, అదే విధముగా దేవుడు, భగవంతుడు
వేరువేరుగా పిలువబడుచున్నారు. సూత్రము ప్రకారము దేవున్ని
భగవంతుడని చెప్పకూడదు. అలాగే భగవంతున్ని దేవుడని చెప్పకూడదు.
దేవుని ప్రాథమిక జ్ఞానము ప్రకారము దేవుడు వేరు, భగవంతుడు వేరుగా
ఉన్నారని తెలియుచున్నది.
దేవుడు 'ఏకస్వరూపుడు' అని కొందరు అనగా వినియున్నాము.
అటువంటప్పుడు స్థూల, సూక్ష్మమని రెండు రకములుగా చీల్చి దేవుడు,
భగవంతుడు అని అంటున్నారు. దేవుడు, భగవంతుడు అను రెండు
రకములుగాయున్న వానిని ఏకస్వరూపుడని ఎలా పిలువాలి? అని కొందరు
ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు! దేవుడు
ఒక్కడే అయినా ఆయన మనకు తెలిసి ఒక రకముగా, తెలియక ఒక
రకముగా ఉన్నాడు. తెలిసి భగవంతునిగా, తెలియక దేవునిగా ఉన్నాడని
ఇంతవరకు తెలుసుకొన్నాము. అయితే దేవున్ని గురించి ఇంకా ఎంతో
తెలియవలసియున్నది. దేవుడు సులభముగా అర్థమగువాడు కాడు.
ఎందుకనగా! రూప, నామ, క్రియలు లేని దేవుడు సర్వజీవరాశులను ఎలా
సృష్ఠించాడు? అను ప్రశ్న రాగలదు. దేవుడు పనిచేయనివాడయితే
ఇంతమంది మానవులను, ఇన్ని జీవరాశులను ఎలా సృష్ఠించాడు?
సృష్టించాడు అంటే పని చేసినట్లే కదా!యని ప్రశ్నించుటకు అవకాశము
గలదు. అప్పుడు దానికి జవాబు లేకుండా పోవు అవకాశము గలదు.
జ్ఞానము అంటే ప్రతి ప్రశ్నకు జవాబు ఉండునది అని అర్థము. నిజమైన

Page 11
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
11
జ్ఞానములో జవాబు లేని ప్రశ్నవుండదు. అందువలన దేవుడు నామ,
రూప, క్రియలు లేనివాడు అనకముందుగానీ లేక తర్వాతగానీ ఏదో మనకు
తెలియని రహస్యమున్నదనీ, లోతుగా చూచి నట్లయితే దేవుని విధానములో
కొంత మనకు తెలియని విషయము తెలియు చున్నది, అదేమనగా!
దేవుడు రెండు రకములుగా ఉన్నాడనీ ఒకటి రూప, నామ, క్రియలు
లేని సూక్ష్మముగా ఉన్నాడనీ, రెండు రూప, నామ, క్రియలుగల స్థూలముగా
ఉన్నాడని చెప్పుకొన్నాము. అయితే మన ఊహకు కూడా అందని
విధానమంటు ఒకటున్నది, అదే మూడవ విధానము. మూడవ విధానములో
దేవున్ని దేవుడని కూడా చెప్పలేము. ఆ విధానము ఇటు స్థూలముగాగానీ,
అటు సూక్ష్మముగానీ లేనిదై ఉన్నది. దేవుడు, భగవంతుడు రెండూకాని
విధానముగా మూడవ విధానము గలదు. ఇది ఎటూ చెప్పలేని విధానముగా
ఉండడమేకాక, ఎటూ అర్థముకాని విధానముగా యున్నదని చెప్పవచ్చును.
మూడవ విధానములో స్థూలములోవలె క్రియలు కలవానిగా ఉన్నాడు,
సూక్ష్మములోవలె ఆకారము లేనివాడైయున్నాడు. పేరును చూస్తే దేవుడు,
భగవంతుడు అని కాకుండా 'స్థిరాస్థిరునిగా' యున్నాడు. 'స్థిరాస్థిరుడు'
అను పదమును విడదీసి చూస్తే స్థిర + అస్థిర అని కలదు. స్థిర అనగా
శాశ్వతమైన దని, అస్థిర అనగా అశాశ్వతమైనదని అర్థము. శాశ్వత,
అశాశ్వతములు కలవాడని దాని అర్థము. ఇది ఎటూగాని రెండువైపులనుండి
చెప్పునదిగా ఉన్నది. దీనిని పేరు అని చెప్పలేము, పేరుకానిదని కూడా
చెప్పలేము. మూడవ విధానములో రూపములేదుగానీ పని ఉన్నది. పని
ఉన్నదిగానీ రూపములేదనియే చెప్పవచ్చును. స్థిరాస్థిరుడు అంటే ఒక
అర్థమునకు కూడా అందనివాడు. దేవుడు అంటే దొరకనివాడు,
తెలియనివాడు అని చెప్పవచ్చును. అయితే స్థిరాస్థిరుడు అంటే ఎటూ

Page 12
12
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
చెప్పలేము. అందువలన పేరు ఉన్నా లేనివాడు అని చెప్పవచ్చును.
దీనినిబట్టి మూడవ విధానములో ఆకారములేదు కార్యమున్నది. అలాగే
పేరున్నదిగానీ అర్థము లేనిదిగా ఉన్నది.
మూడవ విధానము కొంత విచిత్రముగాయున్నది. దేవుడు
స్థూలముగా భగవంతుడయితే, సూక్ష్మముగా దేవుడయితే, స్థిరాస్థిరునిగా
కొంత స్థూలము, కొంత సూక్ష్మముగా యున్నాడు. ఆకారములో సూక్ష్మముగా,
కార్యములో స్థూలముగా యున్నాడని చెప్పవచ్చును. ఇక్కడ కొందరు ఒక
ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ఇంతవరకు ఎందరో భూమిమీద
జ్ఞానమును తెలుపు స్వామీజీలు, మతపెద్దలు, బోధకులు ఉన్నారు. అయినా
ఒక్కరు కూడా మీరు చెప్పిన మూడవ విధానమును గురించి ఎవరూ
చెప్పలేదు. భూమిమీద ముఖ్యముగా మూడు దైవగ్రంథములున్నాయి.
అందులో గీతయందుగానీ, బైబిలుయందుగానీ, అంతిమ దైవగ్రంథము
ఖురానియందుగానీ మీరు చెప్పిన మూడవ విధానము లేదు. ఆ మూడు
గ్రంథములలో స్థూల, సూక్ష్మ అను రెండు విధానములు కూడా పూర్తిగా
కాకుండా అస్పష్టముగా కనిపించుచున్నవి. అదియూ బుద్ధి గ్రహించుకొను
శక్తియున్న వారికి మాత్రమే ఆ గ్రంథములలో స్థూల, సూక్ష్మ రెండు
విధానములు కనిపించుచున్నవి. మీరు చెప్పు మూడవ విధానము ఎక్కడా
లేదు దీనికి మీరేమంటారు? గ్రాహితశక్తి లేనివారికి స్థూలము తప్ప సూక్ష్మము
కనిపించడము లేదు. ముస్లీమ్లకు ఖురాన్ గ్రంథములో స్థూలము మాత్రము
కనిపించుచున్నది, దేవుని యొక్క సూక్ష్మత ఏమాత్రము కనిపించడములేదు.
మూడు గ్రంథములలో దేవుని రెండు విధానములు వ్రాయబడియుండగా
మూడవ విధానము బుద్ధియున్న వాడు గ్రహించగలిగినదైయున్నది. అయినా
ఇంతవరకు రెండు విధానములనే మనిషి సరిగా గ్రహించలేకయున్నాడు.

Page 13
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
13
మూడవ విధానము గ్రంథములలో ప్రత్యేకించి చెప్పకపోవడము వలన,
స్పష్టముగా లేకుండా అస్పష్టముగాయుండుట వలన, మూటలో ముడివేసి
పెట్టిన గంటువలెయుండుట వలన మూడవ విధానము కొందరికి కూడా
అవగాహనకు రాకుండా పోయినది. ఇప్పుడు కొందరు మరియొక ప్రశ్నను
అడుగవచ్చును. అదేమనగా! భూమిమీద అందరికీ అర్థముకాని జ్ఞానము
అనగా దేవుని మూడవ విధానము మీకెలా తెలిసిందని అడుగవచ్చును.
దానికి మా జవాబు ఇలా కలదు చూడండి!
ఎవరికీ తెలియని దానిని గ్రంథమునుండి నేను గ్రహించుకొన్నాను.
అందరి బుద్ధికంటే నా బుద్ధి గొప్పదియని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాకు
పుట్టుకతోయున్న భావమే గ్రంథములో యున్నది గానీ గ్రంథములోనుండి
నేను గ్రహించుకొన్నది ఏమీ లేదు. నా భావములే మూడు గ్రంథము
లలో యుండుట వలన అందులో నాకు రహస్యములంటూ
ఏమీ లేవు. వాటి నుండి నేను నేర్చుకొన్నది కూడా ఏమీ లేదు. నేర్చుకొనే
వాడు ఒక గ్రంథమునకే పరిమితి కాగలడు. ఇతర గ్రంథములను, ఇతర
మతములను ద్వేషించును. ఫలానా మతమువాడని గుర్తింపు తెచ్చుకొనును.
సత్యమును చెప్పితే నేడు ఒక గ్రంథములోని విషయమును (జ్ఞానమును)
కూడా సరిగా తెలుసుకొన్నవాడు లేడు. మూడు గ్రంథములలోని వాస్తవ
జ్ఞానమును నేను చెప్పుచున్నానంటే అది నేర్చుకొన్నదైతే కాదు. మనుషులలో
ఒక దానిని కూడా సరిగా తెలియని వాడు మూడింటిని ఎలా తెలియగలడు?
అందువలన నేడు లోకమున దేవుని జ్ఞానము అసంపూర్ణముగానే
మనుషులకు తెలిసినదని చెప్పవచ్చును. జ్ఞానము తెలియని దానివలన
నేను సులభముగా చెప్పు దేవుని జ్ఞానమును మనిషి గుర్తు పట్టలేక
పోవుచున్నాడు.

Page 14
14
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
దేవుడు తన జ్ఞానమును స్థూల, సూక్ష్మములని చెప్పడమైనది,
అంతేగానీ స్థిరాస్థిరములని ఎక్కడా ప్రత్యేకముగా చెప్పలేదు. తన జ్ఞానము
మీద ఆసక్తియున్నవానికి మాత్రము తెలియునట్లు తన మూడవ విధానము
తన గ్రంథములలో ఇమిడియుండునట్లు చేశాడు. దేవుని మూడవ
విధానమైన స్థిరాస్థిరము, రెండు విధానములను బాగా గ్రహించినప్పుడు
మూడవ విధానము తెలియగలదు. రెండు విధానములు తెలియని వారికి
మూడవ విధానము మీద ధ్యాస ఏమాత్రముండదు. దేవుడు మూడు
విధములుగా ఉన్నాడని గుర్తించుటకు తన ఆత్మను మూడు విధములుగా
క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని విభజించి చెప్పాడు. ఇక్కడ
మనము కొంత ప్రక్కకు జరిగి చెప్పుకొంటే దేవుడు అని కొందరికి, అల్లాహ్
అని కొందరికి, యెహోవా అని కొందరికి పరిచయమున్న వాడు ఒక్కడే
దేవుడు. ఆధ్యాత్మిక పరిభాషలో దేవున్ని పురుషుడు అనీ, సమస్త ప్రపంచమును
ప్రకృతియని అంటున్నాము. కనిపించే ప్రపంచమంతయు ప్రకృతియనీ,
కనిపించని దేవున్ని పురుషుడని అంటున్నాము. ప్రకృతిని విభజించితే
ఐదు భాగములుగా కలదు. ప్రకృతి ఐదు భాగములుగా ఉండుట వలన
'ముతైదువ' అంటారు. ముతైదువ అనగా ఐదు లక్షణములు గలది అని
అర్థము. ఐదు లక్షణములు గల శరీరమును తయారు చేయునది స్త్రీ అని
అర్ధము. మొత్తము మీద ప్రకృతిని స్త్రీ అని అంటున్నాము. దేవున్ని
పురుషుడు అని అంటున్నాము. ప్రకృతి పరమాత్మలకు స్త్రీ, పురుషుడు
అని పేరు పెట్టకముందు పురుషుడిని ఆత్మ అనియూ, స్త్రీని ప్రకృతి అనియూ
ఆధ్యాత్మికరీత్యా అనెడివారము. దాని ప్రకారమే ప్రకృతి ఐదు భాగములని
ముతైదువని, పురుషుడైన దేవున్ని ఆత్మ అనియు, ఆత్మ మూడు భాగములని
త్రైతాత్మ అని అంటున్నాము. ప్రకృతిని ఐదు భాగములుగా విభజించకపోతే

Page 15
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
15
ప్రకృతి ఒకే స్త్రీగా మిగిలిపోతుంది. అనగా ఉత్పత్తి చేయు సాధనముగా
మిగిలి పోతుంది. అలాగే దేవున్ని మూడు భాగములుగా విభజించకపోతే
ఒకే పురుషునిగా మిగిలిపోగలడు. అనగా ఉత్పత్తి చేయు బీజముగా
మిగిలిపోవును.
పురుషుని విషయమునే గ్రహించగలిగితే పురుషుడు మూడు
రకములుగా ఉన్నాడని మూడు దైవగ్రంథములు గొంతెత్తి చాటుచున్నవి.
ముగ్గురు పురుషుల విషయము మూడు గ్రంథములలో చాటిచెప్పుచున్నా,
మనుషులకు మాత్రము పురుషుడు ముగ్గురుగా ఎలా ఉన్నాడు అని
తెలియదు. ముగ్గురు పురుషుల విషయము మొదట మాతోనే ప్రచారము
లోనికి వచ్చినదని, అది మాలోని భావమని చెప్పగలము. మా భావమునకు
సరి సమానముగా ముగ్గురు పురుషుల సమాచారము మూడు గ్రంథములలో
గలదు. ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడు లేక ఒకే పురుషుడు
ఉన్నప్పుడు ఆయన ఎలా మూడు భాగములయినాడని ఎవరయినా
ప్రశ్నించవచ్చును. అయితే ఇక్కడ మూడు భాగములను ముక్కలుగా చీల్చి
చేయలేదు. ఒకే బొమ్మ మూడుచోట్ల మూడు నీడలుగా ప్రతిబింబిచినట్లు
ఒకే ఆత్మ మూడు ఛాయలుగా మారిపోయినది. ఒకే పేపరులోని
సమాచారమును మూడు కాపీలుగా జీరాక్స్ తీసినట్లు ఒకే పురుషుడు
ముగ్గురు పురుషులుగా మారిపోయాడు. ఒక పేపరు మీద సమాచారమును
జీరాక్స్ ద్వారా మూడు పేపర్ల మీద సమాచారముగా మార్చి వేయుచున్నాము
కదా! ఆ మూడు పేపర్లలో ఒకటి వర్జినల్ (అసలయిన) సమాచారముకాగా,
రెండు జీరాక్స్ పేపర్లలోని సమాచారము డూప్లికేట్ (మొదటి దానిని పోలిన)
సమాచారముగా యున్నది. జీరాక్స్ కాపీ మొదటి పేపర్ సమాచారమే
రెండవ, మూడవ పేపర్ మీదయున్న దానిని వర్జినల్ పేపర్ అనము.

Page 16
16
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
అలాగే మొదటి ఆత్మను పోలిన రెండు ఆత్మలు తయారయినా,
అవి
మొదటి ఆత్మ పోలికయేయున్నా, అవి మాత్రము మొదటి ఆత్మ కావు.
ఒకే పురుషుడు లేక ఒకే ఆత్మ నుండి మిగతా రెండు ఆత్మలు తయారయినా,
అవి మొదటి ఆత్మను పోలియున్నా వాస్తవానికి మొదటి ఆత్మ కావు.
ఈ విధముగా ఒక పురుషుడయినా ఆత్మ మొదటి పురుషుని
నుండి ఇంకా రెండుగా విడిపోయి మొత్తము ముగ్గురు పురుషులుగా మిగిలి
యున్నది. మొదటి పురుషునినుండి రెండవ పురుషుడు విడిపోగా, రెండవ
పురుషునినుండి మూడవ పురుషుడు విడిపోయి మొదటి పురుషునితో సహా
ముగ్గురు పురుషులుగా చెప్పబడుచున్నవి. అందులో మొదటిది ఉత్తమ
పురుషుడుకాగా, రెండవది అక్షర పురుషుడు, మూడవది క్షర పురుషుడుగా
చెలామణి అగుచున్నారు. ముగ్గురు పురుషులను మూడు ఆత్మలుగా చెప్పితే
మొదటి ఆత్మ పరమాత్మయనీ, రెండవ ఆత్మ ఆత్మయనీ, మూడవ ఆత్మ
జీవాత్మయని పిలువబడుచున్నవి. ఈ ముగ్గురిని ఇంకొక విధముగా దేవుడు,
పొరుగువాడు, జీవుడు అని కూడా చెప్పుచున్నారు.
1) ఉత్తమ పురుషుడు 2) అక్షర పురుషుడు
1) పరమాత్మ
1) దేవుడు
2) ఆత్మ
3) క్షర పురుషుడు
3) జీవాత్మ
2) పొరుగువాడు 3) జీవుడు
ఈ విధముగాగల ముగ్గురిని మూడు గ్రంథములయందు
ముఖ్యముగా చెప్పియున్నా, ఎవరూ ఈ ముగ్గురిని గుర్తించలేదు, దైవ
గ్రంథములో చెప్పిన మూడు ఆత్మల విషయములో మధ్య ఆత్మ విషయము
ఎవరికీ తెలియదనియే చెప్పవచ్చును. ఇంతవరకు ఆధ్యాత్మిక బోధకులను
వారికి మధ్యఆత్మ అయిన అక్షర పురుషుని గురించి ఏమాత్రము

Page 17
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
17
తెలియదనియే చెప్పవచ్చును. ఆత్మయను పేరు అందరి నోళ్ళలో పలుకబడు
చున్నా, ఆత్మంటే ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయినది. ఆత్మ
విషయములో ఎటువంటివాడయినా వెనుకబడియున్నాడని తెలియగలదు.
ఆధ్యాత్మికములో మధ్య ఆత్మ, లేక అక్షర పురుషుడు, లేక పొరుగువాడు
అని చెప్పబడుచున్నవాని పాత్రయే ఎక్కువగాయున్నది. అందువలన మధ్య
ఆత్మ విషయము తెలియని వానిని పూర్తిజ్ఞాని అని అనుటకు వీలులేదు.
ఈ మూడు ఆత్మలను ఒక్కొక్క దానిని వివరముగా విశదీకరించుకొందాము.
ఇంతకుముందు మనము ఆధ్యాత్మిక విద్యలో అనగా బ్రహ్మవిద్యలో
చాలామార్లు మొదటి ఆత్మను గురించి చెప్పినప్పుడు దేవుడు అని చెప్పుచూ
వచ్చాము. మొదటి ఆత్మను అనగా ఉత్తమపురుషున్ని గురించి చెప్పు
కొనుటకు అంతకంటే మించిన పదముగానీ, మంచి పదముగానీ
లేనిదానివలన అలాగే చెప్పుకుంటూ వచ్చాము. ఆత్మ అను విషయానికి
వస్తే దాని అర్థము ప్రకారము ఆత్మ అనగా అణిగియున్నదనీ, తెలియకుండా
ఉన్నదని అర్థము గలదు. తెలియకుండా ఉన్నదానివలన మధ్య ఆత్మను
కూడా ‘దేవుడు’ అని అనవచ్చును. దేవుడు అనగా తెలియబడని వాడనియేగా
అర్థము. అలాగే ఆత్మకూడా ఎవరికీ తెలియక శరీరములో అణిగి
యున్నందున ఆత్మను శరీరములోని దేవుడని అనవచ్చును. మొదటి
పురుషుడయిన పురుషోత్తమున్ని శరీరము బాహ్యములో కూడా దేవుడని
చెప్పవచ్చును. ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి ఎవరికీ
తెలియకుండా ప్రపంచమంతాయున్న మొదటి పురుషున్ని 'బాహ్య దేవుడు'
అని అనవచ్చును. శరీరములోపలయున్న ఆత్మ తెలియదు కావున 'ఆత్మ
శరీరములోని దేవుడు'గాయున్నది. ఇట్లు దేవుడు అను పదమును రెండు
విధములుగా వాడవచ్చును. మాటల సందర్భములో 'దేవుడు బుద్ధి

Page 18
18
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
పుట్టించితే' అని అప్పుడప్పుడు అంటూవుంటాము. దేవుడు పనిచేయని
వాడని ఒకవైపు చెప్పుచూ, మరొకవైపు దేవుడు బుద్ధి పుట్టించితే అనడములో
దేవుడు పనిచేసినట్లే కదా! అందువలన దైవజ్ఞానమును మాట్లాడునప్పుడు
పూర్తి ఎరుక కల్గి మాట్లాడవలెను. శరీరాంతర్గతములో అన్నీ చేయువాడు
మధ్య ఆత్మే అయినందున, మధ్య ఆత్మను 'దేవుడు' అని ఉచ్ఛరించుచూ
మధ్య ఆత్మ చేయు పనులను దేవుడు చేయుచున్నాడని చెప్పవచ్చును. మనకు
మధ్య ఆత్మ విషయము తెలియకపోయినా 'దేవుడు నన్ను ఎట్లు ఆడిస్తే
అట్లు ఆడగలను' అని ఒకడు అంటున్నాడు. 'దేవుడు చేపిస్తే నేను చేశాను’
అని మరొకడు అంటున్నాడు. 'దేవుడు నా బుద్ధికి అందిస్తే చెప్పగలను'
అని ఇంకొకడు అంటున్నాడు. దేవుడు పని చేయనివాడని, దేవుడు తన
ప్రాథమిక ధర్మము ప్రకారము కార్యరహితుడని మనము జ్ఞానములో
చెప్పుకొన్నా, కొన్ని సందర్భములలో మనకు తెలియకుండానే దేవుడు
పనిచేయువానిగా చెప్పుచున్నాము.
మొదట పురుషుడయిన దేవుడు ప్రపంచము పుట్టక పూర్వము
స్థిరాస్థిరుడని చెప్పబడుట వలన ఆయనను ఊహించుటకు కూడా
సాధ్యమయ్యేది కాదు. ప్రపంచము సృష్టించబడక పూర్వము దేవుడు దేనికీ
సంబంధము లేనివాడుగా యుండెడివాడు. అప్పుడు దేవుడు అనే పదము
కూడా ఆయనకు వర్తించదు. వెదికేవాడే లేనప్పుడు వెతకబడేవానిని గురించి
ఏమీ చెప్పలేము. అటువంటి శూన్యస్థితిలో అనగా సృష్టికి పూర్వము
'నిరామయుడు, నిర్వికారుడు, నిరాధారుడు, దేనికీ సంబంధము
లేనివాడు', ఆయనను గురించి ఎటూ చెప్పలేము. అందువలన సృష్టికంటే
పూర్వమున్న వానిని ఎటూ చెప్పలేక ఆయన అన్నిటికీ సంబంధము
లేనివాడని చెప్పాము. ఇదే విషయమునే అంతిమ దైవగ్రంథములో అల్

Page 19
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
19
ఇఖాస్ అను 112వ సూరాలో నాలుగు వాక్యములుగా చెప్పారు చూడండి.
(12-1,2,3,4) “1) ఆయన ఒక్కడే గలడు. 2) ఆయనకు ఎవరి అక్కరా
లేదు. 3) ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరికీ సంతానము
కాదు. 4) ఆయనకు సమానము ఏదీ లేదు.”
చదివారు.
ఒక దైవగ్రంథములో చెప్పిన నాలుగు విధానములను చాలామంది
హిందువులు, క్రైస్తవులు ఈ వాక్యములను చదివియుండరు.
ఎందుకనగా! అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో చివర 112వ
సూరాలో చెప్పినందున, ఖురాన్ గ్రంథమును ముస్లీమ్లు తమ గ్రంథమని
చెప్పుకోవడము వలన, మతభేదమున్న వారందరూ వారిది మేమెందుకు
చదవాలని హిందువులు, క్రైస్తవులు చదవకుండా వదిలివేయడము జరిగినది.
అంతిమ దైవగ్రంథములో 112వ సూరాలోని నాలుగు వాక్యములు నాకు
చాలా ఇష్టమైనవని నేను ఎన్నోమార్లు చెప్పియుండడమూ కొందరికి తెలుసు.
ఈ వాక్యములు నాకు ఎందుకు ఇష్టమో చాలామందికి తెలియదు. ఈ
వాక్యములను చదివిన ముస్లీమ్లు చాలామంది గలరు. అయితే వారిలో
కనీసము ఒక్కరికయినా ఈ సూరా అర్థమయిందని చెప్పలేము. ఈ
సూరాలోని నాలుగు వాక్యములలో ఒక్క వాక్యమునకు కూడా సరియైన
జవాబును చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అనగా! 112వ సూరా మొత్తము
నాలుగు వాక్యములు సృష్ఠి పూర్వమున్న దేవున్ని గురించి చెప్పిన వాక్యములు.
అయితే మనిషికి జ్ఞానము ద్వారా తెలిసినది సృష్ఠి తర్వాత గల దేవుని
విషయము. సృష్ఠి తర్వాత గల దేవున్ని గురించి భగవద్గీతలో గుణత్రయ
విభాగయోగమున చెప్పిన 3, 4 శ్లోకముల ప్రకారము “సమస్త మానవులకు
తండ్రి దేవుడు” అనిగలదు. ఈ మాట మనుషులందరికీ సంబంధించినదై
ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతయందు చెప్పబడినది. ద్వితీయ దైవ

Page 20
20
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
గ్రంథము బైబిలులో కూడా దేవున్ని తండ్రియని చెప్పియున్నారు. అంతిమ
దైవ గ్రంథము ఖురాన్లో 'సమస్తమును దేవుడు సృష్టించెను' అని చెప్పడమే
కాక, ‘దేవున్ని సృష్టికర్తయని', 'సమస్త మనుషులను సృష్టించినవాడు అల్లాహ్
యని' చెప్పియున్నారు. అలా చెప్పడమువలన దేవుడు అందరికీ తండ్రియని
తెలియబడుచున్నది.
తండ్రియైన దేవుడు అని బైబిలు గ్రంథములో యోహాన్ సువార్త
6వ అధ్యాయము 27వ వచనమందు గలదు. (యోహాన్ 6-27)
(030066-27)
"క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గానీ నిత్యజీవము కలుగజేయు
అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని
మీకిచ్చును. ఇందుకై “తండ్రియైన దేవుడు” ఆయనకు ముద్రవేసి
యున్నాడు” అని గలదు. భగవద్గీతయందు గుణత్రయ విభాగయోగమున
4వ శ్లోకములో "అహం బీజ ప్రదః పితా” “బీజదాతనైన నేను తండ్రిని’
అని చెప్పియున్నాడు. అంతేకాక అదే భగవద్గీతయందు రాజవిద్యా
రాజగుహ్యయోగమున 17వ శ్లోకమందు "పితాహ మస్య జగత్" అని
గలదు. దాని అర్థము “సమస్త జగతికి తండ్రిని నేనే" అని కలదు. అదే
ఖురాన్ గ్రంథములో కూడా సూరా 10, ఆయత్ 56లో (10-56) “దేవుడే
ప్రాణము పోస్తాడు, దేవుడే ప్రాణము తీస్తాడు. మీరంతా ఆయన వద్దకే
మరలింపబడుతారు" అని కూడా కలదు. అంతేకాక 'అందరికీ
సృష్టికర్తయైన దేవుడు” అని చాలామార్లు ఖుర్ఆన్ గ్రంథములోనే చెప్పబడినది.
ఈ విధముగా మూడు దైవ గ్రంథములలో “దేవుడు అందరికీ తండ్రి" అని
చెప్పియున్నారు. అయితే ఖురాన్ గ్రంథములో 112వ సూరాలో 3వ
ఆయతానందు “ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరికీ సంతానము
కాదు" అని కలదు. దైవగ్రంథములో ఒకమారు దేవుడు చెప్పినమాటకు

Page 21
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
21
వ్యతిరేఖముగా రెండవమారు దేవుడు చెప్పలేదు అను మాట ప్రకారము
చూస్తే, మూడు గ్రంథములలోనూ దేవునికి సంతానముంది, సమస్త జీవులు
ఆయన సంతతియే, అందరికీ ఆయనే తండ్రియని చెప్పియున్నాడు. అలా
చెప్పినవాడు అంతిమ దైవగ్రంథములో చివరిలో 112వ సూరాలో మూడవ
వాక్యమందు “నాకు సంతతే లేదు” అని ముందు మాటలన్నిటికీ
వ్యతిరేఖముగా చెప్పాడు. 'దేవుడు సత్యబద్దుడు, సత్యసమేతముగా తన
జ్ఞానమును ప్రజలకు అందించాడు' అని చెప్పిన వారి మాటకు వ్యతిరేఖముగా
'నాకు సంతతి లేదు’ అని చెప్పాడు. ఈ మాటను చాలామంది ముస్లీమ్లు
కూడా చెప్పగా విన్నాము. మూడు గ్రంథములలో చెప్పిన మాటకు పూర్తి
వ్యతిరేఖముగా 112వ సూరాలో వాక్యమున్నది. దేవుడు ఎందుకు అలా
ఒకచోట ఒకరకము మరొకచోట మరొక రకముగా చెప్పాడు? అని
అడిగాము. దానికి చాలామంది ముస్లీమ్లు దేవుడు చెప్పిన మాటను
ప్రశ్నించకూడదు. దేవుడు దేనిని చెప్పితే దానినే నమ్మవలెను, దానినే
వినవలెను. అంతేగానీ అదెలాయని ప్రశ్నించకూడదు అని అంటున్నారు.
దేవుడు ‘అందరికీ తండ్రిని నేనే'యని ఒకచోట చెప్పి, మరియొక
చోట 'ఎవరికీ నేను తండ్రిని కాను' అంటే, అప్పుడు రెండు మాటలగును
కదా! ఆ రెండు మాటలలో దేనిని నమ్మాలి? అని ప్రశ్నిస్తే దేవుడు ఏది
చెప్పినా వినాలి, నమ్మాలి అంతేగానీ తిరిగి ప్రశ్నించకూడదు అని ఒక కథ
చెప్పుచున్నారు. దేవుడు మన ఎదుటే ఒక పక్షిని చంపి నాలుగు ముక్కలుగా
నరికి, నాలుగు ముక్కలను నాలుగు వైపుల విసరివేసి తర్వాత ఆ పక్షిని
పిలిస్తే అది బ్రతికి వచ్చింది. ఇక్కడ పక్షి చచ్చిపోయింది కదా!యని
ప్రశ్నించకూడదు. దేవుడు ఏమయినా చేయగలడు. ఆయన అనుకొంటే
ఏదయినా సాధ్యమే. అందువలన దేవుని విషయములో ప్రశ్న ఉండకూడదు

Page 22
22
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
అని అంటున్నారు. ఒక విధముగా ఈ వాదము సరియైనదని దేవుడు
కూడా ఒప్పుకోడు. ప్రశ్న ఉన్నప్పుడే జవాబు ఉంటుంది. ఆకలి లేనిది
ఆహారముతో అవసరమే లేదు. తెలుసుకోవాలను ఆసక్తియున్నప్పుడే చెప్పే
దానిని వినగలడు. మొదటికి వినే ఆసక్తి, తెలుసుకోవాలను శ్రద్ధ లేనప్పుడు
మనిషికి వినే అవసరమే ఉండదు. తెలుసుకోవాలను ఆసక్తినే 'శ్రద్ధ'
అంటున్నాము. శ్రద్ధ యున్నప్పుడే మనిషి దేనినయినా ఓపికగా తెలుసుకో
గలడు. శ్రద్ధలేని వానికి ఏమి చెప్పినా అది వాని బుర్రకు ఎక్కదు.
భగవద్గీతలో అర్జునుని ప్రశ్నలున్నాయి, కృష్ణుని జవాబులున్నాయి. అలాగే
బైబిలులో శిష్యుల ప్రశ్నలకు ఏసు జవాబులిచ్చాడు. ఖురాన్ గ్రంథములో
కూడా దేవుడు తన జ్ఞానమును సత్యసమేతముగా చెప్పాడుగానీ, ఎక్కడా
అనుమానముండునట్లు చెప్పలేదు. చాలాచోట్ల 'విడదీసి చెప్పుచున్నాను',
‘వివరముగా చెప్పుచున్నాను' అని కూడా చెప్పాడు.
అంతేకాక తనది దైవగ్రంథమయిన దానివలన అది అన్నిటికీ
'గీటురాయి' అని చెప్పాడు. ఇప్పుడు ఒక ఉదాహరణను చెప్పుకొందాము.
ఒక బంగారు షాపులోనికి ఒక రైతు తన బంగారును అమ్ముకోవడానికి
తెచ్చుకొన్నాడు. బంగారు షాపు యజమాని ప్రతి దినము బంగారును
చూస్తున్నా, అప్పుడు రైతు తెచ్చిన బంగారు స్వచ్ఛమైనదో కాదోయనీ,
అతను తెచ్చినది బంగారమో కాదో తేల్చి చూచుకోవడానికి తనయొద్ద ఒక
రాయిని ఉపయోగించి చూచాడు. రైతు తెచ్చిన బంగారును ఆ రాయితో
గీచి చూచి అది బంగారమో కాదో తేల్చుకొన్నాడు. అట్లే అది స్వచ్ఛమయిన
బంగారమా! కాదా!యను విషయము కూడా తెలిసిపోయింది. రాయితో
గీచి చూడడము వలన బంగారము యొక్క బండారము బయటపడుచున్నది.
అందువలన బంగారును పరీక్షించుటకు ఉంచుకొన్న రాయిని “గీటురాయి”

Page 23
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
23
అంటున్నాము. ఏ విధముగా బంగారు స్వచ్ఛతను తెలియుటకు గీటురాయిని
ఉపయోగిస్తున్నామో, అలాగే దేవుని జ్ఞాన విషయము బంగారులాంటిదే
కావున దీనిని కూడా గీచి చూచుకొనుటకు దేవుడు 'గీటురాయి' తప్పనిసరిగా
అవసరము అంటున్నాడు.
ఏ విషయములో అయినా, ఏ జ్ఞానములో అయినా అందులోని
స్వచ్ఛత, అందులోని సత్యాసత్యము తెలుసుకొనుటకు తన గ్రంథమే గీటు
రాయిగా ఉన్నదని చెప్పిన దేవుడు తన జ్ఞాన విషయములో ప్రశ్నించవద్దని,
ప్రశ్నించకూడదని చెప్పునా? అట్లు ఎక్కడా చెప్పలేదు. అలా చెప్పాడనీ,
జ్ఞాన విషయములో చెప్పిందే వినాలిగానీ ప్రశ్నించకూడదనీ, చెప్పేవారు
వినేవారిని మోసము చేయడానికేగానీ వేరు ఏమీ లేదని తెలియుచున్నది.
అల్లాహ్ మాటను ప్రశ్నించకూడదని అలా ప్రశ్నించడము అవిశ్వాసము
అవుతుందని చెప్పడము మోసపూరితమే గానీ, వేరు కాదు. బంగారును
ఎంతో కాలమునుండి చూస్తున్న బంగారు వ్యాపారి కూడా కొనే ప్రతి
బంగారును గీటురాయితో గీచిచూచి అది స్వచ్ఛమయినదో కాదో,
అందులోని స్వచ్ఛత ఎంతో తేల్చి చూచుకొనును. అలాగే దేవుడు జ్ఞాన
విషయములలో స్వచ్ఛత తెలుసుకొను నిమిత్తము తన గ్రంథమునే
గీటురాయిగా ఇచ్చాడు. ఎవరూ మోసపోకుండా తేల్చుకొనుటకు, తెలుసు
కొనుటకు తన గ్రంథమును ఇచ్చి తానే ప్రశ్నించవద్దని చెప్పునా, బంగారును
కంటితో చూడు రాయితో పరీక్షించవద్దని చెప్పునా? దేవుడు అలా ఎక్కడా
చెప్పలేదు. ఇతరులను మోసము చేయదలచుకొన్నవాడు తన బంగారు
స్వచ్ఛమయినదని, దానిని పరీక్షించి చూడవద్దని చెప్పును. అలాగే కొందరు
బోధకులుగాయున్న ముస్లీమ్లు ఇతరులను ప్రశ్నించకూడదని నియమమును
ఉంచి అమాయకమైన ముస్లీమ్లను ఎందరినో వారు చెప్పినది వినునట్లు

Page 24
24
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
చేసుకుంటున్నారు. అవసరమైతే పక్షి, పర్వతాల కథను చెప్పి దేవుడు
పిలిస్తే చచ్చిపోయిన పక్షి వచ్చింది కదా! అని నమ్మబలుకుచున్నారు.
ఇటువంటి మోసములు చేయడములో మానవుడు చేయితిరిగిన
వాడని తెలిసిన దేవుడు ముందే తన చివరి గ్రంథమున గీటురాయిని గురించి
చెప్పాడు. "దివ్యఖురాన్ సందేశం" అను గ్రంథములో సూరా 2, ఆయత్
53యందు (2-53) “మరియు (జ్ఞాపకము చేసుకోండి!) మీరు
సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా
సత్యాలను వేరు చేసే) గీటురాయిని ప్రసాదించాము” అని చెప్పాడు.
అంతేకాక మరియొక చోట ఇలా కలదు (3-4) “దీనికి ముందు ప్రజలకు
సన్మార్గము చూపడానికి మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటు
రాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా ఎవరయితే అల్లాహ్
ఆజ్ఞలను తిరస్కరిస్తారో వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్
(దేవుడు) సర్వశక్తిమంతుడు, ప్రతీకారము తీర్చుకోగలవాడు” అని గలదు.
అంతేకాక మరియొక చోట ఇలా కలదు చూడండి.
(21-48) “మేము మూసా మరియు హారూన్లకు తీర్పులు చేసే
గీటురాయిని, జ్యోతిని భయభక్తులుగలవారికి హితోపదేశముతో కూడిన
గ్రంథాన్ని ఇచ్చాము” అని కలదు. ఇంకా (25-1) “సర్వలోకాలకు హెచ్చరిక
చేసేదిగా ఈ గీటురాయిని తన దాసునిపై క్రమక్రమముగా అవతరింపజేసిన
ఆయన (దేవుడు) ఎంతో శుభదాయకుడు" అని చెప్పియున్నారు. ఈ
విధముగా ఇన్ని వాక్యములలో దేవుడు తాను గ్రంథరూపముగా, జ్ఞాన
రూపముగా ఇచ్చిన గీటురాయిని గురించి చెప్పాడు. దేవుడిచ్చిన గీటురాయిని
తెలియని వాడు ఏది సత్యమైన జ్ఞానమో, ఏది అసత్యమైన జ్ఞానమో
తెలియలేడు. అటువంటప్పుడు జ్ఞానవిషయములో మోసపోవు అవకాశము

Page 25
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
25
గలదు. ఇప్పుడు దేవుని సంతతి విషయములో సందిగ్ధత వచ్చినది. ఏది
సత్యమో, ఏది అసత్యమో తెలియని పరిస్థితి ఏర్పడినది. సత్యాసత్యములను
తేల్చు కొనుటకు మొదటనే ముసా ప్రవక్తకు 'తౌరాత్ గ్రంథము'ను ఇచ్చానని
2-53లో చెప్పియున్నారు. అరబ్బీ భాషలో 'తౌరా' అనగా మూడు అని
అర్థము. 'తౌరాత్' అనగా 'మూడు రాత్రులని' అర్థము. తౌరాత్ అను
పేరుతో మూడు ఆత్మల వివరముగల భగవద్గీత గ్రంథమును ఇవ్వడము
జరిగినది.
20
బంగారు విషయములో గీటురాయిని ఉపయోగించినట్లే బంగారు
పోలికయున్న దేవుని జ్ఞానములో ఇది నిజమైనదా! కాదా!యని అనుమానము
వచ్చినది. అందువలన ఇక్కడ గీటురాయిని ఉపయోగించి జవాబును
నిర్ణయించుకోవలసియున్నది. ఇప్పుడు ఈ విషయము సులభముగా
అర్థమగుటకు ఒక చిన్న ఉదాహరణను తీసుకొని చూస్తాము.
సంవత్సరముల వయస్సున్న ఒక యువకున్ని నీకు పిల్లలెంతమంది? అని
ప్రశ్నిస్తే అబ్బే! నాకు పెళ్ళేకాలేదు, భార్యలేనిది పిల్లలెలా పుట్టగలరు.
నాకు సంతానము లేదండీ! అని చెప్పాడు. అప్పుడు ఆ యువకుడు సైకిల్
మీద ప్లాస్టిక్ బిందెలను అమ్ముకొని వ్యాపారము చేసుకొనేవాడు. ఒక
బిందెను కొనుక్కొనే సమయములో బిందె రేటును తగ్గించమని అడిగే
దానికొరకు మాట పరిచయముండాలి కదా!యని బిందెను కొనేవాడు ఆ
విధముగా అమ్మేవానిని అడిగాడు. తర్వాత ఐదు సంవత్సరములు గడచినది.
బిందెలు అమ్మేవాడు బజారులో ఒక షాప్ పెట్టుకొని అందులో స్టీల్పాత్ర
సామాన్ల వ్యాపారము చేయుచుండెను. ఆ ఆ సమయములో ఐదు
సంవత్సరముల క్రిందట బిందెను కొన్నవాడు, స్టీల్ సామాన్ల షాప్కు వచ్చి
పూర్వము బిందెను అమ్మిన వానిని గుర్తించాడు. అప్పుడు మాటల

Page 26
26
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
సందర్భములో బిందెల వ్యాపారమును తీసివేసి పాత్రల వ్యాపారమును
పెద్దగా పెట్టావే! అని అడిగాడు. అప్పుడు స్టీల్ పాత్రల వ్యాపారి “ముగ్గురు
బిడ్డలున్నారు వారి కట్నము కొరకు డబ్బు సంపాదించాలంటే ఇలా
వ్యాపారమును పెద్దగా చేసుకోవలసి వచ్చినది” అని అన్నాడు. అప్పుడు
కొనే దానికి వచ్చిన వాడు “ఇంతకుముందు పిల్లలే లేరు అన్నావు, ఇప్పుడేమో
ముగ్గురు పిల్లలని అబద్దమును చెప్పుచున్నావా" అని అడిగాడు. అప్పుడు
లేరు, ఇప్పుడున్నారని షాప్ యజమాని చెప్పినా ఇతను నమ్మలేదు. మొదట
చెప్పినమాటనే గట్టిగా నమ్మియున్నాడు. నేను ఐదు సంవత్సరములప్పుడు
అడిగాను అప్పుడు సంతతేలేదు అనినవాడు ఐదు సంవత్సరములలో
ముగ్గురు పిల్లలకు ఎలా తండ్రి అయినాడు అని ప్రశ్న మిగిలిపోయింది.
తర్వాత ఆ విషయములోని సత్యాసత్యమును తెలియు నిమిత్తము
అమ్మేవానితో, కొనేవానితో పరిచయమున్న ఒక వ్యక్తి దగ్గరికి పోయి తన
సందిగ్ధమును అడిగాడు.
"అయ్యా! నాకు ఒక అనుమానము వచ్చింది. ఐదు సంవత్సరముల
క్రిందట నేను ఒక వ్యక్తిని అతని సంతతిని గురించి అడిగాను. అప్పుడు
అతడు నాకు భార్యేలేదు, సంతతి ఎలా కల్గును అని తిరిగి ప్రశ్నించి నాకు
ఎవరూ పుట్టలేదు, ఎవరూ సంతతి లేదు అని చెప్పాడు. ఇప్పుడు కూడా
అదే మనిషిని సంతతిని గురించి అడిగాను, ముగ్గురు బిడ్డలని చెప్పాడు.
తర్వాత భార్య ఏమి చేస్తుంది అని అడిగాను, నాకు భార్యలేదు అన్నాడు.
ఆ మాట విన్న నాకు పెద్ద సంశయము వచ్చినది అప్పుడూ భార్యలేదు,
ఇప్పుడూ భార్యలేదు. అప్పుడు సంతానము లేదు. అయితే ఇప్పుడు
సంతానముంది అంటున్నాడు. అతని మాటను ఎలా నమ్మాలి?” అని
అడిగాడు. ఇప్పుడు మూడవ వ్యక్తిని రెండవ వ్యక్తి గీటురాయిగా

Page 27
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
27
ఉపయోగించుకొన్నాడు. సత్యాసత్యములను తేల్చి చెప్పునది గీటురాయే,
కావున మూడవ వ్యక్తి ఇలా అన్నాడు. “అతనికి భార్య మొదట లేదు
ఇప్పుడు లేదు. అయితే మధ్యలో ఉండవచ్చును కదా! నీవు అడిగినప్పుడు
పెళ్ళికాలేదు, భార్యలేదు. ఇప్పుడు అడిగినప్పుడు పిల్లలున్నారు భార్య
లేదు. అయితే ముగ్గురు పిల్లలు పుట్టగానే భార్య చనిపోయివుండవచ్చును
కదా! ఆ ఆలోచన నీకెందుకు రాలేదు. అతను చెప్పిన దానిలో సత్యముంది
అయితే నీవు విన్న దానిలో అనుమానమున్నది. నాకు తెలిసిన వాస్తవము
ప్రకారము అతనికి భార్య ఉన్నా, ఇప్పుడు ఆమె అతనికి చాలా
దూరముగాయున్నది. అంతేకాక ఇతని మీద (భర్తమీద ఆధారపడకుండా
స్వంతముగా బ్రతుకుతాయున్నది. ఆమె భర్తను వదలివేసి దూరముగా
ఉండుట వలన ఇతను తనకు భార్యలేదని” చెప్పుచున్నాడు. వివరము
తెలియకపోతే భార్యలేకుండా ఐదు సంవత్సరములలో ముగ్గురు పిల్లలెలా
పుట్టగలరని ప్రశ్నరావచ్చును.
ఇక్కడ పాత్రల వ్యాపారి రెండుమార్లు సత్యమే చెప్పాడు. అయితే
ఆ విషయమును మరొకడు అనుమానముతో మరియు తెలివి తక్కువతో
నమ్మలేకపోయాడు. అలాగే దేవుని విషయములో కూడా జరిగింది. దేవుడు
ఒకమారు సంతతి లేదు అనియు మరొకమారు సంతతి వుంది అనియు
దేవుడు చెప్పగా మనము కూడా నమ్మలేకపోయాము. దేవుడు మొదట
చెప్పిన మాటయే నిజమని ఆయనకు సంతతిలేదని ముస్లీమ్లు
అనుచుండగా, లేదు ఆయనకు సంతతి వుంది. మనమంతా ఆయన
సంతతే కదా!యని హిందువులు అంటున్నారు. కొందరేమో అటు ఇటు
కాకుండా రెండూ సత్యమేయని అంటున్నారు. కొందరేమో రెండూ
అసత్యమేయని అంటున్నారు. ఈ విధముగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి

Page 28
28
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
నేడు మనుషులలో కలదు. ఈ సమస్యను తేల్చి చెప్పుటకు, ఏది నిజమో
ఏది అబద్దమో నిర్ణయము చేసి చెప్పుటకు గీటురాయి అవసరము.
గీటురాయి అనునది తాను మొదట ఇచ్చిన తౌరాత్ గ్రంథమేనని దేవుడు
ఖురాన్ గ్రంథములో సూరా 2, ఆయత్ 53లో చెప్పడమైనది. దేవుడిచ్చిన
గీటురాయిని ఉపయోగించుకొని ఇందులోని సత్యమును మనము
తెలియవచ్చును.
దేవుడు అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్లో 112వ సూరాలో
3వ ఆయత్నందు 'నాకు సంతతి లేదు' అని చెప్పాడు. అంతేకాక 6వ
సూరాలో 101వ ఆయత్లో ఇలా చెప్పాడు. (6-10) “ఆకాశమును భూమిని
తయారు చేసినవాడు ఆయనే. దేవునికి భార్యయే లేనప్పుడు ఆయనకు
సంతానము ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు.
ప్రతి జీవరాశిని సృష్టించాడు. ఆయనకు ప్రతీదీ బాగా తెలుసు" అని
కలదు. గీటురాయి ప్రకారము దేవుడు సృష్ఠికి పూర్వము 112వ సూరాలో
చెప్పినట్లు సంతతి లేనివాడుగాయున్నాడు. స్థిరాస్థిరునిగా యున్నప్పుడు
ఆయన దేనినీ సృష్ఠించలేదు. అందువలన ఆయన దేనికీ తండ్రికాడు,
ఆయన తండ్రి కానప్పుడు ఆయనకు సంతతి లేనట్లే కదా! అప్పుడు
ప్రకృతియేలేదు. అక్కడికి ఆ మాట సత్యమే ప్రకృతి దేవునికి భార్యగా
యుండుట వలన సృష్టికి పూర్వము ప్రకృతి లేని దానివలన ఆయనకు
అప్పుడు భార్యలేదు. భార్యయే లేనప్పుడు సంతతి ఎలా కలుగుతుంది?
ప్రకృతియున్నప్పుడే జీవరాశుల శరీరములు తయారగుచున్నవి. ప్రకృతి
ఉన్నప్పుడు జీవరాశులు పుట్టుటకు అవకాశము కలదు. అందువలన
భార్యయే లేనప్పుడు సంతతి ఎలా కలుగుతుందని (6-101) లో
చెప్పడమైనది. ఇక్కడికి ఈ మాట సత్యమే! అయితే అదే దేవుడే కొన్ని

Page 29
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
29
సందర్భములలో 'తండ్రియైన నేను' అనీ, 'సకల జీవులకు నేనే తండ్రిని’యనీ
చెప్పడము జరిగినది. సృష్టి జరిగిన తర్వాత ప్రకృతి ఏర్పడి ప్రకృతికి దైవ
బీజముతో అనేక జీవరాశులు పుట్టడము జరిగినది. అప్పుడు ఆయన
సమస్త జీవరాశులకు తండ్రియని చెప్పడము సత్యమైనది. ఇక్కడ సృష్ఠి
తర్వాత ఆయనకు భార్యవున్నది. సంతతి కలదు. ఇప్పుడు దేవుడు
“పితాహమస్య జగతో” అను భగవద్గీత వాక్యము ప్రకారము 'అందరికీ
తండ్రి' అనుమాట సత్యమే. ఒకే సమయములో రెండు మాటలు సత్యము
కాలేవు. వేరువేరు సందర్భములలో సంతతి లేదు, సంతతియున్నది అను
రెండు రకముల మాటలు పరస్పర విరుద్ధముగాయున్నా సత్యమే అయినవి.
దీనినిబట్టి సృష్టికి పూర్వమున్నవాడే సృష్టి తర్వాత కూడా యున్నా
అప్పుడు పెళ్ళికానివాడు, ఇప్పుడు పెళ్ళి అయినవానిగా గుర్తించాలి. సృష్ఠికి
పూర్వము స్థిరాస్థిరునిగాయున్న దేవుడు సృష్ఠి తర్వాత స్థిరుడయినాడు.
సృష్ఠికి ముందున్న దేవున్ని సృష్టికి తర్వాతయున్న దేవున్ని వివరముగా
తెలియగలిగితే గీటురాయి ద్వారా సత్యాసత్యమును తెలిసినట్లగును. దేవుడు
ముందే తన మొదటి దైవగ్రంథము భగవద్గీతను ఇచ్చి అందులో జ్ఞానమును
గీటురాయిగా చేసి ఇచ్చాడు. పురుషులు ముగ్గురని సృష్ఠి తర్వాత చెప్పుకున్నా,
సృష్ఠికి పూర్వము ఒకే పురుషుడు ఉండేవాడు. సృష్టికి పూర్వము విభజింప
బడని పురుషుడు ఉండేవాడు. సృష్టికి పూర్వము ఉండే వానిని పురుషుడు
అనికూడా చెప్పలేము. అందువలన ముందే ఎటూపోల్చుకోలేని విధముగా
ఉండునని ఒకమాటను చెప్పాము. సృష్ఠికి ముందున్న దేవున్ని దేవుడు
అనికూడా చెప్పుటకు ఆధారముగానీ, వీలుగానీ లేదు. అందువలన
అప్పుడున్న వానిని "స్థిరాస్థిరుడు” అన్నాము. స్థిరుడు అస్థిరుడు అను
రెండు మాటలలో నిజాన్ని అబద్ధాన్ని, తప్పును ఒప్పును, మంచిని చెడును

Page 30
30
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
రెండిటినీ కలిపి చెప్పినట్లు కలదు. అటువంటి వానిని ఏమని తేల్చి
చెప్పుటకు వీలుకాదు.
సృష్ఠికి పూర్వము ఏమీకానివాడు, సృష్ఠి తర్వాత పురుషునిగా చెప్ప
బడ్డాడు. తనను తాను పురుషునిగా ప్రకటించుకొన్నాడు. అలా ప్రకటించు
కొన్న తర్వాత తాను మూడుగా విభజింపబడి సర్వజీవులయందు ఉన్నట్లు
తన మూడు గ్రంథములయందు చెప్పాడు. ముగ్గురు పురుషులకు
వివరమిస్తూ మొదటి ఇద్దరి పురుషులను దేవుడు అని చెప్పుటకు వీలున్నదని
తెలిపాడు. మూడవ పురుషుడు జీవుడుగా చెప్పబడినాడు. ఈ పురుషుల
విషయము మూడు మతములు అనుసరించు మూడు గ్రంథములలోయున్నా
మూడు మతములలో ఏ ఒక్క మతమువారికి ముగ్గురు పురుషుల విషయము
తెలియలేదు. నేడు మేము ప్రత్యేకించి ముగ్గురు పురుషుల విషయము
చెప్పుచుండగా కొందరు ఆశ్చర్యముగా చూచుచుండగా, కొందరు
అసూయతో చూస్తున్నారు. మాకు తెలియని జ్ఞానము నీకు తెలియునా?
అని ప్రశ్నించుచున్నారు. మీకు తెలియదనేగా నేను చెప్పుచున్నాననగా!
వింతగా చూస్తున్నారు.
ముగ్గురు పురుషుల వివరము తెలియకపోయినందున, మూడు
మతములవారు ఎవరికి తెలిసిన దానిని వారు అదే గొప్పయని అంటున్నారు.
ముగ్గురు మూడు కోణములలో వాదించుచున్నారు. ఒకరు చెప్పినది
మరొకరు ఒప్పుకోవడము లేదు. హిందువులు విగ్రహారాధనను ఎక్కువగా
అనుసరించగా, ముస్లీమ్లు విగ్రహారాధనను పూర్తిగా ఖండించు చున్నారు.
క్రైస్తవులు ఎటుకాకుండా మధ్యలోయున్నారు. హిందువుల విగ్రహారాధనను
క్రైస్తవులు కూడా ఖండించుదురు. అయితే ముస్లీమ్లు చెప్పినట్లు 'దేవుడు
పుట్టడు' అను మాటను ప్రక్కనపెట్టి దేవుడు పుట్టుననే చెప్పుదురు. ఇట్లు

Page 31
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
31
ప్రతి విషయములోను ఎవరి వాదనను వారు గట్టిగా చెప్పుచుందురు.
వీరందరికి గీటురాయి అవసరమని మాకు అర్థమయినా, వారు మేమే
గీటురాయిగా ఉన్నామని చెప్పుచుందురు. దేవుడే దిగివచ్చి ఇది సత్యము,
ఇది అసత్యమని తేల్చి చెప్పినా దానిలోని వాస్తవమును గ్రహించక మాకు
తెలిసిందే సత్యమని, నీకంటే మాకే బాగా తెలుసునని వాదించుచున్నారు.
వారివారి మత ఆచరణల ముందర, వారివారి మతపెద్దలు చెప్పిన మత
నియమముల, మత ధర్మముల ముందర దేవుని మాట కూడా తీసివేయబడు
చున్నది. ఈ విధముగా ముగ్గురు పురుషుల విషయమును వదలి అన్ని
మతముల వారు ప్రక్క దారిలో పోవుచూ దేవునికి దూరమగుచున్నారు.
దేవునికి మేమే దగ్గరగా యున్నామనీ, తమ జ్ఞానమే అసలయిన దేవుని
జ్ఞానమని, మా మార్గమే అన్ని మతములకంటే మించిన మార్గమని తలచి
మేము దేవునివైపు పోతున్నామని అనుకొను వారందరూ వారికి తెలియకనే
దేవునికి దూరమగుచున్నారు. దీనికంతటికీ కారణము మూడు దైవగ్రంథము
లలోయున్న ముగ్గురు పురుషులను తెలియకపోవడమేనని చెప్పవచ్చును.
వినేది అర్థము కాకపోతే దానిని తిరిగి అడిగి తెలుసుకోవచ్చును. అట్లుకాక
విన్న దానిని గ్రంథ ఆధారము లేకుండా ఖండించకూడదు. విన్న దానిని
యోచించి సత్యమో కాదో తేల్చుకోవచ్చును. సత్యమైతే స్వీకరించవలెను.
అసత్యమైతే వదలిపెట్టవచ్చును. అలా కాకుండా మొండిగా దేనినీ
కాదనకూడదు. ఇప్పుడు జ్ఞాన జిజ్ఞాసకల్గిన వారు ఈ విధముగా ప్రశ్నించు
చున్నారు.
వారి ప్రశ్న :- మేము కొన్ని సంవత్సరములనుండి మాకు తెలిసిన జ్ఞానమునకు
అలవాటు పడినాము, మా సమాజములో మేము గొప్ప బోధకులుగా
పేరుగాంచి యున్నాము. మేము చెప్పినదంతా విన్నవారు ఎందరో మమ్ములను

Page 32
32
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
అనుసరించుచున్నారు. నేడు ఉన్నట్లుండి మీరు క్రొత్తగా ముగ్గురు పురుషుల
సిద్ధాంతమును బయటపెట్టి దానిని దేవుడు చెప్పిన ముఖ్యమైన జ్ఞానమని
అంటున్నారు. మాకు ఇంతవరకు ఒక పురుషుని జ్ఞానమే తెలియదు. ముగ్గురు
పురుషుల జ్ఞానము ఏమాత్రము తెలియదు. మీరేమో ఇదే మూడు
దైవగ్రంథములలోనున్న
ముఖ్యమైన జ్ఞానము అంటున్నారు. అంతేకాక ముగ్గురు
పురుషుల జ్ఞానము తెలియకపోతే వాస్తవముగా దేవుని మార్గములో
లేనట్లేయని చెప్పుచున్నారు. దేవుడు దిగి వచ్చినా ఇదే నిజమైన జ్ఞానమని
చెప్పుననుచున్నారు. మీరు చెప్పే దాని ప్రకారమైతే ఇంతవరకు మేము
తెలుసుకొన్న దానిని పూర్తిగా వదలివేయవలసివచ్చును. మా సమాజములో
ఎంతో పెద్ద పేరున్న మేము మా పేరును గౌరవమును వదలి మీరు చెప్పే
జ్ఞానములోనికి రావలెనంటే ఎంతో బాధగాయున్నది. ఇప్పుడు మేము మీ
జ్ఞానమును సమర్థించితే, ఇంతవరకు మావద్ద జ్ఞానమును నేర్చినవారు
ఎటుపోవాలి? మీరు మాకు పెద్ద పరీక్ష పెట్టినట్లున్నది. ఇప్పుడు మేము ఏమి
చేయాలి?
మా ప్రశ్న :- మీకు మీ మత జ్ఞానము కావాలా? దేవుని జ్ఞానము కావాలా?
మీకు మీ మతధర్మము కావాలా? దేవుని ధర్మము కావాలా?
వారి జవాబు :- నాకు మతముకంటే దేవుడే ముఖ్యము. నాకు దేవుని
జ్ఞానమే కావాలి గానీ ఇంతవరకు నా బోధలు వినినవారు మత
సాంప్రదాయములలో పూర్తిగా చిక్కుకొనిపోయారు. వారికి ఎంత చెప్పినా
వారు క్రొత్త జ్ఞానమువైపు రారు. వారికి దేవుని జ్ఞానమేదో? మత జ్ఞానమేదో?
తెలియదు. అందువలన వారికి తెలిసిన జ్ఞానమే గొప్పదని నమ్మి, మత
సాంప్రదాయములతో కూడిన జ్ఞానమును వదలి రారు. ఇప్పుడు నేను

Page 33
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
33
వారిని వదలి రావలసిందే! అని చెప్పినా, అట్లువస్తే మా సమాజము
వారికందరికీ వ్యతిరేఖముగా కనిపిస్తానేమోనని అనుకుంటున్నాను.
మా ప్రశ్న :- మతము మధ్యలో వచ్చినది, దేవుడు మొదటినుండి
యున్నవాడు. నిన్ను పుట్టించిన దేవునివైపు పోకుండా నీతో సంబంధము
లేనివారివైపు పోవడము మంచిదా?
వారి జవాబు :- నాకు బాగా అర్థమయినది. మేము ఇంతవరకు తెలిసిన
జ్ఞానముకంటే ఎంతో గొప్ప జ్ఞానమును మీరు చెప్పుచున్నారు. అందువలన
నేను దేవుని జ్ఞానమువైపే రావాలనుకొంటున్నాను. ఉన్నట్లుండి నేను
ఒక్కమారుగా మా జ్ఞానమును వదలి దేవుని జ్ఞానమువైపు రావడము వలన
బయట ప్రపంచములో వచ్చే ఆదాయము పోతుంది. తర్వాత బ్రతుకుటకు
కొంత ఇబ్బంది కల్గునేమోనని ఆలోచించుచున్నాను. దీనికి మీ సలహా
ఏమి?
మా మాట :- దేవుని జ్ఞానమువైపు పోవువారికి ప్రపంచ సంబంధ
భయములు కల్గడము సహజమే. ఇక్కడే ఎంతో తెలివిగా మనిషి
ప్రవర్తించాలి. నన్ను అడిగావు కాబట్టి నేను ఉన్న సత్యమును చెప్పుచున్నాను.
ప్రతి మనిషి ప్రపంచములో బ్రతకవలసిందే. ప్రపంచ బ్రతుకు తెరువుకు
జ్ఞానమునకు ఎటువంటి సంబంధములేదు. అయినా ప్రపంచములో
సహజముగా కర్మలనుబట్టి బ్రతుకుతెరువు మారుచుండును.
మనిషి
పుట్టినప్పుడే ఆ మనిషి జీవితములో గడిచే ప్రతి క్షణమును గురించి
వ్రాసిపెట్టబడి యుండును. అలా వ్రాసిన దానినే కర్మ అనియూ, ప్రారబ్ద
కర్మ అనియూ అంటున్నాము. ఆ కర్మపత్రములో ప్రతి దినము, ప్రతి
క్షణము ఏమి పొందాలో, ఏమి అనుభవించాలో వ్రాసి పెట్టబడియుండును.

Page 34
34
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
దానిప్రకారమే ప్రతీదీ జరుగుచున్నది, అనుభవానికి వస్తున్నది. కర్మ
నిర్ణయము లేని మనిషిగానీ, జంతువుగానీ ఎవడూ భూమిమీద లేడు.
అందరికీ కర్మపత్రములో వ్రాయబడిన అనుభవముల ప్రకారమే జీవితము
గడుచుచుండును. ఇది మానవుల ఎడల నిర్ణయించబడిన కర్మచట్టము.
ఆ చట్టము ప్రకారమే నీకుగానీ, నాకుగానీ జరుగుచుండును. ప్రతీదీ
లోపల యున్న వ్రాత ప్రకారమే జరుగుచుండుట వలన బయట జరిగే
విషయములను జ్ఞానముతో జోడించకూడదు. బయట విషయములు
అన్నియూ లోపల కర్మనుబట్టి జరుగునుగానీ, బయట విషయములు ఏవి
అయినా కర్మలో లేనివి జరుగవు. బయట ఏమో జరుగునని భయపడడము,
దానివలన దేవుని జ్ఞానమును వదలుకోవడము అధర్మమగును. దేవుని
జ్ఞానము ప్రకారము స్వధర్మమును వదలి పరధర్మములో ప్రవేశించినట్లగును.
దీనిని గురించి ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో కర్మయోగమను
అధ్యాయమున 35వ శ్లోకమందు ఇలా చెప్పారు చూడండి.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠి తాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥
11
భావము :- “ఆచరించుటకు ఎంతో అనుకూలమున్న పరధర్మముకంటే
స్వధర్మమే ఎంతో శ్రేయస్కరమైనది. ఇతరుల ధర్మములోవుండు భయము
కంటే స్వధర్మములోయుండు మరణమైనా మంచిదే” అని చెప్పారు.
ఇక్కడ పరధర్మము అనగా అజ్ఞానమునకు సంబంధించినదని, ప్రపంచ
సంబంధమైనదని అర్థము. స్వధర్మము అనగా జ్ఞాన సంబంధమైనది,
దైవికమైనదని అర్థము. ప్రపంచ సంబంధ మత జ్ఞానము కల్గించు భయము
కంటే దైవికమైన ధర్మమును ఆచరించుటలో మరణమైననూ మంచిదేయని

Page 35
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
35
పై శ్లోకము యొక్క భావము. ఇది ప్రథమ దైవ గ్రంథములోయుండే
దేవుని ఉద్దేశ్యము. ప్రతీదీ కర్మప్రకారమే జరుగునని ముందే చెప్పియున్నాము.
స్వధర్మములో మరణముగానీ, పరధర్మములో భయము గానీ, ఏ
సంఘటనగానీ కర్మ నిర్ణయము ప్రకారమే జరిగియుండును. అందువలన
ముందే నిర్ణయమైన వాటిని గురించి ఎంత భయపడినా, ఏమి ఆలోచించినా
అవి జరుగకమానవు. కర్మలో లేని విషయములు ఏవీ జరుగవు.
కర్మలోయున్నవి ఏవీ జరుగకమానవు. అటువంటప్పుడు నీవు ఇప్పుడు
చేయునది ఏమీ లేదు. నీ సంపాదన గురించి ముందే నిర్ణయము
జరిగియుండును. కావున దానిని గురించి చింతించవలసిన అవసరము
లేదు. ప్రపంచములో అన్నీ కర్మనుబట్టి లభించును. అయితే దైవజ్ఞానము
మాత్రము కర్మనుబట్టి లభించునది కాదు. జ్ఞానము శ్రద్ధనుబట్టి లభించును.
అందువలన కర్మనుబట్టి జరుగు పనులను వదలి దైవజ్ఞానము మీద శ్రద్ధను
పెంచుకో, అప్పుడు దైవజ్ఞానము సులభముగా తెలియబడుతుంది.
వారి ప్రశ్న :- మా సమాజములో దేవుడు ఒక్కడేయని కలదు. ఒక్క దేవుని
మినహా ఇంకొక దేవుడు లేడని, అతనితో సమానమైన వాడు కూడా లేడని
చెప్పుకొన్నాము. దేవుడు ఒక్కడేయను నిర్ణయము మా నరములలో
జీర్ణించిపోయినది. ఇప్పుడు మీరు దేవుడు అను పదము ఒకటే అయినా ఆ
పదము ద్వారా ఇద్దరు పిలువబడుచున్నారని క్రొత్తగా చెప్పారు. ఇప్పుడు ఇద్దరు
దేవుళ్ళను మా మనస్సు ఒప్పుకోదు. ఒకే దేవుడను నిర్ణయమే మాలో ఉన్నది.
దీనికి మీరేమంటారు?
మా జవాబు :- దేవుడు ఒక్కడేయని నేను కూడా అంటున్నాను. ఒక్క
దేవున్నే రెండు వేరువేరు సమయములలో వేరువేరుగా చెప్పుచున్నాము.

Page 36
36
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఒకే మనిషినే పెళ్ళి చేసుకోకముందు బ్రహ్మచారి అంటున్నాము, పెళ్ళి
అయిన తర్వాత సంసారి అంటున్నాము. ఇక్కడ బ్రహ్మచారి అనువాడు,
సంసారి అనువాడు ఇద్దరూ ఒక్క మనిషే. అయితే ఆయా సందర్భములను
బట్టి ఆయా పేర్లతో పిలుస్తున్నాము. సృష్టికంటే ముందు దేవుడు అను
పేరు కూడా లేని స్థిరాస్థిరున్ని సృష్ఠి తర్వాత దేవుడు అని చెప్పాము. సృష్ఠి
తర్వాత వున్న దేవున్ని సృష్టికంటే ముందు పిలిచేవారే లేనిదానివలన
దేవుడు అని కూడా చెప్పలేదు, స్థిరాస్థిరుడు అని చెప్పాము. స్థిరాస్థిరుడు
సృష్ఠి తర్వాత దేవుడు అని అర్థము ప్రకారము చెప్పించుకొన్నా, ఆయన
ముగ్గురు పురుషులుగా విభజింపబడినాడు. మీ మాట ప్రకారమైనా దేవుడు
పని చేయనివాడు అని ఒకచోట చెప్పుచున్నాము. మరొకచోట అన్నీ దేవుడే
చేస్తున్నాడు అని అంటున్నాము. అలాంటప్పుడు చేయని దేవుడు ఒకడు,
చేసే దేవుడు ఒకడు ఇద్దరుగా కనిపిస్తున్నారు కదా! ఇంకా వివరముగా
తెలియుటకు ఖురాన్ గ్రంథములో (2-117) “భూమి ఆకాశములను
ప్రప్రథముగా సృష్టించినవాడు దేవుడే. ఆయన ఏ పని చేయ సంకల్పించు
కొన్నా దానిని “అయిపో అంటే చాలు అది అయిపోతుంది" అని
గలదు. ఇక్కడ ఈ విధముగా చెప్పి అదే ఖురాన్ గ్రంథములో మరొకచోట
మరొక విధముగా చెప్పుచున్నాడు చూడండి. (50-37) “హృదయాన్ని
కలిగియుండి లేదా శ్రద్ధను కలిగియుండి ఆలకించండి. సావధానముగా
మసలుకొనే ప్రతి వ్యక్తికి ఇందులో హితబోధ కలదు.”
“నిశ్చయముగా మేము భూమి ఆకాశములను వాటి మధ్యయున్న అన్నిటినీ
ఆరు దినాలలో సృష్టించాము. మరి మాకు అలసట ఏమాత్రము రాలేదు"
అని కూడా కలదు. పైన చెప్పిన 2-117 వాక్యమునకు, క్రింద చెప్పిన
50-37,38 వాక్యములకు పూర్తి వ్యతిరిక్త భావమున్నది. ముందు చెప్పిన
(50-38)

Page 37
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
37
2వ సూరా 117వ వాక్యములో 'దేవుడు పని చేయడు, ఆయన సంకల్ప
మాత్రమున అన్నీ అయిపోవుచున్నవి' అని కలదు. క్రింద చెప్పిన 50వ
సూరా 38వ వాక్యములో 'ఆయన ఆరు రోజులు పని చేశాడు అయినా
అలసట రాలేదు' అని కలదు. అక్కడ 2వ సూరాలో చెప్పిన వాక్యములో
'భూమిని ఆకాశమును ప్రప్రథమముగా దేవుడే సృష్టించాడు' అని వున్నది.
తర్వాత చెప్పిన 50వ సూరాలో కూడా 'భూమిని ఆకాశమును దేవుడే
సృష్ఠించాడు' అని వుంది. ఇక్కడ బుద్దితో గ్రహించు వారికి ఎవరికయినా
‘పని చేయని దేవుడు, పని చేసే దేవుడు' రెండు రకముల కనిపించుచున్నాడు.
అయితే ఆయన ఒకడే అనుటకు ఆధారముగా 'భూమిని ఆకాశములను
సృష్ఠించిన దేవుడు' అని చెప్పారు. సృష్ఠించినది ప్రపంచము. సృష్టించిన
వాడు దేవుడు. ప్రపంచమును సృష్టించిన దేవుడు ఒక్కడే అయినా ఆయన
పని చేయని వాడుగా, పనిచేసేవాడుగా రెండుగా తెలియుచున్నాడు.
దేవుడు ఒక్కడే అయినా రెండుగా యున్నాడను
విషయము యావత్ ప్రపంచమునకే తెలియకుండా పోయినది.
దైవగ్రంథములలో వ్రాసియున్న దానిని మనిషి అర్థము చేసుకోలేని
స్థితిలోయున్నాడు. ముఖ్యముగా అంతిమ దైవగ్రంథములో మనిషి
తెలియుటకు ప్రత్యేకించి ఒక ఆయత్నే చెప్పాడు. 50-37వ ఆయత్యిందు
హెచ్చరించుచూ 50-38వ వాక్యమును చెప్పి యున్నా ఇది మా గ్రంథము
అను చెప్పువారు 50-37లో యున్న వాక్యము ప్రకారము శ్రద్ధగానీ,
సావధానము (జాగ్రత్త)గానీ, రెండూ లేనివాడై యుండుట వలన
వాక్యములో గల హితబోధ తెలియకుండా పోయినది. దేవుడు ఒక్కడేయని
చెప్పుచున్నారుగానీ, ఒక్కడుగా ఎలా ఉన్నాడని తెలియదు. ముస్లీమ్లకు
ప్రపంచములో ఎవరికీ లేని విశ్వాసము వారికి గలదు. అందుకే వారిని

Page 38
38
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
ముస్లీమ్లని అంటున్నాము. విశ్వాసము వలన దేవుడున్నాడని, దేవుడు
గొప్పవాడని చెప్పవచ్చునుగానీ, దేవుడు అనుభవ రీత్యా ఎలా ఉన్నాడను
జ్ఞానము తెలియదు. ముస్లీమ్లకు ఖురాన్ గ్రంథములో చెప్పిన పై రెండు
ఆయత్లకు అర్థము తెలియదు. పై రెండు ఆయత్లలో ఒకే దేవుడు
రెండు రకములని పరస్పర విరుద్ధముగా యున్నాడను విషయమును
గ్రహించలేదు. కొందరికి ఈ విషయము ఆయత్లలో ఉన్నట్లు కనిపించినా,
దానిని పట్టించుకోకుండా తమ పెద్దలు చెప్పిన దానినే ప్రచారము
చేయుచున్నారు. ఈ ఆయత్లను చూచిన వారికి ఎవరికయినా అర్థముకాక
దేవుని విషయములో రెండు రకములుగా ఉన్నదేమి అని అడిగితే, దేవుని
విషయములో ప్రశ్నించకూడదు, చెప్పినది మాత్రము వినవలెనని జవాబు
చెప్పుచున్నారు. ఎందుకు ప్రశ్నించకూడదు అని అంటే పక్షి, పర్వతముల
కథ చెప్పి నోరు మూపిస్తున్నారు.
ఖుర్ఆన్ గ్రంథములో ముహమ్మద్ ప్రవక్తగారు ఉన్నతమైన
స్వభావము కలవాడని, అప్పటి కాలములో ఆయనను మించిన ఉత్తముడు
లేని దానివలన మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ తనబోధను చెప్పుటకు
ముహమ్మద్ ప్రవక్తగారిని ఎన్నుకొన్నాడు. ప్రవక్త ద్వారా తన జ్ఞానమును
ప్రజలకు తెలియజేయుటకు జిబ్రయేల్ నిర్ణయించుకొన్నాడు. అట్లు ప్రవక్తగా
మారిన తర్వాత ముహమ్మద్ ప్రవక్తగారు తనకు తెలిసిన జ్ఞానమును
విడమరచి తనతోటి వారికి చెప్పేవాడు. తనయొద్దయున్న దైవ సందేశమును
తెచ్చి ఏమాత్రము దాచుకోకుండా ఉన్నదంతా అయిపోవువరకు చెప్పెడివాడు.
ప్రవక్తగారు ఏమాత్రము దాపరికములేని మనిషి అయినందున
సందేశమును మిగుల్చుకోకుండా చెప్పెడివాడు. తనయొద్ద చెప్పవలసిన
సందేశమును పూర్తి లేకుండా చెప్పెడివాడు కనుక ప్రవక్తగారిని సందేశ
తన

Page 39
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
39
హరుడు అన్నారు. సందేశము అనగా చెప్పవలసిన సమాచారము. హరుడు
అనగా లేకుండా చేయువాడు, హరించువాడు అని అర్థము. తనవద్ద
సమాచారము మిగలకుండా చెప్పెడివాడు అయినందున ముహమ్మద్ ప్రవక్త
గారిని సందేశహరుడు అని అన్నారు. ఖుర్ఆన్ గ్రంథములో చాలాచోట్ల
ప్రవక్త అని చెప్పుచోట 'సందేశహరుడు' అని వ్రాసియున్నారు.
ఒక విషయమును సంశయ రహితముగా తెలియవలెనంటే ఎదుటి
మనిషి తన సందేశమును పూర్తిగా చెప్పాలి. ముహమ్మద్ ప్రవక్తగారు
సంశయ రహితముగా జ్ఞానము చెప్పువాడయిన దానివలన, ఏమాత్రము
దాచిపెట్టుకోకుండా మిగలపెట్టుకోకుండా చెప్పుట వలన, ఆయనను సందేశ
హరుడు అని అనడము జరిగినది. అటువంటప్పుడు ఆయన ప్రశ్నించ
వద్దండని చెప్పియుండునా? ప్రవక్తగారు సంశయరహితముగా జ్ఞానమును
విడదీసి చెప్పియుండును. అయితే మధ్యలో వచ్చినవారు ప్రవక్త జ్ఞానమును
తెలియనివారైయుండి, చెప్పుటకు చేతకాక, ప్రశ్నించకూడదని నియమము
నుంచి ఎదుటివారి నోరును తెరువకుండా చేయుచున్నారు. అంతిమ
దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో 2-117లో 'చెప్పిన పని చేయని
దేవుడు', 50-38లో 'చెప్పిన పనిచేసే దేవుడు' అని రెండు రకములుగా
యున్న దేవున్ని విడదీసి చెప్పే బాధ్యత ముఖ్యముగా ముస్లీమ్లకేయున్నా,
వారు దీనికి సమాధానము చెప్పకుండా, ప్రశ్నించకూడదని చెప్పి తప్పించు
కుంటున్నారు. ఇతరులకు చెప్పకపోయినా కనీసము వారికయినా తెలిసిందా!
అని చూస్తే వారు ఖురాన్ గ్రంథమును తెలుసుకోవాలనుకోలేదు. ఇటువంటి
కష్టతరమైన సమాచారము వచ్చినప్పుడు అవి ముతషాబిహాత్ వాక్యములని
వాటిని దేవుడే వదలివేయమని చెప్పాడని చెప్పి వాటిని గురించి తెలియుటకు
కూడా ప్రయత్నించలేదు.

Page 40
40
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
దైవగ్రంథములో యున్నదంతా దైవజ్ఞానమే అయినప్పుడు
గ్రంథములో సూక్ష్మజ్ఞానముతో కూడుకొన్న అరవైశాతము (60%)
దైవవాక్యములను ఎందుకు వదలి వేయుచున్నారు? అని ప్రశ్న రాక తప్పదు.
అలా వచ్చిన ప్రశ్నను కూడా అడుగరాదని నియమమును ఉంచుకొన్న
వారిని వదలివేయాలి తప్ప ప్రశ్నించుట వ్యర్థము. దేవుడు సర్వమును
సృష్టించిన సృష్టికర్తయని ముస్లీమ్లు ఒప్పుకుంటారు. అట్లే మిగతా
మతములవారు ఒప్పుకుంటున్నారు. అందరికీ దేవుడు ఒక్కడేయని అన్ని
మతములవారు పైకి చెప్పినా లోపల వారి భావములో మా దేవుడువేరను
భావముతోనే యున్నారు. తమ మతమువారు ఇతర మతముల వారితో
స్నేహముగా యుంటే, మతసామరస్యముగా కలిసిమెలసియుంటే, అటువంటి
వానిని వారి మతపెద్దలు దండించి, మత విషయములలో దూరంగా
ఉండమని వారి దేవుడువేరు, మన దేవుడు వేరని చెప్పుచుందురు. మనుషుల
భావములు వేరయినా మనుషులను పుట్టించిన వాడు ఒక్కడేయను
భావమును మనుషులందరూ మరచిపోయారు.
మూడు దైవగ్రంథములకు గ్రంథకర్త దేవుడు ఒక్కడే. మూడు
దైవ గ్రంథములను వేరువేరు మనుషులు తయారు చేశారు. గ్రంథములను
మనుషులు చేసినా గ్రంథములలోని జ్ఞానమును దేవుడు చెప్పాడు. దేవుడు
తన జ్ఞానమును మూడు విధములుగా అనగా మూడు పద్ధతుల ద్వారా
బోధించాడు. అందువలన గ్రంథములోని జ్ఞానమునకు దేవుడేకర్తగా
యున్నాడు. దీనినిబట్టి గ్రంథములకు నిజమైన గ్రంథకర్తగా దేవున్నే చెప్పాలి.
మనుషులు ఒకే దేవుడు చెప్పిన జ్ఞానమును మూడు మతములుగా
చీల్చుకొన్నారు. చీల్చుకొన్న జ్ఞానమును నాది నీదియని చెప్పుచూ, మూడు
మతములుగా ప్రకటించుకొన్నాడు. ఒకే తండ్రికి పుట్టినవారు వారు పుట్టిన

Page 41
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
41
జాగానుబట్టి వేరు కులములుగా చెప్పుకొన్నట్లు, ఒకే దేవుని బిడ్డలయిన
మనుషులు వేరువేరు మతములుగా చెప్పుకొంటున్నారు. ఖురాన్
గ్రంథములో సూరా 6, ఆయత్ 91లో (6-91) "తౌరాత్ గ్రంథమును
దేవుడు అవతరింపజేశాడు. ఆ గ్రంథము ఒక జ్యోతి. మానవుల కొరకు
మార్గదర్శకత్వము. మీరు దానిని వేరువేరు కాగితములుగా (వేరువేరు
గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు" అని చెప్పారు. నేడు
మనుషులు దేవుడు చెప్పిన గ్రంథమును అనగా భగవద్గీతా జ్ఞానమును,
విభజించుకొని మూడు మతములుగా చెప్పుచున్నారు. మనుషులు ఎలా
చెప్పుకొనినా ఫరవాలేదు.
అయితే అందులోని జ్ఞానమును దాచి
పెట్టుచున్నారు.
మనుషులు దేవుని జ్ఞానమును మూసిపెట్టినా, దాచిపెట్టినా
చివరికది బయటికి రాగలదు. దైవ గ్రంథములలో మొదటి జ్ఞానము
అనగా మాతృ జ్ఞానము మూడు ఆత్మలను గురించి చెప్పినదే. అది ఇతర
దేశములలో తౌరాత్ అని పిలువబడగా, భారతదేశములో భగవద్గీతయని
చెప్పబడుచున్నది. భగవద్గీతా జ్ఞానమే మిగతా రెండు గ్రంథములయందు
గలదు. మొత్తము మీద మూడు గ్రంథములలో దేవుడు 'అవ్యయుడు' అని
కలదు. అవ్యయుడు అనగా నాశనము లేనివాడని అర్థము. దేవుడు
నాశనము లేనివాడని, అక్షరుడని, అవినాశుడని ఎన్నో సందర్భములలో
ఆయా గ్రంథముల నుండి చెప్పడము జరిగినది. ఏ గ్రంథములో చెప్పినా
దేవుని స్థానము ఒక్కటే. భగవద్గీతలో దేవున్ని 'అవ్యయుడని' చెప్పారు
అంతేకాదు 'అజోపి' అని పుట్టుకలేనివాడని చెప్పడమైనది. పుట్టుక నాశనము
లేనివాడు ఒకేఒకడు గలడు, అతడే దేవుడు. నాశనముగానీ, పుట్టుకగానీ
లేని దేవున్ని పరమాత్మయని, పురుషోత్తముడని చెప్పడమైనది. మూడు

Page 42
42
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
గ్రంథములలోనూ ఒకే విధానమును చెప్పినా దానిని చాలామంది గుర్తించ
లేకపోయారు. భగవద్గీతలో జ్ఞానయోగములో దేవుడు 'అవ్యయుడు' అని
చెప్పాడు. అదే గ్రంథమునందు పురుషోత్తమ ప్రాప్తియోగమను అధ్యాయమున
16వ శ్లోకమందు మరియు 17వ శ్లోకమందు ముగ్గురు పురుషులుగా
ఒకే దేవున్ని వివరించి చెప్పవలసి వచ్చినది. మొదట పురుషుడు దేవుడు
అని అందరూ చెప్పుచున్నారు. రెండవ పురుషుడు అక్షరుడైనప్పుడు
'నాశనము లేని వాడు దేవుడు' అను సూత్రము ప్రకారము రెండవ ఆత్మను
కూడా దేవుడే అనాలి. మనకు ఈ విషయము తెలిసినా, తెలియకపోయినా
మనమందరము రెండవ పురుషున్ని దేవునిగానే పిలుస్తున్నాము. రెండవ
పురుషుడు చేసిన పనినంతా దేవుడు చేసినట్లుగానే చెప్పుచున్నాము. దేవుడు
ఒక్కడేయని అందరూ అంటున్నా, తెలిసినవారు చెప్పే దానినిబట్టి తెలియని
వారు కూడా దేవుడు ఒక్కడేయని అనుచున్నా, అందరికీ తెలియకుండా
శాస్త్రము ప్రకారము, దైవగ్రంథముల ప్రకారము ఇద్దరు దేవుళ్ళున్నారు.
అట్లు కాకపోయినా దేవుడే ఇద్దరిగా ఉన్నాడు. ఇది ఎవరికీ తెలియని
సత్యము. అందువలన మనుషులలో కొందరు వివరము తెలిసి ఒకే
దేవుడు ఇద్దరుగా ఉన్నాడని ఒప్పుకోవచ్చును. కొందరు దైవగ్రంథము
ప్రకారము జ్ఞానమును గ్రహించనివారై అదెలా సాధ్యము, దీనిని మేము
ఒప్పుకొనము. మా లెక్కలో దేవుడు ఒక్కడేయని అనుచుందురు. దేవుడు
చెప్పిన జ్ఞానమును విశదీకరించి తెలుసుకొనుటకు చేతకాని వారు తాము
గురువులని నమ్మిన వ్యక్తులు చెప్పిన మాటనే నమ్ముచుందురు. భూమిమీద
ఎందరో వినేవారుండగా, కొందరే చెప్పేవారుగా గురువులుగా చెలామణి
అగుచున్నారు.
గురువులుగా పేరుపెట్టుకొని కొందరు కొన్ని మతములలో
జ్ఞానమును చెప్పుచుండగా, కొన్ని మతములలో మతపెద్దలే జ్ఞానమును

Page 43
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
నిర్ణయించి చెప్పు బోధకులుగా యున్నారు.
43
కొన్ని మతములందు
సాంప్రదాయ గురువులుకాక, మతపెద్దలుకాక, మతములో బోధకునిగా
తర్ఫీదుపొంది యోగ్యతాపత్రమును పొందిన బోధకులు గురువులుగా
యున్నారు. మూడు మతములలోనూ దేవుని జ్ఞానమును బోధించువారు
పది శాతముండగా, వారు చెప్పిన దానిని విని దానినే నిజమని నమ్మి
నడుచుకొనువారు దాదాపు ఎనభై శాతముగలరు. మిగతా ఐదు లేక పది
శాతము మంది ఏ జ్ఞానము తెలియనివారై, దేవుడు అను వారిని తెలివి
తక్కువవారిగా లెక్కించి చూస్తున్నారు. ఎక్కువ శాతము మనుషులు చెప్పిన
దానిని విని సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా లెక్కించు
చున్నారు. అందువలన బోధకుల వలన చాలామంది నేడు అజ్ఞానములో
వుండి నిజమైన జ్ఞానములో ఉన్నామని కల కంటున్నారు. అటువంటి
వారు స్వయముగా దైవగ్రంథములలోని విషయమును గ్రహించలేరు.
ఒకవేళ మాలాంటివారు సత్యమును చెప్పినా, వారు ముందు వినిన దానినే
సమర్థించుచుందురు. క్రొత్తగా తెలిసినది సత్యమైన జ్ఞానమయినా వారు
దానిని విశ్వసించక, తాము తమ బోధకుల లేక తమ మతపెద్దలు చెప్పిన
మాటలనే గొప్పగా చెప్పుకొనుచుందురు.
అటువంటి వారు తాము తమ జ్ఞానమునే గొప్పగా చెప్పుకొనుచూ,
తమకు ముందు తెలిసినదే సత్యమని మొండిగా వాదించుచుందురు. 'దేవుడు
ఒక్కడే సృష్టికర్త'యని వారు సత్యమునే చెప్పుచుందురుగానీ, ఆయన ఎలా
సృష్టికర్త అయినాడను జ్ఞాన వివరమును మాత్రము తెలియకుందురు.
జ్ఞానములో సూక్ష్మ జ్ఞానమును తెలియుటకు కావలసిన శ్రద్ధ వారిలో
లేకపోవడము వలన వారికి జ్ఞానము సంపూర్ణముగా తెలియదు. వారు
అసంపూర్ణ జ్ఞానులుగానే యుందురు. అందువలన వారికి దేవుడు 'స్థిరుడు’

Page 44
44
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
మరియు ‘అస్థిరుడని’ తెలియదు. అలాగే దేవుడు 'ఏకస్వరూపుడే అయినా
అనేకముగా ఉన్నాడని తెలియదు. అట్లే దేవుడు 'నిరాకారుడు' మరియు
‘సాకారుడు' అని తెలియదు. దేవుడు కొన్నిచోట్ల స్థిరుడు మరికొన్నిచోట్ల
అస్థిరుడు అనియూ, అలాగే దేవుడు కొన్నిచోట్ల ఏకస్వరూపుడు, కొన్నిచోట్ల
అనేక స్వరూపుడు అనియూ, అట్లే దేవుడు కొన్నిచోట్ల నిరాకారుడు
మరికొన్నిచోట్ల సాకారుడు అను సత్యమును గ్రహించలేకయున్నారు. దేవుడు
ఏదీకానివాడు అనినప్పుడు అలాగే ఏదీ కాకుండావుండును. దేవుడు స్థిరుడు
అని అంటే దేవున్ని ఇది అని నిర్ణయము చేసినట్లగును. అందువలన
స్థిరుడు కాదు అని చెప్పవలసి వచ్చినది. స్థిరుడు కానప్పుడు దానికి
వ్యతిరేఖమయిన అస్థిరుడు అని చెప్పవచ్చును. అలా అస్థిరుడే అని చెప్పినా
దేవుడు ఫలానావాడని తేల్చి చెప్పినట్లగును. అట్లు కూడా చెప్పకూడదు.
అందువలన స్థిరుడు, అస్థిరుడు అని రెండూ చెప్పితే ఎటూ తేల్చుకోలేక
దేవుడు ఏదీకాదను వాదనలోనికి వస్తారు. అందువలన "స్థిరాస్థిరుడు”
అనియూ, “ఏకానేక” అనీ, 'సాకార నిరాకార' యనీ ప్రతిచోట రెండు
రకముల చెప్పవలసివచ్చినది.
మనము దేవున్ని రెండు రకముల చెప్పడమేకాక ఆయన నిజముగా
అలాగే యున్నాడు. సర్వమును సృష్టించిన సృష్టికర్త దేవుడు నాశనము
కానివాడు అని ఎవరయినా అంటే ఆ మాట కూడా సత్యముకాదు అన్నట్లు
రెండవ పురుషున్ని అక్షర పురుషుడు అని అన్నాడు. మొదటి పురుషుడయిన
దేవుడు అక్షరుడు అని చెప్పితే, అట్లుకాదని రెండవ పురుషుడు కూడా
అక్షరుడేయని భగవద్గీతలో చెప్పడమైనది. ఈ విధముగా దేవుడు 'సత్యా
సత్యుడు’, ‘నిత్యానిత్యుడు', 'క్షరాక్షరుడు', 'ఆకారనిర్వికారుడు', 'స్థిరాస్థిరుడు',
‘వ్యక్తావ్యక్తుడు', 'వ్యయావ్యయుడు' అని ద్వంద్వముగా చెప్పబడుచున్నాడు.

Page 45
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
45
ద్వంద్వముగా చెప్పుట వలన దేవుడు ఫలానావాడేనని మనిషి నిర్ణయించు
టకు వీలులేదు. మనిషి దేవున్ని ఎలా భావించుకొనినా, ఆ భావమునకు
దేవుడు అన్యముగా ఉన్నాడు. అందువలన దేవున్ని 'భావోన్య' అని
చెప్పుచున్నాము. భావమునకు అన్యముగా ఉన్నవాడని 'భావోన్య' అని
అన్నారు.
వారి ప్రశ్న :- ముస్లీమ్ సమాజములో దేవుడు ఒక్కడేయని చెప్పబడుచున్నది.
దేవునికి సమానముగా ఎవరినీ చూడకూడదని, దేవుని మినహా ఎవరినీ
ఆరాధించకూడదనీ, దేవునికి భాగస్వామ్యులుగా ఎవరినీ చూడకూడదని, ఒకే
దేవున్ని తప్ప రెండవ వానిని ఊహలో కూడా పోల్చుకోకూడదని, దేవున్ని కాదని
ఇతరులను పూజించువారిని కాఫీర్లని, దేవునికి వ్యతిరేఖులని, అజ్ఞానులని
చెప్పడము జరుగుచున్నది. వారి నమ్మకము ప్రకారము వారి వాదన సత్యమే
కదా!
మా జవాబు :- వారి వాదన సత్యమే! దేవుడు ఒక్కడే ఆరాధ్యుడు ఇతరులను
పూజించకూడదు, ఆరాధించకూడదు అనుమాట కూడా వాస్తవ జ్ఞానమునకు
సంబంధించినదే. దేవుడు ఎక్కడ చెప్పినా తన జ్ఞానమునే ప్రజలకు
బోధించును. భగవద్గీతలో చెప్పిన జ్ఞానమే మిగతా గ్రంథములలో గలదు.
అంతిమ దైవగ్రంథము ఖురాన్లో 'దేవున్ని ఒక్కన్నే ఆరాధించమని” అనేక
వాక్యములు కలవు. అలాగే భగవద్గీతలో "మన్మనా భవ మద్భక్తో మద్యాజీ
మాం నమస్కురు" అని కూడా చెప్పియున్నాడు. దాని భావము “నీవు
నాకే భక్తునిగా ఉండుము, నీవు నన్నే నమస్కరించుము” అని కలదు.
భగవద్గీతలో చెప్పినదే ఖురాన్లో చెప్పారు. ఖురాన్లో ఉన్నదే భగవద్గీతలో
కలదు. అయితే ఆ ఒక్క విషయమే అయితే దేవుడు అంతపెద్ద గ్రంథములను

Page 46
46
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
×
చెప్పవలసిన పనిలేదు. రెండుమాటలలో దేవుడు ఒక్కడే, ఆయననే
ఆరాధించుము అని చెప్పవచ్చును. ఈ రెండు మాటలేకాక ఎన్నో మాటలతో,
ఎంతో జ్ఞానముతో గ్రంథములను చెప్పడమైనది. అవన్నీ తెలిస్తే దేవుడు
ఒక్కడే ఎలా ఉన్నాడని తెలియగలదు.
ఇక్కడ విషయము బాగా అర్థమగుటకు చిన్న ఉదాహరణను చెప్పు
కొందాము. ఒక యజమాని తనదగ్గర పనిచేయు నలుగురు గుమస్తాలకు
ఒక్కొక్కనికి వేయిరూపాయలు డబ్బులిచ్చి నలుగురు బజారుకుపోయి
సరుకులను తెమ్మని చెప్పాడు. అందరికీ ఒకే సరుకుల పట్టీ ఇచ్చి పంపాడు.
నలుగురు గుమస్తాలు బజారుకుపోయి యజమాని ఇచ్చిన పట్టీ ప్రకారము
సరుకులను తెచ్చారు. యజమాని వేయిరూపాయలు డబ్బు ఇచ్చినప్పుడే
చీటిలోవున్న సరుకులకు వేయిరూపాయలు ఖర్చవుతాయి. మీరు పోయి
సరుకులను తెమ్మని నలుగురుని విడివిడిగా చెప్పి పంపాడు. యజమాని
చెప్పినట్లే నలుగురు బజారుకు పోయి విడివిడిగానే సరుకులను తెచ్చారు.
వెయ్యి రూపాయల సరుకులు తెమ్మని వెయ్యి రూపాయలకు సరిపడు సరుకుల
పట్టీని యజమాని ఇచ్చి పంపాడు. నలుగురు సరుకులు తెచ్చారు. అయితే
ఒకనికి పట్టీలోని సరుకుల ఖర్చు 900 రూపాయలు అయినది. రెండవ
వానికి 800 రూపాయలయినది. మూడవ వానికి 750 రూపాయలు
కాగా, నాల్గవ వానికి 700 రూపాయలే అయినది. వారు తెచ్చిన సరుకులకు
ఎవరికి ఎంత ఖర్చయినది వారికి తెలుసు. అయినా వారు యజమాని
పట్టీలో సరుకులకు వెయ్యిరూపాయలు ఖర్చయితాయని, ముందే చెప్పి
పంపుట వలన నా సరుకులకు వెయ్యి రూపాలయలయినవని మొదటివాడు
చెప్పగా, మిగతా వారు కూడా అలాగే చెప్పారు.

Page 47
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
47
మొదటి గుమస్తా 900 రూ॥ సరుకులనే కొన్నాడు. వానిదగ్గర
వంద రూపాయలు మిగిలినవి. అయినా తను నిజాయితీతో పని చేసినట్లు
తాను వెయ్యిరూపాయల సరుకు తెచ్చానని చెప్పాడు. తనదగ్గర డబ్బులు
అన్నీ ఖర్చు కాలేదని వందరూపాయలు మిగిలినాయని అతనికి తెలుసు.
అయితే తాను నిజాయితీ గలవాడినని ఇతరులు తెలియునట్లు, వారిని
నమ్మించుటకు తాను సక్రమముగా లేనని తెలిసి కూడా నేను సక్రమముగా
ఉన్నానని, తనవద్దయున్న వెయ్యిరూపాయల డబ్బుకు సరుకులు తెచ్చానని
అబద్దము చెప్పాడు. మొదటివాడు ఏ ఉద్దేశ్యముతో ఎలా చెప్పాడో, అలాగే
రెండవ వాడు చెప్పాడు. తాము సరియైన గుమస్తాలమని నమ్మించుటకు
మేము చెప్పిన పనిని సక్రమముగా చేశామని నలుగురు చెప్పారు. ఎవరివద్ద
ఎంత డబ్బులు మిగిలాయి అను విషయము వారికి తెలుసు. అయినా
నేనే కొంత సక్రమముగా ఉన్నాను, నాకంటే మిగతా ముగ్గురు నావలె
కూడా లేరు, వారు ఇంకా అక్రమాలకు పాల్పడియుందురని ఒకడు
అనుకోగా, మిగతావారు కూడా అలాగే అనుకోవడము జరిగినది. నలుగురు
యజమాని వద్దకు పోయి నీవు చెప్పిన పనిని సక్రమముగా చేశామని
చెప్పారు.
నలుగురు గుమస్తాలు చెప్పిన మాటలను వినిన యజమాని వారు
చెప్పినదంతా విన్నాడు. మీరంతా సక్రమముగా పని చేశారని వారిని
నలుగురిని పొగిడి పంపాడు. యజమానిని నమ్మించినందుకు ఆ నలుగురు
గుమస్తాలు సంతోషపడిపోయారు. వారు చేసిన పని సక్రమమయి నదా,
అక్రమమయినదాయని యజమానికి తెలుసు. అయినా వారు చెప్పిన
దంతా విని తనకు ఏమీ తెలియనట్లు అందరినీ పొగిడి పంపాడు.
యజమానికి తన నలుగురు గుమస్తాలు ఎవరెవరు ఎంతెంత మోసము

Page 48
48
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
×
చేసినది బాగా తెలుసు. అయినా తెలియనట్లే ఉండి యజమాని ఎవరినీ
దండించ లేదు. దానితో నలుగురు గుమస్తాలు తాము సక్రమమైనవారమే
అన్నట్లు ధీమాగాయుండిరి. బజారులోయున్న అంగళ్ళన్నీ యజమానివేయని
నలుగురు గుమస్తాలకు తెలియదు. నలుగురు ఎంతెంత సరుకులు కొన్నది,
ఎంతెంత మిగిలించుకొన్నది అన్నీ యజమానికి గుమస్తాలు ఇంటికి
రాకముందే తెలుసు.
అయినా ఆయన మౌనముగా ఉండుట వలన
యజమాని తమను సక్రమమైనవారిగా నమ్మాడని వారు నలుగురు
అనుకోవడము జరిగినది.
ఆరు నెలలు గడచిన తర్వాత 'నెలకు 50 వేల రూపాయల
ఆదాయము' అను ఒక పేపరు ప్రకటన వచ్చినది. ఆ ప్రకటనను చూచిన
నలుగురు గుమస్తాలు నెలకు ఐదువేలు జీతమిచ్చు యజమానిని వదలి
50 వేలు లాభమొచ్చు పనిలో చేరిపోయారు. వారు చేరినది చిట్ ఫండ్
కంపెనీ అయినందున ఒక ఆరు నెలలు అందులో పని చేసిన తర్వాత ఆ
కంపెనీ బోర్డు తిప్పేసి పారిపోయింది. అప్పుడు నలుగురు బజారున
పడ్డారు. చివరికి చూచుకొంటే గతములో తాము మోసము చేసిన యజమాని
ఏమీ అనకపోయినా, ప్రస్తుతము తాము పని చేయుచున్న కంపెనీనే తమకు
ఆశచూపి మోసము చేసింది. చివరికి జరిగినది చూస్తే పేపరు ప్రకటనతో
వారు మొదటి యజమానిని వదలునట్లు దేవుడే చేశాడు. మొదటి యజమాని
అప్పుడప్పుడు ఒకమాట చెప్పుచుండెడివాడు. “నన్ను మోసము చేయువాడు
ఎవడయినా వానికి వాడు మోసపోవును” అని చెప్పెడి వాడు. అలాగే
యజమానికి అన్నీ తెలిసినా, యజమాని వారి మోసమును గురించి బయటికి
చెప్పలేదు. మోసము చేయువాడు కన్నకొడుకైనా తనకు దూరముగా పోవుట
జరుగునని ఆయనకు ముందే తెలుసు. ఇంతవరకు గుమస్తాలకు జరిగిన

Page 49
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
49
విషయమును విశ్లేషించి చూచితే, దేవుని మార్గములో అటువంటివారు
కలరని తెలియుచున్నది.
యజమానిని దేవునిగా, యజమాని క్రింద పనిచేయు నలుగురు
గుమస్తాలను నాలుగు మతముల వారిగా పోల్చుకొని చూస్తే, మనుషులకు
దేవుడు సమానముగా జ్ఞానమును ఇచ్చినట్లు యజమాని నలుగురు
గుమస్తాలకు సమానముగా డబ్బులిచ్చాడనుకొనుము. దేవుడిచ్చిన
జ్ఞానమును మనుషులు పూర్తిగా తమ తలలోనికి ఎక్కించుకోలేదు. అలాగే
యజమాని ఇచ్చిన డబ్బును గుమస్తాలు మిగలకుండా పూర్తిగా ఖర్చు
పెట్టలేదు. దేవుని జ్ఞానము తలకు ఎక్కకుండా కొంత బయట
మిగిలిపోయినట్లు, యజమాని ఇచ్చిన ధనము పూర్తి వినియోగించబడక
బయట కొంత మిగిలిపోయినది. మతముల వారికి దేవుని జ్ఞానము పూర్తి
అర్థము కాకుండా మిగిలి పోయినా, ఆ విషయము ఎవరికీ తెలియనట్లు
దేవుడు చెప్పిన జ్ఞానమంతా మాకు బాగా అర్థమయి, మా తలకెక్కినది
అని అన్నట్లు, బయటి గుమస్తాలు కూడా యజమాని ఇచ్చిన డబ్బంతా
పూర్తి సరుకులకు అయిపోయినది నా వద్ద మిగలలేదు అని బొంకుచుందురు.
దేవుడిచ్చిన జ్ఞానము ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క విధముగా అర్థమయినట్లు,
నలుగురు గుమస్తాలు యజమాని డబ్బును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా
ఖర్చు చేశారు. ఎవరూ పూర్తి ఖర్చు చేయనట్లు అన్ని మతములవారు
దేవుని జ్ఞానమును ఎవరూ పూర్తిగా అర్థము చేసుకోలేదు. దేవునికి
మనుషులు చేయు అజ్ఞానము అర్ధమయినా, దేవుడు ఏ మతము వారిని
ప్రత్యక్షముగా ఏమీ అననట్లు తన గుమస్తాల అవినీతి అర్థమయినా,
యజమాని వారిని ఏమీ దండించ లేదు. అజ్ఞానమును అనుసరించు
వారికి దేవుడు అదే దారిలో పోవునట్లు, వారి పనులు ఆటంకము లేకుండా

Page 50
50
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
సాగిపోవునట్లు చేయుచున్నాడు. అదే విధముగా అవినీతికి పాల్పడిన తన
గుమస్తాలు అదే మార్గములో పోవునట్లు, యజమాని వారిని పొగిడి చాలా
బాగా పని చేశారని చెప్పాడు. ప్రతి మతము వారు తామే నిజమైన
జ్ఞానులము అనుకొన్నట్లు, గుమస్తాలందరూ ఎవరికి వారు తామే నిజమైన
నిజాయితీగలవారమని అనుకొన్నారు. దేవుడు తనకిష్టములేని వారిని
అపమార్గములోనికి పంపును, తనకిష్టమైనవారిని దైవమార్గములోనికి
పంపును. అదే విధముగా యజమానికి మోసగాళ్ళు అని తెలిసిన తర్వాత
వారు ఇష్టము లేనివారైనందున తనను వదలి వారే పోవునట్లు యజమానిని
వదలి గుమస్తాలే తమకు తాముగా పోయారు. “దేవుడు అన్నిటికీ అధిపతి,
సమస్తము ఆయన ఆధీనములో ఉన్నాయి” అన్నట్లు యజమాని బజారులోని
షాపులకు కూడ యజమానిగా ఉన్నాడు. అజ్ఞానులకు దేవుడు ఎంత
గొప్పవాడు అని తెలియనట్లు, గుమస్తాలకు యజమాని బజారులోని
షాపులకు కూడా యజమానే అను విషయము తెలియదు. గుమస్తాలు
తాము అవినీతిగలవారైనా మేమే అందరికంటే నీతిగలవారమని ఎవరికి
వారు అనుకొన్నట్లు, నేడు ప్రతి మతము వారు తమకు తాము అందరికంటే
జ్ఞానములో అధికులము అని అను కొంటున్నారు. నూరు రూపాయల
అవినీతివరుడు, రెండు వందల అవినీతి వరుడు, మూడు వందల
అవినీతిగలవాడు అందరూ మేము ఇతరులకంటే సక్రమమైన వారమే
అని అనుకొన్నట్లు, తమయందు కొంత జ్ఞాన లోపమున్న వారు, ఎక్కువ
జ్ఞానలోపమున్నవారు, ఇంకా ఎక్కువ అజ్ఞానమున్నవారు తామే
స్వచ్ఛమయిన జ్ఞానులమను భ్రమలోయున్నారు. నేడు మూడు మతములలో
అజ్ఞానము చోటు చేసుకొన్నదని దేవునికి బాగా తెలుసు.
మనుషులలో, మతములలో ఎవరివద్ద ఎంత జ్ఞానమున్నదీ దేవునికి
తెలిసియుండుట వలన, ఆయన మౌనముగాయుండి అటువంటి వారిని

Page 51
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
51
దేవుని జ్ఞానమునకు దూరము చేయును. దేవుని ఇచ్చతో పనిచేయు మాయ
మనుషులను ఆవహించి, ఏదో ఒక సాకుతో ఆ మనుషులను దేవుని
నుండి, దేవుని జ్ఞానమునుండి దూరము చేయును. గుమస్తాలు డబ్బు
ఆశతో తమ యజమానిని వారే వదలిపోవునట్లు, అజ్ఞానులయిన వారు
విషయాపేక్షతో దేవుని జ్ఞానమునకు దూరముగా పోవుచుందురు. ఒక
నీతివంతుడు మరియొక అవినీతివంతుని మీద వేలుఎత్తి చూపవచ్చును.
ఒక అవినీతివంతుడు మరియొక అవినీతివంతుని వేలుఎత్తి చూపలేడు
కదా! అట్లు చూపినా అది అసూయతో తప్ప వేరు కాదని మిగతావారికి
అర్థమగును. మంచివాడు దొంగవానిని దొంగ అనినా అందులో పద్ధతి
యుంది. అలా కాకుండా తాను గజదొంగయై ఇతరులను దొంగలని
అనడము పద్ధతి కాదు కదా! దానిని వినిన వారు ఎవరయినా అసూయతో
మాట్లాడు మాటయని అందురుగానీ, అది సరియైన ఆరోపణ కాదు అని
అనగలము. అదే విధముగా ఒక జ్ఞాని అజ్ఞానిని చూచి నీవు అజ్ఞానివి
అనినా సరిపోతుంది, అతడు అన్నది సత్యమే. అలా కాకుండా ఒక అజ్ఞాని
మరొకనిని అజ్ఞాని అనడము హాస్యాస్పదముగా ఉంటుంది. నేడు దేవుడు
ఒక్కడేయని చెప్పువారు విగ్రహారాధకులను అజ్ఞానులని విమర్శించుచున్నారు.
విగ్రహారాధకులు అజ్ఞానులనుమాట భగవద్గీతలో కూడా వుంది. దైవజ్ఞానము
తెలిసినవారు ఎవరైనా ఇతర దేవతలను పూజించువారిని అజ్ఞానులని
అనవచ్చును. అయితే మొదటికి తాను జ్ఞాని కాకుండా ఇతరులను
అజ్ఞానులనడము పద్ధతికాదు. దానిని దేవుడు కూడా ఒప్పుకోడు.
ధనమున్నవాడు ధనము లేనివానిని పేదవాడు అని అనవచ్చును. ధనము
లేనివాడు ఇతరులను పేదవారు అంటే మధ్యలోయున్నవారు నీవద్ద
ధనమెంతయుంది? నీవు ధనికునివా? అని ప్రశ్నించగలరు. అందువలన

Page 52
52
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఏ మాట మాట్లాడినా అది అర్థసహితముగా ఉండవలెనుగానీ, అర్థ
రహితముగా ఉండకూడదు.
ధనికుడు అని పేరున్నప్పుడు వానివద్ద ధనముండాలి. ధనము
లేకుండా నేను ధనికున్ని అని అంటే వానిని ఎవరూ ఒప్పుకోరు. ధనము
విలువ తెలిసినవాడు ధనికుడు అనుటకు వీలులేదు. ధనమున్నప్పుడే
వానిని ధనికుడు అని అనవచ్చును. సినిమా టికెట్ విలువ తెలిసినంత
మాత్రమున సినిమాను చూచుటకు కుదరదు. సినిమా టికెట్ యున్నప్పుడే
సినిమాహాలులోనికి పోయి సినిమా చూడవచ్చును. అలాగే M.L.A టికెట్
విలువ తెలిసినంతమాత్రమున అతడు M.L.A గా పోటీ చేయుటకు
కుదరదు. M.L.A గా పోటీచేయుటకు పార్టీ నాయకుని వద్దనుండి
టికెట్ పొందియుండాలి. అలాగే దేవుడు గొప్పవాడు అని, దేవుడు
ఒక్కడేయని తెలిసినంతమాత్రమున జ్ఞాని కాలేడు, మోక్షము పొందలేడు.
సినిమా టికెట్ లేనిది సినిమాహాలు గేటులో ప్రవేశము లేనట్లు, జ్ఞానము
అను టికెట్ లేనప్పుడు మోక్షము అను గేటులోనికి ఎవరూ ప్రవేశించలేరు.
సర్వప్రపంచమునకు దేవుడు ఒక్కడే. అయితే ఆ విషయమును
చెప్పుటకు పెద్ద జ్ఞానము అసవరములేదు. ఒక మతములో పుట్టిన చిన్న
పిల్లవాడు కూడా వారి మతస్థులందరూ చెప్పు మాటనే చెప్పును. ముస్లీమ్
మతములో పుట్టిన ఎనిమిది సంవత్సరముల చిన్నపిల్లవాడు కూడా దేవుడు
ఒక్కడేయని, మేము వేరే దేవతలను మ్రొక్కము అని చెప్పగలడు. అది
వారి మతముతో వచ్చినమాటగానీ, వాస్తవముగా ఆ పిల్లవానికి దేవునికి
సంబంధించిన జ్ఞానముగానీ, విగ్రహములయిన ఇతర దేవతలకు
సంబంధించిన అజ్ఞానము గానీ తెలియదు. దేవుడు ఒక్కడేయని చెప్పుమాట
చాలా సులభము. ఆ మాట ఎవరయినా, ఎప్పుడయినా చెప్పగలరు.

Page 53
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
53
అయితే దేవుని జ్ఞానము సముద్రములాంటిది, అపారమైనది. అందువలన
దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలియుట చాలా కష్టము. ఎవరయినా
కష్టపడి దేవుని జ్ఞానము తెలిసినప్పుడు, దేవుడు ఎలా గొప్పవాడో, దేవుడు
ఎలా ఒక్కనిగా ఉన్నాడో, దేవుడు ఎలా విగ్రహముకాదో తెలియును. అప్పుడు
దేవతారాధకులను, విగ్రహారాధకులనూ అజ్ఞానులు అని అనవచ్చును.
తనవద్ద జ్ఞానమున్నదని నిరూపించుకొని మోక్షమును పొందవచ్చును.
అట్లు కాకుండా ఒక మనిషి విగ్రహారాధనకు దూరముగాయున్న
ఒక మతములో పుట్టినంతమాత్రమున వానికి దేవుని జ్ఞానము తెలియనిదే
వాడు జ్ఞాని కాలేడు, దేవునికి దగ్గర కాలేడు. అందువలన విగ్రహారాధనకు
దూరముగాయున్న మతములో పుట్టిన వారందరూ జ్ఞానులూ కారు.
విగ్రహారాధన చేయు మతములో పుట్టిన వారందరూ అజ్ఞానులూ కారు.
హిందువులు ఎక్కువగా విగ్రహారాధన చేయువారు గలరు. అంతమాత్రమున
ఆ మతములోని అందరినీ అజ్ఞానులు అని చెప్పలేము. భగవద్గీతయందు
అన్యదేవతారాధనను ఖండించు జ్ఞానము గలదు. భగవద్గీతను అనుసరించు
వారు ఎవరూ విగ్రహారాధన చేయరు. అందువలన ఒక మతమును
అజ్ఞానమని మరియొక మతమును జ్ఞానమని చెప్పలేము. ఎందుకనగా!
మూడు మతములలో ఒకే జ్ఞానము గలదు. భగవద్గీతలో చెప్పిన శ్లోకముల
సారాంశమే మిగతా రెండు గ్రంథములందు గలదు. భగవద్గీత మొదట
తయారయిన ప్రథమ దైవగ్రంథము. తర్వాత రెండు గ్రంథములు వచ్చాయి.
అందులో చివరి దైవ గ్రంథము ఖురాన్ అని గలదు. అందువలన దైవ
గ్రంథములు మూడేయని తెలిసిపోయినది. అంతిమ దైవగ్రంథము ఖురాన్
ప్రథమ దైవగ్రంథమును, దానిలోని జ్ఞానమును ధృవీకరించుచున్నదని
చెప్పడము జరిగినది. భగవద్గీతను ఖురాన్లో తౌరాత్ అను పేరుతో

Page 54
54
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
పిలువబడినది. తౌరాత్ గ్రంథములో జ్యోతి, మార్గదర్శకత్వము ఉన్నదని
ఖురాన్ ఐదవ సూరాలో చెప్పడమైనది. దీనినిబట్టి అన్ని దైవగ్రంథములలో
జ్ఞానమే యున్నది. అన్ని మతబోధలలో జ్ఞానమే ఉన్నదని తెలియుచున్నది.
వారి ప్రశ్న :- మీరు అనేకమార్లు ప్రతిమవేరు, విగ్రహా వేరని చెప్పారు. ప్రతిమ
అనినా ఒక బొమ్మే. అది రాతితో చేసియుండవచ్చు, మట్టితో చేసియుండవచ్చు
లేక లోహముతో చేసియుండవచ్చును. ఒక ఆకారముగల ఏ బొమ్మ అయినా
అది మనుషులచేత తయారు చేయబడినదే కదా! మనిషి తయారు చేసిన
వాటికి మనిషే మ్రొక్కడము విచిత్రముగా యున్నది. మనుషులు తయారు చేసిన
బొమ్మలో మనిషికంటే మించిన శక్తియుండునా?
మా జవాబు :- మనిషి తయారు చేసినవి అన్నీ మనిషికంటే తక్కువవని
ఎందుకనుకోవాలి. మనిషి తయారు చేసిన ఎన్నో యంత్రములు మనిషికంటే
శక్తివంతముగా యున్నవి కదా! అందువలన మనిషిచేత తయారు చేయబడిన
వన్నీ మనిషికంటే తక్కువయినవని అనుకోకూడదు. మనిషి తయారు
చేసిన క్యాలికులేటర్ మనిషికంటే తెలివిగా, ఖచ్చితమైన లెక్కలు చెప్పు
చున్ననది కదా! అట్లే మనిషి తయారు చేసిన విమానము మనిషికంటే
వేగముగా ప్రయాణము చేయుచున్నది కదా! అందువలన మనిషి తయారు
చేసినవి ఎన్నో మనిషికంటే గొప్పవని చెప్పవచ్చును.
వారి ప్రశ్న :- మేము మనిషి చేసిన యంత్రములను గురించి అడుగలేదు. మనిషి
చేసిన రూపమున్న బొమ్మలను గురించి అడుగుచున్నాము. మనిషి చేసిన
బొమ్మలు దేవతలైతాయా?
మా జవాబు :- మనిషి బొమ్మను మాత్రము చేయుచున్నాడుగానీ, అందులోని
దేవతను తయారు చేయలేదు. మనిషి తయారు చేసిన బొమ్మ వేరు, ఆ

Page 55
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
55
బొమ్మలోయుండు దేవత వేరు. మనిషి స్థూలమైన ఆకారమును తయారు
చేయగలడు కానీ, సూక్ష్మమైన దేవతను తయారు చేయలేడు. మనిషి
చేసిన బొమ్మలో ఏ దేవత అయినా ఉండవచ్చును. కార్మికుడు కష్టపడి ఒక
ఇంటిని తయారు చేయగలడు. అయితే ఆ ఇంటిలో నివసించువారిని
తయారు చేయలేడు కదా! అలాగే ఒక ఆకారముగల బొమ్మను మనిషి
తయారు చేయగలడు. అయితే ఆ బొమ్మలో నివాసముండు దేవతను
తయారు చేయలేడు. మనిషి చేత బొమ్మ తయారయిన తర్వాత దానిలో
ఏ దేవతయినా నివాసముండవచ్చును. అయితే బొమ్మను తయారు చేసిన
వానికీ, అందులో నివసించు దేవతకు ఎలాంటి సంబంధము ఉండదు.
బొమ్మను తయారు చేసిన వానిమీద ఆ బొమ్మలో నివసించు దేవత
పెత్తనమును చెలాయించగలదు. అతనికి మంచయినా, చెడు అయినా
చేయగలవు. అందువలన బొమ్మలను చేసిన వాడుగానీ, బొమ్మగానీ
దేవతలకంటే వేరయినవి. దేవతలు మనిషి తయారు చేసిన బొమ్మను
తమ నివాస శరీరముగా వాడుకొంటున్నాయి. అంతేగానీ బొమ్మలోని
దేవతను మనిషి తయారు చేయలేదు.
వారి ప్రశ్న :- మాకు తెలిసినంత వరకు భూమిమీద మనుషులు, సమస్త
జీవరాసులు ఉండగా, అన్నిటికీ అధిపతిగా దేవుడు ఒక్కడే గలడు. మధ్యలో
మీరు చెప్పే దేవతలెవరు? వీరిని ఎవరు సృష్టించారు?
మా జవాబు :- నీకు తెలిసిన వరకు దేవుడు ఆయన ఆధీనములో
మనుషులు ఉన్నారు. అయితే నీకు తెలియని జ్ఞానము ఎంతో గలదు.
అది అంతా దేవుని పరిధిలోనిదే. దేవుడు మనుషులనే కాక మనుషులకంటే
వేరుగాయున్న దేవతలను కూడా సృష్టించాడు. నీకు కనిపించునదే దేవుని
సృష్ఠి అని అనుకుంటున్నావు. అయితే నీకు తెలియనిది, నీకు కనిపించని

Page 56
56
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
సృష్టి ఎంతో గలదు. అందులో భాగముగా దేవతలను దేవుడు సృష్టించాడు.
కనిపించే మానవ జాతియున్నట్లు, కనిపించని దేవతల జాతి ఎంతో గలదు.
మనిషికున్న స్థూలదృష్ఠికి దేవతలు కనిపించరు. జాతి వేరయినా దేవతల
శరీరములో యుండేవారు జీవులే. మానవ శరీరములోనున్న జీవులే
కర్మనుబట్టి అప్పుడప్పుడు దేవతలుగా జన్మించుచుందురు. దేవతలు
కనిపించని ఒక జాతి మాత్రమే. దేవతలకు చావుపుట్టుకలున్నాయి.
మనుషులుగా చచ్చినవారు దేవతల జాతిలో పుట్టవచ్చును. దేవతల జాతిలో
పుట్టినవారు మనుష జాతిలో పుట్టవచ్చును. మనుషుల జీవితమునకుగానీ,
దేవతల జీవితమునకుగానీ కర్మే కారణము. కర్మప్రకారమే వారి జీవితములు
జరుగుచుండును. మానవుల తర్వాత మానవులవలె దేవతల జాతి
మరొకటియున్నదని చాలామందికి తెలియదు. కనిపించని దేవతలు కూడా
సాధారణ జీవులేయని, దేవతలని పేరు పెట్టబడినంతమాత్రమున వారు
గొప్పవారు కాదని తెలియక, మనుషులు కొందరు దేవతలను దేవునివలె
పూజించను మొదలుపెట్టారు. మనుషులకంటే నీచమైన గుణములుగలవారు
దేవతలలో కూడా ఉన్నారను విషయము మనుషులకు తెలియదు. దేవతలలో
ఎంతో ఉన్నతమైన భావములుగల మంచివారు గలరు. అలాగే ఎంతో
నీచమైన భావములుగల చెడువారు కూడా గలరు. దేవతలు, మనుషులు
ఇరువురు దేవుని సృష్ఠిలోని వారే, అయినా కొందరు మనుషులు దేవతలను
దేవునివలె తలచి గొప్ప భావముతో ఆరాధించుటకు మొదలు పెట్టారు.
మనుషుల చేత గౌరవింపబడుచూ, మనుషులచేత ఆరాధింపబడు దేవతలు
అజ్ఞానము చేత మేము గొప్పవారమను అహమును పొందియున్నారు.
దేవతలలో కూడా జ్ఞానజిజ్ఞాసులు కలరు, అజ్ఞానులు కలరు. దేవతలలో
గొప్ప జ్ఞానులు కూడా కలరు. అట్లే గొప్ప అజ్ఞానులు కూడా కలరు.

Page 57
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
57
దేవతలలో మంచి గుణములతో ప్రవర్తించువారు కొందరుండగా, చెడు
గుణములతో ప్రవర్తించు వారు చాలామందియున్నారు. ప్రథమ
దైవగ్రంథములో భారతదేశ భాషలో దేవతలు అని పిలువబడినవారే, అంతిమ
దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో జిన్నులు లేక జిన్నాతులు అని
చెప్పబడినారు.
అంతిమ దైవగ్రంథము ఖురాన్లో సూరా 72 ఆయత్ 6 లో
ఇలా కలదు చూడండి. (72-6) “మానవులలో నుండి కొందరు
జిన్నాతులలోని కొందరిని శరణు వేడేవారు. ఈ కారణముగా
జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.” (72-5) “మనుషులైనా,
జిన్నాతులైనా అల్లాహ్ కు (దేవునికి) అబద్దాలు అంటగట్టడము అనేది
అసంభవమని మనము అనుకొన్నాము" అని కూడా కలదు. (6–100)
“ప్రజలు జిన్నాతులను అల్లాహ్ కు భాగస్వాములుగా ఖరారు చేసు
కొన్నారు. మరి చూడబోతే వారిని సృష్టించినది కూడా ఆయనే" ఈ
విధముగా జిన్నాతులను గురించి ఖురాన్ గ్రంథములో ఇంకా కొన్నిచోట్ల
చెప్పడము జరిగినది. అక్కడ 'జిన్నాతులని' చెప్పినవారినే మనము 'దేవతలు’
అంటున్నాము. దేవతలను దేవునికి సమానము చేసి పూజించుచున్నారని
(72–6) లోను, (6-100) లోనూ చెప్పడము జరిగినది.
దేవతల విషయము మనుషులకు తెలియక కనిపించకుండా మాట్లాడు
దేవతలను పూజ్యులుగా భావించుకొన్నారు. ఒకవేళ దేవతలను పూజించని
వారిని కొన్ని కష్టాలపాలు చేసి, కొన్ని రకముల అనారోగ్యములపాలు చేసి,
మనుషులను భయపెట్టి తమను పూజించునట్లుగా కొందరు దేవతలు
చేసుకొంటున్నారు. తమకు ముడుపులు కట్టనివారిని, కానుకలు ఇవ్వని
వారిని ఇబ్బందుల పాలుచేసి తమకు ముడుపులు చెల్లించునట్లు చేసు
కనిపించని

Page 58
58
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
కొంటున్నారు. ఈ విధముగా జిన్నాతులు అని ఖురాన్ గ్రంథములో
పిలువబడేవారే మన దేశములో హిందువుల మధ్య దేవతలుగా పిలువబడు
చున్నారు. భూమిమీద మనుషులు లేనిచోట కూడా వీరు కలరు.
దేవతలజాతి మానవులజాతికంటే గొప్పదని కొందరనినా అట్లేమికాదు
పక్షులలో కాకులు, గద్దలులాంటి వారు మనుషులు, దేవతలు. రంగులోనూ,
పరిమాణములోనూ గద్ద కాకి కొంత వేరుగాయున్నా రెండూ మాంసము
తినేవే అయినట్లు, మనుషులు దేవతలు వేరువేరు జాతులయినా ప్రవర్తనల
లోనూ, కర్మలలోనూ, గుణములలోనూ దాదాపు సమానముగానే యున్నారని
చెప్పవచ్చును.
వారి ప్రశ్న :- దేవతలు మానవులకంటే కొంత వేరయినా వారిలో చెప్పుకో తగిన
గొప్పతనము లేదని మీరంటున్నారు. వారి విషయము చాలామందికి
తెలియదు కదా! నేడు పెద్ద స్వామీజీలుగాయున్న వారు సహితము మీరు
చెప్పినట్లు దేవతలను గురించి చెప్పలేదు. పైగా వారు కూడా దేవతలను
పూజించుచున్నారు. ఒకవైపు భగవద్గీతను చెప్పుచున్నా, మరొకవైపు దేవతల
భ్రమలోపడి వారిని పూజించుచున్నారు. ఈ విధముగా దాదాపు కొంత
జ్ఞానము తెలిసిన వారందరూ దేవతలనే ఆరాధించుచుండగా, మీరు మాత్రము
దేవతలంటే గొప్పేమీ కాదు, వారు కూడా మానవజాతిలాగే యున్న జాతి అని
అంటున్నారు. మా అనుమానముతో అడుగు చున్నాము, వారి విషయము
మీకు ఎలా తెలుసు?
మా జవాబు :– దేవతలు మనుషుల మీద తమ పెత్తనము చెలాయించుటకు,
మనుషులను భయభ్రాంతులను చేసి తమను పూజించునట్లు చేసుకొనుటకు
కొన్నిచోట్ల తమను గౌరవించని ప్రజలను కనిపించకుండా పీడించుచూ,

Page 59
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
59
మనుషులను అనారోగ్యములపాలు చేసినప్పుడు, మనుషుల మీద దేవతల
దౌర్జన్యము జరుగునప్పుడు వారు చేయు పనులు మంచివి కాదని, ప్రజలను
రౌడీలవలె పీడించడము మంచిదికాదని, కొన్ని సందర్భములలో మేము
వారిని దండించడము జరిగినది. అలా వారు చేయు కొన్ని చెడుపనులను
మేము ఖండించడము జరిగినది. అటువంటి సమయములో కొందరు
దేవతలు మేము చెప్పు నీతిని, జ్ఞానమును గ్రహించినవారై మా మాటకు
గౌరవమిచ్చిన వారు కలరు. అరుదుగా కొందరు దేవతలు మాకు ఎదురు
తిరిగి మాట్లాడిన సందర్భములు కూడా కలవు. అట్లు అరుదుగా జరిగిన
సంఘటనలలో మేము వారిని కఠినముగా శిక్షించడము కూడా జరిగినది.
మా శిక్షకు భయపడి మారిపోయిన వారూ గలరు. కొందరు అప్పటికి
భయపడినా తర్వాత వారి పద్దతి ప్రకారము వారు చెడుగానే నడుచుకొను
వారు కూడా కలరు. ఈ విధముగా దేవతలతోనూ నాకు కొంత పరిచయము
ఉండుట వలన వారి విషయములు దాదాపు పూర్తిగా తెలియుననియే
చెప్పుచున్నాను.
వారి ప్రశ్న :- దేవుడు మనుషజాతిని పుట్టించినట్లు దేవతా జాతిని కూడా
పుట్టించాడు అని అంటున్నారు. మనుషులు పిండజులుగాయున్నారు. కంటికి
కనిపించని దేవతలు పిండజులేనా? వారి సృష్టి ఎలా జరుగుచున్నది?
మా జవాబు :- మనుషులవలె అన్ని రకముల దేవతలున్నారని చెప్పాము.
మనుషులకు దేవతలకు ఒకే ఒక తేడా కలదు. మనుషులు కనపడుచున్నారు.
దేవతలు కనిపించడములేదు. మనుషులకంటే కొన్ని విషయములందు
మాత్రము దేవతలలో ప్రత్యేకత కలదు. అందువలన కొంత విశేషత
దేవతలలో యున్నదని చెప్పవచ్చును. వారి విశేషత వలన మనుషులను

Page 60
60
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
దేవతలు పీడించు, బాధించు బలము కల్గియున్నారు. అంత తప్ప మిగతా
అన్ని విషయములందు మనుషులతో సమానముగానేయున్నారు. దేవుని
సృష్ఠి అయిన అండజ, పిండజ, ఉద్భిజ అను మూడు రకములలో మానవుల
సృష్ఠి పిండజముగా యున్నది. అదే విధముగా దేవతల సృష్టికూడా
పిండజముగానే యున్నది. మనుషులకు దేవతల విధానమంతయు
కనిపించకయుండుట వలన వారి విషయము ఎవరికీ సరిగా తెలియకుండా
పోయినది. మనుషులకున్నట్లే దేవతలకు కూడా బాల్యము, యవ్వనము,
కౌమారము, వృద్ధాప్యము, మరణము అను స్థితులు వరుసగా గలవు.
అంతేకాక మనుషుల మరణములు మూడు రకములుగా యున్నట్లు, దేవతల
మరణములు కూడా కాలమరణము, అకాలమరణము, తాత్కాలిక
మరణమను మూడు రకముల మరణములు గలవు.
వారి ప్రశ్న :- దేవతలు మానవుల కోర్కెలను నెరవేర్చుతారని, అందువలన
మనుషులు దేవతల వెంటపడి మ్రొక్కుచున్నారని విన్నాము. కొందరు దేవతలు
మనుషుల కోర్కెలను తొందరగా నెరవేర్చుట వలన ఆ దేవతలను ఎక్కువమంది
పూజింతురని కూడా విన్నాము. తిరుపతి వెంకటేశ్వరుడు ఆపద
మ్రొక్కులవాడని కొందరు చెప్పుచుందురు. మ్రొక్కుకొన్న వారి ఆపదలను తప్పక
తీర్చునని అలాగ అన్నారు. భక్తుల కోర్కెలను నెరవేర్చడములో కొందరు
ముందుండుటవలన ఆ దేవతలనే ఎక్కువమంది ఆరాధించుచున్నారని
తెలియుచున్నది. కొందరు వారు నమ్మిన దేవుని దయవలన పెద్ద ధనికుడిని
అయ్యానని చెప్పుచుందురు. పేదవారినుండి ధనికులుగా మారిన కొందరు
వారు పూజించు దేవతయొద్దకు నెలకొకమారు పోయి పూజలు చేయించి
వచ్చే వారున్నారు. కొందరు తాము సంపాదించిన సొమ్మును లక్షలలోనూ,

Page 61
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
61
కోట్లలోనూ ముడుపులుగా చెల్లించేవారున్నారు. కొందరయితే తాము
విపరీతముగా సంపాదించి అదంతా తాము నమ్మిన దేవుడే ఇచ్చాడని కొన్ని
కేజీల బంగారమును హుండీలోనికి వేసి వచ్చిన వారు కూడా కలరు.
కొందరయితే కొన్ని కోట్లను ఒక మూటగా వేసినవారు పేరు తెలియకుండా
అజ్ఞాత భక్తులు ఇచ్చారన్నట్లు చేయుచుందురు. ఇంత భక్తి మనుషులందు
డుటకు దేవతల ద్వారా వారికి మంచి జరిగి లాభము వచ్చియుండును కదా!
దీనినిబట్టి దేవతలు తమను మ్రొక్కిన వారి కోర్కెలను తీర్చుచున్నారని, లాభము
చేకూర్చుచున్నారని అర్థమగుచున్నది. దీని విషయములో మీరేమంటారు?
మా జవాబు :- మీరు చెప్పినదంతా నిజమే! అయితే ఇక్కడ కనపడునదంతా
సత్యమే అనుకొంటే మీరు తప్పులో కాలు వేసినట్లేయగును. ఇక్కడ కనిపించు
దానికంటే కనపరానిదే ఎక్కువగాయున్నది. బయటికి కనిపించునది మీరు
చెప్పినట్లుయున్నా, ఏ దేవతా ఏ మనిషికీ ఏ సహాయము చేయలేదు. ఈ
మాటను ఒక్కమారుగా వింటే మేము చెప్పునది అసత్యముగాయుండును.
అందువలన ఇక్కడ కొంత సవివరముగా తెలియవలసియున్నది. భూమిమీద
మనుషులుగానీ, దేవతలుగానీ ఇరువురు కర్మప్రకారము పుట్టి, కర్మప్రకారము
బ్రతుకవలసినవారే. ఎవరి కర్మను వారు అనుభవించక మానదు.
అటువంటప్పుడు మనిషికి ఏమి జరిగినా, ఏమి వచ్చినా అన్నీ కర్మప్రకారమే
జరుగవలసియున్నది. దేవతలుగానీ, మనుషులుగానీ కర్మకు అతీతులు
కారు. మనుషులలోని బలహీనతను దేవతలు ఆసరాగా చేసుకొని, మనిషికి
మేము మేలు చేయుచున్నామని భ్రమింపచేసి, మనిషిని మోసము చేయు
చున్నారు. కొన్ని విషయములలో దేవతలు మంచి చేసినట్లు కనిపించినా
అది వారు చేసిన మంచికాదు. మనిషి దేవతలను తన కోర్కెల నిమిత్తము
పూజించుచున్నాడు. అటువంటి సమయములో తాను ఒక కోర్కెను కోరి

Page 62
62
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఈ గండము తప్పిపోవునట్లు చేస్తే, నీకు ఫలానా కానుక చెల్లించుకొంటానని
మనిషి మంచి పేరున్న దేవతను మ్రొక్కాడనుకొనుము. అప్పుడు ఆ మనిషి
కోర్కె ప్రకారము వాడు కోరిన కోర్కె నెరవేరి వాని గండము గడచిపోయినది.
తర్వాత మనిషి తాను మ్రొక్కిన దేవతకు కానుక చెల్లించవలసియున్నది.
ఎందుకనగా మనిషి ముందే తన కోర్కె నెరవేరితే ఫలానా కానుక ఇచ్చు
కుంటానని చెప్పియున్నాడు. ఆ విషయము ఆ దేవత ముందరే జరిగి
యుండుట వలన అదంతా ఆ దేవతకు కూడా తెలిసియున్నది.
మనిషి దేవతను కోరిన కోర్కె నెరవేరినది కూడా ఆ దేవతకు
తెలుసు. అయితే తాను ఏమీ చేయలేదను విషయము కూడా ఆ దేవతకు
తెలుసు. అయితే అతను కోరుకున్న కోర్కె నన్ను మ్రొక్కిన తర్వాతే
నెరవేరింది కదా!యనీ, అలా నెరవేరుటకు నేనే కారణమైయుండవచ్చును
కదా!యనీ తలచి, కోర్కె నెరవేరిన తర్వాత కూడా కొంతకాలము వరకు
కానుక ఇవ్వని మనిషిని తనకు కానుకను చెల్లించమని ఏదో ఒక రకముగా
ఆ దేవత అతని మీద ఒత్తిడి తెచ్చును. వేరే మనిషిలోనికి పూనకమువచ్చి,
నీ కోర్కెను నేను నెరవేర్చాను నాకు నీవు చెప్పిన కానుక ఇవ్వలేదని
దేవత అడిగిందనుకో, అప్పుడు ఆ మనిషి భయపడి వెంటనే తాను
చెప్పిన కానుకను ఆ దేవతకు ఇచ్చును. దేవత పూనకమువచ్చి కానుకను
గురించి అడిగిన దానివలన కోర్కెను కోరిన మనిషి తన కోర్కెను ఆ దేవతయే
నెరవేర్చినదని అనుకొనును. ఆ విషయమంతా తెలిసినవారు కూడా దేవత
వలననే ఆ మనిషి కోర్కె నెరవేరినదని అనుకొందురు. ఈ విధముగా
మనుషులు దేవతలను నమ్ముచున్నారు. తాము చేయని పనులకు కానుకలను
అడిగి ఇప్పించుకొనుచున్నారు దేవతలు. అట్లు అడుగుటవలన దేవతలే
కోర్కెలను నెరవేర్చారని ప్రజలు దేవతల విషయములో మోసపోవుచున్నారు.

Page 63
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఆ
63
ఏ
వాస్తవముగా జరిగింది చూస్తే దేవతలు ఎంత మోసము చేయు
చున్నారో తెలియగలదు. దీనిని గురించి భగవద్గీతలో విజ్ఞాన యోగమను
అధ్యాయమున 20, 21, 22, 23 శ్లోకముల సారాంశము ఈ విధముగా
కలదు చూడండి. శ్లోకముల భావము "ప్రకృతి సంబంధములగు పాపముల
చేత అజ్ఞానులైన మనుషులు కోర్కెలయందు మునిగి, తమ కోర్కెలు నెరవేరు
నిమిత్తము అసలయిన దేవున్ని ప్రక్కనపెట్టి, దేవుడుకాని అన్యదేవతలను,
ఆ దేవతల నియమముల ప్రకారము ఆరాధించుచున్నారు. ఎవ్వనికి ఏ
దేవతను పూజింప శ్రద్ధయుందో ఆ శ్రద్ధ ప్రకారమే ఆ దేవతనే వదలకుండా
ఆరాధించునట్లు నేనే చేయుచున్నాను. అలా శ్రద్ధ ప్రకారము ఆ దేవతనే
పూజ చేసే దానివలన కోర్కె నెరవేరినదని వానికి తెలియునట్లు నేనే వాని
కోర్కెను నెరవేర్చుచున్నాను. దేవతాభక్తిలో యున్నా వాని మంచి కోరిన
నేను వాని కోర్కెలను నెరవేరునట్లు చేయుచుండగా, తెలివి తక్కువ
మనుజులు దేవతా పూజల వలన కోర్కెలు నెరవేరునని వాటినే ఆచరించు
చుందురు. అల్పబుద్ధిగలవారు పొందు ఫలితములు ఎంతవైనా అవి అల్పమే
యగును. దేవతా భక్తులందరూ దేవతలనే పొందగా, నా భక్తులు మాత్రము
నన్ను పొందగలరు” అని దేవుడు భగవంతుని రూపములో చెప్పడము
జరిగినది. భగవంతుడుగా చెప్పిన విషయమంతా చూస్తే దేవుడు వేరు,
దేవతలు వేరని తెలిసిపోవుచున్నది. మనిషి తమ కోర్కెల నిమిత్తము దేవున్ని
వదలి దేవతలను ఆశ్రయించడము జరుగుచున్నది. మనుషులు దేవుని
జ్ఞానము తెలియనందువలన అజ్ఞానములో పూర్తి లోతుగా చిక్కుకొన్నవారై
తమకు అన్నీ ఇచ్చువాడు దేవుడు ఒక్కడే అని తెలియక, దేవుని చేత
సృష్ఠింపబడినవారు, మానవులవలె మాయలో చికుకొన్న వారు అయిన
దేవతలను తమకంటే గొప్పవారుగా తలచి, వారు కనపడని దానివలన

Page 64
64
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
దేవునితో సమానముగా తలచి, తాము కోరుకొన్న కోర్కెలను నెరవేర్చుదురని
పొరపడినవారై, దేవతలను పూజ్యులుగా భావించి పూజించను మొదలు
పెట్టారు. దేవతలను పూజించిన వారి కోర్కెలు తీర్చుదురను అపోహతో
ఆశవలన అందరినీ మ్రొక్కను మొదలుపెట్టారు.
భూమిమీద ప్రతి ఊరిలోను కొందరు మనుషులున్నట్లు ప్రతి
ఊరిలోను కొందరు దేవతలు గలరు. ఒక ఊరిలో వేయిమంది జనాభా
యుందనుకొందాము. ఆ ఊరిలో దాదాపు రెండువందల యాభై (250)
మంది నుండి 300 వరకు దేవతలుందురు. అలాగే రెండు వందలయాభై
(250) నుండి 300 వరకు దైయ్యాలు ఉండును. అదే విధముగా రెండు
వందల యాభై (250) నుండి 300 వరకు జంతువులు, పక్షులు, పాములు,
క్రిమికీటకాదులు ఉండును. ఊరిలోని మనుషులు వేయిమంది కనిపించు
చుండగా, మిగతా మూడు రకములవారు కనపించకయున్నారు. దేవతలు
కనిపించరు వారి పుట్టుకయే అట్లుండును. దేవతలకంటే భిన్నమైనవారు
దైయ్యములు. దైయ్యములనగా చనిపోయి బ్రతికియున్న మనుషులేయని
అర్థము. అలాగే మనుషులవలె చనిపోయి బ్రతికియున్న జంతువులు,
పక్షులు, పాములు, క్రిమికీటకాదులు మొదలగునవన్నియూ దెయ్యముల
క్రిందకే వచ్చును. ఈ విధముగా భూమిమీద కనిపించకయున్న వారు
మూడు రకములుగా యున్నా వారిలో దైయ్యములుగా యున్నవారు
చనిపోయినా, ఆయుష్షు అయిపోని వారని అర్థము. దేవతల పుట్టుకయే
సూక్ష్మమైనందున దైయ్యములవలె కనిపించక దేవతలు తిరుగుచుందురు.
వేయిమంది గల ఒక ఊరిలో దాదాపు ఎంత సంఖ్యలో దేవతలుందురో
తెలిసినది. దేవతలకు, దైయ్యములకు స్థూల శరీరము లేనందున
దైయ్యములు దేవతలు రెండూ సూక్ష్మశరీరముతోనే కాలము గడుపుచున్నవి.

Page 65
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
65
దేవతలు సూక్ష్మ శరీరముతో దైయ్యములవలె ఉండుట వలన దేవతలను
పెద్ద దైయ్యములని, దైయ్యములను చిన్న దెయ్యములని చెప్పవచ్చును.
బ్రతికియున్న మనకు తెలియదుగానీ, దేవతలకు దెయ్యములకు అప్పుడప్పుడు
అక్కడక్కడ చిన్నచిన్న ఘర్షణలు కూడా జరుగుచుండును.
బ్రతికియున్న మనుషులను కనిపించని దేవతలు అనేక విధముల
మోసములు చేయుచున్నవి. తాము మనుషుల కోర్కెలను నెరవేర్చు శక్తి
గల వారమని ప్రచారము సాగించుకొన్నవి. ప్రజలలో ముఖ్యమైన వారయిన
స్వామీజీలు కూడా దేవతలను మ్రొక్కడము వలన మిగతా ప్రజలందరూ
దేవతల విషయములో మోసపోవడము జరిగినది. ప్రత్యేకమయిన శక్తులు
లేని దేవతలు, మనుషుల కోర్కెలను తీర్చువారుగా ప్రచారమైనారు. ప్రజలు
తమ అజ్ఞానము వలన దేవతలు తమ కోర్కెలను నెరవేర్చుదురను భ్రమతో,
దేవతలకున్న నియమాల ప్రకారము ఆ నియమములను ఆచరించుచూ,
శుక్రవారము మ్రొక్కేవారిని శుక్రవారము, మంగళవారము మ్రొక్కే వారిని
మంగళవారము, శనివారము మ్రొక్కే వారిని శనివారము మ్రొక్కుచున్నారు.
మాంసముతో తృప్తి చెందే దేవతలకు జంతుబలులు చేసి మాంసమును
అర్పించుచున్నారు. కొంతమంది దేవతలకు శబ్దసందడి ఇష్టమైనందున
వారికి అదే విధముగా డోలు, తప్పెట్లతో ఊరేగింపు ఉత్సవము చేయు
చున్నారు. ఇట్లు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆరాధనతో వారి నియమముల
ప్రకారము పూజలు చేయుచున్నారు. అలా పూజలు చేయడము వలన
తమ కోర్కెలు నెరవేరునని ప్రజలు తలచుచున్నారు.
మనుషులు ఆశతో తమ కోర్కెల నిమిత్తము దేవతలను పూజించగా,
దానిని గమనించిన దేవుడు, మనిషి ఏ దేవతను శ్రద్ధతో పూజించుచున్నాడో
ఆ దేవత మీదే శ్రద్ధయుండునట్లు చేయుచున్నాడు. దేవునికి ప్రతీదీ తెలుసు,

Page 66
66
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ప్రతి దానిని చూస్తున్నాడు. దేవునికి తెలియకుండా జరుగునది ఏదీలేదు.
అందువలన మనిషికి ఏ దేవతమీద ఎక్కువ శ్రద్ధయుండునో, ఆ శ్రద్ధను
అలాగే యుండునట్లు దేవుడే చేసి, ఆ దేవతనే మనిషి పూజించునట్లు
చేయును. దేవుడు ఇచ్చిన శ్రద్ధతో మనిషి తాను నమ్మిన దేవతనే కోర్కెల
నిమిత్తము పూజించుచుండగా, ఆ కోర్కెలను దేవుడే నెరవేర్చుచున్నాడు.
అది తెలియని మనిషి తన కోర్కెలను తాను పూజించిన దేవతయే
నెరవేర్చినదని అనుకొనుచున్నాడు. ఈ విధముగా నెరవేరు కోర్కెలను
చూచి, ఇంకా కావలసిన కోర్కెలను కోరుచూ, చిరకాలము దేవతా భక్తిలో
మనిషి కూరుకుపోవుచున్నాడు. మనిషికి దేవుని జ్ఞానము తెలియని
దానివలన, తెలివి తక్కువవాడై నెరవేరు ప్రపంచ కోర్కెలవైపు పోవుచున్నాడు.
ఇన్ని విధములుగా దేవతా భక్తులు దేవతలవైపు పోగా, దేవుని భక్తులు
జ్ఞానము తెలిసినవారై దేవుని వైపు పోవుచున్నారు.
వారి ప్రశ్న :- మీరు చెప్పు విషయమునుబట్టి దేవతలు వేరని, దేవుడు వేరని ఈ
తారతమ్యమును మనుషులు తెలియక, దేవతలను దేవునితో సమానముగా
లెక్కించుకొన్నారని తెలియుచున్నది. అయితే మనుషులు కోరిన కోర్కెలను
దేవుడు ఎందుకు నెరవేర్చాలి? దేవుడు నెరవేర్చినా మనుషులు ఆ విషయమును
తెలియనివారై దేవతలే నెరవేర్చారని అనుకొనుచున్నారు కదా! దానివలన
దేవుడు మనుషుల కోర్కెలు నెరవేర్చినా, ఆ కోర్కెలను ఎవరు తీర్చారను సత్యము
తెలియనప్పుడు, దేవుడు వారి కోర్కెలను తీర్చి ప్రయోజనము లేదు కదా! దేవుడు
మనుషుల కోర్కెలను నెరవేర్చుట వలన మనుషులు దేవునికి వ్యతిరేఖముగా,
దేవతా భక్తులుగా మారిపోవుచున్నారు కదా! అలాంటప్పుడు దేవుడు ఎందుకు
మనుషుల కోర్కెలను నెరవేర్చుచున్నాడు?

Page 67
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
67
ఈ విషయమును గురించి
మా జవాబు :- దేవుడు తన ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలో, అలాగే
తన చివరి దైవగ్రంథము ఖురాన్లో
చెప్పియున్నాడు. తనకు ఇష్టమైన వారిని మాత్రమే తనవైపు వచ్చునట్లు
చేయుటకు, తనకు ఇష్టము లేనివారిని తన మార్గమునుండి దూరముగా
పోవుటకు, తనవైపు రాకుండా చేయుటకు, దేవుడు చేయు కార్యములలో
ఇదొక కార్యము. ఈ కార్యములో మనుషుల కోర్కెలను నెరవేర్చి, నెరవేర్చినది
దేవతలేనని భ్రమింపజేసి, మనుషులను తననుండి దూరముగా పంపు
చున్నాడు. దేవుడు అదే పనిగా చేయుచున్న కార్యములలో ఇదొకటి. దేవుని
కార్యములను మనిషి ఏమాత్రము గుర్తించలేడు. ఎందుకనగా! ఇది దేవుని
కార్యమే అయినా దానిని ప్రకృతియే చేయుచున్నది. అందువలన దేవుడు
మనిషికి మంచి చేసినా, చెడు చేసినా మనిషి ఏమాత్రము గుర్తించలేడు.
వారి ప్రశ్న :- దేవుడు మనిషిని తనవైపునుండి దారి మళ్ళించి ప్రక్కదారిలో
పోవునట్లు చేయుటలో ఇదొక కార్యమని చెప్పారు. దేవుడు మనుషులు
మ్రొక్కిన కోర్కెలను నెరవేర్చడమేకాక మనిషిని అజ్ఞానమార్గములోనికి పంపి,
జ్ఞాన మార్గములోనికి రాకుండా చేయు విధానములలో మరొక విధానము
ఎలావుందో తెలియజేయండి?
మా జవాబు :- సాధారణ ప్రజానీకమును తన దారిలోనికి రాకుండా
చేయుటకు దేవుడు అదేపనిగా కనిపించని దేవతలను సృష్టించాడు. సామాన్య
ప్రజలందరూ తమలోని కోర్కెల ఆధారముతో దేవతలవైపు పోయి, దేవుడు
ఒకడున్నాడను విషయమును కూడా మరచిపోయారు. ఇదంతా సామాన్య
ప్రజల విషయముకాగా, 'దేవుడు' అను నమ్మకము కల్గిన కొందరు ప్రజలు
దేవతలను నమ్మకపోయినా, వేషధారణలో స్వాములుగాయున్న కొందరు

Page 68
68
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
స్వామీజీలను నమ్మి వారినే దేవునిగా భావించి, వారినే అనుసరించుచూ
దేవున్ని మరచిపోవుచున్నారు. వారు ఆశ్రయించిన స్వామీజీ, ఎన్నో
మహత్యములు చేయువాడైయుండి, తమ కోర్కెలను నెరవేర్చుదునని
చెప్పువారైయుండుట వలన, వారు కొన్ని కార్యములను నమ్మశక్యముగాని
విధముగా చేయుట వలన, భక్తులైనవారు వారిని పూర్తిగా నమ్మి ఈయనే
ప్రత్యక్ష దైవమనీ, కనిపించే దేవుడని చెప్పుచుందురు. అటువంటి వారికి
దేవుని జ్ఞానము ఏమాత్రము రుచించదు. దేవుని జ్ఞానముతో మాకు పనే
లేదు, దాని అవసరమే లేదు అని చెప్పుచుందురు. ఈ విధముగా కొందరు
భక్తి కల్గియున్నా ఆ భక్తిని కనిపించే బాబాల మీద, స్వామీజీల మీద
చూపుచూ, దేవుని జ్ఞానమును, దేవున్ని పూర్తిగా ప్రక్కన పెట్టినవారు గలరు.
కొందరు దేవతల మీద భక్తితో దేవున్ని విస్మరించగా, కొందరు బాబాల
మీద భక్తితో వారినే దేవుడని నమ్మి దేవుని జ్ఞానమునకు దూరముగా
పోవుచున్నారు. ఆ విధముగా దేవుని జ్ఞానమునకు దూరముగా పోయిన
అనేక సంఘటనలు గలవు. అయితే ఈ రెండు విధానములలోనే ఎక్కువ
మంది ప్రజలు కొట్టుకు పోవుచున్నారు. అటువంటి వారికి దేవున్ని గురించి
చెప్పినా వారు ఏమాత్రము వినే స్థితిలో ఉండరు. కనపడని దేవతలను
నమ్మి, దేవుని విషయమును మరచిపోయిన వారిని, అలాగే కనిపించే
బాబాలను, స్వామీజీలను నమ్మి దేవుని జ్ఞానమునకు దూరముగా
యున్నవారిని బాగు పరచాలనీ, వారికి కూడా దేవుని జ్ఞానమును తెలుపాలని
ఎవరయినా ప్రయత్నించినా, అటువంటి వారిని తెలివి తక్కువవారిగా
లెక్కించి హేళన చేయువారు గలరు. అజ్ఞానములో కూరుకుపోయిన
వారు, దేవుని చేత అజ్ఞానులని ముద్ర వేయబడినవారు, దేవుని చేత
అపమార్గములో (అజ్ఞాన మార్గములో) పోవాలని తీర్పు తీర్చబడినవారు

Page 69
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
69
X
ఎప్పటికీ జ్ఞానులుగా మారలేరు, వారికి జ్ఞానము రుచించదు. దేవుడే
స్వయముగా వారిని తప్పు దారిలో పంపి తనవైపు రాకుండా చేసుకోవాలను
కొన్నాడు. కావున వారిని ఎవరూ మార్చలేరు. అటువంటి స్థితిలోయున్న
వారు కూడా తాము జ్ఞానులమే అని చెప్పుకొనుచూ, తమకు తెలిసిన
జ్ఞానమునే దేవుని జ్ఞానముగా లెక్కించుచుందురు. వారివద్దయున్న జ్ఞానము,
వారికి తెలిసిన జ్ఞానము పూర్తి అసత్యమైనదని వారికి తెలియదు.
వారి ప్రశ్న :- కొందరు దేవుడున్నాడని, దేవుడు ఒక్కడేనని, ఇతర దేవతలను
పూజించుట అజ్ఞానమనీ క్రైస్తవ, ఇస్లామ్ సమాజములలో చెప్పుచుందురు. వీరు
విగ్రహారాధన చేయరు. విగ్రహారాధనను పూర్తిగా ఖండించుదురు. అయినా
దేవుడు చెప్పిన జ్ఞానమునకు పూర్తి వ్యతిరేఖ భావములో ఉంటూ, తాము
సరియైన భావములో ఉన్నామని, తమకు తెలిసినదే నిజమైన జ్ఞానమని
చెప్పుచుందురు. విగ్రహారాధకులను, బాబాలను పూర్తిగా నమ్మినవారిని
పూర్తిగా అజ్ఞానులనీ, వారిని దేవుడు అదేపనిగా తప్పుదారిలో పంపుచున్నాడనీ,
వారికి అలా తీర్పు తీర్చబడిందని మీరు చెప్పారు. విగ్రహారాధన చేయకుండా
దేవుడు ఒక్కడేయని నమ్మిన వారు చాలామంది ఉన్నా వారికి దేవుని
జ్ఞానములోని నిజమైన భావము తెలియదు. దైవగ్రంథములలోని దేవుని
వాక్యములను సరిగా అర్థము చేసుకోని స్థితిలోయుండువారు ఎందరో గలరు.
అటువంటి వారు తమ గురువులు, మతపెద్దలు చెప్పినట్లు విని వారు చెప్పినదే
నిజమైన జ్ఞానమని నమ్మియుందురు. తమ మతపెద్దలు మత జ్ఞానమునే చెప్పితే
దానినే దైవజ్ఞానముగా నమ్మిన వారు గలరు. అటువంటి వారు దైవగ్రంథముల
లోని దైవజ్ఞానమును తెలియనివారై యుందురు. విగ్రహారాధకులను,
దేవతారాధకులను, బాబాలను, స్వామీజీలను అనుసరించువారిని మార్గము

Page 70
70
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
తప్పిన వారిగా లెక్కించినప్పుడు, దైవజ్ఞానమును తెలియకనే తెలిసినామని
అనుకొనువారిని ఏమనాలి?
మనకు తెలిసిన
మా జవాబు :- “దేవుడు తనకు ఇష్టము లేనివారికి తన జ్ఞానము యొక్క
గట్టు దొరకకుండా చేస్తానని” ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో
చెప్పాడు. అట్లే చివరి దైవగ్రంథము ఖురాన్లో కూడా చెప్పాడు. కనపడని
దేవతలను విగ్రహములుగా పూజించువారినే కాకుండా, కనిపించు
స్వామీజీలు, బాబాలను నమ్మి దేవున్ని లెక్కచేయని వారిని తనవైపుకు
రాకుండా చేయడము అను రెండు విధానములేకాకుండా ఇంకా ఎన్నో
విధానముల ద్వారా దేవుడు తననుండి దూరము చేయుచున్నాడు. దేవుడు
ఎలా చేయునో ముందే ఎవరూ ఊహించుకోలేరు.
విధానములు కొన్నే అయితే తెలియని విధానములు ఎన్నో గలవు. సంపూర్ణ
జ్ఞాని అయిన వానికి మాత్రము కొన్ని విధానములు తెలియును. జ్ఞానము
లేనివానికి ఏమీ తెలియదు. జ్ఞానము లేనివాడు దేవునికి దూరమయినా
నేను దగ్గరగానే ఉన్నానని అనుకొనుచుండును. కనపడని దేవతలనూ,
కనిపించే మనుషులనూ నమ్మినవారిని జ్ఞానమార్గములో పంపక దేవుడు
అపమార్గములో పంపునని అనుకొన్నాము కదా! అదేకాక తన జ్ఞానము
మీద శ్రద్ధలేని వానిని కూడా దేవుడు తనవైపు రాకుండా చేయగలడు.
దేవుని మీద విశ్వాసముండి, దేవుని జ్ఞానముమీద శ్రద్ధ లేనివానిని కూడా
దేవుడు తన దారినుండి తప్పించి దూరముగా పంపును. దేవునిమీద
విశ్వాసము నూటికి నూరు శాతమున్నా, దేవుని జ్ఞానము మీద శ్రద్ధ లేకపోతే
అటువంటి వారి విశ్వాసమును దేవుడు లెక్కచేయడు. మనిషియొక్క
విశ్వాసము దేవునికి అవసరము లేదు. దేవుని జ్ఞానము మీదగల
శ్రద్ధమాత్రమే దేవునికి అవసరము.

Page 71
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
X
71
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను గమనిద్దాము. ఒక జిల్లా
ప్రజలందరూ ఒక వంశము పేరు చెప్పుచూ మేము అందరము
వంశమునకు సంబంధించిన భక్తులమని చెప్పెడివారు. ఇంకా కొందరిని
వివరమడుగగా ప్రక్క దేశములో గోటూరి గుడారం రాజు గారి భక్తులమని
చెప్పెడివారు. గోటూరి గుడారం రాజు భక్తులు ఎవరయినా 'అప్పు
చేయరు, అప్పు ఇవ్వరు' అది మా భక్తుల నియమమనీ, అప్పు అడిగెడివాడు
గానీ, అప్పు ఇచ్చెడివాడుగానీ గుడారంరాజు భక్తులకు సంబంధించిన వారు
కాదని చెప్పెడివారు. అట్లు ఒక జిల్లా మొత్తము ప్రజలలో 80 శాతము
మంది గుడారంరాజు భక్తులమని చెప్పుకొనెడి వారు. మిగత దాదాపు
20 శాతము మంది గుడారంరాజు భక్తులు కాదని తెలిసిపోయినది.
ఎందుకనగా గుడారంరాజు భక్తులు తలమీద గుడారంలాంటి ఒక టోపీని
ధరించెడివారు. మిగతా ప్రజలు టోపీ ధరించెడివారు కాదు. అందువలన
గుడారంరాజు భక్తులను సులభముగా గుర్తించవచ్చును. గుడారంరాజు
భక్తుల కుటుంబములో పుట్టినవారందరూ పెద్దయ్యాక గుడారంరాజు
భక్తులమని చెప్పుకొనెడివారు. ఈ విధముగా గుడారంరాజు భక్తుల సంఖ్య
పెరిగిపోవుచుండెను. గుడారంరాజు భక్తులలో కొన్ని మంచి లక్షణములు
ఉండెడివి. వారు ఎవరివద్ద అప్పు తీసుకోరు, కావున వారు అప్పులపాలయ్యే
అవకాశమే లేదు. అట్లే వారు అప్పు ఇవ్వరు, కావున వారు వడ్డీలాగి
పాపము సంపాదించుకొను అవకాశము కూడా లేదు. ఇటువంటి మంచిపనే
కాకుండా తమకు గోటూరు గుడారం రాజు ఏమీ ఇవ్వకున్నా ఆయన
భక్తులమని నిస్వార్థముగా చెప్పుకొనెడి వారు. ఈ విధముగా మిగతా
ప్రజలకంటే కొంత ప్రత్యేకముగా కనిపించెడివారు.

Page 72
72
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
గోటూరి గుడారం రాజు భక్తులమని చెప్పుకొనువారంతా గుడారం
రాజును గురించి ఎక్కువగా పొగిడి చెప్పెడివారు. గుడారంలాంటి టోపీలు
ధరించువారందరూ గుడారము రాజుకంటే మించిన రాజు భూమండలము
లో లేడనీ, ఆయనకు సమానమైన రాజు కూడా లేడని చెప్పుచుండిరి.
అలా చెప్పడమేకాక ప్రతి దినము ఏడుమార్లు గోటూరి గుడారంరాజును
ప్రత్యేకముగా పొగడుచుండిరి. ప్రార్థనా మందిరములను పోలిన పొగడ్త
మందిరములను నిర్మించుకొని గుడారంరాజును అందరూ కలిసి పొగడెడి
వారు. వారి హృదయములలో గుడారం రాజును గొప్పగా ముద్రించు
కొన్నారు. తమ కుటుంబములో పుట్టిన పిల్లలు కూడా గుడారంరాజు
పాటనే పాడెడివారు. ఆయన భక్తులమనియే చెప్పెడివారు. గుడారం
ఆకారముగల టోపీనే ధరించెడివారు. ఈ విధముగా గుడారం రాజు
భక్తులుగా యున్నవారు మిగతా ప్రజలకంటే జీవన విధానములోగానీ,
భక్తి విధానములోగానీ ప్రత్యేకత కల్గి బ్రతికెడివారు. ప్రత్యేక సమాజముగా
తయారయిన గుడారంరాజు భక్తులు రాబోయే తరము వారు కూడా అదే
భక్తి విధానము, అదే జీవన విధానము కల్గియుండాలని రెండు
గ్రంథములను వ్రాసిపెట్టుకొన్నారు. భక్తి విధానము కల్గిన విషయములన్నీ
ఒక గ్రంథముగా, జీవన విధానములు కల్గిన విషయములన్నీ ఒక
గ్రంథముగా తయారు చేసుకొన్నారు.
కొన్ని వందల సంవత్సరములు గడచినా ప్రక్క దేశములోనున్న
గోటూరి గుడారంరాజు సజీవముగానే ఉండెను. ఆయుష్షును పెంచు
ఒక మూలిక ఆయనవద్ద ఉండుట వలన
గుడారంరాజు ఆయుష్షు
అయిపోయే ప్రసక్తే లేకుండా దినదినమునకు ఆయువు పెరుగుచుండెను.
అందువలన అప్పటి కాలములో గుడారంరాజు ప్రత్యేకత కల్గియుండెను.

Page 73
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
73
గుడారంరాజు అందరివలెనుండు మనిషికాదనీ, ఆయన గొప్ప వ్యక్తి అనీ
చెప్పెడి గుడారం టోపీ సమాజం మనుషులు ఎవరుగానీ, గుడారంరాజును
చూచియుండలేదు. ఎన్ని సంవత్సరములు మారినా గుడారంరాజు ఒకే
విధముగా ఉండెడివాడు. ఆయన భక్తులమని చెప్పుకొనువారు ఎందరో
కాలక్రమములో పోగా క్రొత్తవారు చాలామంది వచ్చారు. కాలము గడువగా
జీవన విధానము మీద గుడారంరాజు భక్తులు ఎక్కువగా శ్రద్ధచూపారు.
అయితే భక్తి విధానము మీద ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయారు. ఉన్న
భక్తిని కోల్పోకుండా గుడారంరాజును గురించి గొప్పగా చెప్పుకొనెడివారు.
ఇలా కాలము గడచుచుండగా ఒక దినము ఉన్నట్లుండి గుడారంరాజు
ప్రక్క దేశములో తన భక్తులుగా చెప్పుకొనెడి వారి వద్దకు వచ్చాడు. గోటూరి
గుడారంరాజు భక్తులమని చెప్పుకొను సమాజము యొక్క ప్రజల మధ్యలోనికి
రాజుగారు వచ్చినా, ఆయన ముందరే ఆయనను పొగడు మనుషులు
ఆయనను ఏమాత్రము గుర్తించలేదు, కనీసము పలకరించనూ లేదు.
గోటూరు గుడారంరాజు ఎలా ఉండేది ఎవరికీ తెలియదు, కావున ఆయన
ప్రత్యక్షముగా వచ్చినా ఎవరూ పలకరించలేదు.
గోటూరి గుడారంరాజు పేరును అందరూ చెప్పుచున్నా, ఆయనను
అందరూ పొగడుచున్నా, ఆయన పేరుగల టోపీని ధరించి తమ భక్తిని
చాటుకొనిచుండినా, గుడారంరాజు ప్రత్యక్షముగా ఇలా ఉంటాడు అను
విషయము తెలియని దానివలన, ఆయన వారి మధ్యలో భక్తియున్నా,
గౌరవము లేకుండా పోయినది. ప్రతి దినము తన భర్తను పొగడే భార్యకు
భర్తమీద భక్తి యున్నప్పటికీ భార్యకు చూపులేనందున, పూర్తి గ్రుడ్డిదియై
నందున భర్త ఇంటికి వస్తే దొంగవచ్చాడని అనుకొని కట్టె విసిరిందట.
అదే విధముగా గోటూరి గుడారంరాజు మీద ఎంతో భక్తి కల్గిన ప్రజలు

Page 74
74
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఆయనను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎట్లుంటాడు అను విషయము
కూడా వారికి తెలియదు. కావున గుడారం రాజు తన సమాజ ప్రజల
మధ్యలోనికి వచ్చినా, ఒక్కడు కూడా ఆయనను గౌరవించలేదు, పలకరించ
లేదు. ఒక పూట భోజనమునకు కూడా తమ ఇంటికి పిలువలేదు. అప్పుడు
ఆ రాజు గుడారం టోపీ ధరించిన ప్రజలను పిలిచి, తనను స్వయముగా
పరిచయము చేసుకొని, నేనే మీరు పొగడుచున్న గుడారంరాజునని చెప్పాడట.
అప్పుడు వారు “మా రాజును పోలిన రాజు భూమండలములో ఎవడూ
లేడు. మా రాజును మించిన వాడుగానీ, మా రాజుతో సమానమైనవాడు
గానీ లేనేలేడు." అని పొగడుచూ “నీవు ఎవడివో వచ్చి మా రాజువని
చెప్పినంతమాత్రమున నీ మాటను నమ్మడానికి మేము తెలివి తక్కువ
వారమా!” అని అన్నారు. అప్పుడు గుడారం రాజు వారి భక్తిని స్వయముగా
చూచినా, తనను ఏమాత్రము గౌరవించని వారితో నాకేమి పని, వారి
భక్తితో నాకేమి అవసరము అని అనుకొని, వీరు నావద్దకు వచ్చినా మీరు
ఎవరో నాకు తెలియదు అని అంటానని అనుకొన్నాడట.
ఈ విధముగా గుడారం టోపీ సమాజము భక్తులందరూ గుడారం
రాజు మీద భక్తియున్నా ఆయనను గుర్తించకపోవడము వలన, ఆయన
మీద
శ్రద్ధ, గౌరవము ఉన్నా ప్రత్యక్షముగా ఆయన వచ్చినా చూపకపోవడము
వలన, గుడారంరాజు యొక్క కరుణను గుడారం సమాజము వారందరూ
కోల్పోవలసి వచ్చినది. గుడారంరాజు తన పేరుతో వెలసిన సమాజమును
చూచి నన్ను గుర్తుపట్టని, నన్ను గౌరవించని వీరి భక్తి (విశ్వాసము)తో
నాకేమి పని అనుకొని వారిమీద అశ్రద్ధ కల్గియుండెను. గుడారంరాజుకు
గుడారం టోపీ సమాజము వారిమీద అయిష్టత ఏర్పడినది. గుడారంరాజు
ఆయన పేరుమీదగల సమాజము వారితో నాకేమి పని? అని అనుకొన్నాడు.

Page 75
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
75
వారు నాకు ఉపయోగపడకపోతే నేనెందుకు వారికి ఉపయోగపడాలి?
అని అనుకొన్నాడు. కొంతకాలమునకు ప్రక్క దేశములోని గుడారంరాజు
వద్దకు గుడారం సమాజమువారు రాగా, రాజుగారు వారిని చూచి మీరెవరో
నాకు తెలియదని చెప్పాడట! అంతేకాక గుడారం టోపీ ధరించిన వారు
ఎవరుగానీ తనయొద్దకు రాకుండునట్లు తన అడ్రస్ ఇక్కడ లేదనీ, తన
దగ్గరకు వచ్చే దారి ఇది కాదనీ, ఆ సమాజము ప్రజలకు తెలియజేసి
వారు ఎవరూ తనవద్దకు రాకుండా పూర్తిగా దారి మళ్ళించాడు. ప్రక్క
దేశములోని ప్రజలు గుడారం సమాజమును స్థాపించి గుడారంరాజును
నిత్యము పొగడినా, ఆయన భక్తులుగాయున్నా, ఆయన ఎట్లుండునో తెలియక
పోవడము వలన వారి విశ్వాసము, వారి భక్తి, వారి పొగడ్త, వారి ప్రార్థన
అన్నీ గుడారంరాజు ఇష్టతను సంపాదించుకోలేకపోయాయి. నేనెవరో
తెలియని వారి భక్తితో నాకేమి పని, నాకేమి అవసరము? అని ఆ రాజుగారు
అనుకోవడము జరిగినది. గుడారంరాజు మీద విశ్వాసమున్నా ఆయన
గుర్తింపు లేకపోవడము వలన గుడారం సమాజం వారు ఆయన
కారుణ్యమును కోల్పోవడము జరిగినది.
ఖచ్చితముగా ఇదే పద్ధతే, ఇదే విశ్వాసమే, ఇదే భక్తియే కొందరిలో
ఉండుట వలన దేవుడు కూడా నన్ను గుర్తించని వారి విశ్వాసముతో
నాకేమి పని? అనుకొన్నాడు. దానివలన కొందరు ప్రజలు దేవునికి
అయిష్టులుగా మారిపోయారు. అయిష్టులుగా మారిపోవడము వలన దేవుని
జ్ఞానము వారికి ఏమాత్రము తెలియకుండా పోయినది. దేవుడు దైవ
గ్రంథమును ఇచ్చి అందులో తన నిజ భావమెట్లుండునో తెలిపినా, దాని
ప్రకారము దేవుడున్నాడని తెలియక, ఆయనకు ఇష్టములేని అవసరములేని
పొగడ్తలతో ముంచివేయుచున్నారు. అటువంటి వారిని గమనించిన దేవుడు

Page 76
76
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
వారికి తన జ్ఞానమును అర్థము కాకుండా చేసి, వేరు విధముగా అర్థమగు
నట్లు చేసి తననుండి దూరముగా పంపుచున్నాడు. అట్లు దేవుని అయిష్టతకు
లోనైనవారు దైవగ్రంథములోని జ్ఞానము యొక్క నిజ భావమును తెలియలేక
దేవునికి దూరముగా పోవుచున్నారు. అట్లు అపమార్గము పట్టిపోవువారు,
తమకు దేవుని జ్ఞానము సంపూర్ణముగా తెలియునని, తామే నిజముగా
దేవునికి దగ్గరగా యున్నామని చెప్పుకొనుచున్నారు. దైవ గ్రంథములోని
జ్ఞానము అర్థము కాలేదని వారికి తెలియదు. ఎవరయినా దైవగ్రంథము
లోని వాక్యములకు నిజ భావమును తెల్పినా, వారిమీద దేవుని శాపముండుట
వలన వారికి అది గ్రహింపునకు రాదు. వారి దృష్టిలో నిజమైన జ్ఞానము
కూడా అజ్ఞానముగా కనిపించును. వారివద్దయున్న అజ్ఞానమే నిజమైన
జ్ఞానముగా కనిపించును. అందువలన ఎంతో పెద్ద జ్ఞానులను సహితము
వారు ఎదిరించి మాట్లాడుచుందురు. తమదే జ్ఞానమనీ, ఇతరులది
అజ్ఞానమనీ, తామే దేవునికి దగ్గరగా యున్నవారమని అనుకొనుచుందురు.
వారి ప్రశ్న :- మీరు చెప్పినట్లు ఇటువంటి అజ్ఞానము అన్ని మతములలో
ప్రాకినది. అన్ని సమాజములు తమ జ్ఞానమే గొప్పయని ఒకరికొకరు
వాదించుకోవడము ప్రత్యక్షముగా కనిపించుచున్నది. మూడు సమాజముల
వారు అజ్ఞానములో కూరుకపోయి ఉన్నారు. ఒకరిని తక్కువ ఇంకొకరిని
ఎక్కువ అని చెప్పుటకు వీలులేదు. దైవజ్ఞానములో ఏమాత్రము విచక్షణ లేని
మనుషులు తమవద్దగలది అజ్ఞానమని ఏమాత్రము గుర్తించక, ఇతర
మతముల వారిమీద అసూయతో, ఆక్రోశముతో చూస్తున్నారు. ఒకరికొకరు
వ్యతిరేఖ భావములతో చూచుకొంటూ శత్రువులుగా మారిపోవుచున్నారు.
ఎక్కడలేని శత్రుత్వము దేవుని విషయములందే ఎక్కువగా యున్నదని

Page 77
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
77
అర్థమగుచున్నది. ఇటువంటి పరిస్థితినుండి మనుషులు బయట పడుటకు
ఏదయినా ఉపాయము గలదేమో చెప్పండి?
మా మాట :- జ్ఞాన విషయములన్నిటినీ తౌరాత్ గ్రంథము (భగవద్గీత)
నుండి పరిష్కారము చేసుకొనెడివారని అంతిమ దైవగ్రంథములో సూరా
5, ఆయత్ 44లో చెప్పడము జరిగినది. జ్ఞానవాక్యముల ద్వారా తృప్తి
చెందేవారికయితే దైవగ్రంథమునుండి పరిష్కారము చేయవచ్చును. నాకు
తెలిసిందే జ్ఞానము మీకు తెలిసినదంతా అజ్ఞానమనువారికి ఎవరూ ఏమీ
చెప్పలేరు. వారికి దైవగ్రంథములు కూడా ఏ పరిష్కారము చేయలేవు.
దేవుడు కూడా వారిని మార్చలేడు. దేవుడు అనుకొంటే ఏదయినా సాధ్యమే
అయినా దేవుడు వారిని మార్చడు. ఎందుకనగా! దేవుడే వారిని అజ్ఞాన
మార్గములో పోవునట్లు నిర్ణయము చేసియుండును. ఒకమారు దేవుని
నిర్ణయమైన తర్వాత అది ప్రకృతి చేతిలోనికి వెళ్ళిపోవును. అప్పుడు
ప్రకృతి దేవుని ఆజ్ఞను అనుసరించి దేవునికి ఇష్టము లేనివారిని దేవుని
వైపు పోకుండా చేసి తనవైపు వచ్చునట్లు చేయును.
ఒక్కమారు దేవునికి అయిష్టుడయినవాడు ప్రకృతినుండి పుట్టి
మానవ శరీరములో గుణరూపముగాయున్న మాయ చేతిలో పడిపోవును.
ఒక్కమారు మాయచేతిలో పడినవాడు తిరిగి బయటపడుట దుస్సాధ్యము.
అందువలన దేవుడు తన మాయను గురించి చెప్పుచూ, ప్రథమ దైవగ్రంథము
భగవద్గీతలో విజ్ఞానయోగమునందు 14వ శ్లోకమున "దైవీహ్యేషా గుణమయీ
మమ మాయా దురత్యయా" ‘నా మాయ దుస్సాధ్యమయినది, దానిని ఎవరూ
జయించలేరు' అని అన్నాడు. అటువంటి దుస్సాధ్యమయిన మాయ చేతిలో
పడినవానిని మాయ తన గుణములలో ముంచి గుణముల ధ్యాసలోనే

Page 78
78
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
మాట్లాడునట్లు చేయును. గుణమయమయిన వానికి దేవుని జ్ఞానము
వంటబట్టదు. అతని మెదడులో అంతా ప్రకృతి జ్ఞానమే నిండిపోయి
వుండును. ప్రకృతి స్థూలమైనది, పరమాత్మ అనబడు దేవుడు సూక్ష్మమైనవాడు.
మాయచేతిలో పడినవానికి దేవుని సూక్ష్మమైన జ్ఞానము అర్థముకాదు.
స్థూలమైన జ్ఞానమే అర్థమగును. స్థూలమైన జ్ఞానమే నిజమైన జ్ఞానమని,
సూక్ష్మమైన జ్ఞానము అసత్యజ్ఞానమని అనుచుందురు. దేవుడు సూక్ష్మమైన
వాడు, దేవుని జ్ఞానము సూక్ష్మముగానే ఉండుననే సూత్రమును మాయ
ఆధీనములో వుండువారు మరచిపోయి వుందురు. అందువలన వారు
స్థూల జ్ఞానమును గురించే మాట్లాడుచుందురు. వారికి దైవగ్రంథముల
లోని సూక్ష్మవాక్యముల జ్ఞానము అర్థము కాదు. దానివలన వారు దేవుని
జ్ఞానమును వదలి ప్రక్కదారిలో పోవువారిగా మారిపోవుదురు. అటువంటి
స్థితినుండి వారిని ఎవరూ మార్చలేరు. మాయ ఆధీనములో పడినవారు
తిరిగి బయటపడుట దుస్సాధ్యమైన పనియగును. దేవునికి అయిష్టునిగా
మారినవానిని మాయ తన ఆధీనములో యుంచుకొని తన ప్రభావము
వలన జ్ఞానమును అర్థము కాకుండా చేయును. అందువలన దేవుడు
అనుకున్నట్లు వారు దేవునికి దూరముగా పోవుచుందురు. అటువంటి
వారిని భూమిమీద ఎవరూ మార్చలేరు.
వారి ప్రశ్న :- మాయ ప్రభావములో చిక్కుకొని దేవునికి వ్యతిరిక్త దిశలో యుండి
కూడా మేము సక్రమముగా ఉన్నామనుకొనువారు మూడు సమాజములలో
యున్నారని మీరు చెప్పుచున్నారు. హిందూ సమాజములో యున్నవారు
సూక్ష్మముగా కనిపించకయున్న దేవున్ని వదలి స్థూలమైన విగ్రహారాధనలో
పడిపోవుచున్నారు. వారికి సూక్ష్మమైన కనిపించని దేవుడు ఒకడు ప్రత్యేకముగా
యున్నాడను విషయమే తెలియదు. మిగతావారు సూక్ష్మమైన దేవుడున్నాడని

Page 79
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
79
చెప్పుచున్నా వారు స్థూలమైన జ్ఞానమును ఆశ్రయించి సూక్ష్మమైన జ్ఞానమును
వదలివేశారు. వీరి ఇరువురిలో ఎవరు ఉత్తములు?
మా జవాబు :- ఇద్దరు మనుషులలో ఒకడు ముఖము మీద గుడ్డను
కప్పుకొన్నాడు, మరొకడు కాగితమును మూసుకొన్నాడు. వారి ఇరువురిలో
ఎవరి ముఖము కనిపించును అని అడిగితే గుడ్డతో మూసుకొన్నా,
కాగితముతో కప్పుకొన్నా రెండూ ముఖమును కనిపించకుండా చేయుచున్నవి.
అందువలన ఇద్దరి ముఖములు కనిపించవనియే చెప్పాలి. వారు ఇరువురు
వేరువేరు విధముల ముఖమును చాటేసుకొన్నవారేయగుదురు. అదే
విధముగా మూడు సమాజములలోని మనుజులు హిందువులు స్థూల
ఆకారము మీద ఆధారపడి సూక్ష్మమును మరచిపోయారు. అలాగే మిగతా
సమాజముల వారు స్థూల జ్ఞానము మీద ఆధారపడి సూక్ష్మ జ్ఞానమును
వదలివేశారు. ఇరువురు స్థూలమునే ఆశ్రయించి సూక్ష్మమును వదలి
వేయడము వలన ఇరువురు ఒకటే కోవకు చెందినవారగుదురు, కావున
వారి ఇరువురిది తప్పుదారే యగును. ఇరువురి మార్గము స్థూలము వైపు
పోవుట వలన, సూక్ష్మము తెలియకపోవుట వలన ఇరువురు అసలు దారి
తప్పినవారేయగుదురు.
హిందూ సమాజము వారిని స్థూలమైన విగ్రహారాధన చేస్తున్నారనీ
వారికి దేవుని జ్ఞానము తెలియదనీ మిగతా సమాజముల వారు
అనుచుండగా, మేము మిగతా సమాజము వారిని ఈ విధముగా
ప్రశ్నించుచున్నాము. మీరు వారికంటే దేనిలో గొప్ప? యని అడుగు
చున్నాము. వారు స్థూలమైన విగ్రహమును ఆరాధించి సూక్ష్మమైన జ్ఞానమును
తెలియనట్లు, మీరు కూడా స్థూలమైన జ్ఞానమును ఆశ్రయించి సూక్ష్మమైన
జ్ఞానమును వదలివేసినారు కదా! హిందువులు కనిపించే స్థూలమైన

Page 80
80
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఆకారమును ఆరాధిస్తే, మిగతా వారు కూడా ఇంకొక విధముగా కనిపించే
స్థూలమైన జ్ఞానమును ఆరాధించి పరోక్షముగా తప్పుదారి పట్టినట్లే కదా!
ముఖము మీద గుడ్డవేసుకొన్నా, కాగితము వేసుకొన్నా ఇరువురు
ప్రత్యక్షముగా ముఖమును మూసుకొన్నట్లేయగును. అలాగే దేవుని
విషయములో విగ్రహారాధన లేక దేవతారాధన అను స్థూల ఆరాధన చేసినా,
స్థూలమైన జ్ఞానమును ఆశ్రయించినా, ఇరువురు సూక్ష్మమైన జ్ఞానమును
వదలివేసి స్థూలమైన జ్ఞానమును ఆశ్రయించినట్లే కదా! కనిపించే స్థూల
జ్ఞానమును ఆశ్రయించినా, కనిపించే స్థూల ఆకారమును ఆశ్రయించినా
ఇరువురు వేరువేరు విధముల సూక్ష్మజ్ఞానమును వదలినవారే యగుచున్నారు.
వీరు ఇరువురు ఒకేస్థాయి తప్పు చేసినవారగుదురు, అంతేగానీ ఒకరు
ఉత్తములని మరొకరు ఉత్తములు కాదని చెప్పలేము. గుహలో దూరియుండు
వాడుగానీ, బయలు ప్రాంతములో నీడయందు ఉన్నవాడుగానీ ఇరువురు
సూర్యరశ్మి అంటకయుండువారేననీ, ఇద్దరూ నీడలో యుండువారేనని ఎట్లు
చెప్పవచ్చునో, అలాగే స్థూల ఆకారమును ఆశ్రయించిన వాడుగానీ, స్థూల
జ్ఞానమును ఆశ్రయించినవాడు గానీ, ఇద్దరూ సూక్ష్మమునకు దూరముగా
యున్నవారేనని, సూక్ష్మమును తెలియనివారేనని చెప్పవచ్చును. ఒక
రకముగా ఇరువురు విగ్రహారాధకులనే చెప్పవచ్చును.
వారి ప్రశ్న :- ఇక్కడ మీరు మమ్ములను సంశయానికి గురిచేయుచున్నారు.
ప్రత్యక్షముగా కనిపించు రూపమున్న దానిని విగ్రహము అంటున్నాము.
జ్ఞానము అలాంటిది కాదు కదా! జ్ఞానమునకు కనిపించే ఆకారము లేదు.
జ్ఞానము మాటల రూపమైనది. జ్ఞానము శబ్దరూపమైనది, శబ్దమునకు
ఆకారములేదు. అటువంటప్పుడు మాటల రూపమైన జ్ఞానమును కూడా
కనిపించే విగ్రహము క్రిందికే జమకట్టడము సరియైనదేనని మీరు చెప్పగలరా?

Page 81
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
81
మా జవాబు :- జ్ఞానము అనునది మాటల రూపములో శబ్దముగాయున్నా,
వినిపించే ఆ శబ్దములోని సారాంశము స్థూలమైనదిగా ఒకరకము, సూక్ష్మ
మైనది మరొక రకము గలదు. అందువలన శబ్దరూపమైన జ్ఞానమును
రెండు రకములుగా పెద్దలు విభజించి ఒకదానిని స్థూలజ్ఞానమనీ, రెండవ
దానిని సూక్ష్మ జ్ఞానమనీ అన్నారు. జ్ఞానములో రెండు రకముల
జ్ఞానములున్నవని వాటిలో ఒక దానిని స్థూల జ్ఞానమని, మరొక దానిని
సూక్ష్మజ్ఞానమని అంటారని అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్లోనూ ప్రథమ
దైవగ్రంథమైన భగవద్గీతలోనూ చెప్పడమయినది. భగవద్గీతయందు
రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయమున మొదటి ఒకటి, రెండు
శ్లోకములలో ఈ విషయము చెప్పగా, పూర్తి అర్థమగునట్లు ఖురాన్
గ్రంథములో 'అలీ ఇమ్రాన్' అను మూడవ సూరాయందు ఏడవ ఆయత్లో
కూడా చెప్పారు. (3-7) “ఓ ప్రవక్తా! నీపై ఈ గ్రంథమును అవతరింపజేసిన
వాడు దేవుడే. ఇందులో సుస్పష్టముగా అర్థము తెలియు స్థూలమైన
(ముహ్కమాత్) వాక్యములు గలవు. అవి గ్రంథానికి పునాదిలాంటివి.
మరికొన్ని అస్పష్టముగా అర్థమునిచ్చు సూక్ష్మమైన (ముతషాబిహాత్)
వాక్యములు గలవు." అని చెప్పడము వలన బ్రహ్మవిద్యా శాస్త్రబద్దముగా
జ్ఞానము రెండురకములనీ, ఒకటి స్థూలజ్ఞానము, రెండు సూక్ష్మజ్ఞానమనీ
తెలిసిపోయినది.
ఇక్కడ ముఖ్యముగా మన బుద్ధిని ఉపయోగించి తెలియవలసిన
విషయమేమనగా! మాటల రూపమైన జ్ఞానము ఏ విధముగా స్థూల,
సూక్ష్మములుగాయున్నదో అలాగే! దృశ్యరూపములోయున్న బొమ్మలలో
కూడా స్థూలము యున్నది, సూక్ష్మము యున్నది. ఏ విధముగా శబ్దరూప
జ్ఞానములలో స్థూలజ్ఞానము ప్రపంచ సంబంధమైనది (ప్రకృతి సంబంధ

Page 82
82
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
మైనది) సూక్ష్మజ్ఞానము దైవసంబంధమైనదని చెప్పుచున్నామో, అలాగే
దృశ్యరూప ఆరాధన జ్ఞానములలో స్థూలజ్ఞానము, సూక్ష్మజ్ఞానము అని రెండు
రకముల జ్ఞానములు గలవు. దృశ్యరూప ఆరాధన జ్ఞానములలో స్థూల
రూపమైనది ప్రకృతి ప్రపంచ) సంబంధమైన జ్ఞానముతో కూడుకొన్నదై
ఉండగా, సూక్ష్మ రూపమైనది దైవసంబంధ జ్ఞానముతో కూడుకొనియున్నది.
మనిషి శబ్ద, రూప, స్పర్శ, రుచి, వాసన అను జ్ఞానములను తన
పంచేంద్రియములయిన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మముల ద్వారా
గ్రహించుచున్నాడు. మనిషి గ్రహించు ఐదు జ్ఞానములను ప్రపంచ
జ్ఞానములు అంటాము. ఐదు ప్రపంచ జ్ఞానములు స్థూలమైనవేయగును.
స్థూలమైన ఐదు ప్రపంచ జ్ఞానములను గ్రహించు ఐదు అవయవములు
శరీరమునకు తగులుకొనియుండి జ్ఞానేంద్రియములని పేరుగాంచినవి.
మనిషి శరీరములో ఐదు జ్ఞానేంద్రియములు కలవని అజ్ఞానికి కూడా
తెలుసు. మనిషికి ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడేది ప్రపంచ
జ్ఞానమే అయినా, స్థూలజ్ఞానమే అయినా అందులో దైవజ్ఞానము కూడా
ఇమిడియున్నది. వివరముగా తెలియగలిగితే జ్ఞానము రెండు రకములు
గలదు. ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండు పరమాత్మ జ్ఞానము అనగా దైవ
జ్ఞానము. ప్రపంచ జ్ఞానమునుండే పరమాత్మ జ్ఞానమును కూడా తెలియ
వలెను. శబ్ద, దృశ్యములు రెండూ ప్రపంచ జ్ఞానములే. చెవి, కన్ను
ద్వారా తెలియబడు జ్ఞానములే. అయినప్పటికీ ఈ రెండింటిలో పరమాత్మ
జ్ఞానము ఇమిడియున్నది. దృశ్యరూపములో ఆకృతి (ఆకారము) వుండగా,
ఆకృతిలో నిరాకారమైన దైవము గలదు. అలాగే సాకారమైన విగ్రహము
గలదు. కంటితో చూస్తే దృశ్యరూపములో ఒక బొమ్మ కనిపించిందను
కొనుము. బొమ్మ ప్రాణమున్నది కావచ్చును, ప్రాణములేనిది కావచ్చును.

Page 83
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఉదాహరణకు నాకు మనిషి ఆకారము కనిపించినదనుకొనుము.
83
స్నేహితుడు 'నారాయణ' అను వ్యక్తి కనిపించాడనుకొనుము. అప్పుడు
అది నాకు దృశ్యమేయగును. ఆ దృశ్యము ఒక మనిషి ఆకారములో
యున్నా, అందులో మనము సులభముగా ఫలానా వ్యక్తి అని తెలియు
చున్నాము. ఆ వ్యక్తి ఏ విషయమునైనా గ్రహించుశక్తి కల్గియున్నాడు.
కావున గ్రహించు శక్తిగలవానిని 'గ్రహము' అని అనవచ్చును. కనిపించే
వ్యక్తి నాకు స్నేహితుడే అయివుండవచ్చును. అతని పేరు కూడా నాకు
తెలిసియుండవచ్చును. అయినా అతను నేను చెప్పు మాటను, చూపు
దృశ్యమును గ్రహించు స్థోమతకలవాడు అయినందున అతనిని 'గ్రహము’
అనవచ్చును. గ్రహించునది ఏదయినా, ఎవరయినా 'గ్రహము' అని చెప్ప
వచ్చును.
ప్రాణమున్న ఆకారములో గ్రహించుశక్తి కలదు, కావున దానిని
'గ్రహము' అని అంటున్నాము. అలాగే ప్రాణములేని ఆకారములో
గ్రహించుకొను శక్తియుండదు. అందువలన దానిని గ్రహము అనుటకు
వీలులేదు. అయితే నేడు చాలామంది హిందువులు ఏదో ఒక బొమ్మను
పెట్టుకొని, ఆ బొమ్మకు ఒక పేరుపెట్టి, అది తమ ఆరాధ్యదైవమని నమ్మి
పూజలు చేయుచున్నాడు. ఈ విధముగా ఎందరో ఎన్నో ఆకారములను
పెట్టుకొని పూజించుచున్నారు. అటువంటి పూజలను ఆకారపూజ అని
అంటున్నాము. ఇటువంటి పూజలను ముస్లీమ్లు పూర్తి వ్యతిరేఖిస్తున్నారు.
దేవుని స్థానములో ఇతర దేవతలను పెట్టి పూజిస్తున్నారని ఆరోపణ చేయు
చున్నారు. ఎక్కడ ఏ బొమ్మను పూజించినా దానిని విగ్రహ పూజ
అంటున్నారు. వారు తెలిసి చెప్పినా, తెలియక చెప్పినా దానిని విగ్రహ
పూజ అని మేము ఒప్పుకొంటున్నాము. మేము మొదటినుండి విగ్రహారాధ

Page 84
84
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
నను ఖండించుచున్నాము. అయినప్పటికీ ఎంతో వివరము జ్ఞానము తెలిసిన
మమ్ములను కూడా విగ్రహారాధన చేయువారిలోనికి కలిపి కొందరు
మమ్ములను విగ్రహా రాధకులు అని అంటున్నారు.
వారి ప్రశ్న :- మీరు శ్రీకృష్ణుని ఆకారమును 'ప్రతిమ' అంటున్నారు. మీరు ఎక్కడ
ఏ పూజ చేయకున్నా మీ అనుచరులందరూ కృష్ణున్ని దేవుడని
పూజించుచున్నారు. కృష్ణాష్టమి సమయములో కృష్ణ పూజలు చేసి కృష్ణ
ప్రతిమను భారీగా ఊరేగింపు చేయుచున్నారు. మీరు దానిని సమర్థించు
చున్నారు. అంతేకాక మీ సలహామీదనే అందరూ కృష్ణాష్టమి చేయుచున్నట్లు
మేము వింటున్నాము. కృష్ణున్ని 'ప్రతిమ' అని విగ్రహము కాదని మీరు
అంటున్నారు. కృష్ణుని ఆకారమును భగవంతుని ప్రతిరూపము అంటున్నారు.
భగవంతుడు దేవుని మారువేషము అంటున్నారు. దానినే భగవంతుని
ఆకారము అనికూడా అంటున్నారు. 'దేవుడు భగవంతునిగా కనిపించే
మనిషిగా వచ్చి తన జ్ఞానమును చెప్పిపోవును' అని చెప్పుచున్నారు. మీరు
కృష్ణుని ఆకారమును పూజించుటను సమర్థించుచున్నారు కదా! దానివలన
మీరు విగ్రహారాధనను ప్రోత్సహించినట్లే కదా!యని ఇతరులు మిమ్ములను
అడిగితే మేము విగ్రహారాధన చేయలేదు, ప్రతిమారాధన మాత్రము
చేయుచున్నాము అని అంటున్నారు. ప్రతిమ అయినా విగ్రహమయినా
మనుషులు చేసిన ఆకారమే కదా! మనుషులు తయారు చేసిన దానిని
దేవునిగా చెప్పవచ్చునా? దేవుని స్థానములో వుంచి పూజించవచ్చునా?యని
ముస్లీమ్లుగా యున్నవారు ప్రశ్నించుచున్నారు. దీనికి మీరు ఏమి
సమాధానమును చెప్పగలరు? ప్రతిమారాధన విగ్రహారాధన కాదా! యని
అడుగు ప్రశ్నకు ఏమి జవాబు చెప్పగలరు?

Page 85
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
85
మా జవాబు :- శాస్త్రాధారము లేనిది, ప్రత్యక్ష నిరూపణకు రాని దానిని
మేము ఎప్పుడూ చెప్పము. మేము ఏది చెప్పినా అది శాస్త్రాధారమై, సత్య
నిరూపణయై ఉండును. ప్రతిమ ఆరాధన వేరు, విగ్రహ ఆరాధన వేరని
చెప్పుచున్నాము. ఈ మాట కొందరికి విచిత్రముగా, ఆశ్చర్యముగా
కనిపించినా ఎటు చూచినా ప్రతిమ వేరు, విగ్రహము వేరుగా ఉన్నవి.
మీకు అర్థమగుటకు కావలసిన వివరమును మేము అందివ్వగలము.
ఇంతకుముందు ఒక ఆకారము గ్రహించునదిగా ఉంటే గ్రహము అంటామని
చెప్పాము. ఆకారమునకు ప్రాణమున్నప్పుడు గ్రహించుకొను శక్తియుండును
కనుక ఆకారమును గ్రహము అని చెప్పుచున్నాము. ఒకవేళ ఆకారము
ప్రాణము లేనిదైతే అందులో గ్రహించుకొను శక్తియుండదు. అప్పుడు
దానిని గ్రహము అనుటకు వీలులేదు. ప్రాణములేని ఆ బొమ్మ ఎవరి
ఆకారమును పోలియుంటే వారియొక్క ప్రతిమ అని చెప్పవచ్చును. ప్రతిమ
అనగా ప్రతిరూపము అని చెప్పవచ్చును. ప్రాణములేని ఆకారము
వాస్తవముగా ప్రతిమయే అగును. ప్రాణమున్నదంతా సత్యముగా గ్రహమే
అగును. గ్రహములలో కొంత ప్రత్యేక శక్తియున్న వాటిని విగ్రహము
అంటున్నాము. విగ్రహ అనగా గ్రహమువలెకాక కొంత ప్రత్యేకతను
కల్గియున్న దానిని విగ్రహము అని చెప్పవచ్చును.
వారి ప్రశ్న :- ప్రాణము లేని బొమ్మలను అందరూ విగ్రహ అని అంటున్నారు కదా!
మీరేమో ప్రాణమున్న వాటినే గ్రహలనిగానీ, విగ్రహలనిగానీ అనవచ్చునన్నారు.
ప్రాణము లేని వాటిని 'ప్రతిమ' అని అది విగ్రహము కాదని అంటున్నారు.
అలాంటప్పుడు ప్రాణములేని ప్రతిమలను విగ్రహములని చాలామంది
ఎందుకంటున్నారు?

Page 86
86
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
మా జవాబు :- నేను ఆ విషయమునే చెప్పుచున్నాను. అంతలోనే మీరు
ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నకు జవాబును చెప్పెదను వినండి. మనుషులకు
స్థూలదృష్ఠి మాత్రమే గలదు. స్థూలదృష్ఠితో స్థూలదృశ్యము కనిపించినా,
దృశ్యరూపములో తెలిసిన జ్ఞానములో స్థూల జ్ఞానము, సూక్ష్మ జ్ఞానము
రెండు రకముల జ్ఞానము కలదని ముందే చెప్పాను. ఒక వ్యక్తి ఆకారమును
చూచినప్పుడు ఆకారములోని కదలికలనుబట్టి అతను ప్రాణమున్న వ్యక్తి
యని స్థూల జ్ఞానము ద్వారా నిర్ధారించి, అతని శరీరములో గ్రహము
కలదని చెప్పుచున్నాము. అతని శరీరములో అతనే గ్రహముగా ఉన్నాడు.
గ్రహించుశక్తి గలవానిని 'గ్రహము' అని అంటున్నామని ముందే చెప్పాము.
ఆ లెక్కప్రకారము మనము అందరము ప్రతిదానిని గ్రహించువారమే.
వినేదానిని గ్రహించుచున్నాము. చూచేదానిని గ్రహించుచున్నాము
అందువలన ప్రాణమున్న, జీవమున్న ప్రతి వ్యక్తి గ్రహమేయగును. అయితే
ఇక్కడ వచ్చిన సమస్య ప్రాణములేని ఒక రాతి ప్రతిమను విగ్రహ అని
ఎందుకంటున్నారన్నదే ప్రశ్న, దానికి జవాబును గ్రహించిన ఇలా కలదు.
గ్రహముకంటే విగ్రహము కొంత ప్రత్యేకత కల్గియుండునని కూడా చెప్పు
కొన్నాము. మొదటికి ప్రాణములేని రాతిబొమ్మలో విగ్రహ ఎలా ఉండునని,
ప్రాణమున్న దానిలో గ్రహమో లేక విగ్రహమో ఉందంటే దానికి అర్ధము
గలదు. ప్రాణమే లేని దానిలో విగ్రహ ఉందంటే ఎలా నమ్మాలి? అది
పూర్తి అసత్యము కాదా? అని కొందరు ప్రశ్నించవచ్చును. ఇది సహజముగా
అందరికీ వచ్చు సంశయమే! ఈ సంశయమును పరిష్కరించుకొనుటకు
స్థూల, సూక్ష్మ జ్ఞానముల వద్దకు పోయి చూస్తాము.
మనిషికున్న ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా బయటి జ్ఞానమును
తెలియవచ్చును. జ్ఞానేంద్రియములయిన కన్ను, చెవి, ముక్కు, నాలుక,

Page 87
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
87
చర్మము అను ఐదు ఇంద్రియములు స్థూల అవయవములే అగుట వలన
వాటి వలన స్థూల జ్ఞానమే తెలియును. అయినా కన్ను, చెవి ద్వారా
తెలియు రెండు జ్ఞానములలో సూక్ష్మజ్ఞానము కూడా ఇమిడియున్నది.
కన్నుతో చూచు దృశ్యములో మనిషి గ్రహమని స్థూలదృష్ఠి ద్వారా తెలియ
వచ్చును. అయితే కన్ను చూచిన దృష్టిలో సూక్ష్మజ్ఞానము కూడా ఉండుట
వలన, ఒక ఆకారములో ప్రాణమున్నది, ప్రాణము లేనిది గ్రహించవచ్చును.
దీనినిబట్టి కన్ను, చెవుకు బాహ్య ప్రపంచ దృష్టి కాకుండా, అంతరంగ
దైవ దృష్ఠి కూడా కలదని చెప్పవచ్చును. చెవుకు వినే మాటలోని బాహ్య
అర్థమునే కాకుండా అంతరంగ ఆత్మజ్ఞానమును తెలియుశక్తి (గ్రహించు
శక్తి) కలదని చెప్పవచ్చును. ప్రాణమున్న ఆకారమును చూచినప్పుడు
అందులో గ్రహమున్నదని చెప్పుట స్థూలదృష్ఠికాగా, రాతిబొమ్మను
చూచినప్పుడు అంతరంగ జ్ఞానము ప్రకారము అనగా సూక్ష్మ దృష్టి ప్రకారము
రాతిబొమ్మలో ప్రాణమున్నదో లేదో చెప్పవచ్చును. అలా తెలియు సూక్ష్మ
జ్ఞానమునే ఆధ్యాత్మిక జ్ఞానము అని కూడా అనవచ్చును. ఆధ్యాత్మిక జ్ఞానము
తెలిసినవారు ఏ బొమ్మలో ఏ శక్తిగలదో, ఎంత గ్రహించు శక్తికలదో తెలియ
గలరు. రాతిబొమ్మలలో కూడా జీవుడున్నాడని తెలిసినప్పుడు అలా ఉన్న
వానిని విగ్రహ అంటాము. తోలుబొమ్మలో జీవుడుంటే వానిని గ్రహ
అంటాము. అలాగే రాతిబొమ్మలో జీవుడుంటే వానిని విగ్రహ అంటాము.
ఎక్కడయినా బొమ్మయుండి అందులో జీవుడు లేకపోతే ఆ బొమ్మను
ప్రత్యేకించి 'ప్రతిమ' అంటాము. ప్రతిరూపము కల్గినది ప్రతిమ అని
చెప్పవచ్చును. కృష్ణుని బొమ్మలో ఎక్కడయినాగానీ జీవుడు ఉండడు.
అందువలన కృష్ణుని బొమ్మను ప్రతిమ అనవలెను. విగ్రహ అని పేరుపెట్టి
చెప్పకూడదు. అలాగే జీవుడున్న ఏ ఆకారమునయినా విగ్రహమే అని
అనాలిగానీ 'ప్రతిమ' అని అనకూడదు.

Page 88
88
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఈశ్వర లింగమును చాలామంది చూచియుందుము. ఈశ్వర
లింగములో ఎక్కడగానీ జీవుడు వుండడు. అందువలన ఈశ్వర లింగమును
కూడా 'ఈశ్వర ప్రతిమ' అని అనవచ్చును. సృష్టికర్త అయిన దేవునికి
ప్రతి రూపముగాయున్న ఏ బొమ్మలో కూడా జీవుడుండడు. అందువలన
ఆ బొమ్మలు ప్రతిమలేగానీ విగ్రహములు కాదు. అట్లని మన ఇష్టమొచ్చిన
బొమ్మను దేవుని ప్రతిరూపముగా చెప్పుకొనుటకు వీలులేదు. గతచరిత్రలో
ఎప్పుడయినా దేవుడు ఆ రూపములో ఉండివుంటే, ఆ ఆకారము మాత్రము
ప్రతిమ అగుటకు అవకాశము గలదు. మిగతా ఏ ఆకారమందైనా
జీవుడుండును. కావున ఆకార బొమ్మలన్నీ విగ్రహములే అగుచున్నవి.
ప్రత్యేకించి ఒక కృష్ణుని ఆకారములో మాత్రము ఏ జీవుడు చేరుటకు
అవకాశము లేదు. అందువలన కృష్ణుని ఆకారమును మాత్రమే ప్రతిమ
అంటున్నాము. కృష్ణుని ఆకారమును ఒక్కదానిని మేము గౌరవించు
చున్నాము. అంతతప్ప భూమిమీద ఏ ఆకారమును మేము ఆశ్రయించలేదు.
దేవుడు భగవంతునిగా వచ్చిన ఆకారమయినందున కృష్ణుని బొమ్మ మాత్రము
ప్రతిమగా గలదు. ఆ విషయమును తెలిసినందున మేము కృష్ణప్రతిమను
గౌరవించడము జరుగుచున్నది. మేము గ్రుడ్డిగా ఏదీ చేయలేదు. భూమిమీద
ఎన్నో బొమ్మలను విగ్రహములనుటకు, కృష్ణుని బొమ్మను ప్రతిమ అనుటకు
మా దగ్గర పూర్తి శాస్త్రబద్దమైన ఆధారమున్నది. ఈ వివరమంతయూ
వారికి తెలియదు కావున ముస్లీమ్లు మమ్ములను కూడా విగ్రహారాధకుల
లోనికి కలిపి చెప్పియుండవచ్చును. వారికి తెలిసినది వారన్నారు,
అంతమాత్రమున దానిని ఎందుకు పట్టించుకోవాలి? మేము ఎవరయినదీ,
మేము ఎవరిని ఆరాధించునదీ మాకు తెలుసు కదా! మేము అసలయిన
దేవున్నే ఆశ్రయించినప్పుడు, చిల్లర దేవుళ్ళను ఆశ్రయించనప్పుడు,
విగ్రహారాధన చేయనప్పుడు మేమెందుకు ఉలిక్కిపడాలి?

Page 89
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
89
ప్రతిమనయినా, విగ్రహమునయినా మనుషులు తయారు చేసివుంటే
తయారయిన ఆకారములే కదా! అటువంటప్పుడు అవి దేవునితో సమాన
మగునాయని కొందరడుగడమును మేము కూడా వినియున్నాము.
మనుషులు తయారు చేసినంతమాత్రమున వాటిని తక్కువగా చూడకూడదు.
ఒక బొమ్మలో యున్న శక్తిని తీసివేయనూలేము, అట్లే లేనిశక్తిని నింపనూ
లేము. ఆ మాటకు వస్తే నేడు మనముందరున్న మూడు దైవ గ్రంథములను
మనుషులు అచ్చువేసి గ్రంథములుగా తయారు చేశారు. వాటిని మనుషులు
చేసిన గ్రంథములని, వాటిలో శక్తిలేదని చెప్పగలమా! ఆ గ్రంథములలో
దైవశక్తి నిండియున్నది. అయితే ఆ శక్తిని గ్రంథమును తయారు చేసిన
మనుషులు నింపలేదు కదా! మనిషి ద్వారా దేవుడే అన్నిటినీ సృష్టించు
చున్నాడు. దేవుడు దేనియందు ఏ శక్తిని నింపియున్నాడో మనకు తెలియదు.
అందువలన మనిషి చేత తయారయిన ప్రతిమయందు దైవశక్తి కలదనియే
చెప్పవచ్చును.
'దేవుడు భూమిమీద అవతరిస్తాడని' ప్రథమ దైవగ్రంథమయిన
భగవద్గీతలో జ్ఞానయోగమందు ఆరవ శ్లోకమున, రాజవిద్యా రాజగుహ్య
యోగమను అధ్యాయమందు పదకొండవ శ్లోకములోనూ చెప్పడమైనది.
అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్లో సూరా 89లో, ఆయత్ 22యందు
కూడా దేవుడు అవతరిస్తాడని చెప్పియున్నాడు. అంతేకాక సూరా 15లో
ఆయత్ 29లో (15–29) “నేను మట్టితో బొమ్మను చేసి అందులోనికి నా
ఆత్మనే ఊది భూమిమీదికి పంపుచున్నాను. నేను నా ఆత్మను ఊది
పంపిన వ్యక్తిని చూచి దేవదూతలందరూ సాష్టాంగ నమస్కారము
చేయుదురు. మీరు కూడా సాష్టాంగ నమస్కారము చేయండి" అని
దేవుడే చెప్పియుండగా, ఆ మాటను గ్రహించని మనుషులు, దేవుడు తన

Page 90
90
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఆత్మగా పంపిన వాడు ఎవడో తెలియని మనుషులు, వచ్చిన వానికి
నమస్కరించడము లేదు. దేవుడు తన ఆత్మను ఊది పంపునని చెప్పినప్పుడు,
తన ప్రతినిధిని పంపుననేగా అర్థము. అయినా కొందరు మేము మనిషిగా
వచ్చిన ఎవరికీ మ్రొక్కము అని ఖురాన్ వాక్యమునే ఎదిరించి మాట్లాడు
చున్నారు. దేవుడు తన ప్రతినిధిగా పంపిన వానినే మేము భగవంతుడు
అని అంటున్నాము. అటువంటి అవతారముగా వచ్చినవాడే కృష్ణుడు.
అందువలన కృష్ణుని ఆకారమును ప్రతిమ అని అంటున్నాము. దేవుని
ప్రతినిధిగా వచ్చి, దేవుని జ్ఞానమును చెప్పిపోయిన వ్యక్తి విగ్రహము కాదు.
ఆయన దేవుని ప్రతి రూపముగా వచ్చినవాడు అయినందున దేవుని
ప్రతిరూపమును 'ప్రతిమ' అంటున్నాము. దేవుడు అంతిమ దైవగ్రంథములో
42వ సూరా 51వ ఆయత్నందు “నేను మూడు విధముల నా జ్ఞానమును
భూమిమీద ప్రజలకు తెలియచేస్తానని” చెప్పియున్నాడు. ఆ మూడు
విధానములలో ఒక విధానముగా భగవంతుడు అను మారువేషములో
దేవుడు వచ్చి తన జ్ఞానమును చెప్పిపోవును.
అలా వచ్చిన రూపమునే దేవుని ప్రతిరూపమని అంటున్నాము.
అలా దైవశక్తితో కూడివచ్చిన వానిని దేవదూతలు గుర్తించి, ఆయన
మానవాకారములో యున్నా దేవదూతలందరూ మ్రొక్కుచున్నారు.
అటువంటి దేవుని ప్రతిరూపమునకు, దేవుని ఆత్మ నిండియున్న వానిని
భగవంతునిగా గుర్తించి, దేవుని మారువేషముగా గుర్తించి అతనికి సాష్టాంగ
నమస్కారము చేయమని స్వయముగా అల్లాహ్ యే ఖురాన్ యందు 15-29వ
వాక్యములో చెప్పియున్నాడు. దేవుడే తాను పంపిన మనిషికి నమస్కారము
చేయమని చెప్పియున్నాడంటే ఆ వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదని
అర్థమయిపోవుచున్నది. ఈ మాట స్వయానా అంతిమ దైవగ్రంథము

Page 91
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
91
ఖుర్ఆన్లో ఉండగా, ఆ మాటను గ్రహించుకోని ముస్లీమ్లు దేవుడు
చెప్పిన ధర్మమును (మాటను) వదలి, తమ మత ధర్మము ప్రకారము
మనిషిగాయున్న ఎవరికీ మ్రొక్కకూడదు, మేము మ్రొక్కము అని తెగేసి
చెప్పుచున్నారు. మా షరియత్ ప్రకారము ఎవరికీ నమస్కరించము అని
అదే ఆయత్ క్రింద వివరములో వ్రాసుకొన్నారు. దీనినిబట్టి అల్లాహ్
చెప్పిన వాక్యముకంటే, దేవుడు చెప్పిన నియమముకంటే, మతము చెప్పిన
నియమమే పెద్దగా యున్నట్లు తెలియుచున్నది. మత షరియత్ ముందర,
మనుషులు తయారు చేసుకొన్న మత ధర్మము ముందర, ఖురాన్లో దేవుడు
చెప్పిన అల్లాహ్ వాక్యము నిలబడలేదని అర్థమయినది. బయట
మనుషులందరికీ తెలిసే రకముగా అల్లాహ్ గొప్పవాడు, ఆయన చెప్పిన
ఖురాన్ జ్ఞానము గొప్పదని చెప్పు ముస్లీమ్ సమాజము వారు, దేవుడు
నేను పంపిన మనిషికి నమస్కరించమని చెప్పినా మేము నమస్కరించము
అని చెప్పడము విడ్డూరముగా ఉన్నది.
దేవుడే తన గ్రంథములో ఒక వ్యక్తిని ప్రత్యేకముగా చెప్పి
దేవదూతలు సహితము నమస్కరించుచున్నారు, మీరు కూడా సాష్టాంగ
నమస్కారము చేయమని చెప్పాడంటే ఆ వ్యక్తి సామాన్యమైన మనిషి కాదని
అర్థమగుచున్నది. అలా వచ్చిన వాడు దేవుని ప్రతినిధియని, ఆయన ప్రతి
రూపమని తెలియుచున్నది. అతనినే భగవంతుడని అనవచ్చును. దేవుని
ఆత్మతో పుట్టినవాడు దేవుడే అయినా, పుట్టిన వానిని 'దేవుడు' అని
అనకూడదు. అందువలన గర్భమునుండి వచ్చినవాడని చెప్పుచూ
భగవంతుడు అని అన్నారు. భగము అనగా తల్లిగర్భము అని అర్థము.
భగవంతుడు అనగా తల్లి గర్భమునుండి వచ్చినవాడని తెలియుచున్నది.
అలా తల్లి గర్భమునుండి పుట్టిన ప్రత్యేకమయిన మనిషి శ్రీకృష్ణుడు.

Page 92
92
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
అందువలన కృష్ణుని రూపమును గ్రహ అనిగానీ, విగ్రహ అనిగానీ అనడము
లేదు. కృష్ణుని రూపమును 'ప్రతిమ' అని అంటున్నాము. భూమిమీద
ఆకారము కల్గి, విగ్రహము కాకుండా ప్రతిమగాయున్నది ఒకే ఒక కృష్ణుని
ఆకారమేనని అందరూ గుర్తుంచుకోవలెను. భగవద్గీతలో జ్ఞానయోగమను
అధ్యాయమున గల ఆరవ శ్లోకము ప్రకారము, అలాగే రాజవిద్యా
రాజగుహ్యయోగమను అధ్యాయమునగల పదకొండవ శ్లోకము ప్రకారము,
అట్లే అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్ఆన్లో సూరా 89, ఆయత్ 22
ప్రకారము, సూరా 15, ఆయత్ 29 ప్రకారము కృష్ణున్ని దేవుని
అవతారముగానూ, ఆయన రూపమును ప్రతిమగాను చెప్పుచున్నాము.
దేవుడు భూమిమీద పుట్టడని కొందరు అంటున్నా, దైవ గ్రంథము
లయిన మూడు గ్రంథములలో దేవుడు పుట్టుననే కలదు. అయితే దేవుని
ప్రాథమిక ధర్మమునకు ముప్పు కలుగకుండా దేవుడు దేవునిగా పుట్టడు.
దేవుడు మరొకనిగా పుట్టుచున్నాడు. దేవుడు దేవునిగా వచ్చినా, లేక మారు
వేషములో వచ్చినా ఆయన వచ్చినట్లే కదా! దైవగ్రంథములో నా జ్ఞానము
నాకు తప్ప ఏ మానవునకు తెలియదు అన్నాడు. ఆ మాట నూటికి నూరు
పాళ్ళు సత్యమే. అదే దైవగ్రంథములో మరియొకచోట “నేను ప్రత్యక్షముగా
నేరుగా ఎవరితోనూ మాట్లాడను అని చెప్పుచూ, నా జ్ఞానమును మూడు
విధములుగా మనుషులకు తెలియజేయుదును” అన్నాడు. అప్పుడు ఆయన
మాటను ఎలా అర్థము చేసుకోవాలో కొందరికి అర్థముకాకపోయి వుండ
వచ్చును. మాకు మాత్రము సులభముగా ఆ మాట అర్థమయినది.
ఇక్కడ చిన్న ఉదాహరణను చెప్పుకొందాము. ఒక పెద్దమనిషికి
చతుషష్ఠీ విద్యలు వచ్చును. అంటే అరవైనాలుగు విద్యలు వచ్చునని అర్థము.

Page 93
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
93
అయితే ఆ పెద్దమనిషి పదిమంది తన అనుచరులతో కలిసి విదేశీ
పర్యటనకు పోయాడు. విదేశీ పర్యటనలో మూడు నెలల కాలము
ఉండాలని దానికి తగిన డబ్బును తీసుకొని బయలుదేరిపోయాడు. అక్కడ
ఒక నెల కాలము గడచిపోయినది. తన పదిమంది అనుచరుల ఖర్చంతయూ
ఆ పెద్దమనిషే చూచుకొనెడివాడు. అప్పుడు ఆ పెద్దమనిషివద్ద గల డబ్బును
ఆ దేశము దొంగలు దొంగిలించారు. పెద్దమనిషి వద్ద గల డబ్బు మొత్తము
పోయింది. ప్రక్కన పెట్టుకొన్న కొంత డబ్బు మాత్రము మిగిలింది.
మిగిలిన డబ్బు మూడు లేక నాలుగు రోజులకు సరిపోగలదు. తర్వాత
డబ్బులేక విదేశములో ఇబ్బంది పడవలసివచ్చును. ఆ సమయములో
అందరికీ నాయకుడుగా యున్న పెద్దమనిషి బాగా ఆలోచించి ఒక
నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయమును ఎవరికీ చెప్పకూడదనుకొన్నాడు.
ఎందుకనగా ఆ నిర్ణయము తన స్థాయికి తగినది కాదు. అందువలన
ఆయన నిర్ణయమును బయటికి చెప్పకుండా, ఆ నిర్ణయమును మరుసటి
రోజే కార్యరూపమునకు తెచ్చాడు. తన కార్యము ఎవరికీ తెలియకూడదు,
కావున అంతవరకు పెద్దమనిషిగా యున్న అతను తనను ఎవరూ
గుర్తించనట్లు తన వేషము మార్చుకొన్నాడు. శరీరమంతా ముసుగు
ధరించాడు. అప్పుడు అతనిని పెద్దమనిషి అని ఎవరూ గుర్తు పట్టలేరు.
ఆ విధముగా తనను ఎవరూ గుర్తుపట్టలేని విధముగా తయారయిన
పెద్దమనిషి, తాను ముందే నేర్చిన 64 విద్యలలో ఒకటయిన చోరకళ
(దొంగతనము చేయుట) ఉపయోగించి డబ్బును పొందాలనుకొన్నాడు.
పోయిన డబ్బు తిరిగి వచ్చుటకు ఆ దారి తప్ప వేరు దారి కనిపించలేదు.
ఎవరూ గుర్తించనట్లు మారువేషములో యున్న పెద్దమనిషి, తాను నేర్చిన
విద్యలలో ఒకటయిన దానిని ప్రదర్శించి రెండవ రోజే డబ్బును

Page 94
94
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
సంపాదించగలిగాడు. ఆ డబ్బుతో తమ విదేశీ పర్యటనను నెరవేర్చుకొని
వచ్చారు. ముసుగులోయున్న పెద్దమనిషి బ్యాంకు దగ్గర ఇతరుల సొమ్మును
అపహరించినది తమ గుంపులోని వారు చూచినా, ఆ దొంగతనము
చేసినది తమ పెద్దమనిషే అని వారికి తెలియదు. దొంగతనము
జరిగినప్పుడు విదేశీ పర్యటనకు పోయిన పెద్దమనిషి గుంపు మనుషులు
అందరూ దానిని చూచారు, దొంగతనము చేసిన మనిషినీ చూచారు.
అయితే ఆ మనిషి ముసుగు ధరించి యుండడము వలన అతను
ఎవరయినది గుర్తుపట్టుటకు వీలు లేకుండా పోయినది.
అక్కడ దొంగగా ముసుగు వేసుకొన్న మనిషి ఐదు నిమిషములలో
దొంగతనమును ఎంతో తెలివిగా చేశాడని చూచిన పెద్దమనిషికి
సంబంధించిన మనుషులే చెప్పుచున్నా, ఆ దొంగతనమును చేసినవాడు
తమ నాయకుడే అని వారికి తెలియదు. పెద్దమనిషి ముసుగు ధరించడము
వలన తన మనుషులే ఆయనను గుర్తించలేకపోయారు. మిగతా విదేశీ
పర్యటన రెండు నెలలు గడచిపోయినది. వారందరూ తిరుగు ప్రయాణము
చేసి స్వంత దేశమునకు, స్వంత ఇంటికి చేరుకోగలిగారు. అలా ఇంటికి
చేరిన వారందరూ ఒకరోజు కలిసి తమ విదేశీ పర్యటనను గురించి చర్చించు
కొన్నారు. అక్కడ జరిగిన చర్చావేదికలో పెద్దమనిషిగాయున్న వ్యక్తి తమ
గుంపులోని ఎవరికీ అంతవరకు తెలియని రహస్యమును చెప్పాడు.
అదేమనగా! "తమ గుంపులో ఒక వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా
పెట్టుకోమని చెప్పాను. అయినా ఆ డబ్బులను ఆ వ్యక్తి పోగొట్టుకోవడము
జరిగినది. తర్వాత ఆ డబ్బులు తిరిగి సంపాదించి తనవద్ద డబ్బులు
పోయిన విషయము ఎవరికీ తెలియకుండా చేయాలనుకొన్నాడు. తన
విషయము బయటపడకుండుటకు తొందరగా డబ్బులు సంపాదించాలనీ,

Page 95
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
95
తొందరగా డబ్బులు సంపాదించుటకు దొంగతనము ఒక్కటే మార్గమనీ
తలచి, ఆ వ్యక్తి దొంగతనము చేసి డబ్బును సమకూర్చి, మన ప్రయాణము
సులభముగా సాగునట్లు చేశాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అను విషయము
నాకు మాత్రము తెలుసు. ఆ వ్యక్తి తనకు తానుగా బయటికి వచ్చి నేనే ఈ
పని చేశాను అని చెప్పితే, అతను ఎవరయినది మిగతా వారికి కూడా
తెలియగలదు" అని పెద్దమనిషి చెప్పడము జరిగినది. పెద్దమనిషి ద్వారా
అప్పుడే ఆ విషయమును వినిన పదిమంది తమ గుంపులో ఎవడో ఒకడు
ఆ పని చేశాడు అని తెలియగలిగారు గానీ, ఆ మనిషి ఎవరయినది
ఎవరికీ తెలియదు.
పెద్దమనిషి తమ సమావేశములో తమ గుంపులోని వాడు ఒకడు
డబ్బును పోగొట్టుకోవడము తిరిగి దొంగతనము ద్వారా సంపాదించడము
జరిగినదని చెప్పుచున్నా దానిని గ్రహించలేకపోయారు. దొంగతనము
జరిగిన రోజు ముసుగు ధరించిన మనిషిని వారు చూచారు. ముసుగు
మనిషి ఆనాడు దొంగయని తెలుసు. అయితే ఆ దొంగ తమ గుంపులోని
వాడనిగానీ, తమ నాయకుడేయనిగానీ వారికి ఎవరికీ తెలియదు. తమ
గుంపులో జరిగిన విషయము అందరికీ తెలిసినా, దొంగ తమ గుంపులో
ఉన్నాడని తెలిసినా, ఫలానావాడని నిర్ణయించుకొనుటకు వీలులేదు.
దొంగతనము జరిగినరోజు ముసుగు మనిషిని చూచినా, ముసుగు మనిషి
ఫలానావాడని చెప్పుటకు వీలులేదు. దొంగతనము చేసిన దొంగ తమ
గుంపులో ఉండుట నిజమేయని అందరికీ తెలిసినా, ఎవరయినది గుర్తించ
లేకపోయారు. అదే విధముగా మానవ గుంపులోనికి దేవుడు దొంగగా
వచ్చిపోయాడు. పెద్దమనిషి ముసుగు ధరించి వచ్చి దొంగతనము
చేసిపోయినట్లు, దేవుడు మానవ సమాజము నకు పెద్దగాయుండి తనను

Page 96
96
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
గుర్తుపట్టనట్లు శరీరమను ముసుగు ధరించి దొంగవలె వచ్చి, తాను
చేయవలసినది చేసి దొంగవలె ఎవరికీ తెలియకుండా పోయాడు.
పెద్దమనిషి తమ విదేశీ పర్యటనలో ఒకరు దొంగగా మారాడని చెప్పాడు.
అలాగే దేవుడు మనిషిగా మానవ సమాజములోని మనిషిగా వచ్చాడని
చెప్పాడు. గుంపులో దొంగయున్నా ఎలా గుర్తించలేకపోయారో, అలాగే
మానవ సమాజములో దొంగవలె దేవుడున్నా ఎవరూ గుర్తించలేకపోయారు.
పెద్దమనిషి దొంగగా వచ్చినప్పుడు ముసుగుతో వచ్చాడు గనుక ఆయనను
ఎవరూ గుర్తించలేకపోయారు. అలాగే దేవుడు భూమిమీదికి తనబోధను
తెలుపటానికి వచ్చినప్పుడు గుర్తించబడని మనిషి అనబడు మారువేషముతో
వచ్చుట వలన ఆయనను అందరూ మనిషే అనుకున్నారుగానీ, దేవుడు
అని ఎవరూ గుర్తుపట్టలేదు. పెద్దమనిషి ముసుగుతో వచ్చియుండుట
వలన అతనిని గుర్తించలేక ముసుగు మనిషి అన్నట్లు, పెద్దమనిషి అని
చెప్పలేనట్లు, దేవుడు మనిషి అను వేషములో భూమిమీదికి వచ్చుట వలన
ఆయనను దేవునిగా ఎవరూ గుర్తించలేకపోయారు. పెద్దమనిషే తన
సమావేశములో దొంగ విషయమును ప్రస్తావించినట్లు, దేవుడే తన
గ్రంథములో అవతారమును గురించి ప్రస్తావించాడు.
పెద్దమనిషే దొంగగా తయారయినాడని తెలియని మనుషులు,
దేవుడే మనిషిగా వచ్చాడని తెలియలేకపోయారు. అన్ని విద్యలు తెలిసిన
వాడు పెద్దమనిషే అని తెలిసి, దొంగతనము కూడా ఆయనే ఎవరూ
గుర్తించనట్లు మారువేషములో చేసియుండవచ్చునని అనుకోలేకపోయారు.
అదే విధముగా అన్ని రహస్యములు దేవునికే తెలుసుననీ, దేవుడే జ్ఞానము
చెప్పు నిమిత్తము మనిషిగా ఎవరూ గుర్తించలేనట్లు వచ్చియుండునని తెలియ
లేకపోయారు. పెద్దమనిషిని పెద్దమనిషిగానే చూడవలెననీ, వేరేవారితో

Page 97
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
97
పోల్చకూడదను నియమమును పట్టుకొని, పెద్దమనిషే దొంగ అయినాడను
సత్యమును మరచిపోయినట్లు, దేవున్ని దేవునిగానే చూడాలి తక్కువవారితో
ఆయనను పోల్చకూడదను నియమమును పెట్టుకొని, దేవుడు మనిషి
అయినాడను సత్యమును మనిషి కాదంటున్నాడు. పెద్దమనిషికి 64 కళలు
వచ్చుననీ, ఆయన ఏమయినా చేయగలడను సూత్రమును మరచి పోయి,
పెద్దమనిషి దొంగతనము చేయడన్నట్లు, దేవుడు సర్వవ్యాపి, సర్వ
శక్తిమంతుడు అను జ్ఞానమును మరచిపోయి, దేవుడు మనిషిగా జీవించడు,
మనిషిగా పని చేయడు అంటున్నారు. ఈ విధముగా ఒక పెద్ద మనిషి
విషయములో మనుషులు ఎలా పొరపాటు పడినారో అదే విధముగా దేవుని
విషయములో కూడా పొరపాటుపడినామని అర్థము చేసుకోలేకున్నారు.
ప్రథమ దైవగ్రంథములో జ్ఞానయోగమందు ఆరవ శ్లోకమున, రాజ
విద్యా రాజగుహ్య యోగమందు పదకొండవ శ్లోకమున దేవుడు మనిషిగా
అవతరిస్తాడని కలదు. అలాగే ద్వితీయ దైవగ్రంథమున బైబిలులో కూడా
దేవుడు ఆదరణకర్తగా అవతరిస్తాడని యోహాన్ సువార్త 14,15,16
అధ్యాయములలో చెప్పడమైనది. అట్లే అంతిమ దైవగ్రంథము ఖురాన్లో
కూడా 89వ సూరా, 22వ ఆయత్యిందు, 15వ సూరా, 29వ ఆయత్నందు
దేవుడు అవతరిస్తాడని వ్రాయబడియున్నా, మనుషులు ఆ విషయమును
చదివి కూడా దేవుడు పుట్టడని అజ్ఞానవాదమును రేకెత్తించుచున్నారు. ఎవరు
ఎట్లు చెప్పుకొనినా దేవుడు తన గ్రంథములలో చెప్పినట్లు, దేవుడు మనిషిగా
పుట్టి తన జ్ఞానమును మనుషులకు బోధించుచున్నాడు. దేవుడు మనిషిగా
వచ్చి జ్ఞానము చెప్పకపోతే భూమిమీద జ్ఞానము తెలిసేదే కాదని పిస్తున్నది.
దేవుడు మనిషిగా పుట్టినప్పుడు ఆ మనిషికి ఏదో ఒక పేరు ఉండును,
ఆకారముండును. అలా దేవుడు మనిషి రూపము అను మారువేషములో

Page 98
98
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
వచ్చినప్పుడు కల్గియున్న రూపమును దేవుని ప్రతిరూపమని అర్థమొచ్చునట్లు
'దేవుని ప్రతిమ' అని ఆ రూపమును అంటున్నాము. దేవుడు మనిషి
ఆకారములో వచ్చినప్పుడు, సజీవమైన శరీరముతోయున్నప్పుడు ఆయనను
'భగవంతుడు' అని అంటున్నాము. దేవుడు నిరాకారముగా కనిపించక
సూక్ష్మముగావుంటే ఆయనను దేవుడే అనాలి. దేవుడు సాకారుడై స్థూలముగా
కనిపించువాడుగాయుంటే అతనిని భగవంతుడని చెప్పవచ్చును. నిరాకార
మైన దేవుడు సాకారముగా మారితే భగవంతుడు అని చెప్పాలి. దేవుడు
ఒకమారు సాకార రూపమున్న మనిషిగా వస్తే, ఆ రూపమే ప్రతిమగా
మారిపోవును. దేవుని ప్రతిరూపమును గ్రహించి 'ప్రతిమ' అని చెప్పాలి.
ఈ విధముగా ప్రతిమ ప్రత్యేకతను సంతరించుకొన్నది.
దేవుడు కాకుండా జీవుడుగా పుట్టుచున్న ప్రతి ఒక్కరు, అకాల
మరణములో చనిపోతే సూక్ష్మగ్రహముగా మిగిలిపోతారు. అట్లు కాకుండా
దేవతాజాతిలోనే పుట్టితే విగ్రహముగా ఉందురు. సాధారణ జీవులు
మనుషులుగా అయితే గ్రహములు అని పిలువబడుతారు. దేవతలుగా
అయితే విగ్రహములుగా పిలువబడుతారు. వీరందరికంటే వేరుగా దేవుని
జన్మ ఉండుట వలన, ఆయన ధరించిన ఆకారమును ప్రతిమ అంటాము.
ప్రతిమకు, విగ్రహమునకు, గ్రహమునకు ఇంత తేడా ఉన్నట్లు చాలామందికి
తెలియదు. కొన్ని మతములవారికి దేవుడను విషయము తెలుసుగానీ
దేవుని జ్ఞానము ఏమాత్రము తెలియదు. దేవుని జ్ఞానము తెలియనివారికి
దేవుడు అందరికంటే గొప్ప, దేవుడు పుట్టడు, మనిషికి కూడా పునర్జన్మలు
లేవు, దేవుడు చనిపోయిన వారందరినీ ప్రళయములో లేపుతాడు అను
ఈ నాలుగు విషయములను మాత్రమే చెప్పుచుందురు. అంతతప్ప వాటి
వివరము వారికి ఏమాత్రమూ తెలియదు. దేవుడు పుట్టడని తెలుసు, ఎందుకు

Page 99
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
99
పుట్టడు? అని తెలియదు. మనిషికి పునర్జన్మలు లేవు అని అంటున్నారు.
అయితే రెండవ జన్మలో మొదటి జన్మ జ్ఞాపకాలు చెప్పేవారున్నా, వారు
ఎక్కడినుండి వచ్చారనే విషయము తెలియదు. ఇలా తాము విన్నది చెప్పడమే
తప్ప, వారు విన్నది తప్పా, ఒప్పా అని ఆలోచించు విచక్షణ లేనివారుగా
యున్నారు.
వారి ప్రశ్న :- మీరు చెప్పునది ఆమూలాగ్రము పరిశీలిస్తే విగ్రహము వేరు, ప్రతిమ
వేరని, ప్రతిమ భగవంతుని చిహ్నమని, గ్రహము మానవ సారాంశమని, విగ్రహ
దేవతల మారురూపమని తెలియుచున్నది. దేవుడు మనిషిగా వచ్చినప్పుడు
మాత్రమే ఆ రూపమును ప్రతిమగా చెప్పవచ్చును. మనిషి సగము చచ్చితే
గ్రహముగా ఉంటాడు. దేవతలు బ్రతికితే విగ్రహములుగా ఉంటారు అని
అర్థమయినది. దేవుని అవతారమును భగవంతుడని, భగవంతుని రూపమును
ప్రతిమ అని చెప్పుచున్నారు. ప్రతిమను దేవుడు అని అనవచ్చునా?
మా జవాబు :- దేవుడు పుట్టితే భగవంతుడగును. భగవంతుని రూపము
ప్రతిమ అగును. దేవుడు, భగవంతుడు, ప్రతిమ అను వరుస క్రమములో
దేవునినుండి ప్రతిమ మూడవదగును. అందువలన పద్ధతి ప్రకారము
ప్రతిమను భగవంతుడని చెప్పవచ్చునుగానీ దేవుడు అని చెప్పకూడదు.
దేవుడు అనగా కనిపించనివాడు, దేవునికి రూపమే లేదు. అటువంటప్పుడు
రూపమున్న ప్రతిమను దేవుడు అని అనడము ఏమాత్రము సరిపోదు.
ఆధ్యాత్మిక చట్టమునకు వ్యతిరేఖమగును. అయితే చాలా సందర్భములలో
ప్రతిమను చూపి దేవునికి నమస్కరించుకోమని చెప్పడము జరుగుచున్నది.
చాలా సందర్భములలో జ్ఞానులు సహితము ప్రతిమను దేవుడనియే లెక్కించి
చెప్పడము జరుగుచున్నది. ప్రతిమను దేవుడనడము తప్పని తెలిసినా

Page 100
100
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
కొన్ని సందర్భములలో అలాగే చెప్పవలసి వచ్చును. అది ప్రతిమ మీద
గౌరవముతో కాకపోయినా, దేవుని గౌరవార్ధము అలా చెప్పవలసియున్నది.
అంతేగానీ అదే పనిగా ప్రతిమను దేవుడు అని అనకూడదు.
వారి ప్రశ్న :- ప్రతిమ భగవంతుని ఆకారమని చెప్పారు. విగ్రహము దేవతల
గ్రహించు శక్తి అన్నారు. అది గ్రహించు శక్తి పేరు విగ్రహ అయినా దేవతను
విగ్రహ అని అంటున్నాము. బ్రతికియున్న దేవత విగ్రహకాగా, బ్రతికియున్న లేక
బ్రతికిపోయిన భగవంతుని ఆకారమును ప్రతిమ అంటున్నాము. అయితే మీరు
ప్రతిమకు పూర్తి వ్యతిరేఖమయినది విగ్రహ అని అర్థమగునట్లు ప్రతిమ × విగ్రహ
అని వ్రాశారు. ప్రతిమకు విగ్రహమునకు శత్రుత్వమున్నదా? యని కొందరు
అడుగుచున్నారు. దీనికి మీరేమంటారు?
మా జవాబు :- అలాంటి శత్రుత్వమును గురించి ఆ గుర్తును పెట్టలేదు.
ప్రతిమకు పూర్తి విభిన్నముగా విగ్రహములుండునను ఉద్దేశ్యముతో అలా
ప్రతిమ విగ్రహ అని వ్రాయవలసివచ్చినది. ఇప్పటికాలములో ఒక
ఆకారమును చూస్తే చాలు దానిని విగ్రహ అంటున్నారు. అర్థము ప్రకారము
దాని భావము వేరున్నా వీరి అలవాటు ప్రకారము రూపమున్న దానినంతటినీ
విగ్రహ అంటున్నారు. రూపములలో విగ్రహ వేరు, ప్రతిమ వేరనే విషయము
కూడా తెలియదు. అటువంటి వారికి అది వేరు ఇది వేరు అని అర్థమగు
లాగున ప్రతిమ × విగ్రహ అని వ్రాయవలసివచ్చినది. అంతేగానీ వేరు
విధముగా అనుకోకూడదని, అది శత్రుత్వమునకు గుర్తు కాదని తెలుపు
చున్నాము.
వారి ప్రశ్న :- దైవము X దెయ్యము అని వ్రాశారు కదా! దీనిని గురించి
ఏమనుకోవాలి?

Page 101
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
101
మా జవాబు :- ఇక్కడ కూడా వ్యతిరేఖ భావమును గురించి అనుకోకూడదు.
దైవమునకు విభిన్నముగా దైయ్యముండును అని తెలుపు నిమిత్తము అలా
వ్రాయవలసి వచ్చినది. దైవము అనగా అణువణువునా సర్వ ప్రపంచము
వ్యాపించిన దేవుడగును. దైయ్యము అనగా ఒక మనిషి అకాల మరణముతో
చనిపోతే అతని కనిపించని సూక్ష్మశరీరమును దెయ్యము అని అంటున్నాము.
దేవుడు కనిపించడు, దెయ్యము కనిపించదు.
అయితే దేవుడు సర్వ
ప్రపంచము వ్యాపించియుండగా, దైయ్యముగాయున్నవాడు ఎక్కడున్నా వాడు
అక్కడే ఒకచోట మాత్రమే ఉండును. దెయ్యము అను పేరుతోయున్నా
అతను కనిపించని సాధారణ మనిషిగానే యుండును. స్థూల శరీరము
లేకుండాపోయి సూక్ష్మశరీరముండుట వలన, అకాల మరణము పొందిన
వాడు రెండవ జన్మకు పోకుండా భూమిమీదనే బ్రతుకవలసియున్నది. అలా
మనుషుల లెక్కలో చనిపోయి సూక్ష్మశరీరముతో ఎవరికీ తెలియకుండా
బ్రతికియున్న వారిని దైయ్యము అంటున్నాము. దైవము అను పదమునకు
దగ్గరగా యుండునట్లు దైయ్యము అను పదమును సూక్ష్మముగా బ్రతికి
యున్న మనిషిమీద ఉపయోగించారు. అలా ఉపయోగించుటకు కారణము
కలదు. అదేమనగా! దైవము అంటే కనిపించక అంతటా ఉన్నదని అర్థము.
దైవము అను పదములో మొదటి రెండు అక్షరములకే అర్థము గలదు.
చివరి అక్షరమైన 'ము' అనునది ముగింపు అక్షరముగా ఉన్నది. 'దైవ'
అనగా కనిపించక అంతటా ఉండునది దేవుడేయగును. 'దై' అనగా
‘కనిపించనిది’ అని అర్థము. 'వ' అనగా వ్యాపించినదని అర్థము. దీనిని
బట్టి 'దైవ' అనగా కనిపించక అంతటా వ్యాపించినదని తెలియుచున్నది.
అలాగే దైయ్య అను రెండు అక్షరములలో 'దై' అనగా కనిపించనిదని
అర్థముకాగా, ‘య్య' అనగా వ్యాపించనిదని అర్థము. వ్యాపించనిది అనగా

Page 102
102
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఒకచోట ఉండునదని అర్ధము. దీనినిబట్టి దైయ్యము అనగా కనిపించక
ఒకచోట ఉండునదని తెలియుచున్నది. కనిపించక అంతటా వ్యాపించిన
వాడు దేవుడు అయినప్పుడు, కనిపించక ఒకచోట ఉండువాడు చనిపోయిన
మనిషి అని అర్థమగుచున్నది. ఈ విధముగా దైవమునకు, దెయ్యమునకు
ఉన్న విభిన్న భావమును తెలియజేయు నిమిత్తము దైవము × దెయ్యము
అని వ్రాశాము.
వారి ప్రశ్న :- మనిషి శరీరములో గ్రహించుకొను బుద్ధియుండుట వలన
గ్రహము అని అంటున్నాము అని మీరు చెప్పిన దానినిబట్టి తెలిసినది. ఈ
విషయమును చెప్పినప్పుడు మనిషి బ్రతికియున్నా, అకాల మరణముతో
చనిపోయినా అతనిలో గ్రహించుకొను శక్తియుండుట వలన మనిషిని
గ్రహము అంటున్నామని, దేవతలలో గ్రహించుకొను శక్తి కొంత విశేషముగా
ఉండును కనుక దేవతలను విగ్రహ అని అంటున్నామని చెప్పారు. మనిషి
బ్రతికినా, చనిపోయినా 'గ్రహ' అనే చెప్పవచ్చును. దేవత కూడా బ్రతికినా,
చనిపోయినా 'విగ్రహ' అనియే చెప్పవచ్చును. ఇంతవరకు ప్రతిమకు,
విగ్రహమునకు గల తేడాను వివరించారు. అట్లే దైవమునకు దైయ్యమునకు
గల వ్యత్యాసమును వివరించి చెప్పారు. వారి తేడాలు విన్న తర్వాత
గ్రహముకంటే విగ్రహము అను పేరులో విశేషత ఏమున్నదో, మనిషిని గ్రహ అని
దేవతలను విగ్రహ అని ఎందుకంటున్నారో తెలుపమని అడుగుచున్నాను.
మా జవాబు :- మనిషి స్థూలముగా బ్రతికియున్నప్పుడు 'గ్రహ' అనిపించు
కొన్నా, సూక్ష్మముగా బ్రతికియున్నప్పుడు 'దైయ్యము' అని పిలువబడు
చున్నాడు. దేవతా జన్మపొందిన వారు బ్రతికినప్పుడు 'విగ్రహ' అని
పిలువబడినట్లే, సగము చనిపోయి సూక్ష్మముగాయున్నప్పుడు కూడా 'విగ్రహ'

Page 103
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
103
అనియే పిలువ బడుచున్నారు. మనుషులకున్నట్లే చావు, పుట్టుకలు దేవతలకు
కూడా కలవని ముందే చెప్పియున్నాము. ఇప్పుడు ముఖ్యముగా
తెలియవలసిన విషయమేమంటే! మనిషి బ్రతికియున్నప్పుడు స్థూల
శరీరమునందు సూక్ష్మ శరీరముతో కలిసియుండును. స్థూల శరీరము
పది (10) భాగములుగా యుండగా, సూక్ష్మశరీరము పదిహేను (15)
భాగములుగా యున్నది. మనిషి కాలమరణము చెందితే శరీరములోని
జీవుడు (జీవాత్మ) శరీరమును మొత్తము వదలిపోవును. అనగా ఇరువదైదు
(25) భాగములుగా యున్న శరీరమును వదలిపోవును. ఒకవేళ అకాల
మరణమే సంభవిస్తే కాలమరణము వచ్చువరకు ఆ జీవుడు సూక్ష్మ
అయినా
శరీరమయిన 15 భాగములలో ఉండవలసిందే. ఇది మనిషికి
సంబంధించిన విషయముకాగా, దేవతా జన్మ పొందిన వాడు కూడా జీవుడే
వానికి స్థూల, సూక్ష్మ అను రెండు భాగముల శరీరము
మనిషికున్నట్లు లేదు. ఒక విధముగా ఒక రాతి బొమ్మ ఆకారమే ఒక
దేవతకు స్థూల దేహముగాయున్నదని చెప్పవచ్చును. అయితే మనిషి
శరీరమువలె అది పెరుగునది కాదు, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య
అను దశలు మారునది కాదు. రాతి శరీరము ఎల్లప్పుడు ఒకే విధముగా
యుండుట అందరికీ తెలిసిన విషయమే.
మనిషి శరీరములోని జీవుడు ఒకమారు శరీరమును వదలి
బయటకు వస్తే తిరిగి ఆ శరీరములోనికి పోవడము సాధ్యముకాదు. మనిషి
శరీరములోని జీవుడు కాలమరణములోగానీ, అకాల మరణములోగానీ
స్థూల శరీరమును వదలి బయటికి రావడము జరుగును. అట్లు కాల
మరణములో వస్తే ఆ జీవుడు ఆ క్షణమే మరుజన్మకు పోవును. కావున
శరీరములోనికి చేరు అవకాశమే ఉండదు. ఒకవేళ అకాల మరణము

Page 104
104
ఆ
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
పొందినవాడు సూక్ష్మశరీరముతో ఆయుష్షు ఉన్నంత వరకు జీవించవలసి
యున్నది. అటువంటి వాడు అకాల మరణముతో చనిపోయి స్థూల
శరీరమును వదలి బయటికి వచ్చియుండును. ఆ విధముగా వచ్చినవాడు
సూక్ష్మశరీరముతో తన స్థూలశరీరము ప్రక్కనే కూర్చొని చూస్తూయుండును.
తన బంధువులు ఏడ్చేది ప్రత్యక్షముగా చూచిన ఆ జీవుడు తిరిగి తన
స్థూల శరీరములోనికి ప్రవేశించి తనవారితో మాట్లాడ వలెనని అనుకొనును.
అయితే ఆ జీవుడు ఎంత ప్రయత్నించిననూ అంతవరకు తాను నివాసమున్న
తన స్థూల దేహములోనికి ప్రవేశించలేడు. ఆ విధముగా అనేకమార్లు
స్థూల శరీరములోనికి ప్రవేశించవలెనని ప్రయత్నించి విఫలమై, ఇక అట్లు
చేరుటకు జరుగదని తెలిసి ఊరకుండిపోవును. అట్టివాడు తన ఆయుష్షు
ఎంతకాలముండునో అంతకాలము సూక్ష్మశరీరము తోనే గడుపవలసి
వచ్చును. ఆ స్థితినే దైయ్యము అనికూడా అంటున్నాము. అలా తన స్థూల
శరీరములోనికి చేరలేనివాడు, ఇతరులు జీవనము సాగించు బ్రతికియున్న
స్థూల శరీరములోనికి చేరు అవకాశము గలదు. అందువలన కొందరు
అకాల మృత్యువుతో చనిపోయినవారు ఇతరుల శరీరములోనికి ఆవహించి
మాట్లాడడము జరుగుచున్నది. అప్పుడు “బ్రతికియున్న వానిని చచ్చినవాడు
పట్టాడు” అని అంటుంటాము.
ఇదంతయూ మనిషి జన్మ యెడల జరుగు విధానము కాగా, దేవతల
జీవితములో జరుగు విధానము వేరుగాయున్నది. దేవతలుగా యున్నవారు
జీవాత్మలే అయినా వారికి మానవులవలె మాంస శరీరము లేదు. రాతి
శరీరములలో అనగా రాతి బొమ్మలలోగానీ లేక ఇతర బొమ్మలలోగానీ
నివసించుచున్నారు. దేవతలకు మరణము రాకముందే సజీవముగా
యున్నప్పుడే వారివారి రాతి శరీరమును వదలి బయటికి రాగలరు. అట్లే

Page 105
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
105
లోపలికి పోగలరు. మనిషి శరీరములో అలా జరుగుటకు వీలులేదు.
దేవతలుగా యున్నవారు తమ రాతి శరీరమునుండి ఎప్పుడయినా బయటికి
రాగలరు, ఎప్పుడయినా లోపలికి పోగలరు. ఉదాహరణకు నేను చూచిన
ఒక ప్రత్యక్ష సంఘటనను గురించి చెప్పుచున్నాను చూడండి. ఒక పేరు
పొందిన ఆంజనేయస్వామి గుడికి ఇతరులవెంట మేము పోవడము జరిగి
నది. అక్కడికి సాయంకాలము ఐదు గంటల సమయములో పోయాము.
అక్కడ గుడిలో ఆంజనేయస్వామికి పూజలు జరుగుచున్నవి. బయట
ఎంతోమంది అనారోగ్యముతో యున్నవారు 'ఆంజనేయస్వామి తమ
రోగమును పోగొట్టి ఆరోగ్యమును చేకూర్చును' అను నమ్మకముతో అక్కడికి
వచ్చిన వారుగలరు. అక్కడికి వచ్చిన అనారోగ్యవంతులందరూ దైయ్యాల
బాధను పొందువారే అయివున్నారు. ఆ గుడి దగ్గర కొన్నాళ్ళుంటే తమను
పీడించు దైయ్యములను ఆంజనేయస్వామి తరిమివేయునని వారి నమ్మకము.
అందువలన చాలామంది అనారోగ్యవంతులు అక్కడ కూడాయున్నారు.
అంతలో ఆంజనేయస్వామి గుడిలోని ఆంజనేయుడు బయటికి
వచ్చి, అక్కడున్న రోగస్థులలోనున్న ఒక దైయ్యమును దండించడము జరుగు
చున్నది. అప్పుడు మనిషిలోని దైయ్యము బయటికి వచ్చి మాట్లాడుచూ
“నన్ను కొట్టొద్దు స్వామీ! నేను ఈమెను వదలిపోతాను ఇక ఎప్పటికీ రాను”
అని అనడము నేను కూడా విన్నాను. అయినా ఆంజనేయస్వామి
కొట్టుచున్నట్లు “అబ్బ! కొట్టొద్దు స్వామీ! ఇక నేను అబద్దము చెప్పను రేపు
ప్రొద్దున్నే పోతాను” అని మరీమరీ చెప్పడము కూడా విన్నాను. ఈ విధముగా
అక్కడున్న దాదాపు పదిమంది దైయ్యాల బాధితులను ఆంజనేయస్వామి
దండించడము జరిగినది. ఆ సమయములో గుడిలో పూజార్లు పూజలు
చేయుచున్నా, ఆంజనేయస్వామి ఆ పూజలవద్ద లేడనీ, అప్పుడు బయట

Page 106
106
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
కార్యములలో ఉన్నాడనీ తెలియుచున్నది. ఈ విధముగా అరగంట కాలము
గడచిన తర్వాత అక్కడ సద్దుమణిగిపోయినది. దానిని బట్టి ఆంజనేయస్వామి
అక్కడ లేకుండా గుడిలోని ప్రతిమలోనికి చేరిపోయాడని తెలిపినది. ఇట్లు
అనేక దేవాలయములలోని దేవతలు తమ ఆకారమును వదలి
బయటికిపోయి అనేక కార్యములను చేసి తిరిగి తమ శరీరములలోనికి
చేరుచున్నారు. ఇదంతా దేవతల విషయము తెలియని వారికి ఏమీ
తెలియదు. మేము అనేకమార్లు దేవతలతో మాట్లాడి వారి జీవిత విశేషము
లన్నీ తెలుసుకోవడము జరిగినది. అందువలన దేవతలు తమ ఆకారము
లయిన రాతిబొమ్మలను వదలి బయటికి వచ్చి పోయినట్లు అనేక
ఆధారములు గలవు. మేము దేవతల జీవన విధానమును దాదాపు నలభై
(40) సంవత్సరములనుండి గమనించుచున్నాము. అందువలన దేవతల
సమస్త విషయములు మాకు బాగా తెలుసు.
దేవతలకు స్థూల అవయవములుండవు. వారికి సూక్ష్మగ్రాహిత
శక్తులే ఎక్కువ ఉండును. ఉదాహరణకు దేవతలకు స్థూలమైన చెవులు
మనవలె ఉండవు. రాతిబొమ్మలలో దేవతలుండుట వలన వారికి చెవులు
బయటికి తెలియునట్లు లేకున్ననూ వినికిడి శక్తి ఎక్కువగా ఉండును.
మనిషికున్న వినికిడి శక్తికంటే వందరెట్లు ఎక్కువ వినగలరని చెప్పవచ్చును.
మనిషికి స్థూలముగా చెవులుండుట వలన వాటికి గ్రాహితశక్తి అయిన
‘వినికిడి’ కొంతవరకేయుండును. కొంత పరిధిలోని శబ్దమును మాత్రము
మనిషి వినగలడు. అయితే స్థూల అవయవము లేనిదానివలన, ఉన్నా
అది రాతిదై యుండుట వలన, దేవతల చెవియొక్క ‘వినికిడి' అను గ్రాహిత
శక్తి ఎక్కువగా యుండుట వలన ఒక కిలోమీటరు పరిధి నుండి నాలుగు
లేక ఐదు కిలోమీటర్ల పరిధి వరకు వారు వినగలరు. అందువలన నీవు

Page 107
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
107
ఒక దేవతను నీ ఇంటివద్ద దూషించినా రెండు మూడు కిలోమీటర్ల
దూరములో యున్న దేవత వినగలదు. నీవు దూషించిన తర్వాత రెండు
మూడు రోజులకు నీవు ఆ దేవతవద్దకు పోయినప్పుడు నీవు ఇంటివద్ద
దూషించిన విషయమును ఆ దేవత చెప్పగలదు. అదే విధముగా చూపుశక్తి
కూడా ఎక్కువగా యుండుట వలన నాలుగు లేక ఐదు కిలోమీటర్ల
దూరములో యున్న దృశ్యమును కూడా దేవతలు చూడగలరు. ఈ విధముగా
మనుషులకు దేవతలకు ఎన్నో రెట్లు గ్రాహిత శక్తిలో తేడాయుండుట వలన
విశేషమైన శక్తిగలవని దేవతలను విగ్రహములని చెప్పడము జరిగినది.
విగ్రహము అనునది వారికున్న గ్రాహితశక్తికి గల మారుపేరని తెలియవలెను.
మనుషులకంటే దేవతలు ఎన్నోరెట్లు ఎన్నో విషయములందు
అధికులుగా యున్నారు. అందువలన మనుషులకంటే దేవతలు గొప్పవారు
అను పేరు వారికి వచ్చినది. ఒక మనిషి మరొక మనిషి ముఖమును
చూచినప్పుడు అతని ముఖ వర్చస్సునుబట్టి, ముఖ కదలికలనుబట్టి అతను
ఏమి ఆలోచిస్తున్నాడో చెప్పగలడు. మనుషులలో బాగా తెలివైనవారు,
గ్రహింపుశక్తి ఎక్కువయున్నవారు ఎదుటి వ్యక్తిలోని ఆలోచనా భావమును
గ్రహించగలరు. ఇది వాస్తవమే ఎందుకనగా! కొందరు చూస్తూనే మనము
ఏమి అనుకొనేది చెప్పగల స్థోమత గలవారున్నారు. అయితే దేవతలలో
ఈ విషయములో మరీ ఎక్కువ గ్రాహితశక్తి గలవారున్నారని తెలియుచున్నది.
ఒక మనిషి తాను తన తలలో అనుకొను విషయమును ముఖమును చూచి
చెప్పగల దేవతలున్నట్లు తెలిసినది. ప్రత్యక్షముగా జరిగిన సంఘటనను
చూస్తే ఆ విషయము సత్యమని తెలియగలదు. ఒక ఊరిలో ఒక దేవత
ఒక మనిషి మీదికి పూనకము వచ్చి ఒక గంటసేపు మాట్లాడడము
వారమునకు ఒకమారు జరిగెడిది. ఆ సమయములో ప్రజలు ఆ దేవత

Page 108
108
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
దగ్గరకుపోయి తమ ప్రపంచ సంబంధ కోర్కెలను అడిగెడివారు. అప్పుడు
ఆ దేవత వారికి తనకు తెలిసిన విషయము చెప్పెడిది. ఒక దినము
వంద కిలోమీటర్ల దూరమునుండి చిన్నపల్లె అనే ఊరినుండి ఒక వ్యక్తి తన
ఇంటిలోనుండి పారిపోయిన ఆవును గురించి అడుగవలెనని వచ్చి
యున్నాడు. అప్పుడు దేవత పూనకము వచ్చిన తర్వాత కొద్దిసేపటికి
అక్కడ చేరిన దాదాపు యాభైమంది జనములో "చిన్నపల్లెనుండి ఆవును
గురించి అడుగవలెనని వచ్చిన గుర్రప్ప, నీవు ముందుకు వచ్చి కూర్చోమని”
చెప్పడము జరిగినది. అంతవరకు వచ్చిన మనిషి ఎవరితోనూ మాట్లాడనూ
లేదు, తన పేరు, తన ఊరు, తాను వచ్చిన పని అక్కడ ఎవరికీ తెలియదు.
అటువంటప్పుడు ఆ దేవతకు తన విషయము ఎలా తెలిసింది? అను
ప్రశ్న అతనికి వచ్చినది. అప్పుడు ఆ దేవత గొప్ప మహత్యముగల
దేవతయని అందువలన ఆ దేవతకు తన విషయమంతా తెలిసిపోయినదని
అనుకొన్నాడు. అతను అనుకొన్న మహత్యము ఆ దేవతవద్ద లేకున్నా,
అతను అట్లు ఊహించుకోవడము జరిగినది. దేవతల విషయములో ఇదే
విధముగా చాలామంది మోసపోవుచుందురు.
వాస్తవముగా అక్కడ జరిగిన విషయము అతనికి తెలియదు.
మనుషులకంటే దేవతలకు గ్రాహితశక్తి అన్ని విధములా ఎక్కువయుండునను
విషయము మనుషులకు తెలియకపోవడము వలన దేవతలకు గొప్ప
మహత్యములున్నవని మనుషులు అనుకోవడము జరుగుచున్నది. అక్కడున్న
దేవతకు ఇంద్రియ గ్రాహితశక్తి ఎక్కువగాయుండుట వలన మనిషి
ముఖమును చూస్తూనే, ఆ చూపు మనిషి తలలో మెదడునందు మెదులు
ఆలోచనలను సహితము చూడగలదు. అప్పుడు ఆ దేవత అతని మెదడులో
కనిపించిన అతని ఉద్దేశ్యమును తెలుసుకోగలుగును. అతను ఆవును

Page 109
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
109
గురించిన చింత అతని తలలో ఉండుట వలన ఆ దేవత అతని ప్రశ్నను
సులభముగా గ్రహించగలిగింది. అందువలన "ఆవును గురించి అడిగే
దానికి వచ్చిన గుర్రప్ప” అని పిలువడము జరిగినది. గుర్రప్ప అను తన
పేరును గ్రహించి దేవత తనను పేరుతో పిలుస్తుందని ఆ మనిషి
అనుకోవడము వలన అతని మెదడులోనే అతని పేరు గుర్రప్పయని ఆ
దేవతకు తెలిసి పోయినది. ఈ విధముగా ప్రస్తుత సమయములో ఆలోచన
రూపములో యున్న సమాచారమును దేవతలు గ్రహించుశక్తిగలవై ఉన్నవని
తెలియని మనిషి దేవతలకు మహత్యములను ఆపాదించుచున్నాడు. ఇట్లు
దేవతలను మనుషులు తమకంటే గొప్పవారుగా చెప్పుకొను అవకాశము
ఏర్పడినది. దానితో కొందరు సమాజములోని ముఖ్యమైన మనుషులు
దేవతలకు పూజలు చేయడము, నైవేద్యములను సమర్పించడము వలన
దేవతలు పూజ్యులుగా మారిపోయారు. దేవతలను గొప్పగా భావించిన
మనుషులు తమ కోర్కెలను దేవతలు తీర్చగలరని నమ్ముచున్నారు.
భూమిమీద మనుషులు ఆశల చేత నిండినవారై, ఎన్నో కోర్కెలను దేవతలను
కోరుచూ దేవతలకు గుడులు కట్టించి నిత్యము మ్రొక్కుచున్నారు. ఈ
విధముగా దేవతలు భూమిమీద నిత్యపూజ్యులుగా మారిపోయారు. కోర్కెలు
నెరవేరే దానినిబట్టి దేవతలను చిన్న పెద్ద దేవతలుగా మనుషులే
విభజించారు. ప్రతి మనిషి ఏదో ఒక కోర్కె నిమిత్తము ఏదో ఒక దేవతను
నిత్యము మ్రొక్కుచుండుట వలన, క్రొత్తగా పుట్టి వచ్చువారు కూడా తమ
పెద్దలు ఏమి చేయుచున్నారో దానినే విచక్షణ లేకుండా చేయుచున్నారు.
అలా పెద్దవారిని చూచి చిన్నవారు వారి దారిలో పోవడము వలన అసలయిన
దేవున్ని, ప్రపంచమునంతటినీ సృష్టించిన దేవున్ని మరచిపోయి ఎల్లప్పుడూ
దేవతల జ్ఞాపకము లోనే మనుషులున్నారు. మనుషుల దృష్టిలో అందరికంటే
పెద్ద దేవుడు అను విషయమే తెలియకుండా పోయినది.

Page 110
110
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
వారి ప్రశ్న :- మీరు చెప్పిన విషయములో దేవతలకు (విగ్రహములకు) గల
విశేషత తెలిసిపోయినది. గ్రహములకు లేని ఇంద్రియశక్తి విగ్రహములకున్నదని
అర్థమయినది. మనిషి చనిపోతే అతను కూడా స్థూల శరీరమును కోల్పోవును
కదా! అప్పుడు మనిషికి సూక్ష్మశరీరముండును కదా! స్థూల అవయవములు
లేని సూక్ష్మ ఇంద్రియములకు గ్రహింపుశక్తి ఎక్కువ వుండునని మీరన్నట్లు మనిషి
అనగా చనిపోతే గ్రహముగా యున్నవాడు దైయ్యముగా మారిపోతే అప్పుడు
అతనికి విగ్రహమునకున్నట్లే ఇంద్రియ శక్తుల గ్రహిత స్థోమత ఎక్కువగా
యుండునా! అని కొందరికి అనుమానము గలదు. ఈ విషయములో
మీరేమంటారు?
మా జవాబు :- మనిషి బ్రతికియున్నప్పుడు గ్రహముగానే చెప్పబడును.
అప్పుడు స్థూల శరీరముండుట వలన అతని ఇంద్రియ శక్తులు
మనుషులందరికీ ఉన్నట్లేయుండును. అయితే మనిషి అకాల మృత్యువుతో
చనిపోతే, అతడు స్థూల శరీరమును వదలి సూక్ష్మ శరీరముతో గడుప
వలసివచ్చును. అప్పుడు అతనిని 'గ్రహ' అని అనకుండా 'దైయ్యము'
అని అంటున్నాము. దెయ్యము దేవతకంటే అన్నిటియందు చిన్నదేయగును.
అట్లే గ్రాహితశక్తిలోనూ చిన్నదేయగును. అయితే మనిషి బ్రతికియున్నప్పుడు
ఇంద్రియములకున్న శక్తులకంటే, దెయ్యముగా ఉన్నప్పుడు కొంత ఎక్కువ
ప్రభావము కల్గియుండును. అందువలన దైయ్యములు కూడా కొంత
దూరములోయున్న శబ్దములను వినగల్గుచున్నవి. అలాగే చూడగలుగు
చున్నవి. మనిషి బ్రతికియున్నప్పుడు ఉన్న చూపుకంటే దెయ్యముగా
మారినప్పుడు చూపు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగాయుండును. అలాగే
చెవియొక్క వినికిడి శక్తి కూడా గ్రహముకంటే దైయ్యముగా మారినప్పుడు

Page 111
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
111
దాదాపు నాలుగురెట్లు ఎక్కువగా ఉండును. ఒక ప్రత్యక్ష సంఘటన ద్వారా
ఆ విషయము కొంత నిరూపణకు వచ్చినది. ఒక ఊరిలో రాత్రిపూట
దాదాపు 150 గజాల దూరములోగల ఇంటిలో దొంగతనము జరుగు
చుండగా, ఆ దృశ్యమును 150 గజాల దూరమునుండి చూచిన దైయ్యము
అక్కడేయున్న మనిషిలోనికి చేరి మిగతా వారందరినీ లేపి, ఫలానా ఇంటిలో
దొంగతనము జరుగుచున్నదని చెప్పగా, దానిని విన్న వారందరూ అక్కడికి
పోయి చూచారు. అప్పుడు పూనకము వచ్చి చెప్పిన దెయ్యము మాట
నిజమేనని తెలిసిపోయినది. అక్కడ దొంగతనము జరుగుచుండగా వారు
చూచి దొంగలను తరిమివేయడము జరిగినది. ఈ సంఘటనతో
బ్రతికియున్న గ్రహముకంటే చనిపోయిన దైయ్యము ఎక్కువ శక్తిగలదని
తెలిసిపోయినది. చూపులోనూ, వినికిడిలోనే కాకుండా బలము కూడా
ఎక్కువగాయుండును.
వారి ప్రశ్న :- ఒక మనిషి బ్రతికియున్నప్పుడు దేవతలు తనకంటే గొప్పవారని
ఎంతో భక్తిగా ముడుపులు కట్టి, నైవేద్యములు పెట్టి పూజించెడివాడు. తన
జీవితములో ఒక దేవతను ఆశ్రయించి ఆ దేవతా భక్తుడనని చెప్పుకొనుచూ
జీవితాంతము పూజలు చేశాడు. అలా ఒక దేవతకు పూర్తి భక్తునిగాయున్న
అతను చనిపోవడము జరిగినది. అతని కర్మవశాత్తు అతను అకాల
మరణమును పొందాడు. అప్పుడు అతను దైయ్యముగా ఆయుష్షు అయిపోవు
వరకు జీవించ వలసి యుంటుంది. అలా జీవించునప్పుడు తాను
జీవితాంతము పూజించిన దేవతను కూడా చూడడము జరుగును. అలా
చూచినప్పుడు ఆ దైయ్యము నకు తన దేవత మీద భక్తి పెరుగునా? తరుగునా?
అంతవరకు ఎంతో పెద్ద అని గౌరవించిన దేవతను చూచినప్పుడు దెయ్యముగా
ఉన్న అతనికి ఏ మనిపించును?

Page 112
112
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
మా జవాబు :- మనిషి బ్రతికియున్నప్పుడు దేవతలను గొప్పగా తలువడము
సహజమే! అయితే మనిషి అకాలమరణము పొందిన తర్వాత అంతవరకు
గ్రహముగా యున్నవాడు దైయ్యముగా మారును కనుక అంతవరకు చూడని
దేవతలనందరినీ చూచును. అంతేకాక తన జీవితకాలములో పూజించిన
దేవతను కూడా చూచును. దెయ్యముగా యున్నవారు దాదాపు దేవతలకు
సమానముగాయుండుట వలన అప్పుడు దేవతలలో గొప్పతనము ఏమీ
కనిపించదు. ఇంతకాలము వీరినేనా మేము పూజించినదని ఆశ్చర్యము
కల్గును. ఎందుకనగా! కొందరు దేవతలు మనుషులకంటే నీచులుగా
యుండుట దైయ్యములుగా యున్నవారు చూడగలరు. అలా చూచినప్పుడు
వారి ప్రవర్తన అజ్ఞానముగా ఉండడమేకాక నీచముగా కూడా కనిపించు
చుండును. కొందరు దేవతలు గొప్ప భావములతో గొప్పగా మసలుకొను
చుండగా, కొందరు మాత్రము దానికి పూర్తి భిన్నముగా ఉందురు. మనుషుల
కున్నట్లే దేవతలకు కూడా మంచి, చెడు గుణములుండుట వలన, వారు
కూడా కర్మప్రకారమే కర్మ ఆధీనములో నడచుట వలన, కొందరు దేవతలు
మనుషులకంటే మంచిగా ప్రవర్తించగా, కొందరు దేవతలు మనుషులకంటే
నీచముగా ప్రవర్తించుచూ ‘వీరు దేవతలేనా!?' అన్నట్లుందురు. అటువంటి
దేవతలకంటే మనుషులే ఎన్నోరెట్లు మంచిగా యున్నారనిపించును.
కొన్నిచోట్ల కొందరు దేవతలు తమ ప్రవర్తనల వలన దైయ్యముల
వద్ద కూడా గౌరవము లేకుండా చేసుకొనుచున్నారు. దేవతల చెడు
ప్రవర్తనలను చూచిన దెయ్యములు కొన్నిచోట్ల దేవతలకు ఎదురు తిరిగి
మాట్లాడడము, కొన్నిచోట్ల పోట్లాడడము కూడా జరుగుచున్నది. కొన్నిచోట్ల
దైయ్యముల చేతిలో పరాభవమును పొందిన దేవతలు కూడా కలరు.
దైయ్యములుగా మారిన వారికి దేవతలవద్ద ఏ మహత్యములు లేవనీ, వారు

Page 113
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
113
కూడా తమవలె బ్రతుకుచున్నవారేనని తెలిసిపోవుచున్నది. దేవతలు కూడా
మానవజాతివలె ఒక జాతిగాయున్నారు తప్ప వారిలో ఏ జ్ఞానముగానీ, ఏ
మహత్యముగానీ లేదని తెలిసిపోవుచున్నది. కొందరు దేవతలు దేవుని
జ్ఞానము అంటే ఏమాత్రము సరిపోని వారుండగా, కొందరు ఎంతో శ్రద్ధతో
జ్ఞానమును తెలియువారు కూడా కలరు. కొందరు దేవతలు ప్రేమ, దయకల్గి
మానవుల ఎడల ఎంతో మంచిగా నడుచుకొనుచూ ఎంతో మంచిపేరు
పొందియుండగా, కొందరు దేవతలు మాత్రము చెడు గుణములతో పూర్తి
చెడుపేరును కల్గియున్నారు. మనిషి బ్రతికియున్నప్పుడు, ఎంతో దైవ
జ్ఞానమును పొందినవారు కూడా కర్మానుసారము అకాల మరణమును
పొందవలసివచ్చినప్పుడు వారు కూడా దైయ్యములుగా ఉందురు.
అటువంటి గొప్ప జ్ఞానులను చూచినప్పుడు కొందరు దేవతలు వినయ
విధేయతలు కల్గినవారై, జ్ఞానులవద్దకు వచ్చి సేవలు చేయుచూ వారి వలన
జ్ఞానమును తెలియువారు కూడా కలరు. కొందరు దేవతలు మాత్రము
జ్ఞానులంటే సరిపోనివారై జ్ఞానులకు ఏదో ఒక చెడును చేయాలని
చూచుచుందురు.
దేవతలలో కొందరు ఏదో ఒక గుడిలో దేవునిగానో, దేవతగానో
ఉండి, ఆ గుడి, గుడి ఆవరణ అంతయూ తన సామ్రాజ్యముగా తలచి, ఆ
స్థానమునకంతా నేనే పెద్దయన్నట్లు ప్రవర్తించుచుందురు. కొందరు దేవతలు
గుడిలో జన్మపొందినా, ఏ గర్వము లేకుండా వచ్చిపోయే భక్తులకు ఎటువంటి
అసౌకర్యము కలుగకుండా చూచుకొనుచుందురు. అటువంటి దేవతలు
తాము ఆ గుడికి దేవతగాయున్నా తమకు, అందరికీ దేవుడు పెద్దగా
యున్నాడని తలచుచూ జ్ఞానముమీద ఆసక్తి కల్గియుందురు. కొందరు
దేవతలు ఏదో ఒక గుడికి అధిపతిగాయున్నా, అది తమకు ఇష్టములేనివారై

Page 114
114
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఆ
దైవజ్ఞానము మీద శ్రద్ధకల్గి ఎక్కడ దైవజ్ఞానము తెలియబడుచున్నదో అక్కడికి
పోయి నెల, రెండునెలలు గడిపి తిరిగి తమ గుడికి వచ్చుచుందురు. అలా
వచ్చినవారు పదిలేక పదిహేను రోజులు అక్కడి పనులను చూచుకొని తిరిగి
జ్ఞానము తెలుసుకొను ప్రయత్నములో బయలుదేరి పోవుచుందురు.
ఒకమారు ఒక గుడిలో బొమ్మలోనికి చేరిన జీవుడు ఆ జన్మయంతయూ
ఆ బొమ్మలోనే ఉండవలెను. ఆ బొమ్మ ఆ దేవతయొక్క శరీరముగా
ఉండును. ఒక బొమ్మలో ఒక దేవత జన్మించిన తర్వాత తిరిగి ఆ దేవత
మరణమును పొందువరకు వేరే దేవత ఆ బొమ్మలో జన్మించుటకు వీలులేదు.
మనుషుల శరీరములో ఇతర దైయ్యము వచ్చి చేరునట్లు, దేవతల
శరీరములయిన రాతిబొమ్మలో వేరే దేవత చేరుటకు అవకాశములేదు.
ఒకమారు ఒక బొమ్మలో చేరిన దేవత ఎన్నిమార్లయినా ఆ రాతిబొమ్మ
నుండి బయటికి రావచ్చును లోపలికి పోవచ్చును. ఒక్కొక్కమారు ఆరు
నెలలు సహితము బొమ్మలో ఆ దేవత లేకుండా ఉండును. కొన్ని గుళ్ళలోని
దేవతలు ధనికులుగా ఉండగా, కొందరు దేవతలు తమ గుడులకు వచ్చి
కానుకలు ఇచ్చువారులేక పేదవారుగా యున్నారు.
ముఖ్యమైన విషయమేమనగా! ఆధ్యాత్మిక రంగములో మనుషులు
తక్కువగాయున్నారని మనము అనుచున్నాము. అయితే ఆధ్యాత్మిక
రంగములో మనుషులకంటే దేవతలే తక్కువగాయున్నారు. ఆధ్యాత్మికతలో
మనుషులు ఎక్కువగా ఉండడమేకాక, దేవతలకంటే ఎక్కువ జ్ఞానులుగా
యున్నారు. అంతేకాక దేవతలకంటే ఎక్కవ జ్ఞానశక్తి కలవారుగా కూడా
యున్నారు. దేవతలు ఎందరున్నా అందరిలో జ్ఞానము తెలిసిన గురువుగా
ఎవరూ లేరు. దేవతలందరూ మనుషులను ఆశ్రయించి జ్ఞానమును తెలియు
చున్నారు. అందువలన జ్ఞానము మీద ఆసక్తికల దేవతలు ఎల్లప్పుడు

Page 115
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
115
సరియైన గురువు కొరకు అన్వేషిస్తూ ఉంటారు. మనుషులు చెప్పు జ్ఞానము
సరియైనదో కాదో గుర్తించు స్థోమత దేవతలకుండును. అందువలన
వారు సరియైన జ్ఞానము కొరకు అన్వేషణ సాగించుచుందురు. మనుషుల
వలె ఏదో ఒక జ్ఞానముతో సరిపెట్టుకోరు. ఇదంతయూ మనిషిగా యున్న
వానికి తెలియకున్నా, వాడు చనిపోయిన (అకాలమరణమును పొందిన)
తర్వాత తాము పూజించిన దేవతలుండు స్థితిని చూచి ఇంతకాలము వీరినా
మేము పూజించినదని మనుషులు సిగ్గుపడుదురు.
వారి ప్రశ్న :- మీరు చెప్పిన దానినిబట్టి మానవులలో నీగ్రోజాతి వేరుగా
యున్నట్లు, దేవుని సృష్టిలో మనుషులకంటే కొంత భిన్నముగా దేవతలున్నా
వారికి కూడా కర్మానుసారము గుణములు, పాపపుణ్యములు, కష్టసుఖములు
గలవు. అంతేకాక మనుషులలో ఆడ మగ జాతులున్నట్లు దేవతలలో ఆడ మగ
జాతులు ఉన్నవని తెలియుచున్నది. దేవతా జాతిలోని ఆడవారిని దేవతలని
పిలువవచ్చును. మగజాతిని దేవుళ్ళు అని పిలవాలి. అయితే దేవతలు,
దేవుళ్ళు అని పిలువకుండా ఆ జాతినంతటినీ కలిపి దేవతలు అనడమెందుకు?
అని ప్రశ్నించుచున్నాము. దీనికి మాకర్థమగు వివరమును చెప్పండి?
మా జవాబు :- మనుషులలో నీగ్రోజాతి ప్రత్యేకముగా యున్నట్లు, దేవుడు
తన సృష్ఠిలో ప్రత్యేకమైన దేవతల జాతిని సృష్టించాడు. మనుషులలో ఆడ
మగ రెండు రకములున్నట్లే దేవతలలో కూడా స్త్రీ పురుషులున్నారు. అయితే
మనుషులను స్త్రీ పురుషులని వేరుగా పిలిచినట్లు దేవతలను స్త్రీ పురుషులుగా
విభజించి పిలువరు. విభజించి పిలిస్తే దేవతలని ఆడవారిని, దేవుళ్ళని
మగవారిని పిలువవలసి యుండును. అయితే “దేవుడు” అను పేరు ఒకే
ఒక పరమాత్మకు తప్ప ఇతరులకు ఉండుటకు వీలులేదు. దేవునితో

Page 116
116
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
సమానమైన వారు ప్రపంచములో ఎవరూ లేరు. అందువలన దేవతా
జాతిలో ఒక మగవానిని దేవుడు అని పిలువవలసి వచ్చును. ఆడ, మగ
అందరినీ కలిపి దేవుళ్ళని చెప్పినా, మగవానిని పిలుచునప్పుడు ఒక్కనిని
దేవుడని చెప్పవలసి వచ్చుట వలన అట్లు పిలుచుటకు జ్ఞానులు ఎవరూ
ఇష్టపడలేరు. దేవుడు అనగా వెదకినా తెలియనివాడు, వెతకబడేవాడు
అని చెప్పుకొన్నాము. ఆ భావమునకు దేవతాజాతిలోని ఏ పురుషుడు
సరిపోడు. అంతేకాక దైవత్వము లేనివారు ఆధ్యాత్మిక చట్టమురీత్యా స్త్రీగా
పరిగణించబడుదురు. దేవతా జాతికి జ్ఞానము లేదు. దానికి తగిన
జ్ఞానశక్తి లేదు. అందువలన ఆ జాతిలో ఆడ, మగ మొత్తము ప్రకృతి
సంబంధమైనదిగా చెప్పుచున్నాము. అందువలన దేవతా జాతిని మొత్తము
దేవతలని చెప్పుచున్నాము. దీనినిబట్టి దేవతలు, దేవుడు వేరు వేరని
భావము కల్గునని జ్ఞానులయిన వారు దేవతా జాతిని దేవతలని చెప్పడమైనది.
అయినప్పటికీ మానవుని అజ్ఞానమువలన దేవతనే దేవునికంటే గొప్పగా
తలచి, దేవున్ని వదలి దేవతలను ఆశ్రయించారు. అటువంటి అజ్ఞానము
నుండి బయటపడుటకు దేవతా జాతినంతటినీ దేవతలని అన్నారు.
వారి ప్రశ్న :- మనుషులు దేవతలను ఎందరినో మ్రొక్కుచున్నారు. దేవతలు
ఎందరో గలరు. వారికి మనుషులు భక్తులుగా ఎందరో గలరు. ఒక మనిషి
ఒక దేవతను కొన్నాళ్ళు మ్రొక్కి తర్వాత వేరే దేవతను ఆశ్రయించితే మొదట
మ్రొక్కుచున్న దేవతకు కోపమొస్తుందా? నన్ను వదలి వేరే వారిని మ్రొక్కుతావా!
అని అతని మీద కక్ష సాధింతురా? లేక ఎవరి ఇష్టము వారిదని వదలివేతురా?
మా జవాబు :- దేవతలలో కూడా జ్ఞానులు, అజ్ఞానులు ఇరువురు కలరని
చెప్పాము కదా! మనుషులు తమను వదలి వేరే దేవతలను ఆశ్రయించితే

Page 117
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
117
కొందరు ఏమాత్రము పట్టించుకోకపోయినా, కొందరు మాత్రము చాలా
కోపముగలవారై కక్షసాధింపు చేయుదురని కొన్ని సంఘటనల ద్వారా
తెలిసింది. అంతేకాదు తమకు కానుకలు ఇస్తామని మాటచెప్పి తర్వాత
కానుకలు ఇవ్వనివారి మీద కూడా కక్ష సాధిస్తారని తెలిసినది. మనుషులలో
అనేక రకముల మనుషులున్నట్లే దేవతలలో కూడా చాలా రకముల
మనస్తత్వములు గలవారున్నారు. కొందరు చాలా సౌమ్యముగాయుందురు.
కొందరు చాలా కౄరముగా ఉందురు. కొంత కాలము తమను మ్రొక్కి
తర్వాత వేరే దేవతలను ఆశ్రయించితే అంతవరకు మ్రొక్కిన దేవతకు
కోపము రావడము, ఆ కోపముతో కక్షసాధింపు చర్యగా ఎన్నో ఇబ్బందుల
పాలు చేయుదురు. కొన్ని రోగముల రూపములో మనుషులను పీడించడము
జరుగుచున్నది. తిరిగి తమను మ్రొక్కేవరకు అనేకరూపములలో ఇబ్బందులు
కలుగజేతురు. అట్లే కానుకలు ఇస్తామని చెప్పి మరచిపోయినా కొందరు
దేవతలు తమ కానుకలను ఇచ్చేంతవరకు వదలక రోగముల రూపములో
బాధించడము మేము ప్రత్యక్షముగా చాలాచోట్ల చూచాము. తమ తప్పును
తెలుసుకొన్నవారు ఎప్పుడయితే కానుకలు చెల్లిస్తారో అప్పుడే రోగములు
బాగయిపోయిన సంఘటనలను మేము చాలా చూచాము.
సంవత్సరముల క్రిందట తిరుమలలోయున్న వెంకటేశ్వరునికి, నేడు తిరుమ
లలో యున్న వెంకటేశ్వరునికి ఎంతో తేడా కలదని మేము చెప్పుచున్నాము.
నేడు గల వెంకటేశ్వరస్వామి ఎంతో సౌమ్యుడు. చెప్పిన కానుకలు ఇవ్వకున్నా
ఈయన ఏమీ పట్టించుకోడు, కక్షసాధించాలని అనుకోడు. గత నలభై
సంవత్సరముల క్రిందటయున్న వెంకటేశ్వరుడు వృద్ధాప్యమును పొంది
చనిపోయిన తర్వాత ప్రస్తుతము ఇప్పుడున్న వెంకటేశ్వరుడు తిరుమల గుడిలో
పుట్టడము జరిగినది. ఇప్పుడున్న వెంకటేశ్వరునికి దాదాపు నలభై (40)
నలభై

Page 118
118
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
సంవత్సరముల వయస్సుండవచ్చును. ఈయన ఎంతో సౌమ్యుడు,
ఉత్తముడు, ఎవరినీ ఇబ్బంది పెట్టువాడు కాదు.
గతములోయున్న వెంకటేశ్వర స్వామి దాదాపు నాలుగు వందల
చిల్లర సంవత్సరములు బ్రతుకడము జరిగినది. ఆయన కానుకలు ఇస్తామని
ఇవ్వనివారిని ఎవరినీ వదలక పీడించి మరీ వారినుండి తన కానుకలను
రాబట్టుకొన్నాడు. అప్పటి వెంకటేశ్వరున్ని చూచి అప్పటి ప్రజలు చాలా
భయము కల్గియుండేవారు. ఎప్పుడయినా వెంకటేశ్వరస్వామికి కానుక
డబ్బులను ఇస్తామని ఎవరు చెప్పిన సమయమునకు చెల్లించెడివారు. ఒకవేళ
ఎవరైనా చెల్లించడములో ఒకనెల ఆలస్యమయినా దానికి తగిన వడ్డీతో
సహా ఇచ్చెడివారు. అందువలన అప్పటికాలములో వెంకటేశ్వరున్ని
వడ్డీకాసులవాడని చెప్పెడివారు. నేను చూచినంతటిలో ఒక వ్యక్తి డబ్బులను
కానుకగా సమర్పించుకుంటానని చెప్పిన తర్వాత ఇవ్వడము మరచి
పోయాడు. ఒక సంవత్సర కాలము వెంకటేశ్వరుడు కానుక కొరకు వేచి
చూచి అప్పటికీ కూడా చెల్లించని వానికి గుండెనొప్పిని కలుగజేశాడు.
గుండెనొప్పి ఫలానా కారణము వలన వచ్చిందని మేము చెప్పిన తర్వాత
ఆ ఇంటివారు వెంటనే కానుకలు చెల్లించడము జరిగినది. అలా చెల్లించగానే
గుండెనొప్పి వెంటనే నయమైపోయినది. ఇటువంటి సంఘటనలతో
వడ్డీకాసులవాడని గతములో వెంకటేశ్వరుడు పేరు తెచ్చుకోవడము జరిగినది.
ఈ విధముగా గమనించి చూస్తే గతములో 40 సంవత్సరముల క్రిందట
యున్న వెంకటేశ్వరునికి నేడు గల వెంకటేశ్వరునికి ఎన్నోరెట్లు తేడాగలదని
చెప్పవచ్చును.

Page 119
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
119
వారి ప్రశ్న :- భూమిమీద మనుషులు చేయు తప్పులకు ఫలితముగా పాపము
వస్తున్నదని చెప్పినట్లే దేవతలు కూడా చెడు చేస్తే పాపము వస్తుంది. మంచి
చేస్తే పుణ్యము వస్తుందని మీరు చెప్పిన దానినిబట్టి తెలిసినది. మనుషులు
పాపపుణ్యములను భూమిమీదనే అనుభవిస్తున్నారని మీరే చెప్పారు. ఇప్పుడు
దేవతలు చేసుకొన్న పాపపుణ్యములను వారు ఎక్కడ అనుభవిస్తారని
అడుగుచున్నాము.
మా జవాబు :- పాపము అనుభవించుటకు యమలోకము, సుఖమును
అనుభవించుటకు స్వర్గలోకము కలదని కొందరు చెప్పినా, అవి ఎక్కడో
ఉన్నాయని అనుకోవడము పొరపాటగును. మనుషులు అనుభవించు
స్వర్గ, నరకములు రెండూ భూమిమీదనే కలవు. ఈ విషయమును గురించి
గతములో చాలామార్లు చెప్పాము. ఎక్కడ మనిషి సుఖమును అనుభవించు
చున్నాడో, అప్పుడు అక్కడ అతను స్వర్గమును పొందినట్లేనని తెలియవలెను.
అదే విధముగా మనిషి ఎక్కడ కష్టమును, బాధను అనుభవిస్తున్నాడో, అప్పుడు
అక్కడ అతను నరకమును పొందుచున్నాడని తెలియవలెను. స్వర్గ
నరకములు అనుభవించు సమయమునుబట్టి అనుభవించు ప్రాంతమునుబట్టి
అక్కడేగలవని తెలియుచున్నది. దేవతల విషయానికి వస్తే మనుషులు ఏ
విధముగా కష్టసుఖములను, నరక స్వర్గములుగా అనుభవించుచున్నారో
అదే విధముగా దేవతలు కూడా అనుభవిస్తున్నారని తెలియుచున్నది.
స్వర్గనరకములను అనుభవించడములో ఎవరికీ ఏ రాయితీలు లేవని
తెలియవలెను.
వారి ప్రశ్న:- నేడు భూమిమీద గల ముఖ్యమైన మూడు మతములలో హిందూ
సమాజములో మాత్రము దేవతలున్నారని నమ్మి వారిని ఆరాధించు వారు

Page 120
120
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
కూడా కలరు. మిగతా రెండు సమాజములలో దేవతలున్నారను విషయమునే
వారు నమ్మడము లేదు. పైగా వారు దేవతలను వారు లేనే లేరు. దేవుడు ఒక్కడు
మాత్రమే కలడని అంటున్నారు. ఈ విధముగా దేవతలున్నారని కొందరు, లేరని
కొందరు వాదిస్తున్నారు. మీరేమో దేవతలున్నారని తేల్చి చెప్పుచున్నారు.
దేవతలున్నారని నమ్మి పూజించిన వారినే కొన్ని విషయములలో దేవతలు
బాధించుచున్నారని చెప్పారు. అయితే దేవతలు లేరని చెప్పువారి జోలికి
దేవతలు ఎందుకు పోలేదు. తామున్నట్లు వారికి ఎందుకు తెలియునట్లు
చేయలేదు?
మా జవాబు :- మనుషులలో సూక్ష్మజ్ఞానము తెలియనివారు సూక్ష్మముగా
యున్న దేవతలు ఉన్నారని తెలుసుకోలేకపోయి దేవతలను వారు లేనేలేరు
అని చెప్పుచున్నారు. మనకు తెలియనంత మాత్రమున ఉన్నవారు లేకుండా
పోరు కదా! ఆకాశములో ఎన్నో శక్తులు మనుషులకు తెలియకుండా
ఉన్నవి. ఆ శక్తులు మనకు తెలియనంత మాత్రమున, వాటిని మనము
లేవు అన్నంతమాత్రమున ఆ శక్తులు తమ పనులు చేయకుండా
మానుకోలేదు కదా! మానవుల మీద అనేక రోగముల రూపములో వచ్చి
పడుచున్నవి. వాటి బాధను మనుషులు అనుభవిస్తున్నారు. మనుషులు
రోగముల బాధలను అనుభవిస్తున్నప్పటికీ, వాటిని సర్వసాధారణముగా
తీసు కొంటున్నారు తప్ప, మనము అనుభవించు రోగములు మనకు
తెలియని శక్తులు కలుగజేసినవని తెలియలేకపోయారు. అదే విధముగా
భూమిమీద మనతోపాటు సహజీవనము సాగించు దేవతలను కొందరు
గుర్తించనంత మాత్రమున దేవతలు తమ పనులను చేయుట మానుకోరు.

Page 121
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
121
దేవుడు తన జ్ఞానమును మూడు గ్రంథములలో అందించినప్పుడు
ఒక గ్రంథములో ప్రస్తావించని జ్ఞానమును మరియొక గ్రంథములో
ప్రస్తావించడము జరిగినది. ప్రథమ దైవగ్రంథములో మనిషి శరీరము
స్థూలము, సూక్ష్మము అను రెండు భాగములుగాయున్నదని తెలియజేసి
నప్పటికీ, సూక్ష్మశరీరమునే దైయ్యము అంటామని అక్కడ చెప్పలేదు. తర్వాత
ద్వితీయ దైవగ్రంథములో దెయ్యముల ప్రస్తావన వచ్చినది. చివరి దైవ
గ్రంథములో కూడా దైయ్యముల ప్రస్తావన రాలేదు. ప్రథమ దైవగ్రంథము
లోనూ, చివరి దైవగ్రంథములోనూ దెయ్యముల గురించి చెప్పనంత
మాత్రమున వాటిని మనము లేవనలేము. అవి ఉన్నాయి కావున మధ్య
దైవ గ్రంథములో చెప్పడమైనది. ఏసు జీవితములో వాటి ప్రస్తావన వచ్చినది.
దేవుడు తన గ్రంథములలో జ్ఞానమును అందిస్తూ ఒక మాటను చెప్పాడు.
“నా జ్ఞానమంతయూ సత్యసమేతముగా ఉంటుంది” అని చెప్పాడు. ఖురాన్
గ్రంథములో చాలా వాక్యములలో (ఆయత్లలో) “నా జ్ఞానము
సత్యబద్దమైనది, సత్యముతో కూడుకొనియున్నది” అని చెప్పాడు. ఖురాన్
గ్రంథములో సూరా 5, ఆయత్ 48ని చూస్తాము. (5-48) “ఓ ప్రవక్తా!
మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యముతో అవతరింపజేశాము. ఇది పూర్వ
గ్రంథాలలో మిగిలియున్న సత్యాన్ని ధృవపరుస్తుంది మరియు వాటిలోయున్న
సత్యాసత్యములను పరిష్కరిస్తుంది” అని గలదు.
సత్యము అనగా ఉన్నది, అసత్యమనగా లేనిదని అందరికీ తెలుసు.
అట్లే సత్యమనగా జరుగునది, అసత్యమనగా జరగనిది అని కూడా
చెప్పవచ్చును. ఇంకా సత్యమనగా శాస్త్రమని, అసత్యమనగా అశాస్త్రమని
కూడా చెప్పవచ్చును. దేవుడు చెప్పినదంతా సత్యమే అయినప్పుడు మనిషి
ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ప్రత్యక్షముగా జరిగి తీరునదిగా

Page 122
122
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఉండును. దేవుని జ్ఞానము ప్రత్యక్షముగా జరిగినప్పుడు ఆయన మాట
సత్యమని నిరూపించబడుతున్నది. నేడు మనుషులు తమమాటను దేవుని
మాటలలో కలిపి ఇది దేవుని జ్ఞానమే అని నమ్మబలుకుచున్నారు. అప్పుడు
ఏది దేవుని జ్ఞానమని తెలియుటకు జరిగితీరునది దేవుని జ్ఞానమనీ,
జరుగనిది దేవుని జ్ఞానము కాదని తెలిసిపోవుచున్నది. ఏది నిజమైన
జ్ఞానము అని తెలియుటకు ఇది నిజమైన జ్ఞానమని తెలియుటకు
ప్రత్యక్షముగా జరుగునదేనని తెలియవలెను. అదే విధముగా కొన్ని
సమాజముల వారు దేవతల జాతీయున్నదని చెప్పుచుండగా, మరికొన్ని
సమాజములవారు దేవతలే లేరు అని అంటున్నారు. ఎవరు ఏమనినా
దేవతాజాతి మానవుల మీద పెత్తనము చెలాయించుటకు, మానవులను
దేవుని మార్గమునుండి తప్పించి తమ మార్గములోనికి లాగుకొనుటకు
తయారయి ఉన్నారు. దేవుడే ఆ విధముగా ఉండునట్లు దేవతలను
సృష్టించాడు. దేవతలు భూమిమీద ఉండుట వాస్తవమే అయినా, మనుషుల
బుద్ధి గ్రాహితశక్తిని బట్టి దేవతలను ఉన్నారని కొందరు, లేరని కొందరు
చెప్పుచున్నారు. దేవుడు ఏ ఉద్దేశ్యముతో దేవతలను తయారు చేశాడో, ఆ
ఉద్దేశ్యము ప్రకారమే దేవతలు నడుచుకొనుచున్నారు. దేవుని భావమును
అనుసరించి మనుషుల మీద వారి పెత్తనమును చెలాయిస్తున్నారు. మనకు
తెలిసినా తెలియకపోయినా దేవతలనుండి కొన్ని కష్టాలను మనుషులు
అనుభవిస్తున్నారు. ఒక రౌడీ పదిమంది మనుషులను పీడించినట్లు కొందరు
దేవతలు ఎంతోమందిని, ఎన్నో విధములుగా బాధించుచున్నారు. మనుషులు
అనుభవించు కొన్ని బాధలు దేవతల వలన వచ్చినవని చాలామందికి
తెలియదు. దేవతలు లేరు అనువారు కూడా దేవతలతో ఇబ్బంది
పడుచున్నారు.

Page 123
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
123
బయట ప్రపంచములో ఇతర మనుషులైన దుర్మార్గులనుండి
చాలామంది పీడింపబడినట్లు, ఇతర దుర్మార్గపు దేవతలనుండి దేవతలు
లేరు అను వారుకూడా బాధపడుచున్నారు. బయట మనుషులయిన
దుర్మార్గులు కనిపించుచుండుట వలన వారి వలన మేము ఇబ్బంది
పడుచున్నామని బయటికి చెప్పుకొనుచున్నాము. అయితే కనపడని రౌడీ
దేవతల వలన ఇబ్బందిపడువారు ఎవరిమీదా ఆరోపణ చేయలేరు కదా!
ఇబ్బంది పెట్టువారు కనపడనప్పుడు ఫలానా వారివలన నేను కష్టపడుచున్నా
నని కష్టాలు పొందువానికే తెలియదు. అందువలన దేవతలను గురించి
కొందరు ఏమీ చెప్పలేకపోవుచున్నారు. కొందరు దేవతలే లేరని
చెప్పుచున్నారు. భూమిమీద దేవతలు లేరు అనువారు కూడా దేవతల
వలన అనేక రోగములను పొందుచున్నారు. వారివలన కొన్నిచోట్ల ఎన్నో
బాధలను అనుభవించుచున్నారు. దేవతలు కొందరు మనుషుల యెడల
దయా దాక్షిణ్యము లేకుండా ప్రవర్తించుచున్నారు. తమ పనులకొరకు
మనుషులను బలిపశువులను చేయుచున్నారు. దేవతలు మనుషుల ఎడల
అనుచితముగా ప్రవర్తించి, మనుషులకు హాని కలిగించినందుకు కొన్ని
సందర్భములలో మేము దేవతలను దండించడము జరిగినది. మనుషుల
వలె ప్రవర్తించి పాపములను మూటకట్టుకోవద్దని హెచ్చరించి చెప్పడము
జరిగినది. అప్పుడు కొందరు దేవతలు మా మాటను విని, వారి ప్రవర్తనను
మార్చుకొన్నవారు కూడా కలరు.
వారి ప్రశ్న :- దేవతలలో ఎందరో అక్రమముగా సంచరించువారు,
దుర్మార్గులుగా, రౌడీలుగా యున్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టునప్పుడు
వారికంటే తక్కువ జాతియైన దైయ్యములు కూడా కొన్ని అదే విధముగా
దుర్మార్గముగా ఉండునని అర్థమగుచున్నది. భూమిమీద కొన్ని సమాజముల

Page 124
124
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
వారు దేవతలు లేరు, దెయ్యములు లేవని చెప్పుచుందురు. వాటి ప్రస్తావన
ఎక్కడా వారి మాటలలో ఉండదు. అటువంటి వారిలో కూడా కొందరు
దైయ్యాలున్నాయని వాటివలన కొన్ని పీడలు, బాధలు కల్గుచున్నవని చెప్పుచూ,
వాటి నివారణకు తాయెత్తులు కట్టుచూ కొంత డబ్బును సంపాదించుకొను
వారు కూడా కలరు. ముస్లీమ్లు దైయ్యములను, దేవతలను నమ్మకున్నా, అవి
లేవు అని చెప్పుచున్నా కొందరు ముస్లీమ్లు దైయ్యములకు మంత్రాలు
చెప్పుచూ, తాయెత్తులు కట్టువారు కలరు. దీనినిబట్టి ముస్లీమ్లు దేవతలను
దైయ్యములను ఉన్నాయని నమ్ముచున్నట్లా? నమ్మనట్లా? ఎలా లెక్కించు
కోవాలి?
మా జవాబు :- ముస్లీమ్లు మేము జ్ఞానులము అని అనువారంతా దేవతలను
దైయ్యములను లేవు అంటున్నారు. జ్ఞానము తెలియని వారు వీటిని
గురించి ఏమీ మాట్లాడడము లేదు. అయితే కొందరు అరుదుగా దైయ్యము
లకు తాయెత్తులు కట్టడము చేయుచున్నారు. దేవుని సృష్ఠి కొందరికి
అర్థమయి వుండవచ్చును, కొందరికి అర్థముకాకపోయి ఉండవచ్చును.
అర్థము కాకపోయినా వారు కనిపించే స్థూలమునే నమ్ముచూ కనిపించని
సూక్ష్మమును లేదంటున్నారు. సూక్ష్మము ఉన్నది లేనిది మనుషుల నిర్ణయము
మీద ఆధారపడి లేదుగానీ, దేవుని సృష్ఠిమీద, దేవుని జ్ఞానముమీద
ఆధారపడియున్నది. ఎన్నో సత్య సంఘటనలలో దేవతలు, దైయ్యములు
ఇరువురు కలరని తెలిసి పోయినది. దేవతలు మనుషుల ఎడల
దౌర్జన్యముగా, దుర్మార్గముగా ప్రవర్తించుచున్నారని తెలియుచున్నది.
దానివెనుక కారణము కర్మే అయినా, బయటికి దేవతలు ఆచరణలో
మనుషుల మీద పెత్తనము చెలాయిస్తూ, మనుషులను పీడించి వేధించు
చున్నారు. దేవతలను చూచిన దైయ్యములు మేము మీకంటే ఏమి తక్కువ

Page 125
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
125
అన్నట్లు ప్రవర్తించుచూ, దేవతలవలె వీరు కూడా మనుషుల మీద
దౌర్జన్యముగా ప్రవర్తించుచున్నారు. దేవతలు, దైయ్యములు లేవు అనువారిని
గానీ, ఉన్నాయను వారినిగానీ ఎవరినీ వారు వదలడము లేదు. దేవతలు,
దైయ్యములు లేవు అనువారిని కాస్త ఎక్కువగానే వేధించుచున్నారని
తెలియుచున్నది.
నేడు భూమిమీద రోగముల రూపములో యున్నవన్నీ కనిపించని
సూక్ష్మముల వల్లనే వచ్చునవిగా యున్నా, వాటిలో ఖగోళములోని భూతముల
వలన, గ్రహముల వలన కొన్ని రోగములు కలుగుచున్నా, కొన్ని రోగములు
మాత్రము భూమిమీద సంచరించు దేవతల వలన, దైయ్యముల వలన
కల్గుచున్నవి. మనుషులకు రోగమువలె వచ్చు పార్శ్వవాయువు లేక పక్షవాత
వాయువు అను ఒక ప్రక్క కాళ్ళు, చేతులు పడిపోవు రోగమును చాలామంది
చూచియే ఉందుము. ఆ రోగమును గురించి అడిగితే మెదడులో నాడీవ్యవస్థ
దెబ్బ తినడము వలన ఆ రోగము వస్తుందని వైద్యులు చెప్పుచున్నారు.
అయితే మెదడులో అతి భద్రముగాయున్న నాడీవ్యవస్థ ఎలా దెబ్బతినిందో
చెప్పలేకపోవు చున్నారు. ఈ రోగము వెనుక దాదాపు ఇరువదైదు (25)
శాతము ఖగోళములోని భూతములు, గ్రహములు కారణముకాగా, దాదాపు
డెబ్బయి ఐదు (75) శాతము భూగోళములోని దేవతలు, దైయ్యములు
కారణమగుచున్నవని బహుశా ఎవరికీ తెలియదనుకుంటాను. పార్శ్వ
వాయువును గురించి ఆ రోగము ఎవరివలన కల్గుచున్నదో, ఎవరివలన
ఎంత శాతము కల్గుచున్నదో 1980వ సంవత్సరములోనే చెప్పగలిగాము.
1970 నుండి మేము జరిపిన పరిశోధనలో దేవతలు, దైయ్యాల
విషయమును, భూతములు, గ్రహముల విషయమును తెలియగలిగి
1980వ సంవత్సరములోనే ఇప్పుడు చెప్పిన పార్శ్వవాయువు విషయమును
అప్పుడే చెప్పగలిగాము.

Page 126
126
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
పార్శ్వవాయువు పూర్తి సూక్ష్మముగా మనకు తెలియకుండా మనతో
పాటు భూమిమీద నివసించు దేవతల వలన, దెయ్యముల వలన 75
శాతము కల్గుచున్నదంటే ఎవరూ నమ్మలేని స్థితియైనా జరుగుచున్న సత్యము
అంతేనని చెప్పుచున్నాము. ఆ ఒక్క రోగమేకాక నేడు భయంకర
రోగములుగా, పెద్ద రోగములుగా పేరుగాంచిన ఎయిడ్స్ (H.I.V) రోగము,
క్యాన్సర్ మొదలగు రోగములు ఎన్నో భూతముల వలన గ్రహముల వలన
వచ్చునవనీ, మిగతా ఎన్నో రోగములు దేవతలు, దైయ్యముల వలన కల్గు
చున్నవని చాలామందికి తెలియదు. ఈ రోగములు పైకి క్రిముల వలన
కల్గుచున్నవని డాక్టర్లు చెప్పుచున్నా, ఆ క్రిముల వెనుక పని చేయునది
కొన్ని అగోచరశక్తులని చాలామందికి తెలియకుండా పోయినది. కలరా,
ప్లేగు, డెంగ్యూ రోగములు దేవతల వలన కల్గునవనీ, మంగు పొంగు
అను చర్మ రోగములు దైయ్యముల వలన కల్గునవని మనకు తెలియదు.
కలరా ఒక దేవతయని తెలిసిన షిరిడీ సాయిబాబా, ప్రక్కవూరిలో యున్న
కలరాను తమ ఊరిలోనికి రావద్దని ఊరిలోనికి వచ్చుదారిలో రొట్టెపిండితో
అడ్డగీత గీచినట్లు పిండిని వేయడము వలన, అక్కడవరకు వచ్చిన కలరా
అను దేవత సాయిబాబాగారు పిండితో వేసిన గీతను చూచి అంతగొప్ప
వ్యక్తి చెప్పినమాటను జవదాటడము మంచిది కాదని తలచి వెనుదిరిగి
పోయింది. ఇక ఆ ఊరిలోనికి రాలేదు. ఇది చరిత్రలో అందరికీ తెలిసిన
విషయమే. దీనినిబట్టి దేవతలు, దైయ్యములు ఎలా ప్రవర్తించుచున్నవో
తెలియగలరు.
వారి ప్రశ్న :- దేశములో ఎంతోమందిని ఇబ్బంది పెట్టి రోగములపాలు చేసిన
ఆకాశములోనున్న భూతములు, గ్రహములు భూమండలములోయున్న
దేవతలు, దైయ్యములు మనుషులలో ఒకరైన మిమ్ములను ఏమీ అనకుండా,

Page 127
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
127
ఏమీ చేయకుండా వదలి పెట్టియుండునా? అని కొందరికి ప్రశ్న వచ్చినది.
వారివలన మీరు బాధింపబడలేదా? ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దండి ఇది
మిగతా ప్రజలకేకాక మాకు కూడా వచ్చిన ప్రశ్నగాయున్నది. అందువలన
అడుగుచున్నాము.
నా జవాబు :- మంచి బుద్ధియున్నవారు మంచిగా, చెడు బుద్ధియున్నవారు
చెడుగా ప్రవర్తించుట సహజముగా జరిగేపని. కనిపించే మనుషులలో
ఎటువంటి ప్రత్యేకత లేని సాధారణ మనిషిగా నేను ఉండెడివాడిని.
గతములోని నా చరిత్రను గురించి ఏమాత్రము దాచుకోకుండా నేను “గుత్తా”
అను గ్రంథములో చెప్పియున్నాను. చిన్నవయస్సులో దేవతల దృష్ఠి, దైయ్యాల
దృష్ఠి ఎవరిమీదా అంతగా ఉండదు. అందువలన అప్పుడు వారివలన
నాకు ఏ ఇబ్బంది కలుగలేదు. నేను యుక్తవయస్సుకు వచ్చేటప్పటికి
డబ్బులేని వానికి మనుషుల మధ్యలో విలువ ఉండదని తెలిసింది. అప్పటికే
ఎంతోమంది మనుషులు మాతో అగౌరవముగా మాట్లాడడము,
బంధువులందరూ నీచముగా చూడడము జరిగెడిది. అప్పటికి స్థూల
ప్రపంచము బాగా అర్థమయినది. అయితే ఆనాడు ఏ జ్ఞానములేని నాకు
సూక్ష్మ ప్రపంచమును గురించి ఏమాత్రము తెలియదు. అటువంటి స్థితిలో
నేనున్న ఊరికి ప్రక్కనున్న పల్లెటూరి నుండి గుండెలో నొప్పియున్న ఒక
ఆడమనిషిని ఆమె అన్నగారు మరియు భర్త నేనున్న ఊరిలోని ఆసుపత్రికి
తెచ్చారు. వారు పేదవారయిన దానివలన ప్రభుత్వ ఆసుపత్రికి పోవడము
జరిగినది. అక్కడ ఒక వారము రోజులున్నా ఆ నొప్పి ఆమెకు నయము
కాలేదు. ఆమె అన్నగారు నాకు కొంత పరిచయముండుట వలన
విషయమంతా నాతో చెప్పడము జరిగినది. 1970వ సంవత్సరమునుండి
నేను వైద్యమును గురించి మనిషి ఆరోగ్యమును గురించి కొంత నా స్వయం

Page 128
128
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
పరిశోధన సాగించుచుండెడి వాడిని. అందువలన గుండెలో నొప్పియున్న
ఆమె విషయము చెప్పి వారము రోజులుగా ఆసుపత్రిలో యున్నా బాగు
కాలేదని చెప్పడముతో నేను కొంత ఆలోచించి నా పరిశోధన నిమిత్తము
ఆమెను నావద్దకు తీసుకరమ్మని చెప్పడము జరిగినది.
ఆ దినము నేను
ఆమె రోగమును నయము చేయుటకు రమ్మని చెప్పలేదు. వ్యాధిని గురించి
తెలుసుకొను నిమిత్తము మాత్రమే రమ్మని చెప్పడము జరిగినది.
ఆసుపత్రిలో ఎటూ బాగుకాలేదు, ఇక ఇంటికి పోవాలని నిర్ణయించు
కొన్నవారు, నా మాటను విని నా వద్దకు తెచ్చారు. ఆ దినము వారికి
కూడా నేను వైద్యము చేసేవాడిని కాదని తెలుసు. ఆమె అన్న నాకు
పరిచయస్థుడయిన దానివలన, వారు కూడా ఆసుపత్రి వదలి వెళ్ళాలని
అనుకొన్నదానివలన, వారి ఊరికి సాయంకాలము బస్సుయుండుట వలన
అంతవరకు మా ఇంటివద్ద యుండవచ్చునులే అనుకొని వారు రావడము
జరిగినది. అప్పుడు 1974వ సంవత్సరము అనుకుంటాను. అప్పటికి
నాకు 24 సంవత్సరముల వయస్సు వచ్చినది. అంతవరకు బాల్యములో
యున్న నేను యవ్వనములోనికి వచ్చియుండుట వలన నాలోని వ్యక్తిత్వ
వికాసము వృద్ధి అవుతుంటుంది.
వారు మా ఇంటికి వచ్చిన తర్వాత 9.30 నిమిషములకు నేను గుండె
నొప్పియున్న ఆమెను నా ముందర కూర్చోమని చెప్పి, ఆమెను నొప్పిని
గురించి తెలుసుకొనుటకు నొప్పి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, మొదట
ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉంది? అని ప్రశ్నించి ఆమె చెప్పినదంతా
వింటూ, ఒకమారు నీ నొప్పి ఎక్కడుందో చెప్పమని అడిగాను. అప్పుడు
ఆమె బాగా గమనించి, ఇంతవరకు యున్న నొప్పి మీరు ఎక్కడుందో
చెప్పు అంటూనే లేకుండా పోయినదని చెప్పింది. ఆ మాట వినిన అక్కడున్న
ఆ దినము ఉదయము 9 గంటలకు

Page 129
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
129
ఐదారుమందితో సహా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒకమారు బాగా
చూచుకొని చెప్పమని అడిగాను. అప్పుడు కూడా ఆమె బాగా గమనించుకొని
ఏమీలేదని చెప్పడము జరిగినది. నా జీవితములో అదే మొదటి అనుభవము
అయినందున ఆ విషయము నాకు కూడా అర్థముకాలేదు. ఆమెకు
నొప్పి ఉన్నట్లుండి లేకుండా పోవడముతో ఆమె భర్తకు, అన్నకు ఇద్దరికీ
సంతోషమయింది. ఇక్కడే ఒకరోజు ఉండి రేపు పోతామని వారు అడుగగా
సరేనని నేను చెప్పి నా పని నిమిత్తము బయటికి వెళ్ళిపోయి సాయంకాలము
వచ్చాను.
సాయంకాలము ఆరుగంటల సమయములో ఆమె కొద్దిగా నొప్పితో
బాధపడుచూ ఆ విషయము మాకు చెప్పడమైనది. అప్పుడు నేను ఆమెను
నా ముందర కూర్చోమని చెప్పగా, ఆమె అలాగే కూర్చొని అంతవరకు
నన్ను ఎవరూ పిలువని “స్వామీ” అను పదమును పలుకుచూ మాట్లాడడము
జరిగినది. అప్పుడు మాట్లాడు ఆమె ఒక దేవతయని వారు చాలాకాలము
నుండి ఆ దేవతను ఆరాధించెడివారనీ, ప్రతి సంవత్సరము పూజలు
చేసేడివారనీ, అయితే ఇప్పుడు ఆమెను పూజించడము మానివేశారనీ, ఆ
దేవత బదులు ఇంకొక దేవతను ఆరాధించుచున్నారనీ, అందువలన
వారిమీద కోపముతో ఆమెకు గుండెలో నొప్పి వచ్చునట్లు చేశాననీ, ఇప్పటికి
మూడుచోట్ల ముగ్గురు వైద్యులతో చూపించినా ఎక్కడా నొప్పిపోలేదనీ ఇక్కడ
మీ ముందరికి రావడముతోనే నేను భయపడి లోపల వణికిపోతూ
ఉంటిననీ, చివరిగా మీరు నీ నొప్పి ఎక్కడ ఉందో చెప్పమన్నప్పుడు ఆమెను
నొప్పించకుండా వదలివేశాననీ, అందువలన ఆమెకు నొప్పి అప్పుడు
ఏమాత్రము లేకుండా పోయినదని చెప్పింది. అప్పుడు నేను ఈ విధముగా
అనేక ప్రశ్నలనడిగి సూక్ష్మలోకము యొక్క వివరమును కొంత తెలుసుకో
గలిగాను.

Page 130
130
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
నేను :- నీవు నన్ను 'స్వామీ' అని ఎందుకు పిలిచావు?
దేవత :- అంతకంటే గొప్ప పదము నాకు తెలియదు. అందువలన నాకు
తెలిసిన పదముతో గౌరవముగా పిలువాలని పిలిచాను?
నేను :- నన్ను ఎందుకు గౌరవముగా మాట్లాడవలెనని అనుకొన్నావు?
దేవత :- నేను ఎంతోమంది స్వామీజీలను, బాబాలను చూచాను.
వారందరిలో లేని వెలుగు మీలో యున్నది. అందువలన మీలోని శక్తికి
నేను మిమ్ములను చూస్తూనే భయపడిపోయాను. నేను ఎంత దేవత నయినా
మీ శక్తి ముందర నేను నిలువలేను. మీలోని వేడికి నేను తట్టు కోలేకున్నాను.
ఎక్కువసేపు మీతో మాట్లాడలేను. మీరు సెలవిస్తే నేను ఈమె నుండి
దూరముగా పోతాను. ఎప్పటికీ ఈమె దరికి కూడా రాను.
నేను :- సరే! నీవు పోవచ్చును. (అని నేను చెప్పగానే ఆమె ఒక ప్రక్కకు
వాలిపోయింది. ఒక నిమిషము తర్వాత లేచింది. లేచినది మామూలు
మనిషి అయినందున అంతవరకు అక్కడ ఏమి జరిగినది ఆమెకు తెలియ
లేదు. ఆ విషయము నాకు తెలిసి ఆమెను ప్రక్కన కూర్చోమన్నాను.)
ఈ విధముగా నా మొదటి అనుభవములోనే ఒక దేవతతో
మాట్లాడడము జరిగినది. తర్వాత సూక్ష్మలోకమును గురించి ఒక్కొక్క
విషయము నేను ఊహించుకొన్నది బయట ప్రత్యక్షముగా తెలిసిపోయెడిది.
అప్పటినుండి ఎంతోమంది దేవతలతోనూ, దెయ్యములతోనూ నేను
మాట్లాడడము జరిగినది. కొందరు గౌరవముగా మాట్లాడితే కొందరు
తలబిరుసుగా మాట్లాడినవారు కూడా కలరు. అటువంటివారు తర్వాత
క్షమాపణ అడిగిన సందర్భములు కూడా కలవు. కొందరు దేవతలు నీ
అంతు చూస్తానని నన్ను బెదిరించిన వారు కూడా కలరు. అటువంటివారు

Page 131
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
131
నా చేతిలో శిక్షార్హులైనారు. సూక్ష్మముగా కనిపించని దేవతలతోనూ,
దైయ్యములతోనూ ఎన్నోమార్లు మాట్లాడడము జరిగినది. వారి రహస్యము
లన్నీ తెలుసుకోవడము జరిగినది. నన్ను అగౌరవముగా మాట్లాడిన
దేవతలు, దైయ్యములున్నా, వారు నా వైపు తల ఎత్తి చూచిన వెంటనే
క్షమాపణ చెప్పిన వారు గలరు. బ్రతికియున్న కనిపించే మనుషులలో
నేను డబ్బులేనివాడినని విలువలేకున్నా, కనిపించని దేవతలలో గొప్ప
గౌరవముండెడిది. నా వయస్సు పెరుగుకొలది నాలోని ఆధ్యాత్మికము
పెరిగినది. నేను ఎక్కడా జ్ఞానమును నేర్వకున్నా సహజముగా నాలో
జ్ఞానము బయటికి వచ్చేది. నేను ఊహించినదే నేను 30 సంవత్సరముల
క్రితము చెప్పినదే నేడు దైవగ్రంథములలో ఉండడము వలన మూడు దైవ
గ్రంథములలోని జ్ఞానము నాకు చాలా సులభమైపోయినది. మొదటి రోజు
ఒక దేవత నన్ను 'స్వామీ' అని ఎందుకు సంబోధించినదో ఇప్పుడు నాకు
బాగా అర్థమయినది. అప్పటినుండి నాలోని వ్యక్తిత్వము పెరుగుకొలది
జ్ఞానము కూడా బయట పడుచూ వచ్చినది. వాస్తవముగా ఈ జన్మలో
నేను ఒక్క ముక్క జ్ఞానమును కూడా తెలియలేదు. అయినా నాకు మూడు
దైవగ్రంథములలోని జ్ఞానము సులభముగా కనిపించుచున్నది. ఎంత
క్లిష్టమైన వాక్యమునకైన భావము అట్లే తెలిసిపోవుచున్నది
నాలోని జ్ఞానశక్తి కనిపించునది కాదు. సూక్ష్మమైనది కావున
స్థూల మైన మనుషులకు ఏమాత్రము నా విలువ తెలియకపోయినా
సూక్ష్మమైన దేవతలకు, దెయ్యములకు సూక్ష్మమైన శక్తి కనిపించడము వలన
వారు నాలోని గొప్పతనమును గ్రహించి గౌరవముగా మాట్లాడడము
జరిగినది. అయితే మనుషులకు నా విలువ ఏమాత్రము తెలియదనియే
చెప్పవచ్చును. అందువలన నేటికినీ మనుషులు నన్ను హేళనగా, దూషణగా

Page 132
132
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
మాట్లాడుచున్నా, నన్ను గౌరవించు దేవతలు ఎందరో గలరు. ఈ
మధ్యకాలములో దాదాపు ఐదు సంవత్సరముల క్రితము బ్రహ్మముగారు
వ్రాసిన కాల జ్ఞానములో మా పేరుండడము చూచి, అందులో మా జ్ఞానము
గొప్పదని చెప్పియుండడము చూచి, కొందరు మనుషులు కొంత గౌరవము
నిచ్చుచున్నారు. అయితే మొదటినుండి దేవతలు, దైయ్యములు మమ్ములను
గౌరవించడము జరుగుచున్నది. దాదాపు పది సంవత్సరములనుండి
ఖగోళములోని గ్రహములు, భూతములు కూడా మమ్ములను గౌరవించడము
వలన, మావద్దకు వచ్చిన వారికి ఉన్న రోగములను భూతములు, గ్రహములు
వెనక్కు తీసుకోవడము జరిగినది. ఈ విధముగా ఎందరికో రోగములు
సులభముగా నయమైపోవడము వలన కొందరు మనుషులు ఇప్పుడిప్పుడు
గౌరవముగా చూస్తున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ మనుషులలో లేని విలువ
భూతముల, గ్రహముల, దేవతల, దైయ్యముల మధ్యగలదని చెప్పుచున్నాము.
అందువలన ఏ భూతము వలనగానీ, ఏ దేవత వలనగానీ నాకు ఇబ్బంది
లేదు. భూతములు, గ్రహములు, దేవతలు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు
గానీ, నన్ను దూషించిన వారినే దేవతలు, భూతములు, గ్రహములు చాలా
ఇబ్బంది పెట్టారు.
వారి ప్రశ్న :- క్షమించండి, మా దృష్టికి వచ్చిన ఇతరులు అడిగిన ప్రశ్నను మీకు
తెలుపుచూ దీనికి మీరేమంటారో తెలుసుకోగోరుచున్నాము? ఇది
ఇంటర్నెట్లో ఫేస్బుక్ నందు ఒక ముస్లీమ్ అడిగిన ప్రశ్నలను మేము
2015 సెప్టెంబర్ 19వ తేదీన చూచాము వాటినే అడుగుచున్నాము?
మా జవాబు :- ఎవరు ఏ ప్రశ్ననయినా అడుగవచ్చును. ప్రశ్న అడుగడములో
తప్పులేదుగానీ, చెప్పిన జవాబును గ్రహించుకోకపోతే ఎంతో విలువయిన

Page 133
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
133
జవాబు బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. అలా కాకుండా జవాబును
స్వీకరించండి.
వారి ప్రశ్న :- “త్రైత సిద్ధాంత ప్రచారకులు తౌరాతు భగవద్గీతగా చెప్పుకొంటూ
దేవుడు కృష్ణుని రూపములో, ఏసు రూపములో అవతరించాడని ప్రచారము
చేస్తూ, ఖురాన్లోని వాక్యములను వక్రీకరిస్తూ అరువుకు తెచ్చుకొన్న
జ్ఞానముతో, అతుకుల జ్ఞానముతో విగ్రహారాధనను బలపరుస్తూ, తాము
మూడు గ్రంథాలలోని జ్ఞానబోధను చేస్తున్నామని చెప్పుకొంటున్నారు" అని
గలదు. దీనికేమంటారు?
మా జవాబు :- దీనిని ఎవరూ ఎట్టి పరిస్థితిలోనూ ప్రశ్న అనరు. దీనిని
విమర్శ అంటారు. ఎవరు ఏమనినా మేము ఓపికతో వింటాము. ప్రపంచ
మన్నాక ఇటువంటి ఆటుపోట్లు సహజముగా ఉంటాయి. విమర్శ
చేయడములో ఒక పద్ధతంటూ ఉంటుంది. మేము చెప్పిన విషయము
ఎలా తప్పో చూపించి చెప్పితే బాగుంటుంది. అలా కాకుండా నాకు
తెలిసిందే సరియైనది, మీది తప్పు అంటే అది సద్విమర్శ క్రిందికి జమ
కట్టబడదు. అసూయతో చెప్పిన మాటలుగా లెక్కించబడుతాయి. ఏదయినా
చిల్లర మనుషులు బజారులో మాట్లాడుకొన్నట్లు కాకుండా పెద్దమనుషులు
అడిగినట్లు అడగండి. అట్లుకాకుండా అరువుకు తెచ్చుకొన్న జ్ఞానము,
అతుకుల జ్ఞానము అని మీరు అనుటకు మేము ఎక్కడినుండి అరువుకు
తెచ్చుకొన్నామో చెప్పగలరా? మేము చెప్పేది ఇంకొక చోట వుంటే అక్కడి
నుండి తెచ్చుకొన్నట్లగును. మేము చెప్పే విషయములు దైవగ్రంథము
లోనివై యుంటాయి. అక్కడలేనివేవయినా వుంటే మాతోనే ప్రారంభమయి
వుంటాయి. కాబట్టి మీరు అరువు తెచ్చుకొన్న జ్ఞానము అనినా, చదివిన

Page 134
134
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
వారు నీ మాటనే తప్పంటారు. నేను చెప్పు జ్ఞానము శాస్త్రబద్దమై
ఉన్నప్పుడు, సత్యబద్దమై ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నప్పుడు అతుకుల జ్ఞానమని
చెప్పుటకు ఆధారమేమయినా ఉన్నదా? ఇది అసూయతో చెప్పుమాట అని
అందరికీ తెలియును. దేవుడు కూడా ఈ మాటను ఒప్పుకోడు.
మేము భగవద్గీతను తౌరాత్ గ్రంథముగా చెప్పుమాట వాస్తవమే.
మా మాటను కాదనుటకు మీరు తౌరాత్ గ్రంథమేదో చూపగలరా? తౌరాత్
గ్రంథమునకు గ్రంథకర్త ఎవరో తెలియదు? అది ఏ భాషలో వ్రాశారో
తెలియదు? అది ఎంత గ్రంథమో తెలియదు? అని కొందరు ముస్లీమ్
పెద్దలు చెప్పగా విన్నాము. అలాగే వ్రాసిన వ్రాతను కూడా చూశాము.
మేము తౌరాత్ గ్రంథమును తక్కువచేసి చెప్పియుంటే బాధపడవలెను గానీ
దానిని ప్రథమ దైవగ్రంథమని గొప్పగా చెప్పునప్పుడు తప్పేముంది. మాకు
తెలిసో తెలియకో చెప్పామనుకో! మీరు తౌరాత్ గ్రంథమును తెచ్చి
చూపగలరా? అలా చూపండి! మా మాట తప్పని ఒప్పుకొంటాము.
వారి ప్రశ్న :- త్రైత సిద్ధాంత ప్రచారకుల వాస్తవ వక్రీకరణ : దివ్య ఖురాన్ 5-68
వాక్యము ఇలా ఉంది. “వారికి చెప్పు, గ్రంథముగల ప్రజలారా! మీరు తౌరాత్ను,
ఇంజీలును, మీ ప్రభువు తరపునుండి మీపై అవతరించిన దానిని (ఖుర్ఆన్ న్ను)
స్థాపించనంత వరకు మీకంటూ ఒక ప్రాతిపదిక లేనట్లే, నీ ప్రభువు తరపున
నీవద్దకు పంపబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరింత
పెంచుతుంది. కనుక నీవు ఈ తిరస్కార జనుల స్థితిపై విచారపడకు. తౌరాతు,
ఇంజీలు, ఖురాన్లోని ప్రధానమైన ఆజ్ఞ "పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో,
పూర్ణవివేకముతో నిజదేవుడు నిజ ప్రభువును ఆరాధించడము, ఆయన్ను
అమితముగా ప్రేమించడము, విగ్రహారాధన త్యజించడమును చేయవలెను"
అని కలదు.

Page 135
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
135
మా జవాబు :- “వానికి పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టితే
బాగవుతుందని” లోగడ ఒకడన్నాడట. ఎదుటివానికి పిచ్చి ముదిరిందని
చెప్పి ఊరకుంటే మిగతా వినేవారు నిజమేనేమో! అని అనుకొనెడివారు.
ఎదుటి వానికి పిచ్చి అని చెప్పేవాడు అంతటితో ఆగక, రోకలిని తలకు
చుట్టండి అని అన్నప్పుడు, ఆ మాటను విన్నవారంతా ఎదుటివానికి పిచ్చి
లేదు, చెప్పేవానికే పిచ్చి అని అందరూ చెప్పే వానిని చూచారట. ఎందుకంటే
రోకలిని తలకు ఎవరూ చుట్టరు, చుట్టలేరు. రోకలి అనునది ఏమాత్రము
వంగని గట్టి కట్టెగాయుండుట వలన అది వంగేది కాదు. అటువంటి
రోకలిని తలకు చుట్టమనువాడే నిజముగా పిచ్చివాడని అక్కడున్నవారికి
తెలిసి పోయినదట. అలాగే ఇక్కడ మాట్లాడువారు ఎదుటివారు
అజ్ఞానులనుచూ అంతటితో ఆగక, ఇంకా సంబంధములేని వాక్యములు
చెప్పడముతో, ఎదుటివాడుకాదు నిజముగా ఆమాట చెప్పువాడే అజ్ఞాని
అన్నట్లు తెలియుచున్నది. అతడు మమ్ములను వక్రీకరణ చేయువారు అని
ఊరక ఉండివుంటే బాగుండేది. అట్లు కాకుండా మిగతా వాక్యములు
చెప్పడముతో అతనిలోని ఉద్దేశ్యము సరిగాలేదని, అసూయతో కూడుకొన్నదని
తెలియుచున్నది. ఆయన చెప్పినది అంతిమ దైవగ్రంథము ఖురాన్లో
ఇలా ఉంది చూడండి. (5-68) “ఇలా చెప్పు. ఓ గ్రంథ ప్రజలారా!
మీరు తౌరాతును, ఇంజీలును మరియు మీ ప్రభువు తరపునుండి మీపై
అవతరింపజేయబడిన దానిని (ఖురాన్ గ్రంథమును) ఆచరించనంతవరకు,
మీ జీవితాలలో నెలకొల్పనంతవరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే, నీ
ప్రభువు తరపునుండి నీపై అవతరింపజేయబడినది వారిలోని తలబిరుసు
తనాన్ని, తిరస్కారవైఖరిని మరింత అధికము చేస్తుంది. కనుక ఈ తిరస్కార
జనుల గురించి దిగులు చెందకు” అని వాక్యము కలదు. ఆయన అంతటితో

Page 136
136
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఆపక తౌరాత్, ఇంజీల్, ఖురాన్లలోని ప్రధానమైన ఆజ్ఞ అని మొదలు
పెట్టాడు. "పూర్ణహృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నీ నిజ
దేవుడు, నిజ ప్రభువును ఆరాధించడము, అధికముగా ప్రేమించడము,
విగ్రహారాధన త్యజించడము" అని వ్రాశారు. అయితే ఈ వాక్యము
బైబిలు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, 22వ అధ్యాయములో 36,
37, 38, 39, 40 వాక్యములలో ఇలా కలదు చూడండి. “(36) బోధకుడా!
ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అని అడిగెను. అందుకాయన
(37) నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ
మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననునదియే (38) ఇది
ముఖ్యమైనదియు, మొదటిదియునైన ఆజ్ఞ (39) నిన్నువలె నీ పొరుగువానిని
ప్రేమించవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే (40) ఈ రెండు ఆజ్ఞలు
ధర్మశాస్త్రమంతటికినీ ప్రవక్తలకును ఆధారమైయున్నవని అతనితో చెప్పెను”.
ఇక్కడ బైబిలు మత్తయి సువార్తలోని ఐదు వాక్యములను చూస్తేగానీ
అక్కడి సమాచారము అర్థము కాదు. అటువంటి దానిని పూర్తి చెప్పక
సగము వరకు చెప్పి వదలివేయడము వలన వాక్యము విషయము అతనికి
తెలియదని తెలిసిపోవుచున్నది. ముఖ్యమైన ఆజ్ఞలు రెండు గలవు. ఈ
రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీ ఆధారమని చివరిలో చెప్పియున్నారు.
ఈ ప్రశ్నలో ఖురాన్ గ్రంథములోని (5-68) వాక్యమును కూడా సరిగా
చెప్పక అస్పష్టముగా చెప్పియున్నారు. “తౌరాతు, ఇంజీలు, ఖురాన్
గ్రంథములను స్థాపించనంతవరకు" అని వ్రాశారు.
అక్కడ "మీ
జీవితములలో ఆచరించనంతవరకు” అని ఉండవలెను. "మీకంటూ ఒక
ప్రాతిపదిక లేనట్లే” యని చెప్పారు. “ఆచరించనంతవరకు మీరు ఏ
ధర్మముపైనా లేనట్లే” అని ఉండవలెను. అనగా ఏ మతములో లేనట్లేయని

Page 137
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
137
లేకపోతే ఏ మతధర్మములో లేనట్లేయని అర్థమగుచున్నది. మీకు ఇచ్చిన
ఖురాన్ గ్రంథమును చూచి కొందరు తిరస్కారులకు తలబిరుసు తనము
ఎక్కునని, వారిని లెక్కచేయకు అని చెప్పారు. ఇదంతా ప్రత్యేకమయిన
సమాచారముకాగా, దానికి అనుబంధములేని బైబిలు వాక్యమును అక్కడ
చెప్పడము జరిగినది. దానితో నన్ను విమర్శించాలనుకొను వారే విమర్శకు
లోనైపోయారు. తిక్కపట్టిందని ఎదుటివానిని ఆరోపించునప్పుడు తెలివిగా
మాట్లాడక 'రోకలి తలకు చుట్టు' అని చెప్పి, వాని పిచ్చిని బయట పెట్టు
కొన్నాడట. అదే విధముగా అసందర్భముగా బైబిలు వాక్యము చెప్పి
అనవసరముగా బయటపడిపోయాడు. అదియూ అక్కడ చెప్పిన బైబిలు
వాక్యమును కూడా తప్పు చెప్పడమైనది. “నీ హృదయముతోనూ, నీ
పూర్ణాత్మతోనూ, నీ పూర్ణమనస్సుతోనూ” అని చెప్పవలసియుండగా, 'నీ'
అనే అక్షరమును చెప్పక వదలివేయడము వలన వాక్యములోని అర్థమే
మారిపోగలదు.
మొదట ఖురాన్ గ్రంథములోని (5-68) వాక్యమును తీసుకొని
చెప్పారు. అందులోని సారాంశము సరిగా చెప్పకనే బైబిలు వాక్యములోనికి
పోయి ముఖ్యమైన ఆజ్ఞను గురించి చెప్పడమైనది. మొదటి వాక్యములో
మూడు దైవగ్రంథములను అనగా భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలోని
జ్ఞానమును మనిషి తన జీవితములో ఆచరించకపోతే, వాడు ఏ మత
ధర్మములో లేనట్లేయని స్పష్టముగా చెప్పడమైనది. హిందువులుగా యున్న
మేము ఖురాన్ గ్రంథము దైవగ్రంథము అని ఒప్పుకుంటున్నాము.
అటువంటప్పుడు భగవద్గీతను దైవగ్రంథముగా మిగతా మతములవారు
ఒప్పుకుంటే తప్పేమి? అని అడుగుచున్నాను. తౌరాతు గ్రంథమును
భగవద్గీత అని అనుట తప్పు అని మీరు చెప్పుచున్నారు. మేము తౌరాతు

Page 138
138
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
అను పదమునకు అర్థముతో సహా చెప్పి మూడు ఆత్మల రహస్యము గల
గ్రంథమయిన 'భగవద్గీత'ను పూర్వము అరబ్బీ భాషలో 'తౌరాత్' అని చెప్పెడి
వారు. తెలుగు భాషలో మూడు అనుటను హిందీలో తీన్ అనీ, అరబ్బీ
భాషలో 'తౌరాత్' అనీ ఇప్పటికీ అనుచున్నాము. భూమిమీద గ్రంథరూపమైన
మొదటి గ్రంథము భారతదేశములోని భగవద్గీతయే. అందువలన ప్రథమ
దైవగ్రంథము భగవద్గీతయని చెప్పడమైనది. 5150 సంవత్సరముల
పూర్వము గ్రంథముగా రూపొందిన భగవద్గీతా జ్ఞానమే మిగతా బైబిలు,
ఖురాన్ గ్రంథములలో గలదు అని చెప్పుటకు ఎన్నో సాక్ష్యములు గలవు.
బైబిలు, ఖురాన్ గ్రంథములలోని జ్ఞానమే దానికి సాక్ష్యముగాయున్నది.
భగవద్గీతను తౌరాత్ గ్రంథముగా మేము చెప్పితే సంతోషించాల్సింది పోయి
విమర్శించడమేమిటి? (5-68) వాక్యములో “భగవద్గీత, బైబిలు, ఇప్పుడు
మీకు ఇచ్చిన ఖురాన్ గ్రంథములోని జ్ఞానమును అనుసరించకపోతే” అని
వుంది. దానిప్రకారమే మేము అన్ని గ్రంథములలోని జ్ఞానమును ఒప్పు
కొంటున్నాము. మీరెందుకు భగవద్గీతను ప్రక్కనపెట్టి తౌరాత్ అంటే
భగవద్గీత కాదంటున్నారని అడుగుచున్నాను. భగవద్గీత తౌరాతు ఒక్కటి
కాకపోతే తౌరాతు గ్రంథమును మీరు ఎక్కడయినా చూపగలరా? అని
అడుగుచున్నాను. మీరు ఎవరయినా చూచారా? అని అడుగుచున్నాము.
దానిని ఏ భాషలో వ్రాశారో తెలుసా? అని ప్రశ్నించుచున్నాను. చేతనయితే
చెప్పండి అని చెప్పుచున్నాము.
బైబిలు గ్రంథములోని మత్తయి సువార్త 22వ అధ్యాయములోని
37వ వచనమును కొంత చెప్పి, మిగతా విషయమును అక్కడ లేనిదానిని
చెప్పడము జరిగినది. “నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ
మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను" అని వాక్యమున్నది.

Page 139
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
139
అయితే మీరు "నీ పూర్ణ వివేకముతో నీ నిజ దేవుడు, నిజ ప్రభువును
ఆరాధించడము, అధికముగా ప్రేమించడము, విగ్రహారాధన త్యజించడము”
అని వ్రాశారు. మీరు చెప్పిన వాక్యము అక్కడ లేనేలేదు. లేని వాక్యమును
మీరు ఎందుకు వ్రాయవలసివచ్చినదో చెప్పమని మేము అడుగుచున్నాము.
మేము విగ్రహారాధకులన్నట్లు మీరు లేనిపదమును ఉపయోగించి మమ్ములను
ఆరోపణ చేయు నిమిత్తము బైబిలులో లేని పదమును వ్రాశారు. అక్కడ
విగ్రహారాధన విషయమే చెప్పలేదు. ఆ పదమునే వాడలేదు. మమ్ములను
వెక్కిరించినట్లు మేము విగ్రహారాధన చేసినట్లు మీరు చెప్పారు. నేను
విగ్రహారాధకుడననీ, దేవతలను ఆరాధిస్తాననీ ఎక్కడయినా చెప్పామా?
వ్రాశామా? మీరు చెప్పే దేవతలు, విగ్రహములు నన్నే గౌరవించుచున్నవనీ,
నా మాటే వినుచున్నవనీ నేను కొన్నిచోట్ల చెప్పడము జరిగినది. అంత
ధైర్యముగా దేవతలను గురించి చెప్పిన వారు ఎవరూ లేరు. దేవతలను
గురించి తక్కువగా వారిముందర మాట్లాడినా వారిని దేవతలు ఎన్నో
ఇబ్బందులపాలు చేశారని కూడా చెప్పాము.
మీరు అవసరములేని బైబిలులోని మత్తయి సువార్త 22వ
అధ్యాయమునందు గల వాక్యమును అసందర్భముగా వ్రాశారు. అదే
మాటను నేను తిరిగి అడుగుచున్నాను. “నీ పూర్ణ హృదయము” అని
అక్కడ చెప్పారు. హృదయమంటే ఏమిటో సరియైన అర్థము తెలుసా?
అని అడుగుచున్నాము. "నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ
పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించుము” అనునది దేవుని
ధర్మశాస్త్రములో మొదటి ఆజ్ఞగా ఉన్నట్లు బైబిలు గ్రంథములో వ్రాశారు.
రెండవ ఆజ్ఞ "నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించవలెను” అనునది.
ఈ వాక్యమును మేము కొన్ని వందలమందిని వివరమడిగాము. ఇంతవరకు

Page 140
140
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
వాటికి సరియైన వివరము చెప్పిన వారు మాకు కనిపించలేదు. రెండవ
ఆజ్ఞ అయిన వాక్యములో పొరుగువాడను విషయమే ఎవరికీ తెలియకుండా
పోయినది. మొదటి ఆజ్ఞ విషయము అగమ్యగోచరముగాయున్నది. దాని
వివరము ఎవరికీ ఇంతవరకు తెలియలేదని చెప్పుచుండగా, ఆ వాక్యముతో
మమ్ములనే ఎదురు ప్రశ్న వేయడము విచిత్రముగాయున్నది. ఈ వాక్యమునకు
శాస్త్రబద్దతతో కూడిన వివరము, మేము వ్రాయబోయే “సువార్త బైబిలు”
గ్రంథములో తెలియగలదు.
వారి ప్రశ్న :- నిజ ఆరాధ్యదైవమును వదలి 'శ్రీకృష్ణున్ని దేవుడని' నిరూపించే
పనిలో త్రైత సిద్ధాంతము వారున్నారు అని ఒక ముస్లీమ్ అంటున్నాడు, ఆ మాట
నిజమేనా?
మా జవాబు :- మేము కృష్ణున్ని దేవుడని చెప్పలేదు, భగవంతుడని
చెప్పుచున్నాము. నోరుంది ఏది మాట్లాడినా సరిపోతుందని అనుకోకూడదు.
కృష్ణుడు దేవుడని చెప్పకూడదు, భగవంతుడని చెప్పాలని చాలామార్లు
చెప్పాము. భగవంతునికి దేవునికి తేడా తెలియనప్పుడు అనవసర ఆరోపణ
చేయకూడదు. “దేవుడు దేవునిగా భూమిమీదికి రాడు” అనికూడా అనేక
మార్లు చెప్పాము. దేవునికున్న ప్రాథమిక జ్ఞానము ప్రకారము దేవుడు
ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు. అయితే దేవుడు తన జ్ఞానమును
భూమిమీద తెలియజేయుటకు దేవుడు దేవునిగా భూమిమీద పుట్టుటకు
అవకాశములేదు. అందువలన దేవుడు భగవంతుడను మారురూపుతో
పుట్టి మాట్లాడవచ్చును. అప్పుడు దేవుడు దేవునిగానే ఉంటూ భగవంతునిగా
మాట్లాడు అవకాశము గలదు. అప్పుడు భగవంతుడు మాట్లాడుట వలన
దేవుడు మాట్లాడినట్లు కాదు. దేవుని యొక్క మారురూపు భగవంతుడయిన
దానివలన, దేవుడు భగవంతునిగా తన జ్ఞానము ప్రజలకు చెప్పు అవకాశము

Page 141
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
141
గలదు. ఆ విధముగా బయటికి వచ్చిన జ్ఞానమే భగవద్గీత, బైబిలు.
ఇదంతా జ్ఞానదృష్టియున్న వారికే తెలుసునని 'పశ్యన్తి జ్ఞానచక్షుసః' అని
భగవద్గీతలో చెప్పడమైనది. జ్ఞానదృష్టి లేనివారికి ఎంత చెప్పినా అర్థము
కాదు. దేవుడే వానికి అర్థము కాకుండా చేశాడని, అటువంటి వానిని
తననుండి దూరము చేయుదునని ప్రత్యేకించి భగవద్గీతలోనూ, ఖురాన్లోనూ
దేవుడు చెప్పడమైనది.
వారి ప్రశ్న :- నిజ దైవమును ఆశ్రయించమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు.
అటువంటప్పుడు మీరు నిజ దైవమును వదలి కృష్ణున్ని ఎందుకు ఆరాధిస్తున్నారు?
మా జవాబు :- నిజ దైవమును ఆరాధించమని దేవుడు నేరుగా ఎవరితోనూ
మాట్లాడి చెప్పలేదు, కనుక కృష్ణుడు భగవద్గీతలో నిజ దైవమునే ఆరాధించ
మని చెప్పుచున్నాడు. అదే భగవద్గీతలో కొన్నిచోట్ల నేనే నిజదైవమని కూడా
చెప్పాడు, దానిని కూడా మరువకూడదు.
వారి ప్రశ్న:- దేవుడు పుట్టుకలేనివాడు, ఆకారములేనివాడు అని కలదు.
అటువంటప్పుడు పుట్టుకగల కృష్ణున్ని దేవుడని మీరు ఎలా చెప్పగలరు?
మా జవాబు :- మేము కృష్ణున్ని భగవంతుడని చెప్పుచున్నాము. తర్వాత
భగవంతుడు ఎవరను ప్రశ్నకు జవాబుగా భగవంతుడు దేవుడేయని
అంటున్నాము. నేరుగా దేవున్ని కృష్ణుడని చెప్పలేదు. శాస్త్రబద్దము ప్రకారము
మాట్లాడితే రూపము పుట్టుకలేని దేవున్ని, చెప్పనిదే ఎవరూ గుర్తించలేరు.
సరే! చెప్పుటకు ఆయన (దేవుడు) ఎవరికీ తెలియదు. అందువలన దేవుడే
చెప్పాలి. దేవునికి పుట్టుక ఆకారము లేని దానివలన చెప్పలేదు. అందువలన
మధ్యవర్తిగా భగవంతుడను పాత్రను దేవుడే పోషించి, తన విధానమును
తానే చెప్పిపోయాడు. ఒక్క దేవుడు తప్ప భగవంతుడు ఎవడూ కాలేడు,

Page 142
142
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
ఒక్క భగవంతుడు తప్ప దేవుడు ఎవడూ కాలేడు. దేవుడు ఒక్కడే,
భగవంతుడు ఒక్కడే. దేవుడు మనుషులతో భగవంతునిగా మాట్లాడగలడు.
దేవునిగా మాట్లాడలేడు. భగవంతుడు ఒక్కడే మనిషితో మాట్లాడి దేవుని
జ్ఞానమును చెప్పగలడు. భూమిమీద భగవంతుడు తప్ప మనిషి అయినవాడు
ఎవడూ దేవుని జ్ఞానమును చెప్పలేడు. భగవంతుడు మనిషి ఆకారములో
యున్నా మనిషి కాదు. మనిషి శరీరమును ధరించి పుట్టుచున్నాడు.
భగవంతుడు శరీరమును ధరించి పుట్టలేదు. దేవునికి పుట్టుకలేదు, అలాగే
భగవంతునికి పుట్టుకలేదు. భగవంతుడు మనిషివలె కనిపించినా మనిషివలె
పుట్టుచున్నాడని ఎవరయినా చెప్పగలరా? భగవంతుడు పుట్టినట్లు
శాస్త్రబద్దముగా చెప్పగలరా?
వారి ప్రశ్న :- త్రైత సిద్ధాంత ప్రచారకులు అంతిమ దిన తీర్పును నమ్మరు.
తీర్పుదినమే లేదంటున్నారు. ఖురాన్లో ఒక ఆయత్ నందు "ఓ ప్రవక్తా!
తొలిసారి పుట్టించినవాడే మలిసారి బ్రతికిస్తాడు" అని వారితో అను అంటూ
కొన్ని వందలసార్లు చెప్పడము జరిగింది అని వారు చెప్పుచున్నారు. మీరు
ఖురాన్లో చెప్పిన తీర్పు దినమును నమ్మరా?
మా జవాబు :- తీర్పు దినమును గురించి అంతిమ దైవ గ్రంథములోనే
కాకుండా ఐదువేల సంవత్సరముల క్రిందటే ప్రథమ దైవగ్రంథమయిన
భగవద్గీతలో కూడా చెప్పడము జరిగినది. మేము తీర్పు దినమును నమ్మడమే
కాదు, వివరించి కూడా చెప్పాము. అయితే తీర్పు దినమును గురించిన
సరియైన అవగాహన మీకే లేదంటున్నాను. ఎప్పుడో ప్రళయములో తీర్పు
దినమున దేవుడు చనిపోయిన వారందరినీ సమాధులనుండి లేపి తీర్పు
తీర్చును అనుటనే మేము పూర్తిగా కాదంటున్నాము. దేవుడు అలా ఎప్పుడూ
చెప్పలేదు. అక్కడ చెప్పిన ప్రళయము ప్రపంచమునకు సంబంధించినది

Page 143
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
143
కాదు, నీకు నీ శరీరమునకు సంబంధించినదని చెప్పుచున్నాము. నీకు
ప్రళయము ఏర్పడి నీ శరీరము నాశనమయిన రోజు దేవుడు నిన్ను తిరిగి
సమాధినుండి లేపునని మేము కూడా చెప్పుచున్నాము. ప్రళయము అనగా
నీ మరణము అనీ, తిరిగి లేవడము అనగా రెండవ జన్మయనీ, సమాధి
నుండి అనగా అపస్మారక స్థితినుండియనీ దేవుడు చెప్పియుండగా, మీరు
దానిని వేరు విధముగా అర్థము చేసుకోవడము జరిగినది. “దేవుడు సమాధి
స్థితి నుండి మనిషిని లేపినప్పుడు అతడు నగ్నముగా శరీరము మీద
గుడ్డలు లేకుండా లేపబడునని” ముహమ్మద్ ప్రవక్తగారు చెప్పగా, ఆయన
చిన్న భార్య ఆయిషా అనుపేరుగల ఆమె “దేవుడు తిరిగి బ్రతికించినప్పుడు,
సమాధినుండి లేపినప్పుడు గుడ్డలు లేకుండావుంటే ఆడవారమయిన మాకు
సిగ్గుచేటు కాదా, అవమానముకాదా' అని అడిగింది. అప్పుడు ముహమ్మద్
ప్రవక్త గారు సమాధానము చెప్పుచూ ఇలా అన్నాడు. "మనిషిని తిరిగి
సమాధి నుండి లేపినప్పుడు అతనికి ప్రపంచ ధ్యాసవుండదు. నేను ఆడ,
నేను మగ అను ధ్యాసలేకుండా ఉందురు” అని చెప్పాడు. అలా చెప్పడము
వలన మనిషి తల్లి గర్భమునుండి మలిసారి పుట్టినప్పుడు శిశుదశలో
ఉండును, కనుక అప్పుడు ఆడ, మగ ధ్యాస వుండదనే ప్రవక్తగారు
సెలవిచ్చారు.
అంతేకాక మనిషికి రెండవ జన్మ అనగా పునర్జన్మలు ఉన్నాయని
చెప్పుటకు ఖురాన్ గ్రంథములో ఎన్నో సాక్ష్యములు గలవు. ఖురాన్
గ్రంథములో చెప్పిన దానిని అర్థము చేసుకొను శక్తి లేనివారు, ప్రవక్త తన
భార్యకు వివరముగా చెప్పిన మాటలను విన్న తర్వాత కూడా ఇటు ప్రవక్త
మాటనుగానీ, అటు ఖురాన్ గ్రంథములో అల్లాహ్ చెప్పినమాటను గానీ
లెక్క చేయక, వారికి ఏది తెలిస్తే అదే నిజమను వారిని నేనుగానీ, ఆ

Page 144
144
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
దేవుడుగానీ ఏమీ చేయలేడు. అనగా వారిని ఎవరూ మార్చలేరు అని
అంటున్నాము. ఖురాన్ గ్రంథములో ఈ విషయమును గురించి ఎక్కడ
ఏమి చెప్పారో కొద్దిగా చూస్తాము.
(36-68) “మేము వృద్ధాప్యానికి చేరినవారిని మళ్ళీ జనన స్థితికి తీసుక
పోతాము. అయినా వాళ్ళు అర్థము చేసుకోరేమిటి?” ఇక్కడ ఈ వాక్యములో
అల్లాహ్ ఏదయినా దాచిపెట్టి చెప్పాడా? ఏదీ లేదు. మనిషి ముసలివాడయిన
తర్వాత అతనిని తిరిగి జనన స్థితికి తీసుకపోతాను అన్నాడు. అంతటా
అదే జరుగుచున్నది. వృద్ధాప్యానికి చేరిన మనిషిని దేవుడు అతని శరీరమును
మార్చి తిరిగి శిశువుగా పుట్టించుచున్నాడు ఆ మాటనే ముసలి వానిని
తిరిగి జన్మించే స్థితికి తీసుకపోతాను అని చెప్పాడు. దానిని కూడా అర్థము
చేసుకోలేక ప్రళయ కాలములో అనగా అంతా నాశనమయి పోయిన తర్వాత
దేవుడు తిరిగి లేపుతాడని చెప్పినట్లు కొందరు చెప్పుచుండగా, అది దేవునికి
సరిపోక ఈ వాక్యము చివరిలో 'అయినా వాళ్ళు అర్థము చేసుకోరేమిటి?'
అని అన్నాడు. దేవుడు అలా ప్రశ్నించిన తర్వాతయినా వెనుతిరిగి
ఆలోచించక మా ఉద్దేశ్యము సరియైనదే అనుకుంటే వాడు అక్కడే వుంటాడు.
(40-11) “మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు చావునిచ్చావు. రెండు
సార్లు బ్రతుకునిచ్చావు. ఇప్పుడు మా పాపాలను ఒప్పుకుంటున్నాము.
మరి ఇప్పుడు మేము బయటపడే మార్గము ఏదైనా ఉందా? అని విన్నవించు
కుంటున్నాము.” ఈ వాక్యములో 'రెండుమార్లు చావు, రెండుమార్లు బ్రతుకు
నిచ్చావు' అని అన్నప్పుడు ప్రళయ కాలము వరకు ఉండడము, అప్పుడు
సమాధులనుండి లేవడము అనుమాట అసత్యమని తెలిసిపోవుచున్నది.
ప్రళయ కాలము వరకు అంతిమ దినము వరకువుండి, దేవుడు సమాధుల
నుండి లేపినప్పుడు లేచినట్లయితే ఒకమారు చావు, ఒకమారు పుట్టుకయే

Page 145
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
145
అగును. దీనినిబట్టి చాలామంది ముస్లీమ్లు చెప్పుకొనుమాట అసత్యమని,
వారు తన జ్ఞానమును సరిగా అర్థము చేసుకోలేదని తెలుపుటకే ఈ
వాక్యమును దేవుడు చెప్పాడని తెలియుచున్నది. ఈ ఒక్క వాక్యమును
చూచిన తర్వాత కూడా పాతపాట పాడేవారిని దేవుడు కూడా ఏమీచేయలేడు.
వారిని గాలికి వదలివేస్తాడు. వారికి శాస్త్రబద్ధత, గ్రంథ ప్రమాణము ఏదీ
లేనిదానివలన వారి ఇష్టమొచ్చినట్లు వారు పోగలరు. ఖురాన్ గ్రంథములో
ప్రళయము, అంతిమ దినము అని కలదు. ప్రళయ దినము అంటే శరీరము
నశించిన దినమనీ, అంతిమ దినము అంటే చివరిరోజు మరణ దినమని
ఎందుకు అర్థము చేసుకోకూడదు? కొన్ని కోట్ల సంవత్సరములప్పుడు
ప్రళయము వస్తుందని ఎందుకు అనుకోవాలి?
(53-44) “నిశ్చయముగా ఆయన మరణింపజేసేవాడు మరియు
జీవితాన్ని ప్రసాదింపజేసేవాడు” ఈ వాక్యములో అల్లాహ్ అనబడు దేవుడు
మనిషికి మరణమును ఇస్తున్నాడు, మనిషి మరణించిన వెంటనే ఏమాత్రము
ఆలస్యము లేకుండా వానికి క్రొత్త జీవితమును ప్రసాదించు చున్నాడు.
ఈ విషయము మీకు బాగా అర్థము కావాలంటే మేము 1980లో వ్రాసిన
అనగా ఇప్పటికి 35 సంవత్సరముల ముందు వ్రాసిన “జనన మరణ
సిద్ధాంతము” అను గ్రంథమును చదవండి. చదివితే సులభముగా
తెలియగలదు. ఒక మనిషికి వాని శరీరములో ఏర్పడిన ప్రళయము
ద్వారా, అనగా అవయవముల నాశనము ద్వారా మరణము సంభవించు
చున్నది. మనిషి మరణించిన సెకండులోనే మరియొక శరీరమును
చేరుచున్నాడు. మరణించిన ఒక్క సెకండు వ్యవధిలోనే, వాని రెండవ
జన్మకు కావలసిన కర్మంతయూ వాడు చేసుకొన్న కర్మపత్రమునుండి
నిర్ణయింపబడుచున్నది. ఒక మనిషికి మరణమునిచ్చువాడు దేవుడే, అతనిని

Page 146
146
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
వెంటనే జన్మకు పంపి బ్రతికించువాడు దేవుడే. ఇదే విషయమునే ఖురాన్
గ్రంథములో అనేకమార్లు చెప్పియున్నా, అల్లా చెప్పిన మాటను కాదని,
తమ పెద్దలు, తమ గురువులు చెప్పిన మాటనే ముస్లీమ్లందరూ నమ్ముచూ,
అసలయిన సత్యమును అర్థము చేసుకోలేకపోవడమే కాక, అర్థము చేసుకొన్న
వారిని సహితము అజ్ఞానులని అంటున్నారు. ఎవరు అజ్ఞానులయినా
మునిగిపోయింది ఏమీ లేదుగానీ, ఒకమారు మేము తెలుసుకొన్నది
సత్యమేనా? అని వెను తిరిగి చూచుకోండి. అలా చూచుకోవడము వలన
నష్టపోయేది ఏమీ లేదు కదా! దేవుడు చెప్పినది సత్యబద్దము అయినందున
అది జరిగి తీరునదిగా ఉండును. ప్రత్యక్షముగా మనముందరే ఎందరో
మరణమును పొందుచున్నారు. ఎందరో జననమును పొందుచున్నారు.
వీరంతా ఎక్కడికి పోవుచున్నారు? ఎక్కడినుండి వస్తున్నారని మీరు ఎందుకు
ఆలోచించలేక పోవుచున్నారు? ఏది ముందు వింటే అదే నిజమనుకొను
స్వభావమును వదలిపెట్టి, ఏది సత్యమని ఆలోచించు వారికే దేవుని జ్ఞానము
అర్థము కాగలదు.
హిందూ మతములో గల దైవగ్రంథమయిన భగవద్గీతను తప్పుదారి
పట్టించుటకు భగవద్గీతకంటే ముందే వేదములు, పురాణములు,
ఉపనిషత్తులు తయారు చేయబడినాయి. అయితే మేము వాటిని కాదని
భగవద్గీతా జ్ఞానమును ఆశ్రయించుచున్నాము. అలాగే మిగతా మతములలో
దైవగ్రంథములో విశేషమైన జ్ఞానమున్నా, దానిని కాదని వారు ఇతర
గ్రంథములను ఆశ్రయించుచున్నారు. దానివలన దైవగ్రంథములోని
జ్ఞానమును తప్పుగా అర్థము చేసుకోవడము జరుగుచున్నది. ప్రశ్నవస్తే
అడుగకూడదు అనీ, చెప్పిందే వినవలెనని కొందరు ఇతర మతములలో
చెప్పుచూ, ప్రజలను జ్ఞానమువైపు పోకుండా చేయుచున్నారు. దైవగ్రంథము

Page 147
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
147
లోని వాక్యమును కూడా తమ మాటముందర వదలి వేయమంటున్నారు.
(15-29) వాక్యమునందు “నేను నా ఆత్మను ఊది పంపిన వాని ముందర
సాష్ఠాంగ నమస్కారము చేయండి” అని అల్లాహ్ చెప్పియున్నా, మత
ధర్మము ప్రకారము మనము ఎవరికీ మ్రొక్కకూడదు అని చెప్పుకోవడమును
చూస్తే మతము ముందర దేవుడు కూడా వారి లెక్కలో తక్కువవాడే అని
అనిపిస్తావుంది. దేవుని వాక్యము మత షరియత్కంటే తక్కువ అని
అర్థమగుచున్నది. ఒకప్రక్క అల్లాహ్ గొప్పవాడు అని చెప్పుచూ, మరియొక
ప్రక్క అల్లాహ్ మాటను కూడా లెక్కచేయక, మాకు మా మతమే ముఖ్య
మన్నట్లు 15-29 వాక్యమును లెక్కచేయకున్నారు. అటువంటివారు
మమ్ములను అరువుకు తెచ్చుకున్న జ్ఞానము కలవాడనుట ఎటువంటిదో,
ఎటువంటివారు ఆ మాటను అంటున్నారో ప్రజలు గ్రహిస్తున్నారు.
ఎప్పటికయినా సత్యబద్దమైన జ్ఞానము నిలువగలదు. అసూయ మాటలు
నిలువలేవు.
(53–46,47) “ప్రవహింప చేసిన వీర్య బిందువు నుండి మరొక జీవితమును
ప్రసాదించడము దేవునికే చెల్లును” అని కలదు. ఈ వాక్యము ప్రకారము
మనిషి చనిపోతే తండ్రి వీర్యము వలననే తల్లిగర్భమునుండి రెండవ జన్మ
కలుగుచున్నదని స్పష్టముగా చెప్పినట్లు తెలియుచున్నది. రెండవ జన్మ
కూడా వీర్యబిందువు ద్వారానే కలుగుచున్నదని అందరికీ అర్థమగునట్లు
దేవుడు చెప్పినా ఆ మాటను వినక, గ్రంథములో లేనిమాటను పట్టుకొని
చనిపోయిన వాడు ప్రపంచము నాశనమగు వరకు పుట్టడు అని చెప్పడమూ,
ప్రళయ కాలములో భూసమాధి నుండి లేపబడునని చెప్పడమూ, దేవుని
మాటను ధిక్కరించినట్లు కాదా! ముహమ్మద్ ప్రవక్తగారు జిబ్రయేల్ చెప్పిన
జ్ఞానమును మోసుకవచ్చి చెప్పితే, ఆయన చెప్పిన వాక్యములకు విలువ

Page 148
148
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
నివ్వకపోవడము, ఆ మాటను కాదనడము వలన ఒక్క ప్రక్క దేవున్ని
మరొక ప్రక్క ఆ విషయమును చెప్పిన ప్రవక్తను అగౌరవపరచినట్లు కాదా!
ముస్లీమ్నవారు 53వ సూరా 46, 47 వాక్యములను ఎందుకు
వ్యతిరేఖముగా చెప్పుచున్నారో వారికే తెలియాలి? రెండవ జన్మ తండ్రి
వీర్యము ద్వారానే అని చెప్పినప్పటికీ, దేవుడు ప్రళయములో లేపుతాడని
మరీ మరీ చెప్పడము విడ్డూరముగా యున్నది.
విచిత్రమేమంటే తాము తప్పుదారిలో పోవుచూ, సరియైన దారిలో
పోవువారిని మీ దారి మంచిది కాదని హేళన చేసినట్లు మేము ప్రతి
విషయమును ఎంతో వివరముగా చెప్పినా, శాస్త్రబద్దముగా చెప్పినా, దైవ
గ్రంథములలోని ఆధారమును చూపి చెప్పినా, మా మాటను తప్పు అని
చెప్పుచూ, ఏమాత్రము శాస్త్రాధారముగానీ, గ్రంథాధారముగానీ చూపకుండా
మాట్లాడుచున్నారు. పైగా వారు తప్పుదారిలో పోవుచూ, మేమే తప్పుదారిని
చూపుచున్నామని, గ్రంథములోని వాక్యములకు తప్పు అర్థమును చెప్పు
చున్నామని ఆరోపించుచున్నారు.
వారి ప్రశ్న :- బూటకపు యోగీశ్వరులు అతుకుల జ్ఞానముతో, అరువుకు
తెచ్చుకొన్న జ్ఞానముతో మాట్లాడుతారు. గతములో ఎవరూ బోధించని
జ్ఞానమును మేము బోధిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. త్రైత సిద్ధాంతాన్ని
ప్రచారము చేసేవారు ఏమంటున్నారో చూడండి. త్రైత సిద్ధాంత గ్రంథములో
“కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా యోగీశ్వరులు చెప్పారు”
దీనినిబట్టి త్రైత సిద్ధాంత ప్రచారకుల వంచకత్వము స్పష్టముగా తెలుస్తుంది.
ఒకవైపు కృష్ణుని విగ్రహాలను ప్రతిష్ఠింపజేస్తూ పూజలు చేయడము, మరోవైపు
శ్రీకృష్ణుడు చెప్పని జ్ఞానమును యోగీశ్వరులు చెప్పారు అంటూ కృష్ణున్ని

Page 149
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
149
కించపరుస్తున్నారు. వీరి ప్రచారములో చిత్తశుద్ధి లేదు అనడానికి ఇంతకంటే
మరోసాక్ష్యము అవసరమా?
మా జవాబు :- మొగుడు వదలివేసిన భార్య తిట్టేదానికి చేతకాక చివరికి
దుమ్ము ఎత్తిపోసిందట! అలాగే నన్ను విమర్శించే దానికి అలసిపోయి
చివరకు కృష్ణునికి నాకు చిచ్చు పెట్టాలని చూడడము మంచి ఉపాయమే
అయినా నీ మాటలను ఎవరూ నమ్మరు. నీవు చెప్పడములోనే నీ మాట
అసూయతో కూడుకొన్నదని అందరికీ తెలిసిపోవుచున్నది. గతములో
ఒక ఆమె నేను వల లేకుండా చేపలు పట్టుతానని గొప్పలు చెప్పి చివరకు
చీరవిప్పి చేతనయినన్ని చేపలు పట్టినా, చీర లేనిదానివలన తన మర్యాద
పోయిందని ఆమెకు తెలియలేదట. చివరకు అందరూ నవ్విపోయిన తర్వాత
తనకు చీరలేదే! అని అనుకుందట. అలాగే ఎదుటి వారిని తిరస్కరించి
మాట్లాడడమే ధ్యాసగా పెట్టుకొన్నవారు, తనమీద తాను ధ్యాసతో ఏమి
మాట్లాడుచున్నామో తెలిసి మాట్లాడడము మంచిది. లేకపోతే మాట్లాడిన
వారి మర్యాదే పోతుంది.
మీరు మమ్ములను తక్కువగా మాట్లాడబోయి, మేము చెప్పని
మాటలను చెప్పుట వలన మీలోని దుర్బుద్ధి బయట పడుచున్నది. కృష్ణున్ని
విగ్రహము అని మేము ఎప్పుడూ అనలేదు. మీరే కృష్ణున్ని మేము 'ప్రతిమ’
అంటున్నామని ప్రతిమకు విగ్రహమునకు చాలా తేడాయున్నదని
అంటున్నామని ఒకచోట చెప్పారు. ఆ మాటను మరచిపోయి ఇప్పుడు
మేము కృష్ణున్ని విగ్రహములను ప్రతిష్ఠించుచూ పూజలు చేయుచున్నట్లు
చెప్పారు. మేము కృష్ణప్రతిమలను నెలకొల్పాముగానీ, విగ్రహములను
ప్రతిష్టించలేదు. కృష్ణ ప్రతిమలను నెలకొల్పి ఆయన గొప్పతనమును
గురించి చెప్పాముకానీ మా జీవితములో కృష్ణున్ని ఇంతవరకు ఎప్పుడూ

Page 150
150
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
పూజించలేదు. ఇతరులు పూజచేయుట చూచాము. ఇతరులకు కృష్ణున్ని
పూజ చేయుటకంటే ఆయన సేవ చేయడము మంచిదని అనేకమార్లు
చెప్పాము. ఎవరి ఇష్టప్రకారము వారు పూజలు చేయవచ్చును. ఎవరినీ
చేయమని మేము ఇంతవరకు చెప్పలేదు. అట్లే చేయవద్దని కూడా చెప్పలేదు.
పూజ చేయుట దేవున్ని పొగడినట్లేయగును. అటువంటి పూజలు ఆయనకు
ఇష్టములేదు. ఆయన భూమిమీద చెప్పిన జ్ఞానమును ప్రచారము చేస్తే
ఆయన సంతోషించునని కూడా చెప్పాము. మేము ఏమి చెప్పినది, ఏమి
చేయునది ఇక్కడి ప్రజలకు తెలుసు, ఎక్కడోయున్న నీకేమి తెలియును.
ప్రతి పనికి కంటికి తెలియని ఒక ఫలితముంటుంది. నీవు
పనిగట్టుకొని మమ్ములను మాట్లాడిన మాటలన్నిటికీ పాపమో, పుణ్యమో
ఏదో ఒక ఫలితముండును. నీ విషయము నాకు తెలియకున్నా, నా
విషయము నీకు తెలియకున్నా, ఇద్దరికీ మధ్యలోయున్న దేవునికి అన్నీ
తెలుసు. నీకు దేవుడే ఏ కర్మను అంటగట్టాలో ఆ కర్మనే అంటగట్టును.
మొత్తము మీద అనవసరముగా మాట్లాడి మీరు కొంత కర్మను సంపాదించు
కొన్నట్లే. అది మంచిదో చెడుదోగానీ మొత్తము మీద కర్మను మూటగట్టు
కొన్నట్లే, వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో మా గురించి నాలుగు
వందల సంవత్సరములప్పుడే వ్రాస్తూ, నన్ను గురించి విమర్శించి మాట్లాడిన
వారికి ఏమి జరుగునో కూడా ఆనాడే చెప్పాడు. ఇంతవరకు మేము
మూడు గ్రంథముల జ్ఞానవాక్యములకు వివరమును చెప్పాము. ప్రబోధానంద
గురువు నాకు గురువే, మీకు గురువేయని చెప్పిన బ్రహ్మముగారు ఒకచోట
అన్ని మతములను ఏకము చేయువారని కూడా చెప్పాడు. నీకు తెలియక
పోతే ఇప్పటికీ భద్రముగాయున్న బ్రహ్మముగారి ఏష్యకాలజ్ఞానమును
చూస్తే తెలుస్తుంది. ఆనాడే 'ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలది’

Page 151
ప్రతిమ X విగ్రహ - దైవము × దెయ్యము
151
అని వ్రాసియుంచారు. ఆయన చెప్పినట్లే మావద్దకు హిందువులు, క్రైస్తవులు,
ముస్లీమ్లు రావడము మా జ్ఞానమును ముగ్గురు ఆశ్రయించడము, వారు
తెలుసుకొన్న జ్ఞానమును ప్రచారము చేయడము జరుగుచున్నది. ఇక్కడ
మూడు మతములవారు ఒకే తాటిమీద నడుస్తున్నారని లోకములో అందరికీ
తెలుసు. నేను జ్ఞానమును అరువుకు తెచ్చుకొన్నవాడినే అయితే నాలుగు
వందల సంవత్సరములప్పుడు బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో అదే
వ్రాసియుండేవాడు కదా! అలా వ్రాయలేదే? నన్ను మూడు మతముల
గురువుగా ఎందుకు చెప్పాడో?
చెవిటివాని ముందర శంఖము ఊదినా వానికి ఏమీ వినిపించనట్లు
అసూయా భావముతో నిండిన నీకు నా మాటలు రుచించవని, నీ బుర్రకు
ఎక్కవని తెలుసు. మీరు నన్ను ప్రశ్నించిన ప్రతీ ప్రశ్నకు, విమర్శించిన
ప్రతీ విమర్శకు మేము జవాబుగా ఒక గ్రంథమును విపులముగా వ్రాసి
ఇచ్చాము. అయినా మీరు వాటిని జ్ఞానదృష్టితో చూడకుండా, కేవలము
అసూయ గుణముతో చూస్తూ అర్థములేని విమర్శలు చేస్తున్నారు. బజారులో
ఏనుగు పోతూవుంటే వీధిలో కుక్కలు అరుస్తూ ఉంటాయి. బజారు
పెద్దది, వీధి చిన్నది. వీధి కుక్కలు బజారులోనికి రావచ్చును గానీ, బజారు
లోని ఏనుగు వీధిలోనికి పోలేదు కదా! బజారు పెద్దది కావున వీధి
కుక్కలు బజారులోనికి రావద్దని ఎవరూ చెప్పలేరు.
అయితే వీధి చిన్నది
అందువలన ఏనుగు
కావున ఏనుగును వీధిలోనికి రమ్మనినా పోలేదు.
కుక్కలను పట్టించుకోకుండా తన దారిన తాను పోవలసిందే. అదే విధముగా
కొందరు ఏ గుర్తింపులేని అనామకులు మాట్లాడు మాటలను విజ్ఞులయిన
వారు పట్టించుకోరు. అందువలన అర్థహీనముగా మాట్లాడు వారి మాటలను
మేము కూడా పట్టించుకోము. ఇకమీదట అటువంటి వారి మాటలకు
ఎటువంటి జవాబునివ్వము.

Page 152
152
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
నేను అందరివలె జ్ఞానమును నేర్చుకొన్న వానిని కాను, నా
స్వతహాగా నేను జ్ఞానమును చెప్పు వానిని. మూడు గ్రంథములలోనున్న
జ్ఞానమును నేను ఎప్పుడూ నేర్చుకోలేదు. నాలోయున్న జ్ఞానమే మూడు
గ్రంథములలో ఉన్నదని చెప్పాను. నేను ఎప్పుడో 35 సంవత్సరములప్పుడు
ఏ గ్రంథము చూడకుండా చెప్పిన జ్ఞానము ఈ మధ్యన గ్రంథములలో
కనిపించినది. అందువలన నేడు నాకు మూడు మతములలోని జ్ఞానము
సులభమైనది. నేడు ఒక మతములోయున్న వాడు, మిగతా మతములలో
యున్న ఎంతటి జ్ఞానినయినా అసూయతోనే చూస్తున్నాడు. పైకి అందరికీ
దేవుడు ఒక్కడే అంటూ, లోపల మీ దేవుడువేరు, మా దేవుడు వేరు అను
భావము కల్గియున్నారు. మూడుమతములను సమ్మతముగాయున్న నన్ను
కూడా అసూయతో చూస్తున్నారంటే, ఒక మతమును గురించి చెప్పు
వారిమీద పూర్తి అసూయను కల్గియుందురు. నా భావములో నేనెంత
గొప్పవాడినో, ఎంత చిన్నవాడినో నాకే తెలుసు. అయితే ఇతరులను నేను
జ్ఞానులుగా చేయు నిమిత్తము, ఈ ప్రపంచములో నేను కూడా కొన్ని
మాటలను మాట్లాడవలసివచ్చినది. లేకపోతే దైవజ్ఞానమనేది ఏ గుర్తింపు
లేకుండా పోగలదు. నేను చెప్పు మాటలు సాధారణముగాయున్నా
ఆలోచించువారికి ఎంతటి సారాంశమునయినా ఇవ్వగలవు.
నేడు నేను చెప్పు జ్ఞానమును చూచి, ఆలోచించు ప్రతివాడు వారికి
తెలిసిన విధానమును వదలి, అది సరియైన విధానము కాదని తెలిసి
నావైపు రావడము జరుగుచున్నది. లోకములో ఎందరో గురువులు,
మరెందరో స్వామీజీలు ఏదో ఒక ప్రచారము చేయుచుందురు. అటువంటి
ప్రచారములు ఏమీ చేయకుండా, కేవలము గ్రంథరచనల వలన మాత్రమే
మేము మా జ్ఞానమును ఇతరులకు తెల్పుచున్నాము. మా జ్ఞానమును

Page 153
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
153
చూచిన ప్రతివాడు మావైపు రావడము జరుగుచున్నది. నేను హిందూ
సమాజములో పుట్టియుండుట వలన కొందరు నన్ను హిందూ గురువుగా
లెక్కించుకొన్నా, చాలామందికి నేను ఒక మతమునకు సంబంధించిన
గురువుగా కాకుండా, మూడు మతముల గురువుగా కనిపించుచుండుట
వలన, మూడు మతముల జ్ఞానులు నావైపు వచ్చారు. వచ్చిన వారు
మూడు మతములకు సంబంధించినవారై, వారి వారి మతములలో
జ్ఞానులుగా యున్నవారే, మా జ్ఞానమును చూచి ఇది గొప్ప జ్ఞానమని
తలచి నా ప్రక్కకు వచ్చి ఇంకా కొంత జ్ఞానమును తెలియగలిగి, సంపూర్ణ
జ్ఞానులయినారు. ఏ మతములోయున్నవారు ఆ మతములోనే వుండి అన్ని
మతములకు సంబంధించిన దేవుని జ్ఞానమును ప్రచారము చేయమని
చెప్పిన నా మాట ప్రకారము, అన్ని మతములవారు వారివారి మతముల
పేరు మీదనే ప్రత్యేక సంఘములను స్థాపించి, దేవుని జ్ఞానమును ప్రచారము
చేయుచున్నారు. ఈ విధముగా హిందువులు “ఇందూ జ్ఞానవేదిక” ద్వారా,
క్రైస్తవులు “సువార్త క్రైస్తవ సంఘము” ద్వారా, ముస్లీమ్లు “ఖుదా ఇస్లామిక్
స్పిరిచ్యువల్ సొసైటీ" ద్వారా వారివారి గ్రంథములలోని జ్ఞానమును వారివారి
మతములలో తెలియజేయుచుండుట వలన నేడు అన్ని మతములలో
సంశయరహిత జ్ఞానము తెలియబడుచున్నది. ఏ మతములో సంశయమున్నా
ఆ మతమునకు సంబంధించిన సంఘము తన జ్ఞానమును అందించి
సంశయమును లేకుండా చేయుచున్నది.
విశాల దృష్ఠితో, వివేకముతో మీరే ఆలోచించండి. మేము
చేయుచున్న పని మంచిదో, కాదో చెప్పండి. నేడు మూడు మతముల
సంఘములు ఒక్క గురువు ఆధ్వర్యములో ఎక్కడయినా ఉన్నాయా? ఇక్కడ
తప్ప ఎక్కడా లేవు. మూడు మతముల సమన్వయ జ్ఞానము ఎక్కడయినా

Page 154
154
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
ఉన్నదా? ఇక్కడ తప్ప ఎక్కడా లేదు. ఒకే వేదిక మీద, ఒకే జ్ఞానమువద్ద
మూడు మతముల ప్రజలు ఎక్కడయినా కలుస్తున్నారా? ఇక్కడ తప్ప ఎక్కడా
కలువడము లేదు. ఏ మతమునకు సంబంధములేని దేవుని గుర్తును
అన్ని మతముల వారు అనుమానము లేకుండా తమ నుదిటి భాగమున
ఎక్కడయినా ధరించుచున్నారా? ఇక్కడ తప్ప ఎక్కడా ధరించడము లేదు.
పరమాత్మ అంటే మా దేవుడని క్రైస్తవులు, ముస్లీమ్లు ఎక్కడయినా
అంటున్నారా? ఇక్కడ తప్ప ఎక్కడా అనడములేదు. పరిశుద్ధాత్మయని
క్రైస్తవుల గ్రంథములోని దేవుని పేరు చెప్పితే ఆయన మా దేవుడని
హిందువులుగానీ, ముస్లీమ్లుగానీ ఎక్కడయినా అంటున్నారా? ఇక్కడ తప్ప
ఎక్కడా అనడము లేదు. అలాగే అల్లాహ్ అని ఖురాన్ గ్రంథములోని
దేవుని పేరు చెప్పితే మా దేవుడని హిందువులు, క్రైస్తవులు ఎక్కడయినా
సంతోషిస్తున్నారా? ఇక్కడ తప్ప ఎక్కడా లేదు. ప్రపంచములో అందరికీ
ఒకే దేవుడైనప్పుడు, అందరూ ఎక్కడ ఏ పేరు చెప్పినా అది ఒకే దేవుని
పేరని తెలిసినప్పుడు, మనుషులలో భేదాభిప్రాయములు ఎందుకుంటాయి.
భగవద్గీతలో చెప్పిన జ్ఞానమును చివరిలో వచ్చిన ఖురాన్ సమర్థించు
చున్నప్పుడు, దానిప్రకారము భగవద్గీతా జ్ఞానమును ముస్లీమ్లు కూడా
సమర్థించవచ్చును. అలాగే భగవద్గీత యొక్క సూత్రములే ఖురాన్లో
కనిపించినప్పుడు, హిందువులు ఖురాన్ ను సమర్థించవచ్చును కదా! అలాగే
బైబిలు గ్రంథములో అనగా నాలుగు సువార్తలలో భగవద్గీత, ఖురాన్
జ్ఞానమున్నప్పుడు హిందువులు, ముస్లీమ్లు సువార్త బైబిలును సమర్థించ
వచ్చును కదా! ఈ విధముగా మూడు మత గ్రంథములలో యున్న
సూత్రములన్నీ ఒక్కటేయని తెలియునట్లు భగవద్గీత, బైబిలు, ఖురాన్
గ్రంథములలోని జ్ఞానమును మనిషి జీవితములో ఆచరించకపోతే వాడు

Page 155
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
155
ఏ మతమునకు చెందినవాడు కాదు అని ఖురాన్లోనే (5-68) లో చెప్పి
యున్నారు. దానిని మరచిపోయి మా గ్రంథము ఒక్కటే మాకు తెలుసు,
మా మతము ఒక్కటే మాకు తెలుసు అంటే, వారు ఏ మతమునకు
సంబంధించినవారు కాదు. అలాగే ఏ గ్రంథమునకు సంబంధించినవాడు
కాదని చెప్పవచ్చును.
నాది అతుకుల జ్ఞానము, అద్దెకు తెచ్చుకొన్న జ్ఞానమయితే మీది
అతుకుల జ్ఞానము కాదనేగా అర్థము. సరే! నాది అతుకుల జ్ఞానమే,
అరువుకు తెచ్చుకొన్న జ్ఞానమే అని నీకు కనిపించియుంటే దానికి ఏ శక్తి
లేదనేగా మీరు చెప్పేది. అటువంటప్పుడు మీ వద్దగలది శక్తివంతమైన
జ్ఞానమైవుండాలి. మాటల రూపములో మీరు ఎట్లు మాట్లాడినా ఫరవాలేదు.
అది బయటికి కార్యరూపములో కనిపించాలి కదా! దేవుడు తన జ్ఞానము
సత్యమైనదని చెప్పాడు, కావున అది ప్రత్యక్షముగా కార్యరూపములో
కనిపించును. మీవద్ద మాటల రూపమున అడ్డముగా మాట్లాడు
జ్ఞానముండుట వలన అది ఎక్కడా కార్యరూపముగా కనిపించలేదే!
మమ్ములను విమర్శించు మీ మాటను ఏ దేవత అయినా గానీ, ఏ
దైయ్యమయినా గానీ వినగలిగాయా అని అడుగుచున్నాము. మీరు చెప్పినట్లు
మాది అతుకులబొంత జ్ఞానమే అయినా, మా మాటను దేవతలుగానీ,
దైయ్యములుగానీ జవదాటలేదు. మేము చెప్పినట్లు వింటున్నవి, మాకు
భయపడుచున్నవి. మా వద్ద వినయ విధేయతలతో భక్తిగాయున్నవి. దీనికి
మీరేమంటారో? దేశములో భయంకర రోగములుగా పేరుగాంచిన పెద్ద
రోగములు కూడా మా మాటను విని వారినుండి దూరముగా పోవుచున్నవి.
పాపము చేత పీడింపబడు వానిని సహితము క్షమించి రోగములు దూరముగా
పోవుచున్నవి. ఇదంతా మా మాట మీద జరిగినవంటే మాది అతుకుల

Page 156
156
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
జ్ఞానమని చెప్పవచ్చునా? మా జ్ఞానమును విని ఆచరించి ఎందరో జ్ఞానశక్తి
కలవారై వారి కర్మలను కాల్చుకోగలుగుచున్నారంటే మాది అతుకుల
జ్ఞానమని చెప్పవచ్చును. మా అతుకుల జ్ఞానమునకు ఇంత శక్తియున్నట్లు
ప్రత్యక్షముగా తెలియుచుంటే, మీ సక్రమమైన జ్ఞానమునకు ఎంతోశక్తి
ఉండును. అయితే మీ జ్ఞానమునకున్న శక్తి ఇంకా పెద్దదయి ఉండవచ్చును.
మీ జ్ఞానశక్తి వలన ప్రత్యక్షముగా ఏమి జరిగాయో చెప్పగలరా? చెప్పలేరు.
ఎందుకనగా ఏదీ మీ మాట వినదు. ఏ కర్మ మీ జ్ఞానము వలన క్షమించ
బడదు.
దేవుని జ్ఞానము ఎక్కడున్నా అది క్షమాశీలత కల్గియుంటుంది.
క్షమాశీలత లేనిది అది దేవుని జ్ఞానము కానేకాదు. 'అగ్నిలో కట్టెలు కాలి
పోయినట్లు, జ్ఞానమను అగ్నిలో కర్మలను కట్టెలు కాలిపోతాయని' భగవద్గీతలో
భగవంతుని రూపములో దేవుడే చెప్పాడు. బైబిలులో “పాపక్షమాపణ
జ్ఞానము వలన కలదని” చెప్పారు. ఖురాన్ గ్రంథములో “దేవుడు
క్షమాశీలుడు” అని చెప్పారు. దానినిబట్టి దేవునికున్న శక్తియే దేవుని
జ్ఞానమునకు ఉండునని తెలియుచున్నది. దేవుని జ్ఞానము ఎక్కడున్నా
దాని శక్తి బయటపడును. దేవుని జ్ఞానము ప్రత్యక్ష శక్తిగలదై ప్రత్యక్షముగా
యున్న కర్మలను కాల్చివేయుచుండుట వలన సత్యవాదులు ఎవరో,
అసత్యవాదులు ఎవరో ప్రత్యక్ష జ్ఞానమువద్ద బయటపడిపోవుదురు. ఎచ్చట
దైవజ్ఞానముండునో అక్కడ క్షమాశీలత అనగా కర్మ నాశనముండును.
ఎక్కడయితే దేవుని జ్ఞానము లేదో అక్కడ క్షమాశీలతయుండదు. మావద్ద
యున్న జ్ఞానము క్షమాశీలతగల శక్తిగలదైవుండగా, ఏదీ చేతకానివారు
మా జ్ఞానమును అతుకుల జ్ఞానమంటే వారిని దేవుడు బాగా గుర్తు
పెట్టుకొనును. అటువంటి వారికి క్షమించరాని పాపమును చేకూర్చును.

Page 157
ప్రతిమ × విగ్రహ - దైవము × దెయ్యము
157
ఇంతవరకు నాలుగు
ప్రస్తుత కాలములో మేము చెప్పు జ్ఞానము గొప్ప రహస్యములతో
కూడుకొన్నదై ఉన్నది. కొన్ని సందర్భములలో సరికొత్త జ్ఞానమును చెప్పి
దీనిని ఇంతవరకు ఎవరూ చెప్పని జ్ఞానమని చెప్పడము కూడా జరిగినది.
అనేక సందర్భములలో మూడు గ్రంథములలో లేని జ్ఞానమును కూడా
చెప్పడము జరిగినది. అది భూమిమీద క్రొత్తగా చెప్పబడిన దైవ జ్ఞానముగా
యుండినా, దాని మూలము మూడు దైవగ్రంథములలో ఏదో ఒక
దానియందు ఉండును. అయితే అది ఇంతవరకు అర్థముకాకపోవడము
వలన అది సరిక్రొత్త జ్ఞానముగా ఉండును.
యుగములలో తెలియని జ్ఞానము తెలియబడుచున్నదని మేము కూడా
చెప్పుచున్నాము. ఆ మాట మేము చెప్పడము వలన పైకి కనిపించు
ప్రబోధానందస్వామి చెప్పుచున్నాడని కొందరనుకోవడము జరిగినది.
అయితే ఇక్కడ అందరూ తెలియవలసినదేమనగా! నాకు తెలిసిన కొంత
జ్ఞానమును నేను చెప్పినది నిజమే. అయినా ఇంతవరకు భూమిమీద
ఎవరికీ తెలియని జ్ఞానమును నా వెనుకనయుండి నన్ను నడుపుచున్న
దేవుడే స్వయముగా చెప్పుట వలన అనేక రహస్యములు బయటపడుచున్నవి.
అందువలన ఇక్కడ చెప్పు జ్ఞానము లోకములో ఎవరూ ఎదురాడని జ్ఞానమని
మేము అనేకమార్లు చెప్పాము. మూడు గ్రంథములను ఎవరయితే చెప్పారో,
ఆ శక్తియే నా శరీరమునుండి చెప్పుచున్నదని నాకు బాగా తెలిసినది.
దేవుడు ఎప్పుడో ఒకప్పుడు అలా చెప్పు అవకాశమున్నది. ఈ గ్రంథము
ప్రారంభములోనే 'శరీరములోని దేవుడు, శరీరము బయట దేవుడు' ఇరువురు
గలరని చెప్పాము. శరీరములోని దేవుడు శరీరము బయటగల దేవున్ని
గురించి చెప్పుచున్నాడని నాకు బాగా తెలిసినది. బయటికి కనిపించు
నేను చెప్పుచున్నా, జ్ఞానమంతయూ కనిపించని వాడు చెప్పుచున్నాడని
నేను చాలామార్లు ఉపన్యాసములలో కూడా చెప్పాను.

Page 158
158
ప్రతిమ × విగ్రహ - దైవము X దెయ్యము
ఇదంతయూ గమనిస్తే గురువు గుట్టుగా ఎవరికీ తెలియకుండా
తన జ్ఞానమును బయటికి చెప్పుచున్నాడని, కావున మూడు గ్రంథములలో
ఇంతవరకు అర్థముకాక రహస్యముగా మిగిలిపోయిన ఎన్నో రహస్యములు
బయట పడుచున్నవని అర్థమగుచున్నది. ఇటువంటి సమయములో
మనుషులు తమలోని అహమును వదలి, తెలియబడు స్వచ్ఛమయిన
జ్ఞానమును తెలుసుకోవడము మంచిది. అట్లు కాకుండా చెప్పేవాడు
మాలాంటి మనిషే కదా!యని అసూయ కల్గియుంటే మీకు ఏమీ ప్రయోజన
ముండదు. నష్టపోయేవారు మీరే. నేను సాధారణ మనిషినేనని నేనే
చెప్పుచున్నాను. అయితే లోపలినుండి నేను జ్ఞానమును చెప్పడము లేదు.
చెప్పేవాడు నా వలె నాతోయున్నవాడని, నేను కాదని గ్రహించవలెను.
నీవలె నీ పొరుగువాడున్నట్లు, నావలెనున్న నా పొరుగువాడు చెప్పు ప్రతి
మాట నాది కాదు ఆయనదే. నీ శరీరములో పూర్ణ హృదయముగా
యున్నవాడు, పూర్ణ ఆత్మగాయున్నవాడు, పూర్ణ మనస్సుగాయున్నవాడు
ఒక్కడేననీ, ఆ ఒక్కడు తెల్పునదే నిజమైన జ్ఞానమని తెలియగలిగితే
ఎవడయినా ధన్యుడు కాగలడు. దేవుడు మనతో ప్రత్యక్షముగా మాట్లాడడు.
ఆయన ఎవరూ చూడకుండా ముసుగులోనే అన్నీ చేయును. నీకు ముసుగు
తెలియదు, ముసుగులోనివాడు తెలియడు, తెలిసేది ఆయన జ్ఞానము ఒక్కటే,
దానినే తెలుసుకో!...
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది
సత్యమును వేయిమంది కాదనినా అది
సత్యము కాదు,
అసత్యము కాదు.

Page 159
మూలకర్త
త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ
ISLAMIC
KHUDA
PIRITUAL
SOCIETY
K..I.S.S
ఖుదా ఇస్లామిక్ స్పిరిచ్యువల్ సొసైటీ (K.I.S.S)
(Regd.No.: 459/2011)
చిన్నపొడమల(గ్రా), తాడిపత్రి(మం), అనంతపురం (జిల్లా), ఆంధ్రప్రదేశ్- 515411
e-mail id : info@khudaislamicspiritualsociety.org
www. khudaislamicspiritualsociety.org
159

Page 160
160
మూలక
త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
సువార్త క్రైస్తవ సంఘం
క్రైస్తవ
కృష్ణ
Decoce
సంఘం
మూస
సువార్త
జ్ఞానము
ఏసు
ఈసా
SANGHAM
SUVARTHA KRAISTHAVA
SKS
| Regd.No:159/2015
సువార్త క్రైస్తవ సంఘం (S.K.S)
(Regd.No.: 159/2015)
చిన్నపొడమల(గ్రా), తాడిపత్రి(మం), అనంతపురం (జిల్లా), ఆంధ్రప్రదేశ్-515411
e-mail id : info@suvarthakraisthavasangham.org
www. suvarthakraisthavasangham.org


----
Page 1
శ్రీకృష్ణుడు
దేవుడా, భగవంతుడా
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
Peca
సేవా
COCO
సమితి
చక్రం
చక్రం
చక్రం
fon
చక్రం
-బ్రహ్మనాడి
త సిద్ధాంతో
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞాన వేదిక
(Regd. No. : 168/2004)
ప్రథమ ముద్రణ : సం॥ 2010
-: విషయ సూచిక :-
1)
శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
2)
కృష్ణుడు అందగాడా ?
3)
బృందావనము - శృంగారవనమా ?
4)
శ్రీకృష్ణ జన్మాష్టవి
4)
రాముడు కృష్ణుడు ఒక్కరేనా?
5)
శ్రీకృష్ణుడు నెమలి పింఛమును ఎందుకు ధరించాడు?
6)
కృష్ణుడు బ్రహ్మచారియా? స్వల్పాచారియా? 7)
8)
కృష్ణుడు దైవధర్మములను అర్జునునికే ఎందుకు చెప్పాడు?
9)
మా కృష్ణమందిరము
10) జచివరి మాట
-
కృష్ణుడు యుద్ధములో పారిపోయాడా ?
నేటి సమాజము
1

Page 2
శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
నేటి ప్రజలందరికి తెలిసిన ప్రకారము దేవుడనినా, భగవంతుడనినా రెండు ఒకటే అను భావముతో ఉన్నారు.
చాలామంది స్వామీజీలు కూడ తమ తమ ఉపన్యాసములలో సృష్టికర్త అయిన పరమాత్మను గురించి తెలుపునపుడు
ఒకప్పుడు దేవుడని, మరొకప్పుడు భగవంతుడని పలుకుచు చెప్పుచుందురు. దీనినిబట్టి ఇటు ప్రజల దృష్ఠిలోను, అటు
బోధకులైన స్వామీజీల దృష్ఠిలోను దేవునికీ, భగవంతునికీ ఏమీ తేడా లేదనీ, అందువలన వారు ఇలా ఆ పదములను
వాడుచున్నారని తెలియుచున్నది. ఆధ్యాత్మిక రంగములో ఇది చాలా ముఖ్యమైన విషయము, అందరికి అవసరమైన
విషయము. కావున దేవుడు మరియు భగవంతుడు అను పదములకు శాస్త్రీయత ఉందా? లేదా? అని యోచించవలసిన
అవసరమున్నది. అంతేకాక ఒక పనిని చేయుటకు ఒక కారణముంటుంది. అలాగే ఒక పదమును పలుకుటకు కూడ
కారణముంటుంది. అటువంటి కారణమునే హేతువు అంటాము. ఇక్కడ దేవుడు అనుటకు, భగవంతుడు అనుటకు
హేతువును చూపకపోతే అది హేతుబద్దము కాదు. హేతువాదులు ఒప్పుకోరు. నాస్తికవాదులు ఒప్పుకోక పోయినా
ఫరవాలేదు. కానీ హేతువాదులు తప్పక ఒప్పుకోవలసియున్నది. ఎక్కడైతే శాస్త్రీయత ఉంటుందో అక్కడ హేతువాదమునకు
జవాబు ఉన్నట్లే. ఎక్కడైతే శాస్త్రీయతలేదో అక్కడ హేతువాదమునకు జవాబు లేనట్లే. హేతువాదమునకు శాస్త్రబద్దమే
అసలైన జవాబు. కావున మనము దేవుడు, భగవంతుడు అను పదములకు శాస్త్రీయతను వెదకాలి.
ఒకమారు నా చిన్నవయస్సులో ఒక స్వామీజీని తిరుపతి కపిల తీర్ధమువద్ద కలిసి దేవుడు అంటే అర్థము
ఏమిటి? భగవంతుడు అంటే అర్థము ఏమిటి? అని నేను అడగడము జరిగినది. దానికి ఆ స్వామీజీ ఈ విధముగా
సమాధానము చెప్పాడు.
స్వామీజీ :- దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో అందరికి తెలిసినవి దేవుడు, భగవంతుడు.
నేను :- ఇంకా ఎన్ని పేర్లున్నాయో చెప్పండి స్వామీ?
స్వామీజీ :- విష్ణువు, నారాయణ, కేశవ, మాధవ, లక్ష్మీపతి, వైకుంఠపతి, బ్రహ్మపితా ఇలా అనేక పేర్లు కలవు. ఒకమారు
విష్ణు సహస్రనామావళి చూడు తెలుస్తుంది. అందులో వెయ్యి పేర్లున్నాయి.
నేను :- అయితే విష్ణువునే దేవుడు, భగవంతుడు అని అనుచున్నామా?
స్వామీజీ :- విష్ణువే సమస్త దేవతలకు పెద్ద. కావున ఆయననే మన మందరము దేవుడని, భగవంతుడని, వైకుంఠపతి
అని అనుచున్నాము. వెంకటేశ్వరుడు కూడ ఆయనే కదా!
ఆ
ఈ విధముగా ఒక స్వామీజీయే చెప్పినపుడు సాధారణ మానవుడు వినక తప్పదు. కానీ నేను అంతటితో తృప్తి
చెందక హేతుబద్దముగా పరిశోధించాలనుకొన్నాను. ప్రయత్నములో నా మొదటి ప్రశ్న ఈ విధముగా ఉన్నది.
విష్ణువు దేవుడా? దేవుడు భగవంతుడా? భగవంతుడు ఎవరు? దేవుడు ఎవరు? అను ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే
ఎక్కడ వెదకాలి? నాలుగు వేదములలోనా? ఆరు శాస్త్రములలోనా? పదునెనిమిది పురాణములలోనా? మనము
చూడవలసినవి, మనకు పెద్దలు తెలిపినవి, వేదములు, పురాణములు, శాస్త్రములు. అయితే భూమిమీద ఆధ్యాత్మిక
విషయముల కొరకు నూటికి 95 మంది వేదముల మీద ఆధారపడుచున్నారు. మిగతా వారిలో నలుగురు పురాణముల
మీద ఆధారపడుచున్నారు. ఒక్కడు మాత్రము వేదములను కొంత, పురాణములను కొంత, శాస్త్రములను కొంత కలుపుకొని
చూస్తున్నాడు. మిగత 99 మంది కూడ అవసరాన్ని బట్టి శాస్త్రము పేరు చెప్పుచున్నప్పటికి వారు చెప్పునది శాస్త్రమునకు
2

Page 3
సంబంధించి ఏమాత్రము ఉండదు. ఉదాహరణకు ఒక స్వామీజీ ఒక దేవత యొక్క ఆరాధనను గురించి చెప్పునపుడు,
మామిడి ఆకుతో నీళ్ళు ఇలా దేవత మీద చల్లాలి, శాస్త్రము ఈ విధముగా చెప్పింది. కావున ఇలా తప్పని సరిగ
చేయాలి అని చెప్పుచుండుటను నేను విన్నాను. దైవత్వమునకు సంబంధించిన ఆరవ శాస్త్రములో అలా ఎక్కడా
చెప్పలేదు. అయినా ఆ స్వామీజీ అలా వేదములలోని విషయమునో, పురాణములలోని విషయమునో తీసుకువచ్చి
శాస్త్రము పేరు చెప్పుచున్నాడని అర్థమగుచున్నది. ఈ విధముగా చాలామంది బోధకులు తాము చెప్పుచున్న మాటలు
వాస్తవముగ ఏ శాస్త్రమునకు సంబంధము లేకున్నా, శాస్త్రమిలా చెప్పింది అనుట అలవాటై పోయింది. ఇంకొక
విచిత్రమేమంటే చెప్పబడే మాట పురాణములలోనిది గానీ, శాస్త్రములలోనిది గానీ, వేదములలోనిది గానీ ఏమాత్రము
కాకున్నా దానిని కూడ శాస్త్రమిలా చెప్పింది అని అనుచున్నారు. ఇది చాలాచోట్ల కనిపించే పెద్దతప్పు, అయినా ఎవరూ
దానిని తప్పుగా గుర్తించడము లేదు.
చెప్పబడే విషయమునకు శాస్త్రమును ఊత పదముగ జోడించి చెప్పడమే కాకుండ, వ్రాయబడే విషయమునకు
కూడ శాస్త్రము అను పదమును జోడించడము జరుగుచున్నది. ఒక పుస్తకమును తెరిచి చూస్తే అందులో ఇటు పురాణ
విషయములుగానీ, అటు వేదముల విషయములు గానీ, శాస్త్రములకు సంబంధించిన విషయములుగానీ ఏమాత్రము
ఉండవు. అయినా ఆ పుస్తకము పేరు చివర శాస్త్రము అని ఉండును. ఉదాహరణకు ఒక రచయిత ప్రేమను గురించి
పుస్తకమును వ్రాశాడు. అందులో భార్యను ఇలా ప్రేమించాలని, తల్లిని ఇలా ప్రేమించాలని, సోదరులను ఇలా ప్రేమించాలని,
జంతువులను ఇలా ప్రేమించాలని వ్రాసి, ఆ పుస్తకమునకు ప్రేమశాస్త్రము అని పేరు పెట్టాడు. మరొకరేమో కొన్ని
కామసూత్రములను వ్రాసి దానికి కామశాస్త్రము అని పేరు పెట్టాడు. ఇంకొకడు ఎనిమిది దిక్కుల పేర్లను వ్రాసి, ఆ
దిక్కులలో ఇలా గృహమును నిర్మించుకోవాలని కొన్ని పద్ధతులను చెప్పి దానికి వాస్తుశాస్త్రము అని పేరు పెట్టాడు.
మరొక స్వామి అబద్ధమును చెప్పరాదు, సత్యమునే చెప్పాలి, నీతిమాలిన పనులు చేయరాదు, చాడీలు చెప్పరాదు,
జూదమాడరాదు అని కొన్ని మంచి వాక్యములను వ్రాసి దానికి నీతిశాస్త్రము అని పేరు పెట్టాడు. ఇట్లు ప్రేమ శాస్త్రము,
కామశాస్త్రము, వాస్తుశాస్త్రము, నీతిశాస్త్రము, నాడీశాస్త్రము, భక్తి శాస్త్రము, ముక్తిశాస్త్రము, రక్తిశాస్త్రము, వృక్షశాస్త్రము,
అష్టదిక్కుల ఆరూఢ శాస్త్రము, శరీరధారుడ్యశాస్త్రము, మూలిక ఔషధశాస్త్రము ఇట్లు ఎన్నో విషయములు శాస్త్రముల
పేరుతో వ్రాయబడినవి. వాస్తవముగ ఇవన్నీ శాస్త్రములేనా అని ప్రశ్నించుకొని చూస్తే శాస్త్రములు ఏమాత్రము కావు.
ఇవన్నీ శాస్త్రములు కావు అనే విషయము క్రొత్తతరము వారికి తెలియదు.
శాస్త్రములు ఎన్ని? అను సత్యము తెలిసినపుడు, అవి ఏవి? అను విషయము తెలిసినపుడు మాత్రమే మిగతావి
ఎన్ని ఉన్నా, అవి శాస్త్రములు కావు అను విషయము తెలుస్తుంది. తినే వంటలు వండుకొను విషయములను
పుస్తకరూపములో వ్రాసి దానికి పాకశాస్త్రము అని పేరుపెట్టు ఈ కాలములో, వాస్తవమైన షట్ (ఆరు) శాస్త్రములను
గుర్తించలేక పోవు చున్నాము. దేవుడు, భగవంతుడు అను విషయమునకుగానీ, వివరమునకు గానీ శాస్త్ర ప్రమాణము
అవసరమైనపుడు, ఏ శాస్త్రమును అనుసరించాలో తెలియని స్థితిలో నేటి మానవుడున్నాడు. ఈ అయోమయ స్థితిపోయి
నిజమైన శాస్త్ర భావమును తెలియుటకు శాస్త్రములను, పురాణములను, వేదములను గురించి ముందు తెలిసియుండాలి.
అందువలన నాలుగు వేదములను, పదునెనిమిది పురాణములను, ఆరు శాస్త్రములను గురించి తెలుసు కొందాము.
వేదములు నాలుగు :- 1) యజుర్వేదము 2) ఋగ్వేదము 3) అధర్వణవేదము 4) సామవేదము.
పురాణములు పదునెనిమిది :- 1) బ్రహ్మ పురాణము 2) పద్మ పురాణము 3) విష్ణు పురాణము 4) శివ పురాణము
3

Page 4
5) భాగవత పురాణము 6) నారద పురాణము 7) మార్కండేయ పురాణము 8) అగ్ని పురాణము 9) భవిష్య పురాణము
10) బ్రహ్మ కైవర్తన పురాణము 11) లింగ పురాణము 12) వరాహ పురాణము 13) స్కంధ పురాణము 14) వామన
పురాణము 15) కూర్మ పురాణము 16) మత్స్య పురాణము 17) గరుడ పురాణము 18) బ్రహ్మాండ పురాణము.
శాస్త్రములు ఆరు :- 1) గణితశాస్త్రము 2) ఖగోళశాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతికశాస్త్రము 5) జ్యోతిష్యశాస్త్రము
6) బ్రహ్మవిద్యాశాస్త్రము.
వేదములలోను, పురాణములలోను ఏవీ చేరలేదు, ఏ మార్పులూ రాలేదు. కానీ శాస్త్రములలోనే ఎన్నో చేరిపోయి,
అన్నీ శాస్త్రములు అను పేరుతో చెలామణి అగుటవలన ఏది శాస్త్రమో, ఏది శాస్త్రము కాదో తెలియకుండపోయినది.
ఇప్పుడు పైన చెప్పిన శాస్త్రములు మినహా ఏ శాస్త్రమైన అది శాస్త్రముకాదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు వాస్తుశాస్త్రము
ఉందనుకోండి అది శాస్త్రము కాదని, అందులో చెప్పిన ప్రకారము గృహముల ఫలితములుండవని తెలియాలి. శాస్త్రము
అను పదము నిబంధనతో కూడుకొన్న శబ్దము. 'శాస్త్రము' అను పదము 'శాపము' అను పదము నుండి పుట్టినది.
శాపము అనగా జరిగి తీరునదని అర్థము. శాపము నుండి 'శాసనము' అను పదము పుట్టినది. శాసనము అనగా
తప్పక అమలు జరుగునదని అర్థము. అలాగే శాసనములతో కూడుకొన్నదే శాస్త్రము. శాస్త్రములో చెప్పినవన్నీ
శాసనములై ఉంటాయి. సూత్రము ప్రకారము వాస్తుశాస్త్రములో వ్రాసినవి అమలుకాని వాక్యములు. కావున అది
పేరుకు శాస్త్రమైనా, పనికి శాస్త్రముకాదు. ఇలాంటి శాసనములు లేని ఎన్నో పుస్తకములకు శాస్త్రములు అని పేరు
పెట్టినా, అవి శాస్త్రములుగా గుర్తించబడవు మరియు శాస్త్రములుగా లెక్కించబడవు. అందువలన వాస్తవమైన శాస్త్రములు
భూమిమీద ఆరే గలవని గట్టిగా చెప్పుచున్నాము.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. ఏ విషయమైనా అది సరియైనదా, కాదా? వాస్తవమా, అవాస్తవమా?
భావము సరియైనదా, కాదా? అమలు జరుగునదా, జరగదా? అని పరిశీలించుటకు వేదములు ప్రమాణములు కాదు,
పురాణములు ప్రమాణములు కాదు. శాస్త్రములు మాత్రమే ప్రమాణములు. అందువలన దేవుడు, భగవంతుడు అను
విషయమును శాస్త్రప్రమాణముతోనే పరిశీలించి చూడాలి. మొదట దేవుడు, భగవంతుడు అను పదములు రెండు,
ఆరుశాస్త్రములలో ఏ శాస్త్రములకు సంబంధించినవో తెలుసుకోవాలి. ఈ రెండు పదములు దైవత్వమునకు,
ఆ
ఆధ్యాత్మికమునకు సంబంధించినవి. కావున దైవమునకు సంబంధించిన విషయములు, వివరములు ఎక్కడున్నాయో
శాస్త్రమునే మనము ప్రమాణముగా తీసుకొని చూడాలి. ఇక్కడ ఒక చిన్న సమస్య కలదు. అదేమనగా అందరికీ
శాస్త్రములు ఆరు అని తెలియవు మరియు అవి పలానా పేర్లుగలవని కూడా తెలియదు.
మాకు తెలుసు కాబట్టి
సులభముగా బ్రహ్మవిద్యా శాస్త్రముతోనే చూడాలని చెప్పగలము, చూడగలము. మిగతావారు కూడ సులభముగ ఆరు
శాస్త్రములను జ్ఞప్తిలో పెట్టుకొనుటకు మరియు ఏ శాస్త్రము దేనికి సంబంధించినదో సులభముగా తెలియుటకు అందరికి
ఉపయోగపడేటట్లు చిన్న ఉపాయమును తెలుపుచున్నాము.
ఆరుశాస్త్రములలో మొదటిది గణితశాస్త్రము, రెండవది ఖగోళ శాస్త్రము. ఈ రెండు ఒక దానితో ఒకటి
అనుసంధానమైనవి. కావున రెండిటిని ఒక జతగా చెప్పుకోవచ్చును. అలాగే మూడవది రసాయన శాస్త్రము, నాల్గవది
భౌతికశాస్త్రము. ఈ రెండు శాస్త్రములు కూడ ఒకదాని కొకటి అనుసంధానముగా ఉన్నవి. కావున ఈ రెండు
శాస్త్రములను ఒక జతగా చెప్పుకోవచ్చును. ఇక మిగిలిన ఐదవ జ్యోతిష్యశాస్త్రము, ఆరవ బ్రహ్మ విద్యాశాస్త్రము కలవు.
ఈ రెండు కూడా కర్మ విధానములో ఒకదానికొకటి అనుసంధానమైయుండి ఒక జతగా ఉన్నవి. మొత్తము మూడు
4

Page 5
జతల శాస్త్రములు ఆరుగా ఉన్నవి. ఈ ఆరు శాస్త్రముల పేర్లలో కేవలము మొదటి అక్షరములను మాత్రము తీసుకొని
వ్రాసుకొంటే “గఖ, రభౌ, జ్యోబ్ర" అని విడివిడిగా పలుకవచ్చును. గఖ రభ్ జ్యోబ్ర అను అక్షరములు ఒక మంత్రములాగ
ఉన్నవి. ఆరు శాస్త్రములకు ప్రతినిధులుగా నున్న ఆరు అక్షరములను ఆరు బీజాక్షరములుగా లెక్కించుకొనవచ్చును. ఈ
ఆరు అక్షరములను కంఠస్తము చేసుకొంటే, ఎప్పుడైనా ఆరుశాస్త్రములు జ్ఞప్తికి రాగలవు. దైవజ్ఞానములో గానీ, ప్రపంచ
జ్ఞానములోగానీ సంశయము వచ్చినపుడు వచ్చిన సంశయము ఏ శాస్త్రమునకు సంబంధించినదో ఆ శాస్త్రము ద్వార
దాని యదార్ధమును తెలియవచ్చును. గఖ రభ్ జ్యోబ్ర అను అక్షరములు ఆయా శాస్త్రములకు బీజాక్షరములని చెప్పాముగా!
అలా ఎందుకు చెప్పాననగా! బీజము అనగా పుట్టుకకు కారణమైనదని అర్థము గలదు. ఇపుడు 'గ' అనగానే గణితము,
'ఖ' అనగానే ఖగోళము మన జ్ఞాపకములో పుట్టుకొస్తున్నవి. కావున వాటిని బీజాక్షరములు అనడములో తప్పులేదు.
విశ్వము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములుగా దేవుడు శాస్త్రబద్ధముగా నిర్ణయించి పెట్టాడు.
విశ్వమునకంతటికి ఆరు శాస్త్రములే ప్రమాణములు. కావున శుచి శుభ్రత కలిగి, సృష్టిలో మొదటి దినము ఆదివారము,
కావున ఆదివారముగానీ లేక సంపూర్ణ తిథులు అయిన అమావాస్య దినముగానీ, పౌర్ణమి దినముగానీ స్థిర ఆసనములో
కదలకుండ కూర్చొని, గఖ రభ్ జ్యోబ్ర అను అక్షరముల సముదాయమును ఒక మంత్రముగా లెక్కించి, విశ్వ ఆయువు
సంఖ్య అయిన 108 మార్లు జపించిన వానికి శాస్త్రసిద్ధి లభించును. అటువంటి వారు పురాణముల జోలికిగానీ,
వేదముల జోలికిగానీ పోరు. కేవలము శాస్త్రములను గురించే మాట్లాడుదురు. విశ్వము శాస్త్రబద్ధమైనది, ప్రత్యక్షమైనది
కావున శాస్త్రము యొక్క బీజాక్షరములను విశ్వము యొక్క ఆయుస్సు సంఖ్యతో జోడించి ఏకధాటిగ జపించుటవలన
కొంత శక్తి ఏర్పడి, ఆ శక్తి వలన శాస్త్రముల యొక్క అవగాహన సులభముగా వచ్చును. అటువంటి వానిని శాస్త్రజ్ఞునిగా
లెక్కించవచ్చును.
G.
గఖ రభ్ జ్యోబ్ర ను గురించి తెలిసిన వానికి దేవుడు, భగవంతుడు యొక్క విషయము చివరిది, ఆరవది
అయిన బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సంబంధించినదని సులభముగా తెలియగలదు. ఆరుశాస్త్రములలో ఇపుడు మనకు
అవసరమైనది బ్రహ్మవిద్యా శాస్త్రము. ఈ బ్రహ్మవిద్యా శాస్త్రము మిగత ఐదు శాస్త్రములకంటే గొప్పదని స్థూలముగా
మరియు సూక్ష్మముగా తెలియుచున్నది. సూక్ష్మముగా బయటికి కనిపించక పోయినా ఈ శాస్త్రమును తెలుసుకొనుకొద్దీ
దీని గొప్పతనము సూక్ష్మముగ తెలియును. స్థూలముగా అంటే బయటికి కనిపించునట్లు మిగత ఐదుశాస్త్రములకంటే
గొప్పగా తెలియుచున్నది. అదెలా అనగా! మొదట ఐదుశాస్త్రముల బీజాక్షరములుగా నున్న గ, ఖ, ర, భౌ, జ్యో అను ఐదు
అక్షరములు ఏకాక్షరములే. చివరిది ఆరవది అయిన బ్రహ్మవిద్యాశాస్త్రము యొక్క మొదట అక్షరము అయిన “బ్ర”
మాత్రము ద్వంద్వాక్షరములు కల్గియున్నది. ద్వంద్వాక్షరములు అనగా రెండు అక్షరములు కలిసి ఒక అక్షరముగా
ఉన్నది. “బ్ర” అను శబ్దములో “బ” మరియు “ర” అను రెండు అక్షరములు కలిసి మిగత ఐదు శాస్త్రముల ఏకాక్షరములకంటే
గొప్పగా కనిపించు చున్నది. ఈ విధముగా ద్వంద్వాక్షరముల శబ్దమును కల్గి తను అన్నిటికంటే పెద్ద అని చాటుకొన్నది.
అంతేకాక “బ్రహ్మవిద్య” అను పేరులోని అర్థమును చూస్తే “బ్రహ్మ” అనగా పెద్ద అని అర్థము కలదు. విశ్వములోని
అన్ని విద్యలకంటే పెద్దవిద్య అయిన దానివలన దీనిని బ్రహ్మవిద్య అని అనుచున్నాము. అన్నిటికంటే పెద్ద అయిన
దేవుడు, భగవంతుడు అను మాటలకు అర్థము పెద్ద విద్యా శాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రములోనే తెలియును. మిగత
ఐదు శాస్త్రములు ప్రపంచమునకు సంబంధించినవి కాగా, ఒక్క బ్రహ్మవిద్యా శాస్త్రము మాత్రము ప్రపంచమునకు
అతీతమైన దేవునికి సంబంధించినది.
5

Page 6
ఇక్కడొక ప్రశ్నను కొందరు ఇలా అడుగవచ్చును. గణిత, ఖగోళ, రసాయన, భౌతిక, జ్యోతిష్యశాస్త్రముల
యొక్క విద్యలు బయటి విద్యాలయము లలో గలవు. వాటిని బోధించు బోధకులు కూడ గలరు. అయితే ఫలానిది
బ్రహ్మవిద్యయని గానీ, ఫలానా గ్రంథము బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినదనిగానీ, ఫలానా వాడు బ్రహ్మవిద్యను
బోధించు బోధకుడని గానీ, ఎవరికీ తెలియనపుడు ఎలా బ్రహ్మవిద్యను తెలియవలెను? అది ఎక్కడ కలదని వెదకవలెను?
అని ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా! అన్నిటికంటే ముందు పుట్టినది బ్రహ్మవిద్యాశాస్త్రము. ఈ శాస్త్రము
సృష్టి ఆదిలోనే పుట్టినది. దీనిని మొట్టమొదట చెప్పినవాడు విశ్వమును సృష్టించిన దేవుడే. మొదట పుట్టినది, దేవుని
చేత చెప్పబడినది అయిన బ్రహ్మవిద్య భూమిమీద ఎప్పుడైన తెలియకుండాపోతే తిరిగి దేవుడే దానిని చెప్పవలసియుండును.
బ్రహ్మవిద్యను మొదట చెప్పినవాడూ, తర్వాత అవసరమొచ్చినపుడు చెప్పువాడూ దేవుడే. దీనిని బట్టి బ్రహ్మవిద్య ఎంత
గొప్పదో అర్థముకాగలదు. బ్రహ్మవిద్య అంతరించినపుడు తిరిగి దేవుడే దానిని పునరుద్ధరించును. కానీ ఏ మానవునకు
ఆ పని సాధ్యముకాదు. మానవుడు, దేవుడు చెప్పిన విద్యను తాను తెలుసుకొని ఇతరులకు బోధించవచ్చును. కానీ లేని
విద్యను చెప్పలేడు. మొదట చెప్పువాడు గురువు (దేవుడు), తర్వాత చెప్పువాడు బోధకుడు అను సూత్రము ప్రకారము
మనుషులు బోధకులు కావచ్చును. కానీ ఏ మనిషి గురువు కాలేడు.
సృష్టి ఆదిలో దేవునిచేత మొదట సూర్యునికి చెప్పబడిన బ్రహ్మవిద్య సూర్యుని ద్వారా ఇతరులకు చెప్పబడినది.
దీనినిబట్టి ఆదిలో దేవుడే గురువుకాగ తర్వాత దానిని బోధించిన సూర్యుణ్ణి బోధకునిగా చెప్పవచ్చును. సృష్ఠినుండి
కాలము జరుగుతూరాగ, బ్రహ్మవిద్య అడుగంటిపోయి అధర్మములు అభివృద్ధి అయినపుడు, దేవుడు దానిని తిరిగి
బోధించాడు. అలా బోధించినదే నేడు మనము చూడగల్గుచున్న భగవద్గీత. భగవద్గీతలో ఉన్నది సృష్ఠి ఆదిలో చెప్పిన
విద్యయే. కావున భగవద్గీతను ముమ్మాటికీ బ్రహ్మవిద్యాశాస్త్రమని చెప్పవచ్చును. మిగత ఐదు శాస్త్రములతో పోల్చి
చూచితే, విషయ విస్తీర్ణములో అన్నిటికంటే చాలా చిన్నది బ్రహ్మవిద్య. మనిషి మిగత ఐదు శాస్త్రములలో ఒక్కదానిని
చదువుటకు ప్రాథమిక పాఠశాల (ఎలిమెంటరీ స్కూల్), ఉన్నత పాఠశాల (హైస్కూల్), కళాశాల (కాలేజ్), విశ్వ విద్యాలయము
(యూనివర్శిటి) అను నాలుగు రకముల విద్యాలయములలో దాదాపు పాతిక (25) సంవత్సరములు చదువవలసి
యుండును. (అంత చదివినా ఇంతవరకు తెలియబడినది పది శాతము మాత్రమే. 90 శాతము ఇంకా కనిపెట్టవలసి
వున్నది.) చెప్పే బోధకులు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు మొదలగు వారు అవసరము. బ్రహ్మవిద్యను నేర్చుకోవాలంటే
ఒక్క సంవత్సరములో ఒక్క బోధకుని చేత నేర్చుకోవచ్చును. అన్నిటికంటే పెద్ద విద్యగా పేరుగాంచిన బ్రహ్మవిద్య,
శ్రద్ధయున్న మనిషికి చాలా చిన్నదిగా కనిపించును. అందువలన శ్రద్ధయున్నవాడు ఒక సంవత్సరములోనే సంపూర్ణముగ
తెలియవచ్చును. శ్రద్ధలేనివాడు ఒకవేళ తెలుసుకోవాలనినా వందసంవత్సరములకు కూడ కొద్దిగా అయినా తెలియలేడు
అందువలన బ్రహ్మవిద్య విచిత్రమైన విద్య.
బ్రహ్మవిద్యను సృష్ఠి ఆదిలో దేవుడే స్వయముగ చెప్పాడు. దేవుడు బ్రహ్మవిద్యను నిబంధన ప్రకారము చెప్పాడు.
నిబంధన ప్రకారము అనగా ధర్మబద్ధముగ అనియు, సిద్ధాంతబద్ధముగ అనియు, శాస్త్రబద్ధముగ అనియు చెప్పవచ్చును.
అందువలన బ్రహ్మవిద్య శాస్త్రము అయినది. దీనినిబట్టి బ్రహ్మవిద్యను పురాణము అనిగానీ, వేదము అనిగానీ అనకూడదు.
పూర్వకాలము చెప్పబడినదని ఇతిహాసము అని కూడ అనకూడదు. ఇతిహాసము అనగా జరిగిన చరిత్ర. త్రేతాయుగములో
జరిగిన రామాయణము చరిత్ర, అలాగే ద్వాపరయుగములో జరిగిన మహాభారతము చరిత్ర. అందువలన రామాయణ,
మహాభారతములను ఇతిహాసములని అనవచ్చును. కానీ భారతములో చెప్పిన విద్యను చరిత్ర అనకూడదు. చరిత్ర
6

Page 7
ఒకేమారు జరుగుతుంది. చరిత్రకు ధర్మమంటూ ఉండదు. అందువలన రామాయణము రంకు, భారతము బొంకు అని
కొందరన్నారు. సృష్ఠి ప్రారంభములో పుట్టిన బ్రహ్మవిద్య మాయప్రభావము వలన మనుషులలో లేకుండ పోవడము,
తిరిగి దానిని దేవుడు మానవులకు జ్ఞప్తి చేసి చెప్పడము జరుగుచున్నది. ఇది బ్రహ్మవిద్య యొక్క విషయముకాగ, మిగత
ఐదు శాస్త్రముల విషయానికి వస్తే వీటిని దేవుడు స్వయముగా చెప్పలేదు. మనుషుల చేత చెప్పించాడు. మిగత
శాస్త్రములకు కూడ దేవుడే కర్త అయినా, ఆ విషయము ఎవరికీ తెలియకుండునట్లు మనుషుల చేత చెప్పించి పైకి
మనుషులనే కర్తలని అందరిని నమ్మించాడు.
ణ
బ్రహ్మవిద్యా శాస్త్రము సృష్ఠి ఆదిలోనే దేవుని చేత సంపూర్ణముగా చెప్పబడినది. అందులో అసంపూర్ణత ఆనాడుగానీ,
ఈనాడుగానీ ఎప్పటికీ లేదు. బ్రహ్మవిద్య మధ్యకాలములో తెలియకుండ పోవచ్చును, అలాంటపుడు దేవుని చేతనే తిరిగి
చెప్పబడును. అంతేగానీ ఆ రోజు కొంత చెప్పబడి, తర్వాత కాలములలో మరికొంత చెప్పబడునది కాదు. బ్రహ్మవిద్యలోని
సూత్రములు (ధర్మములు) అన్నియు మొదటనే చెప్పబడినవి. కావున అది ఆదినుండి సంపూర్ణ శాస్త్రమే, ఒకవేళ
మనిషికి తెలియకుండ పోయినపుడు చెప్పిన సూత్రములనే వివరించి విశదముగా చెప్పడము జరుగుచున్నది. అందువలన
సృష్టి ఆదిలో చెప్పబడిన విద్యయే తిరిగి ద్వాపర యుగమున కొంత విశధీకరించి చెప్పబడినది. అట్లే తర్వాత యుగములలో
కూడ ఉన్న ధర్మమును వివరించి చెప్పడము జరుగుతుంది. కానీ లేని క్రొత్త ధర్మమును చెప్పడము జరుగదు. ఎందుకనగా
బ్రహ్మవిద్య ఆదినుండియే సంపూర్ణ శాస్త్రము. బ్రహ్మవిద్య ఎప్పటికీ సంపూర్ణమే. క్రొత్తగా చేర్చునది ఏదీలేదు. అందువలన
ఒక మతములోని గురువు ఇలా అన్నాడు. “నేను చెప్పినది ఇప్పుడు మీకు సరిగా అర్థము కాలేదు. తర్వాత కాలములో
నేను చెప్పిన విషయములే నా తర్వాత వచ్చు గురువు మీకు వివరించి చెప్పును” అన్నాడు. ఇక్కడ నేను చెప్పిన
విషయములనే వివరించు చెప్పును అన్నాడు. కానీ మరికొన్ని క్రొత్త విషయములని చెప్పలేదు. అందువలన బ్రహ్మవిద్య
మొదటనే సంపూర్ణముగా చెప్పబడినదని, అందులోనికి చేర్చునది ఏమీ లేదని తెలియుచున్నది.
మిగత ఐదు శాస్త్రములైన గణిత, ఖగోళ, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రములు మనుషుల చేత చెప్పబడినవి.
ఈ ఐదు శాస్త్రములు బ్రహ్మవిద్యా శాస్త్రము పుట్టిన తర్వాత కొంత కాలమునుండి పుట్టడము ప్రారంభమైనవి. వివరముగా
చెప్పుకొంటే ఐదు శాస్త్రములు ఒక్కమారుగ పుట్టలేదు. కాలము జరుగుకొలది మానవుల అవసరములను బట్టి
అప్పుడొకటి, అప్పుడొకటి పుట్టుటకు ప్రారంభించినవి. అప్పటినుండి ఇప్పటి వరకు ఐదు శాస్త్రములలో ఏ శాస్త్రమూ
సంపూర్ణముగా పుట్టలేదు. ఈ ఐదు శాస్త్రములను గురించి చెప్పుకోవడము మనకు ఇప్పుడు అసందర్భమే అగును.
కావున వాటిని వదలివేసి అసలు విషయానికి వస్తాము.
బ్రహ్మవిద్యా శాస్త్రమును చెప్పినది దేవుడే. దాని ధర్మములకు ముప్పు ఏర్పడి తెలియకుండ పోయినపుడు తిరిగి
చెప్పువాడూ దేవుడే. బ్రహ్మవిద్యా శాస్త్రములో ఉన్నవన్నీ దేవుని ధర్మములే. దేవుని ధర్మములు దేవునికే తెలుసు,
మానవులలో ఎవరికీ తెలియదు. అందువలన మొదట చెప్పినది దేవుడే! తర్వాత చెప్పునదీ దేవుడే! బ్రహ్మవిద్యా
శాస్త్రము ప్రకారము దేవుడు అనగా రూప, నామ, క్రియలు లేనివాడని అర్థము. దీనినిబట్టి దేవునికి ఏ ఆకారములేదు,
పేరు లేదు, అలాగే ఆయన చేయు పనియు ఏమాత్రము లేదు. శాస్త్రము ప్రకారము దేవుడు ఇటువంటివాడు అని మేము
అంటే ఈ మాటను వినేవారికి అనేక ప్రశ్నలు రాగలవు. దేవునికి పేరు లేనపుడు దేవుడు, భగవంతుడని ఎందుకు
అనుచున్నారు? దేవునికి ఆకారము లేనపుడు అర్జునునకు విశ్వరూపము చూపినట్లు బ్రహ్మవిద్య అనబడు గీతయందే
చెప్పియున్నారు కదా! అది ఒక ఆకారమేకదా! గీతలో చెప్పిన దానిని మీరు కాదంటారా? సృష్టి, స్థితి, లయకర్త దేవుడే
7

Page 8
అని మీరే చెప్పుచున్నారే అలాంటపుడు పుట్టించడము, సాకడము (పోషించడము) చంపడము పనులు కావా!
పనులు దేవుడు చేయుచున్నపుడు ఆయనకు పనియే లేదనడము శాస్త్రవిరుద్ధము కాదా? అని ఎన్నో రకముల ఎన్నో
ప్రశ్నలను అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! శాస్త్రము శాసనములతో కూడుకొని ఉండును. కావున
శాస్త్రము ఎప్పటికీ అబద్దము కాదు, ఎవరి చేత ఖండించబడదు.
దేవునికి వాస్తవముగ పేరు లేదు. దేవుడు అని చెప్పబడు శబ్దము పేరు కానేకాదు. దేవుడు అను శబ్దము
కేవలము అర్థమును తెలియజేయు పదము మాత్రమే. దేవుడు అను పదములో 'దేవు' అను రెండక్షరములలో అసలైన
భావము ఇమిడివున్నది. దేవు అను శబ్దమునకు “డు”ను తగిలించితే దేవుడు అగును. దేవు అను శబ్దమునకు “ఆడుట”
అను పదము జోడించితే దేవులాడుట అగును. అలాగే “ట”ను జోడించితే దేవుట అగును. ఈ విధముగ చూస్తే దేవుట,
దేవులాడుట, దేవుడు పదములలో దేవు అను శబ్దము ముఖ్యమైనదని తెలియుచున్నది. దేవుట అను పదములోని
భావమును గమనిస్తే వెదకుట అని అర్థమగుచున్నది. దేవులాడుట అనగా వెదకులాడుట అని అర్థము. అలాగే దేవుడు
అనగా వెతకబడువాడు అని అర్ధము. ఉన్న వాస్తవమును తెలియజేయునది పేరుగాదు. దేవులాడుట, దేవుట లో ఉన్న
అర్థము వెతకడము అను పనిని సూచిస్తున్నది. యోగి అను శబ్దములో ఒక వ్యక్తి చేసిన యోగమను కార్యమును
సూచిస్తున్నది. అలాగే త్యాగి అను పదము యొక్క అర్థము అతడు చేసిన త్యాగమును సూచిస్తున్నది. యోగికి గానీ,
త్యాగికిగానీ ప్రత్యేకమైన నామధేయము లేక పేరు ఒకటి ఉంటుంది. యోగి అనునది పేరుగాదు అతని గొప్పతనము.
నాపేరు ప్రబోధానంద, నా హెూదా యోగి. అందువలన నన్ను ప్రబోధానంద యోగి అనవచ్చును. అట్లే నారాయణ
త్యాగి అని ఒకరిని పిలిచినపుడు, వానిపేరు నారాయణ, వాడు చేసినది త్యాగము అని అర్థమగుచున్నది. త్యాగి, యోగి
అను పదములు మనిషి సాధించిన హెూదాను తెలుపునవే, కానీ అవి పేర్లు కాదు.
వెతకబడే దేవుడు ఒక్కడే
మననము కలవాడు మనిషి. మననము అనగా జ్ఞప్తి అని అర్థము. మనిషి అనగా అన్ని జీవరాసులకంటే
ఎక్కువ జ్ఞప్తి (మననము) కలవాడని అర్థము. అంతేకానీ మనిషి అనునది పేరుకాదు. మనుషులు అనేక మంది
ఉన్నారు, కనుక ఒక్కొక్క మనిషిని వేరువేరుగా గుర్తించుటకు వేరు వేరు పేర్లు ఉన్నాయి.
కావున దేవునికి పేరు అవసరములేదు. దేవున్ని అనేక శబ్దములతో పిలిచినా అవి ఆయన పేర్లు కావు అవి అన్నియు
ఆయన హెూదాను తెలియజేయు గుర్తులే. మనిషి చదువుకొన్న దానినిబట్టి వానికి M.A., B.A., I.P.S., I.R.S., I.A.S.
అని వాని యోగ్యతను సూచించు శబ్దములున్నట్లు దేవునికి కూడ ఆయన హెూదాను సూచించు పదములు గలవు.
ఉదాహరణకు పరమాత్మ, పురుషోత్తమ మొదలగునవి కలవు. ఆత్మకంటే పరముగా (వేరుగా) ఉన్నవాడు, కావున
దేవున్ని పరమాత్మ అని అనుచున్నాము. అలాగే క్షర పురుషునికంటే, అక్షర పురుషునికంటే ఉత్తమముగా దేవుడున్నాడు.
కావున ఆయనను పురుషోత్తమ అన్నారు. ఇటువంటి పదములన్ని మనిషికున్న డిగ్రీలలాంటివే. ఒక మనిషికి వాడు
చదివిన దానినిబట్టి ఎన్ని డిగ్రీలైన ఉండవచ్చును. అలాగే దేవుడు ఉన్నదానిని బట్టి ఆయనకు ఎన్ని హెూదా పదములైన
ఉండవచ్చును. ఇపుడు మనకు అవసరమైన పదము దేవుడు. దేవుడు అనగా వెతకబడే వాడేగానీ దొరికేవాడు కాడు.
అందువలన మేము అనేక సందర్భములలో ఏ మనిషీ దేవున్ని చూడలేదు అని చెప్పుచూ వచ్చాము. ఎవరైన నేను దేవున్ని
చూచాను అంటే అది పూర్తి అసత్యము.
ఎవరిచేత దేవుడు దేవులాడ (వెతుకులాడ) బడును? అని ప్రశ్నించుకొని చూస్తే, అటువంటి అవసరము
మనిషికే ఉన్నది. అందువలన మనిషి వెదికేవాడు, దేవుడు వెతకబడేవాడు అని చెప్పవచ్చును. సృష్ఠి ఆదినుండి
8

Page 9
అందరూ దేవున్ని వెదకుచున్నారు, దేవుడు వెదకబడుచూనే ఉన్నాడు. ఈ విషయమునే భగవద్గీత విశ్వరూప సందర్శన
యోగమున “నన్ను ఇంతవరకు ఎవరూ చూడలేదు" అని కృష్ణుడు అర్జునునితో చెప్పాడు. ఇపుడు కొందరు ఒక
ప్రశ్నను అడుగవచ్చును. అది ఏమనగా! ఇంతవరకు దేవునికి మనుషులవలె, పేరు లేదు, ఆయనను ఉచ్ఛరించు
పదములన్నియు ఆయన గొప్పతనమును సూచించు శబ్దములే అన్నారు కదా! అటువంటపుడు ఆకారమున్న ఒక
మనిషి అయిన కృష్ణుని పేరు చెప్పి కృష్ణుడు చెప్పిన మాటను దేవుడు చెప్పినటని మీరు చెప్పారు కదా! పేరున్నవాడు
దేవుడు కాడని, దేవుడు మనిషికాదని చెప్పిన మీరు దేవునికి కృష్ణుడు అను పేరు పెట్టడము సమంజసమా? అని
అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! కృష్ణున్ని దేవుడని నేను ఇంతవరకు చెప్పలేదు కదా! అందువలన ఇప్పుడు
ఈ ప్రశ్న అవసరములేదు. భూమిమీద ఏ మనిషి అయినా దేవుడు కాడు. దేవున్ని అన్వేషించువాడు మనిషి అన్న
వాక్యమును ముఖ్యముగ గుర్తుంచు కోవాలి. అపుడు మీరు వెంటనే మరొక ప్రశ్న అడుగవచ్చును. ఇంతకు ముందు
"దేవుని ధర్మములు దేవుడే చెప్పాలి, ఏ మనుషులు దేవుని ధర్మములను చెప్పలేరు” అని మీరే వ్రాశారు. ఇప్పుడేమో ఒక
మనిషి అయిన కృష్ణుడు అంతరించి పోయిన ధర్మములను తిరిగి గీతలో తెలిపాడు అన్నారు. దీనినిబట్టి దేవుడు
మనిషా? అని ప్రశ్న వచ్చుచున్నది. కృష్ణున్ని దేవుడని చెప్పలేదు కదా? అని మీరు ఒక ప్రక్క అంటున్నారు మరొక ప్రక్క
దేవుడు మనిషి అయిన కృష్ణునిగా చెప్పుచున్నారు. మీది ద్వంద్వవైఖరి కాదా అని అడుగవచ్చును. దానికి మా జవాబు
ఏమనగా! నేను ఇంతవరకు కృష్ణున్ని మనిషి అని చెప్పలేదు కదా! అని అడుగుచున్నాను. ఈ నా జవాబును చూచి
కృష్ణున్ని దేవుడు కాదంటారు, అలాగే కృష్ణున్ని మనిషి కాదంటారు మీరు చెప్పే మాటలు మాకు ఏమీ అర్థము కాలేదు
అని కొందరనవచ్చును. కానీ నేను చెప్పునది పూర్తి సత్యము. ఈ గ్రంథము వ్రాయు ఉద్దేశము గ్రంథము పేరులోనే
గలదు. "కృష్ణుడు దేవుడా? భగవంతుడా?" అని ఉన్నపుడు దేవుడా, భగవంతుడా, మనిషి అని తేల్చి చెప్పుకోవలసి
ఉన్నది. నేను వ్రాయవలసినది ఎంతో ఉండగానే, నేను ఏమీ చెప్పకనే నాది ద్వంద్వవైఖరి అని అర్థము చేసుకోకూడదు.
ఇంతవరకు దేవునికి పేరు లేదు అని తెలుసుకొన్నాము. ఇక రూపము ఉందో లేదో తెలుసుకొందాము. రూప,
నామ, క్రియలు లేనివాడు అని మనము చెప్పుకొన్నప్పుడు, ఆయనకు ఆకారము లేదనేగా అర్థము. దీనినిబట్టి రూపమున్న
వాడు ఎవడూ దేవుడు కాడు. ఈ లెక్క ప్రకారము రూపమున్న కృష్ణుడు కూడ దేవుడు ఏమాత్రము కాడని గట్టిగ
చెప్పవచ్చును. కృష్ణుడే కాదు, ఆకారమున్న రాముడు గానీ, విష్ణువు గానీ, శివుడు గానీ దేవుడు కారు. ఎవరు దేవుడు
అని అడిగితే మేము మాత్రము విష్ణువుతో మొదలుకొని ముప్పయి మూడుకోట్ల మంది దేవతలలో ఎవ్వరూ దేవుడు
కారని చెప్పుచున్నాము. నీవు ఎవరు? అని గీతలో అర్జునుడు విశ్వరూప సందర్శన యోగమున దేవున్ని ప్రశ్నించినపుడు,
దానికి దేవుడు “నేను కాలమును" అన్నాడు. కాలమునకు ఆకారమున్నదని ఎవరైనా చెప్పగలరా? కాలము ఎవరికైనా
కనిపిస్తుందా? ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరికీ ఆయన కనిపించ లేదు. కావున దేవునికి ఆకారము లేదని
చెప్పవచ్చును. రూప, నామములు అవినాభావ సంబంధము కలవి. పేరు ఉంటే రూపము ఉంటుంది, ఒకవేళ
రూపమున్నా పేరుంటుంది. దేవునికి పేరు లేదు కావున రూపములేదు. అట్లే ఆయనకు రూపము లేదు కావున పేరు
కూడ లేదు. మరియొక ముఖ్య సూత్రము ఏమనగా! ఆకారము, పేరు ఉన్నవాడు ఎవడైనా ఒక్క క్షణము కూడ ఊరక
ఉండకుండ ఇటు మానసికముగా గానీ, అటు శారీరకముగా గానీ పనిచేయును అని గీతయందు కర్మయోగమున 5వ
శ్లోకములో “నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్, కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః ఏ కర్మను అనుభవించకుండ
ఒక్క క్షణము కూడ ఎవడూ ఊరక ఉండలేడు. ప్రకృతి గుణములచేత వశులై పనులు చేయుచుందురు” అని కృష్ణుడు
చెప్పాడు. ఆకారము పేరున్న ప్రతి మనిషి తప్పక పని చేయవలసి ఉండును. ఆకారమున్న ప్రతి మనిషికి గుణములుండును.
9

Page 10
గుణములున్న మనిషి కర్మ ప్రకారము గుణములకు వశమైపోయి గుణముల ప్రకారము పనులు చేయును. దేవుడు
గుణాతీతుడు, ఆకారరహితుడు కావున దేవునికి కార్యములులేవు. సృష్ఠిలో దేవుడు ఎప్పుడూ పని చేయడు, సృష్ఠిలో
మనిషి ఎప్పుడూ ఊరక ఉండడు అను సూత్రమును ఎల్లప్పుడు మన జ్ఞప్తిలో పెట్టుకోవలెను.
ఇంతవరకు దేవుడు రూప, నామ, క్రియా రహితుడు అను విషయము అర్థమైనది. ఇక మనకు అర్ధము
కావలసినది దేవుడు సృష్టికర్త అను మాట నిజమా, అబద్దమా అను విషయము. దేవుడు సృష్ఠికర్త అయితే, సృష్టిని
తయారు చేసిన వాడనియేగా అర్థము. సృష్టిని తయారు చేయడము పెద్ద పని అగును కదా! అప్పుడు దేవుడు కూడ పని
చేసినట్లే అవును కదా! అని పెద్ద సంశయము వచ్చుచున్నది. దానికి జవాబును వెదికితే ఈ విధముగా కలదు. సృష్ఠి
తయారైన తర్వాత ఆదిలో మొట్టమొదట బ్రహ్మవిద్యా శాస్త్రము పుట్టినది. బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము దేవుడు
రూప, నామ, క్రియా రహితుడు. దానికి శాస్త్రబద్దముగా పైన వివరమును కూడ చెప్పుకొన్నాము. ఇపుడు మనకు
కావలసినది దేవుడు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు విరుద్దముగా సృష్టిని తయారు చేయు పనిని చేశాడు కదా అని. దానికి
సమాధానము దేవుడు బ్రహ్మవిద్యా శాస్త్రమును చెప్పిన తర్వాత, అనగా సృష్టి తయారైన తర్వాత, ఎప్పుడైనాగానీ శాస్త్రబద్ధము
కాకుండ దేవుడు ఏ కార్యమును చేయలేదు. సృష్ఠి తర్వాత, శాస్త్రము తయారైన తర్వాత, దేవుడు క్రియా రహితుడుగానే
ఉన్నాడు. క్రియారహితుడు అను మాటకు విరుద్ధముగా దేవుడు ఏ క్రియను చేయలేదు. సృష్ఠి తయారు కాకముందు,
బ్రహ్మవిద్యా శాస్త్రము తయారు కాకముందు, విశ్వముగానీ, నీవుగానీ, ఎవరుగానీ, ఏ శాస్త్రముగానీ లేకముందు దేవుడు
చేసినది శాస్త్రవిరుద్ధముకాదు. శాస్త్రమే లేనపుడు శాస్త్రవిరుద్ధమని చెప్పుటకు వీలులేదు. సృష్టికర్త అను మాట ఏ
విధముగా చూచినా సత్యమైనదే. సృష్ఠి లేకముందు చేసినది శాస్త్రపరిధిలోనికి రాదు. కావున దేవుడు ఎప్పుడు చేశాడు?
ఎప్పుడు చేయలేదు? అని చూడవలసినది మరిచిపోయి, దేవుని కార్యమును శాస్త్రబద్దతకాదు అనడము పొరపాటు
అగును. దీనినంతటిని గమనించితే సృష్టి తర్వాత దేవుడు ఏ పనినీ చేయలేదని, దేవుడు బ్రహ్మవిద్యా శాస్త్రములో తాను
చెప్పిన ధర్మములను అతిక్రమించలేదనీ, ధర్మముల ప్రకారమే ఉన్నాడనీ తెలియుచున్నది.
దేవుడు రూప, నామ, క్రియారహితుడు అను శాస్త్ర ధర్మము సృష్ఠి తర్వాత విషయమనీ, దేవుడు సృష్ఠికార్యమును
చేయడము సృష్ఠికంటే ముందు విషయమని తెలిసిపోయినది. సృష్ఠి తర్వాతనే శాస్త్రమును చూడవలెనని, సృష్ఠికంటే
ముందు శాస్త్రమే లేదు కనుక అప్పటి విషయములు శాస్త్ర పరిధిలోనికి రావని కూడ తెలిసిపోయినది. ఇక్కడ శాస్త్రపరిధిలోనికి
వచ్చు మరియొక ప్రశ్న కూడ కలదు. దానిని కూడ తెలుసుకొంటే దేవుని జ్ఞానములో సంశయము లేకుండ పోవును.
ఆ ప్రశ్న ఏదనగా! దేవుడు విశ్వమునంతటిని సృష్టించిన తర్వాత ఆయన ఏ కార్యమును చేయలేదు అని మీరు
చెప్పారు. దేవుడు పని చేస్తే శాస్త్రవిరుద్ధమౌతుందని తన మాటను తానే అతిక్రమించినట్లవుతుందని కూడ చెప్పారు.
అంతేకాక సృష్టి ఆదిలోనే మొట్టమొదట దేవుడు సూర్యునికి జ్ఞానమును చెప్పినట్లు కూడా తెలిపారు. సూర్యునికి ఫలానా
ఆకారముతో చెప్పినట్లుగానీ, ఫలానా పేరుతో చెప్పినట్లుగానీ ఎక్కడా ఆధారములు లేవు. రూపము, పేరు లేకున్నా
సూర్యునికి జ్ఞానమును చెప్పానని గీతలో చెప్పడము వలన, బోధించడము అను ఒక పనిని సృష్ట్యాదిలో దేవుడు చేసినట్లు
తెలియుచున్నది. సూర్యునికి బోధించడము సృష్ఠి జరిగిన తర్వాత జరిగిన పని. కావున ఇక్కడ దేవుని ఆకారము, పేరు
వ్యక్తము కాకుండినా చేసిన పని వ్యక్తమవుచున్నది. దీనిని బట్టి సృష్ఠి తర్వాత కూడ దేవుడు పని చేసినట్లు తెలియుచున్నది
కదా! అని ఎవరైన అడుగుటకు అవకాశము కలదు. దీనికి సమాధానము మీవద్ద ఉన్నదా... అని మమ్ములను ఎవరైనా
అడిగితే, మేము ఈ విధముగా సమాధానము చెప్పగలము.
10

Page 11
సృష్ఠి జరిగిన తర్వాత గురువు శిష్యుడు అను రెండు శబ్దములను మనము అక్కడక్కడ వినుచున్నాము. గురువు
శిష్యుడు అను పదములు పేర్లు కావు. ఒక పేరున్న వ్యక్తి బోధించు కార్యమును చేయుట వలన అతనిని గురువు
అంటాము. అలాగే ఒక పేరున్న వ్యక్తి బోధను తెలుసుకొను పనిని చేయడము వలన అతనిని శిష్యుడు అనుచున్నాము.
భూమిమీద రెండు రకముల జ్ఞానములు కలవు. ఒకటి పరమాత్మ జ్ఞానము, రెండవది ప్రకృతి జ్ఞానము. ఇక్కడ ప్రకృతి
(ప్రపంచ) జ్ఞానమును మాత్రము తీసుకొని చూస్తే, ప్రకృతిలోని అనేక విద్యలను నేర్చుకొను వానిని శిష్యుడు అని
అంటాము. అలాగే ప్రకృతిలోని విద్యలను బోధించు వానిని గురువు అంటాము. ప్రకృతి విద్యలో కనిపించే గురువు,
కనిపించే శిష్యుడు ఇద్దరు ఉంటారు. దీనిప్రకారము ప్రపంచములో అనేక విద్యలను బోధించు అనేకమంది గురువులు,
అనేక విద్యలను అభ్యసించు అనేకమంది శిష్యులు కలరు. ఇక బ్రహ్మవిద్య అనబడు దైవజ్ఞాన విషయములోనికి వచ్చి
చూస్తే ప్రపంచ విద్యలో మాదిరి గురువు కనిపించడు, శిష్యుడు కనిపించడు. ఒకవేళ గురువు భూమిమీద ఉండినా
అతనికి శిష్యులు ఉండరు. బ్రహ్మవిద్యను నేర్చుకోవాలని ఎవరైనా అనుకొని గురువు కొరకు అన్వేషించినా అతనికి
గురువు దొరకడు. అందువలన బ్రహ్మవిద్యలో గురు శిష్యులు ఒక కాలములోగానీ, ఒక చోటగానీ కనిపించరు. ప్రస్తుత
కాలములో బ్రహ్మవిద్యను నేర్చుకొను శిష్యులు, బోధించు గురువులు ఉండినా బోధించువారు కేవలము బోధకుడేగానీ,
గురువు కాదు. బోధకులకు శిష్యులు ఎందరైనా ఉండవచ్చును. గురువు కొన్ని వేల సంవత్సరములకో, లక్షల
సంవత్సరములకో భూమిమీదకు వచ్చును. అప్పుడు ఆయనను ఎవరూ గుర్తించలేరు. అందువలన గురువుకు శిష్యులు
ఏర్పడరు.
భూమిమీద ఒక విద్య విస్తరించాలి అంటే ఒక గురువు, ఒక శిష్యుడు తప్పక ఉండి తీరాల్సిందే. ఒకరు
విద్యావేత్త, ఒకరు విద్యార్థి ఉన్నపుడే విద్యకు ప్రాణము వచ్చి పది కాలములపాటు బ్రతుకును. మొదట విద్యను తెలిసిన
విద్యావేత్త (గురువు) వలన విద్యను అర్థించు విద్యార్థి (శిష్యుడు) విద్యను సంపాదించుకొని, తర్వాత ఆ శిష్యుడు ఇతరులకు
బోధకుడై విద్యను ఎంతో మందికి తెలియునట్లు చేయును. అందువలన ఏ విద్యకైనా గురు శిష్య సంబంధము ఉండి
తీరాల్సిందే. దీని ప్రకారము బ్రహ్మవిద్యకు కూడ గురుశిష్య సంబంధము తప్పక ఉండవలెను. అయితే బ్రహ్మవిద్యలో
గురువును ఎవరూ గుర్తించలేరని, అందువలన గురువుకు శిష్యులుండరని కూడ చెప్పుకొన్నాము. వాస్తవానికి బ్రహ్మవిద్యలో
గురువును ఏ శిష్యుడూ గుర్తించలేడు. ఇక్కడ ఏ విద్యకైనా మొదట గురువు శిష్యుడు ఉండితీరవలెనని మీరే చెప్పి,
బ్రహ్మవిద్యలో గురువుకు శిష్యులుండరని మీరే చెప్పుట వలన మీరు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించుచున్నారని ఎవరైనా
మమ్ములను ప్రశ్నించవచ్చును. అంతేకాక సృష్టి తర్వాత పని చేయని దేవుడు తన ధర్మములకు ముప్పు ఏర్పడి,
అధర్మములు చెలరేగినపుడు మాత్రమే వచ్చి తన ధర్మములను తిరిగి తెలియజేసి పోవునని భగవద్గీతలో చెప్పియున్నాడు.
సృష్ఠి ఆదిలో ప్రజలకు ధర్మముల విషయమే తెలియనపుడు, భూమిమీద ధర్మములే లేనపుడు, ధర్మములకు ముప్పు
కలుగడము అను సమస్యే ఉండదు. ధర్మములు ఉంటే ధర్మములు అధర్మములుగా మారవచ్చును. మొత్తానికి ధర్మములే
లేనపుడు ధర్మములు అధర్మములుగా మారునను విషయమే ఉండదు. ధర్మములు అధర్మములుగా మారినపుడు దేవుడు
వస్తాడని బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతలో, జ్ఞానయోగము అను అధ్యాయమున ఏడవ శ్లోకమున చెప్పియున్నాడు.
ధర్మములు సృష్ట్యాదిలో లేనపుడు అవి అధర్మములుగా మారనప్పుడు దేవుడు వచ్చి చెప్పడు. అలా వచ్చి చెప్పాడు అంటే
బ్రహ్మవిద్యాశాస్త్రములోని ధర్మములకు ముప్పు కల్గినపుడు వస్తానని చెప్పిన శాసనము తప్పగును. శాస్త్రము ఎప్పటికి
శాసనముగానే ఉంటుంది, ఎప్పుడు అసత్యము కాకూడదు.
11

Page 12
భగవద్గీతలో అదే జ్ఞానయోగమను అధ్యాయమున మొట్టమొదటి శ్లోకములో, ఈ రహస్యమైన జ్ఞానమును నేను
సృష్ట్యాదిలోనే సూర్యునికి చెప్పియుంటిని, అతని వలన అందరికి తెలియబడినదని చెప్పియున్నారు. ఈ వాక్యము
ప్రకారము సృష్ఠి తర్వాత దేవుడు సూర్యునికి బోధించడము అను పనిని చేసినట్లు తెలియుచున్నది. అట్లు చెప్పియుంటే
దేవుడు రూప, నామ, క్రియారహితుడు అను మాటకు ముప్పు ఏర్పడి, ఆ మాట అసత్యమై సృష్టి తర్వాత కూడ దేవుడు
పని చేసినట్లగుచున్నది. అంతేకాక జ్ఞానయోగములోని ఒకటవ శ్లోకమునకు ధర్మములకు ముప్పుకల్గి ధర్మములు
అధర్మములుగా మారినపుడు వస్తానను ఏడవ శ్లోకము యొక్క మాట అసత్యమగును. ఏడవ శ్లోకము ప్రకారము చూస్తే
ధర్మములే లేనపుడు, ధర్మములు అధర్మములుగా మారనపుడు వచ్చి సూర్యునికి ధర్మములను తెలియజేస్తానని చెప్పిన
ఒకటవ శ్లోకము యొక్క మాట అసత్యమగును. భగవద్గీత రూపములోనున్న బ్రహ్మవిద్యా శాస్త్రములో రెండు శ్లోకములుగా
నున్న రెండు శాసనములు ఒకదానికొకటి విరుద్ధముగా ఉన్నవని అర్థమగు చున్నవి. ఈ రెండు మాటలలో ఏదో
ఒకమాట అసత్యము అని అనుకొనుటకు, శాస్త్రము ఎప్పటికి అసత్యముకాదు అను శాసనము కూడ కలదు. ఏ
కోవనుండి చూచినా దీనికి జవాబు అగమ్యగోచరముగా ఉన్నది.
ప్రపంచమునకు సంబంధించిన ఐదు శాస్త్రములను చూచినా, అవి ఏమాత్రము ఖండించబడలేదు. అటువంటపుడు
బ్రహ్మవిద్యా శాస్త్రము ఖండించబడునని ఎవరూ చెప్పలేరు. అది ఎప్పటికి ఖండించబడదు. ఖండించబడేది శాస్త్రమే
కాదు. అష్టాదశ (18) పురాణములలో ఎన్నో విషయములను ఖండించవచ్చును. కానీ శాస్త్రములు శాసనములై,
శాపములై ఉండుట వలన ఖండించబడవు. పై సమస్య శాస్త్రమునకు సంబంధించినది, కావున శాస్త్రముతోనే
పరిష్కారమగును. శాస్త్రము ప్రకారము గురువునకు శిష్యులు ఉండరు, శిష్యులకు బోధకులుండవచ్చునని ముందే చెప్పి
యున్నాము. భూమిమీద తెలియని దైవధర్మములను మొదట దైవమే తెలియజేయును. దేవుని ధర్మములు దేవునికే
తెలియును, కనుక మొదట దేవుడే చెప్పాలి. మొదట ఎవడు చెప్పునో వాడే గురువు. గురువుకు శిష్యులుండరు
అనుమాట శాసనము. అదే శాసనము ప్రకారము ప్రశ్న ఉన్నపుడే దానికి జవాబు ఉంటుంది. విద్యను అర్థించు
శిష్యుడున్నపుడే విద్యను తెలియజేయు విద్యావేత్త అయిన గురువు ఉంటాడు. ఇక్కడ గమనిస్తే గురువుకు శిష్యులుండరు
అనుమాట శాస్త్రమే, అట్లే ప్రశ్న ఉన్నపుడే జవాబుండునట్లు, శిష్యుడున్నపుడే గురువు ఉండునను మాట కూడ శాస్త్రమే.
ఈ రెండు మాటలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధముగా ఉన్నట్లు కనిపించినా, అది మన దృష్ఠి దోషమేగానీ, ఆ రెండు
మాటలలో ఏ వైరుద్యములేదు, రెండు మాటలు సత్యమే. ఇక్కడ రెండు మాటలు ఎలా సత్యమగును అను సంశయము
రాక తప్పదు. దానికి జవాబుగా ముందు గురువుకు శిష్యులుండరు అను మాటను వివరించుకొందాము.
భూమిమీదున్న గాలి ఎవరికీ కనిపించదు. కానీ గాలి ఉన్నట్లు దాని స్పర్శ ద్వారా తెలియుచున్నది. అలాగే
దేవుడు ఎవరికి కనిపించడు. కానీ దేవుడున్నట్లు దేవుని శక్తి ద్వారా తెలియుచున్నది. గాలి కనిపించకున్నా దాని
పీడనశక్తి బయటికి తెలియుచున్నది. అలాగే దేవుడు కనిపించ కుండినా దేవుని శక్తి అయస్కాంత శక్తిగా (గురుత్వాకర్షణ
శక్తిగా) బయటికి తెలియుచున్నది. ప్రకృతిలోని భాగమైన ఒకగాలికి మనము అంచనా వేయలేనంతశక్తి ఉన్నది.
ప్రకృతికి ఆధారమైన పరమాత్మ అయస్కాంతశక్తిగా ఉంటూ విశ్వములోని సూర్య నక్షత్రాది గోళములను, పంచభూతములను
తన అయస్కాంతశక్తి (Gravity Power) చేత ఖగోళములో నిలిపి ఉన్నది. విశ్వములోని అయస్కాంత శక్తి దేవుడున్నాడనుటకు
ఆధారము మాత్రమే. అది దేవుని యొక్క అణుమాత్రము శక్తియేగానీ దేవుడుకాదు. దేవుడు తనచేత నిర్మింపబడిన
విశ్వమునకు ధర్మములను ఏర్పరచి, వాటిని ఐదు శాస్త్రములుగా విభజించి పెట్టాడు. విశ్వమును సృష్టించిన తన
12

Page 13
ఉనికిని తెలియబరుచుటకు కూడా ధర్మములను ఏర్పరచి వాటిని ఒక శాస్త్రముగా నిర్మించాడు. ప్రపంచమునకు
సంబంధించినవి గణిత, ఖగోళ, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రములుకాగా, దేవునికి సంబంధించినది బ్రహ్మవిద్యా
శాస్త్రము. పరమాత్మ ఒక్కడు, ఆయన చేత సృష్టింపబడిన విశ్వము ఐదు భాగములు. అందువలన శాస్త్రములు ఆరు
తయారైనవి. ఐదు భాగముల ప్రకృతికి పరమాత్మ ఒక్కడే ఆధారమైనట్లు, ప్రకృతికి సంబంధించిన ఐదు శాస్త్రములకు
బ్రహ్మవిద్యా శాస్త్రము ఆధారమై ఉన్నది. అన్నిటికంటే గొప్పదైన బ్రహ్మవిద్యాశాస్త్రమును సృష్ట్యాదిలోనే దేవుడు సూర్యునకు
తెలియజేశాడు. దేవునికి సంబంధించిన ధర్మములు దేవునికే తెలియును, కావున దానిని దేవుడే సంపూర్ణముగ తెలియజేశాడు.
దీనినిబట్టి షట్శాస్త్రములలో మొట్టమొదట తెలియబడిన శాస్త్రము బ్రహ్మవిద్యాశాస్త్రము. ఇంతవరకు సంపూర్ణముగా
తెలియబడిన శాస్త్రము కూడ బ్రహ్మవిద్యాశాస్త్రమే. మిగత ఐదు శాస్త్రములు మానవునికి సంపూర్ణముగా ఇంతవరకు
తెలియబడలేదని చెప్పవచ్చును.
ప్రపంచమునకు సంబంధించిన ఐదుశాస్త్రములు ఇంతవరకు పది హేనుశాతము మాత్రమే తెలియబడినవి.
ఐదు శాస్త్రములలో తెలియ వలసిన సూత్రములు (సిద్ధాంతములు) 85 శాతము గలవు. అందువలన ప్రపంచ
విషయములలో అనేక ప్రశ్నలకు జవాబులు లేవు. కానీ బ్రహ్మ విద్యా శాస్త్రము దేవుని చేత ఆదిలోనే సంపూర్ణముగా
తెలియబడినది. కావున ఏ ప్రశ్నకైన జవాబు దొరికితీరుతుంది. ఇపుడు గురువుకు శిష్యులుండరు అను విషయమును
బ్రహ్మవిద్యాశాస్త్రము ద్వారానే తెలుసుకొందాము. దేవుడు తన జ్ఞానమును భూమిమీదున్న మనుషులకు తెలియజేయలేదు.
ఖగోళము లోనున్న సూర్యునికి బ్రహ్మవిద్యాశాస్త్రమును సంపూర్ణముగా తెలియజేశాడు. అలా తెలియబడిన ధర్మములు
సూర్యుని ద్వారా భూమిమీద ప్రజలకు తెలిసిపోయినవి. అలా ఒకమారు తెలిసిపోయిన ధర్మములు కొన్ని యుగములకు
(దాదాపు పది యుగములకు) అధర్మములుగా మారిపోవును. అప్పుడు ముందు చెప్పిన వాటిని తిరిగి చెప్పుటకు వచ్చు
దేవుని అంశను గురువు అంటున్నాము. గురువు భూమిమీదకు వచ్చి ముందు చెప్పిన ధర్మములనే తిరిగి పునరుద్దరించి
(తిరిగి తెలియబరచి) పోవును. అప్పుడు వచ్చిన గురువుకు శిష్యులు అవసరములేదు. ఎందుకనగా! గురువు ఒక్కమారే
ఒక్క శిష్యునికే తన ధర్మములను సంపూర్ణముగా తెలియజేయును. సృష్ట్యాదిలోనే దేవుడే గురువుగావుండి సూర్యున్ని
శిష్యునిగా చేసుకొని ధర్మములను తెలియజేశాడు. కావున మాటిమాటికి ఆయన వచ్చినప్పుడెల్లా ఆయనకు శిష్యులు
అవసరములేదు. ప్రశ్నించే శిష్యుడున్నపుడే జవాబు చెప్పే గురువుండాలి. విద్యను అర్థించే విద్యార్థి ఉన్నపుడే, విద్యను
తెలియ జేయు విద్యావేత్తయిన గురువు అవసరము. గురువులేనిది శిష్యుడుండడు అను సూత్రము ప్రకారము, మొదట
సూర్యుడు శిష్యుడుకాగా దేవుడు గురువైనాడు. సూత్రము ప్రకారము దేవుడు గురువైనాడు అప్పుడు శిష్యుడు కూడ
ఉన్నాడు. తర్వాత గురువుకు శిష్యులు అవసరములేదు. కావున ధర్మములు అధర్మములుగా మారినపుడు పాతధర్మములనే
తెలియజెప్పుటకు వచ్చును. అప్పుడు చెప్పుటకు క్రొత్త ధర్మములు ఏవీలేవు. క్రొత్త ధర్మములు ఉంటే శిష్యుడు అవసరము.
మిగిలిన క్రొత్త ధర్మములు ఏమిలేవు, కావున పునరుద్ధరణకు వచ్చినపుడు శిష్యులు అవసరములేదు. కొన్ని లక్షల
సంవత్సరములకు ఒకమారు ధర్మములకు గ్లాని కలిగి అధర్మములు అభివృద్ధియైనపుడు వచ్చిన గురువు ఎవనికో ఒకనికి
తెలియచెప్పిపోవును. ధర్మముల మీద శ్రద్ధలేని అనామకునికి చెప్పిన జ్ఞానము వినినప్పటికి వానికి అది ఉపయోగపడదు.
కానీ తర్వాత వానిద్వారా తెలుసుకొన్నవారికి పనికి వచ్చును. సాంబారు పాత్రలోనికి గరిటెను పెట్టినా, గరిటకు
సాంబారు రుచి అవసరములేదు. కానీ గరిటెతో సాంబారును పోయించుకొని తినేవానికి సాంబారు రుచి తెలిసినట్లు,
దేవుడు తన ధర్మములను పునరుద్దరించు కార్యక్రమములో ధర్మములు తెలియ వలసిన మనుషులకు తనకు మధ్యలో
గరిటెలాంటి వ్యక్తిని పెట్టుకొని, వానికి ధర్మములను తెలియజేయును. అదే విధముగ కృష్ణుడు ధర్మముల మీద ఆసక్తిలేని
13

Page 14
అర్జునున్ని అడ్డము పెట్టుకొని ధర్మములను తెలియజేప్పి పోయాడు. అంతేగానీ ఆయన ఏ శిష్యులను తయారు చేసుకోలేదు.
కృష్ణుడు జగత్కంతటికి గురువైన జగద్గురువని ఎవరూ ఆయనను గుర్తించలేదు. ఇక్కడ గురువుకు శిష్యులుండరు
అనుమాట శాస్త్రబద్దముగా నెరవేరినదని చెప్పవచ్చును. ఒక కృష్ణునిగా వచ్చినపుడేకాక, ఎప్పుడైనా ధర్మములను
పునరుద్దరించుటకు వచ్చిన గురువు (దైవము) ఏ వ్యక్తిగా ఉండినా, అప్పుడు ఆయన శిష్యులను తయారుచేసుకోడు.
ఆయన ఎవరికీ గురూపదేశమును ఇవ్వడు. ఆయనను ఎవరు గురువుగా గుర్తించరు. ఆయన గురువుగా కనిపించడు.
ఇదంతా శాస్త్రబద్దమే. అందువలన గురువుకు శిష్యులుండ రను మాట నూటికి నూరుపాళ్ళు సత్యము మరియు
శాసనము అని గ్రహించవలెను.
శిష్యుడుంటేనే గురువుంటాడు అను మొదటి మాట మరియు గురువుకు శిష్యులుండరు అను రెండవ మాట,
రెండు పరస్పర విరుద్దముగా కనిపించినా రెండు శాస్త్రబద్ధమైన మాటలని చెప్పుకొన్నాము. అందులో గురువుకు
శిష్యులుండరను మాట సత్యమని శాస్త్రబద్ధమని తెలిసిపోయినది. ఇక శిష్యుడుంటేనే గురువుంటాడు అనుమాట ఎలా
సత్యమో, ఎలా శాస్త్రబద్దమో వివరించుకొని చూద్దాము. విశ్వమును సృష్టించినపుడు అందులోని మానవులకు దేవుని
ధర్మములు అంటే ఏమిటో తెలియవు. దేవుడు అంటే ఎవడో కూడ తెలియదు. అటువంటి పరిస్థితిలో దేవుడే తన
ధర్మములను మొట్టమొదట తెలియబరచవలసి ఉన్నది. మొదట చెప్పబడు జ్ఞానమును (ధర్మములను) తెలుసుకొనుటకు
శిష్యుడు తప్పనిసరిగ ఉండవలెను. శిష్యుడుంటే గురువున్నట్లే లెక్కించబడును. దేవుడు కనిపించే మనిషిగా కృష్ణుని
మాదిరి వచ్చి చెప్పితే అది ధర్మవిరుద్ధము, శాస్త్రవిరుద్ధము అగును. ఎందుకనగా ముందే ఉన్న ధర్మములు లేకుండ
పోయినపుడు మాత్రమే దేవుడు (దేవుని అంశ) మనిషిగా వచ్చి తిరిగి చెప్పినవాటినే చెప్పి పోవును. పాత ధర్మములకు
శిష్యుడు అవసరములేదు. క్రొత్త ధర్మములకు గురువు శిష్యుడు ఇద్దరు అవసరమే. గురుశిష్య సంబంధము ఉండి
తీరవలసిందే. ఇక్కడ ముందే చెప్పబడిన పాతధర్మములు అను మాటను మరియు మొట్ట మొదట చెప్పబడు క్రొత్త
ధర్మములు అను మాటను జ్ఞప్తిలో ఉంచుకోవలెను. పాతధర్మములను బోధించునపుడు శిష్యులుండరు. క్రొత్త ధర్మములను
బోధించునపుడు తప్పనిసరిగ శిష్యుడు అవసరము. క్రొత్త ధర్మమును బోధించునపుడు ఎదురుగా శిష్యున్ని పెట్టుకొని
తాను మనిషిగావుండి బోధించినా దేవుడు బోధించినట్లే అగును. తర్వాత బోధించే గురువు శిష్యునికి కనిపించి
బోధించినట్లగును. క్రొత్త ధర్మములను బోధించునపుడు గురు శిష్యులుండినా, శిష్యునకు గురువు కనిపించకూడదు.
కనిపించి బోధిస్తే దేవుడు పని చేసినట్లగును. దేవుడు పని చేసినట్లు కాకుండ క్రొత్త ధర్మములు శిష్యునికి తెలియపరచవలెను.
శిష్యునికి దేవుడు (గురువు) జ్ఞానమును (ధర్మములు) తెలుపుచుండినా, శిష్యుడు గురువునుండి జ్ఞానమును అడిగి
తెలుసుకొనుచుండినా ఆ దృశ్యమునుగానీ, ఆ విషయము గానీ ఇతరులకు ఎవరికి తెలియకూడదు. తెలిస్తే దేవుడు పని
చేసినట్లు ఆరోపణవచ్చును. కావున క్రొత్త ధర్మములను మొదట ఒక శిష్యునికి దేవుడే తెలుపవలసియున్నా, శిష్యుడు
దేవుని ద్వారానే తెలుసుకొనినా దేవుడు ఎలా బోధించినది, శిష్యుడు దేవుని ద్వారా ఎలా తెలుసుకొన్నది బయట
ప్రపంచములోని ఎవరికీ తెలియకూడదు.
చములోని
బయట ప్రపంచములో ఎవరికి తెలియకుండ దేవుడు రహస్యముగా బోధించినా వాస్తవానికి దేవుడు పని
చేసినట్లే కదా! అని కూడ కొందరడుగ వచ్చును. దానికి మేము కూడ అవుననే సమాధానము చెప్పవలసి వస్తుంది. కానీ
కనిపించకుండా కూడ దేవుడు పనిని చేశాడని చెప్పుటకు వీలు లేకుండ దేవుడు చేశాడు. అదెలా అనగా! విశ్వవ్యాపి
అయిన దేవుని అంశ ఒకటి భూమిమీద పుట్టి, ఆకారమును ధరించి ధర్మములను తెలియజేయడము ధర్మములను
14

Page 15
పునరుద్దరించినట్లగును. ఆ విధముగ కృష్ణావతారములో జరిగినది. అప్పుడు గురువుకు శిష్యులుండరని కూడ చెప్పాము.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే సర్వవ్యాపి అయిన దేవుడు అందరి శరీరము లందున్నాడు. కావున జ్ఞానము
తెలుసుకొను స్థోమత కల్గిన వానిని మరియు తెలిసిన ధర్మములను ఒక భూమండలములోనే కాక జీవరాసులున్న ఇతర
గోళముల మీద కూడ తెలియజేయు స్థోమత కలిగిన వానిని, నేను మీకు దైవజ్ఞానమును తెలిపాను అను సాక్ష్యముగా
చిరకాలముండువానిని, నేను దేవుని జ్ఞానమును తెలిపి దానివలన ఎవరు నన్ను ఏమి చేయలేరని తెలియ బరుచువానిని,
శరీరములోనే దేవుడు గుర్తించి వానిని శిష్యునిగా ఎన్నుకొనును. అలా అన్ని స్థోమతలున్నవాడు విశ్వములో సూర్యుడొక్కడే
గలడు. “మత్ స్థాని సర్వభూతాని" అన్నట్లు దేవుడు అందరియందు గలడు, అందరు దేవునియందుకలరు, అను
సూత్రము ప్రకారము సూర్యుని శరీరములో కూడ దేవుని అంశకలదు. దేవుని అంశయే సూర్యుని స్థోమతను గుర్తించి
సూర్యున్ని శిష్యునిగా చేసుకొన్నది. సూర్యుని శరీరములోనే ఉన్న దేవుని అంశ సూర్యునికి గురువుగా ఉంటూ, తన
ధర్మములను సూర్యునికి శరీరము లోపలనే బోధించను మొదలు పెట్టింది. గోళమునే శరీరముగానున్న సూర్యుడు తన
శరీరములోనే తెలియబడు అనేక దైవధర్మములను తెలుసు కొన్నాడు. అప్పుడప్పుడు సూర్యునికి కొన్ని ప్రశ్నలు పుట్టుచుండగా
ఆ ప్రశ్నలకు లోపలనున్న దైవశక్తియే జవాబును ఇస్తూ పోయింది. ఈ విధముగ ఒక సంవత్సర కాలము వరకు
సూర్యుని శరీరములోని దేవుడు గురువుగా ఉంటూ, శరీరములోని సూర్యున్ని శిష్యునిగా చేసుకొని, సంపూర్ణముగా
ధర్మములను తెలియజేశాడు. ప్రశ్న శరీరములోనే, జవాబు ఆ శరీరములోనే ఉత్పన్నముకాగా, ఒకే శరీరములో
గురువు శిష్యుడు ఒకే కాలములో ఉంటూ, గురుశిష్యసంబంధముతో శిష్యునికి ధర్మములను గురువు తెలిపాడు. ఒక
శరీరములోని దైవము యొక్క అంశ, అదే శరీరములోనే జీవునికి ధర్మములను తెలిపిన విషయము ఎవరికీ తెలియని
రహస్యము. అందువలన సృష్ఠి తర్వాత దేవుడు పని చేసినట్లు కాకుండ పోయినది. ప్రత్యేకించి ఒక శరీరమును
ధరించిన దేవుని అంశ, ముందు తాను చెప్పిన ధర్మములనే తిరిగి చెప్పును. అప్పుడు శిష్యుడు అవసరములేదు. ఒక
శరీరములో అందరియందున్నట్లు సర్వసాధారణముగ నున్న దేవుని అంశ, అదే శరీరమును వేదిక చేసుకొని అందులోని
జీవున్ని శిష్యునిగా చేసుకొని క్రొత్త ధర్మములను తెలియజేయును. అది సృష్ఠి తర్వాత ఒకమారే జరుగును.
చెప్పడము జరిగినప్పటికీ అది సృష్ఠి తర్వాత దేవుడు చేసిన పనికాదు. దేవుని అంశ చేసిన పని అయినందున దానిని
సంపూర్ణ దేవుని పనిగా లెక్కించలేము.
శాస్త్రబద్దతకు ఏమాత్రము లోపము లేకుండ సృష్ట్యాదిలో దేవుని అంశ ధర్మములను బోధించింది. అయితే
ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! మొట్టమొదట ధర్మములు బోధించబడినపుడు గురువు శిష్యుడు
ఇద్దరు ఉండినా, వారు బాహ్యముగా కనిపించరు. ఒకే శరీరములో ఇద్దరు ఉండుటవలన శిష్యునికి వచ్చిన ప్రశ్నగానీ,
గురువు చెప్పిన జవాబు గానీ, బయటి ప్రజలకు ఎవరికి తెలియదు. శరీరమును వేదిక చేసుకొని దేవుని అంశ
జీవాత్మకు బోధించగా, ఆ జీవాత్మ బయటి ప్రజలకు మొట్ట మొదట బోధించినవాడగును. అందువలన మొదట
భూమిమీద ప్రజలకు ధర్మములను తెలియజేసిన ఘనత సూర్యునికి దక్కినది. సూర్యునికి ఎవరు బోధించినది ప్రజలకు
తెలియదుగానీ, ప్రజలకు మొదట బోధించినది సూర్యుడని అందరికి తెలుసు. మొదట భూమండలములో ప్రజలకు
దైవ ధర్మములను తెలియజేసిన వాడు సూర్యుడు. అందువలన సూర్యున్ని కొందరు ఆది గురువు అంటున్నారు.
వాస్తవానికి ఆది గురువు దైవమే అయినా, అది ఎవరికి తెలియని రహస్యము అగుట వలన, ఆది గురువుగా సూర్యున్నే
చెప్పవచ్చును. మనకు ఆదిలోని దైవ రహస్యము కొంత తెలిసింది కావున సూర్యున్ని ఆది గురువు అనడమేకాక, అదే
సూర్యున్ని ఆది శిష్యుడని కూడ చెప్పుచున్నాము. అలా ఒకే వ్యక్తిని ఆదిగురువుగా మరియు ఆది శిష్యునిగా చెప్పడము
15

Page 16
వలన, అలా ఎందుకు చెప్పుచున్నారని ఎవరికైన ప్రశ్నరావచ్చును. ప్రశ్నవచ్చుట వలన వారు జవాబుకొరకు వెదకుటకు
అవకాశము కలదు. అలా అన్వేషించువారికి ఎప్పటికైన జవాబు దొరక గలదు. అప్పుడు వారికి కూడ ఆదిలో
ధర్మములు ఎలా తెలియబడ్డాయో తెలిసిపోగలదు.
దేవుని అంశ కనిపించే గురువుగా శరీరముతో వచ్చినా, గురువుగా ఆయనను ఎవరూ గుర్తు పట్టలేరు. కావున
గురువుకు శిష్యులుండరని చెప్పాము. కొందరు తమకు గురువు కావాలని అన్వేషించినా గురువు వారికి దొరకడు.
ఒకవేళ గురువు దొరకినా, ఈయన మాకు గురువుకాదని శిష్యులు తేల్చి చెప్పుదురు. అప్పుడు వారికి గురువు దొరికి
ప్రయోజనము లేదు. వారి లెక్కలో వారికి గురువు దొరకనట్లే. కనిపించే శరీరముతో ప్రత్యేకముగా జన్మించి రాకపోయినా
అందరి శరీరములో వ్యాపించియున్న పరమాత్మ, అదే శరీరములోని జీవునికి జ్ఞానమును తెలియజేయడము వలన, ఒకే
శరీరములోనే బయట ప్రజలకు కనిపించకుండ గురువు శిష్యులున్నారని చెప్పుకొన్నాము. అంతేకాక సృష్ఠి కల్పమునకు
అంతటికి అలా ఒకమారే జరుగునని చెప్పుచున్నాము. 1000 యుగములలో దేవుడు శరీరము ధరించి ముందు
తెలిపిన ధర్మములనే తిరిగి తెల్పుటకు, వందమార్లుగానీ అంతకంటే ఎక్కువగానీ రావచ్చును. కానీ శరీరము ధరించకుండ
శిష్యుడున్న శరీరములోనే ఒకే ఒక్కమారు తన జ్ఞానమును బోధించును. దీనినిబట్టి దేవుడు శరీరమును ధరించకుండ
ఒక్కమారు చెప్పినా, శరీరమును ధరించి వందమార్లు చెప్పినా ఒకే జ్ఞానమును చెప్పుననీ, దానిలో ఎటువంటి మార్పు
చేర్పు ఉండదని తెలియుచున్నది. మనకు తెలిసినంతవరకు కృష్ణుడు శరీరమును ధరించి వచ్చియున్న దైవశక్తి అని
అర్థమైనది. కృష్ణుడు అర్జునున్ని అడ్డము పెట్టుకొని జ్ఞానము చెప్పాడని, నిజానికి శిష్యుని లక్షణాలు అర్జునునిలో లేవని,
అందువలన అర్జునుడు శిష్యుడుకాదని, గతములో కూడ చెప్పుకొన్నాము. అయితే చెప్పువానిని గురువుగ వినేవానిని
శిష్యునిగ లెక్కించవచ్చును కదా! దానిప్రకారము అర్జునుడు శిష్యుడే అగును కదా! అని కొందరడుగవచ్చును. భగవద్గీత
సాంఖ్యాయోగములో ఏడవ శ్లోకమందు నన్ను శిష్యునిగ లెక్కించి, ఎట్లు చేయుట ధర్మమో తెలుపుమని అర్జునుడు
కృష్ణున్ని అడిగాడు. అక్కడ గమనిస్తే అర్జునుడు అడిగింది యుద్ధము చేయాలా? వద్దా? అను ప్రపంచ విషయమును
అడిగాడు తప్ప పరమాత్మ విషయమును అడుగలేదు. ప్రపంచ విషయములో ఎవరు ఎవరికైనా గురువుకావచ్చును.
కానీ పరమాత్మ విషయములో ఎవడు ఎవనికి గురువుకాడు. యుద్ధరంగములో ఆ సమయానికి ఏమి చేయాలో
తెలియని స్థితిలో ఉండి, కృష్ణున్ని గురువుగా మొక్కి తనను శిష్యునిగా లెక్కించుకొని అడిగినా, అడిగిన సమస్య ఆధ్యాత్మికము
కాదు, కావున అర్జునున్ని శిష్యునిగా లెక్కించకూడదు. తర్వాత యుద్ధానంతరమూ అర్జునుడు కృష్ణున్ని తనకు ఆధ్యాత్మిక
గురువుగా గుర్తించినట్లు ఎక్కడా చెప్పుకోలేదు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. దైవజ్ఞానము మీద ధ్యాసలేని
అర్జునునికి ధర్మములను కృష్ణుడు ఎందుకు తెలియజేయాలి? ధర్మముల మీద ఆసక్తివున్న వానికి ఎవనికైన చెప్పవచ్చును
కదా! అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! భూమిమీదికి శరీరమును ధరించి గురువుగా వచ్చిన
గురువు (కృష్ణుడు) ఎదురుగా కనిపించు వ్యక్తికి (అర్జునునికి) దైవధర్మములను చెప్పినా అవి నేరుగా ఎదుటి శరీరములోని
ఆత్మను చేరును. అందువలన గురువుగా వచ్చినపుడు తెలిపిన జ్ఞానము వినే జీవునికి కాదని, అదే శరీరములోని జీవుని
ప్రక్కనున్న ఆత్మకని తెలియవలెను. ఇంకొక రహస్యమేమనగా! శరీరమును ధరించకుండ శరీరములోనే పరమాత్మ
అంశ తెలుపు జ్ఞానము అదే శరీరములోని జీవునికి చేరుచున్నది. అందులన అక్కడ జీవుడు (శిష్యుడు) అగుచున్నాడు.
కృష్ణునిగా వచ్చి చెప్పినపుడు అర్జునుని ఆత్మకు జ్ఞానము చేరడము వలన అర్జునుడు శిష్యుడు కాలేకపోయాడు.
ఇప్పటికి దాదాపుగా దేవుని వివరము, ధర్మము తెలిసిపోయినట్లే. తెలిసిన దాని ప్రకారము దేవుడు ఈ సృష్ఠి
అంతయు లేనప్పుడు కూడ ఉన్నాడు. కానీ అప్పుడు ఎట్లు ఉన్నాడో ఏ శాస్త్రములు ఆయనను గురించి తెలుపలేవు.
16

Page 17
సృష్ఠి పూర్వము దేవున్ని ఏ ప్రమాణముతోను చెప్పుటకు వీలులేదు. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగమున 20వ
శ్లోకమున "భావోన్యో" అను పదమునుపయోగించి సృష్ఠి పూర్వమున్న దైవమును గూర్చి చెప్పడము జరిగినది. "భావోన్యో”
అనగా మనము భావించుకొను భావములకు అన్యముగా ఉన్నాడని తెలియుచున్నది. మనము ఏ విధముగా యోచించి
భావించినా, ఆ భావముకంటే వేరుగా ఉన్నాడని అర్థము. వాస్తవముగా చెప్పాలంటే ఏ ప్రమాణమునకు దైవము
అందనిదని అర్థము. సృష్ఠి తర్వాత పరమాత్మ అనీ, పురుషోత్తముడనీ శాస్త్రప్రమాణముగా చెప్పగలుగుచున్నాము. విశ్వము
పుట్టిన తర్వాత శాస్త్రము పుట్టింది. కావున బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము దేవుడు సర్వాంతర్యామి, విశ్వవ్యాపి,
సర్వధారి, పరమాత్మ, పురుషోత్తముడు అని చెప్పవచ్చును. ఇవే మాటలను సృష్ఠి పూర్వము ఎవరూ లేనపుడు సర్వాంతర్యామి
అనుటకు వీలులేదు. విశ్వమే లేనపుడు విశ్వవ్యాపి అనుటకు వీలులేదు. ఏదీ లేనపుడు సర్వధారి అనుటకు కుదరదు.
ఆత్మే లేనపుడు పరమాత్మ అనుటకు వీలులేదు. అలాగే క్షర పురుషుడుగానీ, అక్షర పురుషుడుగానీ లేనపుడు పురుషోత్తమ
అనుటకు అవకాశమే లేదు. దీనినంతటిని బట్టి చూస్తే సృష్ఠి లేనపుడు దేవుని గురించి ఏమీ చెప్పలేము. సృష్ఠి
ఉన్నపుడు మాత్రమే దేవున్ని గురించి శాస్త్రబద్దముగా చెప్పగలము.
సృష్ఠి లేని కాలము, సృష్ఠి ఉన్న కాలములు రెండు ఉన్నాయని తెలిసినది కదా! సృష్ఠి ఉన్న కాలములో మనము
ఉన్నాము. సృష్ఠి మొదలైన కాలమును ఖచ్చితముగా చెప్పలేము. కానీ సృష్ఠి మొదటి నుండి ఎంత కాలముండునో
చెప్పగలము. బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము ప్రపంచము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములని తెలియుచున్నది.
సృష్ఠి వెయ్యి యుగముల కాలముండునని శాస్త్రమే చెప్పుచున్నది. 1) కృత యుగము 2) త్రేతాయుగము 3) ద్వాపరయుగము
4) కలియుగము అను నాలుగు యుగములు 250 మార్లు జరుగవలెనని తెలియుచున్నది. సృష్ఠి మొదలైనది
కృతయుగముతోనని, అంత్యమగునది కలియుగముతోనని తెలియుచున్నది. అంతేకాక కలియుగము యొక్క పరిమాణము
4,32,000 సంవత్సరములని, దానికంటే రెండింతలు 8,64,000 సంవత్సరములు ద్వాపరయుగమని, కలియుగమునకు
మూడింతలు 12,96,000 సంవత్సరములు త్రేతాయుగమని, అలాగే కలియుగమునకు నాలుగంతలు, 17,28,000
సంవత్సరములు కృతయుగమని తెలియుచున్నది. నాలుగు యుగములు గడచుటకు 43,20,000 సంవత్సరముల
కాలము పట్టుచున్నది.
కలియుగము
4,32,000 సం||
ద్వాపరయుగము
8,64,000 సం||
త్రేతాయుగము
12,96,000 సం||
కృతయుగము
17,28,000 సం॥
నాలుగు యుగములు మొత్తము 43,20,000 సం॥
కలియుగము పరిమాణమునకు పదింతలుగా నాలుగు యుగముల పరిమాణమున్నదని తెలియుచున్నది.
25 మారి
నాలుగు యుగములు 250 మార్లు జరిగితే వెయ్యియుగములగును. ఒక నాలుగు యుగములు గడుచుటకు
43,20,000 సంవత్సరముల కాలము పట్టినపుడు, నాలుగు యుగములు 250 మార్లు గడుచుటకు 108 కోట్ల
సంవత్సరములు పట్టును.
43,20,000 × 250 = 108,00,00,000.
17

Page 18
ఈ విధముగా ప్రపంచము యొక్క ఆయుస్సును 108 కోట్ల సంవత్సరములుగా బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారమే
చెప్పవచ్చును. ప్రపంచము యొక్క ఆయుస్సును ఎవరూ మరిచిపోకుండ ఉండుటకు జప మాలలో 108 పూసలనే
ఉంచడము జరిగినది. ప్రపంచము 108 కోట్ల సంవత్సరములు జీవులతో నిండి జనన మరణములు జరుగుచుండును.
108 కోట్ల సంవత్సరములను ఒక కల్పము అనుచున్నాము. కల్పము అయిపోయిన వెంటనే ప్రళయము వచ్చును.
కల్పము అనగా సృష్ఠించబడినది లేక కల్పించబడినదని అర్థము. పంచభూతములచేత సృష్ఠించబడిన ప్రపంచము
ప్రళయములో లేకుండ పోవును. అలా ప్రపంచము లేని స్థితిని దేవునికి రాత్రి కాలముగ, ప్రపంచమున్న స్థితిని దేవునికి
పగలు కాలముగ బ్రహ్మవిద్యా శాస్త్రములో దేవుడే చెప్పాడు. దేవుని పగలు 108 కోట్ల సంవత్సరములైనపుడు దేవుని
రాత్రి కూడ 108 కోట్ల సంవత్సరములే ఉండును. మనిషికి పగలు పండ్రెండు గంటలు, రాత్రి పండ్రెండు గంటల
కాలమున్నట్లు, దేవునికి కూడ పగలు 108 కోట్లు, రాత్రి 108 కోట్ల సంవత్సరములుండును. కాలచక్రములో మనిషికి
ఒక రాత్రి పగలు గడుచుటకు 24 గంటలు పట్టినట్లు దేవునికి ఒకరాత్రి ఒక పగలు గడుచుటకు 216 కోట్ల సంవత్సరములు
పట్టును. ఈ లెక్క ప్రకారము చూస్తే మనిషి లెక్కలో 25,000 సంవత్సరములు గడిస్తే దేవుని లెక్కలో ఒక్క సెకండు
గడచినట్లు, మనిషి లెక్కలో 15,00,000 సంవత్సరములు గడిస్తే దేవుని లెక్కలో ఒక్క నిమిషము గడచినట్లగును.
మనిషి లెక్కలో 9 కోట్ల సంవత్సరములు గడిస్తే దేవుని లెక్కలో ఒక్క గంట గడచినట్లగునని తెలియుచున్నది.
సృష్ట్యాది నుండి మనము అందరము ఉన్నాము. కానీ ఇప్పుడున్నది మాత్రము మనకు తెలియుచున్నది. గతములో
ఎన్నోమార్లు జన్మించి, కొంత కాలము బ్రతికి, ఎన్నోమార్లు చనిపోయాము. ఈ విధముగ ప్రళయము వరకు మనము
చావుపుట్టుకల చక్రములో చిక్కుకొని ప్రతి జీవితములోను ఎన్నో పాపములను బాధలరూపముగా అనుభవిస్తున్నాము.
ఇటువంటి చావుపుట్టుకలనుండి తప్పించుకోవాలంటే, పాపఫలితములను పొందకుండ ఉండాలంటే, మనిషికి ముక్తి
రావాలంటే జగతిలో ఎవరికైనా సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానమే ఆధారము. దేవుడు చెప్పిన జ్ఞానము వలననే
మనిషి కర్మబంధముల నుండి బయట పడగలడు, మోక్షమును పొందగలడు. అయితే సృష్టి మొదటిలో దేవుడు చెప్పిన
జ్ఞానము ఏనాడో మనుషులకు తెలియకుండ పోయింది. అందువలన దైవజ్ఞానము కావాలనుకొన్న మనిషి, ఏది దైవజ్ఞానమో
తెలియక ఎందరో గురువులమను వారు చెప్పినదే జ్ఞానమని నమ్మి దానినే అనుసరించుచున్నాడు. సృష్ట్యాదిలో దేవుడు
చెప్పిన జ్ఞానము తెలియకుండ పోయి, దాని స్థానములో అనేకమంది చెప్పిన, అనేక జ్ఞానములు వచ్చి చేరినవి.
ఉదాహరణకు భూమిమీద పది రకముల గురువులు పది రకములుగా తమ తమ జ్ఞానమును చెప్పగా, మనుషులు కూడ
పది రకములుగా చీలిపోయి, ఒక్కొక్క గురువును ఆశ్రయించిన వారందరు ఒక్కొక్క రక జ్ఞానమును తెలుసుకొని, ఎవరికి
వారు మేమే గొప్ప జ్ఞానులమనుకొనుచున్నారు. విశేషమేమంటే పది రకముల గురువుల జ్ఞానములలో ఒక్కరిది కూడ
దేవుడు చెప్పిన జ్ఞానము కాకుండ పోయినది. కాలక్రమేపి దేవుడు చెప్పిన ధర్మములు పోయి, మనుషులు, దైవజ్ఞానమను
పేరుతో సృష్టించిన జ్ఞానము వచ్చి, ఏది మనుషులు చెప్పిన ధర్మమో, ఏది దేవుడు చెప్పిన ధర్మమో తెలియకుండ
పోయినది. అటువంట పుడు దేవుడు చెప్పిన ధర్మములకు ముప్పు ఏర్పడి దేవుని ధర్మముల స్థానములో మనుషుల
అధర్మములు చోటు చేసుకొన్నవి. దేవుని ధర్మములు దేవునికే తెలుసు, కావున తిరిగి వాటిని చెప్పవలసినవాడు దేవుడే
అని ముందు పేజీలలో వ్రాసుకొన్నాము. ఇంటిగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్లు, ఒళ్ళు (ఒంటి గుట్టు దేవునికెరుక.
ఒళ్ళు లేక ఒంటి అనగా సజీవ శరీరమని అర్ధము. జన్మించిన శరీరముతో ఉన్నవాడు శరీరము అను ఇల్లునుండి
బయటపడుటకు ఒక విధానము కలదు. ఆ విధానమే జ్ఞానము అను గుట్టు లేక రహస్యము. జ్ఞానము అనే గుట్టు
శరీరమను ఇల్లును తయారు చేసిన వానికే తెలుసు. శరీరము అను ఇల్లును తయారు చేసినవాడు దేవుడే, కనుక ఇంటి
18

Page 19
గుట్టు పెరుమాళ్ళకెరుక, ఒంటి గుట్టు దేవునికెరుక అన్నారు. ఇంటి గుట్టు అనినా, ఒంటి గుట్టు అనినా రెండూ ఒకటే.
అలాగే పెరుమాళ్ళు అనినా, దేవుడు అనినా రెండు ఒకటే అని అర్థము. గుట్టు అనగా రహస్యమైన జ్ఞానము అని
గుర్తుంచుకోవాలి.
ఎలా చెప్పుకొనినా మనిషి కర్మలనుండి, జన్మలనుండి ముక్తి పొందుటకు దేవుని జ్ఞానము ఒక్కటే అవసరము.
ఆ ఒక్క జ్ఞానమును తెలుపువాడు ఒక్క దేవుడు మాత్రమే. దేవునికి తప్ప ఎవరికీ కర్మములను జయించు జ్ఞానము
తెలియదు, ఏ మనిషికీ దైవధర్మములు తెలియవు. అందులన మనుషులు చెప్పినది దేవుని ధర్మములు కావు. ఇపుడు ఒక
పెద్ద చిక్కు వచ్చి పడింది. అది ఏమనగా! దేవుడా, కనిపించడు మరియు మాట్లాడు పనిని కూడ చేయడు. ఒకవేళ
సైగలతోనైనా తెలుపగలడా అని చూస్తే అది కూడ పనియే అవుతుంది కదా! నేను ఏ పనిని చేయని క్రియారహితుడనని
అంటాడు. సైగలు చేయుటకైనా ఆయన కనిపించాలి కదా! ఇటు కనిపించడు, అటు వినిపించడు అటువంటపుడు
తన ధర్మములను దేవుడు తిరిగి తెలియజేస్తాడనడము ఒప్పుకోవలసిన మాటేనా అని మనకు ప్రశ్న రాకతప్పదు.
కనిపించనివాడు, వినిపించనివాడు తన జ్ఞానమును ఎలా తెలియజేస్తాడని ఎవరైనా అడగవచ్చును. దానికి సమాధానము
ఏమనగా! మనకు చెవి ద్వార శబ్దము వినిపిస్తుంది. జ్ఞానము శబ్దము ద్వారానే మనిషికి తెలియాలి. మనిషి తనకు
అర్థమయ్యే శబ్దమును విన్నపుడే ఆ శబ్దములోని సారాంశమును గ్రహించును. అందువలన తాను మాట్లాడే భాషలోనే
మనిషి జ్ఞానమును వినాలి. అటువంటపుడు దేవుడు మనిషికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. మనిషికి అర్థమయ్యే
భాషలోనే చెప్పాలి అంటే ఎదుట ఇంకొకరుండి చెప్పాలి. ఎదురుగా ఉన్న వాడు తనలాగున్నపుడే, తనలాగ మాట్లాడునపుడే
అతనిని చూచి గౌరవించి, అతని మీద ఉన్న గౌరవముతో, అతడు చెప్పు మాటలను మనిషి వినును. అనగా వినే
మనిషికి చెప్పే వాడు చిరపరిచితుడై ఉండాలి మరియు అతను తనతో మాట్లాడువాడై ఉండాలి. ఇదంతటిని చూస్తే
జ్ఞానము తెలియని మనిషికి జ్ఞానము తెలిసిన మరొక మనిషి, జ్ఞానమును తెలుపుచున్నాడనియేగా అర్థము. దేవుడు
తెలుపునదే అసలైన జ్ఞానమని, ఏ మనిషి అసలైన జ్ఞానమును తెలుపలేడనీ ఇంతవరకు మీరే చెప్పారు. ఇప్పుడేమో ఒక
మనిషికి జ్ఞానము తెలియాలంటే అతనిలాగ ఉన్న మనిషే జ్ఞానమును చెప్పాలి. అలా చెప్పినపుడే వినేవానికి జ్ఞానము
తెలియునని అన్నారు. దేవుడు కనిపించడు, వినిపించడు. అలాంటపుడు కనిపించి చెప్పేవాడు దేవుడు కాదని మీరే
అంటారు. ఈ పద్ధతిలో దేవుడు తన జ్ఞానమును మనుషులకు ఎలా తెలియజేస్తాడని నన్ను అడిగితే! దేవుడు మనిషికి
అన్ని విధాల అర్థమయ్యేలాగునే మనకు కనిపించి వినిపించేలాగున తెలియజేయుటకు తగిన ఏర్పాట్లు చేసిపెట్టాడని
చెప్పవచ్చును. దేవుడు కనిపించడు, వినిపించడు అను మాట వాస్తవమే. కావున దేవుడు స్వయముగ చెప్పకుండ
కనిపించే వానితో మరియు వినిపించే వానితో చెప్పించును. అలాగని చెప్పేవాడు మనిషికాదు.
దేవుని జ్ఞానము
దేవునికే తెలియును. ఏ మనిషి చెప్పలేడు అన్నాము కదా! అలాగని దేవుని జ్ఞానమును సంపూర్ణముగ తెలియజేయు
వాడు ఇటు దేవుడూ కాదు, అటు మనిషీకాడు. అయితే దైవధర్మములను తిరిగి తెలుపువానిని ఏమనాలి? అని
ప్రశ్నించవచ్చును. చెప్పబడునవి దైవ ధర్మములైనప్పుడు, చెప్పువాడు కనిపించినా, వాడు మనిషికాడు. ఇంకొక విధముగ
చూస్తే చెప్పబడునవి దైవధర్మములైనపుడు కనిపించువాడు దేవుడూ కాదు. రూప, నామ, క్రియలు లేనివాడు దేవుడు
అన్న సూత్రము ప్రకారము కనిపించి చెప్పేవాడు దేవుడు కాడు. దేవుని జ్ఞానమును దేవుడు తప్ప మనిషి తెలియజేయలేడను
సూత్రము ప్రకారము చెప్పువాడు మనిషి కాడు. ఇటు మనిషికాక, అటు దేవుడుకాకుండ ఉన్నవాడు మాత్రమే తెలియజేయాలి.
వివరముగా చెప్పితే దేవుడు కాకుండ మనిషి లక్షణములుండి, మనిషి కాకుండ దేవుని లక్షణములున్న వాడు మాత్రమే
తెలియజేయును. ఇటు దేవుడు, అటు మనిషి కానివాడు ఒక్కడే ఒకడు గలడు అతడే భగవంతుడు. దేవుడు భగవంతుడా?
19

Page 20
అంటే కాడు, భగవంతుడు దేవుడా? అంటే అట్లు కూడ కాడు. ఇంకొక విధముగా మనిషి భగవంతుడా? అంటే కాడు.
భగవంతుడు మనిషా? అంటే అట్లు కూడ కాడు. ఇదేంటి తికమక వ్యవహారము అని కొందరనుకోవచ్చును. చెప్పేవాడు
ఎవరో తెలియకపోతే చెప్పబడునది అసలైన జ్ఞానమని ఎలా తెలియగలదు? అని కూడ కొందరడుగవచ్చును.
ఇక్కడొక ముఖ్యసూత్రము గలదు. అదేమనగా! చెప్పేవానిని బట్టి విన్న జ్ఞానము ఫలానా జ్ఞానమని చెప్పలేము.
కానీ విన్న జ్ఞానమును బట్టి చెప్పినవాడు ఫలానావాడని చెప్పవచ్చును. అందువలన చెప్పినవాడు భగవంతుడా, లేక
సాధారణ మనిషా అని చూడవలసిన పనిలేదు. చూడవలసినదంతా మనము విన్నది అసలైన దైవజ్ఞానమా? కాదా?
అని చూడవలెను. ఇక్కడ అడుగవలసినది ఏమంటే! మనకు జ్ఞానమేదో తెలియనపుడు, ఎందరో జ్ఞానమును చెప్పుచున్నపుడు,
ఇదియే నిజమైన దైవజ్ఞానమని ఎలా తెలుస్తుంది? మనము జ్ఞానమును ఫలానా అని గుర్తించ లేనపుడు, చెప్పువాడు
మనిషా? భగవంతుడా? అని ఎలా తెలియనగును? అని కొందరనుకోవచ్చును. దానికి సమాధానముగా ఒక చిన్న
ఉదాహరణను చెప్పుకొందాము. బజారులో ఇరవైమంది వ్యాపారస్థులు బియ్యము అమ్మే వారున్నారు. వారు ఒక్కొక్కరు
ఒక్కొక్క రకము బియ్యమును అమ్ముచున్నారను కొనుము. మార్కెట్లో ఎవడైతే అన్నిటికంటే మంచి నాణ్యతగల బియ్యమును
అమ్మువాడో, వాడు మంచి వ్యాపారస్థుడు అని తెలిసినపుడు, మంచి వ్యాపారస్థుడు ఎవడని తెలియాలంటే, మొదట
మంచి బియ్యమును ఎవరు అమ్ముచున్నారో చూడాలి. బియ్యమును చూచేదానికి అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. బియ్యము
రకములలో ఏ బియ్యము మంచివో కొనేవానికి ఏమాత్రము తెలియదు. అటువంటపుడు ఒక్కొక్క దినము ఒక్కొక్క
వ్యాపారస్థుని వద్ద, ఆ దినమునకు తగినన్ని బియ్యమును కొని వండి తిని చూడవలెను. అలా ఇరవై దినములు ఇరవై
రకముల బియ్యమును తిని రుచి చూచిన తర్వాత అన్ని రకములలో అన్నము మృధువుగా, ఒక మెతుకుకు మరొక
మెతుకు అతుక్కోకుండ విడిగా, తేమలేకుండ పొడిగా, రుచిగా, 24 గంటలుండినా చెడిపోకుండ, తొందరగా ఉడికి
పోవునవిగా, వండిన తర్వాత రంగుమారకుండ ఉండునవి, తిన్న తర్వాత సులభముగా జీర్ణమగునవి ఏవైతే ఉన్నాయో,
ఆ బియ్యమును అన్నిటికంటే మంచి నాణ్యతగల బియ్యమని చెప్పవచ్చును. మంచి నాణ్యతగల బియ్యమును అమ్మువానిని
మంచి వ్యాపారస్థునిగా గుర్తించవచ్చును.
బజారులో బియ్యమును అమ్ము వ్యాపారస్థులవలె భూమిమీద చాలామంది జ్ఞానమును చెప్పు గురువులు కలరు.
మంచి నాణ్యతగల బియ్యమును అమ్మువానిని మంచి వ్యాపారస్థుడని గుర్తించవచ్చునని చెప్పినట్లు, మంచి జ్ఞానమును
చెప్పు గురువును అసలైన గురువుగా గుర్తించ వచ్చును. బియ్యము యొక్క నాణ్యత మనకు తెలియనట్లు ఏది అసలైన
జ్ఞానమో కూడ మనకు తెలియదు. అన్ని దుకాణములలోని బియ్యమును వాడిచూచి, ఏవి మంచి బియ్యమో గ్రహించినట్లు,
గురువులందరు చెప్పు జ్ఞానమును విని, ఏది మంచి జ్ఞానమో తెలుసుకోవచ్చును. మంచి బియ్యమును అమ్మిన వానినే
నిజాయితీగల మంచి వ్యాపారిగా గుర్తించినట్లు, మంచి ధర్మముల జ్ఞానమును చెప్పిన గురువునే నిజమైన గురువుగా
గుర్తించ వచ్చును. అన్ని రకముల బియ్యము యొక్క అన్నమును చూచినపుడేగా ఏవి మంచి బియ్యమో తెలిసేది.
అలాగే అందరి జ్ఞానములను చూచినప్పుడు కదా! ఏది అన్నిటికంటే మించిన జ్ఞానమో తెలిసేది. బియ్యమును బట్టి
బియ్యము అమ్ము వ్యాపారి ఎటువంటివాడో తెలుసుకొన్నట్లు, మనము విన్న జ్ఞానమును బట్టి జ్ఞానమును చెప్పిన గురువు
ఎటువంటివాడో తెలియును. మొదట బియ్యమును గురించి తెలియని వానికి, అన్ని రకముల బియ్యమును చూచిన
తర్వాత మంచి బియ్యమును తెలుసుకొన్నట్లు, మొదట జ్ఞానము యొక్క భేదములను తెలియని మనిషి, అన్ని రకముల
జ్ఞానములను చూచిన తర్వాత ఏది ఉత్తమ జ్ఞానమో తెలుసు కొనును. ఏది ఉత్తమ జ్ఞానమో తెలిసినపుడు దానినిబట్టి
20

Page 21
ఎవరు ఉత్తమ గురువో తెలియును. ఈ విధముగా అయితే అసలైన జ్ఞానమును చెప్పువాడు అసలైన భగవంతుడని
గుర్తించవచ్చును.
కొన్ని రకముల రాళ్ళను పరిశీలించినపుడు అన్నిటికంటే వెలుగైనది, ఉత్తమమైనది వజ్రమని గుర్తించవచ్చును.
అలాగే భూమిమీద ఎందరో చెప్పు అన్ని రకముల జ్ఞానములను వింటేనే, అన్నిటికంటే గొప్ప ధర్మములను తెలుపు ఉ
త్తమమైన జ్ఞానమును గుర్తించవచ్చును. కావున మేము అందరి జ్ఞానమును చూడండి అని చెప్పుచుండగా, కొందరేమో
మేము చెప్పు బోధను తప్ప ఇతరులు చెప్పుదానిని వినవద్దండి అనీ, మేము వ్రాసిన పుస్తకములు తప్ప ఇతరులు వ్రాసిన
పుస్తకములను చదవద్దండని వారివారి శిష్యులకు చెప్పుచుందురు. అట్లు ఎందుకు చెప్పుచున్నారనగా! తాము చెప్పు
జ్ఞానముకంటే గొప్ప జ్ఞానము ఎక్కడైనా తెలిస్తే, తమను వదలి వారి వద్దకు పోవుదురను ఉద్దేశముతో లేక భయముతో
అలా చెప్పుచుందురు. తాము చెప్పు జ్ఞానములో ధర్మములు లేవని, తమ జ్ఞానముకంటే ఉత్తమమైన జ్ఞానముకలదని,
అది తెలిస్తే తమవద్దకు శిష్యులు రారని తలచి, తమ పెద్దరికమును కాపాడుకొనేదానికి, నేడు చాలామంది బోధకులైన
గురువులు, తమ శిష్యులను ఇతరుల పుస్తకములను చదవద్దండి అని చెప్పుచున్నారు. ఒకవేళ ఏ మనుషులైనా అటువంటి
గురువులు కానటువంటి గురువుల మాటలను వింటే వారు మోసపోయినట్లగును. ఒకడు నాది అసలైన బంగారం,
నీవు కొనినా ఎవరికి చూపవద్దండి అంటాడు. అయితే మనము వాని మాట వింటామా? ఇతరులవద్ద పరీక్షించుకొని
అది అసలైనదో కాదో నిర్ధారించు కొంటాము. అదే విధముగా బంగారు కంటే ఎంతో ఎక్కువ విలువైన జ్ఞానమువద్ద
మనము మోసపోకూడదు. జ్ఞానము జీవిత సాఫల్యము నకు చెందినది. కావున చాలా జాగ్రత్తగా ఆచి తూచి గ్రహించవలెను.
భూమిమీద దైవము తన జ్ఞానమును నెలకొల్పితే, దైవమునకు ప్రతి పక్షము అయిన మాయ కూడ తన జ్ఞానమును
ఏర్పరచి పెట్టినది. ఇక్కడ విశేషమేమంటే దేవుని జ్ఞానము మాదిరి మాయజ్ఞానము ఉండుటవలన ఏది దేవుని
జ్ఞానమో, ఏది మాయ జ్ఞానమో ఎవరికీ అర్థముకానట్లు ఉంటుంది. అందువలన ఎవరైన మాయ జ్ఞానమును దైవజ్ఞానము
అనుకొనుటకు అవకాశము గలదు. దైవజ్ఞానమువలెనున్న మాయ జ్ఞానము భూమిమీద 99 పాళ్ళు విస్తరించియున్నది.
ముఖ్యమైన మత గ్రంథములలో కూడ దైవజ్ఞానమువలె మాయ జ్ఞానము చోటు చేసుకొని ఎవరూ గుర్తించని రీతిలో ఉ
న్నది. అంతేకాక మాయ భూమిమీద గురువులుగా ఎంతో మందిని తయారు చేసి, వారిచేత తన జ్ఞానమును దైవ
జ్ఞానమువలె బోధింప చేయుచున్నది.
ఇంతకుముందు బియ్యము యొక్క రకముల ఉదాహరణను చెప్పుకొన్నాము కదా! అందులో ఇరవై రకముల
బియ్యములలో శ్రేష్ఠమైనది ఒక్కటి మాత్రమే ఉండునట్లు, భూమిమీద గల ఎన్నో రకముల జ్ఞానములలో చివరకు ఒక్క
జ్ఞానమే నిజమైన దైవజ్ఞానమని తెలిసినపుడు, మిగత రకముల జ్ఞానములన్నిటిని మాయ జ్ఞానములనియే చెప్పవచ్చును.
దైవజ్ఞానము ఏది, మాయ జ్ఞానము ఏది అని పరిశీలించని వారందరు, దైవజ్ఞానమును గుర్తించలేక, మాయ జ్ఞానమువైపే
ఆకర్షితులగుదురు. దానినే గొప్పగ చెప్పుకొనుచుందురు. అందువలన మాయజ్ఞానము నూటికి తొంభైతొమ్మిది
పాళ్ళుగ ఉన్నదని చెప్పవచ్చును. ఈ మాట నిజమా అబద్దమా అనుటకు చిన్న ఉదాహరణను చూస్తాము. ప్రస్తుత
కాలములో యజ్ఞములు చేయడము గొప్ప కార్యమని చాలామంది తలచుచుందురు. ఏ దేవాలయములోగానీ, ఏ
ఆరాధన కార్యములోగానీ యజ్ఞములను జ్ఞానము కల్గినవారే చేయుచుందురు. యజ్ఞములను చేయడము ఉన్నతమైన
ఆరాధనగా ఎందరో భావించుచున్నారు. వర్షాలు రావాలని వరుణయజ్ఞము, మృత్యువు రాకూడదని మృత్యుంజయ
యజ్ఞము, శాంతికొరకు విశ్వశాంతి యజ్ఞము, ఇలా ఎన్నో పేర్లు కల్గిన యజ్ఞములు అనేకము గలవు. దైవమార్గములో
21

Page 22
యజ్ఞములు సరియైనవా? కావా? ధర్మములా? అధర్మములా? అని ప్రశ్నిస్తే వెయ్యిమందిని అడిగినా సరియైనవేనని,
ధర్మములేనని చెప్పుచుందురు. కొన్ని లక్షలమందిని అడిగితే ఎవడైనా అరుదుగా సరియైనవి కావు అధర్మములని
చెప్పునేమో! ఒక్క యజ్ఞవిషయములోనే కొన్ని లక్షలమందికి ఒక్కడు కూడ యజ్ఞములు చేయుట అధర్మమని చెప్పలేదు.
వాస్తవానికి దైవజ్ఞానము ప్రకారము యజ్ఞములు అధర్మములే. మాయజ్ఞానములో యజ్ఞములు చేయుట మంచిపనియని
బోధింపబడుచున్నది. యజ్ఞములు ధర్మమా, అధర్మమా అని అడిగితే కొన్ని లక్షలమంది ధర్మమన్నపుడు, భూమిమీద
మాయజ్ఞానము ఎన్ని పాళ్ళు ఉందో, దైవజ్ఞానము ఎన్ని పాళ్ళు ఉందో మీరే యోచించండి. ఇది మాయజ్ఞానము, ఇది
దైవజ్ఞానము అని తెలియకపోవడము వలన భూమిమీద దైవజ్ఞాన సాంద్రతకంటే మాయా జ్ఞాన సాంద్రత ఎక్కువైపోయినది.
పుట్టినప్పటినుండి తిండికోసము, పెరిగినప్పటినుండి బ్రతుకు తెరువుకోసము ప్రాకులాడు మనుషులకు జీవితములో
ముఖ్యమైనది దైవ జ్ఞానమని తెలియకుండా పోయినది. ఒకవేళ కొన్ని వేలమందిలో అరుదుగా ఎవనికైనా దైవజ్ఞానము
మీద ఆసక్తి కల్గినా, వానికి దైవజ్ఞాన రూపములో మాయజ్ఞానము తెలియుచున్నది. అలా మాయజ్ఞానము అంటుకొన్న
కొన్ని లక్షలమందిలో, ఎవడైనా అరుదుగా దైవజ్ఞానము ప్రత్యక్షముగా ఉన్నదని, ఇంతవరకు తనకు తెలిసినది
దైవజ్ఞానముకాదని తెలియగలడు. ఈ విధముగా లెక్కించితే ప్రస్తుతకాలములో దైవజ్ఞానము యొక్క స్థితి ఏమిటో
అర్థమగుచున్నది. నిజమైన దైవధర్మములను తెలుపు జ్ఞానమును తెలిసినపుడే ఇది దేవుడు చెప్పిన జ్ఞానమని తెలియగలదు.
మాయ జ్ఞానమైనా, దైవజ్ఞానమైనా దానిని మనిషి చెప్పినదనియే చెప్పవచ్చును. మాయ జ్ఞానమును అందరూ
చెప్పుచుండగా దైవజ్ఞానమును మాత్రము ఒక్కడే చెప్పును. జ్ఞానమును చెప్పు అందరిలో దైవజ్ఞానమును చెప్పువాడు
కూడ మనిషే అయినా వానిని ప్రత్యేకమైన వానిగా చెప్పవచ్చును. ఆ ప్రత్యేకత కల్గియున్నవాడే భగవంతుడని చెప్పవచ్చును.
భగవంతుడు కూడ ఒక మనిషే. అతని జీవితములో గానీ, ఆకారములో గానీ అన్ని విధముల మనిషినే పోలియుండును.
అందువలన భగవంతున్ని ఒక్క జ్ఞానము ద్వారా తప్ప ఏ విధముగా కూడ గుర్తించలేము, గుర్తించుటకు వీలుపడదు.
భూమిమీద దైవధర్మములను తెలుపు ఒక్క మనిషిని మాత్రము భగవంతుడు అనుచున్నాము. కాబట్టి మిగత
మనుషులెవరు భగవంతులు కారని తెలియుచున్నది. భూమిమీదికి భగవంతుడు కొన్ని వేల సంవత్సరము లకో లేక
కొన్ని లక్షల సంవత్సరములకో వచ్చును. అలా వచ్చిన వాడు మనిషిగా కనిపించినా అతను మనిషికాదు. భగవంతుడు
ఎప్పటికి మనిషి కాదు. అలాగే మనిషి ఎప్పటికి భగవంతుడు కాడు. భగవంతుడు పుట్టినపుడు భగవంతుడు తన
జీవితములో మనిషిగా మారుటకు వీలులేదు. అలాగే మనిషి పుట్టిన తర్వాత తన జీవితములో భగవంతునిగా మారుటకు
వీలులేదు. దీనినిబట్టి "భూమిమీద భగవంతుడు మనిషిగా, మనిషి భగవంతునిగా మారడు” అన్నది సూత్రము అని
తెలియాలి. దేవుడు భగవంతునిగా మారవచ్చును గానీ, మనిషి భగవంతునిగా మారలేడు. ఈ సూత్రము ప్రకారము
దేవుడు, భగవంతుడు, మనిషి అని ముగ్గురిని చెప్పుకోవచ్చును. దేవుడు తన జ్ఞానమును భూమిమీద మనిషికి చెప్పుటకు
భగవంతుని పాత్రను ఉపయోగించుకొంటున్నాడు. దేవుడు ప్రత్యక్షముగా మనిషికి తన జ్ఞానమును తెలుపడు. కావున
భగవంతుని పాత్రను ఉపయోగించుకొంటున్నాడు. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున 16,17 శ్లోకములలో
క్షర, అక్షర, పురుషోత్తములని త్రైతమును తెలియజేసినట్లు బయట కూడ మనిషి, భగవంతుడు, దేవుడు అను త్రైతముతోనే
తన జ్ఞానమును ప్రసరింపజేయుచున్నాడు.
దేవుని ధర్మములను దేవుడే తెల్పాలి, మనిషి చెప్పలేడు అను సూత్రము ప్రకారము మనిషి కానటువంటి భగవంతుడు
దేవుని ధర్మములను తెలియ జేయుచున్నాడు. దేవుడు కనిపించడు, వినిపించడు, భగవంతుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు.
22

Page 23
కనీ, వినే మనిషికి కనిపించి, వినిపించే వాడే జ్ఞానమును తెలియజేయాలి. కావున దేవుడు భూమిమీదకు భగవంతునిగా
తన అంశను పంపును. దేవునికి లెక్కలేనన్ని కోట్ల అంశలు గలవు. భగవద్గీత విభూతియోగము 42వ శ్లోకములో
"ఏకాంశేన స్థితో జగత్" అన్నట్లు ఈ జగత్తు అంతయు దేవుని ఒక్క అంశ చేతనే కలిగియున్నది. మొత్తము జగత్తు
అంతయు ఒకే ఒక్క అంశచేత కలిగియుండగా, దేవుని యొక్క మరియొక అంశ చేత భగవంతుడు సృష్ఠింపబడి
ఉన్నాడు. దేవునికి గల లెక్కలేనన్ని కోట్ల అంశలలో ఒక అంశ జగతికాగ, ఒక అంశ భగవంతునిగా వచ్చుచున్నది.
అందువలన జగతితో సమానమైనవాడు భగవంతుడు, అయితే జగతి ఎవరికీ అర్థముకాదు, అలాగే భగవంతుడు కూడ
ఎవరికీ అర్థముకాడు. “జగతి” ని విభజించి చూచితే జ+గతి = జగతి అగును. 'జ' అనగా జన్మించుట అనియు, ‘గతి’
అనగా గతించుట లేక మరణించుట అనియు చెప్పవచ్చును. అందువలన పుట్టి చనిపోవు దానిని జగతి అంటున్నాము.
జీవునికి జననము, మరణము లేకున్నా జీవుడు ధరించు శరీరమునకు జనన మరణములు గలవు. అందువలన సజీవ
శరీరములన్నిటిని జగతి అంటున్నాము. దేవుని అంశ భగవంతునిగా శరీరమును ధరించి వచ్చుచున్నది. కావున
జగతిలో భగవంతున్ని కూడ ఒక మనిషిగా ప్రజలు చూచుచున్నారు. అజ్ఞాన ప్రజలు భగవంతున్ని సాధారణ మనిషిగా
లెక్కించి భగవంతున్ని కూడ అవమానిస్తున్నారు.
ఇదే విషయమును భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగములో 11వ శ్లోకమున ఈ విధముగా అంటున్నాడు.
"అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్,
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్"
భావము :- నేను సర్వ జీవరాసులకు మహేశ్వరుడనైనప్పటికి, మనిషి శరీరము ధరించిన నన్ను చూచి, నా
తెలియని నరులు మూఢులగుచు నన్ను అవమానించుచున్నారు.
శ్రేష్ఠత్వమును
వివరముగా చెప్పుకొంటే దేవుడు సర్వప్రపంచమును సృష్టించిన సృష్టికర్త. అటువంటి దేవుని ఏకాంశే భగవంతుడు.
ఆ దేవుని మరియొక అంశయే జీవరాసులు జగత్తు. దీనినిబట్టి చూస్తే జగత్తులోని జీవులందరికి అధిపతి భగవంతుడు
అని చెప్పవచ్చును. అయితే కొందరు ఇక్కడొక ప్రశ్న లేవదీయవచ్చును. అదేమనగా! దేవుని ఒక అంశ జగత్తు
అయినపుడు మరియు దేవుని మరియొక అంశ భగవంతుడైనపుడు జగత్తు భగవంతుడు రెండు సమానమే అగును
కదా! అటువంటపుడు జగత్తుకు భగవంతుడు ఎలా అధిపతి అగును? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఏమనగా! ప్రభుత్వము నిరుద్యోగ సమస్య తీర్చుటకు పదిమందిని ఉద్యోగములోనికి తీసుకొని, ఒకరోజుకు వందరూపాయల
ప్రకారము నెలకు మూడువేల రూపాయలు జీతమిచ్చునట్లు చేసినది. ఒక్కనెలకు పదిమందికి వచ్చు జీతము ముఫ్పైవేల
రూపాయలగును. ఈ పదిమంది చేత సరిగ పనిచేయించుటకు పదిమందికి అధిపతిగ ఒక ఆఫీసర్ను నియమించింది.
అలా నియమించిన ఆఫీసర్కు ఒక నెలకు జీతము 30 వేల రూపాయలుగ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయము
ప్రకారము పదిమందికి 30వేలు జీతముకాగ, ఆఫీసర్ ఒక్కనికే 30వేలు జీతముండగా నెల జీతములో ఇద్దరూ సమానమే
అయినా, పదిమందికి ఆఫీసర్ అధిపతియేనని చెప్పుచున్నాము. ఒక్క ఆఫీసర్ చెప్పినట్లు పదిమంది వినవలసిందే. పది
మంది ఉద్యోగస్థులు మనుషులే, అలాగే ఒక ఆఫీసర్ కూడ మనిషియే. అయినప్పటికీ పదిమందికి ఆఫీసర్ను పెద్ద
అనినట్లు భగవంతున్ని జగత్తుకు అధిపతి అంటున్నాము. వివరించి చెప్పితే 30 వేల రూపాయలు పదిమందికి నెల
జీతము మరియు 30 వేల రూపాయలే ఆఫీసర్ జీతము. అలాగే ఒక అంశయే జీవరాసులన్నీ మరియు ఒక అంశయే
భగవంతుడు. పదిమంది జీతము, ఆఫీసర్ జీతము సమానమైనంత మాత్రమున పనివారు ఆఫీసర్ ఇద్దరూ ఎట్లు
23

Page 24
సమానము కారో అలాగే జగత్తు అంశ, భగవంతుని అంశ సమానమైనంతమాత్రమున జగత్తు భగవంతుడు సమానము
కారు. పదిమంది జీతము ఒక ఆఫీసర్ జీతముతో సమానమైనప్పటికి, పదిమంది కలిసి ఆఫీసర్ మాటను వినుట
వలన, అతను పదిమందికి అధిపతి అని చెప్పవచ్చును. అదే విధముగా ఒక అంశతో జగత్తుండినా, ఒక అంశతోనే
భగవంతుడుండినా, జగత్తులోని మనుషులు భగవంతుడు చెప్పిన ధర్మములనే వినవలసివచ్చును. భగవంతుడు చెప్పిన
ధర్మములను విననంత వరకు వారికి ముక్తిలేదు. అందువలన మానవులందరికి భగవంతుడు అధిపతియేనని చెప్పవచ్చును.
ఇటు పదిమంది ఉద్యోగస్థులకు అటు ఆఫీసర్కు ప్రభుత్వము ఎట్లు పెద్దగా ఉన్నదో, అట్లే ఇటు జగతికి అటు భగవంతునికి
దేవుడు పెద్దగా ఉన్నాడు.
పదిమంది ఉద్యోగస్థులు ఆఫీసర్ మాట వినకుండ, ఆఫీసర్ను గౌరవించకుండ ఆఫీసర్ను ఏ విధముగా
అవమానించినా పైన ప్రభుత్వము తప్పక ఉద్యోగస్థులను శిక్షించును. పైన ఉన్నది గ్రుడ్డి ప్రభుత్వములే మనకు వచ్చే
జీతము వస్తుందిలే అని చేయవలసిన పనిని సరిగ చేయక పోయినా, మన మధ్యలోనికి వచ్చిన అధికారిని అధికారిగా
గుర్తించక అవమానపరచినా, పైన ప్రభుత్వము ఉద్యోగస్థుల మీద కఠినచర్యలు తీసుకొనును. అలాగే జగతిలోని
మనుషులు దేవున్ని గ్రుడ్డివానిగ లెక్కించి తమ ఇష్టమొచ్చినట్లు పాపము చేసినా, తమ మధ్యలోనికి గానీ, వద్దకుగానీ
వచ్చిన భగవంతున్ని గుర్తించక ఆయనను అవమానపరచినా, దేవుడు నిర్మించిన భూతముల, గ్రహముల పరిపాలనలో
పూర్తి శిక్షార్హులగుదురు. అయినప్పటికి దేవుని పరిపాలన ఏమిటో తెలియక మనుషులు అజ్ఞాన అంధకారములో
కన్నులు గ్రుడ్డివైపోయి, జగత్తుకంతటికి అధిపతియైన భగవంతున్ని గుర్తించక, మానవ శరీరమును ధరించిన భగవంతుని
గొప్ప తనము తెలియక, సాధారణ మనిషిగ లెక్కించి అవమానముపాలు చేయుచున్నారు. అందువలన పై శ్లోకమున
"అవజానన్తి మాం మూఢా మానుషీమ్ తను మాశ్రితమ్" మనిషి శరీరమును ధరించిన నన్ను చూచి మూఢులు
అవమానిస్తున్నారని అన్నాడు. అంతేకాక "పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్" 'నేనే సర్వ జీవరాసులకు
అధిపతినని, నా గొప్పతనమును తెలియరు' అని కూడ అన్నాడు.
దేవుడు తాను నిర్మించిన సృష్ఠిలోనికి తన ధర్మములను కాపాడుటకు ఎప్పుడో ఒకప్పుడు భగవంతున్ని
పంపుచున్నాడు. వచ్చిన భగవంతుడు ఎవరో, పంపిన దేవునికి తెలుసు. కానీ భూమిమీదున్న మనుషులకు తెలియదు.
దేవుని చేత పంపబడిన అంశను అనగా భగవంతున్ని మొదట ప్రజలు గుర్తించ లేకపోయినా, తర్వాత గుర్తించుటకు
అనేక అవకాశములను దేవుడు కల్గించాడు. వచ్చిన భగవంతుడు ఎప్పటికీ నేను భగవంతుడినని చెప్పక పోయినా,
ఆయన చెప్పు బోధలనుబట్టి సులభముగా భగవంతున్ని తెలియవచ్చును. ఆయన బోధలనే విననివాడు, ఆయనను
సాధారణ మనిషిగానే లెక్కించడము జరుగుచున్నది. ఆయన చెప్పు అనేక దైవ ధర్మములనుబట్టి భగవంతున్ని గుర్తించుటకు
అనేక అవకాశములున్నప్పటికి దైవధర్మముల మీద ఆసక్తి లేనివాడు, భగవంతుడు ఏమి చెప్పుచున్నాడని ఏమాత్రము
చూడడు. అందువలన అటువంటివారు భగవంతున్ని ఏమాత్రము తెలియలేరు. దేవునిమీద విశ్వాసము లేనివాడు
దేవుని ధర్మముల మీద ఆసక్తిని కనబరచడు. దైవజ్ఞానము మీద ఆసక్తిలేనివారికి ప్రపంచ కార్యముల మీద, ప్రపంచ
విషయముల మీద ఆసక్తి ఎక్కువగా ఉండును. కావున భగవంతుడు తెలుపు ధర్మముల మీద అజ్ఞానులు ఆసక్తిని
కనబరచక, భూమిమీద భగవంతున్ని మనిషిగా తలచి, అతను చేయు ప్రపంచకార్యములనే లెక్కించి, భగవంతున్ని
మనుషులకంటే హీనముగా మాట్లాడుచున్నారు. అంతేకాక సాధారణ మనిషికి ఇచ్చే గౌరవమును కూడ ఇవ్వక హీనముగా
అవమానపరచుచున్నారు. అవమాన పరచడమేకాక భగవంతుడు భూమిమీద చేయు ధర్మకార్యములకు ఆటంకములను
24

Page 25
కలుగజేయుచున్నారు. ఈ విధముగా అజ్ఞాన ప్రజలు చేసినప్పటికీ భూమి మీద ప్రజలందరికి భగవంతుడు అధిపతి
అయినా, తాను సాధారణ మనిషిగానే కనిపిస్తూ, తాను ఏ పని నిమిత్తము వచ్చాడో ఆ పనిని మాత్రము చేసుకుంటూ
పోవుచుండును.
దేవుని అంశ అయిన భగవంతున్ని అవమానపరిస్తే, భగవంతుని కార్యములను ప్రోత్సహించక, సహకరించక
ఆటంకపరిస్తే, అటువంటి వానిని దేవుడు ఏమి చేయడా? అని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా!
దేవుడు ఏ పనిని చేయనివాడని ముందే చెప్పుకొన్నాము కదా! అందువలన అటువంటి అజ్ఞానులను దేవుడు ఏమీ
చేయడు. కానీ దేవుని పరిపాలనలోని వారు అజ్ఞానులు చేసిన పనిని లెక్కించి, పాపమును అంటగట్టి, ఆ పాపమును
అనుభవింప చేతురు. ఈ నామాట అసత్యము కాదు. ఇదే మాటనే భగవంతుడు ఒక సందర్భముగా చెప్పుచూ ఇలా
“నేను ప్రజలకు దైవధర్మములను బోధించుటకు వచ్చాను. దైవ ధర్మముల మీద ఆసక్తి కలవారందరు నావద్దకు వచ్చి
జ్ఞాన సమూహముగా జ్ఞానసంఘముగా తయారగుచుందురు. నేను చేయు పనులలో నాకు సహకరించని వాడు, నాకు
ప్రతిపక్షముగా ఉండి వ్యతిరేఖ కార్యములను చేయుచుండును. అటువంటి వాడు నాకు విరోధిగా లెక్కించబడును. నా
పనులకు వ్యతిరేఖి అయినవాడు నావద్దకు వచ్చు ప్రజలను రానివ్వక, ఉన్నవారిని కూడ చెదరగొట్టు వాడుగా ఉన్నాడు”
అన్నాడు. అటువంటి వారిని గూర్చి నేను ముఖ్యముగా చెప్పునదేమనగా! మనుషులు చేయు ప్రపంచ సంబంధమైన
ప్రతి పాపమును దైవజ్ఞానము చేత క్షమింప చేసుకొని అనుభవించకుండ తప్పించుకోవచ్చును. కానీ దైవసంబంధమైన
పాపమునకు దైవజ్ఞానము చేత కూడ క్షమాపణ లేదు. మనుషుల వలన పుట్టిన మనిషికి విరోధముగా మాటలాడినా,
విరుద్ధమైన పనులు చేసినా వచ్చు పాపమునకు క్షమాపణ కలదు. కానీ దేవుని వలన పుట్టిన భగవంతునికి విరోధముగా
మాటలాడువానికి వచ్చు పాపము దైవజ్ఞానము అను అగ్ని చేత కూడ కాలదు. అనగా ఆ పాపమును ఇటు భగవంతుడుగానీ,
అటు దేవుడుగానీ క్షమించడు. దేవుని చేత దేవుని అంశగా వచ్చిన భగవంతునికి విరుద్ధముగా చేసిన పాపము
భయంకరమైనది. సాధారణ మనుషులకు విరుద్ధముగా చేసిన పాపము ఒక జన్మలో అనుభవిస్తే పోతుంది. లేకపోతే
దేవున్ని ఆరాధించి దేవుని జ్ఞానము ప్రకారము నడిస్తే వచ్చు జ్ఞానాగ్ని వలన కాలిపోతుంది. కానీ భగవంతునికి
విరుద్ధముగా చేసిన పాపము ఒక జన్మలో అనుభవించినా అయిపోదు, దైవ జ్ఞానమువలన కూడ కాలిపోదు. ఆ పాపము
చాలా భయంకరమైనది ఎందుకనగా! అది ఒక జన్మలో అయిపోక, జరుగుచున్న ఈ యుగములో ఎన్నో జన్మలలో
అనుభవించవలసి ఉండును. ఈ యుగములోనేకాక రాబోవు యుగములో కూడ అనుభవించ వలసివుండును. భగవంతునికి
వ్యతిరేఖమై సంపాదించుకొన్న పాపము రెండు యుగముల పర్యంతము అనుభవించవలసి ఉండును.
చూచారా! మనుషుల పట్ల చేయు పాపముకంటే భగవంతుని పట్ల చేయు పాపము ఎంత భయంకరమైనదో!
ఎంత పెద్దదో!! ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! మనిషి వీర్యము వలన పుట్టిన మనిషి
అయినా, దేవుని అంశ వలన పుట్టిన భగవంతుడైనా ఇద్దరు మనుషులే కదా! అటువంటపుడు సాధారణ మనిషి వలన
వచ్చు పాపము ఎంతో, భగవంతుని వలన వచ్చు పాపము కూడ అంతే పాపము రావలెను కదా! అట్లుకాక ఎందుకు
ఎక్కువ పాపము వచ్చుచున్నది? ఈ ప్రశ్నకు మా జవాబు ఏమనగా! మనిషినుండి వచ్చిన మనిషిగానీ, దేవుని నుండి
వచ్చిన భగవంతుడుగానీ ఇద్దరు మానవరూపమునే కల్గియున్నా, సాధారణ మనిషి దేవుని జ్ఞానమును తెలుసుకోవచ్చును
గానీ, దేవుని జ్ఞానమును తెలుపలేడు. అట్లని జ్ఞానము చెప్పువారందరు భగవంతులు కాదు. ఎవరికీ తెలియకుండ
అణగారిపోయిన ధర్మములను నూతనముగా (క్రొత్తగా) తెలుపువాడు భగవంతుడు. మనిషి కర్మను సంపాదించుకొను
25

Page 26
చుండును. భగవంతుడు ఏ కర్మను తగిలించుకోకుండ పని చేయుచుండును. మనిషి కర్మ అనుభవించు నిమిత్తము
పుట్టాడు. భగవంతుడు దైవధర్మము లను తెలుపుటకు పుట్టాడు. అంతేకాక "మమభూత మహేశ్వరమ్" అన్నట్లు
ఆయన అందరికీ అధిపతి. అంత గొప్పవానిని, ఎంతో గొప్ప జ్ఞానము తెలుపు భగవంతుని వలన వచ్చు పాపము
ఎంతో పెద్దదిగానే ఉండును. భగవంతుడు "మానుషీమ్ తనుమాశ్రితమ్" అన్నట్లు మనిషి శరీరము ధరించి ఉన్నప్పటికి
ఆయన ఏ విధముగ చూచిన మనిషితో సమానము కాదు. కనుక మనిషికి చెడు చేస్తే వచ్చే పాపముకంటే భగవంతునికి
చెడుచేస్తే వచ్చే పాపము గొప్పదని తెలియుచున్నది.
ఇక్కడ మరియొక ప్రశ్నను అడుగుటకు అవకాశము కలదు. “సాధారణ మనిషి కర్మను అనుభవించు నిమిత్తము
పుట్టాడు అన్నారు. పుట్టిన తర్వాత కర్మను సంపాదించుకొనుచుండును అని కూడ అన్నారు. భగవంతుడినేమో కర్మ
అంటకుండ కార్యములను చేయునని చెప్పారు. మీరు చెప్పు ధర్మ సూత్రముల ప్రకారము కనిపించు ఏ మనిషి
అయినా, ఏ కార్యమును చేయుచుండినా, ఆ కార్యమునకు కనిపించని కర్మ కారణమై ఉన్నదని చెప్పారు. అటువంటపుడు
భగవంతుడు కూడ కనిపించు మనిషియే కదా! ఆయన కూడ ఎన్నో కార్యములను చేయుచుండును కదా! ఆయన
చేయు పనులకు కూడ ప్రారబ్ధకర్మ కారణమై ఉండును కదా! ఆయన కర్మ అంటకుండ పనిచేయువాడైనప్పుడు,
ఆయనకు ప్రారబ్ధకర్మనే ఉండదు కదా! అలా కర్మలేనపుడు ఆయన కార్యములనెలా చేయుచున్నాడు. ఆయన చేయు
కార్యమునకు కారణము కర్మ కాదా!" అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దేవుడు చెప్పిన
సూత్రము ప్రకారము భూమి మీద ఆకారమున్న ఏ మనిషిగానీ కదలి పనిచేయాలంటే దానికి కారణమైన ప్రారబ్ధకర్మ ఉ
ండి తీరాలి. ఈ సూత్రము ఆకారమున్న భగవంతునికి కూడ వర్తించును. కర్మలేకుండ ఎవరూ శరీరము ధరించి
పుట్టుటకు వీలులేదు. అందువలన శరీరమున్న ప్రతి మనిషి కర్మతోనే పుట్టవలసి వచ్చును. దేవుని అంశ అయిన
భగవంతుడు కూడ భూమిమీద శరీరముతో ఉన్నాడు. కాబట్టి ఆయన కూడ ప్రారబ్ధకర్మతోనే వచ్చియుండును.
సాధారణ మనిషి అయినా, భగవంతుడైనా ఎవరైనా ప్రారబ్ధకర్మననుసరించి కార్యములను చేయవలసిందే. ఇంకొక
ముఖ్య విషయమేమనగా! దైవ సంబంధము కాకుండ, ప్రపంచ సంబంధమైన ఏ కార్యమునకుగానీ కర్మ కారణముండి
తీరును. దైవజ్ఞానము కర్మను నాశనము చేయునది, కావున దైవకార్యములకు గానీ, దైవజ్ఞానమునకు గానీ ప్రారబ్ధకర్మ
కారణముగా ఉండదు. దైవజ్ఞానము కర్మకు అతీతమైనది. అందువలన దైవమునకు సంబంధించిన ఏ కార్యమునకు
కర్మ ఉండదు. అదే ప్రపంచ సంబంధమైన అతిచిన్న పనికి కూడ కర్మ కారణమై ఉంటుంది. దేవుని అంశ భూమి మీద
భగవంతునిగా వచ్చినపుడు భగవంతుడు సమయమును, సందర్భమును చూచి దైవధర్మములను తెలియజేయు పనులను
చేయును. మిగతా జీవిత కాలములో అందరివలె ప్రపంచ కార్యములనే చేయుచుండును. ప్రపంచ కార్యములకు కర్మ
ఉండి తీరాలి. కావున భగవంతునికి కూడ కర్మ ఉందని చెప్పవచ్చును. ఆ కర్మప్రకారమే ఆయన కూడ ప్రపంచ
కార్యములను చేయుచున్నాడు. భగవంతుడు దేవుని ధర్మములను తెలియజేయు నిమిత్తము వచ్చినప్పటికీ జీవితకాలములో
ఎక్కువ అందరివలె ప్రపంచ కార్యములే చేయవలసి ఉండును. దైవజ్ఞానమును సందర్భము వచ్చినపుడు మాత్రమే
చెప్పును. ఉదాహరణకు శ్రీకృష్ణున్ని తీసుకొందాము. కృష్ణుడు సాధారణ వ్యక్తిగానే జీవించాడు. జీవితములో ఒక్కమారు
90 సంవత్సరముల వయస్సులో అదియు యుద్ధ ప్రారంభ సమయములో జ్ఞానమును చెప్పాడు. ఆ ఒక్క సమయము
మాత్రము కర్మకు అతీతమైనది. మిగతా జీవిత కాలమంతయు కర్మానుసారము జరిగినదనియే చెప్పవచ్చును. ఈ
జన్మలో కర్మ సంపాదించుకోని వాడు అదే సూత్రము ప్రకారము వెనకటి జన్మలో కూడ కర్మ సంపాదించుకొని ఉండడని
చెప్పవచ్చును. వెనుకటి జన్మలో కర్మలేని వానికి ఈ జన్మలో అనుభవించుటకు కర్మ ఉండదు. ఎందుకనగా వెనుకటి
26

Page 27
జన్మ కర్మయే ఈ జన్మ పనులు చేయుటకు కారణమైన ప్రారబ్ధకర్మ అగును. వెనుక జన్మలో కర్మ సంపాదనలేని వానికి
ఈ జన్మలో కర్మ అనుభవము కూడ ఉండదు.
అటువంటపుడు కృష్ణుడు భూమిమీద అనేక కార్యములను చేయుటకు కారణము అయిన కర్మ లేనపుడు, ఆ
పనులను ఎలా చేశాడు? అను ప్రశ్న రాగలదు. పని జరగాలంటే కర్మ ఉండాలి. కానీ కృష్ణునికి వెనుకటి కర్మలేదు.
అయితే ఆయన భూమిమీద పనులు చేయుటకు కారణమైన కర్మ ఎక్కడిది? అను ప్రశ్నకు జవాబు ఒక్కటే గలదు!
కర్మలేని కృష్ణుడు, కర్మ ఉన్న కృష్ణునిగా వచ్చాడు. ఆయన పుట్టినపుడే ఆ జన్మకు కావలసిన కర్మను ఆయనే స్వయముగా
రచించుకొని వచ్చాడు. అందువలన కృష్ణుడు చేసిన కార్యములు ఆయన చేసుకొన్న కర్మవలన జరిగినవి కావు.
కార్యములన్నీ ఆయన వ్రాసుకొన్న కర్మలని తెలియుచున్నది. ఈ విషయమై భగవద్గీతయందు జ్ఞానయోగమున 6వ
శ్లోకములో ఈ విధముగా ఉన్నది.
"అజోపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో పిసన్,
00
ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవా మ్యాత్మ మాయయా”
భావము : పుట్టుకగానీ, నాశనముగానీ లేనివాడను మరియు సర్వ జీవరాసు లకు ఈశ్వరుడను అయిన నేను,
ప్రకృతిని అధిష్ఠించి గుణములను ఏర్పరుచుకొని కర్మను కల్పించుకొని జీవునివలె పుట్టుచున్నాను.
వివరముగా చెప్పుకొంటే పై శ్లోకమున సర్వజీవరాసులకు ఈశ్వరుడను, దేవుడనైన నేను ప్రకృతి వలన
పంచభూత శరీరమును తయారు చేసుకొని, మాయ వలన గుణ కర్మములను ఏర్పరుచుకొని పుట్టుచున్నానని చెప్పాడు.
ఈ శ్లోకములో "ప్రకృతిం స్వామధిష్ఠాయ” అన్నపుడు పంచభూత శరీరమును అధిష్ఠించి అని తెలియవలెను. అలాగే
"సమ్భవామి ఆత్మ మాయయా” అన్నపుడు 'మాయ' అనబడు గుణములు వాటివలన కలుగు కర్మను నియమించుకొని అని
తెలియవలెను.
దేవుడైన పరమాత్మ సర్వజీవులకు అధిపతిగా ఉండి, చావుపుట్టుకలు లేనివాడుగా ఉండి, తన ప్రకృతితో
ప్రత్యేకమైన శరీరమును తయారు చేసుకొని, తన మాయతో గుణములను వాటికి అనుబంధమైన కర్మను తయారు
చేసుకొని, మనిషివలె పుట్టి, మనుషులలో ప్రత్యేక మనిషియై భగవంతునిగా ధర్మములను పునరుద్ధరించి, తిరిగి ఎక్కడినుండి
వచ్చాడో అక్కడికే పోవుచున్నాడు. దీనినిబట్టి దేవుడు భగవంతునిగా పుట్టి, మనిషిగా జీవించాడని చెప్పవచ్చును.
అందువలన దేవుడు మనిషికాడు. అలాగే భగవంతుడు మనిషిగా మరణించి, దేవునిగా మారిపోయాడని చెప్పవచ్చును.
అందువలన భగవంతుడు మనిషి కాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దేవుడు భగవంతునిగా వచ్చి, భగవంతుడు దేవునిగా
మారిపోయినా, మనకు కనిపించునది మనిషి పుట్టి కొంతకాలముండి చనిపోయినట్లే ఉండును. అందువలన భూమిమీద
భగవంతున్ని ఎవరూ సాధారణముగా గుర్తించలేరు. దేవుడు భగవంతునిగా పుట్టి, మనిషివలె పనులు చేయుచు జీవించాడని
చెప్పుచున్నాము. ఇప్పుడు దేవుడు, భగవంతుడు, మనిషి అను ముగ్గురిలో దేవుడు కనిపించడు, భగవంతుడు, మనిషి
ఇరువురు కనిపిస్తారు. కానీ మనుషులలో భగవంతుడు ఎవరో తెలియదు, కావున భగవంతుడు కనిపించినా కనిపించనట్లే.
మనిషి మాత్రము ఎల్లప్పుడు కనిపిస్తాడు. కనిపించే మనిషికి మననము గలవాడు మనిషి అను నిర్వచనము గలదు.
అలాగే దేవునికి దేవులాడబడేవాడు దేవుడు అను నిర్వచనము గలదు. ఇక భగవంతునికి ఏమి నిర్వచనము కలదని
కొందరడుగ వచ్చును. దానికి జవాబుగా దేవునికి, మనిషికి నిర్వచనమున్నట్లే భగవంతునికి కూడ నిర్వచనము
27

Page 28
కలదని చెప్పవచ్చును. అదేమనగా! భగమునుండి పుట్టినవాడు భగవంతుడు అనునదే నిర్వచనము. ఈ మా మాటను
వినిన తెలుగు భాషా పండితుడు భగవంతుడు అనగా భగమునుండి పుట్టినవాడు అను అర్థము తప్పు అన్నాడు. ఎట్లు
తప్పు అని వివరమడుగగా! "బలవంతుడు అన్నపుడు బలము కలవాడని అర్థము కదా! అలాగే భగవంతుడు అన్నపుడు
భగముకలవాడని అర్థము” అన్నాడు దానికి వెంటనే మేము ఈ విధముగా అడిగాము. హిందీ భాషలో “దవాఖానా”
అను పదములో 'దవా' అనగా మందు అనీ 'ఖానా' అనగా తినడము అని అర్థము. దాని పూర్తి అర్థమును తీసుకొని
చూస్తే దవాఖానా అనగా మందులు తినుపించు వైద్యశాల (ఆసుపత్రి) అని అర్థము. దాని ప్రకారము “పాయఖానా”
అను పదమును చూస్తే పాయ అనగా మలము అని ఖానా అనగా తినడమని, మలమును తినిపించునది పాయఖానా
లేక మరుగుదొడ్డి అని అనాలి. కానీ అలా అనుటకు వీలులేదు. దవాఖానా, పాయఖానా అను రెండు పదములు ఒకే
విధముగా ఉండినా వాటి భావము వేరు, వాటి అర్థములు వేరు. దవాఖానా అంటే ఆసుపత్రి, పాయఖానా అనగా
మరుగుదొడ్డి అని వేరు వేరు భావముల అర్థములున్నట్లు భగవంతుడు, బలవంతుడు అను రెండు పదములు ఒకే
విధముగా ఉండినా వాటి భావములు వేరువేరుగా ఉన్నవి. అట్లు కాకుండ భగవంతుడు అంటే భగము కల్గినవాడు
అంటే పూర్తి తప్పు అగును. పురుషులకు భగము (గర్భము) ఉండదు. అందువలన సందర్భానుసారము పాయఖానా,
ధవాఖానా వేరువేరు భావములైనట్లు, బలవంతుడు, భగవంతుడు వేరువేరు భావములు కల్గియున్నవి.
భగవంతుడు అనగా భగమునుండి పుట్టినవాడని అర్థము కదా! అటువంటపుడు మనమందరము తల్లి
భగమునుండియే పుట్టాము కదా! దానివలన మనలనందరిని భగవంతులనియే అనాలి కదా! అని ఎవరైనా
ప్రశ్నించవచ్చును. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఏమనగా! దేవుడు తనను తాను సృష్టించుకొని
మానవశరీరముతో తల్లిగర్భము నుండి పుట్టుచున్నాడు. కానీ ప్రపంచములో ఏ జీవరాసిగానీ, ఏ మనిషిగానీ తల్లి
గర్భమునుండి పుట్టలేదు. ఇదేమిటి ఇంత విరుద్ధముగా, ఇంత గ్రుడ్డిగా చెప్పుచున్నారే అని మీరనుకోవచ్చును.
ఎవరేమనుకొనినా నేను చెప్పునది నూటికి నూరుపాళ్ళు వాస్తవము. ఒక్క భగవంతుడు తప్ప మిగతా వారందరు
గర్భము బయట శరీరమును ధరించుచున్నారు. మనిషి శరీరము తల్లి గర్భములో తయారగుచున్నది. తల్లిగర్భములో
తయారైన శరీరము గర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ శరీరములోనికి జీవుడు చేరుచున్నాడు. గర్భమునుండి
బయటపడిన శరీరములోనికి జీవుడు చేరుచున్నాడు. అందువలన ఎవరూ భగమునుండి పుట్టలేదు. కావున ఎవరూ
భగవంతులు కారు.
సర్వవ్యాపి అయినవాడు దేవుడు, ఒక్కచోట మాత్రముండువాడు మనిషి. మనిషి మరణములో ఒకచోటునుండి,
జన్మించవలసిన మరొక చోటికి పోయి గర్భము నుండి బయటకు వచ్చిన శిశుశరీరములో చేరు చున్నాడు. అలా జీవుడు
వచ్చిచేరిన దానిని జన్మ అంటున్నాము. ఎక్కడి నుండో వచ్చి శిశుశరీరములో ప్రవేశించు మనిషికి జన్మకలదు, జాతకము
గలదు. కానీ అంతటా వ్యాపించియుండి ఎక్కడినుండో వచ్చాడనుటకు వీలులేనివాడు దేవుడు. అటువంటి దేవుడు లేక
దేవుని అంశ భగవంతునిగా మారినపుడు తల్లిగర్భమునుండి సజీవముగా బయటికి వచ్చును. అలా దైవాంశ భగమునుండి
సజీవముగా వచ్చుచున్నది. కావున దానిని జన్మ అనలేము, దానికి జాతకము లేదు. జన్మించిన మనిషికి జాతకముండ
వచ్చును. కానీ జన్మలేని భగవంతునికి జాతకముండదు. భగవంతుడు తన కర్మను తానే సృష్ఠించుకొని వచ్చును.
కావున ఆయన కర్మను ఏ జ్యోతిష్యమూ చెప్పలేదు. మనిషికి అతను చేసుకొన్న కర్మ ప్రకారము శరీరము లభించును.
భగవంతునికి అతను వ్రాసుకొన్న కర్మ ప్రకారము గర్భములోనే శరీరమును ధరించి వచ్చును. గర్భములోనే జీవముతోనున్న
28

Page 29
వాడు ఒకే ఒక భగవంతుడు. ఇప్పటి కాలములో విజ్ఞానము అను పేరుతో జ్ఞానము కాని దానిని కొందరు తెలుసుకొని,
భౌతికశాస్త్రము యొక్క పూర్తి సారాంశమును తెలియక, తమకు తెలిసినదే గొప్ప అనుకొని ప్రతి గర్భములోని శిశువుకు
ప్రాణమున్నదని అంటున్నారు. గర్భస్థ శిశువుకు ప్రాణమున్నదను మాటను డాక్టర్లందరు చెప్పుచున్నారు. గర్భస్థ శిశు
వుకు ప్రాణము లేదను మాట వైద్యరంగములో పూర్తి వ్యతిరేఖమని మాకు తెలిసినా వారికి తెలిసినది అసత్యము, మాకు
తెలిసినది సత్యము కావున గర్భములోని ఏ శిశువుకు ప్రాణములేదని ధైర్యముగా చెప్పుచున్నాము. అలాగే దైవాంశ
జన్మించునపుడు మాత్రమే గర్భములోని శిశువుకు జీవముంటుందని చెప్పుచున్నాము. అలా జీవముతో పుట్టిన శిశువునే
భగవంతుడు అని అనవచ్చును.
జగతిలో ధర్మములకు ముప్పు ఏర్పడి అధర్మములు వ్యాపించి పోయినపుడు, తెలియని ధర్మములను తెలియ
చెప్పుటకు దైవాంశ భగవంతునిగా కొన్ని వేలసంవత్సరములకో, లేక కొన్ని లక్షల సంవత్సరము లకో భూమిమీదకు
వచ్చును. అలా వచ్చిన దేవుని అంశయే శ్రీకృష్ణుడు. కృష్ణుడు సాధారణ మనిషి అయినప్పటికీ ఆయన జన్మలో
భగవంతుడు. కృష్ణుడు గర్భములోనే జీవము కల్గియున్నాడనుటకు ఆధారమేమి అని భవిష్యత్తులో ఎవరూ ప్రశ్నించకుండ
కృష్ణుడు తల్లి గర్భమునుండి ఎదురు కాళ్ళతో పుట్టాడు. అలా కాళ్ళు బయటికి వస్తూనే, శరీరమంత గర్భములో
ఉన్నపుడే ఆయన గర్భములో సజీవముగా ఉన్నాడనుటకు నిదర్శనముగా కాళ్ళను కదిలించాడు. ఆ దినము ఆయన
ఎదురు కాళ్ళతో పుట్టి కాళ్ళు అల్లాడించడము వలన ఆయన భగవంతుడని చెప్పుటకు పూర్తి ఆధారము ఏర్పడినది.
సాధారణ మనిషికి గర్భము బయట జన్మకలుగుచున్నదను పూర్తి వివరమును మేము 1980వ సంవత్సరములో రచించిన
“జనన మరణ సిద్ధాంతము” అను గ్రంథములో గలదు.
కృష్ణుడు తల్లిగర్భమునుండి బయటికి వచ్చునపుడు ఒక కాలు రెండుమార్లు, ఒకకాలు ఒకమారు అల్లాడించాడని
మేము కృష్ణాష్టమి సందర్భమున ఉపన్యాసములో కూడ చెప్పాము. అంతేకాక ఆయన పుట్టినపుడు మీరు చూచారా?
అని ఎవరైనా ప్రశ్నించినా దానికి జవాబును కూడా అక్కడ చెప్పాము. ఇలా అన్ని ఆధారములతో కృష్ణుడు భగవంతుడని
చెప్పుచున్నాము. అంతేకాక ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యమును కూడ ఇపుడు చెప్పుకొందాము. కృష్ణుడు
పుట్టినపుడు కాళ్ళతో పుట్టాడని భారతములో వ్రాశారు. అయితే కాళ్ళు అల్లాడించాడని ఎవరూ చెప్పలేదు. కానీ
కాళ్ళు అల్లాడించినది వాస్తవమే, అయినా ఆ మాట నేడు గొప్ప రహస్యము. అలాంటిదే భారతములో కూడ చెప్పని
రహస్యము ఒకటి గలదు. అదేమనగా! కృష్ణుడు కాళ్ళతో పుట్టాడు కదా! ఆయన రెండు కాళ్ళకు రెండు చారలుండేవి.
ఆ విధముగా కాళ్ళకు చారలుండువారు భూమిమీద చాలా అరుదుగా ఉందురు. బహుశా కోటికొకరు కూడ
ఉండరనుకుంటాము. అలా చారలుండు శరీరము చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకత ఏమనగా! కాళ్ళకు చారలున్న
మనిషితో శత్రుత్వము చేసినా, అతనికి వ్యతిరేఖముగా ప్రవర్తించినా అటువంటివాడు ఆ జన్మలోనే క్షీణించి పోవును.
అలాంటివాడు ఎవడూ బ్రతికి బట్టగట్టలేడు. అలా అయితే ఆ దోషము ఆ జన్మలోనే అయిపోవును. ఆ
జన్మలో ఏమి
కాకుండ ఎవడైనా తప్పించుకోగలిగితే తర్వాత కొన్ని జన్మలవరకు పాపమును అనుభవించ వలసివచ్చును. ఇదంత
మీరే సృష్టించి చెప్పుచున్నారే అని అనుకోవద్దండి. కృష్ణుని శరీరమున కాళ్ళకు చారలున్న మాట నిజమే. ఆయనకు
వ్యతిరేఖమైనవారు ఎవరూ మిగలకుండ నాశనమై పోయిన మాట నిజమే. ఇదంత మీకు క్రొత్తగా కనిపించినా కృష్ణుని
జన్మలో జరిగిన సత్యమే.
ఆ
ప్రత్యేకమైన శరీరముతో తల్లిగర్భమునుండి జీవముతో పుట్టిన వాడు కృష్ణుడు. అందువలన ఆయన భగవంతుడు.
29

Page 30
కృష్ణుడు భగవంతుడైనప్పటికీ ఆ విషయము ఎవరికీ తెలియదు. కృష్ణుడు భగవంతుడని గుర్తించుటకు ఆధారమైన
దైవజ్ఞానమును, తనకు 90 సంవత్సరముల వయస్సు వచ్చు వరకు కృష్ణుడు ఎవరికీ చెప్పలేదు. కృష్ణునికి 90
సంవత్సరముల వయస్సులో భారతయుద్ధము జరిగినది. అప్పుడే ఆయన భగవద్గీతా జ్ఞానమును చెప్పాడు. అప్పుడు
చెప్పిన “గీత” యొక్క ఆధారముతో కృష్ణుడు భగవంతుడని కొందరు గుర్తించుటకు వీలుకల్గినది. ఇక్కడ ఎవరికీ
తెలియని మరియొక విచిత్రము గలదు. అదేమనగా! కృష్ణుడు పుట్టుకతో కాళ్ళు అల్లాడించినది, ఆయన కాళ్ళకు
చారలున్నది, కృష్ణుడు పుట్టుకతోనే భగవంతుడన్నదీ ఒకే ఒక భీష్మునికి మాత్రము తెలుసు.
ఆ కాలములో భీష్మున్ని
అందరూ గౌరవించినా భీష్ముడు మాత్రము కృష్ణున్ని భగవంతునిగా లెక్కించి గౌరవించెడి వాడు. భీష్ముడు కృష్ణున్ని
భగవంతునిగా గుర్తించాడు, కావున భీష్ముడు తన అవసానదశలో కృష్ణున్ని అడిగి మోక్షమును పొందాడు. ఈ విధముగా
ఆ కాలములోగానీ, ఈ కాలములోగానీ మనకు తెలిసినా, తెలియకపోయినా కృష్ణుడు భగవంతుడే. కృష్ణుడు భగవంతుడేగానీ
దేవుడు కాడు. కృష్ణుడు భగవద్గీతను చెప్పిన తర్వాత 36 సంవత్సరములు బ్రతికాడు. తనకు 126 సంవత్సరముల
వయస్సులో కృష్ణుడు మరణించాడు. పుట్టకముందు కృష్ణుడు దేవుడు, పుట్టిన తర్వాత భగవంతుడు. 126 సంవత్సరములు
జీవించి మరణించిన తర్వాత తిరిగి దేవునిగా మారిపోయాడు. ఈ విధముగా కృష్ణుడు బ్రతికియున్నపుడు భగవంతుడు,
చనిపోయిన తర్వాత దేవుడు. బ్రతికియున్న భగవంతున్ని దేవుడు అని అనకూడదు. అలాగే చనిపోయిన తర్వాత
భగవంతుడు అనకూడదు. ఈ వివరమునంతటిని చూస్తే కృష్ణుడు భగవంతుడని, భగవంతుడైన కృష్ణుడు తిరిగి
దేవునిగా మారిపోయాడని తెలియుచున్నది. అందువలన దేవునికి భగవంతునికి ఎంతో వ్యత్యాస ముందని తెలియుచున్నది.
తేడా తెలియకుండ ఎవరైనా మాట్లాడితే SP ని SI అన్నట్లు, SI ని SP అని అన్నట్లుండును.
కృష్ణుడు అందగాడా?
కృష్ణ జన్మ తండ్రి వీర్యకణము వలన కలిగినది కాదు. ప్రతి మనిషి పుట్టుకకు అతని భౌతిక తండ్రి యొక్క
వీర్యకణము అవసరము కాగా, భగవంతుని పుట్టుకకు భౌతిక తండ్రి అవసరమే లేదు. సాధారణ మనిషి పుట్టుకలో
తండ్రి వీర్యకణము తల్లి రజోకణముతో చేరి రజో కణము, వీర్యకణము మార్పు చెందుచూ గర్భములో శిశుశరీరము
తయారగు చున్నది. వీర్య, రజోకణ కలయిక చేత తయారైన శరీరము భౌతిక తల్లి, తండ్రి పోలికలు కల్గియుండును.
అయితే భగవంతుని శరీరము దేవుని అంశ చేత పుట్టినది కావున ఆ శరీరమునకు తండ్రి పోలికలుంటాయను
నమ్మకము లేదు. కొంత మేరకు తల్లి పోలికలుండవచ్చును. కృష్ణుని విషయానికి వస్తే ఆయన భౌతిక తల్లిదండ్రులైన
దేవకి, వసుదేవుల పోలికలు కృష్ణునికి ఏమాత్రము లేవు. అంతేకాక దేవకి, వసుదేవులు ఇద్దరు మంచి తెల్లని శరీర
ఛాయ కల్గియుండగా, కృష్ణుడు నల్లని ఛాయతో పుట్టాడు. ఉత్తర భారతదేశములో నల్లగ పుట్టువారు చాలా అరుదుగా
ఉందురు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనున్న మధుర పట్టణములో పుట్టిన కృష్ణుడు నల్లగా పుట్టడము ఒక వింతేనని
చెప్పవచ్చును. తల్లి తండ్రులు తెల్లగా ఉండగా వారి బిడ్డ అయిన కృష్ణుడు నల్లగా పుట్టడము వింతేకదా! కృష్ణుని
శరీరముగానీ, ఆ శరీరమునకు కారణమైన కర్మగానీ, దేవుని అంశచేత తయారైనవేనని చెప్పినా, అందులో కూడ ఒక
రహస్యము గలదు. అదేమనగా! తల్లి అయిన దేవకీదేవి గర్భములో కృష్ణుని యొక్క శరీరము తయారగుటకు మొదలైనపుడు
ఆ శరీరములో ఆ సమయమునుండే కృష్ణుడు ఉన్నాడు. అప్పటినుండే శరీరములోనున్న కృష్ణుడు తన శరీరము ఎలా
ఉండాలో, ఆ శరీరముతో ఏయే కర్మలను ఆచరించాలో, వాటిని తానే స్వయముగా నిర్ణయించుకొని అలాగే శరీరమును
తయారు చేసుకొన్నాడు. ఆ శరీరములోని కర్మచక్రములోని కర్మలను, గుణచక్రములోని గుణములను, కాలచక్రములోని
30

Page 31
కాలమును నిర్ణయించుకొని పెట్టాడు. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఏమి అనగా! పుట్టునది దేవుని అంశయే
అయినా కృష్ణుని జీవితమును గురించిగానీ, కృష్ణుని శరీరమును గురించిగానీ దేవుడు ఏమీ నిర్ణయించడు, దేవునికి
కృష్ణుని జన్మ విషయములో ఏమీ సంబంధము లేదు. భూమిమీద అధర్మములు చెలరేగినపుడు, అధర్మములు ఒక
స్థాయికి పెరిగినపుడు దేవుని అంశ తనకు తానుగా తల్లిగర్భములో శిశువుగా తయారగుటకు మొదలు పెట్టును. బాగా
గమనించవలసినది ఏమనగా! దేవుడు తాను భూమిమీద ఈ సమయములో, ఈ స్థలములో, ఈ గర్భములో పుట్టి ఈ
విధముగా ప్రవర్తించి, ఈ విధముగా ధర్మములను నెలకొల్పాలని అనుకోడు. దేవునికి తాను భగవంతునిగా పుట్టాలను
సంకల్పము కూడ లేదు. అధర్మములు తారాస్థాయికి చేరినపుడు తనకు తానుగా పుట్టుటకు సృష్ఠి లేకముందే దేవుడు
నిర్ణయించాడు. కావున అధర్మములు తారాస్థాయికి చేరినపుడు దేవుని సంకల్పము లేకుండానే, దేవుని అంశ భూమిమీదకు
వచ్చును. ఈ విషయము బాగా అర్థమగుటకు ఒక చిన్న ఉదాహరణను వివరిస్తాము చూడండి.
ఈ కాలములో పెద్ద షాప్లలోగానీ, పెద్ద హాస్పిటల్స్లోగానీ సెన్సార్ డోర్లు అమర్చిపెట్టారు. ఆ డోర్లు
ఎప్పుడూ మూసుకొని ఉంటాయి. మనము లోపలికి పోవాలనినా, బయటికి రావాలనినా వాటిని మనము తెరవవలసిన
పనిలేకుండా వాటంతటవే తెరుచుకొంటాయి. ఆ తలుపులకు నాలుగు అడుగుల దూరములోనికి మనిషి వస్తూనే
ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకొనునట్లు వాటికి సెన్సార్ అను పరికరము అమర్చబడి ఉండును. అందువలన
నాలుగు అడుగుల దూరములోనికి తలుపుల వైపు మనిషి వస్తూనే, సెన్సార్ గ్రాహితశక్తి వలన తలుపులు వాటంతటవే
ఓపన్కాగలవు. అలాగే మనిషి నాలుగడుగులు దూరము పోగానే మూసుకోగలవు. ముందే సెన్సార్లో నిర్ణయించిన
ప్రకారము మనిషి నాలుగడుగులలోనికి వస్తే తలుపులు వాటంతటవే తెరచుకొన్నట్లు భూమిమీద ధర్మములు క్షీణించి
పోయి, అధర్మములు 90 పాళ్ళు పెరిగి ధర్మములు కేవలము 10 పాళ్ళు మిగిలినపుడు, దైవాంశ దానంతటదే భగవంతుని
రూపముతో భూమిమీదకు వస్తున్నది. నాలుగడుగుల లోపలికి మనిషి ఒక్క అడుగు పెట్టిన వెంటనే ముందే నిర్ణయించిన
సెన్సార్ తనకు తానుగా తలుపులు తెరిచినట్లు, భూమిమీద అధర్మములు 89 పాళ్ళు దాటి 90 శాతములోనికి అడుగు
పెట్టిన వెంటనే సృష్ఠి పూర్వమే నిర్ణయించిన ప్రకారము దైవాంశ తనకు తానుగా భగవంతుని అవతారమెత్తుచున్నది.
భూమిమీద ధర్మముల సాంద్రత తగ్గి, అధర్మముల సాంద్రత 90 శాతమునకు వస్తూనే ఎవరి ప్రమేయము లేకుండ,
చివరికి దేవుని ప్రమేయము కూడ లేకుండ భగవంతుని రాక తనకు తానుగ జరిగిపోవుచున్నది.
ఇక్కడ కొందరికి కొన్ని ప్రశ్నలడుగుటకు అవకాశము గలదు. అడిగితే ఆ ప్రశ్నలు ఇలా ఉంటాయి. కృష్ణుని
రెండు కాళ్ళకు చారలున్నాయని ఇది భారతములో కూడ చెప్పని రహస్యమన్నారు. కృష్ణుడున్న ఆ కాలములో మీరు లేరు
కదా! కృష్ణుని కాళ్ళ చారల రహస్యము మీరెలా చెప్పగలుగు చున్నారు? రెండవ ప్రశ్న కృష్ణుడు భగవంతుడను విషయము
ఎవరికీ తెలియని రహస్యమన్నారు. కానీ ఆ రహస్యము భీష్మునికొక్కనికే తెలుసు నన్నారు. కృష్ణుడు 90 సంవత్సరముల
వయస్సులో గీతను చెప్పితే దానికంటే ముందు భీష్మునికి కృష్ణుడు భగవంతుడని తెలిసిన విషయము మీకెలా తెలుసు?
అని అడుగవచ్చును. మూడవ ప్రశ్న భగవంతుడు తండ్రి వీర్యకణము వలన పుట్టడు దేవుని అంశచేత పుట్టునన్నారు.
ఆ మాటను మీరు ఎలా చెప్పగలుగుచున్నారు? ఇక నాల్గవ ప్రశ్న ధర్మములకు ముప్పు ఏర్పడి అధర్మములు 90
శాతము పెరిగిన వెంటనే దైవాంశ భగవంతునిగా తనకు తానుగా పుట్టుచున్నాడని, అప్పుడు దేవుని సంకల్పము గానీ,
దేవుని ప్రమేయముగానీ ఏమీలేదని చెప్పుచున్నారు. ఎవరికీ తెలియని ఈ రహస్యము మీకెలా తెలుసు? అని అడుగవచ్చును.
ఈ ప్రశ్నలన్నీ సమంజసమైనవే, కానీ నేను ఒక్కమాట చెప్పగలను. నేను మీకు ఎలా తెలియనో, నాకు అవి అలా
31

Page 32
తెలుసునని చెప్పగలను. ఈ ప్రశ్నలకు నేను జవాబులు చెప్పకూడదు, కానీ మీరు స్వయముగా జవాబులను తెలుసుకో
వచ్చును, ముందు తెలియగలవు.
శ్రీకృష్ణుడు పుట్టిన తేదీ 19, జూలై నెల, క్రీ॥ పూర్వము 3228 సంవత్సరము 19-07-3228 B.C దినమున
వృషభలగ్నములో బహుళ అష్టమిలో కృష్ణుడు పుట్టాడు. ఆయన వయస్సు 30 సంవత్సరములు జరుగుచుండగా
జరాసంధుని చేతిలో ఓడిపోయి మధురను వదలి ద్వారకకు పోయాడు. క్రీస్తు పూర్వము 3138వ సంవత్సరము
కురుక్షేత్రమున భారత యుద్ధములో అనగా 90యేళ్ళ వయస్సులో “గీత” ను బోధించాడు. తర్వాత 36 సంవత్సరములు
బ్రతికి క్రీస్తుపూర్వము 3102 సంవత్సరములో మరణించాడు. మొత్తము 126 సంవత్సరములు బ్రతుకగలిగాడు.
భీష్ముడు కృష్ణునికంటే దాదాపు 260 సం|| పెద్ద వయస్సుకలవాడు. భీష్ముడు దాదాపు 350 సంవత్సరముల వయస్సుపైనే
చనిపోయి ఉంటాడు. కృష్ణున్ని సాక్షాత్తు దేవునిగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఒక్క భీష్ముడే, కృష్ణుడు కాళ్ళతో పుట్టాడని
తెలిసిన భీష్ముడు కృష్ణుని కాళ్ళవైపే ఎక్కువగా చూచెడి వాడు. కృష్ణుని కాళ్ళకు చారలను గ్రహించిన భీష్ముడు తన
సంస్కార బలముచేత కృష్ణున్ని దైవాంశ అయిన భగవంతునిగా గుర్తించగలి గాడు. ఈ విషయమునే భగవద్గీత విజ్ఞాన
యోగమున 19వ శ్లోకములో ఈ విధముగా శ్రీకృష్ణుడే చెప్పాడు.
బహూనాం జన్మనామస్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥
ఈ శ్లోకము భీష్మునికిగానీ, భీష్మునిలాంటి వారికిగానీ బాగా సరిపోతుంది. ఎన్నో జన్మలు జ్ఞానిగా పుట్టిన వ్యక్తి
జన్మజన్మకు జ్ఞానమును అభివృద్ధిచేసుకొని, దేవుడొక్కడేనను జ్ఞానము చేత పరమాత్మను తప్ప ఇతరులను ఆరాధించడు.
వానిని మహాత్ముడని చెప్పవచ్చును. అటువంటి వాడు వేల సంవత్సరములకో, లక్షల సంవత్సరములకో బహు
అరుదుగా భూమిమీదకు వచ్చు భగవంతున్ని తన జ్ఞాన సంస్కార బలముచేత గుర్తించ గలడు. వాసుదేవుడే అనగా
కృష్ణుడే సర్వజీవులకు అధిపతి అయిన భగవంతుడని గుర్తించగలడు. ఆ విధముగా భూమిమీద భగవంతున్ని
గుర్తించగలుగువాడు చాలా అరుదుగా ఉండును. మనిషిలాంటి భగవంతున్ని ఎవరైనా మనిషిగానే గుర్తించగలరు.
కానీ మనిషిని భగవంతునిగా గుర్తించుటకు కోట్ల అనుమానముల అడ్డంకులు వచ్చును. కృష్ణుడు భగవంతుడు కాదు
అని వచ్చు కోట్ల మాయ ప్రశ్నలకు కోట్ల జ్ఞాన సమాధానములు చెప్పవలసియుండును. మాయ వలన వచ్చు ప్రశ్నలకు
జవాబులు చెప్పుటకు మనిషికి ఎంతో జ్ఞానముండవలెను. అటువంటి జ్ఞానము లేనపుడు భగవంతుడు మన ముందరే
ఉన్నా గుర్తించలేము. అధర్మములు చెలరేగిన కాలములో కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు భగవంతుడని ఎవరికీ తెలియని
రహస్యమును ఒకే ఒక భీష్ముడు ఛేదించగలిగాడు. తన జీవితములో ఎన్నోమార్లు కృష్ణుడు గొప్పవాడని కౌరవులకు
కూడ చెప్పాడు. అయినా ఆయన మాటను ఎవరూ వినలేదు. భీష్ముడు కనీస జ్ఞాని అనికూడ ఎవరి చేతా గుర్తింపు
పొందలేదు. అయినా వాస్తవానికి ఆ కాలములో అత్యున్నత జ్ఞాని అని మనము నేడు చెప్పగలుగుచున్నాము. భీష్ముడు
ఉన్నతమైన జ్ఞాని అనుటకు ఆయన కృష్ణున్ని భగవంతునిగా గుర్తించడమే నిదర్శనము.
కృష్ణుడు మధురలో కారాగారము (జైలు)లో జన్మించాడు. జ్ఞానము నకు అజ్ఞానము నిత్యము శత్రుత్వము
కల్గియున్నదనుటకు నిదర్శనముగా జ్ఞాన నిధిగా పుట్టిన కృష్ణునికి పుట్టుకతోనే అజ్ఞానులైన వారిచే ప్రాణహాని ఉండెడిది.
అందువలన కృష్ణుడు శిశువుగా పుట్టిన గంటకే మధుర ప్రక్కనేనున్న “గోకుల్" అను చిన్న గ్రామములోనికి చేర్చబడి
అక్కడ యశోద సంరక్షణలో మూడు సంవత్సరముల నాలుగు నెలలు ఉన్నాడు. తర్వాత ప్రక్కనే “నందగావ్”లో ఆరు
32

Page 33
సంవత్సరముల ఎనిమిది నెలలు ఉన్నాడు. అలా పది సంవత్సరములు పెరిగిన తర్వాత పదకొండవ సంవత్సరము తన
జన్మస్థలమైన మధురకు కృష్ణుడు రావడము జరిగినది. తన పదకొండవ ఏట మేనమామ అయిన కంసున్ని చంపాడు.
అప్పటి నుండి దాదాపు ముప్పైసంవత్సరముల వయస్సు వరకు మధురలోనే నివాసమున్నాడు. ఆ సమయములో 15
సం॥ నుండి 30 సంవత్సరముల వరకు మధురకు ప్రక్కనేనున్న బృందావనములో గోపికలతో గడిపాడు. తర్వాత
జరాసంధుని చేతిలో ఓడిపోయి మధురను విడచి, గుజరాత్ రాష్ట్రములో సముద్రము ఒడ్డున ద్వారకాపట్టణమును
నిర్మించుకొని చివరి వరకు అక్కడే కాలము గడిపి మరణించడము జరిగినది. తర్వాత ద్వారక సముద్రములోనికి
కలిసిపోయినది. ఈ విధముగ సాగిన కృష్ణుని జీవితమును చూచి ఎవరూ ఆయనను భగవంతుడని అనలేరు.
కృష్ణుని బాల్యములో పూతన, శకటాసురుడు మొదలగు వారిచేత గండము ఏర్పడినా అవి ఆయనను ఏమీ
చేయలేకపోయాయి. పదకొండు సంవత్సరములకే మేనమామను హత్యచేసిన కృష్ణుడు మధుర రాజ్యభారమును అన్న
అయిన బలరామునికి అప్ప చెప్పి, తన పదిహేనవ సం||ల నుండి దాదాపు ముఫ్పై సం||లు వయస్సు వచ్చు వరకు
ప్రక్కనే ఉన్న బృందావనము లో గోపికలతో కాలము గడిపాడు. కృష్ణుడు నల్లని శరీరఛాయ కల్గి ఆరు అడుగుల
ఎత్తుగలవాడు. ఎక్కడైనా కృష్ణుని చిత్రపటము కనిపిస్తే అది బృందావనములోనిదై ఉంటుంది. ఆయన చిత్రపటములన్నీ
ఇటు గోపికలతోగానీ, అటు రాధతోగానీ ఉన్నవిగా ఉంటాయి. అవి కాకపోతే చిన్న వయస్సులో నందగావ్లో తోటి
స్నేహితులతో కలిసి వెన్న, పాలు దొంగిలించిన పటములు ఉండును. నందగావ్లోనివి, బృందావనములోని చిత్రపటములు
అనేక రకములుగా ఉండినా అవన్నియు కృష్ణుని యుక్తవయస్సులోనివే. 30 సంవత్సరముల వయస్సు వరకు ఉన్న
చిత్రపటములు తప్ప తర్వాత 90 సం|| వయస్సు వరకు ఏ ఫోటోలు లేవు. ఆయనకు తొంభై సంవత్సరముల వయస్సులో
కురుక్షేత్ర యుద్ధములోని చిత్రములు రెండే ఉన్నవి. అందులో ఒకటి కృష్ణుడు అర్జునుని రథసారథిగా ఉండి గీతను
బోధించునది, రెండవది యుద్ధము మధ్యలో భీష్ముని మీదికి కోపముతో చక్రధారియై రథము దిగి పోవుచుండగా అర్జునుడు
వారించు చున్నది. విశేషమేమంటే ఈ రెండు చిత్రపటములలో కృష్ణున్ని 90సం॥ వృద్ధ వయస్సులో ఉన్నట్లు చూపక,
ముఫ్పై సంవత్సరముల యుక్తవయస్సులో ఉన్నట్లే చూపారు. యుద్ధరంగములో కృష్ణుని వయస్సు పెద్దదైనా చిన్న
వయస్సుగా చిత్రకారులు చిత్రించడము వలన అందరికీ కృష్ణుని యుక్త వయస్సే కనిపిస్తుంది. కృష్ణుని మధ్యవయస్సుగానీ,
వృద్ధ వయస్సుగానీ ఎవరికీ తెలియకుండ పోయినది.
ఎక్కువగా బృందావనములో గోపికలతోను, ఏకకాంత రాధతోను గడిపిన చిత్రపటములు కనిపించుట వలన
కృష్ణుని పేరు వింటూనే ఆయన యుక్తవయస్సులో అల్లరిగా తిరిగినవాడని ప్రజలు అనుకోవడము జరుగుచున్నది. కొన్ని
లక్షల సంవత్సరముల తర్వాత భూమిమీదికి దిగివచ్చిన దేవుని అంశ అయిన భగవంతుడే కృష్ణుడని ఎవరూ అనుకోవడము
లేదు. కృష్ణున్ని అలా అనుకోవడము ఈనాటి ప్రజల దౌర్భాగ్యము, అజ్ఞానము అని చెప్పవచ్చును. కృష్ణుడు
మధురానగరమును విడిచిపోయిన తర్వాత తిరిగి బృందావనమునకు వచ్చిన సమాచారము లేదు. ఆయన ద్వారకకు
పోయిన తర్వాత ఎనిమిది మంది భార్యలను చేసుకొన్నాడు. కృష్ణునికి అష్ట భార్యలను మాటవినినా, ఆయన విధానము
తెలియని ప్రజలు కృష్ణున్ని తక్కువగా భావించుకొనుచున్నారు. కొందరైతే పదహారు వందలమంది స్త్రీలతో సహవాసము
చేసినాడని కొందరను చుండగా, పదహారు వేల మంది స్త్రీలతో ఉన్నాడని అనువారు కొందరున్నారు. ఈ విధముగా
భగవంతుడైన కృష్ణున్ని తక్కువ భావముతో మాట్లాడువారే భూమిమీద ఎక్కువగా ఉన్నారు. ఇంతమంది స్త్రీల మనస్సులను
దోచాడు అంటే కృష్ణుడు అంత అందగాడా? అను ప్రశ్న రాగలదు. అందరికీ తెలిసినట్లు ఆయన నల్లనివాడు.
33

Page 34
ఉత్తరదేశములో పురుషులందరు తెల్లగానే ఉంటారు. నల్లగ ఉండువానిని ఎవరూ ఇష్టపడరు. అలాగే స్త్రీలు కూడ
తెల్లని పురుషున్ని కోరుకుంటారు, కానీ నల్లనివానిని కోరుకోరు. పైగా కృష్ణుడు నల్లనివాడైనా అందగాడా అంటే అంత
అందగాడు కూడా కాదు. కొనతేలిన ముక్కుగలవాడా అంటే అట్లు కూడా లేకుండ మొద్దు ముక్కు కలవాడు. వాస్తవానికి
పెద్ద అందగాడేమీ కాదు. కృష్ణునికి తెల్లని శరీర ఛాయ లేకపోయినా, నల్లనివాడైనా, మొద్దు ముక్కున్నవాడైనా, చెప్పుకొను
అందము లేకపోయినా ఆయనను ఒకమారు చూస్తే రెండవమారు చూడాలనునట్లు ముఖములో ఆకర్షణ కళ
ఉండెడిదని చెప్పవచ్చును. ఆయన కళే ఆయనకు ప్రత్యేకమైన అందమును చేకూర్చినది. ముఖములో కళలేని
మనుషులకంటే కృష్ణుడు అందమైన వర్చస్సు కలవాడని చెప్పవచ్చును.
బృందావనము - శృంగారవనమా ?
ఆ
కృష్ణుని జీవితములో 15 నుండి 30 సంవత్సరముల వయస్సు వరకు బృందావన జీవితము ఒక అందమైన
అనుభూతియే కాక, చందమైన అవగాహన కూడ అని చెప్పవచ్చును. ఆనాడు బృందావనములో కృష్ణుని సన్నిధియందు
అందము చందము రెండూ ఉండెడివి. మాయ గుణములతో కూడుకొన్న మనుషులకు బృందావనములో గోపికల
అందము, కృష్ణుని శృంగారము కనిపించింది. అంతతప్ప ఇటు గోపికలుగానీ, అటు కృష్ణుడు గానీ ప్రజలకు అర్థము
కాలేదనియే చెప్పవచ్చును. నేడు ప్రజలలోనున్న అజ్ఞానము తొలగిపోయి కృష్ణుడు భగవంతుడుగా తెలియాలనినా లేక
గొప్ప వాడని తెలియాలనినా కృష్ణుని బృందావన జీవితము యొక్క విశేషమేమి అని విశ్లేషించి చూడవలసిందే.
విశ్లేషణలో కృష్ణుని వద్దకు వచ్చిన గోపికలెంత మంది? వచ్చినవారు ఆయనకంటే వయస్సులో చిన్నవారేనా? రాధాదేవి
కృష్ణునికంటే చిన్నదా, పెద్దదా? రాధయొక్క ప్రణయమేమిటి? కృష్ణునివద్దకు వచ్చిన స్త్రీలంతా గొల్లవారేనా? బృందావనములో
కృష్ణుని వద్ద మనుషులుగానీ, జంతువులుగానీ, పక్షులుగానీ అన్ని స్త్రీజాతివే ఎందుకున్నాయి? కృష్ణుడు శృంగార ప్రియుడా?
ఇన్ని ప్రశ్నలకు సరియైన సమాధానము దొరికినపుడు కృష్ణుని బృందావన జీవితము మనకు అర్థము కాగలదు. కృష్ణునికి
అష్ట భార్యలుండినా ఆయన ప్రక్కలో ఏ భార్య కనిపించక కేవలము రాధమాత్రమే కనిపిస్తూవుంది. ఎక్కడైనా రాధాకృష్ణుడు
అను పేరుగలదు, కానీ సత్యభామ కృష్ణ అనిగానీ, రుక్ష్మిణి కృష్ణ అనిగానీ ఎవరూ పిలువరు. కృష్ణుని ఏ చిత్రపటములోగానీ
కృష్ణుని భార్యలలో ఒక్కరు కూడ కనిపించరు. ఎన్ని చిత్రములలోనైనా రాధాకృష్ణులే ఉందురు. రాధ, కృష్ణుని జీవితములో
మరపురాని ఘట్టమైనదని చెప్పవచ్చును.
బృందావనములో రాధకు కృష్ణునితో పరిచయము ఏర్పడినది. అప్పటికి కృష్ణుని వయస్సు 15 సంవత్సరముల
9 నెలల 7 దినములు కాగా, రాధ వయస్సు 14 సం॥ల 2 నెలల 15 దినములు. దీనినిబట్టి రాధాదేవి కృష్ణునికంటే
1సం|| 6 నెలల 22 రోజులు చిన్నదని చెప్పవచ్చును. బృందావనములో మొదట రాధతో పరిచయమేర్పడిన తర్వాత
కాలము గడచుకొలది, ఒక్కొక్కరు కృష్ణునివద్దకు ఆయనతో బృందావనములో కొంతసేపు కాలము గడిపి పోయెడివారు.
కృష్ణుడు ప్రతి దినముగానీ, దినము మార్చి దినముగానీ, ఒక్కొక్కప్పుడు మూడు దినములకు ఒకమారుగానీ బృందావనమునకు
పోయి ఒకరోజు లేక రెండు రోజులు ఉండి తిరిగి మధురకు వచ్చెడివాడు. మధురలోవున్నంత కాలము కృష్ణుడు పెళ్ళి
చేసుకోలేదు. కృష్ణుడు ద్వారకకు పోయిన తర్వాత ముందు రుక్మిణీదేవిని వివాహమాడారు. తర్వాత మిగత ఏడుమందిని
భార్యలుగా చేసుకొన్నాడు. ఇక్కడ ముఖ్యముగ గమనించవలసినది ఏమనగా! ఆయనకు దగ్గరగా కాలము గడిపిన
వారిలో రాధ అందరికీ తెలుసు, అలాగే ఎనిమిది మంది భార్యలు అందరికీ తెలిసినవారే. ఇకపోతే గోపికలు ఎంతమంది
34

Page 35
అన్నది తెలియని సంఖ్య. కానీ కొందరు 16 వందల మంది గోపికలతో కృష్ణుడు బృందావనములో తిరిగాడనగా,
కొందరేమో 16 వేల మంది గోపికలతో తిరిగాడని అంటున్నారు. చరిత్రకారులు వ్రాసినది తప్పా? ఒప్పా? అని
చూడవలసిన అవసరమున్నది. అలా చూస్తే 16 వందలమంది అనుమాట గానీ, 16 వేలమంది అనుటగానీ పూర్తిగా
అవాస్తవమని తెలియుచున్నది.
బృందావనములో మొదట రాధ భగవంతుడైన కృష్ణునివద్దకు రాగా తర్వాత ఒకరి తర్వాత ఒకరు గోపికలు
రావడము జరిగినది. అలా వస్తూ 15 సంవత్సరముల బృందావన కాలములో మొత్తము 99 మంది గోపికలు వచ్చారు.
మొదట ఒక రాధ తర్వాత 99 గోపికలు మొత్తము 100మంది బృందావన జీవితములో కృష్ణునితో కాలము గడిపారు.
అలా వచ్చిన వారిలో కృష్ణునికంటే పెద్దవయస్సువారు కూడ కొందరున్నారు. మొదటి రాధకానీ తర్వాత వచ్చినవారుగానీ
కృష్ణునివద్దకు శృంగారము కొరకు వచ్చారనుటకు కూడ వీలులేదు. ఎందుకనగా కృష్ణుడు నల్లనివాడు మరియు చెప్పుకోతగ్గ
అందగాడూ కాడు. అందువలన శృంగారము కొరకు ఎవరూ రాలేదు. అట్లయితే దేనికి వచ్చారని అడిగితే దానికి
బలమైన కారణము కలదు. అదేమనగా! భూమిమీద ధర్మములు ఒక్కమారుగా నశించిపోవు. ఎన్నో వందల, వేల
సంవత్సరముల నుండి ధర్మముల స్థానములో అధర్మములు చేరుతూ వచ్చుచుండును. అట్లు జరుగుచూ వచ్చి అధర్మములు
90 శాతము పెరుగుతూనే భగవంతుడైన కృష్ణుడు భూమిమీదకు వచ్చాడు. కృష్ణుని జన్మకంటే కొన్ని వేల, లక్షల
సంవత్సరముల నుండి అధర్మములు పెరుగుచున్నప్పటికీ, అధర్మములకులోను కాకుండ ధర్మములనే ఆశ్రయించి, పూర్తి
శ్రద్ధతో జ్ఞానమును తెలుసుకొంటూ, దైవమును దర్శించాలని ఆయనలో కలిసిపోవాలని తహ తహలాడువారు
కొందరుండవచ్చును. అలా జన్మ జన్మకు దైవము మీద ఇష్టతను పెంచుకొన్నవారై దైవసన్నిధికి చేరాలని, దైవమును
దర్శించాలని ఆరాటపడువారు మొత్తము 108 మంది ఉండెడి వారు. ఆ నూట ఎనిమిది మందిలోని శ్రద్ధయొక్క
మరియు విశ్వాసము యొక్క తీవ్రతను బట్టి వారిని మూడు భాగములుగ విభజించడము జరిగినది. మూడు భాగముల
శ్రద్ధలో మొట్టమొదటి శ్రద్ధనుబట్టి రాధ ఒక్కతే. తర్వాత శ్రద్ధనుబట్టి 99మంది ఉన్నారు. ఆ తర్వాత శ్రద్ధనుబట్టి
మూడవ గుంపుగా ఎనిమిదిమంది ఉన్నారు. ఈ నూట ఎనిమిది మంది 1+99+8 = 108. అధర్మములు అభివృద్ధి
అయ్యే కాలములోనే ధర్మములను వదలకుండ, దైవమును చేరాలని దైవ దర్శనము కావాలను గట్టి పట్టుదలతో ఉండుట
వలన వారి ఉద్దేశము కొంత వరకు నెరవేరుటకు అవకాశమొచ్చినది.
ఇక్కడ కొంత వివరముగా అర్థము చేసుకోవలసిన పని ఉన్నది. అదేమనగా. భక్తిగల్గిన వారు వారి విశ్వాసము
కొద్ది దైవమును చేరాలని, దైవమును దర్శించుకోవాలని అనుకోవడము సహజమే. అయితే దేవుడు కనిపించడు కదా!
అలాగే దైవమువద్దకు చేరుటకు దైవము ఒకచోట ఉండునది కాదుకదా! అందువలన ఆ రెండు కోర్కెలు మంచివే
అయినా నెరవేరుటకు వీలులేదు. అధర్మములు అభివృద్ధి అయ్యే కాలములోనే దేవుని మీద విశ్వాసముతో మాయవైపు
పోకుండ, దైవమువైపు రావాలని గట్టి ఉద్దేశముతో కొన్ని జన్మలనుండి వచ్చుట వలన, వారి భావము ధర్మయుక్తమే
అయిన దానివలన, వారి ఉద్దేశము నెరవేరుటకు దైవచట్టము సహకరించి నది. అందువలన దేవుని అంశ భగవంతునిగా
భూమిమీదకు వచ్చిన కాలములోనే ఆ నూట ఎనిమిదిమందిని భగవంతుని వద్దకు చేర్చినది, భగవంతుని దర్శనము
లభించునట్లు చేసినది. (ముఖ్యగమనిక :- ఇక్కడ దైవచట్టము అను క్రొత్త పదము ఉపయోగించబడినది. దానిని
తెలియాలంటే “దయ్యాల, భూతాల యదార్థసంఘటనలు" అను గ్రంథమును చదువవలసి యుండును. ప్రస్తుతానికి
దైవచట్టము అను మాటను ప్రకృతి లేక దైవపరిపాలన అని అర్థము చేసుకోండి. ఎన్నో జన్మలనుండి దైవమును
35

Page 36
ఆ
ఆరాధిస్తూ, అనేక జన్మల సంస్కారముకలవారిగా ఉండుట వలన, వారిలోని సంస్కార బలమును అనుసరించి మూడు
గుంపులుగా వారికి వారి ఉద్దేశము నెరవేరినది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నను కొందరు జ్ఞానులు అడుగుటకు
అవకాశము గలదు. అదేమనగా! భీష్ముడు కూడ అనేక జన్మల సంస్కారము తోనే పుట్టాడని, అందువలన ఆ జన్మలోనే
దైవమునందు ఐక్యమైపోయి ముక్తి చెందాడని చెప్పారు కదా! పూర్వజన్మలనుండి భీష్ముడు కూడ దైవమును చేరాలను
ఉద్దేశముతోనే వచ్చాడు కదా! అటువంటపుడు ఈయనతో కలుపుకొని చెప్పితే 109 మంది సంఖ్య అగును కదా! 108
మంది ఆడవారిగా పుట్టి కృష్ణునివద్దకు చేరినపుడు, భీష్ముడు మాత్రము పురుషునిగా పుట్టి కృష్ణునికి దూరముగానే
ఉంటూ చివరిలో మోక్షము పొంది దైవములో చేరిపోయాడని చెప్పారు కదా! ఇక్కడ భీష్మునికి మిగత 108 మందికి
తేడాగలదా! అని అడుగవచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు.
కృష్ణుడు పుట్టిన కాలములోనే గతజన్మల సంస్కారముల వలన పుట్టినవారు మొత్తము 109 అను మాట సత్యమే,
అయితే వారిలోని ఉద్దేశములో కొంత తేడా ఉండుట వలన భీష్మున్ని మాత్రము 108 మందిలో కలపకుండ
విభజింపవలసివచ్చినది. ఆ విభజనలోనే భీష్మునికి పురుష శరీరమురాగా మిగత 108 మందికి స్త్రీ శరీరములు
లభించినవి. భీష్ముడు దేవునిలోనికి ఐక్యము కావాలని అనుకొన్నాడు. మిగత 108 మంది దేవునివద్దకు చేరాలని,
దేవున్ని దర్శించుకోవాలని అనుకొన్నారు. వారి ఉద్దేశములలో తేడా ఉండుట వలన వారికి అలాగే నెరవేర్చబడినవి.
భీష్ముడు మోక్షమును చేరిన వారికి జ్ఞానగుర్తుగా మిగిలాడు. మిగత 108 మంది మోక్షమును చేరవలసిన వారికి
జ్ఞానగుర్తుగా మిగిలారు. మనము కూడ ప్రయత్నము చేసి చివరకు మోక్షము చేరవలసిన వారమే, కావున ముఖ్యముగ
108 మందిని చూచి నేర్చుకోవలసిన జ్ఞానము ఎంతో ఉంది. 108 మందిలో గత జన్మలయందు 100 మంది
పురుషులుగా 8 మంది స్త్రీలుగా పుట్టారు. కృష్ణుడు భూమిమీదకు వచ్చినపుడు మొత్తము 108 మంది స్త్రీలుగా
పుట్టడములో ఒక విశేషమైన అర్థముగలదు. ఆ అర్థము మనకు ఎంతో ముఖ్యమైన జ్ఞానము అగును. అందువలన
108 మంది మోక్షమును చేరవలసిన వారికి జ్ఞాన గుర్తు అని అన్నాము. గత జన్మలలో జ్ఞానులైన 108 మంది స్త్రీలుగా
పుట్టడము, వారు మూడు గుంపులుగా విభజింపబడడము జరిగినదని చెప్పుకొన్నాము. మొదటి గుంపులో ఒక్కరే
మిగిలారు. ఆమే రాధాదేవి. రెండవ గుంపులో 99 మంది మిగిలారు, వారే బృందావనములోని గోపికలు. మూడవ
గుంపులో 8 మంది ఉన్నారు, వారే కృష్ణునికి భార్యలుగా ఉన్నారు. ఇలా మూడు భాగములుగా చేయుటకు కూడ కొంత
కారణమున్నది. వారిలో ఉన్న ఉద్దేశము ఒక్కటే అయినా వారిలోగల శ్రద్ధలో చిన్న తేడాను బట్టి ఆ విధముగా
విభజించవలసి వచ్చినది. మొదటి శ్రేణిలోనున్న రాధ గత జన్మలలో పురుష శరీరమునే ధరించి ఉన్నప్పటికీ, దైవము
మీద ఉన్నతమైన విశ్వాసము కల్గియుండినా, ఆ జీవుని మనస్సులో ఒక గాఢమైన కోర్కె ఉండెడిది. అదేమనగా! దేవుని
పేరు ఎక్కడుండిన ఆయన సేవకురాలిగా నాపేరు అక్కడుండాలి అనునది ఆమె వాంఛ. దైవము మీద అమితమైన
విశ్వాసము, బలమైన శ్రద్ధ ఉండుట వలన ఆమె కోర్కె దేవుని పరిపాలనలో ఆమోదయోగ్యమైనది. అయితే దేవునికి
పేరుండదు, దేవుని అంశ అయిన భగవంతునికి పేరుంటుంది. కావున ఆమె కోర్కె ప్రకారము భగవంతుని పేరు ప్రక్కన
ఆమె నిలబడినట్లు జరిగినది. రాధ దైవదర్శనము కావాలని కూడ కోరుకొన్నది. అలాగే దైవమువద్ద కొంతకాలమైనా
ఉండాలనుకొన్నది. గత జన్మలలో రాధ పురుష శరీరములో ఉండుట వలన భౌతికమైన ఏ వాంఛలను కోరలేదు.
అందువలన రాధ భగవంతుని సన్నిధానములోనికి చేరినది. కానీ రాధకు కృష్ణునితో మానసిక సంబంధము తప్ప
శరీర సంబంధము ఏమి లేదు. రాధ కోర్కెలన్ని దైవపాలనకు ఆమోదయోగ్య మగుట వలన ఆమె కోర్కెలన్నీ దైవాంశ
భూమిమీదికి వచ్చినపుడు నెరవేరినవి. భగవంతుడు దైవమునకు వేరుకాడు కావున భగవంతుడు కృష్ణుని రూపములో
36

Page 37
ఉండినపుడు తన పదిహేనవ ఏటనే ఆయనవద్దకు చేరగలిగింది. ఆయనకు సేవ చేయగలి గింది. కృష్ణునికి దగ్గరగా
ఉండిన భాగ్యము రాధకు దక్కినది. రాధతో పాటు కృష్ణుని వద్ద ఎందరు గోపికలున్నా వారిపేరు కృష్ణుని ప్రక్కన
నిలబడలేదు. రాధాకృష్ణ అను పేరు స్థిరస్థాయిగా ఈనాటికీ నిలిచిపోయినది, భవిష్యత్తులో కూడ ఉంటుంది.
రాధాదేవి మొట్టమొదట బృందావనములో కృష్ణునివద్దకు రాగా తర్వాత గోపికలందరు ఒక్కొక్కరుగా వచ్చారు.
రాధాదేవి మొదలుకొని గోపికలందరు కృష్ణునివద్దకు దాదాపు నాలుగైదు సంవత్సరముల కాలములో వచ్చారు. దీనినిబట్టి
అందరూ ఒక్కమారుగా రాలేదని తెలియుచున్నది. ఏ గోపిక ఆయన వద్దకు వచ్చినా, ఏ గోపిక ఆయనను మొదటిసారిగ
చూచినా, వారికి తెలియకుండానే వారి కన్నులలో నీళ్ళు వచ్చేవి. వారికి తెలియకుండానే వారిలో ఏదో బాధ
ఉప్పొంగినట్లు ఏడ్చేవారు. వారిని మౌనముగా కృష్ణుడు చూచేవాడు, ఏమాత్రము నివారించేవాడు కాదు. ఆ విధముగా
ఆయనవద్దకు వచ్చిన వందమందికి రాధతో సహా అందరికీ జరిగినది. ఎవరైనా బాధతో ఏడ్వవచ్చును లేక సంతోషముతో
అయినా ఏడ్వవచ్చును. కానీ ఆనాటి గోపికలకు సంతోషముగానీ, దుఃఖముగానీ లేకుండానే ఏడ్చేసేవారు. అలా
ఏడ్వడములోని అనుభూతి సుఖదుఃఖములకు అతీతమైనదిగా ఉండెడిది. అలా మొదటి దర్శనములో అందరికీ జరిగినది.
తర్వాత ఎప్పుడైనా కృష్ణుని జ్ఞాపకము వారి మనస్సులో వచ్చినపుడు వారి గుండెల స్థానమునుండి పులకింత మొదలై
శరీరమంతా ప్రాకెడిది. కృష్ణుని దర్శనము అందరికీ అన్ని దినములు దొరికెడిదికాదు. గోపికలందరు కలిసి
బృందావనములోనికి రావడము జరిగెడిది కాదు. ఎవరి అనుకూలముకొద్ది వారు బృందావనములోనికి కృష్ణుని దర్శనము
కొరకు వచ్చెడివారు. ప్రతి దినము వచ్చినవారున్నారు, దినము మార్చి దినము వచ్చినవారున్నారు. అలాగే
మూడురోజులకొకమారు, నాలుగు రోజులకొక మారు వచ్చిన వారున్నారు. ఒక్కొక్కప్పుడు ఎంత అనుకూలము
లేకుండాపోయినా ఏదో ఒక విధముగా వీలు కల్పించుకొని కనీసము పదిరోజులకొకమారైన వచ్చిన వారున్నారు. అలా
వచ్చినప్పటికి వారికి కృష్ణుడు కనిపించవచ్చును లేక కనిపించకపోవచ్చును. ఎందుకనగా! కృష్ణుడు ప్రతి దినము
బృందావనమునకు వచ్చెడివాడు కాదు. రెండు మూడు రోజులలో బృందావనమునకు వచ్చినా విశాలమైన బృందావనములో
కృష్ణుడు ఎక్కడుండెడి వాడో కొందరికి తెలియదు. కొన్ని దినములకు ఒక్కొక్కరికి మాత్రమే ఆయన దర్శనము దొరికెడిది.
కొన్ని దినములలో ఐదారుమంది గోపికలతో కలిసి ఉండెడివాడు. కొన్ని దినములలో రాధతోమాత్రము కలిసి ఉండగా,
కొన్ని దినములలో రాధకు కూడ కనిపించెడివాడు కాడు. బృందావనములో కృష్ణుడు ఎక్కడున్నాడోనని కొందరు గోపికలు
కలిసి వెదికేవారు. కృష్ణుడు ఎక్కడో ఒక చోట కూర్చొని మురళిని మ్రోగించుచుండగా ఆ శబ్దమును బట్టి ఆయనను
కనుగొనేవారు. కొందరు గోపికలైతే కృష్ణున్ని బృందావనమునకు ఎప్పుడు వస్తావని, వస్తే ఎక్కడుంటావని అడిగెడివారు.
కృష్ణుడు పలానాప్పుడు వస్తానని, ఫలానా చోటే ఉంటానని చెప్పెడివాడు. కానీ కృష్ణుడు అలా వచ్చెడివాడు కాడు,
ఒకవేళ వచ్చినా చెప్పిన చోట ఉండేవాడు కాడు. ఈ విధంగా వారిని ఆట ఆడించేవాడు. అలా ఆయన కనిపించక
పోవడముతో వారు విసిగిపోయే వారు. ఆయన దొరికితే గట్టిగా అడగాలనుకొనెడివారు. ఆయన దొరికినపుడు,
ఆయన దర్శనమైనపుడు తమను తాము మరచి పోయెడివారు. కొందరు కృష్ణునితో పలానా సమయములో పలానా
చోట నేను ఇక్కడే ఉంటానని ప్రమాణము చేయించుకొనెడివారు. అయినా కృష్ణుని మాటలు అబద్దాలే, కృష్ణుని ప్రమాణములు
అబద్దాలే. వారికి చెప్పినట్లు ఏ దినము దొరికెడివాడు కాదు. ఒక్కొక్క మారు కృష్ణుని మీద కోపము వచ్చి ఏడ్చిన
గోపికలు ఎందరో ఉన్నారు. అలా వారిని అదే పనిగా ఏడ్పించెడివాడు. కృష్ణుడు అలా చేసేకొద్దీ ఆయన దర్శనము
కొరకు గోపికలు ఎక్కువ ఆరాటపడెడివారు.
ఈనాడు చాలామంది కృష్ణుడు శృంగారపురుషుడని అనుకోవడము జరుగుచున్నది. ఎందరో ఆయనను ఎన్నో
37

Page 38
రకముల తక్కువగా అనుకోవడము జరుగుచున్నది. కానీ వాస్తవానికి కృష్ణునికి రాధతోగానీ, 99 మంది గోపిక లతో
గానీ శరీర సంబంధము ఏమాత్రము లేదు. ఆనాటి గోపికలలో వివాహమైనవారు కూడ కొందరున్నారు. వారందరు
కృష్ణుని సన్నిధానములో పొందిన సుఖము వర్ణనాతీతమైనది. దానిముందర శరీర సంబంధ సుఖము చాలా చిన్నది.
పెళ్ళైన గోపికలు తమ భర్తలవద్ద పొందిన శరీర సుఖముకంటే ఎన్నో వేలరెట్లు అధిక మానసిక సుఖమును కృష్ణునివద్ద
పొందారు. కృష్ణుని వద్ద పొందిన మానసిక సుఖమును, శరీర సుఖముతో పోల్చి చూచితే భగవంతునివద్ద అనుభవించిన
ఆనందము పర్వతముతో సమానమైతే, తమ భర్తలవద్ద అనుభవించిన శరీరసుఖము చిన్న రాయిలాంటిది. కృష్ణుడు
గోపికను తాకితే అతని చేతి స్పర్శతో శరీరములో హృదయమునందు ఒక విధమైన అలలాంటి పులకింత మొదలై
శరీమంతా వ్యాపించెడిది. ఆ హృదయ స్పందన వారు ఆ జన్మలోగానీ, ఏ జన్మలోగానీ అనుభవించి ఉండలేదు. అంత
పెద్ద ఆనందము ఆయనను వీరు తాకినా, ఆయన వారిని తాకినా పొందెడివారు. గతజన్మలలో వారు దేవున్ని ఆరాధించిన
ఆరాధన ఫలితము దేవుని అంశ అయిన భగవంతునివద్ద నెరవేరినది. అదియు కొలత కొలిచినట్లు ఎవరికి ఎంత
లభించాలో అంతే లభించింది. వారి ఆరాధన ఫలితముగానే కొంతమందికి ఎక్కువమార్లు, కొంతమందికి తక్కువమార్లు
ఆయన దర్శనము దొరికినది. వందమందిలో అందరికంటే ఎక్కువ దర్శనము, ఆనందము పొందినది ఒక్క రాధాదేవి
మాత్రమే. అంతేకాక ఆమె భాగ్యముకంటే భక్తి భావము మించినదై, స్థిరస్థాయిగా కృష్ణుని పేరు ముందు రాధపేరు
నిలిచి పోయినది. రాధాకృష్ణ అను పేరు భక్తులందరి దగ్గర నిలిచిపోయినది. నేడు బృందావనములో రాధాకృష్ణ అను
వాక్యము అందరినోట నిత్యము భజింపబడుచున్నది. బృందావనము గోడలమీద వారిపేరు ఎక్కడ చూచిన వ్రాయబడి
ఉన్నది. కృష్ణుని చిత్రపటము ఎక్కడున్నా అందులో రాధ ఆకారము చోటు చేసుకొన్నది. రాధాదేవి భాగ్యము సౌభాగ్యము
కాదు. ఆమె భాగ్యము భక్తిభాగ్యము అని తలచవలెను. శరీరభర్త దగ్గర పొందునది సౌభాగ్యము. సౌభాగ్యము అనగా!
భర్తనుండి పొందు శరీరసుఖము, భక్తి భాగ్యము అనగా! శరీరములన్నిటికి అధిపతియైన భగవంతునివద్ద పొందు మానసిక
సుఖము అని అర్థము చేసుకోవాలి. సజీవ శరీరములన్నిటికీ అనగా జగతికి అంతటికీ అధిపతియైన భగవంతుడు
భూమిమీదకు వచ్చునది అరుదుగా జరుగును. ఆ సమయము భగవంతుని సన్నిధానమునకు భక్తితో చేరిన వారి
భాగ్యము గొప్పదే కదా!
వారి భాగ్యము సౌభాగ్యము కాదు, వారి భాగ్యము భక్తి భాగ్యము. కావున వారిని ఆ దినములలో గోపికలు
అన్నాము. బృందావనములో కృష్ణుని వద్దకు చేరినవారు అన్ని కులములకు చెందిన వారున్నారు. కానీ ఈనాడు
కొందరు గోపికలనందరిని గొల్లవారిగా అనుకోవడము జరుగు చున్నది. వారు అనుకొన్నట్లు గోపికలందరు గొల్లవారు
కాదు. ఇపుడు మనము అనుకొను గొల్లకులము వాస్తవానికి దేశమంతా 'యాదవ కులము' అను పేరుతో ఉన్నది.
ఇపుడు గొల్ల, యాదవ అను పేర్లు విడిచి కులమునకు సంబంధములేనిది 'గోపిక' అను పదము అని తెలియవలెను. ఏ
కులములో నైనా గోపికలుండవచ్చును. ఇంతకుముందు గోవింద అను పదమును పలుకు విధానమును గురించి,
గోవింద అను పదములోని అర్థమును గురించి చెప్పుకొన్నాము. గోవిందలోని సారాంశము చివరిదైన దైవము అని
తెలుసు కొన్నాము. ఆ దైవమును కోరువారు స్త్రీ అయితే గోపిక అను శబ్దముతోనే పిలువబడుదురు. పురుషుడైతే గోపి
అని పిలువబడుదురు. గోపికకానీ, గోపికానీ ఇరువురు ఒకటే ఉద్దేశముకలవారై ఉందురు. కృష్ణుడు భగవంతునిగా
ఉన్నపుడు స్త్రీలైన గోపికలేకాక, పురుషులైన గోపీలు కూడ ఎందరో ఉన్నట్లు చెప్పవచ్చును. ఆ లెక్క ప్రకారము ఆనాటి
విదురున్ని గోపి అని చెప్పవచ్చును. భగవంతుడు భూమిమీద లేనపుడుగానీ దైవము మీద ఇష్టమును పెంచుకొన్న
వారందరు గోపి, గోపికలేనని చెప్పవచ్చును. కృష్ణుని కాలములో సాక్షాత్తు భగవంతునిరూపములో దైవదర్శనమును
38

Page 39
పొందిన గోపికలు నేటి గోపికలకంటే ఎంతో అదృష్టవంతులు, ఎంతో గొప్పవారు. మనకు భగవంతుని దర్శనము
దొరకాలంటే భూమిమీదకు దేవుని అంశ భగవంతునిగా వచ్చువరకు ఆ కోర్కె నెరవేరదు.
ఆ
దేవున్ని చేరాలను ఉద్దేశముతో దైవమును కోరు గోపి, గోపికలు ఉన్నపుడు ద్వాపరయుగమున కృష్ణునివద్ద ఒక్క
పురుషగోపి కూడ కనిపించ కుండ, అందరూ ఆడ గోపికలే ఎందుకు కనిపించారని కొందరు అడుగ వచ్చును. గోవిందుడైన
కృష్ణుడు పురుషునిగా ఉండి స్త్రీలైన గోపికలనే తనవద్ద కనిపించునట్లు చేయడము కూడ పెద్ద జ్ఞానసందేశమేనని
అర్థమగు చున్నది.
దీనికంటే ముందు కృష్ణునికి ఎనిమిది మంది భార్యలెందుకు ఉన్నారో తెలుసుకొందాము. బృందావనములో
కృష్ణునికి రాధాదేవితో సహా మొత్తము 100 మంది గోపికలున్నారు. ఈ నూరు మంది పూర్వజన్మలలో పురుషులుగా
ఉన్నవారని చెప్పుకొన్నాము. దేవుని సన్నిధానములోనికి చేరాలను వారి కోర్కె దేవుని అంశ అయిన భగవంతునివద్ద
నెరవేరినది. గతజన్మలలో పురుషులైన వందమంది భగవంతునివద్దకు స్త్రీలగానే వచ్చారు. ఈ విషయమిట్లుండగా
గతజన్మలలో స్త్రీలుగా పుట్టిన ఎనిమిది మంది దేవుడే తమ భర్తగా ఉండాలని కోరుకొన్నారు. వారికున్న భక్తితో వారు
కోరుకొన్న కోర్కె నెరవేరాలంటే అది భగవంతునివద్ద మాత్రమే నెరవేరాలి. భగవంతునికి భార్యలైతే దేవునికి భార్యలైనట్లే,
అట్లు తప్ప వేరు విధానము లేదు. కృష్ణునికి ముందు రాధాదేవి పరిచయము కాగా తర్వాత ఒక్కొక్కరు గోపికలు
పరిచయమయ్యారు. మొత్తము నూరుమంది బృందావనములో కలిసిన తర్వాత, కృష్ణుడు బృందావనము వదలి ద్వారక
చేరిన తర్వాత, ఆయనకు భార్యలుగా ఎనిమిది మంది వచ్చారు. మొదట కృష్ణునివద్దకు భక్తులుగా రావాలనువారి కోరిక
నెరవేరినది, తర్వాత భార్యలుగా రావాలను వారి కోర్కె నెరవేరినది. ఎనిమిదిమంది భార్యలలోను ఎక్కువ భక్తి భావమున్న
రుక్మిణీదేవి మిగతా వారికంటే ముందు భార్యగా రావడము జరిగినది. ఈ విధముగా కృష్ణునివద్దకు వచ్చిన వారిసంఖ్య
మొత్తము 108కి చేరినది. సృష్ఠిలో దేవుని పరిపాలన జరుగు కాలము 108 కోట్ల సంవత్సరములు. కనిపించని దేవుని
పాలన 108 కోట్ల సంవత్సరములకు గుర్తుగా, కనిపించే భగవంతుడు 108 మంది స్త్రీలతో కాలము గడిపాడని
తెలియుచున్నది. 108 కోట్ల సంవత్సరములు కనిపించే ప్రకృతి ఉంటుంది. కనిపించని దేవుడు ఆ ప్రకృతికంతటికి
అధిపతి అని సూక్ష్మజ్ఞానము తెలియుటకు, 108 కోట్ల సంవత్సరముల ప్రకృతిని 108 స్త్రీలుగా చేసి, వారందరికి పతి,
అధిపతి పురుషున్ని నేనేనని స్థూలజ్ఞానము తెలియునట్లు, దేవుడు కనిపించే భగవంతుడుగా కృష్ణుని పేరుతో వచ్చాడని
తెలియుచున్నది. దీనినిబట్టి కనిపించని దేవుడు 108 కోట్ల సంవత్సరముల ఆయుస్సుగా గల ప్రకృతిని పాలించగా!
అదే పద్ధతిని బయటికి తెలియునట్లు 108 కోట్ల సంవత్సరముల ప్రకృతిని 108 మంది ప్రకృతి స్వరూపమైన స్త్రీలుగా
కనిపించునట్లు చేసి, కనిపించని పురుషోత్తముడు పురుషత్త్వముగల కనిపించే భగవంతునిగా వచ్చాడని తెలియుచున్నది.
కనిపించని దేవుని ప్రకృతిపాలన కనిపించే భగవంతుని స్త్రీల ఆలన తెలిసినవాడు సంపూర్ణ జ్ఞాని అగును.
ప్రకృతి స్త్రీతత్త్వము గలదని, దైవము పురుషతత్త్వముగల పురుషోత్తముడని, భగవద్గీతలో చెప్పబడి ఉన్నది.
ప్రకృతికంతటికి పెద్ద మరియు భర్త దేవుడేనని, ప్రకృతియంతా చివరకు తనలోనికే కలిసిపోతుందని కూడ చెప్పడమైనది.
ప్రకృతిలో పుట్టిన జీవరాసులన్నీ చివరకు తనను ఆశ్రయించి, తనలోనికి ఐక్యము కావలసిందేనని దేవుడు తెలియజేశాడు.
సృష్ఠిలోని స్త్రీతత్త్వమునకంతటికి తానే గతి మరియు పతి అని తెలియ జేయుటకు గుర్తుగా భగవంతునిగా వచ్చినపుడు
తనచుట్టు స్త్రీతత్త్వమున్నట్లు, తననే స్త్రీతత్త్వము ఆశ్రయించినట్లు, అందరికీ తానే గతి అని తెలియునట్లు, కృష్ణుని చుట్టూ
కొందరు మనుషులైన స్త్రీలు, జంతుజాతిలో స్త్రీ అయిన ఆవు, పక్షి జాతిలో స్త్రీ నెమలి ఉన్నటువంటి చిత్రపటములు ఎన్నో
39

Page 40
కనిపించు చుండును. ఆనాటి బృందావనము యొక్క చిత్రపటములలోనేకాక ద్వాపర యుగములోని ఆనాడుగానీ,
కలియుగములోని ఈనాడుగానీ కృష్ణుడు పురుషుల మనస్సులకంటే, ఎక్కువ స్త్రీల మనస్సులలోనే స్థానమును
సంపాదించుకొన్నాడు. ఇప్పుడు కృష్ణుడు లేకున్నా పురుషులలో లేని భక్తి భావము స్త్రీలలో ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చును.
స్త్రీలలోనే ఎక్కువ భక్తి భావమున్నదని మీరు ఏ ఆధారముతో చెప్పుచున్నారని కొందరడుగవచ్చును. దానికి జవాబు
ఏమనగా! ప్రకృతి, పరమాత్మ జ్ఞానము తెలిసినవారెవరైనా ఈ ప్రశ్నకు సులభముగా జవాబును చెప్పవచ్చును. నేను
పురుషున్ని అను భావము మగవారిలో ఉన్నది. నేను స్త్రీనను భావము ఆడవారిలో ఉన్నది. నేను స్త్రీనను భావము ఒక్కటే
పురుషులలోకెల్ల ఉత్తమ పురుషుడైన పురుషోత్తమునివైపు మనస్సును మళ్ళించుచున్నది. అందువలన పురుషుల కంటే
స్త్రీలలోనే దైవభక్తి ఎక్కువగా ఉండును. అటువంటి దైవభక్తికలవారిలో కృష్ణుని మీద భక్తికలవారు ఎక్కువగా ఉందురు.
కృష్ణుని మీద భక్తికలవారిలో కొందరు పురుషులు కూడా ఉన్నారు. అయినప్పటికీ పురుషులకంటే స్త్రీల సంఖ్య
ఎక్కువని చెప్పుచున్నాము. నేను పురుషుడనే అయినప్పటికీ, నాకంటే ఉత్తమ పురుషుడు కృష్ణుడని తలచిన మగవారిలో
కృష్ణభక్తి గలదు. నేను స్త్రీనను భావముగల ఆడవారిలోను కృష్ణభక్తి కలదు. వాస్తవానికి ఈ కాలములో భూమిమీద
కృష్ణభక్తి ఇతర దేవతల మీద భక్తికంటే చాలా తక్కువగా ఉన్నదని చెప్పవచ్చును. దానికి కారణము కృష్ణుని యొక్క
గొప్పతనము తెలియకపోవడము, కృష్ణుని బృందావన జీవితమును తప్పుగా అర్థము చేసుకోవడము, మూడవది దైవ
జ్ఞానము తెలియకపోవడము. దైవజ్ఞానము ప్రకారము సకల జీవరాసులకు, మానవులకు తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ.
ప్రకృతి పరమాత్మలకు పుట్టినవాడు మనిషి. ఒక మనిషి పుట్టుకతో వానియందు తల్లితండ్రుల లక్షణములు ఇమిడి
ఉండును. అనగా స్త్రీ (తల్లి), పురుష (తండ్రి) రెండు లక్షణములు కల్గియుండుట వలన అటువంటి వానిని నపుంసకుడు
అంటారు. నపుంసకుడు అనగా మగతనము లేక పురుషత్వము లేనివాడని అర్థము. పురుషత్వము లేనివాడు స్త్రీక్రిందికే
లెక్కించబడును. శరీరము మగదిగానీ, ఆడదిగానీ వానిలోని జీవుడు స్త్రీగానే లెక్కించబడుచున్నాడు. ఈ విధానము
భూమిమీద తెలియుటకే పరమాత్మకు గుర్తుగా పురుష శరీరమును, ప్రకృతికి గుర్తుగా స్త్రీ శరీరమును, జీవునికి గుర్తుగా
నపుంసక శరీరమును దేవుడు సృష్టించాడు. దీని భావము తెలియగలిగితే పుట్టిన శరీరము ఏదైనా, ఆడైనా, మగైనా
అందులోని జీవుడు పురుషుడుకాదని నపుంసకుడని తెలియును. లెక్కప్రకారము నేను పురుష శరీరములో పుట్టిన
జీవున్ని, కావున నేను కూడ స్త్రీలింగము గలవాడిననే చెప్పుచున్నాను. నీవు నమ్ము నమ్మకపో సృష్ఠి అంతటికి దేవుడు
ఒక్కడే పురుషుడు, అందువలన దైవాంశ అయిన కృష్ణున్ని ఒక్కన్నే పురుషునిగా చిత్రించి, ఆయన ప్రక్కనున్న వారందరిని
పక్షి, పశువు, మనిషిని స్త్రీలుగానే చూపారు. కృష్ణుని చుట్టూ స్త్రీలు చేరియున్న చిత్రమును చూచి అందులోని దైవజ్ఞానమును
తెలుసు కోలేక భగవంతున్ని అపార్థము చేసుకొని, అల్లరివాడు చిల్లరివాడు అనడము ఎంత అజ్ఞానమో ఇప్పటికైనా
అర్థమైందా!
ద్వాపరయుగములోని కృష్ణున్ని ఆనాటి ఎందరో అజ్ఞానులు హేళన చేసి అవమానించిన సంఘటనలు కూడ
కలవు. ఆ విషయమునే భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్యయోగమందు 11వ శ్లోకమున ఈ విధముగా అన్నాడు.
అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్,
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్.
భావము : నేను సర్వ జీవరాసులకు అధిపతినని, నేను పుట్టేవాడిని మరణించే వాడిని కాదని, నాయొక్క పరంభావమును
తెలియని మూఢులు, మానవ శరీరము ధరించి మనిషివలె కనిపించు నన్ను అవమానించుచున్నారు.
40

Page 41
ద్వాపరయుగములో దేవుని భాగమైన భగవంతున్నే ఒక మనిషిగా లెక్కించి అవమానము చేసినవారున్నారు. ఏ
యుగములోనైనా అజ్ఞానులు అజ్ఞానులే. వారికి పాపపుణ్య తారతమ్యములు తెలియవు. అవి ఎలా వస్తాయని కూడ
తెలియదు. కనిపించనివి లేనేలేవు అంటారు. అలాంటి అజ్ఞానులు ఈ యుగములో కూడ చాలామంది ఉన్నారు.
ఉండడమేకాక వారి సాంద్రత పెరుగుచు, జ్ఞానుల సాంద్రత తగ్గుచూ పోవుచున్నది. ఈ కలియుగములో కొంతమంది
జ్ఞానులుగా పేరుపొందిన వ్యక్తులు కూడ వారికి తెలియకుండ అజ్ఞానములోనే ఉంటున్నారు. కృష్ణుని విషయములో
తక్కువ భావముతోనే ఉన్నారు. మేము పురుషులముకాదని, భగవంతుడే పురుషుడని ఏనాటికైనా భగవంతున్నే
ఆశ్రయించవలసిన అవసరమున్నదని తెలియకున్నారు. బృందావనములోని కృష్ణున్ని తప్పుడు అంచనా వేసుకొన్నారు.
దాదాపు ఐదువందల సంవత్సరముల క్రితమే రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో క్రీ॥శ॥1498 లో పుట్టిన మీరాబాయి
కృష్ణుని మీద భక్తితో ఆయన తిరిగిన బృందావనమునకు పోవాలను ఉద్దేశముతో పోయింది. బృందావనములో కృష్ణసమాజ్
అను ఆశ్రమమును సందర్శించి అక్కడి స్వామీజీని దర్శించుకోవాలని అక్కడున్న శిష్యులను వారి గురువుగారి దర్శనార్థము
అడిగింది. అప్పుడు అక్కడి శిష్యులు "మా గురువుగారు స్త్రీలకు దర్శనమివ్వరు. మా గురువుగారు పురుషుడైన
దానివలన పురుషులకే ఆయన దర్శనము స్త్రీలకు లేదు” అని చెప్పారు. ఆ మాట వింటూనే మీరాబాయి ఫక్కున
నవ్వింది. ఆమె తన నవ్వును ఆపుకోలేక పోయింది. ఆమె అలా నవ్వడము చూచి అక్కడి శిష్యులు ఆశ్చర్యపోయారు.
ఎందుకు నవ్వావు? అని అడిగారు. దానికి ఆమె “ఈ సృష్ఠి అంతటికి కృష్ణుడు ఒక్కడే పురుషుడని అనుకొనివుంటిని.
ఇపుడు మీ గురువుగారు కూడ పురుషుడని మీరంటే ఆశ్చర్యమేసి నవ్వుచున్నాను” అన్నది. మీరాబాయి అన్న ఆ
మాటలను లోపలనున్న గురువుగారు విన్నారు. వెంటనే తానే బయటికి వచ్చి మీరాబాయికి నమస్కరించి "మీ వలన
నాలోనున్న అజ్ఞానము పోయింది. నేను పురుషుడనను నా భావము తొలగిపోయింది. నేను శరీరమునుబట్టి బయటి
దృష్ఠితో పురుషుడనని భ్రమించివుంటిని. ఇపుడు మీవలన నేను పురుషుడను కాదని, నేను కూడ పురుషున్ని ఆశ్రయించ
వలసిందేనని తెలుసుకొన్నాను" అన్నాడు. అపుడు బృందావనములో వారి ఆశ్రమమునందే ఆమెకు ఆశ్రయము కల్పించారు.
మీరాబాయి చిన్న వయస్సులోనే భర్త వదలివేయడముతో బృందావనము చేరినది. 49 సంవత్సరములు జీవించి
ద్వారకలో చనిపోయింది. ఆనాడు బృందా వనములో కృష్ణసమాజమును ఏర్పాటు చేసుకొన్న 70 సంవత్సరముల
స్వామీజీకే 20 సంవత్సరముల వయస్సులోనున్న మీరాబాయి మనమంతా స్త్రీలమేనను జ్ఞానమును కల్గించినది. శ్రీకృష్ణుని
గురించి, ఆయన బృందావన జీవితమును గురించి 13వేల భక్తిపాటలను కూర్చి భజనగా పాడినది. మీరాబాయి
మనస్సులో కృష్ణుడు తప్ప అందరూ స్త్రీలేనను భావముండెడిది. ఈ మాటవినేదానికి విడ్డూరముగా ఉన్ననూ నూటికి
నూరుపాళ్ళు సత్యము.
కృష్ణుడు సాధారణ మనిషికాదు భగవంతుడని తెలుసుకొన్నాము. కృష్ణుడు భగవద్గీతను చెప్పకముందు 90
సంవత్సరముల కాలము సాధారణముగా జీవిస్తూ ఎవరికీ దైవజ్ఞానమును గురించి చెప్పలేదు. అందువలన ఆయన
భగవంతుడని గుర్తించుటకు జ్ఞానులకు కూడ వీలుపడలేదు. కానీ ఆయన జ్ఞానమును చెప్పకున్ననూ ఆయన జీవితము
ఎంతో జ్ఞానమయమై ఉన్నది. ఆయన అష్టమి రోజు పుట్టడమే ఒక పెద్ద జ్ఞానసందేశము. అలాగే 30 సంవత్సరముల
వరకు గడపిన బృందావన జీవితము కూడ మనము చెప్పుకొన్నట్లు గొప్ప జ్ఞానసందేశమే. అట్లే ఆయన 30 సంవత్సరముల
వయస్సు తర్వాత ద్వారకా నగరమునకు పోయి ఎనిమిది మందిని వివాహమాడాడు. గోపికలున్నంత కాలము పెళ్ళి
చేసుకోలేదు. పెళ్ళి చేసుకొన్న తర్వాత బృందావనము వద్దకుగానీ, గోపికలవద్దకుగానీ రాలేదు. బృందావనమున్నంత
41

Page 42
వరకు ద్వారకలేదు, ద్వారకున్నంత వరకు బృందావనములేదు. ఆయన ధరించిన నెమలిపింఛము గానీ, మ్రోగించిన
మురళిగానీ ఎంతో జ్ఞాన విషయములను తెలుపినవే. గీతను చెప్పిన తర్వాత అందులోని జ్ఞానమును బట్టి కృష్ణుడు
ఫలానా జ్ఞానముగలవాడనీ, భగవంతుడనీ గుర్తించుటకు వీలున్నది. కానీ ఆయన జ్ఞానమును చెప్పకనే ఆయన
పనులనుబట్టిగానీ, ప్రవర్తననుబట్టిగానీ అందులోని జ్ఞానమును ఎవరూ తెలుసుకొన్నట్లు లేదు. ఆయన ఎందుకు
ఎవరూ పెట్టని నెమలి పింఛమును తలమీద పెట్టుకొన్నాడని గానీ, అంతమంది గోపికలతో ఎందుకున్నాడనిగానీ,
అంతవరకు ఎవరూ పెట్టుకోని “కృష్ణ” అను పేరును ఎందుకు పెట్టుకొన్నాడనిగానీ ఎవరూ యోచించలేదు. జీవితములో
కృష్ణున్ని జారునిగా, చోరునిగా చూచిన మనుషులు, వ్యభిచారి, దొంగ అయినవాడు గీతను ఎలా బోధించగలిగాడు అని
కొద్దిమాత్రము కూడ యోచించలేదు. ఈ విధముగా చూస్తే కృష్ణుడు గీతను చెప్పిన తర్వాత బ్రతికిన 36 సంవత్సరముల
జీవితముగానీ, గీతను చెప్పకముందు బ్రతికిన 90 సంవత్సరముల జీవితముగానీ, అంతా దైవజ్ఞానముతో కూడుకొన్నదేనని
అర్థమగుచున్నది.
శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణుడు పుట్టినది క్రీస్తు పూర్వము 3228 సం॥ జూలై నెల 19వ తేదిన బహుళ అష్టమి దినమున
వృషభలగ్నములో పుట్టాడు. దీనినిబట్టి ఇప్పటికి 5238 సంవత్సరముల పూర్వము కృష్ణుడు భూమిమీద పుట్టాడని
తెలియుచున్నది. అర్థము చేసుకొంటే ఆయన జీవితమే గొప్ప జ్ఞాన సందేశమని చెప్పుకొన్నాము కదా! దానిప్రకారము
ఆయన జన్మలో కూడ గొప్ప జ్ఞానము ఇమిడి ఉన్నదని చెప్పవచ్చును. కృష్ణుడు ఎదురు కాళ్ళతో పుట్టడమే ఒక
విశేషమైతే, ఆయన పుట్టిన అష్టమి దినము కూడ విశేషతను సంపాదించుకొన్నది. కృష్ణుని జన్మాష్టమి యొక్క విశేషమేమిటని
చూచిన ఈ విధముగా అర్థము కాగలదు. సర్వసాధారణముగ ఏమీ జ్ఞానము తెలియని ప్రజలు కూడ "అష్టమి కష్టము,
నవమి నష్టము” అని అంటూ అష్టమి, నవమి దినములలో కొన్ని పనులను చేయరు. కొన్ని పనులు ప్రారంభించే
ముందు ఈ రెండు తిథులను లేకుండ చూచుకొంటారు. నవమి నష్టము, అష్టమి కష్టము అనడములో మీ భావమేమి
అని కొందరినడిగితే వారు ఇలా చెప్పుచున్నారు. “అష్టమి రోజు పని ప్రారంభించితే ఆ పని కష్టముతో కూడుకొన్నదగును.
అలాగే నవమి రోజు ప్రారంభించితే ఆ పని నష్టములతో కూడుకొన్నదగును" ఇలా వారు అన్న మాటలను బట్టి చూస్తే
ఇది జ్యోతిష్యశాస్త్రము ప్రకారము జరుగునది కాదు. జ్యోతిష్యశాస్త్రములో అటువంటి సూత్రము ఏది లేదు. అయినప్పటికి
పూర్వకాలము ఈ మాట చాలా ప్రచారములో ఉండెడిది. దాదాపు యాభై సంవత్సరముల క్రిందటి వరకు అష్టమి,
నవమి అను మాటలు అక్కడక్కడ వినిపించెడివి. ప్రస్థుత నవీన కాలములో ఆ మాట కరువై పోయినది. ఇప్పటి
చదువులలో పడిన పిల్లలకు తిథులంటే కూడ ఏమిటో తెలియకుండ పోయినది. ఇప్పటికి కూడ ఎక్కడైన పల్లెప్రాంతములలో
ఈ రోజు అష్టమి, అష్టమి రోజు ప్రయాణమా అనుటగానీ, ఇంతకాలముండి ఇప్పుడు అష్టమి దినమునా ప్రారంభించేది
అనిగానీ అనుట గలదు. దీనినిబట్టి అష్టమి, నవమి అను రెండు తిథులలో ఒక తిథి నవమి గాలికి పోయింది. అష్టమి
మాత్రము మిగిలివుంది అని అర్థమగుచున్నది. పల్లె ప్రాంతములలో ఎక్కడో ఒకచోట ఇంతవరకు మిగిలిన అష్టమి
కూడ పది సంవత్సరముల కాలమునకు లేకుండ పోతుందని తెలియుచున్నది. అష్టమి కష్టము, నవమి నష్టము అని
ఉండెడిదని చెప్పు మా మాటలకు కొంత ఆధారముగా ఇప్పటికీ అష్టమి మిగిలి ఉన్నది. కాలగమనములో ఎన్నో
కనుమరుగై పోయాయి. అయినప్పటికీ జ్ఞానమునకు విలువను చేకూర్చే మాటలు కనుమరుగు కాకూడదని మా అభిలాష,
42

Page 43
అందువలన అష్టమి కష్టము, నవమి నష్టము అను మాటను పెద్దలు ఎందుకు అమలులోనికి తెచ్చారు? ఎప్పటినుండి
అమలులోనికి వచ్చింది? అను ప్రశ్నలకు జవాబులు వెదుకుకొందాము.
అష్టమి కష్టము, నవమి నష్టము అనుమాట శ్రీకృష్ణుడు పుట్టక ముందు లేదు. కృష్ణుడు పుట్టిన తర్వాత 90
సంవత్సరములకు భగవద్గీతను చెప్పాడు. భగవద్గీతను చెప్పిన తర్వాత కృష్ణుడు గొప్పవాడను విషయము కొందరికి
అర్థమైనది. అప్పటినుండి కృష్ణుడు పుట్టిన దినమును గోకులము లోను, మధురంలోను పండుగగ చేసుకోవడము
జరుగుచున్నది. భగవద్గీత యుద్ధరంగములో చెప్పబడినది. భారతయుద్ధము క్రీస్తు పూర్వము 3138వ సంవత్సరము
జరిగినది. దీనినిబట్టి ఇప్పటికి భగవద్గీత పుట్టి 5148 సంవత్సరములు అయినది. భగవద్గీత పుట్టిన తర్వాత కృష్ణుడు
సామాణ్య మనిషి కాదని కొందరు జ్ఞానులు గ్రహించగలిగారు. అప్పటి నుండి శ్రీకృష్ణ జయంతిని చేయుటకు పూనుకొన్నారు.
అలా ఏర్పడినదే శ్రీకృష్ణ జన్మాష్టమి. అప్పటినుండి శ్రావణమాస బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుని జన్మదినమును పెద్ద
పండుగగా చేసుకొనెడివారు. ఆ విధముగా దైవజ్ఞానము తెలిసినవారు ప్రారంభించిన శ్రీకృష్ణాష్టమి కొంత కాలమునకు
దేశవ్యాప్తముగా అందరు చేయుట మొదలుపెట్టారు. భగవద్గీతను చెప్పిన తర్వాత కృష్ణుడు 36 సంవత్సరములకు
చనిపోయాడు. కృష్ణుడు సజీవముగా ఉన్నప్పుడే కృష్ణ జయంతిని కృష్ణాష్టమిగా చేయుట జరిగినది. ద్వాపరయుగములోనే
కృష్ణాష్టమి పండుగ తయారైనది.
కృష్ణుడు చనిపోయిన రెండు సంవత్సరములకే కలియుగము ప్రారంభమైనది. కలియుగ ప్రారంభములో దేశమంతా
ముఖ్యమైన పండుగగా శ్రీకృష్ణాష్టమి జరిగెడిది. కలియుగములో కృష్ణాష్టమి దేశ వ్యాప్తముగా ఐదు ఆరువందల
సంవత్సరముల వరకు ఉత్సవముగా జరిగినది. అప్పటినుండి మాయా ప్రభావముచేత క్రమేపి కృష్ణాష్టమి పండుగ
చేయడము ఒక్కొక్కరు మానివేస్తూ వచ్చారు. ఆ విధముగా నాలుగు లేక ఐదువందల సంవత్సరములకు కృష్ణాష్టమిని
చేయడము 90 శాతము మంది మానివేశారు. చివరకు కొంతకాలమునకు కేవలము ఐదుశాతము మంది మాత్రమే
అదియు మధుర, గోకులమైన నందగావ్ పరిసరప్రాంతములలో మాత్రము చేయడము, గొల్లవారు మాత్రము చేయడము
ఆనవాయితీగా ఉన్నది. గొల్లవాడలయందు కృష్ణుడు చిన్నతనములో చేసిన వెన్న దొంగ తనమును గుర్తు చేయుటకు ఉ
ట్టిని పగుల గొట్టడము మొదలగు కార్యములను పండుగ వాతావరణములో ఇప్పటికీ చేయుచున్నారు. కలియుగ
ప్రారంభములో ఎంతో పెద్ద ఎత్తున జరుపబడు కృష్ణాష్టమి పండుగ నేడు గుర్తుకు మాత్రము మిగిలియున్నది. ఇటువంటి
పరిస్థితి రాకూడదని ఆనాటి పెద్దలు ఒక ప్రయోగము చేశారు. ఆ ప్రయోగమే అష్టమి కష్టము, నవమి నష్టము
అనుమాట. ఈ పద ప్రయోగమేమిటని కొందరికి అర్థము కాకపోవచ్చును. ఆనాటి పెద్దలు ఏ ఉద్దేశముతో ఈ
పదములను వాడారో గమనిద్దాము.
పూర్వము కృష్ణుడు మధురానగరములో అష్టమి దినమున పుట్టాడు. మరుసటి దినము నందగావ్లో కనిపించాడు.
పుట్టిన రాత్రే వసుదేవుడు రహస్యముగా కృష్ణున్ని మధురానగరమునుండి ప్రక్కనేనున్న నందగావ్ లోనికి చేర్చాడు.
అందువలన రెండవ దినమున అనగా తెల్లవారిన తర్వాత కృష్ణుడు యశోదకు పుట్టాడని ఆ గ్రామమంతా తెలిసిపోయింది.
కృష్ణుడు పుట్టిన అష్టమిరోజు రాత్రిపూట, తెల్లవారిన తర్వాత తిథి నవమి వచ్చినది. గొల్లవాడలలో తెలిసినది నవమిరోజు.
నందాగావ్లో కృష్ణుడు నవమి రోజు తెలిసాడు. మధురలో కృష్ణుడు అష్టమిరోజు పుట్టాడు. కృష్ణుని యొక్క పుట్టుక
అష్టమి రోజు, కావున ఆత్మజ్ఞానము తెలిసిన వారందరు శ్రావణ బహుళ అష్టమి రోజును 'కృష్ణాష్టమి' అను పేరుతో
చేసెడివారు. నందగావ్ లోని గొల్లవారందరు కృష్ణుడు తమ గ్రామములో కనిపించిన నవమి రోజున 'గోకులాష్టమి’
43

Page 44
అను పేరుతో నవమిరోజు ఉత్సవము చేసెడివారు. వారు కులాభిమానము తో తమ పేరు ఉండునట్లు 'గోకుల అష్టమి'
అని చేయడము జరుగుచున్నది. ఇప్పటికీ కూడా శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి రెండు పేర్లతో అష్టమి, నవమి రెండు
రోజులు పండుగలు చేయడం జరుగుచున్నది. అష్టమి రోజు జ్ఞానులు చేయునది కృష్ణాష్టమి, నవమి రోజు గోకులవంశము
వారైన నేడు యాదవులనబడు గొల్ల కులము వారు ప్రత్యేకముగా చేయునది గోకులాష్టమి అని తెలియవలెను. కృష్ణుని
పుట్టుక అష్టమి రోజే అయినా కృష్ణాష్టమి, గోకులాష్టమి అను రెండు పేర్లతో అష్టమి రోజు, నవమి రోజు పండుగ
చేయడము జరుగుచున్నది.
కృష్ణ జయంతిని నవమిరోజున చేసినా దానిపేరు గోకులాష్టమి అని అష్టమినే చూపిస్తున్నది. కావున శ్రీకృష్ణుని
జన్మ ఉత్సవము అష్టమి, నవమి రెండు రోజులు జరగడము ఆనందదాయకమైన పనిగా తలచ వచ్చును. కలియుగము
మొదటిలో దేశవ్యాప్తముగా కృష్ణాష్టమి, గోకులాష్టమి రెండు రోజులు జరిగెడివి. ఆ రెండు దినములలో అందరూ
తమతమ పనులను మానుకొని ఉత్సవము చేసెడివారు. ఆ దినములలో ఎవరినీ పనిలోనికి పంపెడివారు కాదు.
పనులుంటే కృష్ణుని ఉత్సవములో పాల్గొనరని అన్ని పనులకు స్వస్తి చెప్పెడివారు. ఆ దినములలో ఎవరికైన, ఏ పనికైనా
మంచి ముహూర్తముండినా దానిని చేయక మానుకొనునట్లు, ఎవరు ఏ పని జోలికి పోకుండ పెద్దలు ఒక భయము
పెట్టారు. అష్టమి రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో కష్టము ఏర్పడుతుందని, ఆ పని సక్రమముగా సాగదని
చెప్పారు. అలాగే నవమి రోజున పనిని ప్రారంభిస్తే దానివలన ఎక్కువ నష్టము వస్తుందని చెప్పారు. కృష్ణాష్టమి,
గోకులాష్టమి సక్రమముగా జరుగుటకు, అందరు పాల్గొనుటకు అవకాశము ఉండునట్లు ఆ విధముగా చెప్పి భయమును
ఏర్పరచి, ఆ రెండు దినములు పనిని మాన్పించారు. ఆ భయము అందరికీ తెలియునట్లు అష్టమి కష్టము, నవమి
నష్టము అను మాటను ప్రయోగముగా వాడి మనుషులలో అందరికీ తెలియునట్లు చేశారు. ఆనాడు వారు చేసినది
మంచి ఉద్దేశమే అయినప్పటికి అష్టమి కష్టము, నవమి నష్టము అనుమాట నేటికి ఎవరికీ తెలియకుండా పోయినది. ఆ
మాట తెలియకుండా పోవడమే కాక కృష్ణాష్టమిని చేయువారు 90 పాళ్ళు తగ్గి పోయారు.
మనము కృష్ణ జయంతిని పండుగగా చేసిన చేయకున్నా ఆయన అష్టమి తిథినాడే ఎందుకు పుట్టాడని యోచించితే
ఎంతో జ్ఞాన అర్థమున్నదని చెప్పుకొన్నాము కదా! దానిని గురించి వివరించుకొంటే ఈ విధముగా కలదు. అమావాస్య
నుండి పౌర్ణమి వరకు 15 రోజులు, అట్లే పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 రోజులుండుట అందరికీ తెలిసిన
విషయమే. శ్రీకృష్ణుడు పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల 15 దినములందు మధ్యలో గల అష్టమి దినమునందు
జన్మించాడు. 15 దినములలో పాఢ్యమి నుండి సప్తమి వరకు 7 దినములు, మధ్యలో అష్టమి, తర్వాత నవమి నుండి
అమావాస్య వరకు 7 దినములు గలవు. 7+1+7=15 పదిహేను రెండు సమాన భాగములు చేయవలయునంటే 7
మరియు 7 దినములుగ విభజించగ ఒకటి శేషము మిగులును. ఆ ఒక్క దినము అష్టమిగ గుర్తించి అష్టమికి ముందు
7 దినములుగ, వెనుక 7 దినములుగ గుర్తించు కోవలయును. శ్రీకృష్ణుడు మధ్య దినమైన అష్టమియందే పుట్టుటకు
విశేషమైన అర్థము గలదు. అదేమనగా!
భగవంతుడైన శ్రీకృష్ణుడు జ్ఞానమునకు, అజ్ఞానమునకు సంధిలాంటి వాడు. అజ్ఞానము నుండి జ్ఞానమునకు,
జ్ఞానము నుండి అజ్ఞానమునకు పోవుటకు ఆయన కేంద్రములాంటివాడు. ఎందరో జ్ఞానులు సహితము ఆయన తన
జీవితములో నడుచుకొన్న పద్ధతులనూ ఆచరణలనూ చూచి, ఆయన చెప్పిన గీత అంతా బాగుగానే ఉంది, కానీ
ఆయన ఆచరణ మాకు నచ్చలేదు. ప్రవర్తన ముఖ్యము కదా! లోపల గుణములనుబట్టియే కదా ఎవరైనా ఆచరించేది,
44

Page 45
ఆయన ఎన్ని చెప్పినప్పటికీ శ్రీకృష్ణుడు చేసిన పనులను బట్టి చూస్తే, బోధలు చెప్పినంత గొప్పవాడుకాదని తెలుస్తుందని
అంటున్నారు. అటువంటి వారు జ్ఞానమునుండి కృష్ణుని ద్వారా అజ్ఞానములోనికి పోయినట్లే, వారికున్న జ్ఞానము
నిష్ప్రయోజనమన్నమాట. శ్రీకృష్ణుడేమి చెప్పాడో వారు అర్థము చేసుకోలేదన్నమాట. అటువంటపుడు శ్రీకృష్ణుడు
చెప్పిన అసలైన జ్ఞానము వేరు విధముగ అర్థమై ప్రవర్తనకు భిన్నముగ తోచినపుడు వారు శ్రీకృష్ణునికి భిన్నముగ పోగలరు.
శ్రీకృష్ణుడు జ్ఞానకేంద్రమైనపుడు, ఆయనకు భిన్నముగ పోవువారు అజ్ఞానమువైపు పోవుచున్నారనే తెలియాలి. అట్లే
శ్రీకృష్ణుని చూచి ఆయన చెప్పినది, చేయునది, చేయించునది అంతా ఒకటేనని తెలిసినవారు జ్ఞానమువైపు సాగిపోగలరు.
ఆయనను చూచి ఉన్న చోటునుండి కొందరు జ్ఞానమువైపుకు, కొందరు అజ్ఞానమువైపుకు పోవుచున్నారు. కావున
శ్రీకృష్ణుడు అటు జ్ఞానమునకు, ఇటు అజ్ఞానమునకు మధ్యగలవాడని తెలియునట్లు అష్టమిరోజునే ఎంచుకొని పుట్టాడు.
శ్రీకృష్ణుడు బహుళపక్ష అష్టమి రోజే ఎందుకు పుట్టాలి? శుక్లపక్ష అష్టమియందు ఎందుకు పుట్టలేదు? దానికి కారణమేమై
ఉండవచ్చునను సంశయము కొందరికి రావచ్చును. దానికి మా సమాధానమేమనగా!
జ్ఞానబోధలలో చంద్రున్ని జ్ఞానచిహ్నముగ చెప్పిన సందర్భములు గలవు. గీతయందు అక్షర పరబ్రహ్మయోగమున
25వ శ్లోకములో యోగులకు మరుజన్మ ఉంటే జ్ఞానవికాసముకల్గి పుట్టుదురని చెప్పుచూ "చాంద్రమసం జ్యోతిః" చంద్రతేజస్సు
కల్గిపుట్టుదురని జ్ఞానవికాసమును చంద్రుని వెన్నెలతో పోల్చి చెప్పారు. అందువలన వెలుగైన పౌర్ణమిని జ్ఞానముగ,
చీకటిమయమైన అమావాస్యను అజ్ఞానముగ సులభముగ పోల్చుకోవచ్చును. పరమాత్మ జ్ఞానయుతుడైవుండి అజ్ఞానయుతమైన
ప్రపంచములోనికి వచ్చి భగవంతునిగా పుట్టాడు. కావున జ్ఞాన చిహ్నమైన పౌర్ణమి నుండి చీకటిమయమై పోవుచూ
చివరకు అమావాస్యగా మారు బహుళ పక్షమిలో పుట్టాడు. అట్లు పుట్టిన ఆయన అటు జ్ఞానియో, ఇటు అజ్ఞానియో
ఎవరికి అర్థముకానట్లు, జ్ఞానము అజ్ఞానము రెండు నాలోనే ఉన్నాయన్నట్లు మరియు జ్ఞానమునకు అజ్ఞానమునకు నేనే
మార్గమును, నేనే ద్వారమును అన్నట్లు మధ్యలో అష్టమి రోజున పుట్టాడు. పౌర్ణమి గడచిపోయిన తర్వాత వచ్చు అష్టమి
రోజున పుట్టాడు. కావున పరమాత్మ జ్ఞానప్రకాశవంతమైన పరము నుండి అజ్ఞాన అంధకారమైన ప్రపంచము లోనికి
వచ్చాడని తెలియాలి. ఈ విధముగా ఆయన పుట్టిన దినమునందు కూడ ఎంతో విశేషమైన అర్థమిమిడి ఉన్నది. కావున
ఆయన పుట్టిన దినమును మహాపర్వదినముగ భావించి, ఆ దినమును శ్రీకృష్ణాష్టమి అని పేరు పెట్టి పూజించుకొంటున్నాము.
ఎవరైతే సకల సృష్ఠికి ఆధారమై ఉన్నాడో, సకల దేవతలు ఎవరినైతే దేవుడని మ్రొక్కారో, అణువణువున వ్యాపించి
ఎవరికీ కనిపించని శక్తి ఏదైతే ఉన్నదో, క్షణ క్షణము జరుగుచున్న కాలమై, అందరికి ఆయువై ఆరోగ్యమై, మరణమై
ఎవరైతే ఉన్నాడో, ఆ దేవుడే కృష్ణునిగా పుట్టి, మనిషి వలె కదలాడిన ఒక వ్యక్తి అని చెప్పితే ఎవరైనా నమ్మగలరా?
నమ్మలేరు. అంతగొప్ప దేవుడే మనిషిగా పుట్టడమేమిటి? అను ప్రశ్నరాక తప్పదు. ఇక్కడ ఒక చిన్న ఉపమానమును
చెప్పుకొందాము. సముద్రము సకల భూఖండములను తాకి ఉంది. ఎంతో విశాలమైనది, దానియందు ఇన్ని అని
చెప్పలేని అసంఖ్యాకములైన జీవరాసులున్నవి. సముద్రములేనిది భూమికి మనుగడయే లేదు అని చెప్పబడు సముద్రము
నీ ఇంటిలో నీ ఒంటిలో ఉన్నది అంటే ఎవరైన నమ్మగలరా? దేవుడే కృష్ణుడు అంటే ఎట్లు నమ్మలేరో అట్లే సముద్రము
ఇంటిలో ఉన్నదంటే నమ్మలేరు. అంత పెద్ద దేవుడు ఇంత చిన్న మనిషా! అని ఎట్లు నమ్మమో, అట్లే అంత పెద్ద
సముద్రము ఇంత చిన్న ఇంటిలో ఉందా! అని నమ్మలేము. అయినా వివరించుకొని చూస్తే దేవుడు మనిషిలో
ఉన్నది నిజమే, అలాగే సముద్రము ఇంటిలో ఉన్నది నిజమే. అసాధ్యమనుకొన్న దానిని సుసాధ్యము అనునట్లు చేయు
వివరమేమిటి అని చూస్తే ఈ విధముగ వివరముగలదు.
45

Page 46
నీరు సముద్రములో ఉన్నది. సముద్రమంతా నిండియున్న నీటికి కొన్ని ధర్మములు గలవు. అలాగే విశ్వములో
దేవుడున్నాడు. విశ్వమంతా నిండియున్న దేవునికి కొన్ని ధర్మములు గలవు. ఎన్నో లెక్కలేని నీటి బిందువుల కలయిక
సముద్రమంతా నిండివున్న నీరు. అలాగే ఎన్నో దైవ అంశముల కలయిక దేవుడు. సముద్రమంతా నిండియున్న నీటికి
ఏ ధర్మముకలదో, అదే ధర్మము నీటి బిందువుకు కూడ కలదు. అట్లే విశ్వమంతా నిండియున్న దైవమునకు ఏ
ధర్మముకలదో, అదే ధర్మము దైవ అంశకు కూడ కలదు. సముద్రములోని అఖండమైన నీటికి ఏ ధర్మమున్నదో, అదే
ధర్మము ఖండమైన నీటి బిందువుకు కూడ కలదని ఎట్లు చెప్పుచున్నామో, అలాగే విశ్వములోని అఖండమైన దైవమునకు
ఏ ధర్మముందో, అదే ధర్మము ఖండమైన దేవుని అంశకు కూడ ఉన్నది. గమనించవలసిన విషయమేమంటే అఖండముగా
ఉన్న నీటిని సముద్రము అంటున్నాము. సముద్రమునుండి ఖండమై బయలుపడిన ఒక నీటిచుక్కను నీటిబిందువు
అంటున్నాము. అలాగే అఖండముగా అంతటా వ్యాపించి యున్న దైవశక్తిని దేవుడు అంటున్నాము. దైవమునుండి
విడివడి ఖండముగానున్న ఒక దైవ అంశను భగవంతుడు అంటున్నాము. సముద్రమునకు నీటి బిందువుకు ఒకే
ధర్మమున్నట్లు, దైవమునకు భగవంతునికి ఒకే ధర్మము గలదు. దేవుని ధర్మములు దేవునికే తెలుసును, దేవుడే మానవులకు
తెలియబరచాలి అను ధర్మము భగవంతుని పట్ల కూడ కలదు. అందువలన దేవుని ధర్మములు భగవంతునికి కూడ
తెలుసు. అలాగే దేవుడే మానవునికి తెలియబరచాలి అన్నట్లు భగవంతుడే మనుషులకు తెలియబరచును. ఈ
ఉపమానమును బట్టి దేవుడు, భగవంతుడు అను ఒక మనిషిగా వచ్చుననుటను ఎవరైనా విశ్వసించగలరు. దేవుడు
భగవంతుడు ఇద్దరూ ఒకటే అయినా ఉన్న స్థితినిబట్టి అపరిమితముగా ఉన్నపుడు దేవుడు, పరిమితముగా ఉన్నపుడు
భగవంతుడని అనుచున్నాము.
పరిమితి లేని దేవుడు పరిమితమైన శరీరములోనికి, ఆకారములేని దేవుడు ఆకారమున్న శరీరములోనికి,
పేరులేని దేవుడు పేరున్న శరీరము లోనికి, ఏ కార్యము చేయని దేవుడు పని చేయు శరీరములోనికి వచ్చినపుడు
శరీరమును భగవంతుడు అంటున్నాము. దేవుని అంశ శరీరధారియై వచ్చినదే శ్రీకృష్ణుడు. ఆయనే భగవాన్ శ్రీకృష్ణ.
అంత పెద్ద దేవుడు మానవాకారముతో వచ్చిన పుట్టుక సమయము చాలా పవిత్రమైనదని, గొప్పదని భగవంతుని
జన్మదినమును పండుగగాజేసుకొనుచున్నాము. అదియే కొందరికి కృష్ణాష్టమి, కొందరికి గోకులాష్టమి. కలియుగ
ఆరంభములో అందరు చేయు కృష్ణజయంతి నేడు కనుమరుగై పోవుచున్నది. దేవునికి వ్యతిరేకమైనది మాయ. మాయ
మానవునియందుండి దైవమువైపు పోకుండ చేయుచున్నది. అట్లు చేయుటకు కావలసిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లన్నిటిని
చేసి పెట్టుచున్నది. మాయ చేయు ఆ కార్యక్రమములలో కృష్ణాష్టమిని లేకుండ చేయడము కూడ ఒక పని. అందులన
పూర్వము పెద్దలు పెట్టిన నానుడి మాట అయిన అష్టమి కష్టము, నవమి నష్టము ఈ కాలములో ఎవరికీ తెలియకుండా
చేసినది. ఆ మాట తెలియకుండ పోవుట వలన కృష్ణజయంతి యొక్క జ్ఞాపకము చాలామందికి లేకుండా పోయినది.
మాయా ప్రభావము చేత మనుషులు భగవంతున్ని ఏమాత్రము గుర్తించలేక పోయారు. ఆయనను సాధారణ మనుషులకంటే
తక్కువగా పోల్చుకొన్నారు. మాయ మనిషియందు గుణముల రూపములో ఉంటూ, దైవమార్గములోనికి మనిషిని
పోకుండ చేయుచున్నది. అట్లు చేయాలంటే మనిషిని దేవునివైపు పోతున్నట్లు నమ్మించి ప్రక్కదారి పట్టించాలి అన్నది
మాయ యొక్క పథకము. ఆ పథకములో భాగముగ కృష్ణాష్టమికి బదులుగా దాని స్థానములో మరొక పండుగను
తెచ్చిపెట్టి, అందరి దృష్ఠి దానివైపు సారించునట్లు చేసినది. దేవుడు చెప్పినట్లు మాయకు బలమెక్కువ అందువలన
కృష్ణాష్టమిని లేకుండ చేసి, మాయ తన పండుగను తెచ్చిపెట్టి చిన్నలను పెద్దలను దానియందు పాల్గొనునట్లు చేసినది.
46

Page 47
పూర్వము కృష్ణాష్టమిని పదకొండు రోజుల పండుగగా చేసెడివారు. కృష్ణాష్టమి ఇంటిలోపల చేయు పండుగకాదు.
పూర్వమందరు వీధులలోనే చేసెడివారు. వీధులలోనే ఉట్ల ఆట ఆడెడివారు. వీధులలోనే మగవారు గోపికలవలె
ఆడవేషము వేసుకొని వెన్న దొంగలుగా వస్తే వారిని ఆడవారు చేటలతో, కట్టెలతో కొట్టెడివారు. ఆడవేషములో ఉన్న
మగవారిని ఆడవారు కొట్టడము కూడ ఉత్సవములో ఒక భాగముగా ఉండెడిది. వీధులలోనే పందిరికట్టి, ఆ పందిరిలో
కృష్ణుని ప్రతిమను పెట్టి, పదకొండు రోజులు పూజించెడివారు. వీధిలోని పందిరి ముందే కృష్ణలీలలను ప్రదర్శించుచు
ఉట్ల ఆట, వెన్నదొంగ ఆట మొదలగునవి ఆడుచు సంతోషముతో పదకొండు రోజులు ఉత్సవము చేసి, చివరి
పదకొండవరోజు అనగా చవితి రోజు పందిరిలోని కృష్ణప్రతిమను ఊరేగించి, ఆ ప్రతిమను ఇంటిలో పెట్టుకొని
ఉత్సవమును ముగించెడివారు. దేశములో మొట్టమొదటి వీధి ఉత్సవము కృష్ణాష్టమియేనని తెలియవలెను. కృష్ణాష్టమికంటే
ముందు ఏ వీధి ఉత్సవములు లేవు. తర్వాత మాయ ప్రభావముతో ఒక్కొక్కటిగా తయారైనవి. అందులో వినాయకచవితి
ఒకటి, తర్వాత దుర్గాష్టమి రెండవది. విశేషమే మంటే కృష్ణుని పండుగ అష్టమి తిథి పేరుతో ఉండగా
ప్రత్యమ్నాయముగా తిథుల పేర్లతోనే వినాయక చవితి, దుర్గాష్టమి వీధి పండుగలు తయారైనవని గ్రహించవలెను.
దానికి
కృష్ణాష్టమికి బదులుగా మొదట తయారైన పండుగ వినాయక చవితికాగా, తర్వాత ఈ మధ్యకాలములో దుర్గాదేవి
పండుగ కూడ వీధి పండుగగా తయారైనది. దుర్గాదేవి పండుగ పూర్వకాలమునుండి భక్తితో గృహములయందే తొమ్మిది
దినములు చేసుకొనెడివారు. దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారముతో పూజించడము సాంప్రదాయముతో
కూడు కొన్నదని చెప్పవచ్చును. ఇప్పటికీ కూడ దుర్గాదేవి పండుగ అయిన దశరా సాంప్రదాయముతో కూడుకొన్న
పండుగయని చెప్పవచ్చును. కానీ వినాయక చవితి మాత్రము ఏ సాంప్రదాయములేని పండుగయని చెప్పవచ్చును.
మన సాంప్రదాయము కాని పండుగ మన మధ్యలోనికి ఎలా వచ్చింది? అని యోచిస్తే దానికి కొంత వివరముగలదు.
అష్టమిగానీ, చవితిగానీ తిథులని చెప్పాము కదా! పూర్వము ఇందూధర్మములను తెలిసిన పెద్దలు జ్యోతిష్య శాస్త్రములోని
తిథులను తీసుకొని, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విషయ ప్రాబల్యమును సమకూర్చి, ఆ తిథి రోజు ఆ విషయమునకు ఎక్కువ
ప్రాధాన్యత నిచ్చునట్లు తెలిపారు. దానిప్రకారము చవితి రోజు సమాజము నకు సంబంధించిన విషయమునకు
ప్రాధాన్యతనిచ్చారు. అట్లే సప్తమి యోగమునకు, అష్టమి మోక్షమునకు, దశమి ఏకాదశి రెండు తిధులు భక్తి, జ్ఞానమునకు,
అమావాస్య పౌర్ణమి రెండు పరమాత్మ విషయమునకు ప్రాధాన్యత నిచ్చునవి నిర్ణయించారు. అందువలన చవితి రోజు
పండుగ లైన నాగులచవితి, వినాయకచవితి రెండు సమాజము యొక్క శ్రేయస్సు విషయమును తెల్పునవిగా ఏర్పాటు
చేశారు. ముందుగా నాగులచవితిని గురించి చెప్పుకొంటే, అదే విధానము ప్రకారము వినాయక చవితి కూడ అర్థము
కాగలదు. అప్పుడు జ్ఞానమునకు, మాయకు తేడా తెలియాలంటే వినాయక చవితిని గురించి వివరించుకోవాలి.
వినాయక చవితిని గురించి సత్యమును చెప్పినప్పటికి మాయ ప్రభావము చేత మనుషులు అపార్థము చేసుకొను
అవకాశమున్నది. కావున అది సమాజశ్రేయస్సుకు ఎలా సంబంధించినదో అర్థము కావాలంటే, ముందు నాగులచవితిని
చెప్పు కోవలసివుంటుంది. నాగుల చవితిని పెద్దలు ఎందుకు మనుషుల మధ్యలో ఏర్పాటు చేశారో వివరించుకొని
చూద్దాము. ఈ వివరములను చెప్పేముందు మరొక మాటను ముందే చెప్పవలసివుంది. అదేమనగా! నాగులచవితి
ప్రజల శ్రేయస్సుకు ఏర్పరచినా, పెద్దల పని వృథా అయిపోయి శ్రేయస్సు ప్రజలకు అందడము లేదు. అలాగే
వినాయకచవితిని కూడ పెద్దలు యోచించి చేసి చూపించినా, మనుషులు ఆ ఫలితము యొక్క శ్రేయస్సును అందుకోక
పోవడమేకాక పెడత్రోవపట్టి పోయారని చెప్పుచున్నాము. ఈ రెండు చవితులను చెప్పితేకానీ కృష్ణాష్టమి యొక్క విలువ
తెలియదు. అందువలన ఇక్కడ నాగులచవితిని, వినాయకచవితిని గురించి చెప్పవలసి వచ్చినది.
47

Page 48
ముందు నాగులచవితిని గురించి చెప్పుచున్నాము చూడండి. ఇది సమాజశ్రేయస్సుకని చెప్పాము కదా! అందువలన
దీనిని చదివే నీకు కూడ పనికి వచ్చునదే. కావున శ్రద్ధగా గమనించండి. నాగులు అనగా పాములు అని అర్థము, చవితి
అనగా నాలుగు అని అర్థము. నాగులచవితి అనగా పాముల నుండి పూర్తి రక్షణ పొందడమని అర్థము. అపాయము
నుండి బయటపడునట్లు జరగడమే శ్రేయస్సు అని చెప్పవచ్చును. పాముల కాటునుండి రక్షణ పొందితే ఎవరికైనా
అపాయమునుండి బయట పడినట్లే అవును కదా! అట్లు బయట పడు విధానమున్నది. కావున నాగులచవితి
సమాజశ్రేయస్సును తెలుపునదని చెప్పుచున్నాము. భూమిమీద 80 జాతుల పాములున్నాయి. అన్ని జాతులకు
విషముండదు. 15 జాతులకు మాత్రము విషముండును. వాటిలో నాగుపాము జాతి ఒకటి కలదు.
విషమున్న మిగత జాతుల పాములకంటే నాగుపాము జాతికే మనిషిని తొందరగ చంపు విష ప్రభావమున్నది.
అందువలన పూర్వపు వైద్యపండితులు నాగుపాము విషమునకు విరుగుడు వైద్యమును చెప్పితే అన్ని జాతుల పాము
వైద్యము చెప్పినట్లేనని తలచారు. పూర్వము ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన మూలికా వైద్యముండెడిది. పాము విషమునకు
విరుగుడైన మూలికలను ప్రతి ఊరులోను పెంచవలెనని వారు నిర్ణయించుకొన్నారు. ఆ పథకములోని భాగముగానే
ప్రతి ఊరులోను మొదట వేపచెట్టును, దానిప్రక్కననే రావిచెట్టును నాటారు. వాటి ముందర నాగుపాముల ప్రతిమలను
ఉంచారు. పూర్వము ప్రతి ఊరులోను వేప, రావిచెట్లు ఒకచోట ఉండడమూ, అక్కడ చాలామంది విశ్రాంతి తీసుకొనునట్లు
విశాలమైన అరుగునుంచడమూ, ఆ అరుగు మీద చెట్ల మొదటిలోనే ముందర నాగ ప్రతిమలుంచడము జరిగెడిది. ఆ
విధముగా నిర్మింపబడిన దానిని నాగులకట్ట అనెడివారు. ఇప్పటికీ కొన్ని ఊర్లలో రావి, వేపచెట్లున్న నాగులకట్టలు
ఈ మధ్యకాలములో తయారైన కొన్ని ఊర్లలో నాగులకట్టలు లేవు. నాగులకట్టలు కొన్ని ఊర్లలో
కనిపించును.
ఎందుకు లేవో తర్వాత తెలుసుకొందాము.
C.
పాము కరిచి విషము ఎక్కితే అనగా తలకు ఎక్కితే మొదట నాలుకకు రుచి తెలియకుండ పోవును. నాలుక
తెలుసుకొను ఆరు రుచులలో మొదట చేదు తెలియకుండ పోవును. అటువంటి పరిస్థితిని తెలుసుకొనుటకు చేదు
రుచిగల వేపచెట్టును నాగులకట్టలో ఉంచారు. విషము తలకెక్కిన తర్వాత దానిని సులభముగా తీసివేయుటకు సాధ్యమగును.
అందువలన పాముకరచిన వ్యక్తికి, విషము తలకు ఎక్కిందా లేదా అని చూచుటకు వేప ఆకును నమిలించెదరు.
విషము ఎక్కినపుడు చేదు తెలియకుండ పోవుట వలన అపుడు తలనుండి విషమును తీసివేయుటకు ప్రయత్నించవచ్చును.
వేప ఆకుల ద్వార విషమును తెలుసుకొన్నవారు, దానిని తీసివేయుటకు రావి ఆకులను వాడుకొందురు. రావి ఆకుల
కాడలను విషమున్నవానికి చెవులలో పెట్టితే, రావి ఆకులు తమ కాడల ద్వారా తలలోని విషమును ఆకులలోనికి
లాగుకొనును. ఆ విధముగ రెండు లేక మూడు జతల ఆకులతో పూర్తి విషమును తీసివేయవచ్చును. తర్వాత వేప
ఆకును నమిలిస్తే అది చేదుగా ఉండుట వలన విషము దిగిపోయినదని తెలుసుకోవచ్చును. విషమును లాగుకొను
రావిఆకు పాము పడగవలె ఉండడము, క్రింద ఆకుకొన పాముతోకలా ఉండడమును గమనించవచ్చును. దీనినిబట్టి
ప్రతి ఆకు ఒక పాముతో సమానమనీ, పాము విషము పామే లాగుకొన్నట్లు, రావి ఆకు విషమును లాగుకొనుచున్నదని
తెలియుచున్నది. ఈ వైద్య విధానము అందరికీ తెలియునట్లు, పూర్వము ప్రతి ఊరిలోను రావి, వేపచెట్లను పెంచి
కట్టకట్టియుంచారు. అదే చెట్లక్రింద నాగుపాము ప్రతిమలను కూడ పెట్టుటకు కారణమేమనగా! ఈ పాములు కరిస్తే
ఈ చెట్ల ఆకులే వైద్యమన్నట్లు చెట్లక్రింద ముందరే పాము బొమ్మలనుంచారు. “ప్రతి ఆకు ఔషధమని” నానుడి గలదు.
రావి, వేపఆకు దేనికి ఔషధమని ప్రశ్న వస్తే వెంటనే పాములకు అని తెలియునట్లు ఆ చెట్ల క్రింద పాముల
48

Page 49
ప్రతిమలనుంచారు. ప్రతి ఊరులోను ఆ విధముగా ఉంటే, అందరికీ ఆ వైద్యము తెలిసి, అందరూ పాముకాటునుండి
బయటపడగలరని ఆనాటి పెద్దలు తలచారు.
ప్రస్తుతకాలములో ఆనాటి పెద్దల ఉద్దేశము తెలియకుండ పోయినది. ఇప్పటికీ కొన్ని ఊర్లలో నాగులకట్టలు,
రావి, వేపచెట్ల సమేతముగా ఉండినప్పటికీ అవి వైద్య విధానముగా పెట్టినవనీ రావి, వేప చెట్లు పాము విషమునకు
మంచి ఔషధములని ఎవరికీ తెలియదు. విషమునకు ప్రతీకగా పాము బొమ్మలనూ, ఔషధమునకు ప్రతీకగా రావి,
వేపచెట్లనుంచితే ఆ భావము కాలగర్భములో కలిసిపోయినది. పాము ప్రతిమలు నాగదేవతలుగా, వేప, రావిచెట్లను
లక్ష్మీనారాయణులుగా భావించి ప్రజలు పూజలు చేయుచున్నారు. ఈ విధముగా వైద్యము భక్తిగా మారిపోయినది.
పాము ప్రతిమలకు రావి, వేపచెట్లు నీడ నిమిత్తమే ఉన్నాయనుకొన్న ప్రజలు, ప్రతిమలను చెట్లక్రింద లేకుండ గుడులలో
ప్రతిష్ఠించను మొదలుపెట్టారు. అందువలన నాగప్రతిమలు ఇప్పటి కాలములో గుడులలో కనిపిస్తున్నవి. గ్రామాల్లో
రావి, వేపచెట్లు జతగా ఉండడము కనిపించకుండ పోవుచున్నవి. ఇవి ప్రాణము తీసే పాములని పాము ప్రతిమలను,
ఇవి ప్రాణము పోసే చెట్లని రావి, వేపచెట్లను అందరికీ తెలియునట్లు పూర్వము ఎంతో పథకముగా వైద్యపండితులుంచితే,
ప్రాణము తీసే పాములు దేవతల స్థానములో ఉన్నాయి. ప్రాణము పోసే ఔషధచెట్లు అదృశ్యస్థానములో ఉన్నాయి.
పాములను గురించి, ఔషధవృక్షములను గురించి చర్చావేదికలు నాగులకట్టల మీదనే పెట్టి ప్రజలకు తెలియ జేయుటకు
నాగులచవితి అను పేరుతో శ్రావణమాస శుక్లపక్ష చవితిని పూర్వము నిర్ణయించారు. మొదట వైద్యపండితులు పెట్టిన
ఉద్దేశము కాలక్రమమున మారిపోయి, చివరకు నాగులచవితి ఒక భక్తి పండుగగ మారిపోయినది. మన పెద్దలు మన
శ్రేయస్సును కోరి ఒక అమోఘమైన ఔషధాన్నిస్తే దానిని అందుకోలేక కాలగర్భములో వారి ఉద్దేశమును సమాధి చేశాము.
పెద్దలు అందించిన ఫలితాన్ని మేము చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడ అర్థము చేసుకోలేక అడ్డముగా మాట్లాడు వారున్నారు.
పూర్వము సమాజశ్రేయస్సుకు మనవారు అందించిన విధానమునకు మనము ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అట్లుకాక
వారు అందించిన విధానమును గాలికి వదలివేశాము. ఎప్పుడో తెలియకుండ పోయిన విధానము ఈ రోజు తెలిసినా,
ఇది మన శ్రేయస్సుకు సంబంధించినదని కూడ తలచడములేదు. ఈనాడు తెలియకుండ పోయిన దానిని తెలిపినవారు
గానీ, ఆనాడు ఎంతో పరిశోధన చేసి తెలిపినవారుగానీ ఏ ఫలితాన్ని ఆశించి తెలుపలేదు కదా! అని కొంతైనా యోచించక,
మూఢముగా నాగదేవతల పూజను మాన్పించుటే వీరి ఉద్దేశమని, వీరు హిందువులుకాదని అనడము సరియైన పద్ధతేనా
అని మీరే యోచించండి. మంచి ఏదో చెడు ఏదో తెలియకుండ, నిస్వార్థముగా సమాజ శ్రేయస్సుకోరువారిని తప్పుగా
మాట్లాడువారు కూడ నేడు కలరు. అందువలన ఇప్పుడు చదువుచున్న మీరైనా సత్యమును తెలుసుకొమ్మని కోరుచున్నాము.
ఇంతవరకు నాగులచవితిని గురించి చెప్పాము, ఇప్పుడు వినాయక చవితి గురించి చెప్పుచున్నాము.
విషయమును కూడ అపార్థము చేసుకొనుటకు అనేక అవకాశములు గలవు. అందువలన చదువుచున్న ప్రతి పాయింటును
జాగ్రత్తగా గమనించమని కోరుచున్నాము. ఒక మనిషి సక్రమమార్గములో నడవాలంటే మనిషికి ఆధ్యాత్మిక వికాసము,
వ్యక్తిత్వ వికాసము, సామాజిక వికాసము అవసరమని తెలిసిన పెద్దలు ఆ మూడు విధానములను పండుగల రూపములో
తెల్పుచు, అన్నింటియందు ఆధ్యాత్మికమునకే అతి ముఖ్యమైన ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు మనము చెప్పుకొన్న మరియు
చెప్పుకొనబోవు పండుగలన్నీ హిందూ(ఇందూ) మతములోనే గలవు. పూర్వము హిందూసంస్కృతి చాలా గొప్పగ
ఉండెడిది. ప్రస్తుత కాలములో హిందూసంస్కృతినే పరాయి సంస్కృతిగా, పరాయి సంస్కృతినే హిందూసంస్కృతిగ
భావించుకొను హిందువులు తయారైనారు. ఈ మామాటను మీరు నమ్మలేకపోతే, మేము చెప్పు ప్రత్యక్ష ప్రమాణమును
49

Page 50
ఆ
చూచిన తర్వాత అయినా మా మాట నిజమని నమ్మగలరు. క్రీస్తుశకము 2008, 8వ నెల, 8వ తేదిన, 8 గంటల, 8
నిమిషాలకు మంచి ముహూర్తమున్నదనీ, ఆ విధముగ సంవత్సరము మొదలుకొని నెల, దినమూ అన్నీ 8 సంఖ్యకావడము
విశేషమనీ, అనేక దేశాలు దీనిని శుభదినముగా పాటిస్తున్నవనీ, ప్రపంచము మొత్తము మీద చాలా వివాహములు
జరుగుచున్నవీ, చైనాలో ఒలంపిక్స్ వేడుకలు కూడా ఈ దినమే ప్రారంభిస్తున్నారనీ, టీవీ9 వారు చర్చావేదిక పెట్టి
అందులో జ్యోతిష్య శాస్త్రపండితులను, సంఖ్యాశాస్త్రపండితులను కలిపి వారి చర్చను ఆగష్టు 8వ తేదీన ఉదయము 8
గంటలకు ప్రసారము చేశారు. ఆ చర్చలో ఒక సందర్భమున కలియుగము 4,32,000 సంవత్సరముల పరిమితితో
ఉన్నది. ఆ సంఖ్యలో ఇపుడు గడచినది కేవలము 2000 సంవత్సరములు మాత్రమే, ఇంకా గడువవలసినది ఎంతో
ఉన్నదని స్వయాన పండితులే అన్నారు. ఆ విషయమును ప్రక్కనేయున్న మరియొక జ్యోతిష్య పండితుడు ఏమాత్రము
ఖండించకపోగా టీవీ9 వారు కూడ తటస్థముగా ఉన్నారు. అక్కడ కూర్చొన్న ఇద్దరు జ్యోతిష్యపండితులూ, టీవీ9 వారు
అందరూ హిందువులే! అయినప్పటికీ ఎవరూ పెదవి విప్పలేదు. అక్కడ కలియుగము యొక్క పరిమాణము 4,32,000
అయినపుడు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరములు గడిచిపోయి, కలియుగము ప్రారంభమై 5108 సంవత్సరములు
కూడ గడిచిపోయి, 5109 వ సంవత్సరము జరుగుచున్నది. ఇజ్రాయిల్దేశములో పుట్టిన ఏసుప్రభువు చనిపోయి
క్రీస్తుశకము ప్రారంభమై 2007 సంవత్సరములు గడచి, 2008 సంవత్సరములో 7 నెలలు కూడ అయిపోయి 8వ నెల
జరుగుచున్నది. అటువంటపుడు హిందువుల ధర్మము ప్రకారము యుగముల పరిమాణ ముండగా, అందులో కలియుగ
పరిమాణము 4,32,000 అన్నపుడు గడచినది 5108 సంవత్సరముల నాలుగు నెలలే అయినపుడు, క్రైస్తవ మతస్థుల
క్రీస్తుశకము యొక్క సంవత్సరములను చెప్పుకోవడము తప్పుకాదా! బ్రాహ్మణున్ని ప్రస్తావించి అతని పేరు డేవిడ్ బ్రస్
అని చెప్పినట్లు, కలియుగ ఆయుఃప్రమాణమును ప్రస్తావించి, క్రీస్తుశక భుక్తిని (గడచిన దానిని) చెప్పితే హిందూసంస్కృతిని
వదలి క్రైస్తవ సంస్కృతిని చెప్పినట్లు కాదా! అక్కడున్న ముగ్గురికీ అందులో క్రైస్తవ సంస్కృతి కనిపించలేదా! వారు
మాట్లాడినది హిందూసంస్కృతియేనా?
త్రైతశకము - 30, కలియుగము 5109వ
1, వసంతఋతువు అని హిందూ సంస్కృతి
ఇటువంటిదే మరొక ప్రత్యక్ష సత్యమును చెప్పెదను చూడండి.
సంవత్సరము, సర్వధారి నామ సంవత్సరము నెం-22, ఛైత్రమాసము నెల
ప్రకారము యుగాది నుండి ప్రారంభమైన క్యాలెండరును మేము తయారు చేసి జనవరి నెలతో ప్రారంభమైన క్యాలెండరు
వద్దు, అది మన దేశ సంస్కృతికాదని, యుగాది నుండి ప్రారంభమైన మా క్యాలెండరును ఉచితముగా పంచితే,
మహానందిలో పరమత ప్రచారమని క్యాలెండరును టీవీలో దగ్గరగా చూపి, వరుసగా మూడు రోజులు ప్రసారము చేసిన
టీవీ9 వారికి మేమూ మా క్యాలెండరూ క్రైస్తవముగా కనిపిస్తే, తమ ఎదురుగా క్రైస్తవశకములోని 2000 సంవత్సరములను
కలియుగములో గడచిన సంవత్సరములుగా చెప్పువారు హిందువులుగా కనిపించారా? హిందూ ధర్మమును చెప్పువారిని
క్రైస్తవులుగా, క్రైస్తవమును చెప్పువారిని హిందువులుగా టీవీ9 వారు ప్రచారము చేయడము చూస్తే మీకేమనిపి స్తుందో
యోచించండి. టీవీ9 వారు యుగాది నుండి ప్రారంభమైన మా క్యాలెండర్ను పరమత ప్రచారమని టీవీలో క్లోసప్లో
చూపించగా, దానిలోని వాస్తవమెంత అని యోచించకుండానే కొందరు హిందువులు మా క్యాలెండర్లను అనంతపురము
జిల్లా గుంతకల్లులో నిప్పు పెట్టి కాల్చేశారు. మెరుగైన సమాజము కొరకు టీవీ9 అనువారు అసత్యమును ప్రసారము
చేయవచ్చునా? ఇదంతయు చూస్తే హిందువులు హిందూత్వమును గుర్తించలేని గ్రుడ్డివారుగా ఉన్నారో లేదో మీరే
యోచించండి.
50

Page 51
ఇంకొక విషయమును చెప్పెదను చూడండి. పంచాంగము, నవ గ్రహములు, జ్యోతిష్యము పూర్వము నుండి
హిందువులు కనుగొన్నవి, హిందువులు లెక్కించునవి. హిందువులు కర్మ సిద్ధాంతముననుసరించి గ్రహచారముండునని
ఆధ్యాత్మికములో కూడ చెప్పుకొన్నాము. అటువంటిది క్రీస్తుశకము 2008, 8వ నెల, తేదీ 8 ప్రకారము హిందువులకు
మంచిదినమెలా అయినది. ఆ మూడు 8 లు ఒక్కమారు కలిసి రావడము క్రైస్తవులకు మంచిది కావచ్చునేమో కానీ,
హిందువులకు ఆ దినమెలా మంచిదైనది? జ్యోతిష్యశాస్త్రము ప్రకారము ఆ దినమునకు ఏ ప్రత్యేకత లేదు. అటువంటపుడు
ఆ దినమును గూర్చి ప్రత్యేకముగా టీవీలో ప్రచారము చేసి మాట్లాడడము క్రైస్తవశకము 2008 ని గురించి పొగిడినట్లు
కాదా? హిందువుల పంచాంగము ప్రకారము ఇది 8వ సంవత్సరమూ కాదు, 8వ నెలా కాదు, 8వ దినమూ కాదు.
అటువంటపుడు క్రైస్తవుల మూడు ఎనిమిదులను గురించి మాట్లాడువారు హిందువులైతే, మేము భగవద్గీత ప్రకారము
జ్ఞానమును చెప్పుచూ, యుగాది నుండి క్యాలెండరును తయారు చేసినవారము, పరమతస్థులమా? మా యుగాది
క్యాలెండరును చించినవారు, కాల్చినవారు, క్రైస్తవులదని చూపించిన టీవీ9 వారు, వారి ఇళ్ళలో జనవరి నుండి ప్రారంభమైన
క్యాలెండరును ఉంచుకోవడము సమంజసమా? జనవరి 1వ తేదీని క్రొత్త సంవత్సరమని సంతోషపడువారు, ఆ రాత్రికి
టీవీలలో చూపువారు పరమతమును అనుసరించినట్లు కాదా? ఇట్లు అడుగుచూ, వివరిస్తూ పోతే హిందూమతములో
దైవజ్ఞానము సన్నగిల్లిపోయి, హిందువులు తమ సంస్కృతిని, తమ జ్ఞానమును గుర్తించలేని స్థితిలో లేరని తెలియు
చున్నది. అటువంటి స్థితినుండి హిందువులు బయటపడుటకు, హిందూ సంస్కృతికి అద్దముపట్టు పండుగలను వివరిస్తూ
వచ్చాము. హిందువులకు ఆధ్యాత్మికమను అద్దములో పండుగల అర్థమును చూపిస్తూ వచ్చాము. సామాజిక స్రృహను
కలుగజేయు నాగులచవితిలో కూడ భక్తిని పెంపొందించుకొమ్మని చెప్పాము. అదే కోవలో సామాజిక న్యాయమును,
నీతిని చూపు వినాయకచవితిలో కూడ భక్తిని పెంచుకొమ్మని తెలుపు చున్నాము. నాగుల చవితి సమాజమునకు
ఆరోగ్యమును అందించు సూత్రమును తెలియజేయగా, వినాయకచవితి సమ సమాజమును నెలకొల్పు అంశమును
తెల్పునదై ఉన్నది. సమాజమునకు గొప్ప సందేశమునిచ్చు వినాయక చవితిని గురించి తెలుసుకొందాము.
మనము ప్రతి సంవత్సరము ఆగష్టు, సెప్టెంబరు మాసాలలో వచ్చు వినాయకుని పండుగను ఎంతో ఉత్సాహముతో
జరుపుకుంటాము. ఈనాడు ఇందూ (హిందూ) ప్రజలలో ఎంతో గాఢముగా నిలిచిపోయిన ఈ పండుగను గురించి
ఇతర మతస్థుల విమర్శలు కూడా ఎన్నో గలవు. అటువంటి విమర్శకులు మావద్దకు వచ్చి "మీరు ఎంతో ఖచ్చితముగా
సత్యమైన విషయములు తెలుపుచున్నారు గదా! అటువంటపుడు మీరు మా ప్రశ్నలకు సమాధానమిస్తారా” అని అడిగారు.
అందులకు సమాధానముగా మేము ఆధ్యాత్మికములో సత్యమైన జ్ఞానవిషయాలనే తెలుపుచు జీవితమును
సాగించాలనుకొన్నాము. కావున మీ ప్రశ్నలకు జవాబులు నాకు తెలిసి ఉంటే తెలుపగలను, లేకపోతే నాకు తెలియదని
చెప్పగలను అడగండి అని తెలిపాము. అపుడు వారు అడిగిన మాటలిలా ఉన్నవి.
1)
ఇందూమతములో విఘ్నేశ్వర పండుగ అని చేస్తున్నారు కదా! విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములకధిపతియని
కదా అర్ధము. విఘ్నములంటే అడ్డంకులు, ఆటంకములు అని కదా అర్థము, అటువంటి ఆటంకములకు అధిపతియై,
ఆటంకములు కలుగజేయువానిని శత్రువుగా భావించి దూషించాలి, కానీ పూజించడమెందుకు? చెడ్డ చేయువాడు
బలమైనవాడైతే వానిని ఎవరు వ్యతిరేఖించక పొగిడినట్లు, మీరు చేయు భక్తి కూడ విఘ్నేశ్వరుడు విఘ్నములు కలిగిస్తాడని
భయపడి, భయముతో పూజ చేయు చున్నట్లున్నది. కానీ భక్తితో కాదని తెలియుచున్నది దీనికి మీరేమంటారు?
2)
ఎంతో భక్తిగ, మరి ఎంతో ఖర్చుతో ఎంతో అందముగ తయారు చేసుకొన్న విఘ్నేశ్వరుని ప్రతిమలను మిగులభక్తిగ
51

Page 52
పూజించుకొని, ముందు రోజు చూపిన భక్తినంతటిని ఏటిలో కలిపి, విఘ్నేశ్వరున్ని నీటిలోనికి విసిరి వేయడము మంచిదా?
ఇక చాలు నీ సహవాసము అన్నట్లు వినాయకున్ని నీటిలోనికి త్రోసి చేతులు దులుపుకోవడము భక్తి అంటారా?
3)
పదిరూపాయలు పెట్టి దైవజ్ఞానము తెలుపు గ్రంథము కొనుక్కోవ డానికి బాధపడు వారిని మీరెందరో
చూచివుంటారు. అటువంటి వారు సహితము వేలు ఖర్చుపెట్టి వినాయక ప్రతిమలు చేసి వాటిని విరగగొట్టి వారి
డబ్బును వృథా చేసుకొనుచున్నారు. కొందరు బలవంతముగా ప్రతిమల ఖర్చుకని ఇతరులనుండి డబ్బును వసూలు
చేయుచున్నారు. ఇలా బలవంతముగ వసూలు చేయడము బలవంతపు భక్తి కాదా?
4) ఒకే రకముగ, ఒకే పద్ధతిగ, ఒకే విధముగ అవయవములు కల్గి పుట్టిన మనము, ఒకే దేవుని బిడ్డలమని మరచి,
మతద్వేషములను పెంపొందింపజేసుకొను అధ్యాయములో వినాయక పండుగను ఉపయో గించుకొనుచున్నాము. జ్ఞానమును
పొందిన యోగులుగ మీరేమంటారు?
ఈ విధముగ అడిగిన వారికి వినాయక చవితి పండుగ రహస్యము మేము చెప్పవలసి వచ్చినది. వారి
ప్రశ్నలకు సరైన జవాబులు అందివ్వక పోతే, వారి హృదయములో వినాయక పండుగ మీద ఉన్న భావము మార్చలేము.
మనకు గొప్పదైనప్పటికీ అడుగువారికి చిన్నదిగనే కన్పిస్తుంటుంది. కావున నిజార్థాన్ని చెప్పక తప్పదు కావున ఇలా
చెప్పాను. ప్రపంచ పుట్టుక సమయములో మతములు అనునవి లేవు. దేవుళ్ళను వారూ లేరు, దేవుడొక్కడను విషయము
అందరికి తెలుసు. కొంత కాలమునకు అటువంటి అవగాహన మనుష్యులలో క్షీణింప మొదలిడినది. ఆ సమయమున
తత్త్వవేత్తలైన మహాత్ములు కొందరు యోచించి, అజ్ఞాన బీజమును తీసివేయుటకు, దైవత్వమును గూర్చి ప్రచారము
చేయబూనినారు. దేవునికి రూపములేదు, కావున ముక్కు ముఖములేని రాయిని (లింగమును) గుర్తుగా పెట్టి, దేవుడు
ఇట్లుంటాడని రూపములేని వానిగా బోధించారు. ఆయనకు (దేవునికి) పేరులేదు, కావున ఈశ్వరుడని పిలిచారు.
ఈశ్వరుడనగా అధిపతియని అర్థమేకాని పేరుకాదు. ఇట్లు సర్వమునకు అధిపతియైన వాడొకడున్నాడని రూపములేని
గుండును చూపించి, తెలియకుండ పోయిన దైవత్వమును గురించి ఆనాటి పెద్దలు తెలియజేశారు.
ఇట్లు జ్ఞానరీత్యానే కాక, సంఘరీత్యా కూడ రెండు విధముల మానవున్ని నడిపించుటకు ఆనాటి పెద్దలు కృషి
చేశారు. ఈనాడు మనము ‘సామెత' అను పదమును ఆనాడు 'సమత' అనెడివారు. పెద్దలమాట మారనిదనీ, నిజమనీ,
చెడని వాక్యమనీ చెప్పుటకు సమానముగా “పెద్దలమాట పెరుగన్నము మూట" అనుట నేటికీ కలదు. పెద్దలమాటకు
సమతగా పెరుగన్నపు మూటను వాడినారు. సమత అంటే సమానమని అర్థము. అట్లే “చింత లేనమ్మకు సంతలో
నిద్రవచ్చె” అనుట కూడ గలదు. చింత లేనమ్మకు సంతలో నిద్రకు సమానముగా (సమతగా) పోల్చి చెప్పడమన్న
మాట. ఇటువంటి సమత అను పదము కొంతకాలమునకు పలుకడములో 'సామత' గా మారినది. అట్లే మరి
కొంతకాలమునకు సామత పోయి 'సామెత' గా మారిపోయి నేడు మన ముందరున్నది. ఇటువంటి ముఖ్యమైన సామెతలను
ఎన్నిటినో పూర్వము మానవుని సంఘములో సక్రమముగా నడుపుటకు పెద్దలుంచారు. ఆ విధానము ప్రకారమే
సమాజములోని ఒక చెడును తీసివేయడానికి సమాన పోలికతో, సంఘములో బలహీనుని ఎలుకగా పోల్చి, బలవంతుని
ఏనుగుగా పోల్చి చెప్పెడివారు. బలవంతుడు బలహీనునిపై పెత్తనము చెలాయించి పీడించడమును “ఎలుకపై ఏనుగు
స్వారీ చేసినట్లు” అని సామెతను అనెడివారు. ఇది సంఘవిద్రోహ చర్య కావున ఇది మంచిదికాదనీ అందరికి తెలియునట్లు,
నోటితో చెప్పడమే కాకుండా దృశ్యరూపముగా కంటికి కనిపించెడి కార్యక్రమముగా చూపించెడి వారు.
ఒక చిన్న
52

Page 53
ఎలుకను ఉంచి, దానిమీద పెద్ద ఏనుగును ఆసీనమైనట్లు చేసి, అది అందరికి తెలియునట్లు ఊరంతా ఊరేగించి,
చివరకు ఈ పద్ధతి మంచిదికాదన్నట్లు ఆ దృశ్యమును నాశనము చేసెడివారు. వారు ఆ దినము మట్టితో చేసిన
బొమ్మలను అగ్నిలోవేసి కాలిస్తే ఇంకా గట్టిపడి చెక్కు చెదరకుండావుంటా యని, నీటిలో అయితే పూర్తిగా కరిగిపోతాయని
నీటిలో ముంచెడివారు. నీటిలోనికి వేసిన తర్వాత ఆ దృశ్యము తొందరగా నాశనమగుటకు నీటిలో వేయకముందే ఆ
బొమ్మకు కాళ్ళు, చేతులు విరగగొట్టి పూర్తి నీటిలో కలిసిపోయేటట్లు చేసెడివారు. ఇది ఆనాటి సంఘ సంస్కరణ నిమిత్తమైన
ఆచరణ. ఈ కార్యము ప్రతి సంవత్సరము ఒక ఆచరణగా చేయడము నేటికీ మిగిలివున్నది. కానీ అర్ధము మాత్రము
తెలియకుండా పోయినది. ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు ఆ ఆచరణ చేయడమే నేడు తెలిసిన విధానము, అంతే తప్ప
అర్థమును గూర్చి ఎవరూ ఆలోచించడము లేదు. ఒక మతస్థులు చేయుచున్న ఆచరణ పూర్వము గొప్ప భావముతో
పెట్టినదని ఆ మతస్థులకే తెలియనపుడు, ఇతర మతస్థులు అపార్థము చేసుకోవడములో తప్పులేదు. కానీ నిజమైన
అర్థమునూ, ఆచరణనూ తీసుకొన్నపుడు అందులో విమర్శించునది ఏమీలేదు. ఎవరూ విమర్శించలేరు, అసలైన అర్థము
తెలిసినపుడు అన్ని మతస్థుల మద్దతు లభిస్తుంది.
మేము ముందే చెప్పాముగా! పూర్వము మతమను పేరు లేని ప్రజలకు దేవుడొక్కడను భావముండేదనీ, దేవునికి
రూపము, పేరులేదను గుర్తింపుకే రాతిలింగమును ఉంచినారనీ, అయినప్పటికీ కాలక్రమమున ధర్మములు అధర్మములుగా
మారునను గీతావాక్యానుసారము, కొంత కాలమునకు మానవులలో అజ్ఞానవశమున ఏకత్వము పోయి, మేము మీరు
అను గుంపులుగ చీలిపోయిన వారికి కూడ పేర్లుండేవి. అట్లు కొంత కాలమునకు ఏర్పడిన గుంపులే వైష్ణవులు, శైవులు.
పూర్వము వైష్ణవులు, శైవులు సాంప్రదాయములను ఏర్పరుచుకొని, ఇవి మా సాంప్రదాయములు అనుచు, వాటి భద్రత
కొరకు కొన్ని పురాణములను వ్రాసి, అవి ప్రజలందరికీ తెలియునట్లు చేసి, వారి సాంప్రదాయములను భద్రము చేసుకొన్నారు.
అటువంటి పురాణములలో శైవుల సంబంధమైన “శివపురాణము” పుట్టినది.
ఇట్లు శైవమేర్పడు రెండువేల సంవత్సరములకు ముందే సమాజ ములో చెడును ఏనుగుగా, ఎలుకగా చూపించి
నీటిలో ముంచివేయు ఆచరణ గలదు. ఆ ఆచరణ చేస్తూ చేస్తూ పెద్దలు చనిపోతూరాగ, చిన్నలు వారిననుసరిస్తూ
చేస్తూ, చివరకు ఎందుకు ఈ కార్యక్రమము చేస్తున్నామను నది ఎవరికీ తెలియకుండా పోయినది. అర్థము ఇది అని
తెలియక ఎంతో మంది కలిసి ఆనందముగా ఎలుకను ఏనుగునూ ఊరేగిస్తున్నాము. ఇదేదో గొప్ప భక్తి కార్యమనుకొని
ఆ ఏనుగాకారానికి మ్రొక్కను మొదలిడినారు. అట్లు శైవముద్భవించు దినములకే ఎలుక ఏనుగు బొమ్మలను మ్రొక్కువారు
గలరు. కనుక శైవులు శివపురాణములో ఎలుకకు ఏనుగుకు విశిష్టత కల్పించి, ఏనుగు తల కల్గినవాడు వినాయకుడనీ,
పార్వతి కుమారుడనీ ఉన్న భక్తిని ఇంకొంత ఎక్కువగునట్లు మంచిపనియే చేశారు. అప్పటినుండి ఏనుగు బొమ్మపోయి
ఏనుగు తలమాత్రమున్న వినాయకుని బొమ్మవచ్చినది. ఉన్న భక్తిని ఎక్కువ చేయుటవలన వినాయకుని బొమ్మలు
చేయువారు ఎక్కువైనారు. డబ్బు ఖర్చుపెట్టి పూజించువారు ఎక్కువైనారు, కానీ నీళ్ళలో వేసి త్రొక్కే పూర్వ ఆచరణను
మాన్పించలేక పోయినారు. ఈ విధానమును మాన్పించలేని పెద్దలు వినాయక నిమజ్జనమును నీటిలోనే చేయుచున్నా
మన్నారు. నిమజ్జనమనగా స్నానమని అర్థము కానీ విరగగొట్టడము, పూజించిన దేవున్ని కాలదన్నడము కాదని
తెలియాలి. మీరడగిన మొదటి ప్రశ్నలో విఘ్నము కలిగించు విఘ్నేశ్వరున్ని దూషించాలి, కానీ పూజించ కూడదన్నారు
కదా! అసలుకు విఘ్నేశ్వరున్ని దూషించడానికి ఆయన మనకే విఘ్నముగానీ, ఏ చెడ్డగానీ చేయలేదు కదా! అందువలన
ఆయనను దూషించ వలసినది లేదు. భక్తి కలిగి విఘ్నేశ్వరుని పూజించడములో తప్పులేదు, కానీ పూజించిన వానిని
53

Page 54
పూజించినట్లే ఉంచుకొని ఉంటే బాగుండేది. నీటిలో పారవేయడము మంచిది కాదు. ఒకమాటకొస్తే దానిని దూషించుటకు,
పూజించుటకు కాక సంఘములోనున్న అన్యాయము ను బహిర్గతము చేయడానికి ఊరేగించు ఊరేగింపుయనీ, అట్లే
దానిని లేకుండా చేయవలయునను ఉద్దేశమే ఆ బొమ్మను నీటిలో ముంచి నాశనము చేయడమనీ అందరూ తెలియవలెను.
మీరడిగిన మరొక ప్రశ్న ప్రకారము బలవంతముగా డబ్బు వసూలు చేసి ఉత్సవము చేయడము పద్ధతికాదు.
భక్తిలో కూడ అది బలవంతపు భక్తి అగును, కానీ మనస్ఫూర్తి భక్తికాదు. ఇష్టము లేకుండా ఇచ్చినవారు అడిగిన
వారినేకాక, విఘ్నేశ్వరున్ని కూడ నిందించుటకు అవకాశము గలదు. అందువలన ఇంకొకరితో డబ్బు వసూలు చేయడము
మంచిది కాదు.
పూర్వకాలములో సమత అను పదము సామతగా మారి చివరకు సామెతగా మారినట్లు, ఆ రోజు పెద్దలుంచిన
సంఘసంస్కరణ పద్ధతియైన ఎలుక ఏనుగు ఊరేగింపు నేడు భక్తిరూపముగా మారిపోయినది. పురాణముల ప్రభావము
వలన ఏనుగు రూపు కాస్త వినాయకుని రూపుగా మారినప్పటికీ ఆచరణ పూర్తి మారక పూర్వాచరణే చేయుటవలన
ఇతర మతస్థులైన కొందరిచేత విమర్శింపబడుచున్నది. ఆచరణను పూర్తి భక్తి భావముగా మార్చుకున్ననూ ఫరవాలేదు,
లేక ముందుమాదిరే సంఘరీత్యా పెట్టుకొన్నా ఫరవాలేదు. కానీ అటు ఇటు కాక చేయుచున్న పనికి అర్థము
తెలియకపోవడము వలన ఇతర మతములచేత, చూచువారిచేత విమర్శింప బడు కార్యమైనది. వినాయకుని నిమజ్జనము
(స్నానము) అను పేరుతో చిన్న చిన్న బొమ్మలను నీటిలోనికి విసురుచుండుట చూస్తే, నిజముగా భక్తి అనిపించదు.
సరదాగా చేయుచున్న పనిగా కన్పిస్తున్నది, కానీ పూర్తి భక్తిగా కనిపించుపనిగా తోచడము లేదు. ఊరేగింపులందామా?
కొన్ని చోట్ల పీర్లపండుగ మాదిరి త్రాగి చిందులు వేయడము, కర్రసాములు చేస్తూ పోవడము చూస్తే అల్లరి
సాంప్రదాయమేగానీ, అర్థసాంప్రదాయము కాదనిపిస్తుంది. ఆనాడు మన పెద్దలు సమాజములోని చెడును తీసివేసి సమ
సమాజమును స్థాపించుటకు చేసి చూపిన దానిని అర్థము చేసుకోలేక, వారి అర్థమును తుంగలో త్రొక్కి, మన ఇష్టమొచ్చినట్లు
మనము వినాయక చవితిని చేసుకొనుచున్నాము. ఇటు చదువుకొన్నవారు, అటు చదువులేని వారు మూఢముగా పెద్దల
ఉద్దేశమును మట్టిలో కలిపివేసి అర్థరహితమైన వినాయకచవితిని చేస్తున్నారు.
ఇక్కడ ముఖ్యముగ చెప్పుకోవలసినదేమనగా! కృష్ణుడు భగవంతు డైనా, దేవుని అంశ కృష్ణునిగా భూమిమీదికి
వచ్చి మన జీవితముల సారాంశమైన భగవద్గీతను చెప్పినా, భగవంతుడుగానీ, భగవద్గీతగానీ నేటి మానవులకు గొప్పగ
కనిపించక, భగవంతుని పుట్టిన రోజు పండుగైన కృష్ణాష్టమిని చేయక, దాని స్థానములోనికి వినాయక చవితిని తెచ్చి
పెట్టుకొన్నారు. కృష్ణాష్టమి పదకొండు రోజుల పండుగని ముందే చెప్పుకొన్నాము. అంతేకాక కలియుగ ప్రారంభములో
పెద్ద ఎత్తున చేయు వీధి పండుగ కృష్ణాష్టమి ఒక్కటేనని కూడ చెప్పాము. మాయా ప్రభావము చేత ఒక్కరోజు చేయు
వినాయకచవితి పదకొండు రోజులైంది. పదకొండు రోజులు చేయు కృష్ణాష్టమి ఒక్కరోజుకు పరిమితమై పోయినది.
అంతేకాక పూర్వము కృష్ణాష్టమి పండుగ ముగింపు దినము భాద్రపదమాస శుక్లపక్ష చవితిరోజు అగును. సరిగ ఆ
దినమునే వినాయక చవితిగా లెక్కించడము వలన, కృష్ణాష్టమి ముగింపు పదకొండవ దినమునకు ఆటంకమేర్పడినది.
ఈ విధముగా కృష్ణాష్టమికి ఆటంకముగా వినాయకచవితి రావడము వలన హిందూ (ఇందూ) సంస్కృతిలోని ముఖ్యమైన
కృష్ణాష్టమి పోయి, ముఖ్యము కాని వినాయకచవితి వచ్చి చేరిపోయినది. కృష్ణాష్టమి ముగింపు దినమైన పదకొండవ
దినమే వినాయకచవితి ప్రారంభమగుట వలన, కొందరు వినాయకచవితిని వదలలేక కృష్ణాష్టమిని ఒక్కరోజు పండుగగా
కుదించి, శ్రావణ బహుళ అష్టమి రోజు మాత్రము కృష్ణాష్టమిని చేయుటకు మొదలు పెట్టారు. అలా చేయడము వలన
54

Page 55
మనము మన ముఖ్యమైన సాంప్రదాయము తెలియకనే వదలుకొన్నట్లయింది. ఆ విధముగా సంవత్సరములో ఒక్కరోజు
పండుగగా కృష్ణాష్టమి మారిపోయి కొంతకాలము గడువగా, కాలక్రమమున ఆ ఒక్కరోజు పండుగను కూడ మరచిపోయి,
కృష్ణాష్టమి అంటే ఏమిటో తెలియనిస్థితికి మనము వచ్చాము. ఇంకా విశేషమేమంటే కొన్ని ప్రాంతము లలో కృష్ణుడు
పెరిగిన కులమైన యాదవులకు (గొల్లవారికి) కూడ కృష్ణాష్టమి గురించి తెలియకుండా పోయినది. సాక్షాత్తు దేవుడు
అవతరించి భగవంతునిగా వచ్చిన మొదటి దినమైన కృష్ణాష్టమి, నేడు ఆదరణలేనిదై, అర్థములేనిదై, ఆచరణలేనిదై
పోయివుంటే, దైవత్వముకాని ఒక సమాజ శ్రేయస్సు విషయము, మాయబలము వలన దైవస్థానమును ఆక్రమించి
అందరిచేత ఆదరణ పొందుతూ, అందరిచేత ఆచరింపబడుచున్నది. ఈ విధముగా సమాజములో వినాయకచవితి
వీధిపండుగగా మారిపోవడము, అంతేకాక పదకొండు రోజుల పండుగగా మారిపోవడము, కృష్ణాష్టమి అన్ని విధములుగ
ఆదరణలేకపోవడము మాకు చాలా బాధకల్గించిన విషయము. నాకే కాదు ప్రతి హిందువు (ఇందువు) బాధపడవలసిన
విషయము. ప్రతి ఒక్కరు వెనుతిరిగి చూచుకోవలసిన విషయము.
ఇందూ (హిందూ) ధర్మములకు పూర్వవైభవము రావాలంటే, ఇందుత్వము అందరికి ఆమోదయోగ్యము కావాలంటే,
ఈనాటి ఆచారము లను మానుకొని, ఆనాటి ఆచారములను అమలు చేయాలి. ఇంత చెప్పినా కొందరు మొండిగ
వాదిస్తూ, వినాయకచవితి కూడ హిందూ ధర్మములకు సంబంధించినదే కదా! పార్వతీదేవికి, శివునికి పుట్టినవాడే కదా!
వినాయకుడు అని అడుగవచ్చును. నేను మొదటినుండి మనకు శాస్త్రమే ఆధారమని చెప్పుచునే ఉన్నాను. పార్వతి,
వినాయకుడు భగవద్గీత కంటే ముందు వ్యాసునిచేత వ్రాయబడిన ఒక పురాణగాథ నుండి వచ్చినవారు. వినాయకుని
పుట్టుకే అశాస్త్రీయము, ప్రకృతికి విరుద్ధము అవుతుంది. తండ్రికి తెలియకుండ కొడుకు పుట్టడమేమిటని ఎవరైనా
ప్రశ్నించినా, తండ్రి సంబంధము లేకుండ తల్లి కొడుకును ఎలా పుట్టించుకొన్నదని ఎవరైనా అడిగినా, మనము సరియైన
శాస్త్రబద్ధమైన సమాధానము చెప్పలేము. అలా పుట్టినవాడు తల్లి కొడుకే అగును, కానీ తండ్రి కొడుకు కాడు. తల,
మొండెములు వేరువేరుగా ఉన్న నరసింహస్వామి, వినాయకుని కథలు పురాణములే అగును. కానీ శాస్త్రబద్దమైన
చరిత్రలు కావు. కవులు సృష్టించిన కథలను విడచి వాస్తవ చరిత్రగల విషయమునే స్వీకరించవలెను. నాగుల చవితికి
శాస్త్రీయత కలదు. అలాగే వినాయకచవితికి శాస్త్రీయత గలదు. ఈ రెండూ సమాజ శ్రేయస్సుకు సంబంధించినవని
తెలియుచుండినా, శాస్త్రీయతను వదలి నాగులచవితికి, వినాయకచవితికి అశాస్త్రీయతను అంటగట్టకూడదు.
కొందరు హిందూ (ఇందూ) మతమును రక్షించుతామని, హిందూ ధర్మములను కాపాడుతామని చెప్పుచు,
హిందూధర్మరక్షణ అను నినాదముతో కొన్ని పేర్లు గల సంఘములను స్థాపించుకొని, వారి ఆధిపత్యము కొరకు
హిందూ ధర్మములను భక్షించుచున్నారు. అటువంటి వారికి హిందూ ధర్మములంటే ఏమిటో, అవి ఎట్లుంటాయో కూడ
తెలియదు. అటువంటి వారా హిందూ ధర్మములను కాపాడేది? అటువంటి సంస్థలు ఇతర మతముల మీద దౌర్జన్యము
చేస్తూ హిందుత్వము శాంతి స్వరూపమైనది కాదు అనునట్లు చేయుచున్నారు. అటువంటివారు తమ పేరు ప్రఖ్యాతుల
కొరకు మాలాంటి వారిని కూడ అవమానిస్తున్నారు. అటువంటివారిని లెక్కచేయక, ఇందూ ధర్మముల ప్రకారమే
జ్ఞానము తెలిసినవారు ప్రవర్తించాలి. భగవద్గీత తెలిసిన తర్వాత పురాణములను వ్రాసిన వ్యాసుడే తాను పురాణములను
వ్రాసి తప్పు చేశానని బాధపడి పశ్చాత్తాపముతో కృంగిపోయాడు. వ్రాసిన వ్యాసుడే బాధపడితే, ఆ విషయము తెలియక
మనము ఆ పురాణముల ఆధారముతోనే నాగులచవితి, వినాయకచవితి ఇష్టానుసారము చేస్తే మనము దైవద్రోహము
చేసినట్లే. అసలైన హిందూ ధర్మములను కించపరిచినట్లే. అందువలన అధర్మములైన పద్ధతులను వదలి ధర్మములైన
55

Page 56
పద్ధతులనే ఆచరించాలి. ఆ ప్రయత్నములో వినాయక చవితిని వదిలివేసి కృష్ణాష్టమిని చేద్దాము. కృష్ణాష్టమిని
పదకొండురోజులు జరిపితే వినాయకచవితిని చేసుకొను అవకాశము లేకుండ పోవును. పదకొండవ రోజు వినాయకచవితి
అగును. ఆ దినమున కృష్ణుడు పందిరిలో ఉండుట వలన వినాయకునికి పందిరే ఉండదు. అందువలన భగవంతుని
పండుగ కోసము భగవంతుడుకాని వినాయకుని పండుగను వదలివేసినా తప్పులేదు.
భూమిమీద చాలామందికేకాక ఒక విధముగ అందరికి తెలియని రహస్యమొకటి కలదు. అదియే దేవుని
పాలన. దేవుని పాలనలో మహా భూతములు, భూతములు, ఉపభూతములు పాత్రధారులుగా ఉండి భూమి మీద
పాలన సాగించుచున్నవి. ఈ విషయము భగవద్గీతలో శాస్త్రబద్దముగా కలదు. దేవుడు ఏమీ చేయడు, చేయునదంతా
మూడు రకముల భూతములే. దేవునికి వ్యతిరేఖమైన పనులు చేయువారి మీద భూతముల దృష్ఠి ఉండునని కూడ ఒక
గ్రంథమందు వివరముగా చెప్పడము జరిగినది. దేవతల దర్శనార్థము పోవునపుడు, వచ్చునపుడు పాల్గొన్నపుడు,
పెళ్ళిళ్ళలకు పోవునపుడు, వచ్చునపుడు ఎక్కువగా ప్రమాదములు జరుగుటకు భూతములే కారణమని కూడ చెప్పాము.
ప్రతి సంవత్సరము వినాయకచవితి పండుగలలో వినాయక నిమజ్జన సందర్భములో చాలా ప్రదేశములలో ఒకరు,
ఇద్దరు లేక ముగ్గురు ప్రమాదవశాత్తు చనిపోవడము జరుగుచున్నది. ప్రతి సంవత్సరము అలా జరుగుచున్నా ఎందుకిలా
జరుగుచున్నదని ఎవరికీ అర్థము కావడము లేదు. అది భూతముల పని అని ఎవరికీ తెలియడము లేదు. వినాయకచవితి
సందర్భములో దేశము మొత్తము వేలాదిమంది చనిపోతున్నారు. భూతములనుండి వచ్చు అటువంటి ప్రమాదములు
లేకుండ పోవాలంటే పంచభూతములకు ఇష్టములేని వినాయకచవితిని మానివేసి, భూతములకు ఇష్టమున్న దేవుని
ఆరాధన అయిన భగవంతుని జన్మదినమును పండుగగా చేసుకోవడము మంచిది.
అన్నిటిని గమనించిన తర్వాత ఈ గ్రంథమును చదివిన ప్రతి ఒక్కరు, కృష్ణాష్టమిని చేయుటకు, అందరికంటే
ముందుగా మొదలు పెట్టండి. కృష్ణాష్టమిలో వినాయకచవితివలె ఖర్చు ఉండదు, ప్రమాదము ఉండదు. ప్రతి సంవత్సరము
ప్రతిమలను కొను అవసరము లేదు. ఇంటిలోని ప్రతిమను వీధిలో పెట్టి, పదకొండురోజులు ఉత్సవములు చేసి ఆ
ప్రతిమను తిరిగి ఇంటిలో పెట్టుకోవలెను. ఎట్టి పరిస్థితిలోను కృష్ణ ప్రతిమను నీటిలో నిమజ్జనము చేయడముగానీ,
ఎక్కడైనా పారవేయడము గానీ జరుగకూడదు. చివరిరోజు ఊరేగింపు తర్వాత కృష్ణ ప్రతిమను ఇంటిలోనే పెట్టుకోవాలి.
వినాయకచవితి సమయములో చందాల వసూళ్ళే ఎక్కువగా జరుగుచున్నవి. అందులో వినాయక భక్తికంటే డబ్బుల
వసూళు ముఖ్యపాత్ర పోషిస్తున్నవి. ఇవ్వడానికి స్థోమతలేని వారివద్దకూడ బలవంతముగా డబ్బులు వసూలు చేయడము
జరుగుచున్నది. కృష్ణాష్టమిలో అటువంటి విధానముండదు. వర్షానికి తడవని విధముగా పందిరిని ఏర్పాటు చేసి
అందులో కృష్ణప్రతిమ పెట్టి, కొబ్బరి కాయకొట్టి ఆరాధిస్తే చాలు. కృష్ణుని ముందర వినాయకుని పందిరిలో పెట్టినట్లు
సినిమా పాటలను పెట్టడముగానీ, కాలక్షేపమునకు జూదమాడడముగానీ మంచిది కాదు. కర్ణాటక ప్రాంతములో ప్రతి
వినాయక పందిరిలోను జూదమాడడము అలవాటుగా ఉన్నది. అటువంటి పనులు కృష్ణప్రతిమ ముందర చేయకూడదు.
కృష్ణపందిరిలో పదకొండురోజులు ప్రత్యేకముగా గీతా పఠనము జరుగునట్లు ఏర్పాటు చేయవలెను. అదియు గాయకులు
గానము చేసిన భగవద్గీత రికార్డు పెట్టకూడదు. శుచిశుభ్రతలతో ఎవరైనా గీతను ఉదయము, సాయంకాలము పఠించవలెను.
కృష్ణుని పందిరిలో వేదమంత్రములు నిషేధము. కృష్ణుని పూజలో వేదమంత్రము లను వాడకూడదు. మంత్రరహితమైన
సాధారణ పూజ చేయడము మంచిది. మత్తు పానీయములు త్రాగినవారు కృష్ణప్రతిమవున్న పరిసర ప్రాంతములోనికి
పోకూడదు. పోయినా అప్పుడు ఏమీకాదు, కానీ తర్వాత వాని ఆరోగ్యములో ఎంతో తేడావచ్చును. నయముగాని
56

Page 57
రోగములు తగులు కొనును. రోగములు కూడ భూతములే కావున, భూతములు కృష్ణున్ని అనగా భగవంతున్ని కించపరచిన
వానిని వదలవు. ఇప్పటికే భగవంతున్ని వదలి ఇతర దేవతలను ఆరాధించువారిని ప్రమాదములలో చిక్కుకొనునట్లు
గానీ, ఆరోగ్యములో అనేక సమస్యలు వచ్చునట్లుగానీ భూతములు చేయుచున్నవి. అందువలన వారి కోపమునకు
గురికాకుండ అన్యదేవతలను వదిలి కృష్ణాష్టమిని చేసిన వారికి దేవుని పాలనలో పాత్రధారులైన భూతములు సహకరించును.
భగవంతుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకొంటే, శరీరములో రోగములుగా వున్న భూతములు కూడ అటువంటి వారిని
గౌరవించి తమ రోగములను వానికి లేకుండాచేయును. అంతేకాక నేడు జరుగు ప్రకృతి వైపరీత్యములు చిన్నదాని
నుండి పెద్దదానివరకు అన్నియు దేవుని పాలకులైన భూతముల వలననే జరుగుచున్నవి. కృష్ణాష్టమిని భక్తితో చేయుట
వలన ఆ ప్రాంతములో ప్రకృతి (భూతముల) వైపరీత్యములు తగ్గిపోవును. వర్షము కూడ భూతముల వలననే వచ్చుచున్నది.
అందువలన భగవంతుని భక్తి కల్గియున్న ప్రాంతములో వర్షములు సక్రమముగా కురియును. ఇదంతయు కవిత్వము
కాదు, నగ్నసత్యము. భూతములంటే ఏమిటో, దేవుని పాలన అంటే ఏమిటో, ఎవరికీ తెలియదన్నాము కదా! ఆ
విషయములు తెలియాలంటే మేము రచించిన "దయ్యాల భూతాల యదార్థసంఘటనలు" అను గ్రంథము చదివితే
దేవుని పాలన అంటే ఏమిటో, భూతములు అంటే ఏమిటో తెలియును.
మీరు తెలివితక్కువ వారు మాత్రము కాదు. కానీ హేతుబద్దముగా ఆలోచించని దానివలన తెలివి తక్కువ వారు
ప్రవర్తించినట్లు ప్రవర్తించు చున్నారు. అదెలా అనగా! కృష్ణునికి చరిత్రవుంది, కృష్ణుడు మనలాగే పుట్టాడు, ఆయన
పుట్టిన తేదీవుంది. ఆయన చనిపోయిన సంవత్సరమూ ఉంది. కానీ విఘ్నేశ్వరుడు పుట్టిందే లేదు, ఆయన చరిత్రే లేదు.
కేవలము పురాణాలలో కల్పించబడ్డాడు. మాయచే కల్పించపబడి అసలైన భగవంతుని గా పూజింపబడుచున్నాడు.
లేడా? అని ఎవరూ యోచించక గ్రుడ్డిగా ప్రవర్తించడము వలన, నాస్తికవాదులు
హేతుబద్ధతలేని వినాయకున్ని లేడనడమేకాక, శాస్త్రములను తెలిపిన దేవున్నే లేడంటున్నారు. వ్యాసుడు అజ్ఞాన దశలోనున్న
వయస్సులో పురాణములు వ్రాయడము, అందులో వినాయక పాత్రను వ్రాయడము జరిగినది. పురాణములన్నియు
కాలక్షేపమునకు వ్రాయబడినవే తప్ప, కర్మక్షేపమునకు కాదు. వినాయకుని జీవితమును గురించి ఏమాత్రము తెలియని
మనుషులు వినాయకుని ఉత్సవములు చేయడములో ముందున్నారు. కృష్ణుని జీవితము తెలిసినా, కృష్ణుడు మానవుల
జీవితమునకు సంబంధించిన మరియు మనిషి కర్మలనుండి బయటపడు జ్ఞానమును చెప్పినా, కృష్ణాష్టమి చేయనివారు,
వినాయకుని జీవితమేమిటో తెలియకున్నా మరియు వినాయకుడు మనిషికి అవసరమైన ఏ జ్ఞానమును చెప్పకున్నా,
వినాయకచవితిని చేయుచున్నారు. నేను మిమ్ములను హిందూమతమును వదలి వేరే మతములోనికి రమ్మని చెప్పడము
లేదు. హిందూ (ఇందూ) పథములోని ఔన్నత్యమును తెలుసుకొని, ఇందూధర్మములను తెలిపిన కృష్ణున్ని భగవంతునిగా
గుర్తించి, ప్రతి సంవత్సరము కృష్ణాష్టమిని చేయమని, అట్లు చేయడము వలన మీ కర్మలు పోవునని తెలుపుచున్నాము.
వాస్తవానికి వినాయకుడు ఉన్నాడా లేడా? అని ఎవరూ యోచించక గ్రుడ్డిగా ప్ర
కృష్ణున్ని భగవంతునిగా గుర్తించక పోయిన కారణము వలన ఆయనను అశ్రద్ధ చేశాము. అంతేకాక కృష్ణున్ని
శృంగారపురుషునిగా కవులందరు వ్రాయడము వలన, కృష్ణున్ని చిల్లర మనిషిగా లెక్కించు కొన్నాము. భాగవతపురాణములో
కృష్ణుడు మధురకు పోయి కంసున్ని చంపకముందే గోపికలతో తిరిగే వాడని, వారితో శృంగారములో పాల్గొనెడి వాడని,
స్వయాన పోతన కవియే తెలుగులో వ్రాశాడు. సంస్కృతములో వ్యాసుడు కొంత విడ్డూరముగా వ్రాస్తే, దానిని తెలుగులోనికి
అనువదించిన పోతన ఇంకా కల్పితము చేసి మరీ విడ్డూరముగా వ్రాశాడు. కృష్ణుడు మధురకు పోయినది, కంసున్ని
57

Page 58
చంపినది ఆయనకు పదకొండు సంవత్సరము ల వయస్సులో జరిగినది. పదకొండు సంవత్సరములకే ఏ మనిషైనా
స్త్రీలతో సంయోగము చేస్తాడా? శృంగారములో పాల్గొంటాడా? ఈ మాటలు విడ్డూరము కాదా! ఆ విధముగా కృష్ణున్ని
తప్పుగా వ్రాయడము వలన, దాని ఆధారముతో మనుషులలో మాయ గాఢంగా పనిచేసి, కృష్ణున్ని అల్లరి మనిషిగా
లెక్కించుకొనునట్లు చేసింది. అందువలన కృష్ణుని విషయము చాలామంది ఆలోచించలేక పోయారు. 90 ఏళ్ళవయస్సులో
కృష్ణుడు భగవద్గీతను చెప్పిన తర్వాత, పురాణములను వ్రాసిన వ్యాసుడు తన తప్పును తెలుసుకొని, పురాణములకు
వ్యతిరేఖమైన భగవద్గీతను సంస్కృతములో శ్లోకముల రూపముగా వ్రాశాడు. అంతటి వ్యాసుడే తన తప్పును తాను
తెలుసుకోగలిగి తన శ్లోకములలో కృష్ణుడు చెప్పిన ధర్మములను తెలియబరిచాడు. వేదపఠనము, తపస్సు, యజ్ఞములు
ధర్మములుకావని అధర్మములని తాను వ్రాసిన శ్లోకములలోనే చెప్పాడు. అంతపెద్ద కార్యములే అధర్మములైనపుడు,
మనము చేయు వినాయక చవితి కూడ అధర్మమే అగును. అందువలన ఇప్పటినుండి వాస్తవ విషయమును తెలుసుకొని,
విశ్వవ్యాపి, సృష్టికర్త అయిన దేవుడు, భగవంతుడై కృష్ణునిగా వచ్చాడని, దేవుడే భగవంతునిగా గీతాజ్ఞానము చెప్పాడని,
అదియే భగవద్గీతయని తెలిసి కృష్ణున్ని ఆరాధించి దేవునికి దగ్గరగుటకు ప్రయత్నిద్దాము. దేవుని దగ్గరకు చేరాలంటే
ఆయన చిరునామ(అడ్రస్) ఏమిటో మనకు తెలియదు. ఆ చిరునామాను చెప్పువాడు ఎవడో వాడే భగవంతుడు, ఆ
భగవంతుడే కృష్ణుడు. అందువలన కృష్ణుడు శరీరముతో మన మధ్యన ఉన్నపుడు ఆయన భగవంతుడైన దేవుడని, అట్లే
ఆయన మన మధ్య శరీరముతో లేనపుడు దేవుడైన భగవంతుడని చెప్పవచ్చును. అర్థము కాలేదేమో మరొకమారు
శ్రద్ధగా వినండి. కృష్ణుడు భూమిమీద ఉన్న ద్వాపరయుగములో భగవంతుడైన దేవుడు అనియు, కృష్ణుడు భూమిమీద
లేని కలియుగములో దేవుడైన భగవంతుడనియు చెప్పవచ్చును. ఇంతవరకు చాలామంది స్వామీజీలు, బోధకులు
దేవునికి, భగవంతునికి వ్యత్యాసము లేకుండా చెప్పివున్నారు. ఇప్పుడు అట్లు కాకుండ ఎవరు దేవుడో, ఎవరు భగవంతుడో
గుర్తించి చెప్పుకోవలెను.
ఇంతవరకు కృష్ణుని మీద మనకున్న అపోహలన్ని తొలగించివేసి భగవంతుడైన కృష్ణున్ని తెలుసుకొందాము.
ఇంతవరకు భగవంతుడు చెప్పిన జ్ఞానమును తెలియని మనము ఆయన తెలిపిన సారాంశమును గురించి తెలుసుకొందాము.
కృష్ణుని మీద భక్తిగల గోపి, గోపికలు ఆనాడే కాదు, ఈనాడు కూడ ఉన్నారని నిరూపిద్దాము. కృష్ణుని మీద భక్తి
భావమును పెంచుకొని అపార్థ భావమును లేకుండ చేసుకొందాము. భూమిమీద కృష్ణుడు ఒక్కడే భగవంతుడని
ఇతరులకు తెలియజేద్దాము. ఆ నేపధ్యములోనే వినాయక చవితిని వదలి, కృష్ణాష్టమిని చేద్దాము. మనము చేయడమే
కాక అందరిచేత చెప్పి చేయిద్దాము. హిందూత్వము మతముకాదు పథము (దారి) అని తెలియజేద్దాము. భూమిమీద
ఏ మతమువాడైనా ఈ పథములోనికి రావలసిందేనని తెలియపరుస్తాము. మీ మతములో ఏ దేవుడున్నాడో ఆ దేవుడే ఈ
భగవంతుడని అర్థమగునట్లు చేస్తాము. ఇతరులను మార్చాలంటే ముందు మనము మారాలి. మనము మారితే మన
దారినే ఇతరులు అనుసరిస్తారు. కావున మొదట మనము మారుటకు కృష్ణాష్టమితోనే మొదలు పెడదాము.
కృష్ణుడు యాదవుడా, మాధవుడా?
కృష్ణుని తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి. తండ్రి పేరులో రెండు పదములు తల్లి పేరులో రెండు పదములు
గలవు. ఇద్దరి పేర్లలోను మొదటి పదములను చూస్తే తండ్రి పేరులో 'వసు' అను పదము, తల్లి పేరులో 'దేవకీ' అను
పదములు గలవు. అలాగే చివరి పదములను చూస్తే తండ్రి పేరులో 'దేవుడు', తల్లి పేరులో 'దేవి' కలదు. దేవుడు
58

Page 59
అనగా ఆధ్యాత్మిక రీత్యా పరమాత్మ అనియు, దేవి అనగా ప్రకృతి అనియు అర్థము కలదు. దీనినిబట్టి చూస్తే కృష్ణునికి
శరీరము యొక్క తల్లితండ్రులు కూడ ప్రకృతి పరమాత్మలను అర్థముగల పేర్లతోనే ఉన్నారని తెలియుచున్నది. ఇవి
కృష్ణుని బాహ్య శరీరము యొక్క బాహ్య తల్లితండ్రుల యొక్క ప్రత్యేకమైన పేర్లు. కృష్ణుని తండ్రి వసుదేవుడు యదువంశము
వాడు. తల్లి దేవకీదేవి భోజ వంశములో పుట్టినది. వసుదేవుడు ఆనాడు గల సూర్య, చంద్ర వంశములను రెండు
తెగలలో చంద్రవంశ తెగకు చెందిన క్షత్రియుడు. చంద్రవంశ క్షత్రియులలో వసుదేవునిది యదువంశము. వసుదేవునికి
గల ఇద్దరు భార్యలలో పెద్ద భార్య పేరు రోహిణి, రెండవ భార్య పేరు దేవకీదేవి. పెద్ద భార్య రోహిణికి పుట్టినవాడు
బలరాముడు. రెండవ భార్యకు పుట్టినవాడు కృష్ణుడు. కృష్ణుడు పుట్టిన తర్వాత గంటకే గోకులములోని నందగావ్యందు
నందుని ఇంటిలోనికి వసుదేవుని ద్వారా పోయాడు. నందుడు ఆ ఊరిలో పెద్దమనిషి మరియు పాలెగాడు. కావున ఆ
ఊరికి నందగావ్ అను పేరు ఉండెడిది. ఒక రాజ్యమునకు అధిపతి అయిన వానిని చక్రవర్తి అని, అతని క్రింద కొంత
ఏరియాలో జిల్లావారిగా పనిచేయు అధిపతులను సామంత రాజులని, ఒక ఊరికి మాత్రము పెద్దగ ఉండు అధిపతిని
పాలెగాడని పూర్వము అనెడివారు. ఆ లెక్క ప్రకారము కంసుడనే రాజు క్రింద పాలెగాడుగా నందుడు ఉండెడి వాడు.
నందుడు గొల్ల కులమునకు చెందినవాడు. వసుదేవుడు క్షత్రియుల కులమునకు చెందినవాడు. కంసుని చెల్లెలు దేవకీదేవి.
కావున కంసుడు కృష్ణునికి మేనమామ అగును. వసుదేవుడు కన్నతండ్రికాగ, నందుడు కృష్ణున్ని పెంచిన తండ్రి అగును.
ఆ
కృష్ణుడు పుట్టకముందు యాదవ్ అను పేరు ఎక్కడాలేదు. కృష్ణుడు మధురను విడచి ద్వారకకు చేరిన తర్వాత,
మొట్టమొదట భీష్ముడు కృష్ణున్ని యాదవా అని పిలిచాడు. కృష్ణుడు రుక్మిణిని 32 సంవత్సరముల వయస్సులో పెళ్ళి
చేసుకొన్నపుడు ఒక సందర్భములో కృష్ణుని గురించి భీష్ముడన్న మాట "కృష్ణుడు సామాన్యుడు కాదు, ఆయన యాదవుడు”
అన్నాడు. కృష్ణుని జీవితములో కృష్ణున్ని బాగా అర్థము చేసుకొన్న వ్యక్తి భీష్ముడు ఒక్కడే. అందువలన భీష్ముడు
మొదటినుండి కృష్ణున్ని ప్రత్యేకముగా చూచెడివాడు. కృష్ణుడు సాక్షాత్తు దేవుని అంశ అయిన భగవంతుడని, ఆ కాలములో
భీష్ముడు తప్ప ఎవరూ గ్రహించలేదు. అలా తెలిసినవాడు భీష్ముడు, కావున ఆయన మరణములో తనకు మోక్షమును
ఇమ్మని నేరుగా కృష్ణున్ని అడిగాడు. అలా అడుగుట వలన మోక్షమునకు అధిపతి దేవుడనీ, ఆ దేవుడే ఈ భగవంతుడని
భీష్ముడు గుర్తించినట్లు మనకు అర్థమగుచున్నది. భీష్ముడు కృష్ణున్ని గుర్తించాడు. కనుక కృష్ణున్ని యాదవా అని
సంబోధించాడు. ఆ విధముగా “యాదవ” అను పదము పుట్టినదని తెలియుచున్నది.
కృష్ణునితో యాదవ అను శబ్దము భూమిమీదకు వచ్చినది. కృష్ణుడు గొల్లవాడలలో తాను కూడ గొల్లకులస్థునిగా
తిరిగిన దానివలన, కృష్ణుడు గొల్ల కులమునకు చెందినవాడేనని అందరూ అనుకోవడము జరిగినది. ఉత్తరదేశములోని
గొల్లవారందరు తమ పేరు చివర 'యాదవ్' అను పదమును తగిలించుకొన్నారు. 30 లేక 40 సంవత్సరముల
క్రిందట వరకు ఆంధ్రప్రదేశ్లోని గొల్ల కులస్థులందరు తాము గొల్లవారమని తమ కులమును గురించి చెప్పుకొనెడివారు.
ఈ మధ్య 30 సంవత్సరములనుండి మేము యాదవులమని, తమను గొల్లవారని అనకూడదని అంటున్నారు. ఇప్పటికీ
మారుమూల పల్లెలలో యాదవ అను పేరు తెలియని గొల్లవారు తమ కులమును గురించి చెప్పునపుడు మేము
గొల్లవారమని చెప్పుచున్నారు. కృష్ణుడు గొల్లవాడలలో చిన్న తనమున తిరిగాడని, గొల్లవారందరు ఆయనను
గౌరవించెడివారనీ, గొల్ల వృద్దులు కృష్ణుని గురించి గొప్పగా చెప్పుకొనెడి వారని భారతములోను, భాగవతములోను
వ్రాశారు. దీనినంతటిని గమనిస్తే గొల్ల అనునది ఒక కులమని తెలియుచున్నది. నేడు గొల్ల కులస్థులను గొల్లవారు
అంటే అదేదో తక్కువ చేసి మాట్లాడినట్లు వారు బాధపడు చున్నారు. మమ్ములను గొల్లవారని కించపరుస్తున్నారని,
59

Page 60
మేము గొల్ల వారము కాదు, యాదవులమని అంటున్నారు. వాస్తవానికి దేవుడు కులములను ఏర్పరచలేదు, మనుషులు
పెట్టుకొన్నవే కులములు. భగవద్గీతా జ్ఞానము ప్రకారము మనుషులను నాలుగు రకములుగా విభజించవచ్చును
1) తామసులు 2) రాజసులు 3) సాత్వికులు 4) యోగులు అను నాలుగు రకములుగా చెప్పవచ్చును. దీనినిబట్టి
కులములు దేవుని లెక్కలో లేవని, మనుషులు కొందరు "చాతుర్వర్ణము" అని భగవంతుడు గీతలో చెప్పిన వాక్యమును
వక్రీకరించి తప్పు భావములో 1) బ్రాహ్మణులు 2) వైశ్యులు 3) క్షత్రియులు 4) శూద్రులు అని చెప్పారు. నాల్గవ రకము
శూద్రులలో చిన్న చిన్న కులములన్నిటిని కలిపి వేశారు. చేయు పనినిబట్టి వారందరిని ఫలానా వర్గమువారని పని
నిమిత్తము చెప్పిన పేరు తప్ప అది కులము అనుకోవడము పొరపాటు. ఇక్కడ కూడ గొర్లు, గోవులను కాపాడువారిని
(కాయువారు) గొల్లవారనడము జరుగుచున్నది తప్ప వేరుకాదు. ఇక్కడ కులము అను పేరు ఒక వర్గమునకు వచ్చినది
కావున దానిని గురించి తెలుసుకొందాము. ఒక పనిని చేయువారిని ఒక గుంపుగా లెక్కించి ఆ గుంపునకు గుర్తుగా
ఒక పేరు పెట్టడము జరిగినది. పూర్వము అలా ఫలానా పని చేయువారు అని గుర్తింపుకు పెట్టుకొన్న పేరును
కాలక్రమమున కులము అనుకొనుట జరుగుచున్నది. అంతేకానీ కుల వ్యవస్థను ఏ దేవుడూ సృష్టించలేదు.
ఇక్కడ ఒక వర్గము వారిని గొల్లవారనీ, గొల్లవారందరు యాదవులనీ అనడము నేడు జరుగుచున్నది. ఇపుడు
గొల్ల, యాదవ అను పదములను విశధీకరించుకొని చూడవలెను. కాపాడుట అను పదమునుండి పుట్టినది కాయుట
అను పదము. గొర్లను కాయువాడిని లేక గొర్లను కాపాడువానిని గొర్లకాపరి అంటాము. అటువంటి గొర్లకాపరినే
“గొల్లవాడు” అని అనడము జరుగుచున్నది. ద్వాపరయుగములో సాక్షాత్తు భగవంతుడే గొల్లకులములో గొల్లవానిగా
కనిపించాడు. సాక్షాత్తు భగవంతుడే ఎన్నుకొని వచ్చిన కులము మిగతా అన్ని కులములకంటే ఉత్తమమైనదిగానే
చెప్పవచ్చును. అంతేకాక జ్ఞానవిధానములో ఏ కులమునకు లేని ప్రత్యేకత గొల్లకులమునకు ఉన్నది. ఆ ప్రత్యేకత
గొల్లవారికి కూడ తెలియదు. అందువలన తమను గొల్లవారని అనవద్దండి. యాదవులని అనండి అని చెప్పుచున్నారు.
సరే అట్లే యాదవులని అనినా యాదవులంటే వివరము ఏమిటి అని కూడ తెలియదు. అటు గొల్లవారనుటకు గానీ,
ఇటు యాదవులనుటకుగానీ అర్థము తెలియని యాదవులు లేక గొల్లవారు ఉన్నారని తెలియుచున్నది. వారి పేరుకు
అర్థము వారికే తెలియక పోవడానికి కారణం ఒక్క దైవజ్ఞానము లేక పోవడమేనని తెలియుచున్నది. యాదవులే కాదు
అన్ని కులముల వారికి దైవజ్ఞానము తెలియకపోవడము వలన కులవ్యవస్థలో ఒకరికొకరు చిన్నపెద్ద అను కొంటున్నారు.
కానీ వాస్తవానికి దేవుడు కులముల వ్యవస్థను ఏర్పరచలేదు. మనుషులు ఏర్పరచుకొన్నవే కులములని చెప్పుకొనినా
అందులో గొల్లకులము ఒకటి. ఇటువంటి కులములు భూమిమీద లెక్కలేనన్ని ఉన్నాయి. ఎన్నో కులములలో నాది
గొల్ల కులము అని తల ఎత్తి చెప్పుకొను ప్రత్యేకత ఆ కులములో ఉండగా, మమ్ములను గొల్లవారనడము తక్కువచేసి
మాట్లాడినట్లు అని ఆ కులస్థులు చెప్పు కోవడము చూస్తే, ఆ కులములో ఉండినా, ఆ కులము యొక్క ప్రత్యేకత వారికి
తెలియకుండ పోయినదని అర్థమగుచున్నది. కావున గొల్ల కులమును గురించి కొంత వివరించుకొందాము.
అన్ని జంతువులవలె చాకచక్యము లేనివి గొర్రెలు, తర్వాత ఇది చేయాలని నిర్ణయించుకొను చురుకుతనము
గొర్రెలకు లేదు. ముందు గొర్రె ఎటు పోతే వెనుకల గొర్రె దానిని చూచి అది పోయినట్లు పోవును. కానీ దానివెంట
పోవచ్చునా, పోకూడదా అని యోచించుశక్తి దానికుండదు. బయటి ప్రపంచములో కూడ ఎవడైనా తెలివి తక్కువ
వారుంటే, వానిని గొర్రెతో సమానముగా పోల్చి చెప్పుచుందురు. గొర్రెలకు స్వయముగా ఆలోచించు శక్తి ఉండదు.
ముందున్న ఒక గొర్రె బావిలోనికి దూకితే దానివెనకున్న గొర్రెలన్ని బావిలోనికి దూకును. ముందు గొర్రె తెలియక
60

Page 61
దూకింది, అలా దూకితే ప్రమాదము అని వెనకున్నవి ఆలోచించవు. అందువలన గొర్రెలకు తప్పనిసరిగా కాపరి
అవసరము. గొర్రెలను సక్రమముగా నడిపించువానిని గొర్రెలకాపరి అంటారు. గొర్రెల కాపరి బాగా తెలివైనవాడని,
వాటికి ప్రమాదము జరుగకుండ ఎలా కాపాడవలెనో బాగా తెలిసినవాడని అందరికి తెలియును. రాత్రిపూట నక్కలు,
తోడేళ్ళ నుండి, పగటిపూట మిగతా ప్రమాదములనుండి కాపాడు వానిని గొర్రెల కాపరి అంటాము. గొర్రెల కాపరి
పనిని చేయువారందరిని 'గొల్లవారు' అని అనెడివారు. కాలక్రమమున ఆ పదము 'గొల్లవారుగా' మారిపోయినది. ఈ
గొల్లకులమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునకు సంబంధమున్నట్లు దేశము లోని ఏ కులమునకు లేదు. అందువలన
దేవదేవుడైన పరమాత్మ భగవంతునిగా భూమిమీదకు వచ్చినపుడు ప్రత్యేకించి గొల్లకులమునే ఎంచుకొని, ఆ కులములోనే
పెరిగి తానుకూడ గొల్లవాడనిపించుకొన్నాడు. కృష్ణుడు పుట్టినది చంద్రవంశ క్షత్రియులైన యదువంశమునకు చెందిన
వసుదేవునికి పుట్టినవాడైనప్పటికి, పుట్టిన తర్వాత గంటకే గోకుల వంశమునకు చెందిన నందునికి పుత్రునిగా నందగావ్కు
వచ్చాడు. అక్కడి గొల్ల బాలురతో కలిసిమెలిసి తిరిగి, తానుకూడ గొల్ల కులమునకు చెందిన వానిగా కనిపించాడు.
భగవంతుడైన కృష్ణుడు అలా గొల్లవానిగా కనిపించడ మెందుకు అని ఆలోచిస్తే, అలా ఆయన కనిపించుటకు
ఆధ్యాత్మికమునకు కొంత సంబంధముందని తెలియుచున్నది. అదెలా అనగా!
జ్ఞానములో ప్రపంచ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము అని రెండు రకముల జ్ఞానములుగలవని ఇంతకుముందే
చాలామార్లు చెప్పాము. ప్రపంచ జ్ఞానములో చాలా తెలివి తక్కువవి, చాలా అవివేకముగా, అనాలోచితముగా ప్రవర్తించునవి
గొర్రెలని, వాటిని తెలివి తక్కువకు గుర్తింపుగా లేక నమూనాగా చెప్పుకొన్నాము. అవి మూఢముగా ప్రవర్తించు నని,
వాటికి ఒక కాపరి అవసరము అని కూడ చెప్పుకొన్నాము. ప్రపంచ జ్ఞానములో పూర్తి మూఢముగా ప్రవర్తించునవి
గొర్రెలుకాగ, పరమాత్మ జ్ఞానములో పూర్తి మూఢముగా, అజ్ఞానముగా, అనాలోచితముగా, అవివేకముగా ప్రవర్తించువాడు
మానవుడు. ప్రపంచ జ్ఞానములో ఒక గొర్రె ఎటుపోతే అటు, యోచించకుండ అన్ని గొర్రెలు దానివెంట పోవునట్లు,
మనిషి కూడ పరమాత్మ జ్ఞానములో ఏమాత్రము యోచించకుండ గొర్రెలవలె ప్రవర్తించుచున్నాడు. దేవుడు కోడి
గ్రుడ్డుమాదిరి ఉన్నాడని ఒకరు చెప్పితే, దానిని విన్నవాడు ఏమాత్రము యోచించకుండ, వాడు కూడ దేవుడు గ్రుడ్డు
మాదిరే ఉన్నాడని చెప్పుటకు మొదలు పెట్టును. తనకంటే ఆధ్యాత్మికములో ముందున్నవారు అంటే గురువులుగా,
స్వాములుగా ఉన్నవారు ఎవరైనా తన ప్రత్యేకతను చాటుకొనే దానికి, తనకు తెలియకున్నా తెలిసినట్లు దేవుడు
దోమమాదిరి ఉన్నడనినా, గొర్రెలవలె దానినే అనుసరించువారు గలరు. నేను ఏమి చెప్పినా నా మాటనే వినగలరని
కొందరు వారి విధానమును చెప్పిగా వారి వెంట పోవువారు, దానినే గ్రుడ్డిగ నమ్మి ఒక సమాజముగ ఏర్పడి ప్రచారము
చేయువారు గలరు. అందువలన నేడు ఆధ్యాత్మికము అను పేరుతో ఎన్నో సమాజములు ఏర్పడినవి. తమకంటే
ముందున్న గొర్రెను అనుసరించి, అన్ని గొర్రెలు ప్రమాదములో చిక్కుకొన్నట్లు, తమకంటే తెలిసినవారని కొందరిని
నమ్మి, వారిని అనుసరించి మనిషికూడ అజ్ఞాన గమ్యమునే చేరుచున్నాడు. తమకంటే ముందున్న వాటిని, వెనుకున్న
వాటిని అన్నిటిని కాపాడుచు నడిపించు కాపరిని అనుసరించిన గొర్రెలు ఎట్లయితే ప్రమాదములో చిక్కుకోవో, అలాగే
ప్రపంచములోని సామన్య మనిషికీ, వానికంటే కొంత ఎక్కువ తెలుసుననుకొను స్వామీజీలకు అందరికీ కాపరి అయిన
భగవంతుడు ఒకడున్నాడనీ, ఆయన ఒక్కడే మనుషులందరికి గురువనీ, ఆ గురువు సూచించినదే అసలైన మార్గమనీ,
తెలిసి ప్రవర్తించు వారు జ్ఞానగమ్యమును చేరుచున్నారు. గొర్రెలకు కాపరి ఉన్నట్లు, మనుషులకు కాపరి భగవంతుడని,
భగవంతుడొక్కడే గురువని తెలియక ఒకడు శ్వాసమీద ధ్యాస అని, మరొకడు ముక్కుకొన మీద (నాసికాగ్రము మీద)
ధ్యాస అని, మరొకడు హృదయములోనని, ఇంకొకడు శిరస్సులో సహస్రారమున అని, ఒకడు బయట అని, ఒకడు
61

Page 62
లోపల అని చెప్పుచూ పోవుచుంటే ఇంతమందిలో ఏది సత్యమని యోచించని ప్రజలు, ఎవరికి నచ్చిన వారిని వారు
అనుసరించుచు, నాది ఫలానా సమాజమని కొందరు చెప్పితే, నాది ఇంకొక సమాజమని చెప్పువారు కొందరున్నారు.
నా సమాజములోని బోధ ఎంతమాత్రము సత్యమని, నాకు బోధించువాడు గురువేనా అని యోచించని వాడు చివరకు
అజ్ఞాన జన్మలకే పోవుచున్నాడని తెలియవలెను.
ముందున్న గొర్రె వెనుకున్న గొర్రెలను ఎలా సక్రమముగా నడిపించ లేదో, అలాగే ఆధ్యాత్మిక దారిలో మనకంటే
వెనకున్న
గొర్రెలను అన్నిటిని కాపరి ఒక్కడే సక్రమముగా నడిపించునట్లు ఆధ్యాత్మిక దారిలో ముందున్న స్వామిని, వెనుకున్న
అనుచరులను (వెంట పోవువారిని) అందరిని గురువు ఒక్కడే సక్రమముగా ఆధ్యాత్మిక దారిలో నడిపించును. గొర్రెలన్నిటికి
ముందున్నవాటికి, వెనుకున్నవాటికి కాపరి ఎలా అవసరమో, అలాగే ప్రపంచములో కొంత తెలిసి ముందున్న వారికి,
ఏమీ తెలియక వెనకున్న వారికి అందరికి గురువు అవసరము. గొర్రెలకు కాపరి అనగా గొల్లవాడు ఎట్లున్నాడో, అట్లే
మనుషులకు గురువు ఉన్నాడు. బయటి ప్రపంచములో గొల్లవాడిని ఆధ్యాత్మికములో గురువుగా పోల్చి చెప్పవచ్చును.
అందువలన ఒక మతప్రవక్త ఇలా “నేను గొర్రెలకాపరిని, నా స్వరము విని, నా గొర్రెలు నన్ను గుర్తించి, నన్ను
వెంబడించును” అని అన్నాడు. తనను ఒక గొల్లవానిగా పోల్చుకొన్నాడు కదా! ఒక మతానికే ప్రవక్తగా చెప్పబడు ఒక
పెద్దగురువు ఆ మాటను చెప్పితే, గొల్లవాడు అను పేరు గొప్పదికాక తక్కువెట్లగును? ప్రపంచములోని మనుషులకందరికి
గురువు ఒక్కడేనని, ఆయన కొన్ని వేల, లక్షల సంవత్సరములకు ఒకమారు భూమిమీదకు వచ్చునని, అలా వచ్చినవాడే
భగవంతుడని, భగవంతుడొక్కడే అందరికి గురువని, మా రచనలలోని “గురువు” అను గ్రంథములో ముందే
చెప్పియున్నాము. ఆ విధముగా వచ్చిన భగవంతుడే ద్వారపయుగములోని కృష్ణుడు. ఆయన ఒక్కడే అందరికి
గురువు. గొర్రెలకు దారి చూపించు వాడు కాపరి, మనుషులకు దారి చూపించువాడు గురువు. గొర్రెలకు దారిని
చూపించు కాపరిని గొల్లవాడు అనుచున్నాము. మనుషులకు దారిని చూపించువాడు కూడ మనుషులకు కాపరియగును.
నేను మీకు కాపరి అని తెలియునట్లు, భగవంతుడైన కృష్ణుడు గొల్లవారింట పెరిగి గొల్లవాడ నిపించుకొన్నాడు. ఈ లెక్క
ప్రకారము గొల్లవాడనినా, గురువు (భగవంతుడు) అనినా రెండు ఒకే సూత్రమును తెలియజేయుచున్నవి. దీనినిబట్టి
గొల్ల కులము అనునది అన్ని కులములకంటే విలువైనదని తెలియుచున్నది. ఇంతవరకు గొల్లకులము ఎంత ప్రాధాన్యత
కల్గియున్నదో, దాని అర్థమేమిటో అంతరార్థమేమిటో తెలుసుకొన్నాము. ఇక యాదవ అను దానిని గురించి
కొంత ముందున్నవాడు వెనుకున్న మనుషులను సక్రమముగా నడిపించలేడు. దారిలో ముందున్న .com
తెలుసుకొందాము.
యాదవ అనుపేరు కృష్ణునికంటే ముందులేదు. కృష్ణుని వయస్సు ముప్పై సంవత్సరములకు పైగా ఉన్నపుడు
మొదట భీష్ముడు కృష్ణున్ని “యాదవా” అని సంభోదించాడు. అప్పటినుండి యాదవ అను శబ్దము అమలులోనికి
వచ్చినది. కృష్ణుడు యాదవుడే కావున గొల్లకులములోని వారందరు తమపేరు చివర యాదవ్ అను పదమును
చేర్చుకోవడము జరుగుచున్నది. అలా చేర్చడము వలన యాదవ్ అంటూనే వారు ఫలానా కులమువారని అర్థమగుచున్నది.
దీనినిబట్టి గొల్లవారంటే యాదవులని, యాదవులంటే గొల్లవారని తెలియుచున్నది. దాదాపు ఐదు సంవత్సరముల
క్రితము గొల్లకుల సమాజములోని గిరి యాదవ్ అను వ్యక్తితో యాదవ్ అంటే ఏమి అర్థము అని అడిగాము. అప్పుడు
ఆయన “దాని విషయము ఏమాత్రము తెలియదని, అందరు పెట్టుకొన్నట్లు నేను యాదవ్ అని పెట్టుకోవడము జరిగినది.
కానీ అర్ధము ఏమిటో నాకు తెలియదు, నాకే కాదు బహుశ మా వారికి ఎవరికీ తెలియదనుకొంటాను” అన్నాడు.
62

Page 63
వాస్తవానికి ఆయన ఉన్నదున్నట్లు చెప్పాడు. ఇంకొక సందర్భములో అదే కులస్థున్ని యాదవ్ అని ఎందుకంటారని
అడిగాము. అపుడు ఆయన “యదువంశములో పుట్టినవారము కావున మాకు యాదవులని పేరు వచ్చినది” అన్నాడు
ఆ మాటను బట్టి మనము యోచిస్తే యదువంశములో పుట్టినవాడు కృష్ణుడు మాత్రమే అగును. ఆనాటి గొల్లవారిది
యదువంశము కానేకాదు, యదువంశమునకు గొల్లవారికి సంబంధములేదు. కావున ఆయన చెప్పిన సమాధానము
సరియైనది కాదని అర్థమైనది. వారికి తెలిసినా తెలియక పోయినా మనము మాత్రము ఇపుడు యాదన్ని గురించి
తెలుసుకొని తీరాలి. ఈ నేపధ్యములో భీష్ముడు కృష్ణున్ని ఏ ఉద్దేశముతో “యాదవ” అన్నాడో ఆయన భావమేమిటో
అక్కడికెళ్ళి చూస్తే ఈ విధముగా కలదు.
ణ
ఏ
'యాద్' అను శబ్దము నుండి 'యాదవ' అను పదము పుట్టినది. యాద్ అనగా జ్ఞప్తి (జ్ఞానము) అని అర్థము.
జ్ఞాపకము లేదా అని అనుటకు కొన్ని ప్రాంతములలో యాద్ లేదా అనుటకూడ కలదు. యాద్ అనునది సంస్కృత
పదము, హిందీలో కూడ అదే పదము కలదు. యాద్ అనగా జ్ఞాపకము, జ్ఞానము అను రెండు అర్థములలో భీష్ముడు
జ్ఞానము అను అర్థమును తీసుకొన్నాడు. కృష్ణుడు సంపూర్ణ జ్ఞానముకలవాడు అయిన దానివలన కృష్ణున్ని యాదవ అని
భీష్ముడు అన్నాడు. భీష్ముని భావములో కృష్ణుని మించిన జ్ఞానిలేడు, కావున కృష్ణున్ని యాదవ అన్నాడు. ఈ విధముగా
కృష్ణుడు సంపూర్ణ యాదవుడని మనము కూడ చెప్పవచ్చును. కృష్ణుడు ఇతరులకు ఎప్పుడు జ్ఞానము చెప్పకుండ
కాలమును గడుపుట వలన, ఆయనను అందరు సాధారణ మనిషిగానే లెక్కించారు తప్ప భగవంతునిగా ఏనాడు చూడలేదు.
అలా 90 సంవత్సరములు కృష్ణుని ఆయుస్సు గడచినపుడు, హస్తినలో (ఢిల్లీలో) పాండవులకు కౌరవులకు యుద్ధము
వచ్చినపుడు, ఆ యుద్ధము కూడ కురుక్షేత్రములో (పంజాబ్ లోని ఒక జిల్లా) జరిగినపుడు, తాను నివాసమున్న ద్వారకకు
దాదాపు వేయి కిలోమీటర్ల దూరములో అర్జునునికి ఒక్కనికే గీతను చెప్పాడు. భగవంతుడు చెప్పినది కావున గీత పేరు
“భగవద్గీత” అయినది. తన ఊరియందు, తన వారియందును కృష్ణుడు జ్ఞానమును చెప్పలేదు. ఎక్కడో వేయి కిలోమీటర్ల
దూరములో చెప్పబడిన భగవద్గీత కొంతకాలమునకు ద్వారక లోని గొల్ల కులము వారికి కూడ తెలిసినది. వ్యాసుడు
వ్రాసిన గీతను చూచిన తర్వాత ద్వారకలోని గొల్లకులములోని పెద్దలు గీతాజ్ఞానమును తెలుసుకొని కృష్ణుని యొక్క
గొప్పతనము గుర్తించారు. అలా తెలిసిన వయో వృద్ధులందరు కృష్ణునివద్దకు పోయి వారి సంతోషమును వ్యక్త పరిచారు.
వారిని చూచిన కృష్ణుడు ద్వారకలో నేను ఒక్కడినే యాదవుడను అనుకోవద్దండి మీరందరూ యాదవులే అన్నాడు.
అప్పటి నుండి ఆ జ్ఞానవృద్ధులనందరిని యాదవులని కృష్ణుడే పిలిచెడివాడు. ఆనాడు ద్వారకలో ఉన్నవారంతా
గొల్లకులము వారే, కావున ఆ దినములలో యాదవులని పిలిపించుకొన్న వారందరు గొల్లవారే అయిన దానివలన,
తర్వాత వచ్చినవారు యాదవ అనునది తమ కులమునకు సంబంధించిన దేమో అనుకొన్నారు. యాదవ అని అంటే
జ్ఞాని అని తెలియనివారందరు, తమ పెద్దలు యాదవులైనపుడు తాము కూడ యాదవులమే కదా! అని అనుకొన్నారు.
అప్పటినుండి ఉత్తర భారత దేశములో గొల్లవారు కొందరు యాదవ అను పదమును తమ పేరు చివర తగిలించుకొన్నారు.
తర్వాత కొంతకాలము గడువగా మిగిలిన గొల్లవారు కూడ యాదవ అని పేరు తగిలించుకొనుచు వచ్చారు. ఇలా
ఒకరిని చూచుకొని మరొకరు తమ పేరు చివర యాదవ పదమును తగిలించుకొన్నారు. చివరకు గొల్ల కులము
యాదవ కులముగా మారిపోయినది. అలా మారిపోయిన యాదవ పదము ఈ మధ్యకాలములో దక్షిణదేశములోనికి
కూడ ప్రాకినది. ఇక్కడి గొల్లవారు కూడ మేము యాదవులమని చెప్పుకొనుచున్నారు. ఒక పల్లెటూరిలో ఒక గొల్లకులస్థుని
కలిసి నిన్న మొన్నటి వరకు మీరు గొల్లవారిమని చెప్పుచుంటురి కదా! ఉన్నట్లుండి ఇప్పుడు యాదవులము అని
అంటున్నారే, ఏమి విషయము అని అడుగగా! "అప్పుడు గొల్లవారమే కాని ఇప్పుడు యాదవులము” అని అన్నాడు.
63

Page 64
మొదట కృష్ణున్ని భీష్ముడు యాదవ అని పిలువగా, తర్వాత కృష్ణుడు జ్ఞానులుగా మారిన గొల్లవృద్ధులను యాదవులు
అన్నాడు. యాదవ అను పదమునకు జ్ఞాని అని అర్థముగలదను ఉద్దేశముతో భీష్ముడు కృష్ణున్ని యాదవ అని
ఉద్భోదించాడు. తర్వాత అదే ఉద్దేశముతో కృష్ణుడు కొంతమందిని యాదవులని అన్నాడు. ఆ విధముగా ఉద్భవించిన
యాదవ అను పదము నేడు కులముగా మారిపోయినది. యాదవ అను పదమునకు అర్థము జ్ఞాని అయినపుడు, ఆ
పేరు పెట్టుకొన్నవారు ఆ పేరుకు సార్థకతను చేకూర్చుటకు, కొంతైనా దైవజ్ఞానమును తెలుసుకొంటే బాగుంటుంది.
కృష్ణుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకోవడము, యాదవ అను పేరు పెట్టు కొన్నవారు మొదట చేయవలసిన పని. నేడు
గొల్లవారందరు యాదవులని చెప్పుకోవడము సంతోషమే, అయితే వారందరు కృష్ణుని గీతను తెలుసు కోవడము కూడ
చేయాలి. అలా గీతాజ్ఞానమును తెలుసు కోలేనివారు కృష్ణునికి గౌరవమివ్వని వారవుతారు. అటువంటివారు యాదవులని
చెప్పుకొనినా నిజమైన యాదవులు కాదని తెలియాలి. కృష్ణుని వారసులుగా గొల్లవారు నిజమైన యాదవులుగా
మారాలంటే, కృష్ణుడు చెప్పిన జ్ఞానమును తెలియవలెను. అప్పుడే యాదవ పేరుకు సాఫల్యము ఏర్పడును. జ్ఞానము
లేని గొల్లవారు యాదవులు కారు. జ్ఞానమున్న ఏ కులమువాడైనా అర్థము ప్రకారము యాదవుడే అగును. అందువలన
కృష్ణుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకొని, అందరము యాదవులుగా మారేదానికి ప్రయత్నిద్దాము. కృష్ణుడు యాదవుడు
మరియు మాధవుడు అని కూడ చెప్పవచ్చును. మనము ప్రయత్నము చేసి భగవంతుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకొని
యాదవులుగా మారవచ్చును. కానీ ఈ జన్మలోగానీ మరి ఏ జన్మలోగానీ ప్రయత్నించినా కృష్ణునివలె మాధవునిగా
మారలేము. కృష్ణుడు యాదవుడు, మాధవుడు అయినపుడు, మనము కూడ యాదవునిగా మారగల్గినపుడు, మాధవునిగా
ఎందుకు మారలేము? అని ప్రశ్నరావచ్చును. దానికి సమాధానము దొరకాలంటే యాదవుడంటే అర్థమేమిటో తెలిసినట్లు
మాధవుడు అంటే అర్థము ఏమిటో తెలియాలి. అందువలన ఇపుడు మాధవుడు అంటే ఎవరు? కృష్ణుడు మాధవుడు
ఎలా అయ్యాడు? అను వివరమును తెలుసుకొందాము.
పరమాత్మ, ప్రకృతి అను రెండు శాశ్వతమైనవి. పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీ అని ముందే చెప్పుకొన్నాము.
భగవంతుడు పరమాత్మ అంశతో పుట్టినవాడు, కావున ఆయన పురుషుడే అగును. మిగతా జగతిలోని జీవులందరు
ప్రకృతి పురుషుల చేత పుట్టినా, వాని తలయందు పురుషత్వము ఒక భాగము, స్త్రీ తత్త్వము మూడు భాగములుండుట
వలన ప్రతి జీవరాసిని స్త్రీతత్త్వము గలదిగా చెప్పవచ్చును. ధరించిన శరీరము పురుషాకారముతో ఉండినా, లేక స్త్రీ
ఆకారముతో ఉండినా, ఆ శరీరములోని జీవున్ని మాత్రము స్త్రీగా జమకట్టవలసిందేనని, ఆధ్యాత్మిక అర్థముతో చెప్పవచ్చును.
ఆ లెక్కప్రకారము భూమిమీద ఉన్న జీవరాసులన్ని స్త్రీలుకాగ, భగవంతుడొక్కడే పురుషుడని చెప్పవచ్చును. మీరాబాయి
కూడ ఇదే సూత్రమును చెప్పినట్లు మనము చెప్పుకొన్నాము. ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము మరియు మీరాబాయి
చెప్పినట్లు, శరీరము ధరించిన వారిలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు. అందువలన ఆయనను “జగద్భర్త” అన్నారు.
అంతేకాక ఆయనను “జగత్ గురువు” అనికూడ అన్నారు. భూమిమీద భర్త ఒకడే ఉంటాడు, అలాగే గురువు ఒకడే
ఉంటాడు. అందరికి గురువుగానీ, భర్తగానీ భగవంతుడు ఒక్కడే అని తెలియాలి. ఇపుడు కొందరికి ఒక ప్రశ్నను
అడుగుటకు అవకాశము గలదు. అదేమనగా! “జ్ఞానమును తెలియజేయువాడు గురువు కదా! గురువు స్త్రీ శరీరములో
పుట్టవచ్చునా? అంటే భగవంతుడు పురుష శరీరములోనే పుట్టకుండ భగవతిగా స్త్రీ శరీరములో రాకూడదా?” అని
అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! పురుషుడైన భగవంతుడు స్త్రీ శరీరమును ధరించడు. స్త్రీ, పురుష శరీరములు
ప్రకృతి పురుషులకు గుర్తుగా ఉన్నపుడు పురుషుడైన భగవంతుడు పురుషుని శరీరముతోనే పుట్టును. కానీ స్త్రీ శరీరములో
పుట్టడు. జగద్భర్త అని పిలుపించుకొన్నవాడు స్త్రీ శరీరములో ఉండుట ధర్మవిరుద్ధమగును. గురువు లేక భగవంతుడు
64

Page 65
ఎప్పటికైనా పురుష శరీరమునే ధరించి తాను పురుషుడినని తెలియపరుచును. జగత్ కంతటికి భర్త అయినవాడు,
ప్రకృతికే పురుషుడైనవాడు, సూత్రము ప్రకారము పురుషశరీరమునే ధరించునని తెలియవలెను.
ఇపుడు అసలు విషయానికి వస్తాము. ధవుడు అనగా భర్త అని అర్థము. మాధవుడు అనగా మా అందరికి భర్త
అని అర్థము. మా, మేము బహువచనమును సూచిస్తున్నది. బృందావనములో గోపికలు అందరు కృష్ణున్ని మాధవుడు
అన్నారు. కానీ కృష్ణునికి పెళ్ళైన తర్వాత ఎనిమిది మంది భార్యలలో ఒక్క సత్యభామ మాత్రము కృష్ణున్ని నాధవుడు
అన్నదట. అందరు మా భర్త అని అనగా ఒక్క సత్యభామ మాత్రము నాభర్త అని అన్నది. భగవంతుడు జగతిలోని
అందరికి భర్త అని మీరాబాయి జగద్భర్త అని చెప్పింది. జగద్భర్త అయిన వారిని బహువచనములో మా భర్త అని
అనడములో తప్పులేదు. అందువలన కృష్ణున్ని మాధవ అని అన్నారు. కృష్ణుడు యాదవుడేకాక మాధవుడు అని కూడ
పేరుగాంచాడు. మాధవా అను పదము కృష్ణునికి మాత్రము సరిపోతుంది, కానీ బయట ప్రజలకు సరిపోదు. ఎందుకనగా
మనుషులందరు ప్రకృతివైపు ఉన్నవారే అనగా స్త్రీతత్త్వముగలవారే. కావున పురుషుడు అయినప్పటికి ఎవనినీ భర్త
అనుటకు వీలులేదు కదా! స్త్రీతత్త్వము గల ఎవ్వరూ ధవుడు (భర్త) కాలేరు. అయితే జ్ఞానమును తెలిసిన ఎవరైనా
యాదవుడు కావచ్చును. దీనినిబట్టి తెలియునదేమనగా! కృష్ణుడు ఒక్కడే మాధవుడు మిగతా ఎవరూ కాదు, కాలేరని
తెలియుచున్నది.
రాముడు కృష్ణుడు ఒక్కరేనా?
శ్రీరాముడు త్రేతాయుగములో దశరథునికి పుట్టినవాడు. శ్రీకృష్ణుడు ద్వాపరయుగములో పుట్టినవాడు.
త్రేతాయుగములో రాముని చరిత్ర గలదు. అలాగే ద్వాపరయుగములో కృష్ణుని చరిత్రయుగలదు. రెండు చరిత్రలను
గమనించి చూచితే, వీరిద్దరు ఒకరికొకరు భిన్నమైన చరిత్ర గలవారు. రాముడు ఏకపత్నిగలవాడు, కృష్ణుడు ఎనిమిదిమంది
భార్యలను గలవాడు. ఈ విధముగ ఇద్దరూ వేరువేరు భావములు గల వ్యక్తులని తెలియుచున్నది. ఏ ఒక్క ప్రపంచ
విషయములో గానీ, వారి భావములను ఒక్కటిగా చూపలేము. ఇకపోతే దైవజ్ఞాన విషయములో కృష్ణుడు బ్రహ్మవిద్య
అయిన గీతను బోధించాడు, రాముడు దైవజ్ఞానమును బోధించినట్లు ఎక్కడా కనిపించలేదు. కృష్ణుడు విలాసవంతమైన
జీవితమును అనుభవించాడు. రాముడు తన జీవితములో ఎక్కువ మానసిక బాధలను అనుభవించడమే కాక, అరణ్యవాసము
14 సంవత్సరములు ఏ సౌఖ్యములు లేని జీవితమును అడవిలో గడిపాడు. ఎక్కువ జీవితమును భార్యా వియోగముతోనే
గడిపాడు. ఇట్లు రాముని, కృష్ణుని జీవితములో ఎన్నో తేడాలు కనిపించినా, రాముడు కృష్ణుడు ఒక్కరేనా అనుటకు
కేవలము ఆధ్యాత్మిక విషయములనే ఆధారము చేసుకొని చూడవలెను. ఇక్కడ ఒక్క ఆధ్యాత్మిక విషయములనే చూడవలసిన
అవసరము ఏమనగా! కృష్ణున్ని భగవంతునిగా లెక్కించినపుడు, రామున్ని కూడ భగవంతునిగానే లెక్కించవలెనా
అన్నదే ప్రశ్న. ఒక్క దైవ ధర్మములను బట్టి కృష్ణున్ని భగవంతుడు అన్నాము. కావున రామున్ని కూడ దైవధర్మముల
ఆధారముతోనే చూడవలసిన అవసరమున్నది. కృష్ణున్ని భగవంతుడని ఏ సూత్రములతో చెప్పగలిగామో, ఆ సూత్రములతోనే
రామున్ని కూడ లెక్కించి చూడవలెను.
నేటి కాలములో కొందరు ఆధ్యాత్మికవాదులు రాముడు, కృష్ణుడు ఇద్దరు ఒక్కరే అను భావమును వ్యక్తపరిచారు.
అలా వ్యక్తపరిచిన వారిమీద ఉన్న అభిమానముతో, వారిని అనుసరించు కొందరు కూడ రామున్ని కృష్ణున్ని ఒక్కరే
అనుకొన్నారు. ఈ విధముగ కొందరు అనుకోవడము చూచి మిగత ప్రజానీకము కూడ అలాగే అనుకొన్నారు. కొంతకాలము
65

Page 66
గడువగా కృష్ణభక్తిని ప్రదర్శించు ఒక సంస్థ రాముడు కృష్ణుడు ఒక్కరేనని ప్రచారము చేసి, రాముని భక్తులందరిని తమ
సంస్థలో చేరునట్లు చేసినది. అంతేకాక "హరేక్రిష్ణ హరేక్రిష్ణ, క్రిష్ణ క్రిష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామ రామ
హరేహరే” అని ఒక మంత్రమును కూడ పాటగ తీర్చిదిద్దారు. అలా చేయడము వలన పండితులు, పామరులు అందరు
రాముడు, కృష్ణుడు ఇద్దరు ఒక్కటేనను భావములోనికి వచ్చారు. అంతేకాక కొన్ని చలన చిత్రములు కూడ త్రేతాయుగములో
పుట్టిన రాముడే ద్వాపర యుగములో పుట్టిన కృష్ణుడని చూపడము వలన, నేటికీ సర్వప్రజానీకము రాముడు కృష్ణుడు
ఇద్దరూ ఒక్కరేనను భావములో ఉండిపోయారు. కొందరు రాముని భక్తులు రామున్ని గొప్పగ తెలుపుటకు త్రేతాయుగములో
ఎప్పుడో చనిపోయిన ఆంజనేయున్ని చిరంజీవి అని వర్ణించి, ఆంజనేయుడు ద్వాపర యుగములోనున్న కృష్ణున్ని,
రామునిగా గుర్తించాడని, త్రేతాయుగము నాటి రాముడే ద్వాపరయుగములోని కృష్ణుడని ఆంజనేయుడే తెలిసి కృష్ణునికి
నమస్కరించాడని చెప్పడము వలన అంతవరకు నమ్మనివారు కూడ కృష్ణున్ని రాముడని, రామున్ని కృష్ణుడనీ తలవడము
జరుగుచున్నది.
రాముడు, కృష్ణుడు ఒక్కటికాదు అను సంశయము ఎవరికీ రాక పోయినా, ఇప్పుడు ఆ విషయమును అనేక
కోణములనుండి చూచి, చివరకు ఆధ్యాత్మిక కోణములో కూడ చూడవలసియున్నది. మొదట పుట్టుక విషయములో
చూస్తాము. దశరథుడు పుత్రకామేష్టి యాగము చేయుట వలన, యజ్ఞఫలము వలన రాముడు పుట్టాడు అని చెప్పుచుందురు.
యజ్ఞఫలము వలన పిల్లలు పుట్టారు అనడము యజ్ఞములకు విలువ చేకూర్చే పనే, కానీ యజ్ఞముల వలన పిల్లలు
పుట్టుదురనుట విడ్డూరము. యజ్ఞములు చేశామను మానసిక తృప్తితో ఉండగా, ఆ సంతోషమునకు వీర్యకణ చలనము
ఎక్కువై సంతానము కలిగియుండవచ్చును. అలా వీర్యకణమునకు పుట్టిన వాడు రాముడు కాగా కృష్ణుడు అలా
పుట్టలేదు. దశరథ, కౌసల్య దంపతులకు యజ్ఞసంతోషము సమయములో గర్భధారణ జరుగగా రాముడు పుట్టాడు.
కానీ వసుదేవ, దేవకీ దంపతులకు కారాగారమున దుఃఖముతోనున్న కాలములో గర్భధారణ జరుగకుండా పుట్టినవాడు
కృష్ణుడు. దశరథ పుత్రుడు రాముడు కానీ, వసుదేవ పుత్రుడు కృష్ణుడు కాడు. కృష్ణునికి ఏ మనిషీ తండ్రికాడు. దేవుని
చేత ఉద్భవించినవాడని, కావున దేవుని కుమారుడని కృష్ణున్ని చెప్పవచ్చును. దేవుని అంశ లేక శక్తి భూమి మీద
మనిషి ఆకారమును తీసుకొని పుట్టినపుడు దానిని భగవంతుని జన్మగా చెప్పవచ్చును. ఇక్కడ కృష్ణుని జన్మ దేవుని వలన
పుట్టినది, కావున కృష్ణున్ని భగవంతుడు అనుచున్నాము. కానీ రాముడు దశరథుని వలన పుట్టినవాడు, కనుక
రామున్ని మనిషిగా చెప్పవచ్చును, భగవంతునిగా చెప్పలేము.
దేవుని కుమారుడైన భగవంతుడు భూమిమీద అధర్మములు చెలరేగినపుడు పుట్టును. పుట్టిన భగవంతుడు
అధర్మములను లేకుండ చేయుటకు ధర్మములను బోధించును. అంతేకాక అధర్మవరులకు శత్రువుగా, ధర్మవరులకు
మిత్రునిగా మారిపోవును. కృష్ణుడు అధర్మములు తారాస్థాయికి చేరినపుడు పుట్టి, ధర్మముల రక్షణ నిమిత్తము పాటుపడినాడు.
అధర్మవరులకు శత్రువైనాడు. రాముడు అలా కాకుండ అధర్మములను కాపాడుటకు పుట్టాడు. ధర్మవరులకు శత్రువయ్యాడు.
కృష్ణుడు తనబోధలో యజ్ఞములు, వేదాధ్యయనములు, తపస్సులు, అధర్మములని తెలుపగ, రాముడు యజ్ఞములను
రక్షించుటకు, తపస్వికులను కాపాడుటకు కృషి చేశాడు. అధర్మములైన యజ్ఞములను నాశనము చేసి, అధర్మవరులైన
తపస్వికులను శిక్షించు రావణబ్రహ్మకు శత్రువయ్యాడు. కృష్ణుడు యజ్ఞ యాగాదులు పెచ్చుగా పెరిగి పోయిన కాలములో,
తపస్వికులు విరివిగా ఉన్న కాలములో, అధర్మములు పెరిగిపోయినవని తలచి, ధర్మ రక్షణ నిమిత్తము కృష్ణుడు
అవతరించాడు. వ్యాసుడు పదునెనిమిది పురాణములు వ్రాసిన సమయములో భగవంతుడైన కృష్ణుడు పుట్టాడు.
66

Page 67
పురాణములను వ్రాసిన వ్యాసుడు అంతకుముందే వేదములను వ్రాసి అధర్మములను రేకెత్తించాడని, అపుడు ధర్మములకు
పూర్తి ముప్పు కలిగిందని, భగవంతుడు కృష్ణునిగా పుట్టాడు. కృష్ణుడు చెప్పిన భగవద్గీతను అర్జునుని ద్వారా తెలుసుకొన్న
వ్యాసుడు తాను వేదములను, పురాణములను వ్రాసి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప్పడి, తర్వాత గీతను శ్లోకముల
రూపముతో వ్రాసాడు. గీతను వ్రాసిన తర్వాత వ్యాసుడు ధర్మవరుడైనాడు. గీతను కృష్ణుడు చెప్పిన తర్వాత మొట్టమొదట
ధర్మవరుడుగా మారినది వ్యాసుడేనని తెలియవలెను.
కృష్ణుడు భగవంతునిగా పుట్టి అధర్మవరులను ధర్మవరులుగా మార్చగా, సాధారణ మనిషిగా పుట్టిన రాముడు
ఒక్క అధర్మవరుని కూడ ధర్మవరునిగా మార్చలేదు. ఇక్కడ ధర్మవరుడు, అధర్మవరుడు అను రెండు క్రొత్త పదములను
వాడాను. ఈ పదములను ధర్మపరుడు, అధర్మపరుడు అను పదమునకు బదులుగా వాడడము జరిగినది. ధర్మపరుడు
అని ధర్మములను ఆచరించు వానిని అనడము అందరికి అలావాటైపోయినది. అందువలన అందరికి అలవాటైనట్లే
మేము కూడ ధర్మపరుడు, అధర్మపరు డని అనేక చోట్ల వ్రాయడము జరిగినది. వాస్తవానికి ఆ పదములను అలా
వాడకూడదు. ఎందుకనగా! పర అనగా వేరుగా ఉన్నదని అర్థము. తన, పర అని అన్నపుడు తన అనగా స్వంతముది,
పర అనగా తనకంటే వేరుగా ఉన్నదని అర్థము. పరమాత్మ అనగా ఆత్మకంటే వేరుగా ఉన్నదనీ, ఆత్మకాని వేరొకటి అని
అర్థము. పరదేశి అనగా ఈ దేశము కానివాడు, ఇతర దేశస్థుడు అని అర్థము. ఇహము అనగా ఇక్కడ అని, పరము
అనగా ఇక్కడ కానిదని అర్థము. ఈ విధముగ 'పర' అను పదము వేరుగానున్న దానిని సూచించు పదము అని
తెలియుచున్నది. ధర్మము కాని దానిని అధర్మము అంటాము. భగవద్గీతలో స్వధర్మము, పరధర్మము అను పదములు
కర్మయోగము 35వ శ్లోకమున వాడబడినవి. స్వధర్మము, పరధర్మము అను పదములలో స్వ, పర అను శబ్దములు
వేరువేరుగా కనిపించుచున్నవి. ఇక్కడ స్వధర్మము అనగా తన ధర్మమని, పరధర్మమనగా తనది కాని ఇతర ధర్మమని
తెలియుచున్నది. దీనిప్రకారము ధర్మపరుడు అని అంటే ధర్మములకంటే వేరుగా ఉన్నవాడని, ధర్మములను ఆచరించు
వాడు కాదని, అధర్మములను ఆచరించువాడని చెప్పవచ్చును. కానీ ధర్మ పరుడు అను పదమును ధర్మములను
ఆచరించువానిని గురించి వాడు చున్నాము. అట్లే అధర్మములను ఆచరించువానిని అధర్మపరుడు అంటున్నాము.
వాస్తవానికి అలా అనడము పూర్తి తప్పు. అధర్మములను ఆచరించువానిని నిజముగా ధర్మపరుడు అనాలి. అట్లే
ధర్మములను ఆచరించువానిని అధర్మపరుడు అనాలి.
పూర్వము ధర్మములను ఆచరించువానిని ధర్మవరుడు అనియు, అధర్మములను ఆచరించువానిని అధర్మవరుడు
అనెడివారు. వరుడు అనగా కోరినవాడు, వరించినవాడు అని అర్థము. ధర్మవరుడు అనగా ధర్మములను కోరినవాడని,
ధర్మములను వరించినవాడని అర్థము. అలాగే అధర్మవరుడు అనగా అధర్మములను కోరి ఆచరించువాడని అర్థము.
పూర్వకాలములో ధర్మములను కోరి ఆచరించువానిని ధర్మవరుడు అనెడివారు. అయితే కాలక్రమమున ధర్మవరుడు
అను పదము ధర్మపరుడుగా మారిపోయినది. వరుడు అను పదములోని "వ" అను శబ్దము "ప" అను శబ్దముగా
మారిపోయినది. అప్పటినుండి ధర్మవరున్ని ధర్మపరునిగా, అధర్మవరున్ని అధర్మపరునిగా పిలువడము జరుగుచున్నది.
వివరము తెలిసిన తర్వాత ఇతరులకు అర్థమగునట్లు ఉచ్ఛరించుటకు చిత్తము ఒప్పదు. మనకు తెలిసినట్లు మన
చిత్తము ఒప్పునట్లు పలికితే, ధర్మములను బోధించి ధర్మముల ప్రకారము నడచిన కృష్ణున్ని అధర్మపరుడు అనాలి.
అధర్మములకు వేరుగా ఉన్నవాడను అర్థము కృష్ణునికి సరిపోతుంది. ధర్మవరుడైన కృష్ణున్ని ఇతరులు వాడు పదములో
చెప్పితే అధర్మపరుడు అగును. అలాగే అధర్మ వరుడైన వానిని ధర్మపరుడు అనాలి.
67

Page 68
వ్యాసుడు నాల్గువేదములను వ్రాసి, వేదవ్యాసుడు అను పేరుగాంచి ఉన్నాడు. అలాగే 18 పురాణములను వ్రాసి
పురాణ పురుషుడనీ, పురాణకర్త అని పేరు తెచ్చుకొన్నాడు. కృష్ణుడు చెప్పిన బోధ ప్రకారము వేదములనగా మూడు
గుణవిషయములు (త్రైగుణ్య విషయాలేదా). ఆ మూడు గుణములే నాయొక్క మాయ (గుణమయీ మమ మాయా) అని
అన్నాడు. వేదములలో మూడు గుణములే ఉన్నాయి. ఆ గుణములే నా మాయ. నా మాయను దాటుట దుస్సాధ్యము
(మమ మాయా దురత్యయా) అన్నాడు. భగవంతుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఎవరికి సాధ్యముకానీ మాయతో
కూడుకొన్న వేదములను వ్యాసుడు వ్రాశాడు. దేవుడు ధర్మములతో కూడుకొన్నవాడు. దేవునికి ప్రతి పక్షమైన మాయ
అధర్మములతో కూడుకొని ఉన్నది. అధర్మయుక్తమైన వేదములను వ్యాసుడు వ్రాశాడు, కావున వ్యాసున్ని అధర్మములను
బోధించిన వానిగా లెక్కించాలి. ఈ లెక్క ప్రకారము వ్యాసున్ని “ధర్మపరుడు" అని అనాలి. ధర్మములను బోధించిన
కృష్ణున్ని “అధర్మపరుడు” అని అనాలి. వ్యాసుడు ధర్మపరుడు అయినపుడు “అధర్మ వరుడు" అగును. అట్లే కృష్ణుడు
అధర్మపరుడు అయినపుడు “ధర్మవరుడు" అగును. ఇక్కడ వరుడు, పరుడు అను పదములకు వివరము తెలిసి చదువవలెను.
వేదములను చెప్పిన వేదవ్యాసుడు, పురాణములను వ్రాసిన వ్యాసుడు, కొందరిచేత “వ్యాసో నారాయణో హరి”
అని పొగడబడిన వ్యాసుడు, మరికొందరిచేత వ్యాసభగవానుడు అని పిలిపించుకొన్న వ్యాసుడు, బ్రహ్మవిద్యా శాస్త్రము
ప్రకారము, భగవంతుడు చెప్పిన భగవద్గీత ప్రకారము వ్యాసుడు అధర్మయుక్తుడు, అధర్మవరుడు, అధర్మములను బోధించిన
ధర్మపరుడు. వ్యాసుని కాలములోనే వేదములు, పురాణములు మనుషుల లోనికి చేరి ధర్మములకు ముప్పు ఏర్పడగా,
తప్పనిసరిగా భగవంతుడు భూమిమీదకు వచ్చి ధర్మములను తెలియ చెప్పవలసి వచ్చినది. ఈ మా మాటలు కొందరికి
విడ్డూరముగా కనిపించినా, మా మాటలన్ని వాస్తవములే. మేము ఇప్పుడు చెప్పునదే కాదు. ఆనాడు వ్యాసుడే స్వయముగా
తాను చేసినది తప్పని గ్రహించాడు. అప్పటికే అనగా భగవద్గీత తనకు తెలిసినప్పటికి 80 సంవత్సరముల ముందే
వేదములు, పురాణములు తన ద్వారా వ్రాయబడి ప్రజలలోనికి వెళ్ళి పోయాయి. తన తప్పు ఎటువంటిదో గీత ద్వారా
తెలుసుకొన్న వ్యాసుడు, తాను గీతను దాటి ప్రవర్తించానని తెలిసి పశ్చాత్తాపపడి పోయాడు. తాను చేసిన తప్పును
సరిదిద్దుకోవడానికి, అర్జునుని ద్వారా విన్న దాదాపు ఆరు నిమిషముల సమాచారమును 578 శ్లోకముల రూపములో
వ్రాశాడు. అలా గీతను వ్రాసిన వ్యాసుడు అందులోని ధర్మములను జీర్ణింపచేసుకొని ఆచరించుతూ గీత ద్వారా మారిన
మొట్ట మొదటి వాడైనాడు. ఆనాడు వ్యాసుడు వ్రాసిన గీత 578 శ్లోకములు కాగా, ఈనాడు కొంత కలుషితమై 700
శ్లోకాల రూపములో మన ముందున్నది. కలిపిత శ్లోకాలను మా రచన అయిన "త్రైతసిద్ధాంత భగవద్గీత”లో బయట
పెట్టడము జరిగినది.
జగతిలో త్రేతాయుగమునందు ఆది కవి అయిన వాల్మీకి ఇతిహాస మైన రామాయణమును వ్రాయగా,
ద్వాపరయుగమునందు వ్యాసుడు వేదములను, పురాణములను, ఇతిహాసమైన (చరిత్రయైన) భారతములోనే భగవద్గీతను
కూడ యుద్ధకాండములో పొందుపరచి వ్రాశాడు. త్రేతా యుగములోని రామాయణమునందు వాల్మీకి వ్రాతలో, రాముడు
ద్వాపర యుగములో కృష్ణునిగా పుట్టునని ఎక్కడా వ్రాయలేదు. అదే విధముగ ద్వాపరయుగములోని వ్యాసుడు శ్రీకృష్ణుడు
ముందు జన్మలో రాముడనీ వ్రాయలేదు. అటు వాల్మీకిగానీ, ఇటు వ్యాసుడుగానీ వ్రాయని విషయమును మధ్యలోని
కవులు రాముడు, కృష్ణుడు ఒకటని వ్రాశారు. ఇప్పటి కవులు వ్రాసిన ప్రకారము రాముడు దేవుడుగాదు, భగవంతుడుకాదు.
అలాగే కృష్ణుడు దేవుడు కాదు, కానీ భగవంతుడని చెప్పవచ్చును. దేవునికి, భగవంతునికి, మనిషికి అర్థము తెలిసినపుడు
రాముడు కృష్ణుడు ఏమవుతారో చెప్పవచ్చును. రామున్ని కృష్ణున్ని ఇద్దరిని దేవుడు కాదన్నాము. వీరే కాదు జగతిలో
68

Page 69
శరీరమును ధరించి ఆకారముతో ఎవరు పుట్టినా వారు దేవుడు కాదు. కృష్ణున్ని రామున్ని పరిశీలించి చూచితే రాముడు
సాధారణ మనిషిగా లెక్కించబడతాడు. కృష్ణుడు మాత్రము భగవంతునిగా లెక్కించబడతాడు. అలా లెక్కించుటకు
ఆధారము బ్రహ్మవిద్యాశాస్త్రమే. దేవుడు, భగవంతుడు, మనిషి అను ఈ త్రైతములో ఎవరు దేవుడు, ఎవరు భగవంతుడు,
ఎవరు మనిషి అని తేల్చి చెప్పుటకు దైవధర్మములతో కూడుకొన్న బ్రహ్మవిద్యాశాస్త్రమే ఆధారము.
బ్రహ్మవిద్యాశాస్త్రములో దైవశాసనముల ప్రకారము భగవంతుడు మనిషి కుమారునిగా పుట్టాడు. భగవంతుడుగా
పుట్టినవాడు సాధారణ మనిషి శరీరమును ధరించినప్పటికీ తల్లిగర్భమునుండి పుట్టుచున్నాడు, కావున అతను భగవంతుడే.
ఎందుకనగా తల్లిగర్భము లోపలనుండి సజీవముగా పుట్టినవాడు భగవంతుడు. తల్లిగర్భము లోపల నుండి నిర్జీవ
శరీరము పుట్టిన తర్వాత, ఆ శరీరములోనికి చేరిన వాడు (జీవుడు) భగవంతుడు కాడు, సాధారణ మనిషి అగును.
మనిషికి భగవంతునికి తేడా పుట్టుకలోనే కలదు. తల్లిగర్భము (భగము) నుండి పుట్టువాడు భగవంతుడు. తల్లిగర్భములో
జీవుడు ఏమాత్రము లేకుండా చైతన్యములేని శరీరము పుట్టిన తర్వాత, ఆ శరీరములోనికి చేరువాడు మనిషి అని,
అతను భగవంతుడు కాడు అని చెప్పవచ్చును. ఎవరు సజీవముగా పుట్టుచున్నారు, ఎవరు సజీవముగా పుట్టలేదు అను
విషయము ప్రసవ సమయములో ప్రసవములను (కాన్పులను) చేయు వైద్యులకు కూడ తెలియక పోవడము వలన,
భగవంతున్ని గుర్తించుటకు వీలులేకుండ పోయినది. రాముని పుట్టుకను చూస్తే, తల్లిగర్భమునుండి రాముని శరీరము
పుట్టిన తర్వాత బయటవున్న శరీరములోనికి, రాముడు అని పేరుపెట్టబడిన జీవుడు వచ్చి చేరాడు. కృష్ణుని పుట్టుకను
వివరించుకొని చూస్తే, కృష్ణుడు ఎదురు కాళ్ళతో పుట్టడమే కాక, కాళ్ళు బయటపడినపుడు తన కాళ్ళను కదిలించాడు.
అలా కదిలించి తాను తల్లిగర్భములోనే సజీవముగా ఉన్నట్లు బయటికి తెలియజేశాడు. దీనినిబట్టి కృష్ణుడు భగమునుండి
పుట్టినవాడని భగవంతుడని తెలియుచున్నది. ఈ ఒక్క ఆధారముతోనే రాముడు మనిషి, కృష్ణుడు భగవంతుడు అని
చెప్పుచున్నాము. అంతేకాక భగవంతుడు దైవ ధర్మములను తెలియజేయుటకు వస్తాడు, కనుక కృష్ణుడు భగవద్గీతను
బోధించాడు. రాముడు సాధారణ మనిషి, కావున రాముడు తన జీవితములో ఏ ఒక్క దైవధర్మమును తెలియచేయలేదు.
రాముడు గతజన్మలో చేసుకొన్న ప్రారబ్ధకర్మచేత పుట్టి సుఖదుఃఖములను అనుభవించాడు. కృష్ణుడు గత జన్మలో
చేసుకొన్న కర్మప్రకారము పుట్టలేదు. ప్రతి పుట్టుకకు కర్మ ఉంటుంది, అను సూత్రము ప్రకారము కృష్ణుడు కర్మవలననే
పుట్టినప్పటికీ, ఆ కర్మ ఆయన చేసుకొన్నది కాదు. కృష్ణుని పుట్టుకగానీ, జీవితముగానీ, మరణముగానీ కర్మచేతనే
జరిగినా, ఆ కర్మ అతను చేసుకొన్నది ఏమాత్రము కాదు. అతను వ్రాసుకొన్న కర్మ అని చెప్పవచ్చును. ఒక జన్మకు
కావలసిన కర్మను కృష్ణుడు తానే సృష్టించుకొని, దానిప్రకారము వచ్చి పోయాడు. తాను సృష్టించుకొన్న కర్మ ప్రకారము
ఆయన పనులు చేసినా, ఆ కర్మ వలన కృష్ణుడు బాధపడలేదు. ఎందుకనగా ఆయన కర్మ ఆయనకు ముందే తెలుసు.
ఏమి జరుగుతుందో ముందే తెలిసి ఉండడము వలన ఆయనకు బాధలేదు. అదే రాముని విషయములోనికి వస్తే
ఆయన కర్మ ఎలాగున్నదో ఆయనకు తెలియదు. కావున అనేక సందర్భములలో రాముడు బాధపడినాడు. సీతను
పోగొట్టుకొన్నపుడు ముందు జరుగబోవునది తెలియదు, కనుక రాముడు చాలా బాధపడిపోయాడు. సాధారణ మనిషి
జీవితములో కర్మ ఎలాగున్నదో, అలాగే రాముని జీవితములో కూడ కర్మ ఉన్నది. సాధారణ మనిషి కర్మవలన ఎటువంటి
అనుభవములను పొందు చున్నాడో, అలాగే రాముడు కూడ అటువంటి అనుభవములనే పొందాడు. అందువలన
రామున్ని మనిషి అని, కృష్ణున్ని భగవంతుడని చెప్పుచున్నాము. వీరిద్దరిలో ఎవరూ దేవుడు కాదు అన్నది అందరికి
అర్థమై ఉంటుంది.
69

Page 70
ఇట్లు ఎన్నో విధముల చూడగా రాముడు, కృష్ణుడు ఒక్కటి కాదని తెలియుచున్నది. ఆధ్యాత్మిక విషయములలో
చూస్తే రాముడు యజ్ఞములను రక్షించి, యజ్ఞములను చేయువారిని ప్రోత్సహించాడు. కృష్ణుడు తన గీతయందు
యజ్ఞములు రెండే ఉన్నవని, అవి శరీరములో జరుగుచున్నవని, శరీరాంతర్గత యజ్ఞము చేత మోక్షమును పొంది
దైవములోనికి చేరవచ్చునని తెలిపాడు. అంతేకాక బయట అనేక రకముల పేర్లతో చేయబడు ఏ ఒక్క యజ్ఞము
చేతగానీ దేవున్ని చేరుటకు, మోక్షము పొందుటకు వీలులేదని చెప్పాడు. బాహ్యయజ్ఞములు అధర్మములనీ, ధర్మములు
కాని వాటిచేత దైవత్వము తెలియదని కూడ చెప్పాడు. ఈ విధముగ బయటి యజ్ఞములను ఖండించిన కృష్ణుడు
భగవంతుడనీ, బాహ్యయజ్ఞములను ప్రోత్సహించి కాపాడిన రాముడు సాధారణ మనిషి అని చెప్పవచ్చును. ఇన్ని
విధముల రాముడు, కృష్ణుడు ఒక్కటికాదు. వారిరువురు వేరువేరని, రాముడు దేవుడుకాదు మనిషియనీ, కృష్ణుడు కూడ
దేవుడుకాదు, కానీ భగవంతుడనీ చెప్పవచ్చును.
త్రేతాయుగములో రామునికంటే ముందు పుట్టిన వాడు రావణుడు. రావణుడు లంకకు చక్రవర్తి, రాముని
తండ్రియైన దశరథునికంటే రావణుడు పెద్దవాడే. రామునికంటే రావణుడు 65 సంవత్సరములు పెద్దవాడు. రావణుడు
దైవధర్మములను సంపూర్ణముగ తెలిసినవాడు. త్రేతాయుగములో సంపూర్ణ జ్ఞానియై రావణబ్రహ్మ, త్రికాల జ్ఞాని అని
పేరుగాంచిన వాడు రావణుడు. ఇంతవరకు జగతిలో బ్రహ్మ అను బిరుదును పొందినవాడు రావణుడు ఒక్కడే.
బ్రహ్మవిద్యా శాస్త్రమును సవివరముగా తెలిసిన రావణునికి బాహ్యయజ్ఞములు అధర్మములని కూడ తెలియును. అంతేకాక
భగవద్గీతలో చెప్పినట్లు వేదాధ్యయణము, తపస్సు కూడ అధర్మములనియే తెలిసినవాడు. తన లంకారాజ్యములో
దైవధర్మములకు విరుద్ధముగ వేదపఠనముగానీ, తపస్సులుగానీ, యజ్ఞములనుగానీ ఎవరూ చేయకూడదని శాసించాడు.
లంకారాజ్యము ఆనాడు లంకాద్వీపములోనేకాక దక్షిణ భారతదేశములో కూడ వ్యాపించి ఉండెడిది. నేడు గల ఆంధ్ర,
తమిళనాడు, కర్ణాటక, కేరళ నాలుగు రాష్ట్రములు ఆనాడు రావణబ్రహ్మ పాలనలోనే ఉండెడివి. ఆ కాలములో ఉత్తర
భారతదేశములో యజ్ఞములు, తపస్సులు, వేదాధ్యయణములు ఎక్కువగా ఉండేవి. ఉత్తరదేశము యొక్క అలవాట్లు
దక్షిణ దేశములో కూడ అక్కడక్కడ ఉండెడివి. రావణబ్రహ్మ ఆధీనములో నున్న దక్షిణ భారత దేశములో ఎవరైన
వేదములను చదివినా, యజ్ఞములను చేసినా, తపస్సులను చేసినా రావణబ్రహ్మ శిక్షించెడి వాడు. దైవధర్మములైన
యోగములను ఆచరించమని, యోగములను ఆచరించక యజ్ఞ, తపస్సులను చేయువారు, వేదములు చదువువారు
దేవునికి వ్యతిరేఖమైన అధర్మములను ఆచరించునట్లు అగునని, అట్లు చేసినవారు శిక్షార్హులని కూడ తెలియజేశాడు.
అయినప్పటికీ ఉత్తర భారతదేశము వారు రావణబ్రహ్మకు వ్యతిరేఖముగా ఆయన చెప్పినట్లు వినకుండునట్లు కొందరిని
ప్రేరేపించి దొంగతనముగా యజ్ఞములు చేయించెడివారు.
ఆ కాలములోనే రావణబ్రహ్మ యొక్క రాజ్యమైన దక్షిణ భారత దేశములోని వారు, లంకలోని వారు అందరూ
రాక్షసులని, ఉత్తర భారత దేశములోని వారు దేవతలని ఉత్తర దేశములోని కొందరు ప్రచారము చేశారు. అందువలన
లంకతో సహా దక్షిణ దేశమువారందరు ఒక తెగయని, ఉత్తర దేశము వారందరు మరొక తెగయని అందరికి తెలియునట్లు
ప్రచారము జరిగిపోయినది. అప్పుడే కాదు ఈ కాలములో కూడ దక్షిణమువైపు ఉన్నవారంతా ద్రావిడులని, ఉత్తరమువైపు
ఉన్నవారంతా ఆర్యులని ప్రచారములో గలదు. ద్రావిడులందరు రాక్షసజాతియని, ఆర్యులందరు దేవతలజాతియని
ఇప్పటికీ అనుకోవడము జరుగుచున్నది. ఆ లెక్క ప్రకారము ప్రస్తుతము ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ వారందరు
రాక్షసజాతియని, ద్రావిడులమని చెప్పడము జరుగుచున్నది. కేవలము రెండు వందల సంవత్సరముల పూర్వము కూడ
70

Page 71
ఉత్తర భారతదేశములో సంస్కృతము వచ్చిన పండితులు ఎక్కువగా ఉండెడివారు. దక్షిణ భారతములో అందరూ చదువురాని
పామరులుగా ఉండెడివారు. అంతకంటే పూర్వము ద్రావిడ రాజ్యములో ఎవరూ పాండిత్యము గలవారు లేరు.
ఉత్తరదేశమంతా పాండిత్యముగలవారు, సంస్కృత భాషమీద పట్టున్నవారు ఉండుట వలన, తాము ఆర్యులమను భావము
వారిలో ఉండుట వలన, ద్రావిడులందరు రాక్షసులను తక్కువ భావము దక్షిణ దేశము వారిమీద ఉండెడిది. ఆర్యులు
వారి పాండిత్యముతో తమ ప్రాంతమువాడైన రామున్ని గొప్పగ చిత్రించి, ద్రావిడ ప్రాంతమువాడైన రావణున్ని నీచముగా
చిత్రించి పుస్తకములను వ్రాయడము జరిగినది. వాటిని చదివిన వారందరు రామున్ని మంచివాడు, గొప్పవాడు అని
అనుకొన్నారు. రావణబ్రహ్మను చెడ్డవాడు, నీచుడు అని అనుకొన్నారు. ఈ విధముగ ఆర్యులు రామున్ని గొప్పగ,
రావణున్ని నీచముగ ప్రచారము చేశారు. గతమును గూర్చి యోచించని ప్రజలు, తాము చదివిందే నిజమనుకొని నమ్మి
రామున్ని దేవునిగా రావణున్ని రాక్షసునిగా అర్థము చేసుకొన్నారు. వాస్తవానికి ఆర్యుల కుటిల కుతంత్ర రచనలను
వదిలి సత్యమును గ్రహిస్తే, రాముడు సాధారణ మనిషి, రావణుడు బ్రహ్మజ్ఞాని. రామునికి ఆత్మజ్ఞానము ఏమాత్రము
తెలియదు. రాముని చిన్నవయస్సులో విద్యాభ్యాసము జరుగగ తర్వాత 16 సంవత్సరములకే సీతతో పెళ్ళి జరిగినది.
పెళ్ళి జరిగిన వెంటనే పట్టాభిషేకము యొక్క గొడవలు జరుగడము, దాని తర్వాత ఊహించని రీతిగా రాముడు అరణ్యమునకు
వెళ్ళడము జరిగినది. 14 సంవత్సరముల వనవాసము ముగియు చివరి సంవత్సరములో రావణుడు సీతను తన
లంకకు తీసుకెళ్ళాడు. అప్పటికి రాముని వయస్సు కేవలము 30 సంవత్సరములు కాగా, రావణబ్రహ్మ వయస్సు
దాదాపు 95 సంవత్సరములుండవచ్చును. తర్వాత రావణుని తమ్ముడు విభీషణునితో రాముడు కుట్రపన్ని రావణున్ని
చంపి, దాదాపు ఒక సంవత్సరమునకు సీతను తెచ్చుకొన్నాడు, తర్వాత ఒక సంవత్సరమునకే సీతను అడవికి పంపాడు.
అప్పటినుండి మానసిక క్షోభతో నిండిపోయాడు. తర్వాత దాదాపు పది సంవత్సరములకు కొడుకులైన లవకుశలను
కలుసుకొన్నపుడు సీత తనవెంట వచ్చుటకు నిరాకరించినది. అప్పటికి రాముని వయస్సు దాదాపు 42 సంవత్సరములు.
తర్వాత జీవితములో కూడ సీతను గురించి చింతించడము, తాను తప్పు చేశానని బాధపడడము జరిగినది. కానీ
ఏనాడూ రాముడు దైవజ్ఞానమువైపు చూడలేదు. ఆయన జీవితములో దైవజ్ఞానమును తెలుసుకొను అవకాశమే రాలేదు.
దైవజ్ఞానము మీద రాముడు ఏనాడూ శ్రద్ధ చూపలేదు. కొంతైనా దైవజ్ఞానములేని రామున్ని సంపూర్ణ జ్ఞాననిధియైన
కృష్ణునితో పోల్చుటకు ఏమాత్రము వీలులేదు. కృష్ణుడు దైవమునుండి వచ్చి పుట్టిన దైవ అంశ అయిన భగవంతుడు.
రాముడు దైవజ్ఞానమేదో తెలియని వ్యక్తి. కృష్ణుడు నశించుపోవుచున్న ధర్మములను తిరిగి పునరుద్ధరించిన ప్రవక్త,
రాముడు ప్రపంచ సంబంధ నీతి, న్యాయమును కూడ ఆచరించక, తన స్వార్థము కొరకు వాలిని చంపిన హంతకుడు.
అంతేకాక తనలో వేధిస్తున్న అనుమానముతో ఏదో ఒక సాకు చూపి భార్యను నిండు గర్భవతిని కూౄరముగ అడవికి
పంపిన వాడు. ఏ శత్రుత్వము లేని వాలిని చంపడము కిరాయి హత్యకాదా అని ఒక ముస్లీమ్ ప్రశ్నించినపుడు ఏమి
జవాబు చెప్పలేక తల దించుకోవలసి వచ్చినది. సీతను అడవికి పంపడము అన్యాయము కాదా! అదే మీచెల్లెలునో,
అక్కనో మీబావ మృగాలున్న అడివిలోగానీ, మానవమృగాలున్న పెద్ద సిటీలో గానీ ఒంటరిగా వదలివేస్తే మీ బావను
మనిషేకాదని వానిని చంపివేస్తానని దూషించు మీరు, రామున్ని ఏమి అనకుండ దేవుడని పొగడుతారా! అని ఒక
క్రైస్తవుడు అడిగినపుడు కూడ ఏమీ జవాబు చెప్పలేక పోయాము. అటువంటి సందర్భములన్నిటిని అతిక్రమించి,
దైవాంశ సంభూతుడైన కృష్ణునితో సమానముగా పోల్చలేము. అందువలన రాముడు, కృష్ణుడు ఒక్కటి కానేకాదు అని
చెప్పుచున్నాము.
71

Page 72
ప్రాంతీయ ద్వేషముతో ఆర్యులు రావణబ్రహ్మను తక్కువ చేయడమే కాక, రాముని లోపములు కనిపించకుండ
ఉండుటకు కృష్ణున్ని వాడుకొని రాముడు కృష్ణుడు ఇద్దరు ఒక్కటేనన్నారు. రామునికి దైవజ్ఞానము తెలియదని ఎవరైనా
అంటే, ద్వాపరయుగములో రాముడే కృష్ణావతారమెత్తి దైవ జ్ఞానమును బోధించాడని కృష్ణున్ని వాడుకొనుచున్నారు.
కృష్ణుడు అల్లరి వాడు, ఎంతోమంది ఆడవారితో సంబంధమున్నవాడు, ఎనిమిది మంది భార్యలున్నవాడు అంటే కృష్ణుని
తప్పును కప్పి పుచ్చుటకు రామావతారములో ఏకపత్నీవ్రతుడని రామున్ని చూపుచున్నారు. ఈ విధముగా రాముని
తప్పులు కప్పిపుచ్చుకొనే దానికి కృష్ణున్ని, కృష్ణుని తప్పులు అడిగితే రామున్ని చూపుటకు ఆర్యులు రాముడు కృష్ణుడు
ఒక్కటే అన్నారు. కానీ అది ఎటు చూచినా సత్యముకాదు.
రాముడు అయోధ్యలో పుట్టకముందే 'రామ' అను రెండక్షరముల పేరు ఉంది. కానీ కృష్ణుడు మధురలో
పుట్టకముందు 'కృష్ణ' అను పేరు ఎక్కడా లేదు. రాముడు త్రేతాయుగములో పుట్టాడు. అయితే రామ అను పదము
కృతయుగములోనే ఉన్నది. రామ అను రెండక్షరముల పదములో ఎంతో గొప్ప దైవజ్ఞాన భావము ఇమిడి ఉన్నది. అది
ఏమనగా! “రామ” అను రెండక్షరముల శబ్దమును ప్రజలకు కృతయుగములోని జ్ఞానులే పరిచయము చేశారు. రాముడు
పుట్టని ఆ కాలములో 'రామ' అను రెండక్షరములకు ఆధ్యాత్మికరీత్యా విశేషమైన అర్థముండెడిది. 'ర' అనగా అర్థము
నాశనము అని ముందే తెలుసుకొన్నాము. 'ర' అనినా 'రా' అనినా రెండు ఒకే అర్థము నిచ్చుచున్నవని, దశరాపండుగను
గురించి చెప్పుకొన్నపుడే తెలుసుకొన్నాము. 'మ' అనగా నేను లేక నా అను అర్థముగలదని, మమ అనగా నాయొక్క
అనియు “సుబోధ” గ్రంథములో 'మామ' ను గురించి చెప్పుకొన్నప్పుడు తెలుసుకొన్నాము. ఆ ప్రకారము చూస్తే రామ
అను మాటలో నా అనునది నాశనము కావలెనని అర్థమిమిడి యున్నది. నేను అనువాడినైన జీవున్ని నాశనమై పోవాలని
అర్థము, ఆ రెండక్షరముల శబ్దములో గలదు. జీవుడు నాశనమైతే దేవునిగా మారిపోగలడు, అనగా దేవునిలో కలిసి
పోగలడు. ఒక జీవుడు జన్మరాహిత్యమును కోరుకొంటూ, దేవునియందైక్యమగు అర్థము "రామ" అను శబ్దములో
ఇమిడివున్నది. బ్రహ్మజ్ఞానము ప్రకారము ప్రతి జీవుడు దేవునియందైక్యమగునట్లు కోరుకోవలెను. ఆ విధముగానే
ప్రవర్తించవలెను. జీవుడు ఎప్పటికైనా దేవునియందు చేరి పోవలసినవాడే. జీవుడు అను మాట లేకుండ పోయి,
దేవుడను మాటగా మార్పు చెందవలసినదే. అందువలన భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగము అను అధ్యాయమున
జీవున్ని క్షరుడు అన్నారు. క్షరుడు అనగా నాశనమగువాడని అర్థము. “నాశనము చెందువాడిని నేను" అను జ్ఞాపకమును
ఎల్లపుడు మనిషి మరిచి పోకుండునట్లు “రామ” అను మాటను సందర్భములోగానీ, అసందర్భములో గానీ అపుడపుడు
పలుకునట్లు పెద్దలు అలవాటు చేశారు. పూర్వము రెండక్షరముల రామ అను మాటలో ఎంత అర్థముందో అందరికి
తెలిసియుండెడిది. కృతయుగములోనే రామ అను శబ్దము ఆధ్యాత్మికమునకు ఆదర్శముగా ఉండెడిది. నేను
నాశనమగువాడినని అందరిలో దృఢభావము రామ అను రెండక్షరముల వలన ఉండెడిది. భగవద్గీతలో చెప్పిన క్షర
భావము, అనగా నాశన భావము 'ర' వలన, నేను అను భావము 'మ' వలన కల్గుచున్ననది. కావున 'రామ' శబ్దము
పరమ పవిత్ర అర్థముతో కూడుకొన్న శబ్దముగా పూర్వము భావించెడివారు. గొప్ప భావమున్న రామ శబ్దమును
దశరథపుత్రునికి నామధేయముగా పెట్టుకొన్నారు. ఆనాటి నుండి ఆధ్యాత్మిక జ్ఞానము ప్రజలలో తగ్గిపోవడము వలన,
రామ అను రెండక్షరములు శ్రీరామ అని మూడక్షరములుగా మారిపోవడమూ, దశరథ పుత్రునినుండే రామ అను పేరు
వచ్చినదనీ, రామ అనగా దశరథ రాముడే నను భావము అందరిలో ఉండిపోయింది. అదే భావము ఈనాటికీ మిగిలి
పోయినది.
72

Page 73
రామ అంటే దశరథపుత్రుడే అని రామదాసు అనుకొనగా, రామదాసుకంటే పెద్దవాడైన కబీర్ దాసు తాను
అనుకొను రామ దశరథ రాముడు కాదన్నాడు. అందువలన ఒక సందర్భములో దశరథ రాముడే కనిపించినా “నీవు
నా రామునివి కాదు పో!” అన్నాడట. నేను తలచు రాముడవు నీవుకాదు అని శ్రీరామున్ని కబీర్ అన్నాడంటే, కబీర్కు
పూర్వపు జ్ఞానము ఆధ్యాత్మికము ప్రకారము తెలుసునన్నమాట. రామదాసుకు ఆధ్యాత్మికము తెలియక రామ అను మాట
శ్రీరాముని పేరేననుకొన్నాడు. ఒక రామదాసే కాదు, ఆనాటి త్రేతాయుగమునుండి ఎందరో దశరథ రాముడే నిజమైన
రామ అని తలచిన వారు కలరు. అటువంటి వారందరు శ్రీరాముని మీద భక్తితో గుడికట్టి రామున్ని పూజించుచున్నారు.
విశేషమే మంటే కృష్ణుని గుడి ఒక్కటుంటే రాముని గుడులు వంద ఉంటాయి. ఆ లెక్క ప్రకారము కృష్ణునికంటే రాముడే
ప్రజలకు గొప్పగ కనిపించాడని అర్థమగుచున్నది. రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటేనని చెప్పు వారు కూడ రాముని
భక్తులుగానే ఉంటారు. కృష్ణుడు పుట్టిన ఉత్తరదేశములో కూడ కృష్ణుని గుడులు తక్కువగా ఉండడమును గమనించవచ్చును.
రామ అను రెండక్షరములు ఎంతో జ్ఞానముతో కూడుకొన్నవై ఉండుట వలన, ఆ రెండక్షరములను ఒక్కమారు
ఉచ్చరించినా దాని అర్థమును బట్టి ఎంతో సార్థకత కల్గునని జ్ఞానులు చెప్పియున్నారు. అదంతయు వాస్తవమే అయినా
రామ అను పదము అయోధ్య రామునికంటే ముందునుండి ఉన్నదని ఎవరికీ తెలియకుండ పోవడము, నేడు మనుషులలోని
పెద్ద అజ్ఞానమైనది. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందనేమోనని త్రేతాయుగములోనే ఊహించిన పెద్దలు అటువంటి
పరిస్థితి రాకుండుటకు, 'రామ' అను రెండక్షరముల శబ్దమునకు ఆధ్యాత్మిక విలువ ఉండుటకు, దశరథపుత్రునికి రామ
అని పేరు పెట్టిన రోజుననే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆధ్యాత్మిక 'రామ' కు, మనిషిగా పుట్టిన 'రామ' కు తేడా
ఉండునట్లు, ఆ తేడాను ప్రజలు సులభముగా గ్రహించునట్లు చేయాలనుకొన్నారు. అందువలన పుట్టిన వ్యక్తి పేరు
'రామ' అనినా ఇది వ్యక్తి పేరు అని తెలియునట్లు గుర్తునుంచాలను కున్నారు. అందువలన పుట్టిన రామున్ని ‘దశరథ
రామ' అని రామకంటే ముందు తండ్రి పేరును గుర్తుగా ఉచ్చరించునట్లు చేశారు. ఆధ్యాత్మిక రామ శబ్దమునకు
ముందు వెనుక గుర్తు ఏమీ ఉండదు. శరీరముతో పుట్టిన రామకు మాత్రము ముందు చాలా గుర్తింపులున్నవి. వాటిని
చూస్తే సీతారామ, అయోధ్య రామ, కోదండరామ, పట్టాభిరామ, దశరథరామ, కౌసల్యరామ అని రామునికి చాలా
గుర్తులు కలవు. ఈ విషయము తెలియని రామదాసు కనిపించే అయోధ్య రామున్ని ఆరాధించాడు. గుర్తుల జ్ఞానము
తెలిసిన కబీర్దాస్ కనిపించని ఆత్మా రామున్ని ఆరాధించాడు. అందువలన అయోధ్య రాముడు కనిపించినా నీవు
రామునివి కాదు పో అన్నాడు.
నా
కొంత జ్ఞానము తెలిసి నిత్యము రామ శబ్దమును ఉచ్చరించిన కబీర్దాసే అయోధ్య రామున్ని, నీవు నా
రాముడవు కాదనినపుడు, దైవము యొక్క అంశగా వచ్చిన భగవంతుడైన కృష్ణున్ని కేవలము మానవ మాత్రుడైన
రామున్ని కలిపి ఒక్కటనడము పొరపాలగును. అందువలన అన్ని విధముల యోచించి రాముడు కృష్ణుడు ఒక్కటికాదని
పెద్దలైన జ్ఞానులంటున్నారు. వారి మాటనే సమర్థిస్తూ మనము కూడ రాముడు వేరు, కృష్ణుడు వేరు అంటున్నాము. ఈ
విధముగా చెప్పడము వలన అయోధ్య రాముని భక్తులకు కొంత బాధగా ఉండవచ్చును. ఇక్కడ గమనించదగిన
విషయమేమంటే ఇద్దరూ ఒకటి కాదంటున్నాము తప్ప అయోధ్య రామున్ని పూజించవద్దనిగానీ, ఆయనను వదలి కృష్ణున్ని
పట్టుకోమనిగానీ చెప్పలేదు కదా! ఆధ్యాత్మిక జ్ఞానరీత్యా ఇద్దరు ఒక్కటి కాదంటున్నాము తప్ప, ఆరాధించుటకు అనర్హుడని
చెప్పడము లేదని గ్రహించవలెను. అయోధ్య రామున్ని పూజించినా అంతరంగములోని రామున్ని మరువవద్దని, రామ
అను రెండ క్షరముల శబ్దము పవిత్రమైనదని, రామ జపమును చేసినవారు ఎందరో పవిత్రులైనా రని తెలుపుచున్నాము.
73

Page 74
శ్రీకృష్ణుడు నెమలి పింఛమును ఎందుకు ధరించాడు?
బహుశ నెమలిపింఛమును చూడనివారుండరు. నెమలిపింఛమును బాగా గమనిస్తే అందులో నాలుగు
గుండ్రని భాగములు నాలుగు ప్రత్యేకమైన రంగులలో ఉండును. నాలుగు రంగుల వలయాకారములున్న నెమలి
పింఛమును కృష్ణుడు తలమీద అందరికి కనిపించునట్లు ధరించాడు. ఆ విధముగా రంగుల పింఛమును ధరించడము
అందముకొరకని కొందరను కొని ఉండవచ్చును. పింఛమును గురించి ఏమీ ఆలోచించని వారు కూడ కొందరుకలరు.
కృష్ణుడు ఎంతో గొప్పవాడు, ధనికునిగా ఉన్నవాడు, ఏదో అర్థముతో ధరించి ఉంటాడని అనుకొన్నవారు కొందరు
గలరు. కొందరేమో దృష్టిదోషము (జిష్ఠి) తగలకుండుటకు అలా పెట్టుకొన్నాడని అనుకొన్నారు. మరికొందరు స్త్రీల
ఆకర్షణ కొరకు దానిని పెట్టుకొన్నాడని అనుకోవడము జరిగినది. ఈ విధముగా ఎవరికి తోచినది వారు అనుకోవడము
జరిగినది. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు కదా! భగవంతుడు మనుషులకు దైవ ధర్మములను, ఆత్మజ్ఞానమును
అందించను భూమిమీదకు వచ్చాడు కదా! అంతగొప్పవాడు నెమలిపింఛమును దృష్ఠి దోషమునకో, అందమునకో,
ఆకర్షణకో ధరించాడనుకోవడము పొరపాటు. ఆయన జీవితమంతా జ్ఞాన సందేశముతోనే కూడుకొని ఉండును.
ఆయన నెమలిపింఛమును ధరించినా జ్ఞానసందేశముతో కూడుకొన్న అర్థమే ఉంటుంది. అలా ధరించడము ఏ
భావముతో కూడుకొన్నదో మనము వెతికి చూచుకోవలెను. అలా వివరించు కొని చూస్తే, కృష్ణుడు నెమలిపింఛమును
తలమీద ధరించడము దేనికి అని మొదట చూడవలెను. మనిషికి శిరస్సే అజ్ఞానమునకుగానీ, జ్ఞానమునకు గానీ
నిలయమై ఉన్నది. భగవంతుడైన కృష్ణుడు తన తలమీద పింఛమును ధరించాడు. కృష్ణుని తల జ్ఞానమునకు నిలయమైనది.
తలయందున్న జ్ఞానమును బాహ్యముగా చూపుటకు నెమలిపింఛమును ధరించాడని అర్థమగుచున్నది.
ప్రతి మనిషి తలలోపల, తల మధ్యభాగములో భూమధ్య స్థానమున నాలుగుచక్రముల సముదాయమున్నది.
ఈ నాలుగు చక్రములు బ్రహ్మనాడి లోని ఆత్మను ఇరుసుగా చేసుకొని అమరి ఉండును. అన్నిటికంటే పైన ఉన్న
చక్రము పేరు బ్రహ్మచక్రము. దానికంటే క్రిందనున్న చక్రము యొక్క పేరు కాలచక్రము, దానికంటే క్రిందగల చక్రము
పేరు కర్మచక్రము. కర్మచక్రముకంటే క్రింద చివరిలోనున్న చక్రము పేరు గుణచక్రము. ఈ విధముగానున్న నాలుగు
చక్రములకు ఆధారముగా ఇరుసుగానున్న బ్రహ్మనాడిలో ఆత్మగలదు. ఈ నాలుగు చక్రములు మరియు ఇరుసుగా
ఉన్న బ్రహ్మనాడిని తర్వాత పేజీ చిత్రపటములో చూడుము.
పైనున్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములలో క్రింది చక్రమైన గుణచక్రమును తీసుకొందాము. మిగత మూడు
చక్రములకంటే మనిషి ఎక్కువగా తెలుసుకోవలసినది గుణచక్రమును గురించేనని అందరు గుర్తుంచుకోవాలి. ఈ చక్రములోనే
మాయ ప్రతిష్ఠింపబడి ఉన్నది. అందువలన దీనిని మాయచక్రమని కూడ చెప్పవచ్చును. గుణ అనినా మాయ అనినా
రెండూ ఒకే అర్థము అని తెలుసుకోవలెను. పైనుండి నాల్గవ చక్రమైన గుణచక్రమును గురించి సంపూర్ణముగా తెలిసిన
వానిని సంపూర్ణజ్ఞానమును తెలిసినవానిగా లెక్కించవచ్చును. నాల్గవచక్రమునకు ఎందుకంత ప్రాధాన్యతవుందనగా! ఆ
నాల్గవచక్రములోనే నీవు ఉన్నావు. ప్రతి జీవుడు నివాసముంటున్నది క్రింది చక్రమైన నాల్గవచక్రములోనే. నాల్గవ
చక్రములోనే మాయ ఉన్నది. నాల్గవ చక్రములోనే జీవుడు ఉన్నాడు. జీవుడు మాయలో చిక్కుకున్నాడు అంటే అది
గుణచక్రములోనే అనీ, జీవుడు మాయనుండి బయటపడాలి అంటే అది కూడ గుణచక్రము లోనేననీ జ్ఞాపకముంచుకోవలెను.
ఆత్మజ్ఞానమును తెలుసుకోవలసినది జీవుడేననీ, దేవుడు భగవంతునిగా వచ్చినది జీవునికి ఆత్మజ్ఞానము తెలియ జేయుటకేననీ,
ఆత్మజ్ఞానమును తెలుసుకొను జీవుడు నివాసమున్నది గుణ చక్రములోనేననీ, అందువలన గుణచక్రమును తెలుసుకోవడము
74

Page 75
బ్రహ్మ
కాల
కర్మ
గుణ
www
చక్రం
చక్రం
చక్రం
చక్రం
బ్రహ్మనాడి
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు
విశేష జ్ఞానమని తెలియవలెను. భగవంతునికి ఈ విషయము తెలియుట వలన గుణచక్రముతో సమాన పోలికలున్న
నెమలి ఫించమును తల మీద ధరించి చూపించాడు.
ఒక మనిషిని గుర్తించుటకు, ఇతను ఫలానా మనిషి అని తెలియుటకు ముందు అతని ముఖమును చూచి
అతను ఎవరైనది తెలుసు కొంటాము. ముందు పరిచయమున్నవానిని, ముందు చూచిన వానిని వాని ముఖమును
చూచి వీడు ఫలానావాడని తెలియవచ్చును. ముందు ఏమాత్రము పరిచయము లేని వ్యక్తిని కూడ ముఖమును చూచిన
తర్వాత ఇతను క్రొత్తవ్యక్తి అని గుర్తిస్తాము. అందువలన ఒక మనిషిని గుర్తించుటకు శరీరములో పై భాగమున ఉన్న
తలభాగమునే చూస్తాము అని చెప్పవచ్చును. కృష్ణుడు నేను ఫలానావాడినని తెలియచెప్పుటకు, ప్రతి మనిషి తెలియ
వలసినది ఇదేనని గుర్తు చేయుటకు, తన తలమీద నెమలిపింఛమును ధరించాడు. నెమలిపింఛము గుణచక్రముతో
సమానపోలికలు ఉండడము వలన నెమలిపింఛమును ఆయన ధరించి చూపాడు. అలా చూపడములో రెండు భావములు
ఇమిడివున్నవని చెప్పవచ్చును. ఒకటి అందరికీ ముఖ్యమైన జ్ఞానము ఇదేనని, అందరు తెలుసుకోవలసిన జ్ఞానము
ఇదేనని తెలుపు నిమిత్తము అందరు చూచునట్లు తలమీద ధరించడము జరిగినది. రెండవది నేను శరీరములో
ఉండినా మాయలో లేకుండా, మాయకు అతీత మైన యోగిగా ఉన్నానని తెలుపునిమిత్తము కూడ ఆ విధముగా ధరించాడని
తెలియుచున్నది. ఈ అర్థములలో కృష్ణుడు నెమలిపింఛమునే ధరించుటకు బలమైన కారణము కలదు. అది ఏమనగా
గుణచక్రమునకు సమానమైన పోలిక ప్రపంచములో ఒకే ఒక్క నెమలిపింఛమునకు మాత్రమే కలదు. ఇపుడు
నెమలిపింఛమునకు గుణచక్రమునకు ఎలా పోలికలున్నాయో గమనిద్దాము. నెమలిపింఛమును అందరూ చూచి
ఉంటారు. కానీ గుణచక్రమును ఇంతవరకు ఎవరూ చూడలేదు. గుణచక్రము కంటికి కనిపించునది కాదు. కావున
ఎవరూ చూడలేరని చెప్పుచున్నాము. కంటికి ఒక గుణచక్రమేకాదు, మిగత మూడు చక్రములు కూడ కనిపించవు.
అలాంటి బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల చట్రమును కంటికి కనిపించు బొమ్మగా చూపించాము. అంతేకాక ఈ
దినము త్రైత సిద్ధాంతమును తెలిసిన ప్రతి వ్యక్తి మతములకు అతీతముగా తన ముఖము మీద నుదుటి భాగమున
నాల్గుచక్రముల గుర్తును పెట్టుకోవడము జరుగుచున్నది. నాల్గుచక్రములను చిత్రించి చూపినపుడు క్రింద చక్రమైన
గుణచక్రమును కూడ వివరముగా తెలియునట్లు బొమ్మరూపములో చూపుచున్నాము. గుణచక్రము యొక్క చిత్రమును
తర్వాత పేజీలో చూడవచ్చును.
75

Page 76
తామసములో జీవుడు
115
గుణచక్రము
తామసము
రాజసము
సాత్త్వికము
×
యోగము
ఈ చిత్రములో కనిపించునట్లే మన శరీరములోని గుణచక్రము ఉన్నది. గుణచక్రములో ముఖ్యమైన నాలుగు
భాగములు కనిపిస్తున్నవి. అందులో బయటినుండి మొదటకలదానిని తామస గుణభాగము అంటాము. అలాగే బయటినుండి
రెండవది రాజసగుణభాగము అంటాము. మూడవ దానిని సాత్విక గుణభాగము అంటాము. నాల్గవది మరియు
అన్నిటికంటే మధ్యలోనిది అయిన చివరి దానిని గుణరహిత యోగము అనవచ్చును లేక ఆత్మ అని కూడ అనవచ్చును.
బయటినుండి మొదటి భాగమైన తామస భాగములోనున్న జీవున్ని తామసుడు అంటాము. రెండవ భాగములోనున్న
జీవున్ని రాజసుడు అని అంటాము. మూడవ భాగములో నున్న జీవున్ని సాత్వికుడు అంటాము. ఇక నాల్గవ చివరి
భాగము మధ్యలోనున్న జీవున్ని యోగి అంటాము. గుణచక్రము ఈ విధముగా నాలుగు భాగములుగా ఉండగా,
ఆయా సమయములలో, ఆయా భాగములో నున్న జీవులకు ఆ భాగము యొక్క పేరునే పెట్టారు. జీవుడు కర్మానుసారము
కొన్ని సమయములలో ఒక భాగములో ఉండును. మరికొన్ని సమయము లలో మరియొక భాగమునకు మారవచ్చును.
శాశ్వతముగా ఒకే భాగములోనే ఉంటాడని చెప్పలేము. ఎప్పుడు ఏ భాగములో ఉంటే అప్పుడు ఆ భాగము యొక్క
పేరు ఆ జీవునికి వర్తిస్తుంది. దీని ప్రకారము ఎక్కువ కాలము తామస గుణభాగములోనున్న జీవుడు కొన్ని సమయములలో
రాజసములోనికి పోవచ్చును, మరికొన్ని సమయములలో సాత్వికములోనికి కూడ పోవచ్చును. ఆ విధముగా పోయిన
సమయములో ఆ భాగము పేరును అతనికి చెప్పవచ్చును. ఎక్కువ కాలము ఏ గుణభాగములలో ఉంటే ఆ భాగము
యొక్క పేరునే వానికి పెట్టవలసివస్తుంది. ఒక దినములో 24 గంటల కాలములో, తామస భాగములో 23 గంటలుండి
ఒక గంట కాలము మాత్రము రాజసములో కొంతసేపు, సాత్వికములో కొంతసేపు ఉన్నవానిని తామసుడనే పిలవాలి.
అదే విధముగా మధ్య భాగమైన ఆత్మభాగములో ఎక్కువ కాలముండు వానిని యోగి అని పిలువవలెను. అట్లే మిగత
రాజస, సాత్త్విక గుణస్తులను కూడ పిలవవచ్చును.
గుణచక్రము ప్రతి జీవరాసికి ఉన్నా, ప్రతి జీవుడు గుణచక్ర భాగములలోనే చిక్కుకొనే ఉన్నా, జీవుడు శాశ్వతముగా
ఏ గుణభాగముల లోను ఉండక అప్పుడప్పుడు వేరు గుణ భాగములలోనికి పోవుచుండును. గుణచక్రముతో సమాన
పోలికలున్న నెమలిపింఛములో గుణభాగములు మూడు, గుణములేని భాగము ఒకటి, మొత్తము నాలుగు భాగములు
నాలుగు రంగులలో కనిపించుచున్నవి. కానీ ఆ నాలుగు భాగములలో జీవుని పోలిక అయిన ఏ రంగుగానీ, ఏ
గుర్తుగానీ లేదు. ఈ విధముగా ఎంతో విశేషమైన జ్ఞానమును నెమలిపింఛము మనకు తెలియబరుస్తున్నది. సృష్ఠి
మొదలుకొని ఇంతవరకు భగవంతునికి తప్ప ఎవరికీ గుణచక్రము మన శరీరములో ఉన్నదని, అందులోనే మనమున్నామని
76

Page 77
తెలియదు. ప్రతి జీవునికి నివాసస్థలము శరీరములోని గుణచక్రమే. శరీరములో గుణచక్ర మందున్న జీవుడు బయటి
ప్రపంచములో కలెక్టర్ ఉద్యోగము చేసినా, కండక్టర్ ఉద్యోగము చేసినా, తన అడ్రస్ (చిరునామ) తనకు తెలియని
స్థితిలో ఉన్నాడు. తాను శరీరముకాదని, తాను శరీరములోనున్న జీవుడనని తెలియక నేను ఫలానా మనిషినను
భావముతో ఉన్నాడు. ద్వాపరయుగము అంత్యములో ఇప్పటికి 5148 సంవత్సరముల క్రితము భగవంతుడు భగవద్గీతను
చెప్పి, అందులో గుణములను గురించి వివరించినా, సాత్వికుడు, రాజసుడు, తామసుడు, యోగి అను నాలుగువర్ణముల
మనుషులను చెప్పినా, ఇంతవరకు భగవంతుడు చెప్పిన జ్ఞానమును అర్థము చేసుకోలేని మనుషులు అజ్ఞాన చీకటిలో
మునిగి నేను బిలకలెక్టరు, నేను జిల్లా కలెక్టర్ను, నేను గుమస్తాను, నేను గూండాను అని అనుకొంటున్నారు. బయటి
ప్రపంచములో ఎంత చదువు చదివినా, ఎంత హెూదా ఉండినా తన అడ్రస్ తనకే తెలియని వానిని తెలివి తక్కువవాడని
అనవచ్చును.
గుణచక్రమునే మాయచక్రము అని కూడ అనవచ్చునని చెప్పు కొన్నాము. మాయ చక్రములోనే మాయవలలో
చిక్కుకొని తన స్థితిని తానే తెలియక ప్రతి జీవుడు బాధపడుచున్నాడని, గుణచక్రమును గురించి తెలుసుకోవడము ప్రతి
మనిషి కర్తవ్యమనీ, అలా తెలుసుకోవడము స్వధర్మమును తెలుసుకొన్నట్లేనని భగవంతుడు గీతలో బోధించాడు. అం
బోధించడమేకాక తన చిన్నవయస్సులోనుండి కృష్ణుడు తన తలమీద నెమలిపింఛమును ధరించాడు. అలా ధరించడము
వలన ఎదుటి వ్యక్తికి అది కనిపించును. దానిని చూచిన వ్యక్తి దాని సారాంశమును గురించి తెలుసుకొనునని కృష్ణుడు
నెమలిపింఛమును ధరించాడు. అంతేకాక ఆయన ధరించడములో ఇంకొక ముఖ్యమైన భావముకూడ కలదు. అదే
మనగా! నేను బయటికి ఒక వ్యక్తిగా కనిపించినా, ఎక్కడ తిరిగినా నేను మాత్రము తలలో గుణచక్రమందు మధ్యభాగములో
యోగినై ఉన్నానని తెలుపుటకు పింఛమును ధరించాడు. పింఛములో మధ్యలోగల ఆత్మభాగము ప్రత్యేకమైన గుర్తింపురంగుగా
ప్రక్కనున్న మూడు రంగులకంటే ఘాడముగా కనిపించు చుండును. అలా కనిపించడము వలన మూడు గుణభాగముల
కంటే ముఖ్యమైనది మధ్యలోని ఆత్మభాగమని చూడగానే తెలియుచున్నది. ఘాడముగా కనిపించు మధ్యభాగములో ఉ
ండి కృష్ణుడు పనులు చేయుట వలన ఆయన మాయకు అతీతుడుగా ఉన్నాడు. "గుణమయి మమ మాయా” అని
గీతలో చెప్పినట్లు త్రిగుణములే మాయ. మాయకు మధ్యలో ఆత్మస్థానములో ఉన్నవాడే యోగి. నెమలి పింఛములో
మధ్యలో ఘాడముగానున్న రంగు గుర్తింపుగా కనిపించుట వలన అందులో నేనున్నాను మీరుకూడ అందులోనికి రమ్మని
కృష్ణుడు తెలిపినట్లున్నది.
ఆధ్యాత్మిక రంగములో ఎంతో ప్రాముఖ్యతను కల్గియున్నది నెమలి పింఛము. నెమలిపింఛము యొక్క రహస్యము
ఒక్క కృష్ణునికి తప్ప ఎవరికీ తెలియదు. పింఛము కృష్ణుడు తలమీద పెట్టుకొని చూపించినా దానిని గుర్తుపట్టలేని
గ్రుడ్డివారుగా ప్రజలున్నారు. నెమలిపింఛమును దాని వివరమును తెలియాలంటే ముందు ఎవరికైన తన శరీర నిర్మాణము,
శరీరములో జరుగు పనిని గురించి తెలిసివుండాలి. గీతలో చెప్పు జ్ఞానము అంతయు మరియు నెమలిపింఛము యొక్క
గుర్తు యొక్క జ్ఞానము శరీరములోనిదే. కావున శరీరములోని పనితనము తెలిసిన వారికి సులభముగా నెమలిపింఛము
యొక్క వివరము అర్థమగును. కానీ నేటి కాలములో నెమలిపింఛమును గురించి ఆలోచించువారే లేరు. దానిని
ధరించిన కృష్ణుడు గొప్పవాడనిగానీ, ధరించబడిన పింఛము భగవద్గీతలో జ్ఞానయోగమున చెప్పిన "చాతుర్వర్ణమ్" అను
శ్లోకము యొక్క భావము అనిగానీ ఎవరికి తెలియకుండా పోయినది. మనిషి అజ్ఞానములో మునిగి మాయలో ఏ
విధముగా చిక్కుకొన్నాడో ఆ విధానమును తెలుపునది నెమలిపింఛము యొక్క జ్ఞానము. నెమలిపింఛమును గుణచక్రముగా
77

Page 78
పోల్చి చెప్పాడు కదా! పింఛము ఆకారమును చూచి దాని పూర్తి నిర్మాణ వివరమును గురించి తెలుసుకొందాము.
నెమలిపింఛము యొక్క చిత్రమును క్రింది పటములో చూడుము.
నెమలి పింఛము
నెమలి పింఛము క్రింది
భాగము
నెమలిపింఛము యొక్క తల భాగమునే కాక క్రింది తోక భాగమును కూడ గమనిస్తే తెల్లని కాడకు రెండు
ప్రక్కల పింఛము యొక్క కేశములు (వెంట్రుకలవలెవున్న రెమ్మలు) ఉండును. నెమలిపింఛమును చూచిన తర్వాత మన
శరీరమున తల భాగములోని మెదడును దానిక్రింది భాగములోని వెన్నుపాము అను పెద్దనరమును గమనిస్తే క్రింది
చిత్రములో మాదిరి ఉండును.
g
గుణచక్రము
బ్రహ్మనాడినుండి చీలివచ్చిన
శరీరమంతా వ్యాపించిన
చిన్న నరములు
-వెన్నుపాము అను బ్రహ్మనాడి
ma
శరీరములోని మెదడు దాని నరము - నెమలిపింఛము దాని క్రిందికాడ
78

Page 79
మనిషి శరీరములోని నాడీమండలమును గమనిస్తే తలయందు స్థూలముగా కనిపించునది మెదడు మరియు
మెదడునుండి క్రిందికి దిగిన వెన్నుపాము అను పెద్దనరము. అంతేకాక వెన్నుపాము అను పెద్దనరము నుండి రెండువైపులా
చీలిపోయిన చిన్నచిన్న నరములు క్రింది వరకు కనిపించును. వెన్ను నరము నడుము క్రింది వరకు వ్యాపించిన
వెన్నెముకలో అమరివుండును. తలనుండి నడుమువరకున్న వెన్నునరము (బ్రహ్మనాడి) తల నుండి రెండువైపుల క్రింది
వరకు చిన్నచిన్న నరములను శరీరమంతా వ్యాపింపజేసి ఉండును. శరీరమును గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి
స్థూలముగానున్న మెదడు, దానినుండి క్రిందివరకున్న పెద్దనాడి, పెద్దనాడి నుండి క్రింది వరకు రెండువైపులా ప్రాకిన
నరములు సులభముగా తెలిసి వుండును. శరీరములోని బ్రహ్మనాడి దాని అమరిక ఆరవతరగతి చదివిన పిల్లవానికి
కూడ తెలియును. కానీ మెదడులో సూక్ష్మముగ కనిపించకుండ వున్న గుణచక్రమూ, దాని భాగములు ప్రపంచములోని
అన్ని తరగతులు చదివిన పెద్దవానికి కూడ తెలియదు. సూక్ష్మముగ కనిపించక ఉన్న నాలుగుచక్రములు గానీ, చివరకు
క్రిందిచక్రమైన గుణచక్రముగానీ ఐదు శాస్త్రములను నేర్చిన శాస్త్రవేత్తలకు కూడ తెలియదు. ఐదు శాస్త్రములకంటే
ముందు పుట్టిన బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసిన వానికి మాత్రమే గుణచక్రము, మిగత నాలుగుచక్రముల వివరము
తెలియును. గుణ (మాయ) చక్రము యొక్క నిర్మాణమును తెలిసినవాడు దానితో సమాన పోలికలున్న నెమలిపింఛమును,
దాని వివరమును సులభముగా గ్రహించగలడు. ఆనాడు కృష్ణుడు శరీరములోని కనిపించని విధానము అంతయు
మరియు నాల్గుచక్రముల జ్ఞానమంతయు తెలిసినవాడు. కావున గుణచక్రముతో పోలికలున్న నెమలిపింఛమును తలమీద
ధరించి అందరూ చూచునట్లు చేశాడు.
శరీరములోనే మనిషిని నడిపించు యంత్రము తలయందు నాల్గు చక్రముల సముదాయములలో క్రింది చక్రములో
అమర్చబడి ఉన్నది. క్రింది చక్రమైన మాయచక్రము మనిషిని ప్రపంచములో అనేక విధముల నడిపించు ముఖ్యమైన
యంత్రము. దానిని గురించి తెలియనివాడు వాని జీవితమంతా దానినుండి బయటపడలేక దాని మాయలోనే
ఉండును. దానినుండి బయట పడాలంటే దుస్సాధ్యమని భగవద్గీతలో విజ్ఞాన యోగమున 14వ శ్లోకమందు "గుణమయీ
మమ మాయా దురత్యయా" అని భగవంతుడే చెప్పియున్నాడు. ఈ వాక్యమును బట్టి గుణచక్రములోని మాయ గుణముల
రూపములో ఉన్నదని, దానిని జయించుట దుస్సాధ్యమని అర్థమగుచున్నది. ఏ మనిషి అయినా నావలె మీరు
ప్రవర్తించండి అనీ ఆ విధముగా ప్రవర్తించుట వలన మీరు కూడ మాయను జయించిన వారగుదురని అందరికి
తెలియు నట్లు కృష్ణుడు నెమలిపింఛమును ధరించి చూపించాడు. నెమలి పింఛము గుణములకు నిలయమైన గుణచక్రమును
సూచిస్తున్నా, గుణములకు అతీతముగా ఆత్మ ఉన్నదని తెలియునట్లు మధ్యలో గాఢముగా నల్లగా కనిపించు భాగము
కూడ కలదు. అందులోనే నేనున్నానని కృష్ణుడు తెలియబరిచాడు. గుణచక్రమందు నేను మధ్యలో ఉన్నాను, మీరు
మధ్యలో లేకుండ ప్రక్కన మూడు భాగములలో ఉన్నారు. అందువలన నేను మాయలో లేను, మీరు మాయలో ఉన్నారు
అని భగవంతుడు తన నెమలిపింఛము ద్వారా చూపించి, గీత ద్వారా బోధించాడు. జగతిలో మొట్టమొదట నెమలిపింఛమును
గురించి వివరముగా తెలిసినవాడు, తెలిసి ధరించినవాడు కృష్ణుడు తప్ప ఎవరూ లేరు. నెమలిపింఛమును
ద్వాపరయుగములో ఆయన ధరించి చూపించినా, అరచి బోధించినా, ఇంతవరకు దానిని గురించి ఎవరూ యోచించలేదు.
నేను మేధావిననుకొన్న ఎవడూ దాని అర్థమును తెలియలేదు. చివరకు స్వాములు, గురువులు, పీఠాధిపతులు కూడ
భగవంతుడు ధరించిన నెమలి పింఛము యొక్క అంతరార్థమును తెలుసుకోలేక పోయారు. అంతపెద్ద జ్ఞాన విషయమును
నాద్వారా చెప్పించునట్లు తన పాలన ద్వార చేయించినందుకు సంతోషముతో దేవుని పాలకుల ద్వారా దేవునికి
నమస్కారములు తెలుపుకుంటున్నాము.
79

Page 80
ఇక్కడ ఎవరైనా ఒక ప్రశ్న అడుగుటకు అవకాశమున్నది. అదేమనగా! "నెమలిపింఛమును గురించి భగవంతునికి
తప్ప ఇంతవరకు ఎవరికీ తెలియదని చెప్పిన మీరు, దేవుడు ఎవరి ద్వారానో మీతో చెప్పించి నట్లు, మీరు దేవుని
పాలకుల ద్వారా దేవునికి నమస్కారములు తెలిపినట్లు వ్రాశారు కదా! అట్లు ఆయన పాలకుల ద్వార ఆయనకు
నమస్కారములు తెలుపుటకంటే దేవుడా! నేను నిన్ను నమస్కరించుచున్నాను అని అనవచ్చును కదా! మీరు దేవునికి
నేరుగా ఎందుకు నమస్కారములు తెలుపలేదు?” అని ప్రశ్నించవచ్చును. ఇటువంటి ప్రశ్నలు వచ్చునపుడు నా ప్రక్కవాడు
“నీ వేలు తీసుకొని నీ కన్నునే పొడుచుకొన్నట్లు నీ ప్రశ్నను నీవే అడిగి, చిక్కులో పడి కష్టపడి జవాబును చెప్పడము
దేనికి? ఎవరికి రాని ప్రశ్నను నీకు నీవే ఎందుకు ప్రశ్నించుకోవాలి? అని అడిగాడు. దానికి నేను “నా వేలుతో నా
కన్నును నేనే పొడుచుకొన్నట్లు నీకు కనిపించి ఉండవచ్చును. నేను అలా నీవనుకున్నట్లు చేయలేదు. నా కన్నుకు
దురుద పెడితే నా వేలితో నా కన్నును అదిమి దురదను లేకుండ చేసుకొంటున్నాను.” అని జవాబు చెప్పాను.
విధముగానే అనుమానము అను దురద పుట్టినపుడు కన్నును ఇలా దిద్దుకోవాలి అని ముందుగానే చూపుచున్నానని,
మీరు ఎందుకు అనుకోకూడదు అని కూడ అడుగుచున్నాను. ఏది ఏమైన నా అనుమానమునకు నామాటే తిరిగి జవాబైతే,
ఎవరి అనుమానమునకైనా అది జవాబగును అను నమ్మకముతో నేను ముందు ప్రశ్నించుచున్నాను. ఇపుడు మీరు
అడిగినట్లు నేను నేరుగా దైవమునకు ఎందుకు నమస్కరించ లేదంటే! చెప్పెదను వినుము. భగవద్గీతలో విశ్వరూపసందర్శన
యోగమందు 40వ శ్లోకమున అర్జునుడు దేవునికి నమస్కరించవలెనని, ఎక్కడ మ్రొక్కాలో తెలియక, ఎట్లు మ్రొక్కాలో
తెలియక ముందుకు, వెనక్కు, ప్రక్కలకు, క్రిందికి, పైకి మ్రొక్కుచున్నానని చెప్పాడట. దేవుడు కనిపిస్తేనే అర్జునుడు
ఎంతో తికమక పడిపోయి అన్ని ప్రక్కలా మ్రొక్కాడు. అంత పనిలేకుండ సులభముగా నేను చెప్పాను. నేను అలా
చెప్పడమును సులభము అని ఎందుకు చెప్పుచున్నానంటే, దేవుని బయోడేటా (దేవుని సమాచారం) అర్జునునికి అర్థముకానట్లు
మనకు కూడ అర్థముకాదు. ఆయన బయోడేటా పేపరును చూస్తే ఈ విధముగా ఉంది.
1)
పేరు
- పెద్ద.
2) ఊరు
విశ్వము.
3) కులము గోకులము.
-
4) తండ్రి
-
నేనే.
5) తల్లి
నేనే
6) వృత్తి
ఊరకుండడము.
7) ప్రవృత్తి - తెలియకుండడము
8) నీతి
జ్ఞానము.
9) న్యాయము - ధర్మము
10) భార్య
మీ అమ్మ.
11) పిల్లలు - మీరే
12) ఆకారము
-
కాలము.
13)
ఆహారము - మోక్షము
14) మెలుకువ - ప్రభవము.
15) నిద్ర ప్రళయము
16) రాజ్యము
-
పరలోకము.
17) పాలకులు – భూతములు
-
18) దండన
-
యమదండన
19) ప్రియకుమారుడు - యోగి
20) మనవడు -
జ్ఞాని.
80

Page 81
దేవుడు ఏ అంచనాకు దొరకనివాడు. అందువలన ఆయన జ్ఞానమును తెలిసినవారు భూమిమీద
ఉండవచ్చునుగానీ, ఆయనను తెలిసినవాడు ఎవడూ భూమిమీద లేడు. ఇంతవరకు దేవున్ని చూచినానని చెప్పువాడు
ఎవడూ లేడు. ఒకవేళ నేను దేవుని చూచాను అని ఎవడైనా అంటే ఆ మాట పూర్తి అసత్యము. ఎందుకనగా దేవుడు
దేవులాడ (వెతుకులాడ) బడువాడు, దొరుకువాడు కాదు. దేవుని వృత్తి ఊరకుండడము అయితే, దేవుని ప్రవృత్తి
తెలియకుండడము. అటువంటి ప్రవృత్తిగల దేవున్ని ఏ విధముగా కూడ నిరూపించలేము. బయటి నిరూపణలకు
తెలియని వాడు దేవుడు, కావున ప్రత్యక్షముగా మ్రొక్కలేము. అందువలన మనకంటే దేవునికి దగ్గరగానున్న ఆయన
పాలకుల ద్వారా నా నమస్కారములను దేవునికి తెలియజేశాము. ఎక్కడ ఏ నిరూపణకు రాని దేవుడు, విశ్వమంతా
వ్యాపించి ఉంటూ భగవంతునిగా జన్మించాడు, ఆ భగవంతుడే కృష్ణుడు. కృష్ణుడు సాధారణ మనిషిగా కనిపిస్తున్నా
ఆయనను భగవంతుని రూపములో నున్న దేవుడని చెప్పవచ్చును. అందువలన ఒక సందర్భములో నన్ను చూస్తే దేవున్ని
చూచినట్లేనని భగవంతుడు అన్నాడు.
దేవుడు సృష్ఠి పూర్వమే మాయను తయారుచేయగా, భగవంతుడు దానిని నెమలిపింఛరూపములో చూపించాడు.
నెమలిఫించమును భగవంతుడు సూచించినట్లు అది మన తలలోని గుణచక్రమేనని మేము చెప్పుచున్నాము. అది ఒక
చక్రమని తెలియుటకు నెమలిఫించము పాతబడి పోయినపుడు మేము తామస గుణభాగము అని తెలియజేసిన చివరి
వలయము యొక్క బయటి అంచులో వలయము (చక్రము)వలె కనిపించు నట్లు రంగుపోయివుండును. చుట్టు అంచులో
రంగుపోవడము వలన దానిని చక్రముగా గుర్తించుటకు సులభముగా ఉండును. రంగుపోయిన పింఛము యొక్క
అంచు భాగమును తర్వాత పేజీ చిత్రములో చూడవచ్చును.
ఇంతవరకు నెమలిపింఛము యొక్క ముందు భాగములో కనిపించు నాలుగురంగుల గురించి మరియు క్రింది
కాడ గురించి, కాడకు ఇరువైపుల నున్న కేశముల గురించి తెలుసుకొన్నాము. ఇవన్నియు ఆధ్యాత్మిక రంగములో ఎంతో
అర్థముతో కూడుకొన్నవని కూడ అర్థమైనది. నెమలి పింఛములో ఎంతో జ్ఞానము ఇమిడి ఉండుట వలన భగవంతుడైన
కృష్ణుడు ధరించాడని కూడ తెలుసుకొన్నాము. ఇవన్ని తెలిసిన తర్వాత మేము చెప్పునదేమనగా! దేవుడు కనిపించని
వాడు అయినప్పటికీ కనిపించని మాయను, దాని గుణముల రూపమును, అది శరీరములో ఎలా వ్యాపించి పని
చేయుచున్నదో ఆ విధానమును, కనిపించునట్లు నెమలిఫించములో అమర్చిపెట్టాడు. శరీరములోని కనిపించని మాయ
విధానము, కనిపించు నెమలి పింఛములో ఉన్నదని భగవంతుడు ధరించి దృశ్యరూపముగా చూపించాడు. దృశ్యరూపములో
మూడుగుణములు, వాటియందు జీవాత్మ, గుణముల మధ్యలో ఆత్మ ఉన్నది. నెమలిపింఛములో ఎంత వెతికినా మూడవ
ఆత్మ అయిన పరమాత్మ ఆచూకి కనిపించలేదు. అయితే సూత్రము ప్రకారము కనిపించని మాయకు, జీవునికి, ఆత్మకు,
కనిపించు గుర్తులైన రంగులను నెమలిపింఛములో చూపినపుడు, అట్లే కనిపించని దేవుని (పరమాత్మ) గుర్తును కూడ
పింఛములో చూపివుండవలెను కదా! అని యోచిస్తే కొంత సమాచారము తెలియుచున్నది. అదేమనగా!
సకల సృష్టిని తయారు చేయకముందు దేవుడు పని చేశాడు. సృష్ఠి తయారైన తర్వాత దేవుడు ఏ పనిని
చేయనివాడై పోయాడు. సృష్టి అంతటికి మూలకారణము పరమాత్మయే. పరమాత్మ పని చేయకున్ననూ ఆయన
ఉంటేనే అన్నీ ఉన్నాయి. ఆయన కనిపించకున్ననూ ఆయన చేయనిది ఏదీ లేదు. సకల జీవరాసులను పుట్టించువాడు,
సాకువాడు (పోషించువాడు), చంపువాడు దేవుడే. అయినా ఆయన ఎక్కడా కనిపించక అన్నిటిని ఆయన పాలకుల
చేయించుచున్నాడు. దేవుడు లేకుండా మాయగానీ జీవాత్మగానీ ఆత్మగానీ ఎవరు లేరనుటకు చిన్న ఉదాహరణను
ద్వారా
81

Page 82
చెప్పుకొందాము. పంచవన్నెల రామచిలుక బొమ్మను గీయాలని (చిత్రించాలని) ఒకడు అనుకొన్నాడు. పంచవన్నెల
రామచిలుకను జూపార్కులో మనము చూడవచ్చును. పంచవన్నెల రామచిలుక అనగా ఐదు రంగులతోనున్న రామచిలుక
అని అర్థము. చిత్రకారుడు ఐదురంగుల చిలుకను చిత్రించాలనుకొన్నపుడు ఐదురంగులను తీసుకొని, ఒక తెల్లని
మందముగానున్న కాగితమును (ఆర్టు పేపర్ను) తీసుకొన్నాడు. ఐదురంగుల చిలుకను జూపార్కులో చూచినది చూచినట్లు
గీయాలనుకున్నాడు. అట్లే మొదలుపెట్టి గీచాడు. జూపార్కులో చిలుక ఏ విధముగా ఉందో నూటికి నూరుపాళ్ళు అదే
విధముగా ఉన్నట్లు గీయగలిగాడు. ఆ చిత్రపటమును చూస్తే పార్కులో చిలుకను చూచినట్లే ఉన్నది.
అలా చిత్రించిన పంచరంగుల చిలుక చిత్రపటమును గోడకు తగిలించి పెట్టాడు. ఆ చిత్రకారుడు పార్కులోనున్న
చిలుక మాదిరి ఉన్న బొమ్మను గీచాడని తెలుసుకొన్న అతని స్నేహితుడు ఆ బొమ్మను చూడాలని వచ్చాడు. స్నేహితుడు
వచ్చిన సమయానికి చిత్రమును గీచిన చిత్రకారుడు ఇంటిలో లేడు. వచ్చిన స్నేహితుడు గీచిన బొమ్మను చూడాలని
వచ్చాడు, కావున ఇంటిలోనున్న గోడకున్న బొమ్మలను చూచాడు. కానీ చిలుక పటము కనిపించలేదు. దానికి
కారణమేమనగా! ఆ స్నేహితుడు చిత్రకారుని ఇంటికి రాకముందు ఒక గంటక్రితము పెద్దగాలి వీచింది. అలా వీచిన
గాలికి ఆ చిత్రపటము తిరగబడింది. అది గోడకే ఉండినా గాలికి తిరగబడుట వలన, ముందువైపు కనిపించు చిలుకబొమ్మ
గోడవైపుకు పోయింది. గోడవైపువున్న తెల్లని కాగితము ముందువైపుకు వచ్చింది. అలా ఉండుటవలన చిలుక బొమ్మ
కనిపించక తెల్లని కాగితము మాత్రము కనిపిస్తున్నది. అప్పుడు చిత్రకారునికి అతని స్నేహితుడు ఫోన్చేసి చిలుక ఉన్న
పటము ఎక్కడుంది అని అడిగాడు. మొదట హాలులో ఎదురుగా కుడిప్రక్కన ఉంది చూడు అని చిత్రకారుడు చెప్పాడు.
అతను చెప్పిన స్థలములో ఏ బొమ్మ గీయని తెల్లని కాగితముండుటను స్నేహితుడు చూచి ఇది తిరగబడిందని తెలిసి
త్రిప్పి చూచాడు. అప్పుడు ఐదు రంగుల చిత్రము కనిపించింది. చిత్రకారుని ఇంటికి వచ్చిన అతను స్నేహితుడు
మొదట బొమ్మలేని తెల్లకాగితమును చూచాడు. తర్వాత బొమ్మ ఉన్న రంగుల భాగమును చూచాడు. దీనినిబట్టి ఇప్పుడు
మనకు అర్థమగునది ఏమనగా!
బొమ్మను కాగితము మీద గీచాము. తెల్లని కాగితము బొమ్మకు ఆధారము. కాగితము మీద బొమ్మ ఉంది.
కాగితము తెల్లనిదైనప్పటికీ ఒక ప్రక్క రంగుల బొమ్మను చూపుచున్నది. మరొక ప్రక్కన తన సహజత్వము అయిన
బొమ్మలేని తెల్లని కాగితము కనిపిస్తున్నది. ఐదురంగుల చిలుకను చూపుచున్న కాగితము తన అసలు రంగును
కనిపించకుండ దాచి పెట్టినట్లు రెండవవైపున కనిపించక ఉన్నది. చూచువారందరు ముందున్న పంచ వన్నెల చిలుకను
మాత్రము చూస్తారు. కానీ ఆ బొమ్మకు ఆధారమైన కాగితము యొక్క అసలు రంగును ఎవరూ చూడరు. ఈ బొమ్మ
ఉండాలంటే ఈ కాగితమే ఆధారము కదా అని ఎవరూ యోచించరు. బొమ్మకు కాగితము ఎలా ఆధారమో, ఈ
కనిపించే ప్రపంచమునకు కూడ దేవుడు ఆధారముగా ఉన్నాడు. కాగితము లేకపోతే పంచరంగుల చిలుక ఎట్లు లేదో,
అలాగే దేవుడు లేకపోతే పంచభూతముల ప్రపంచము కూడ లేదని తెలియాలి. కనిపించే పంచవన్నెల చిలుకను చూచువాడు
దానికి ఆధారమైన కాగితమును గురించి ఎలా యోచించడో, అలాగే కనిపించే పంచభూతముల జగతిని చూచువారు
దానికి ఆధారమైన దైవమును గురించి ఎవరూ యోచించడము లేదు. వెనుకవైపు కనిపించక ఉన్న తెల్లని కాగితము
ముందువైపు రంగుల చిలుకను చూపునట్లు, వెనుకవైపు కనిపించకుండ దాగివున్న దేవుడు ముందువైపు రంగుల ప్రపంచముగా
కనిపించుచున్నాడు. ఇంతవరకు చెప్పిన కాగితము, రంగులచిలుక విధానములో కనిపించే ప్రపంచము, కనిపించని
దేవుని విధానమున్నట్లు, నెమలిపింఛములో కూడ ఇలాంటి రహస్యమే కలదు. అదేమనగా!
82

Page 83
మన శరీరములోని గుణచక్రములో ఉన్న మాయకు, జీవునికి, ఆత్మకు దేవుడే ఆధారముగా ఉన్నాడు. పంచరంగుల
చిలుకతో సమానముగా మూడు గుణములు + జీవాత్మ + ఆత్మ అను ఐదు భాగములుగా గుణచక్రము గలదు.
గుణచక్రము వెనుక తెలియకుండ ఉండి నడిపించు మూల పురుషుడు దేవుడే. కానీ దేవుని గురించి ఎవరూ యోచించడము
లేదు. నెమలిపింఛము ముందు భాగములో రంగుల భాగములు కనిపిస్తున్నవి. నెమలిపింఛమును త్రిప్పి వెనుక
భాగమును చూస్తే ముందున్న ఏ రంగూ కనిపించదు. చిలుకకు కాగితము ఆధారమైనట్లు నెమలిపింఛము యొక్క
ముందువైపు కనిపించు మాయకు, జీవాత్మకు, ఆత్మకు దైవము ఒక్కడే ఆధారమన్నట్లు ఫించము వెనుక ఒకేరంగు
కనిపిస్తున్నది. తనయందే మాయ ఉండినా, జీవాత్మ, ఆత్మ ఉండినా వాటి ఆనవాళ్ళు ఏమీ కనిపించకుండ దేవుడున్నాడు
అనుటకు గుర్తుగా నెమలి పింఛమునందు ముందువైపు మాయకు, జీవునికి, ఆత్మకు గుర్తుగా పింఛములోని రంగులు
కనిపిస్తున్నా, వెనుక వైపు చూస్తే ముందువైపు వున్న రంగుల ఆనవాళ్ళు ఏమాత్రము కనిపించడము లేదు. దీనినిబట్టి
దేవుడు ఒకవైపు అన్నీ తానైవున్నా, అన్నిటికంటే నేను వేరుగా ఉన్నాను అని తెలుపుటకు ఆ విధముగా పింఛమునకు
ముందున్న రంగులు వెనుక కనిపించడములేదని తెలియుచున్నది. చిత్రపటములోని చిలుకమీద ధ్యాసను పెట్టి చూచువారు
ఏ విధముగా దానికి ఆధారమైన కాగితమును ధ్యాసలో ఉంచుకోవడము లేదో, అదేవిధముగా ప్రపంచధ్యాసలో మునిగిపోయిన
వాడు మాయకు జీవునికి, ఆత్మకు ఆధారమైన దేవుని మీద ధ్యాస ఉంచడము లేదని తెలియజేయుచున్నాము.
”
భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 4వ శ్లోకములో "మత్ స్థాని సర్వభూతాని" అని కృష్ణుడు చెప్పాడు.
స్థానములో అన్ని జీవరాసులున్నాయని దాని అర్థము. తర్వాత ప్రక్కన 5వ శ్లోకములోనే "నచ మత్ స్థాని భూతాని"
అని ఆయనే చెప్పాడు. నాయందు ఏ జీవరాసి లేదు అని ఈ మాట యొక్క అర్థము. ఇక్కడ బాగా గమనిస్తే ముందు
శ్లోకములో “మత్ స్థాని భూతాని" అన్నవాడు క్రింది శ్లోకములోనే "నచ మత్ స్థాని భూతాని " అనడములో బయటికి
చూచుటకు ఒకదానికొకటి పూర్తి విరుద్ధ భావము కనిపిస్తున్నది. ప్రక్కప్రక్కనే శ్లోకములలోనే మొదట “నాయందు సర్వ
జీవరాసులున్నాయి” అని చెప్పిన భగవంతుడు, రెండవ శ్లోకములోనే “నా యందు ఏ జీవరాసీలేదు" అని చెప్పాడు. వినే
దానికి భగవంతుడే అబద్ద మాడుచున్నాడే అని అనుమానము వచ్చును. భగవంతుని రెండు మాటలలో ఒకటి ఒప్పు
అయితే రెండవది తప్పు అగును. కానీ ఇక్కడ రెండు మాటలు ఒప్పే అగును. భగవంతునికి అబద్దము చెప్పవలసిన
అవసరములేదు. ఆయన రెండు మాటలు ఎలా సత్యమో వివరించు కొందాము. ఇంతకు ముందు చెప్పుకొనిన
కాగితము బొమ్మ ఉదాహరణను తీసుకొందాము. కాగితము మీద చిలుకబొమ్మ బయటికి కనిపిస్తున్నపుడు “మత్ స్థాని
చిలుక” (నా యందు చిలుక ఉన్నది) అని కాగితము చెప్పితే ఆ మాట వాస్తవమే అగును. కాగితము తిరగబడి, చిలుక
బొమ్మ గోడవైపు వుండి బయటివైపు ఖాళీ కాగితము కనిపించునపుడు అదే కాగితము "నచ మత్ స్థాని చిలుక” (నా
యందు చిలుక లేదు) అని చెప్పితే ఆ మాట అప్పటికి సత్యమే అగును. ఒకే కాగితము మీద ఒక ప్రక్క చిలుక ఉన్నది,
ఒక ప్రక్క చిలుకలేదు. అలాగే ఒకే దేవునియందు ఒక విధముగ చూస్తే సర్వజీవరాసులు ఉన్నవి. మరొక విధముగ
చూస్తే ఏ జీవరాసిలేదు. దీని ప్రకారము అర్థము చేసుకొంటే రెండు శ్లోకములలోని మాటలు సత్యమే అగును.
విధానమును నెమలి పింఛము కూడ చూపుచున్నది. నెమలి పింఛములో మాయచక్రము (గుణచక్రము) ఉన్నది అని
చెప్పవచ్చును. తర్వాత నెమలిపింఛములో మాయచక్రము ఏమాత్రములేదని కూడ చెప్పవచ్చును. రెండు మాటలు
వాస్తవమే ఎందుకనగా! ఒక ప్రక్క పింఛములో మాయచక్రము కనిపిస్తున్నది. మరొక ప్రక్క మాయచక్రము ఏమాత్రము
కనిపించడము లేదు. ఈ విధముగ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన "మత్ స్థాని భూతాని" అను మాటకు, అట్లే "నచ
83

Page 84
మత్స్థాని భూతాని" అను మాటకు సరియైన పోలిక నెమలి పింఛములో కలదు. కావున అన్ని విధముల జ్ఞాన సందేశమునకు
నిలయమైన నెమలిపింఛమును భగవంతుడైన కృష్ణుడు ధరించాడు. అలా ఆయన ధరించడము వలన అది ప్రజలకు
జ్ఞానసందేశమైనది. అయినప్పటికి కృష్ణుని విలువ తెలియని మనుషులు, కృష్ణుడు ధరించిన నెమలిపింఛమును ఖాతరు
చేయలేదు. అందువలన నెమలిపించము అంటే ఏమిటో ఎవరికీ తెలియకుండ పోయినది. ఇప్పటినుంచైనా కృష్ణుడు
ధరించిన నెమలిపింఛమును గురించి తెలుసుకొనే దానికి, భగవంతుడైన కృష్ణున్ని అర్థము చేసుకొనే దానికి ప్రయత్నించి,
దానివలన ముక్తి పొందమని తెలుపుచున్నాము.
కృష్ణుడు బ్రహ్మచారియా? స్వల్పాచారియా?
బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము. పెద్దకు వ్యతిరేక పదము చిన్న అగును. చిన్న అను పదమును స్వల్ప
అనికూడ చెప్పవచ్చును. ఆచారి అనగా ఆచరించువాడని అర్థము. బ్రహ్మచారి అనగా బ్రహ్మ ఆచరణను ఆచరించువాడని
అర్థము. దానినే పెద్ద ఆచరణను ఆచరించువాడని కూడ చెప్పవచ్చును. జగతిలో అన్నిటికంటే పెద్ద, దేవుడే అగును.
అట్లే అన్నిటి కంటే పెద్ద ఆచరణ, దేవుని ధర్మాచరణ అగును. దేవుని ధర్మములను ఆచరించువానిని బ్రహ్మచారి అని
అనుచున్నాము. దేవునికి వ్యతిరేఖ దిశలోనున్న మాయయొక్క అధర్మ ఆచరణను ఆచరించువానిని స్వల్పాచారి అనవచ్చును.
కృష్ణుడు స్వయముగా దేవుని ధర్మములను బోధించుటకు భూమిమీదికి వచ్చిన భగవంతుడు. ఆయన దైవ ధర్మములను
ఆచరించి అందరికీ మార్గదర్శకుడుగా ఉన్నాడు. అందువలన కృష్ణుడు నూటికి నూరుపాళ్ళు బ్రహ్మచారియేనని చెప్పవచ్చును.
పెళ్ళైన వానిని సంసారి అని, పెళ్ళి కానివానిని బ్రహ్మచారి అని అంటుంటారు. ఆ మాట ఎంతవరకు సత్యమని
కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! ప్రజలు అనునది సత్యమా కాదా అని
ఆ పదములోని అర్థమును
ఆధారము చేసుకొని మీరే చూడవచ్చును. బ్రహ్మచారి అను పదమునకు అర్థము బ్రహ్మము యొక్క ధర్మముల ఆచరణను
ఆచరించు వాడు అని చెప్పుకొన్నాము కదా! అటువంటపుడు పెళ్ళైయిన వాడు, పెళ్ళికానివాడు ఎవడైన దేవుని ధర్మములను
ఆచరించుటకు అవకాశము కలదు. ధర్మముల ప్రకారము ప్రవర్తించినపుడు పెళ్ళైన వానిని కూడ బ్రహ్మచారి అని
అనవచ్చును. అలాగే పెళ్ళికాని వానిని కూడ ధర్మఆచరణను బట్టి చెప్పచ్చును. అంతేకాని బ్రహ్మచారికి పెళ్ళికి
ఏమాత్రము సంబంధము లేదు. అదే విధముగా సంసారి అను పదమును తీసుకొని చూస్తే మంచిసారము కలది అని
అర్థము కాగలదు. ప్రపంచములో మంచి సారమున్నది ఒకే ఒక దైవజ్ఞానము తప్ప ఏదీ లేదు. భార్యాపిల్లలను కలిగి
ఉండడము సంసారము అని అనుకోకూడదు. భార్యాపిల్లలతో కాపురము చేయువానిని సంసారి అని, భార్య పిల్లలను
వదిలిన వానిని సన్న్యాసి అనడము తప్పగును. భార్య పిల్లలతోనున్న వారిలో కొందరు గొప్ప సన్న్యాసులు కూడ కలరు.
అలాగే భార్యాపిల్లలు లేనివారిలో గొప్ప సంసారులు గలరు. భగవద్గీతయందు ఆత్మసంయమ యోగమున మొదటి
శ్లోకమందు కర్మ ఫలమును ఆశ్రయించక కార్యములను చేయువానిని నిజమైన సన్న్యాసి అనవచ్చును అని అన్నారు. ఈ
శ్లోకములో సన్న్యాసి అంటే భార్య పిల్లలను వదలినవాడని చెప్పలేదు కదా! ఈ విధముగ నిజమైన అర్థముతో చూస్తే
నిజమైన భావము తెలియగలదు.
సరియైన భావముతో చూస్తే కృష్ణుడు గొప్ప బ్రహ్మచారి. ఆయన పెళ్ళికాకముందు బ్రహ్మచారియే! అలాగే
పెళ్ళైన తర్వాత కూడ బ్రహ్మ చారియే!! కృష్ణునికి పెళ్ళికాకముందు కూడ కృష్ణుడు సంసారియే, అలాగే పెళ్ళైయిన
తర్వాత కూడ సంసారియే. కృష్ణునికి పెళ్ళికాకముందు కూడ ఆయన సన్యాసియే. పెళ్ళైయిన తర్వాత కూడ సన్యాసియే.
84

Page 85
స్కలనము లేక
కృష్ణుడు బ్రహ్మచారియే కాక ఆయనకు అస్కలిత బ్రహ్మచారి అని కూడ బిరుదు కలదు. బ్రహ్మచారి అంటే వివరము
తెలిసినది. స్కలిత, అస్కలిత పదములకు అర్థము కొందరికి తెలియకపోవచ్చును. ఇపుడు దాని వివరము చెప్పుకొందాము.
స్కలిత్ అను పదమును సంస్కృత భాషలో స్థలిత అంటాము. తెలుగులో మనము స్కలిత అంటున్నాము. దీని అర్థము
జారిపోవుట, పడిపోవుట. మనిషి ఒక్కొక్కప్పుడు తానున్న ఉన్నత స్థాయినుండి జారిపోయి లేక పడిపోయి తగ్గుస్థాయికి
వచ్చుచుండును. అంతేకాక తననుండి ఏదైనా జారి పోయినపుడు స్కలిత అను పదమును వాడుచున్నాము. మగ
మనుషులలో వీర్యము జారిపోవడమును స్కలితము అంటాము. దీర్ఘనాడి, మధ్యనాడి, స్వల్పనాడి లేక ధీర్ఘస్కలన
మధ్యస్కలన, శీఘ్రస్కలన అను మూడు రకముల వ్యక్తులుంటారని వైద్యులు చెప్పగా విన్నాము.
స్కలితము అనునవి భౌతికముగ మరియు మానసికముగ రెండు రకములు ఉండును. మనిషిలో వీర్య స్కలనమును
భౌతిక స్కలనము అంటాము. అలాగే యోగ భావమునుండి తప్పి పోవడమును మానసిక స్కలనము అంటాము.
మనిషి మనోబలము చేత కర్మయోగమును చేయుచుండును. మనస్సును లేకుండ చేయడము బ్రహ్మయోగమగును.
కర్మయోగి మనోబలమును కోల్పోతే యోగభ్రష్టుడు అగును. అలాగే బ్రహ్మయోగి మనోబలమును కల్గితే యోగభ్రష్టుడగును.
మనిషి చేయు కర్మయోగముకానీ, బ్రహ్మయోగముకానీ రెండూ దేవుని ధర్మములను ఆచరించు ప్రక్రియలే. కావున ఆ
రెండు యోగములను కానీ, రెండిటిలో ఒక్క యోగమునుకానీ ఆచరించువానిని బ్రహ్మచారి అని అనవచ్చును. కృష్ణుడు
కర్మయోగమును ఆచరించుచుండుట వలన ఆయనను బ్రహ్మచారి అన్నాము. ఒక మనిషి యోగమును ఆచరిస్తూవుండి
కొంత కాలమునకు మాయా ప్రభావముతో యోగమును ఆచరించడములో చేతకాకపోతే వానిని యోగభ్రష్టుడు అంటాము.
అటువంటి వానిని యోగమునుండి జారి పోయినవాడని అనవచ్చును మరియు అతనిని స్కలిత బ్రహ్మచారి అని కూడ
అనవచ్చును. కృష్ణుడు తన జీవితములో కర్మయోగము నుండి ఎప్పుడూ జారిపోలేదు. యోగమునుండి జారిపోని
విధానమును ప్రజలకు తెలియజేసిన వ్యక్తి కృష్ణుడు. తపస్సులు, యజ్ఞములు, వేదములు తప్ప యోగమంటే ఏమిటో
తెలియని కాలములో భూమిమీదికి వచ్చి యోగమును గురించి తెలియజేసిన ఏకైక వ్యక్తి కృష్ణుడు. యోగము యొక్క
రహస్యములను తెలియ చెప్పిన కృష్ణుడు తాను స్వయముగా కర్మయోగమును ఆచరించి మానవులందరికి మార్గ
దర్శకుడయ్యాడు. కర్మయోగములో మార్గదర్శకుడైన కృష్ణుడు ఎప్పుడూ తన యోగమునుండి జారిపోలేదు. కృష్ణుడు
యోగబ్రష్టుడయ్యాడని అంటే శరీర వ్యాయామమును నేర్పించువాడు (ఫిజికల్ ట్రయినింగ్ మాస్టర్) వంగలేడు అంటే
ఎంత అసత్యమగునో, అంతే అసత్యమగును. కృష్ణుడు యోగము యొక్క పుట్టుపూర్వోత్తరములను తెలిసినవాడు.
ఆయన కర్మయోగము నుండి ఎప్పుడూ తప్పిపోవడముగానీ లేక జారిపోవడముగానీ జరుగలేదు. అందువలన ఆయనను
అస్కలిత బ్రహ్మచారి అని అంటున్నాము. కృష్ణుడు బ్రహ్మచారియేకాక అస్కలిత బ్రహ్మచారి అని ఆయనను ఒక్కనినే
చెప్పవచ్చును. భూమిమీద ఆయనకు ఒక్కనికే ఆ బిరుదు దక్కుతుంది.
కృష్ణుడు యుద్ధములో పారిపోయాడా?
అవును కృష్ణుడు యుద్ధములో జరాసంధుని చేతిలో ఓడిపోయి పారిపోయాడనుటలో ఎటువంటి సంశయము
లేదు. జరాసంధుడు కంసునికి బిడ్డలనిచ్చిన మామ అగును. ఆస్తి, ప్రాస్తి అను పేర్లుగలవారు జరాసంధుని ఇద్దరు
బిడ్డలు, కంసుని భార్యలగుదురు. కృష్ణుడు కంసుని చంపుట వలన, తన ఇద్దరు బిడ్డలు విధవలు అగుట వలన,
జరాసంధుడు కృష్ణుని మీద శతుృత్వము వహించి యుద్ధమును ప్రకటించి మధురమీద దండెత్తి వచ్చాడు. కంసున్ని
చంపిన వెంటనే జరాసంధునితో కృష్ణుడు యుద్ధము చేయవలసి వచ్చినది. అప్పటికి కృష్ణుని వయస్సు కేవలము 12
85

Page 86
సంవత్సరములు మాత్రమే. బలరాముడు కృష్ణునికంటే 9 సంవత్సరములు పెద్ద అగుట వలన ఆయన వయస్సు 21
సంవత్సరములు. ఆ యుద్ధములో కృష్ణ బలరాముల చేతిలో జరాసంధుడు ఓడిపోయి పారిపోయాడు. అలా కృష్ణబలరాముల
చేతిలో ఓడిపోవడము జరాసంధునికి చాలా అవమాన మైనది. ఆ అవమానమును భరించలేక తర్వాత సంవత్సరమునకు
తిరిగి మధుర మీదికి యుద్ధమును ప్రకటించి అప్పుడు కూడ ఓడిపోయాడు. ఈ విధముగ ప్రతి సంవత్సరము కృష్ణుని
మీద యుద్ధమునకు రావడము, ఓడిపోవడము జరిగెడిది. అట్లు 18 మార్లు జరాసంధుడు ఓడిపోయాడు. కృష్ణునికి 30
సం|| వయస్సులో 19వ మారు కాలయవనునితో కలిసి మధుర మీద దండెత్తి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఓటమిని
పొందాడు. జరాసంధుడు యుద్ధములో గెలిచి మధురలోనున్న కృష్ణ బలరాములను సంహరించాలని అనుకొన్నాడు.
కానీ జరాసంధుడు మధురను చేరేలోపలే కృష్ణ బలరాములు ఇరువురూ రహస్య మార్గము ద్వారా ద్వారకకు పారిపోయారు.
కృష్ణుడు సాధారణ మనిషికాదు భగవంతుడని చెప్పారు కదా! అలాంటపుడు భగవంతుడు సాధారణ మనిషికి
భయపడి పారిపోవడమేమిటి అని కొందరడుగ వచ్చును. దానికి జవాబు ఏమనగా! కృష్ణుడు దైవ జ్ఞానమును చెప్పుట
కొరకు భగవంతునిగా వచ్చాడు. కానీ భూమిమీద యుద్దములు చేసి జయించుటకు రాలేదు కదా! భగవద్గీతలో కూడ
ధర్మములను తిరిగి పునరుద్ధరించుటకు వస్తానని చెప్పాడు తప్ప ఏ రంగములోనైనా తాను గొప్పగ కనిపిస్తానని
చెప్పలేదు కదా! భగవంతుడు భూమిమీదకు వచ్చినపుడు తాను భగవంతుడనని తెలియునట్లు ప్రవర్తించడు. తనను
ఎవరూ గుర్తించలేనట్లు సాధారణ మనిషివలె కనిపించును తప్ప ప్రపంచ విషయములలో ప్రత్యేకతను కల్గియుండడు.
భగవంతుని ప్రత్యేకత అంతా ఒక్క దైవజ్ఞానములోనే ఉండును. ముఖ్యముగ చెప్పుకొంటే భగవంతుని ప్రత్యేకత
స్థూలముగా ఎక్కడా కనిపించదు. ఆయన ప్రత్యేకత అంతా సూక్ష్మముగా ఉండును. మనుషులకు సూక్ష్మము యొక్క
విధానము ఏమీ తెలియదు. మనుషులు కేవలము స్థూలముగానున్న దానినే చూడగలరు. సూక్ష్మముగానున్న భగవంతుని
ప్రతిభ ఏమిటో తెలియని దానివలన భగవంతున్ని ఎవరూ గుర్తించలేరు. దైవజ్ఞానములో ఎవరూ చెప్పలేని, ఎవరికీ
తెలియని ధర్మములను కృష్ణుడు చెప్పినా, ఆనాటి ప్రజలుగానీ, ఈనాటి ప్రజలుగానీ కృష్ణున్ని భగవంతుడని నమ్మలేదు.
జరాసంధుడు 19వ మారు యుద్ధములో గెలిచిన సమయానికి కృష్ణుడు దైవజ్ఞానమును ఎక్కడా చెప్పలేదు. దైవజ్ఞానమును
కూడ చెప్పకుండ సాధారణ మనిషివలె ప్రవర్తించాడు. అప్పటి వరకు సాధారణ మనిషిగానే ఉన్నాడు. కృష్ణుడు 18
మార్లు గెలిచి, ఒకమారు ఓడిపోవడముతో ఆయన భగవంతుడేనా అని ప్రశ్న వచ్చుటకు అప్పటికి ఆయన భగవంతుడని
ఎవరికీ తెలియదు కదా! అందువలన భగవంతుడైతే ఓడిపోతాడా? అని అడుగుటకు అవకాశమే లేదు. ఒకవేళ
అడిగినా భగవంతుడు ప్రపంచములో ఓడి పోకూడదను నిర్ణయము ఏమిలేదు కదా! భగవంతుడైన అతను కూడ
నిర్ణయించుకొన్న కర్మ ప్రకారమే నడువవలెననునది శాసనము. అందువలన భగవంతుడు ఓడిపోవడములో ఆశ్చర్యము
లేదు.
కృష్ణుడు చిన్న వయస్సులోనే జ్ఞానమును ఇతరులకు చెప్పాడని భాగవత పురాణములో వ్రాశారు. భాగవతము
శాస్త్రముకాదు, పురాణము. పురాణములోని అన్ని మాటలను నమ్మకూడదు. కృష్ణుడు భారతయుద్ధములో కురుక్షేత్రమున
దైవధర్మములైన గీతను బోధించాడు. అంతవరకు తనకు జ్ఞానము తెలియనట్లు, అజ్ఞానివలె ప్రవర్తించాడు. 90
సంవత్సరములు జీవితమును గడిపాక అప్పుడు ధర్మములను తెలియచేశాడు. క్షీణించి పోవుచున్న ధర్మములను
ఉద్దరించుటకు వచ్చానని తెలిపాడు. ఆయన చిన్నతనమునుండి దైవధర్మము ప్రకారమే నడుచుకొనుచున్నాననీ, కర్మ
యోగమును ఆశ్రయించి ఉన్నానని తెలిపాడు. అప్పటివరకు కృష్ణుడు జ్ఞాని అను విషయము కూడ ఎవరికీ తెలియదు.
86

Page 87
ఆయన ఫలానావాడు అని తెలియకుండుటకు జరాసంధునికి భయపడినట్లు, ప్రాణ భయముతో పారిపోయినట్లు మనకు
కనిపించాడు.
కృష్ణుడు దైవధర్మములను అర్జునునికే ఎందుకు చెప్పాడు?
అధర్మములుగా మారివున్న ధర్మములను తిరిగి ధర్మములుగా తెలియజెప్పుటకు కృష్ణుడు భూమిమీద ఉద్భవించాడు.
కృష్ణుడు చెప్పవలసిన ధర్మములు అధర్మములుగా మారిపోయి ముఖ్యమైన వారి తలలో కూర్చున్నవి. ఆ కాలములో ఏ
విషయమైన గ్రంథరూపములో వ్రాయగలుగు వ్యక్తి వ్యాసుడు. అటువంటి వ్యాసుడు ఏమి చెప్పినా, ఏమి వ్రాసినా నమ్మే
ప్రజలు ఆనాడు ఉండెడివారు. ఆనాడు నాల్గువేదములను, పదునెనిమిది పురాణములను వ్యాసుడు వ్రాసిపెట్టాడు.
విద్యాసంపన్నుడైన వ్యాసుడు ఆ విధముగా ఉండగా, అధర్మములైన యజ్ఞములు, తపస్సులు, వేదపఠనములు ప్రజలలో
చొచ్చుకొని పోయి, అవియే ధర్మముల రూపములో వారియందు ఇమిడిపోయినవి. ఈ విధముగా అధర్మములు,
ధర్మముల రూపములో ప్రజలలో ఉండిపోయినవి. వ్యాసుడు నాలుగు వేదములను వ్రాసిన దానివలన ఆయన పేరు
ముందర ‘వేద' అను పదము అప్పటినుండి ఉండిపోయినది. వేదములను వ్రాయకముందు వ్యాసుడు అను పేరుండగా,
వేద రచన వలన ఆయన పేరు వేదవ్యాసునిగా మారిపోయినది. వ్యాసునికంటే ముందు వేదములులేవా? అని ప్రశ్నిస్తే
లేవనియే చెప్పాలి. నేను సత్యమునే చెప్పినా నా మాట కొట్టివేయబడుతుంది. ఎందుకనగా శ్రీమహావిష్ణువు వేదములను
రక్షించుట కొరకు హిరణ్యాక్షుని, వరాహావతారము (పంది అవతారము) తో చంపాడని భాగవత పురాణములోనే కలదు.
అక్కడ పురాణములో వ్రాసిన దానినిబట్టి సృష్ఠి ఆదినుండి వేదములున్నాయని చెప్పుటకు వ్యాసుని మాటయే ఆధారమైనది.
ఆనాడు వ్యాసుడు సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారమేనని ప్రజలు చెప్పుకొనెడివారు. “వ్యాసో నారాయణో హరి” అను
మాటను వ్యాసుని గురించి చెప్పెడివారు. అంతేకాక “వ్యాస భగవాన్” అని కూడ అనెడివారు. దీనినిబట్టి వ్యాసుడు
ప్రజలలో ఆనాడు ఎంత పూజ్య భావముతో ఉన్నాడో అర్థమగుచున్నది. అటువంటి స్థానములోనున్న వ్యాసుడు ఏది
చెప్పినా అది అందరు ఆమోదించేవారు. అటువంటి సమయములో కృష్ణుడు చెప్పవలసిన ధర్మములన్ని వ్యాసునికి
వ్యతిరేకమైనవే. ఎక్కడ చెప్పినా, ఎవరికి చెప్పినా వెంటనే వ్యతిరేకత వస్తుందని కృష్ణునికి బాగా తెలుసును. పైగా
కృష్ణుడు ఎక్కడా కూడ జ్ఞానిగా కనిపించలేదు.
సాధారణ మనిషి స్థానములో భగవంతుడైన కృష్ణుడుండగా, భగవంతుని స్థానములో సాధారణ మనిషియైన
వ్యాసుడున్నాడు. ఆనాడు ధర్మము అధర్మముగా, అధర్మము ధర్మముగా ఎట్లున్నదో అట్లే భగవంతుడు మనిషిగా, మనిషి
భగవంతునిగా ఉన్నట్లు తెలియుచున్నది. ఆనాడు ధర్మములుగానున్న యజ్ఞ, దాన, వేద, తపస్సులను అధర్మములనినా,
భగవంతునిగా, విష్ణువుగా, నారాయణునిగా పేరుగాంచిన వ్యాసుని మాటలకు విరుద్ధమైన ధర్మములను బోధించినా,
ఎవరూ వినకపోవడమే కాకుండ చెప్పే వానికి ముప్పు ఏర్పడును. అందువలన వినేవాడు తన అనుచరుడై ఉండాలి.
అనుచరుడైనా చెప్పే మాటలను తప్పనిసరిగ వినే పరిస్థితి ఉండాలి. తప్పక వినే పరిస్థితి ఏర్పడినా, వినేవాడు తన
అనుచరుడైనా, వినే సమయములో ప్రక్కవారు ఎవరూ వినని సందర్భము ఉండాలి. ఇవన్నియు సరిపోవుటకు కృష్ణునికి
90 సంవత్సరముల కాలము పట్టింది. చివరకు కురుక్షేత్రములో, కృష్ణుడు చెప్పేటప్పుడు ఎవరూ గమనించకుండ,
ఎవరి ధ్యాసలో వారుండు యుద్ధసమయములో, అర్జునుని మనస్సు ప్రపంచ విషయములలో విసిగి, జ్ఞానబోధ కావాలనుకొన్న
సందర్భములో, అదియు వినేవాడు విధేయుడైన అర్జునుడు దొరికినపుడు తన ధర్మములను తెలియజెప్పాడు. కృష్ణుడు
87

Page 88
అంతవరకు ఎవరికీ జ్ఞానమును చెప్పకపోవడానికి కారణములన్ని ఉన్నాయి. అప్పటి ప్రజలకు ప్రత్యక్షముగా చెప్పితే
వినరని, వినకపోవడమేకాక చెప్పేవాని మీదికి తిరగబడే అవకాశము ఉన్నదని కృష్ణుడు చెప్పలేదు. అయితే అటువంటి
పరిస్థితిలో అర్జునుడు విన్న జ్ఞానమును బయటికి చెప్పినా ఎవరూ వినరు. ఒక్క వ్యాసుడు చెప్పినా, వ్రాసినా అవియే
ధర్మములని విశ్వసించు ప్రజలకు వ్యాసుని చేతనే తన ధర్మములను చెప్పించితే, అవి బయటి ప్రజలకు, తెలియు
అవకాశము కలదు. ఆనాడు వ్రాయగల సంస్కృత పాండిత్యము కలవాడు వ్యాసుడు ఒక్కడే. ఆ కాలములో సంస్కృత
భాషలో ఏది వ్రాసినా అదియే జ్ఞానము, ధర్మము అను ప్రజలుండెడివారు. నేడు కూడ కొందరు సంస్కృత భాషకు
ఎక్కువ విలువనిచ్చుచూ సంస్కృతము తెలిసినవాడే స్వామి, గురువు అనీ, సంస్కృతములోనున్న రచనలే జ్ఞానముతో
కూడుకొన్నవని చెప్పువారున్నారు. వాస్తవానికి సంస్కృతము ఒక భాష మాత్రమే, అది జ్ఞానము కాదు. నేడు స్వామీజీలుగా
మారాలనుకొన్న వారందరు ముందు సంస్కృతమును నేర్చు కొనుచున్నారు. ఇప్పుడు ఎవడు సంస్కృతమును నేర్చుకొంటే
వాడు స్వామి పోస్టును, గురువు స్థానమును, పీఠాధిపతి అను పీఠమును సంపాదించు కొన్నట్లే. జ్ఞానమున్నా, లేకున్నా
సంస్కృతముంటే చాలు బయటి ప్రపంచములో వాడు పూజ్యుడై పోవుచున్నాడు.
సంస్కృత భాషను ఎంత గొప్పగా చెప్పుకొనినా ఆ భాషను లిపిలేని భాషగానే చెప్పవచ్చును. హిందీ లిపితో
సంస్కృతమును వ్రాసుకొంటున్నాము తప్ప ఇంతవరకు సంస్కృతమునకు ప్రత్యేక లిపి లేదు. అది ఒక లిపిలేని
'ఎరికల', 'సుగాలి' మొదలగు భాషలలాగవున్న ప్రత్యేకమైన భాష అని చాలా మందికి తెలియదు. ఈనాడు కలియుగములోనే
ఎంతో విలువను కల్గియున్న సంస్కృతము ఆనాడు ద్వాపరయుగములో ఇంకా పెద్ద ప్రాధాన్యతతో ఉండెడిదని
అర్థమగుచున్నది. ఆనాడు కృష్ణునికి హిందీ భాష తప్ప సంస్కృత భాష తెలియదు. సంస్కృతములో చెప్పితేనే జ్ఞానము,
హిందీలో చెప్పితే జ్ఞానము కాదను మనుషులు ఆ రోజులలో ఉండుట వలన, ఎటు తిరిగి కృష్ణుడు వ్యాసునిచేతనే
సంస్కృత భాషలోనే తన జ్ఞానమును చెప్పించాలనుకొన్నాడు. 90 సంవత్సరములు కాచుకొన్న కృష్ణుడు, చివరకు తాను
అనుకొన్న పనిని నెరవేరునట్లు చేశాడు. అధర్మయుక్తుడైన వ్యాసుడు కళ్ళు తెరచి తాను ఇంతవరకు బోధించినది
అధర్మములని పశ్చాత్తా పడునట్లు చేశాడు. తన పాపపరిహారము కొరకు ధర్మములతో కూడుకొన్న భగవద్గీతను
వ్రాయాలనుకొన్నాడు. వ్యాసుని చేతనే గీతను వ్రాయించాడు కృష్ణుడు. "కొట్టిన వానితోనే చీమిడి తీయించినట్లు” అను
సామెత ప్రకారము తనకు వ్యతిరేఖమైన అధర్మములను వ్రాసిన వ్యాసునితోనే, తన గీతను వ్రాయించుకొన్నాడు. కృష్ణుడు
ఎవరికి ఎట్లు కనిపించినా మా లెక్కలో మాత్రము ఆయన మహామేధావి అని తెలియుచున్నది. ఎంతో తెలివిగా
యుద్ధరంగములో కృష్ణుడు అర్జునునికి ధర్మములను చాటుగా చెప్పగా అవి చివరకు వ్యాసునికి చేరినవి. ఆనాడు
అందరికీ తెలియునట్లు ప్రత్యక్షముగా చెప్పియుంటే, వ్యాసుడు కూడ దానిని వినేవాడు కాడు. కృష్ణుడు చాటుగా చెప్పిన
దానివలన అందులో ఏముందోనని చూచాడు, అందులోనే చిక్కుకున్నాడు, చివరకు సత్యమును గ్రహించాడు.
కురుక్షేత్రయుద్ధము 18 రోజులు జరిగింది. మొదటి దినము కృష్ణుడు అర్జునునికి ధర్మములను తెలియజేశాడు.
చివరకు తన విశ్వరూపమును చూపాడు. విశ్వరూపము ఇంతవరకు ఎవరూ చూడలేదు అని కృష్ణుడే స్వయముగా
చెప్పుట వలన, ఎవరికీ దక్కనిది తనకే దక్కినదని, ఆ లెక్కలో అందరికంటే నేనెంతో గొప్పవాడినని అర్జునుడు అనుకొన్నాడు.
యుద్ధము అయిపోయిన తర్వాత తాను గొప్పవాడినని, ఏ మనిషికిగానీ, ఏ దేవతలకు గానీ దొరకని విశ్వరూప
సందర్శనము తనకు దొరికిందని తన గొప్పను బయటకు చెప్పుకోవాలనుకొన్నాడు. అలా చెప్పుట వలన నా గొప్పతనము
అందరికీ తెలియును, దానివలన అందరూ నన్ను గొప్పగ ప్రత్యేకముగా చూస్తారని, గౌరవిస్తారని అర్జునుడు అనుకొని,
88

Page 89
మొదట ఆ విషయమును వ్యాసునికే చెప్పాలనుకొన్నాడు. కృష్ణుడు ఊహించినట్లే అర్జునుడు వ్యాసుని వద్దకు పోయి
చెప్పడము జరిగినది. ఎవరికీ దొరకనిది, ఏ దేవతలకూ ఇంతవరకు సాధ్యముకానిది అని రహస్యముగ అర్జునుడు
వ్యాసునికి చెప్పాడు. అర్జునుని మాటలు విన్న వ్యాసునికి దిమ్మతిరిగి పోయింది. అక్కడ కృష్ణుడు చెప్పిన శాసనములైన
సూత్రములను అర్జునుని ద్వారా తెలుసుకొన్నాడు. అంతవరకు అర్జునునికి కూడ అర్థముకాని జ్ఞానము వ్యాసునికి
అర్థమైనది. కృష్ణుడు తెలిపిన ధర్మములను అర్జునుని ద్వారా విన్న వ్యాసునికి యజ్ఞములు, వేదములు, దానములు,
తపస్సులు పూర్తి అధర్మములని అర్థమైనది. తాను అంతకుముందు వ్రాసిన వేదములు, పురాణములు, అధర్మములని
తెలిసి బాధపడిన వ్యాసుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తముగా కృష్ణుడు తెలిపిన ధర్మములను గ్రంథరూపములో
వ్రాయాలనుకొన్నాడు, అలా సంకల్పించుకొని వ్రాసినదే శ్లోకముల రూపములోనున్న భగవద్గీత.
కృష్ణుడు చెప్పిన ధర్మములకు గీత అని పేరు పెట్టినవాడు వ్యాసుడని చాలామందికి తెలియదు. కృష్ణుడు తెల్పిన
ధర్మములు “గీత” అను పేరుతో వ్యాసుని చేత చందోబద్ధమైన శ్లోకముల రూపముగా వ్రాయబడినవి. అలా వ్యాసుడు
వ్రాసిన శ్లోకములు 578 మాత్రమే. తర్వాత కాలములలో కొందరు సంస్కృత పండితులు తమ స్వార్థముతో కొన్ని
శ్లోకములను గీతలో చొప్పించారు. అలా చొప్పించిన కల్పిత శ్లోకములతో కలిపి 700 ల శ్లోకముల రూపములో నేడు
గీత మనముందరున్నది. కృష్ణుడు బ్రతికివున్న కాలములోనే వ్యాసుడు గీతను వ్రాయగలిగాడు. వ్యాసుడు తాటి ఆకుల
మీద సంస్కృత భాషలో హిందీలిపితో గ్రంథమును వ్రాసాడు. ఆనాడు వ్యాసుడు తాలపత్రముల మీద వ్రాసిన ప్రతి
ఒక్కటే. ఇప్పటి కాలములోవలె అచ్చుయంత్రములు లేవు. అందువలన వ్యాసుడు వ్రాసిన ఏకైక ప్రతి ఒక్కటే చాలా
కాలముండెడిది. కొంత కాలమునకు తాటి ఆకుల గ్రంథము శిథిలావస్థకు రాగా కలియుగములో జనమేజయుడు
రాజ్యమేలిన సమయములో కొందరు సంస్కృత పండితులు, గీతను వేరొక తాటి ఆకుల గ్రంథములోనికి వ్రాశారు. అలా
ఎత్తి వ్రాయు సమయములో అంతకువరకు ఎవరికీ తెలియని గీతలోనికి కొన్ని స్వార్థపూరిత శ్లోకములను చేర్చి
వ్రాశారు. ఆ విధముగా పండితుల చేతిలో 700 శ్లోకములతో గీత తయారైనది. తర్వాత కొంత కాలమునకు
మరికొందరు సంస్కృత పండితులు కొన్ని తాటి ఆకుల ప్రతులను తయారు చేసుకొని, దానిని బోధిస్తూ కాలమును
గడిపెడివారు. కృష్ణుడు అధర్మములని చెప్పిన యజ్ఞములను తర్వాత వ్రాసినవారు యజ్ఞములను చేయవలెనని, యజ్ఞము
చేయనివాడు దొంగతో సమానమని విడ్డూరముగా వ్రాశారు. దీనివలన స్వయముగా భగవంతుడు చెప్పిన గీతలో కూడ
జ్ఞానము యొక్క ముసుగులో అధర్మములు అక్కడక్కడ ఉన్నాయని తెలియుచున్నది.
ఆ విధముగా తయారైన గీత నేడు భగవద్గీతగా చలామణి అగుచున్నది. మొదట వ్యాసుడు, కృష్ణుడు చెప్పిన
ధర్మములకు “గీత” అని పేరు పెట్టగా, తర్వాత కొన్ని శ్లోకములను కలిపి వ్రాసిన పండితులు తమ మాటలను ఎవరూ
గుర్తుపట్టనట్లుగా, వారి మాటలను విమర్శనా దృష్ఠితో ఎవరూ చూడనట్లుగా గీతకు, “భగవద్గీత” అని పేరు పెట్టారు.
భగవద్గీత అంటే భయముతో తమ శ్లోకములను ఎవరూ విమర్శించరను ఉద్దేశముతో, ఆ విధముగా గీతను భగవద్గీతగా
చేశారు. పండితులు అజ్ఞానముతో గీతను భగవద్గీత అనినా, అది నిజముగా భగవంతుడు చెప్పినదే, కావున నిజముగా
గీత భగవద్గీతయే. ఒకనాడు వ్యాసుడు వ్రాసిన గీత, భగవద్గీతయై నేడు దాదాపు మూడువందల ఇరవై మంది చేత
అనేక భాషలలో వివరము వ్రాయబడింది. ద్వాపరయుగములో కృష్ణుడు చెప్పిన జ్ఞానము భగవద్గీతలో ఉండినా, ఆయన
జ్ఞానమును ఎవరూ అర్థము చేసుకోక స్వామీజీలు సహితము అధర్మ ప్రవర్తనయైన యజ్ఞములను చేయుచున్నారు.
ఏనాడో త్రేతాయుగములో యజ్ఞములు అధర్మములని చెప్పిన మహాజ్ఞాని అయిన రావణబ్రహ్మనే రాక్షసునిగా నేడున్న
89

Page 90
పండితులు చిత్రించి ప్రచారము చేశారు. ఉన్నదున్నట్లు వ్రాయు మమ్ములను పరమతమును బోధిస్తున్నారని చెడుగా
ప్రచారము చేశారు.
ఎవరు ఏమనినా, ద్వాపరయుగములో కృష్ణుడు సమయమును సందర్భమును చూచి, అన్ని అనుకూలములు
సరిపోయినపుడు, తన ధర్మములను తెలియజేశాడు. అంతేకాక యుక్తిగ వ్యాసుని చేతనే వ్రాయించాడు. ఆనాడు కూడ
అజ్ఞాన ప్రజలు తమకు తెలిసినదే జ్ఞానమను కొని, తాము చేయునదే ధర్మమనుకొని, కృష్ణుని జ్ఞానమును అర్థము
చేసుకోక అజ్ఞానముగా ప్రవర్తించుదురను ఉద్దేశముతో, భగవంతుడు 90 సంవత్సరములు వేచిచూచి గీతను చెప్పాడు.
ఆనాడే ద్వాపరయుగములో అట్లుంటే, నేడు కలియుగమున ధర్మవిరుద్ధులు ఎందరుంటారో చెప్ప నవసరము లేదు.
తమకు తెలిసినదే ధర్మము, జ్ఞానము అనీ తాము హిందూమతమును కాపాడువారమని చెప్పుకొనువారికి, మనది
ఇందూ ధర్మము అని మేము చెప్పితే, 'ఇందూ' అను పదమునకు అర్థము తెలియని వారు, మేము చెప్పునది పరమతము
అనునట్లు మాట్లాడుచున్నారు. ఇందూ అనగా అర్థముంది, కానీ హిందూ అంటే అర్థమేలేదు. అయినా విని
తెలుసుకొందాము. మన పూర్వ సంస్కృతి సాంప్రదాయములు మనకు తెలియవు కదా! అని ఏమాత్రము అనుకోకుండ
గ్రుడ్డిగ మాట్లాడు వారున్నారు. మేము కేవలము ఆధ్యాత్మిక విద్యను తెలపాలని దాదాపు అర్థశతక గ్రంథములను వ్రాస్తే,
చదువురాని వారంతా పుస్తకములు వ్రాస్తున్నారని మమ్ములను అంటున్నారు. ఇలా చెప్పుకోలేనన్ని ఆటంకములు వచ్చినా,
భగవంతుడు తెల్పిన జాన్జమునకు సరియైన అర్థమును చేకూర్చ వలెనను ఉద్దేశముతో మతములకతీతముగా గీతజ్ఞానమును
త్రైత సిద్ధాంతము మీద శాస్త్రపద్ధతిగా మేము చెప్పితే, దాని వివరమును చూడకనే కొద్దిమాత్రముగానైనా చదవకనే
హిందు (ఇందు)వులమనుకొను వారంతా సిగ్గుతో తల దించుకొనేలాగ, మా ముందరే భగవద్గీతను తగులబెట్టిన హిందూ
రక్షకులను పేరుగలవారున్నారంటే, ఇప్పటి ధర్మముల పరిస్థితి ఎలాగుందో చెప్పకనే అర్థమగును. మేము హిందు
(ఇందువులకు జాన కేంద్రము భగవద్గీత అంటే, హిందూ సంస్థలను పేరు పెట్టుకొన్న కొందరు, కాదు వేదములే
జ్ఞానము అంటున్నారు. కృష్ణుడు వేదములు అధర్మములని చెప్పాడని మేము వ్రాస్తే, ఇటువంటి పుస్తకములను బయట
ప్రజలు చదవకుండ ప్రభుత్వము నిషేధించాలని హిందువులలో అగ్రస్థానములోనున్న వారే అంటున్నారు. జాతీయపక్షి
నెమలి దానిని కాపాడుతాము అంటారు, కానీ దొరికితే కోసుకొని తింటారు. అలాగే భగవద్గీతను కోర్టులో సాక్షుల దగ్గర
విలువగా చూపుతాము, కానీ ఇంటిలో గీతను ముక్క కూడ చదవము. నేడు గీత అచ్చుయంత్రముల పుణ్యాన ఎన్నో
ప్రతులుగా వచ్చినా ఏమి ప్రయోజనము లేదు. కృష్ణుడు యుక్తిగా అర్జునునికి బోధించి, వ్యాసుని చేత వ్రాయించినా
కలియుగములో మతమును అడ్డము పెట్టుకొని, వేదములను ప్రచారము చేయువారి ముందర ఆయన శ్రమంతా వృథా
అగుచున్నది. హిందువులమని బొట్టుపెట్టుకొన్న వారంతా హిందువులేనా? వారిలో హిందూ (ఇందూ) ధర్మములున్నాయా?
అని అనుమానము వస్తున్నది. అటువంటి వారందరికి ఎదురీదుచు త్రైత సిద్ధాంత భగవద్గీత బయటికి వచ్చి భగవంతుని
భావములను నిర్భయముగా తెల్పుచున్నది. ఆనాటి దేవుని ధర్మములు ఈనాడు స్వచ్ఛముగా త్రైతసిద్ధాంత భగవద్గీత
రూపములో వచ్చాయని అనుకుంటున్నాము.
కృష్ణుని మరణము లోకమునకు కనువిప్పు
క్రీస్తుపూర్వము 02-02-3102వ సంవత్సరము కృష్ణుడు మరణించాడు.
జనవరి 14వ తేదీ తర్వాత
ఉత్తరాయణ కాలము వస్తుంది. కావున కృష్ణుడు చనిపోయినది ఉత్తరాయణములోనని తెలియుచున్నది. ఒకనాడు
90

Page 91
కృష్ణుడు ఒక చెట్టుపొదవద్ద కాలు మీద కాలు పెట్టుకొని పడుకొని కాలును కదిలించుచుండగా, ఆ ప్రాంతమునకు
వేటకు వచ్చిన బోయవాడు పొదచాటున కాలు కదులుటను చూచి, అక్కడ జింక కదులుతున్నదని తలచి పొరపాటుగా
బాణమును వేయగా, అది కృష్ణుని కుడికాలు బొటన వ్రేలుకు తగిలింది. బొటనవ్రేలుకు చిక్కుకొన్న బాణము వలన
కృష్ణుని శరీరము నుండి రక్తము కారిపోయి ఆయన చనిపోవడము జరిగినది. విశ్వవ్యాప్తమై అణువణువున ఉన్న శక్తి
ఏదో, ఆ శక్తిలోని భాగము ఒక శరీరమును ఏర్పరుచుకొని వచ్చి, 126 సంవత్సరములు మానవులతో సహజీవనము
చేసి తన ధర్మములను తెలిపి, శరీరములో లేకుండ అంతటావున్న తనశక్తిలో కలిసిపోయింది. అలా వచ్చి పోయినది
సాధారణ జీవాత్మకాదు, పరమాత్మ శక్తి అని ఒక భీష్మునికి తప్ప ఎవరికీ తెలియదు. భీష్ముడు కృష్ణునికంటే ముందే
చనిపోయాడు. అందువలన కృష్ణుడు చనిపోయినపుడు ఆ శరీరములోని జీవాత్మగా ఇంతకాలమున్నది దైవశక్తి అని
ఎవరికీ తెలియదు. 126 సంవత్సరములు శరీరముతో బ్రతికిన ఆ శక్తిపేరు “కృష్ణ” అను రెండక్షరములు మాత్రమే.
కృష్ణ అను శబ్దము యొక్క అర్థము నల్లని రంగు అని తెలియుచున్నది. కృష్ణ పదము నల్లని రంగును తెలుపుచున్నది.
చీకటి నల్లగా ఉండును. కటిక చీకటిలో ఏమీ కనిపించక నల్లని రంగు మాత్రము అగుపడుచున్నది. మనిషి ఎల్లప్పుడు
ఏదో ఒకటి కనిపించు వెలుతురునే కోరుకొంటాడు. కానీ ఏమి కనిపించని చీకటిని కోరుకోడు. అదే విధముగ
భూమిమీద ప్రతి మనిషి ఏదో ఒక విషయమును తెలియజేయు మాయనే కోరుకొంటాడు. కానీ ఏ విషయములేని, ఏ
గుణములేని దైవమును కోరుకోడు. దేవుడు ఎవరికీ కనిపించువాడు కాడు. దేవున్ని ఎవరూ కోరుకోవడము లేదు అని
తెలియుటకు గుర్తుగా భగవంతుడు తన పేరుగా నల్లని రంగుకు గుర్తు అయిన నలుపు (కృష్ణ) అను పేరును పెట్టుకొన్నాడు.
విశ్వమంతా వ్యాపించి ఎవరికీ తెలియని శక్తియే కృష్ణ శరీర మందుండి చివరికి మరణించింది. కృష్ణ శరీరములోని
శక్తియు బయట విశ్వమంతా అణువణువున వ్యాపించియున్న శక్తియు రెండు ఒకటే. కావున నీరు నీరులో కలిసి
పోవునట్లు, బయటి శక్తి, కృష్ణ శరీరములోని శక్తి రెండు ఒకటిగా కలిసిపోయినవి. పుట్టిన మనిషి ఎవడైన చనిపోయిన
తర్వాత జన్మించకుండా మోక్షమును పొందాలంటే అనగా దేవునిలో కలిసిపోవాలంటే భగవద్గీతలో చెప్పిన సూత్రము
ప్రకారము చనిపోయిన వ్యక్తి యోగియై ఉండాలి. చనిపోయిన యోగి ఉత్తరాయణము, శుక్లపక్షము, పగలు, సూర్యరశ్మి
కలిగిన సమయములో చనిపోయి ఉండాలి. అటువంటి వాడు మాత్రము మోక్షమును పొందును. ఈ సూత్రమును
చెప్పిన కృష్ణుడు ఈ సూత్రము ప్రకారము చనిపోయాడా? అని అడుగవచ్చును. దానికి సమాధానము ఏమనగా!
గీతలో చెప్పిన సూత్రము ప్రకారము కృష్ణుడు కర్మయోగియై ఉన్నాడు. ఉత్తరాయణములోనే పగటిపూటే, సూర్మరశ్మి
కలసిన సమయములోనే చనిపోయాడు. కానీ ఆయన చనిపోయినది శుక్లపక్షములో కాదు. కృష్ణపక్షములో చనిపోయాడు.
మోక్షము పొందవలసిన యోగి శుక్లపక్షములో చనిపోవలసివుంది. కానీ కృష్ణుడు కృష్ణపక్షములో చనిపోవడము వలన,
భగవద్గీతలో భగవంతుడైన కృష్ణుడు చెప్పిన సూత్రము ప్రకారము కృష్ణుడే మోక్షమునకు పోలేదని, తిరిగి జన్మకే
పోయాడని చెప్పవచ్చును. అయితే కృష్ణుడు దేవునిలోనికే పోయాడు, కానీ జన్మకు పోలేదు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో
చెప్పిన సూత్రము కృష్ణునికి వర్తించదా అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నీరు నీరులో కలిసే
దానికి ఏ అడ్డంకులేదు. కానీ మంచు ముక్కలు నీటిలో కలియాలంటే అవి నీరుగా మారుటకు కొంత ఉష్ణోగ్రత
అవసరము. కృష్ణుడు చెప్పినది మంచుముక్కలు నీరుగా మారుటకు ఉష్ణోగ్రత అవసరమన్నట్లు మనుషులు దేవునిగా
మారుటకు ఫలానా సమయములోనే మరణము పొందాలి అని చెప్పాడు. కృష్ణుడు నీరులాంటివాడు కావున మరణకాల
నియమము ఆయనకు లేదు. కానీ మనుషులు మంచుముక్కలు లాంటివారు వారికి ఉష్ణము అను జ్ఞానము అవసరము.
కావున వారికి మరణకాలనియమము ఉన్నది. "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల” అన్నట్లు కాలమే తానైన వానికి
91

Page 92
మరణకాల నియమము వర్తించదు. కర్మ అను చలికి గడ్డకట్టిన మనుషులకు వేడి అను జ్ఞానము అవసరము. అందువలన
సాధారణ మనుషులకు మాత్రమే మరణకాల నియమము వర్తించునని తెలియాలి. మరణకాలము తనకు వర్తించదని
తెలుపు నిమిత్తమే ఆయన కృష్ణపక్షములోనే చనిపోయాడు.
పొదమాటున చల్లని నీడలో పడుకొనివున్న కృష్ణున్ని బోయవాడు వేట నిమిత్తము అక్కడికి వచ్చి, కదలుచున్న
కాలును లేడి అనుకొని బాణము వేయగా, అది కృష్ణుని కుడికాలు బొటనవ్రేలిని తాకి రక్తము కారుచున్న సమయములో,
ఆ బోయవాడు వచ్చి చూచి నేను ఎంత పనిచేశానని రోదిస్తున్నపుడు, కృష్ణుడు ఇలా “నీవు బాధపడవలసినది ఏమీ
లేదు. నిర్ణయము ప్రకారమే అన్ని జరుగుచున్నవి. నా పుట్టుక, చావు రెండూ జరుగుటకు ఒక కారణమున్నది. నేను
అశుభ్రమైన స్థలములో జైలునందు తల్లిప్రక్కన తండ్రి తప్ప ఎవరు లేకుండ పుట్టవలెనను నిర్ణయమున్నది. ఆ నిర్ణయము
ప్రకారమే దీనస్థితిలో పుట్టాను. అలాగే మరణము కూడ ఒంటరినైన సమయములో, ఇతరుని ఆయుధము వలన
గాయపడినవాడినై రక్తముకారి చనిపోవలెనని నిర్ణయము కలదు. దాని ప్రకారమే ఇపుడు ఒంటరిగానున్న నన్ను నీ
బాణము గాయపరిచినది. పుట్టుక, చావు రెండు ఇలా జరగవలెనని ఉన్నది. కావున నీవు బాధపడవలదు" అన్నాడు.
ఆ మాటలు విన్న బోయవాడు "మీరు ఎంతో కలిమి, బలిమి రెండూ కలవారు. మీరు ఏమీలేని వారివలె దీనస్థితిలో
పుట్టడము, అలాగే ఒంటరిగా గాయపడి ప్రక్కన ఎవరు లేకుండ చనిపోవడము మీరు నిర్ణయమనినా నాకు చెప్పలేని
బాధకల్గుచున్నది” అన్నాడు. అలా బాధగా మాట్లాడిన బోయవానిని ఓదారుస్తూ కృష్ణుడు “దీనస్థితిలో పుట్టిన నా
జననము, గాయపడి ఒంటరినై మరణించు నా మరణము భావితరమునకు అవసరము. ఇప్పటి నుండి కలియుగము
ప్రారంభమగుచున్నది. కలియుగములో ఇంతవరకు లేని అజ్ఞానము ప్రారంభమగును. ఇంతవరకు లేని మతములు
కలియుగములో పుట్టుకొచ్చును. సృష్ట్యాదినుండి ప్రపంచ వ్యాప్తముగ ఉన్నా ఇందూ ధర్మములు క్షీణించి పోయి, మచ్చుకు
మాత్రము ఇందూదేశము లోనే మిగిలి అదియు బలహీనముగా ఉండును. ఇందువులు తమ ధర్మములను తామే
తెలియక, తమను తాము హిందువులుగా చెప్పుకొందురు. ఇందూపథమును (జ్ఞానమార్గమును) హిందూమతముగా
ప్రకటించు కొందురు. 'పథము' అను శబ్దము చివరకు 'మతము' అను పదముగా మారిపోవును. పథము అనగా
మార్గము, మతము అనగా ఇష్టము ఇది నా మార్గము అను అర్థమును వదలి, ఇది నా ఇష్టము అను మాటను
చెప్పుదురు.
ష్టము ఇది
ఆదినుండి ఇందూ ధర్మములు విశ్వవ్యాప్తముగా ఉన్నవి. కలి యుగములో మతములు తయారై ఇందూపథము
యొక్క స్థానమును క్రైస్తవ మతము ఆక్రమించుకొనును. హిందువులందరు ఒక్కొక్కరుగా ఆ మతములో చేరిపోవుచు
హిందూమతము క్షీణించిపోవును. అటువంటి సందర్భములో హిందూమతమును కాపాడుకొనుటకు కొన్ని సంఘములు
ఏర్పడును. అటువంటి హిందూసంఘములకు, తమ మతమునకు సంబంధించిన ధర్మములు తెలియక పోవడము
వలన, వారి వలన హిందూ మతమునకు నష్టము ఏర్పడును. జ్ఞానములేని హిందూసంఘముల పనులను చూచి
హిందువులే ఏవగించుకొందురు. హిందూ దేశములో కూడ క్రైస్తవ మతము విరివిగా వ్యాపించి పోవును. అట్లు పెరిగి
పోవుచున్న మతమును చూచి ఆ మతప్రవక్తకు పూర్తి వ్యతిరేఖులుగా హిందువులు తయారగుదురు. తమ మతమును
హిందువులు కించపరుస్తున్నారని హిందువుల ప్రవక్తనైన నా గురించి క్రైస్తవమతము వారు అసూయగా వ్యతిరేఖముగా
మాట్లాడుదురు. మా దేవుడు గొప్ప, మీ దేవుడు దిబ్బ అని హిందువులు అనగా, మా దేవుడే గొప్ప అని క్రైస్తవులు
అందురు. క్రైస్తవమత ప్రవక్త అయిన ఏసును చూచినా, ఆయన పేరును వినినా హిందువులు కొందరు మండిపడుదురు.
92

Page 93
అట్లే హిందువుల దేవున్ని, దేవతలను క్రైస్తవులు తక్కువ భావముతో మాట్లాడుదురు. ఇట్లు మా దేవుడు గొప్ప అని
క్రైస్తవులు అనగా, హిందూసంఘములోని వారు కొందరు మీ దేవుడు దేవుడే కాదని ఏసును దూషించుచుందురు.
హిందువులు క్రైస్తవ ప్రవక్త అయిన ఏసును దూషించే కొలది, క్రైస్తవులు తమ బైబిలులోని వాక్యములను చెప్పుచు, వారి
మతప్రచారము చేయుదురు. జ్ఞానమును బోధిస్తూ మా మతములో రక్షణ ఉన్నదని చెప్పుచుండుట వలన, దేవతా భక్తి
తప్ప దేవుని భక్తి హిందూమతములో లేనిదానివలన, చాలామంది హిందువులు క్రైస్తవులుగా మారిపోవుదురు. చివరకు
హిందువులు తమ మతమును రక్షించుకొను ప్రయత్నములో పడిపోవగా, క్రైస్తవులు తమ మతమును పెంచుకొందురు.
పరమతమని హిందువులు క్రైస్తవమతమును, దాని ప్రవక్తను దూషించగా, క్రైస్తవులు హిందూమతము మాయ (సాతాన్)
మతమని హిందూమతమును, హిందువుల దేవుళ్ళను దూషించుదురు. ఈ విధముగా మత ద్వేషములు ఏర్పడి, దాని
వలన భూమిమీద మతహింసలు ఏర్పడును. భూమిమీద మతముల కొరకు యుద్ధములే వచ్చును. వీటన్నిటికి మనిషి
ఆచరించదగిన ధర్మములేవో, మనిషి తెలుసుకోదగిన జ్ఞానమేమిటో, మతముల పేర్లు పెట్టుకొన్న మనుషులకు తెలియకుండ
పోవడమే ముఖ్య కారణము. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి యుక్తవయస్సు వరకు బ్రతుకు తెరువుకొరకు చదువుకొని,
దాని తర్వాత ధనార్జనలో పడిపోయి, మిగత కాలములో మతమును మతభక్తిని, మత ప్రచారమును చేయుచు
మతము గొప్ప, నా మతము గొప్ప అని ద్వేషములు పెంచుకొందురు. క్రైస్తవులను చూస్తే హిందువులు, హిందువులను
చూస్తే క్రైస్తవులు ఒకరికొకరు అజ్ఞానులమనుకొను స్థితి ఏర్పడును. ప్రతి మతము వాడు దేవుని పేరే చెప్పుచు, దేవునివద్దకే
చేరాలని చెప్పినా వారివారి ప్రవక్తలు, వారివారి మతములు వేరువేరైన దానివలన వారివారి దేవుడు కూడ వేరువేరని
చెప్పు కాలమువచ్చును.
నా
ఈ విధముగ భూమిమీద కలియుగమునందు మతముల పేరుతో అధర్మములు పెరిగి పోవును. వేరు మతములు
లేని ద్వాపరయుగములో ఒక్క ఇందువులకు సంబంధించిన ధర్మములనే నేను చెప్పాను. నేను చెప్పిన ధర్మములు
సర్వమానవులకు, సర్వమతములకు సంబంధించినవని ఎవరికీ, ఏ మతము వారికీ తెలియకుండ పోవుట వలన, క్రైస్తవులు
మా జ్ఞానము, మా ధర్మములు ప్రత్యేకమైనవని, మా ప్రవక్త చెప్పినవి కృష్ణుడు చెప్పినవి వేరని అనుకొందురు.
ద్వాపరయుగములో కృష్ణుడు చెప్పిన ధర్మములనే తమ ప్రవక్త చెప్పాడని ఎవరూ గుర్తించలేరు. ఇందూధర్మము లను
దేవుడు చెప్పాడని, ఇందూ ధర్మములులేని మతము భూమిమీదలేదని ఎవరూ గ్రహించలేరు. ఇందూధర్మములు దైవజ్ఞానము
తెలియాలనుకొను ప్రతి మతస్థునికి అవసరమైనవే. ఎందుకనగా వారి మత గ్రంథములలో ఏమి చెప్పారో అవియే
నేను చెప్పిన ఇందూ ధర్మములు, ఇందూ అనగా దైవ జ్ఞానము అని తెలియని ప్రతి మతము, తమ మతములకు
ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొందురు. చివరకు దైవజ్ఞానము (ఇందుత్వము) తెలియని ఇందువులు కూడ తమది కూడ ఒక
మతమని, దానిపేరును హిందూ మతమని చెప్పుకొందురు. నేను చెప్పిన ధర్మములను తెలియక వేదములను ఆశ్రయించి,
మేము హిందువులము అని కొందరు చెప్పగా, అలాగే నేను చెప్పిన ధర్మములనే తమ ప్రవక్త చెప్పాడని తెలియక, తమది
మతమని కొందరు చెప్పుకొందురు. నేను చెప్పిన ధర్మములలో కూడ కొన్ని అధర్మములు కలిసిపోయి భగవద్గీతగా
మీముందు నా బోధ ఉండును. నా బోధ అయిన భగవద్గీతలో కూడ అధర్మములు కలిసి ఉండుట వలన, వాటినే
కొందరు హిందువులు ఆశ్రయించి, నేను చెప్పిన ధర్మములను అర్థము చేసుకోలేరు. ఆ విధముగ భగవద్గీత ఎవరికీ
అర్థము కాకుండ పోతుంది.
క్రైస్తవ
93

Page 94
జగతిలో అతి పెద్ద మతముగా క్రైస్తవమతము పేరుపొందినా, ఆ మత ప్రవక్త చెప్పిన బైబిలు గ్రంథములో కూడ
అధర్మములు కలిసిపోయి క్రైస్తవులు కూడ దైవజ్ఞానమును (ఇందుత్వమును) తెలియలేరు. బైబిలును చదివిన ప్రతి
క్రైస్తవుడు, బైబిలును బోధించిన ప్రతి బోధకుడు, అందులో వున్న నా ధర్మములను తెలియలేరు. అందువలన క్రైస్తవ
ప్రవక్త అయిన ఏసు ప్రజలనుద్దేశించి ఒక మాట చెప్పి పోవును. నేను చెప్పిన ధర్మములు మీకిప్పుడు అర్థము కావు. నా
తర్వాత కొంతకాలమునకు ఒక వ్యక్తి వచ్చి నేను చెప్పిన నా మాటలనే వివరముగా చెప్పును. అప్పుడు నేను చెప్పిన
మాటలు అర్థమగును అని చెప్పును. ఏ వ్యక్తి అయితే బైబిలు వాక్యములను వివరించి చెప్పునో, అదే వ్యక్తి భగవద్గీతలో
శ్లోకరూపములోనున్న నా ధర్మములను కూడ వివరించి చెప్పును. అంతవరకు భగవద్గీతకానీ, బైబిలు గానీ సరిగా
ఎవరికీ అర్థము కావు. ఇటు బైబిలును అటు భగవద్గీతను ఏక కాలములో చెప్పునతడే రెండు గ్రంథములలోని ధర్మములు
ఒక్కటేనని, ఆ రెండు గ్రంథములను ఒక్కడే చెప్పాడని సంచలన మాటను చెప్పును. రెండు గ్రంథముల లోను దేవుడు
చెప్పిన ధర్మములతోపాటు, మనుషులు వ్రాసిన అధర్మములు కూడా ఉన్నాయని, వాటిని వదలి ధర్మములకు మాత్రమే
వివరమును చెప్పును. ఆ వ్యక్తి గురువుగా గానీ, స్వామిగా గానీ చలామణి కాడు. ఏ ఆధారములేని ఆయనను
గుర్తించుట చాలాకష్టము” అని కృష్ణుడు బోయవానికి చెప్పాడు.
ఆ
ఇక్కడ మనము ఆలోచింపదగిన విషయమేమంటే దైవధర్మములను గీతరూపములో ధనస్సు, బాణములు
ధరించిన అర్జునునికి మాత్రము చెప్పాడు. అక్కడ కృష్ణుడు అర్జునుడు తప్ప మూడవ వ్యక్తి లేడు. పైగా అర్జునుడు
ధర్మములను గురించి అడుగనూ లేదు. దారిన పోయేవానికి పిలిచి పిల్లను ఇచ్చినట్లు, ధర్మముల మీద ధ్యాసలేని
అర్జునునికి ధర్మములను గురించి కృష్ణుడు చెప్పాడు. అట్లే కలియుగములో జరుగబోవు భవిష్యత్తును గురించి, క్రైస్తవ
మతమును గురించి, హిందూమతము క్షీణించి పోవడమును గురించి, ధనస్సు బాణములు ధరించియున్న బోయవానికి
చెప్పాడు. అర్జునునకు గీతా జ్ఞానమును చెప్పినట్లు, భవిష్యత్తును గురించి అడుగకున్నా బోయవానికి కలియుగ
ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి చెప్పాడు. కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి చెప్పునపుడు అక్కడ కృష్ణుడు,
బోయవాడు తప్ప మూడవ వ్యక్తి ఎవరూ లేరు. యుద్ధరంగమున గీతను చెప్పినపుడు కృష్ణుడు అర్జునునికి చెప్పగా,
తర్వాత అర్జునుడు వ్యాసునికి చెప్పుట వలన గీత అర్జునుని ద్వారా బయటపడినదని చెప్పవచ్చును. కానీ కలియుగ
ఆధ్యాత్మిక భవిష్యత్తును కృష్ణుడు బోయవానికి చెప్పినపుడు అక్కడ మూడవ వ్యక్తి లేడు. చెప్పిన కృష్ణుడు వెంటనే
చనిపోయాడు. ఇక బోయవాడు మాత్రము మిగిలాడు కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు ఒక్క బోయవాని ద్వారానే
బయటికి రావాలి. కానీ బోయవాడు కూడ తాను చేసిన తప్పుకు అప్పుడే నిరాహారదీక్ష చేసి అక్కడ కృష్ణుని ముందరే
చనిపోయాడని వ్రాశారు. ఇక్కడ ప్రత్యేకించి నేను అడిగే ప్రశ్న ఏమంటే! నీ తప్పు ఏమీ లేదని, అంతా నా కర్మ
ప్రకారము జరిగిందని కృష్ణుడు బోయవానితో చెప్పినా, అతను వినకుండా నేను చేసిన తప్పుకు శిక్ష ఉండాలని,
నిరాహారదీక్ష చేసి వెంటనే చనిపోయాడని, తర్వాత కృష్ణుని రథసారధియైన దారకుడు అక్కడికి వచ్చాడని వ్రాశారు.
నిరాహారదీక్ష చేసి ఒక మనిషి చనిపోవాలంటే కనీసము 40 రోజులైనా పడుతుంది. అలాంటిది నిరాహారదీక్ష చేసి
నిమిషానికే చనిపోయాడని చెప్పడము పచ్చి అబద్దము కాదా?
భాగవతములో కృష్ణున్ని బాణముతో బోయవాడు కొట్టినట్లు వ్రాసిన వారు, జరిగిన సంఘటనను చూచి కృష్ణుడు
నివారించినా వినకుండ నిరాహార దీక్షతో చనిపోయాడని వ్రాశారు. కృష్ణుడు, బోయవాడు తప్ప అక్కడ ఎవరులేని
సమయములో ఏమి జరిగిందో, ఏమి మాట్లాడారో ఎవరికీ తెలియదు. వాస్తవానికి బోయవాడు చనిపోలేదు. బోయవాడు
94

Page 95
బాధపడగా కృష్ణుడు అంతా కర్మప్రకారమే జరిగిందని ఓదార్చిన తర్వాత కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తును గురించి
కృష్ణుడు బోయవానికి చెప్పి, ఈ విషయమును నేను నీకు తప్ప ఎవరికీ చెప్పలేదన్నాడు. కృష్ణుడు చెప్పిన చివరి
సందేశమైన కలియుగములో ఆధ్యాత్మిక భవిష్యత్తును వినిన బోయవాడు, నేనెంతో అదృష్టవంతున్ని అని సంతోషపడినాడు.
నా జీవిత అంత్య భాగములో నేను చెప్పు పెద్ద రహస్యము ఇది. దీనిని నీవు తప్ప వినినవాడు ఎవరూ లేరని కృష్ణుడు
చెప్పిన మాటను బట్టి నేను గొప్పవాడినని బోయవాడు అనుకొన్నాడు. యుద్ధరంగమున కృష్ణుని ద్వారా గీతను విని, ఈ
రహస్యము నీకు తప్ప ఎవరికీ తెలియదని కృష్ణుడు చెప్పగా, అర్జునుడు తనకు తాను గొప్పగ ఊహించుకొన్నట్లు
కృష్ణుడు చెప్పిన కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు, దైవజ్ఞాన రహస్యమును విన్న బోయవాడు కూడ అర్జునుడు అనుకొన్నట్లు
అనుకొన్నాడు. ఆ కాలములో యుద్ధము అయిపోయిన తర్వాత అర్జునుడు వ్యాసునికి చెప్పగా, అది వ్యాసుని ద్వారా
అందరికీ తెలిసినది. కృష్ణుడు చెప్పిన గీతను అర్జునుడు వ్యాసునికి చెప్పినట్లు, భారతములోగానీ, భాగవతములోగానీ
వ్రాయలేదు. అయినా ఇట్లే జరిగింది, అర్జునుడే స్వయముగా వ్యాసునికి చెప్పాడని మేము చెప్పాము. ఇక్కడ బోయవానికి
కృష్ణుడు చెప్పిన విషయము కూడ భారత, భాగవతములలో వ్రాయలేదు. అయినా ఈ విధముగా జరిగిందని మేమే
చెప్పుచున్నాము. ఈ నా మాటవిన్న కొందరు పండితులు, కవులు ఈయన ఎవరు? స్వయముగా ఇట్లే జరిగిందని
చెప్పడానికి? అని అడుగవచ్చును. దీనికి జవాబును తర్వాత చెప్పెదము, కానీ ఈ ప్రశ్నలో ఈయన ఎవరు అను ప్రశ్న
నాకు బాగా నచ్చింది.
నేను సత్యమును చెప్పితే విశ్వసించలేని వారు నిరాహారదీక్షతో బోయవాడు చనిపోయాడన్నపుడు, నిరాహారదీక్షకు
నిమిషాలలో ఎవరు చనిపోరు కదా! అని ఎందుకు అడగలేకపోయారు? కృష్ణుడు రక్తస్రావము వలన చనిపోయాడని
సత్యమును మేము చెప్పితే నమ్మలేని వారు, కృష్ణుడు రథమునెక్కి వైకుంఠమునకు పోయాడు అని భాగవతములో
వ్రాసిన మాటను ఎలా నమ్మారని అడుగుచున్నాము. నిరాహారదీక్షతో నిమిషాల వ్యవధిలో చనిపోతాడను మాటగానీ,
కృష్ణుడు రథము మీద వైకుంఠమునకు పోయాడనుట గానీ పూర్తి అశాస్త్రీయము, అసత్యము. కల్పిత పురాణములను
గ్రుడ్డిగా నమ్మువారు ఆధారపూరిత విషయములను ఎందుకు నమ్మరని మేము అడుగుచున్నాము. కృష్ణుడు బోయవానికి
ఇంకా కొన్ని విషయములను చెప్పాడు. ఆ విషయములు క్రైస్తవ, హిందూమతములకు రెండిటికి కనువిప్పు కల్గించు
విషయములుగా ఉన్నవి. కృష్ణుడు దేవుని ధర్మములను తెలియ బరచుటకు అవతరించి వచ్చాడు. ద్వాపరయుగ
అంత్యములో దైవ ధర్మములను భారతదేశములో తెలియబరిచాడు. అలాగే కలియుగ ప్రథమములోనే వచ్చి మరియొకమారు
ధర్మములను ఇతర దేశములో తెలియ బరుస్తానని చెప్పాడు. ఇజ్రాయేల్ దేశములో ఏసుగా ఉద్భవించి ధర్మములను
చెప్పిపోతానని, అవసరమునుబట్టి తర్వాత కూడ వస్తానని చెప్పాడు. బోయవానిని అడ్డము పెట్టుకొని చెప్పిన మాటలు
నేటికి సత్యములుగా కనిపిస్తున్నవి. ఇంకా ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నవి. కృష్ణునిగా వచ్చిన నేను కలియుగ
ప్రథమాంకములోనే ఏసుగా వస్తాను. అలా వచ్చిన నన్ను ఎవరూ గుర్తించలేరు. ఇప్పుడు చెప్పిన గీతగానీ, అప్పుడు
చెప్పు వార్తగానీ రెండు నా ధర్మములనే తెలియబరుచును. ఎక్కడ ఏ వాక్యము బేధము కల్గియుండదు. నేనే ఏసును,
ఏసే నేను అయినప్పటికీ శరీరములు, పేర్లు వేరైనా ఇద్దరు ఒక్కరేనని ఎవరికీ తెలియదు. నా బోధ, ఏసు బోధ రెండు
ఒక్కటే అయినప్పటికీ, గ్రంథములు వాటి పేర్లు వేరువేరైనప్పటికీ, రెండూ ఒక్కటేనని ఎవరూ గుర్తించలేరు. అంతేకాక
నేను చెప్పిన గీత, ఏసు చెప్పిన నాలుగు సువార్తలు తిరిగి వివరముగా మరొక వ్యక్తి చెప్పేంత వరకు ఎవరికీ అర్థముకావు.
ఆ వ్యక్తిని గురించి ఏసు చెప్పిన వార్తలలో ఆదరణకర్త అని వ్రాయబడివుండును. ఏసు చెప్పిన “ఆదరణకర్త” అను
పేరులోని మొదటి అక్షరము, చివరి అక్షరము రెండు అక్షరములు మొదటిది మొదలులోను, చివరిది చివరిలోను ఉండు
95

Page 96
పేరు ఆయనకుండును. ఆ..... అను రెండక్షరముల పేరు కల్గినవాడే నేను చెప్పిన బోధనూ, అలాగే ఏసు చెప్పిన
వార్తలనూ ఏక కాలములో వివరించి చెప్పును. అలా చెప్పువాడే కాలజ్ఞానమును చెప్పిన వీరబ్రహ్మముగారికి, సమస్త
మానవులకు గురువగును.
ఏసుప్రభువును విశ్వసించిన వాడు నన్ను (కృష్ణున్ని) విశ్వసించడు. అలాగే గీతను చదివినవాడు ఏసును
విశ్వసించడు. ఇటు నేను అటు ఏసు ఉత్తర దక్షిణ ధృవములవలె కనిపించుచుండుట వలన హిందువులు క్రైస్తవులను,
క్రైస్తవులు హిందువులను ఏవగించుకొను స్థితిలో ఉందురు. ఆ సమయములో ఏసు చెప్పిన ఆదరణకర్త తప్ప ఎవరూ
రెండు మతములకు సమాధానములు చెప్పలేరు. అలాగే సమన్వయపరచలేరు. క్రైస్తవులలో ఆదరణకర్త, హిందువులలో
ఆ.....ర్త అయిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడే రెండు మతములలోని ఏసు చెప్పిన వాక్యములకు, నేను చెప్పిన గీతకు
సరియైన భావమును చెప్పి, రెండు బోధలను ఒక్కటిగానే చూపును. రెండు మతములలో చెప్పిన నన్ను, ఏసును
ఒక్కనిగానే చూపించును. నేను మూడు వేలసంవత్సరముల తర్వాత పుట్టి, ఈ జన్మలో చెప్పినది తిరిగి అప్పుడు చెప్పగలను.
అలా చెప్పిన నేనే, ఏసు పేరుతో కొంతకాలముండి పోగలను. తర్వాత కొంత కాలమునకు వచ్చినవాడే రెండు జన్మలలో
ఉన్నది నేనేనని, చెప్పినది నేనేనని తెలియజెప్పును. అలా చెప్పుట వలన ఆయన ఇటు హిందువులకు, అటు క్రైస్తవులకు
వ్యతిరేకియై కనిపించును. సమాజములో ఎంత వ్యతిరేఖత వచ్చినా నా పని ఇదేనన్నట్లు ఆయన మాత్రము ఎవరికీ
జంకక తాను చెప్పవలసినది చెప్పిపోవును. రెండు బోధలను వివరించి చెప్పువాడు ప్రత్యేకించి రెండు మతములలో
ఇటు నేను, అటు ఏసు చెప్పక వదలివేసిన బోధలను తెలియజెప్పును. అంతేకాక ఆదినుండి తెలియని ఆధ్యాత్మిక
రహస్యములను తెలియజెప్పి, ఆయన ప్రత్యేకత ఏమిటో ఇతరులకు అర్థమగునట్లు చేసినా, ఆయనను ఎవరూ గుర్తించలేరు.
మానవునికి కావలసిన జ్ఞానమును నేను ఒక విధానముతో చెప్పగా, ఏసు దానినే మరొక విధముగా చెప్పగా, రెండు
ఒకటేనని చెప్పిన ఆదరణకర్త, రెండిటిని వివరించి చెప్పుచూ, రెండిటియందు ఉన్నదానినే తన విధానముతో చెప్పి
పూరించును.” అని చెప్పాడు. కృష్ణుడు చెప్పిన విధానమును చూస్తే వచ్చే మూడవ వాడు ఎలా ఉంటాడో కొద్దిగ
అర్థమవుతుంది.
మనిషి బ్రతుకుటకు ఆహారము తినాలి. ఆహారములో మనము అన్నమును తింటున్నాము. అన్నమును ఒక్క
దానినే తినినా ఆకలి తీరును. కానీ అన్నములోనికి కూరను కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. అన్నము లోనికి
కూరను కలుపుకొని తిని ఆకలి తీర్చుకొనువారు చాలామంది ఉన్నా, కొంతమంది అన్నమును కూరతో తిన్న తర్వాత
చివరిలో మజ్జిగతో తింటారు. అలా మజ్జిగతో తింటే పూర్తి తృప్తిగా తిన్నట్లగును. ఈ విధముగా ఆహారమును మూడు
భాగములుగా చెప్పుకోవచ్చును. ఒకటి అన్నము, రెండు కూరలు, మూడు మజ్జిగ. ఈ మూడింటిని సంపూర్ణమైన
ఆహారమని చెప్పవచ్చును. అన్నమును, కూరను,. మజ్జిగను మూడింటిని తిన్నవాడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉండును.
మూడు ఆహార భాగములలోను పోషక పదార్థములు సంపూర్ణముగ ఉండుట వలన మూడు భాగముల ఆహారమును
తిన్నవాడు శరీరములో తృప్తిగా ఆరోగ్యముతో జీవించును. అన్నము, కూర, మజ్జిగను గురించి ఇప్పుడు చెప్పుకోవలసిన
అవసరమేమొచ్చిందని కొందరనుకోవచ్చును. దీనిని ఉపమానముగా చెప్పుచున్నాము. ద్వాపర యుగములో కృష్ణుడు
గీతను చెప్పాడు. గీతను ఆధారము చేసుకొని ముందుకు పోవువారుండినా, కలియుగములో ఏసు కూడ జ్ఞానమును
చెప్పాడు. ఏసు చెప్పిన జ్ఞానమును ఆధారము చేసుకొని పోవువారు కూడ ఎందరో కలరు. ఈ రెండు జ్ఞానములను
ఆహారములోని రెండు భాగములుగా పోల్చి చూచుకొందాము. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానమును ఆహారములో ఒకటవదైన
96

Page 97
అన్నముగా పోల్చుకొందాము. అన్నము ఆహారములో ముడిపదార్థములాంటిది. అన్నము ఒకే రంగుకలిగి, ఒకే
రుచికల్గివుంటుంది. అన్నమును ఒక దానినే తినాలంటే కొంత కష్టముగా ఉంటుంది. అన్నమును ఒక దానినే
కడుపునిండా తినవచ్చును. అట్లు ఒక అన్నమును కడుపునిండా తినినా మనిషి బ్రతకవచ్చును. కానీ తినే ఆహారము
రుచిగా ఉండుటకు, దేవుడు కృష్ణున్ని పంపి గీతాజ్ఞానమును చెప్పించినట్లు, ఏసును పంపి వార్తా జ్ఞానమును చెప్పించును.
ఏసు చెప్పిన వార్తా జ్ఞానము అన్నముతో సహా అన్నము కలుపుకొని తిను కూరలాంటిది. అన్నము రుచివేరు, కూర
రుచివేరు అయినా రెండూ మనిషికి అవసరమైన ఆహారపదార్థములే. ఏసు చెప్పిన జ్ఞానమును, కృష్ణుడు చెప్పిన
జ్ఞానమును అర్థము చేసుకోగలిగితే, అన్నమును వడ్డించిన వ్యక్తి, కూరను వడ్డించిన వ్యక్తి వేరు వేరైనా, అన్నము కూర
వేరువేరైనా రెండూ తినే పదార్థములేనని తెలుసుకోగలిగితే, రెండు పదార్థములను కలుపుకొని తినగలిగిన వాడు పొందు
రుచివలె, గీతా జ్ఞానమును, వార్తా జ్ఞానమును రెండిటిని సమన్వయముగా అర్థము చేసుకోగల్గితే, ఎంతో అభిరుచి తృప్తి
ఏర్పడును. అట్లు కాకుండ అన్నము తెల్లగున్నది, కూర నల్లగున్నది అది వేరు ఇది వేరు నేను అన్నమును ఒకదానినే
తింటానని, అన్నమును మాత్రము తినినా కడుపు నిండును. అలాగే కూరను మాత్రము తింటానని కూరనొకదానినే
తినినా కడుపు నిండును. అలా తినడములో గల రుచివేరుగా ఉండును. రెండిటిని కలుపుకొని తినడము వలన రుచి
వేరుగావుండి బాగుండును.
ఇప్పుడు భూమిమీద మేము అన్నమును మాత్రము తింటామన్నట్లు కృష్ణునియొక్క గీతా జ్ఞానమును మాత్రము
చదవగల్గిన హిందువులనువారు కొందరున్నారు. అలాగే మేము కూరను మాత్రము తింటామన్నట్లు ఏసు యొక్క వార్తా
జ్ఞానమును మాత్రము చదవగల్గిన క్రైస్తవులను వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయములో అన్నము కూర రెండిటి
విషయము తెలిసిన ఆదరణకర్త వచ్చి రెండిటి వివరమును వివరించి రెండిటిని కలుపు కొమ్మన్నట్లు గీతలోని జ్ఞానమును,
వార్తలలోని జ్ఞానమును వివరించి చెప్పును. అంతవరకు కృష్ణుడు వేరు, ఏసు వేరని అట్లే గీతాజ్ఞానము వేరు,
వార్తాజ్ఞానము వేరని అనుకొనుచుందురు. భూమిమీద క్రైస్తవ పాస్టర్ ఫాదర్లను బోధకులకు, హిందూ గురువులను
బోధకులకు విభిన్నముగా అంతవరకు రెండిటియందు ఎవరికీ తెలియని వివరమును ఆదరణకర్త బోధించగా, వివరము
తెలిసినందుకు కొందరు మాత్రము సంతోష పడుదురు. చాలామంది బోధకులు ఆయనను వ్యతిరేఖిస్తారు. ఆయన
మీద దాడులు కూడ చేస్తారు. అయినా ఆయన ఎవరికీ భయపడకుండా తన పనిని తాను చేయునని కృష్ణుడు కూడ
చెప్పాడు. రెండిటికి సమన్వయకర్త అయిన ఆయనను ఏసు ఆదరణకర్త అని చెప్పగా, ఆయన పుట్టుక హిందూమతములో
ఉండుట వలన మరియు ఆయన రెండు మతములకు ఆదర్శముగా ఉన్న దానివలన, ఏసు చెప్పిన ఆదరణకర్త,
హిందువులలో “ఆదర్శకర్త" అను పేరుతో చలామణి అగునని కృష్ణుడు బోయవానికి చెప్పి పోయాడు. కృష్ణుడు చెప్పిన
ఆదర్శకర్త, ఏసు చెప్పిన ఆదరణకర్త ఇద్దరు ఒక్కరేనని తెలిసిపోయినది. ఆదరణకర్త అయిన ఆదర్శకర్త అను పేరు
ఎవరికున్నదో వెతికితే ఆ పేరును బట్టి సులభముగా మూడవవ్యక్తిని గుర్తించగలము. ఆ పేరున్న వాడు వచ్చిపోయాడా,
లేక వచ్చివున్నాడా, లేక రాబోవు కాలములో వస్తాడా, అను విషయము మాత్రము అర్థముకాని విషయము.
ఆదర్శకర్త అను పేరున్నవాడు ఆదరణకర్తగా ఇటు ఏసు, అటు కృష్ణుని జ్ఞానమును వివరించి చెప్పునదేకాక,
ఇంకా అర్థము కాకుండ మిగిలియున్న ధర్మములను అనగా ఇంకా తెలియకున్న ధర్మములను క్రొత్త విధానములో తెలిపి
పూరించునని కృష్ణుడు చెప్పిపోయాడు కదా! ఆయన పూరించు ధర్మములను ఎలా పోల్చవచ్చునో వివరించుకొందాము.
మనిషికి సంతృప్తి నిచ్చు పూర్తి భోజనము మూడు భాగములుగా ఉండునని, ఆ మూడు భాగములను అన్నము, కూర,
97

Page 98
మజ్జిగ (పెరుగు) అని చెప్పుకొన్నాము. అన్నమును రుచికరమైన కూరతో తినినా, చివరిలో మజ్జిగతో తింటేనే తృప్తిగా
ఉంటుంది, పూర్తి భోజనము అయినట్లు ఉంటుంది. అలాగే రాబోవు ఆదర్శకర్త, కృష్ణుడు గీతను చెప్పగా అందులో
కూడ తెలియనిది ఏదైతో ఉందో, అట్లే ఏసు తన వార్తను చెప్పగా అక్కడ కూడ తెలియనిది ఏదైతే ఉందో, రెండు చోట్ల
తెలియక మిగిలిన దానిని పూర్తిగా తెలియజేయును. దేవుని ధర్మముల విషయములో ఎవరివద్ద ప్రశ్న అనునది గానీ,
సంశయమనునది గానీ లేకుండ చేయును. దీనినిబట్టి ఆదర్శకర్త అను పేరుతో వచ్చువాడు నాస్తికులవద్దగానీ,
హేతువాదులవద్దగానీ దేవుని గురించి అడుగు ప్రశ్నే లేకుండ చేయును. అందువలన ఆదర్శకర్త ఇటు నాస్తికులకు,
అటు ఆస్తికులకు తెలియని జ్ఞాన విధానమును తెలుపునని అర్థమగుచున్నది. ద్వాపరయుగములో కృష్ణుడు చనిపోతూ
చెప్పిన ఆదర్శకర్త, కలియుగములో ఏసు బోధిస్తూ చెప్పిన ఆదరణకర్త, ఎంతో గొప్ప జ్ఞానము కలిగి క్రైస్తవులకు,
హిందువులకు మ్రింగుడు పడనివాడై ఉండును. ఆదరణ కర్త, ఆదర్శకర్త అయినవాడు చెప్పిన బోధను గ్రహించిన
హిందువులు, క్రైస్తవులు ఆయనలోనే కృష్ణున్ని, ఆయనలోనే ఏసును చూచుకొందురు. నేను ఇప్పుడు చెప్పిన విషయములు
హిందూ మత ప్రచారమునకో, లేక క్రైస్తవ ప్రచారము కొరకో కాదు. రెండు మతములకు అతీతమైన దేవున్ని గురించి
తెలుపు విధానమని తెలియాలి. అంతేకాక కృష్ణుడు పోతూ పోతూ చివరిగా చెప్పిన కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తులో
ఆదర్శకర్త పేరుండడము విశేషము. ఈ దినము భూమిమీదవున్న జ్ఞానమును గురించి, అజ్ఞానమును గురించి, పుట్టుకొచ్చిన
మతముల గురించి కృష్ణుడు ఆనాడే చెప్పాడు. ఇదంతయు కృష్ణుడు చివరి రోజున చెప్పిన భవిష్యత్తు వివరమని
తెలియవలెను.
ఇప్పుడొక ప్రశ్నరాక తప్పదు. అదేమనగా! కృష్ణుడు యుద్ధ రంగములో బోధ చెప్పగా వినిన అర్జునుడు
తర్వాత వ్యాసునికి చెప్పాడనీ, వ్యాసుని ద్వారా అందరికీ తెలిసిందని చెప్పారు. దానిని ఒక విధముగా సత్యమేనని
ఒప్పుకోవచ్చును. కానీ కృష్ణుడు చనిపోవు చివరి సమయములో కలియుగ ఆధ్యాత్మికమును గురించి చెప్పాడని, దానిని
బోయవాడు విన్నాడని చెప్పారు. అక్కడ ఎవరూలేని ఆ సమయములో కృష్ణుడు చెప్పిన సమాచారమును వినిన
బోయవాడు ఆ విషయమును తర్వాత ఎవరికీ చెప్పినట్లు ఆచూకి లేదు. బోయవాడు చెప్పినట్లు ఎక్కడా లేనపుడు
అక్కడ జరిగిన విషయము మీకెలా తెలిసింది? మీరెలా ఈ విషయములన్నిటిని చెప్పగలుగుచున్నారని ప్రశ్నించవచ్చును.
దానికి మా జవాబు ఏమనగా! అర్జునుడు గీతను వ్యాసునికి చెప్పినట్లు కూడ భారతములోగానీ, భాగవతములోగానీ
లేదు. అక్కడ వ్యాసుడు తెలివిగా ప్రవర్తించి, అర్జునుడు చెప్పినట్లు తెలియకుండ చేసి, సంజయుడు దృతరాష్ట్రునికి
చెప్పినట్లు వర్ణించాడు. ఎలాగైతే ఏమి, చివరకు కృష్ణుడు అర్జునునికి చెప్పిన విషయము బయటికి వచ్చినది. కానీ
ఇక్కడ భాగవతములో బాణముతో కొట్టిన బోయవాని పాత్రను చంపివేసి బోయవానిని పూర్తిగా లేకుండ చేశారు.
అందువలన కృష్ణుడు చెప్పిన విషయము ప్రస్తావనకే రాలేదు, తర్వాత ఎవరికీ తెలియకుండ పోయినది. ఆ బోయవాడు
తనకు కలియుగ ఆధ్యాత్మిక భవిష్యత్తు తెలిసినా, ఆ విషయమును ఎవరికీ చెప్పాలనుకోలేదు. తనకు పరిచయమున్న
వారంతా నిత్యము వేటకు పోయి బ్రతుకువారే, కావున వారికి ఈ విషయము అవసరము లేదనుకొన్నాడు. ఎవరికైనా
చెప్పాలను కొనినా వీనికి చెప్పే దానికీ కుదరలేదు. ఈ విధముగ ఆ విషయము వానితోనే లేకుండ పోయినది. అలా
వాడు ఆ జన్మలో చనిపోయి తర్వాత జన్మలో పుట్టుతూవస్తూ అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో జన్మలు ఎత్తాడు. ఆ
విధముగా ఆ జీవుడు జన్మిస్తూ, మరణిస్తూ ఎన్నో జన్మలను ధరించినా అతని వెంట ఆత్మ వస్తూనే ఉండును. ఆ జీవుడు
ఎన్ని జన్మలు మారినా వానితో పాటు శాశ్వతముగా వున్న ఆత్మకూడ వాని వెంటనే ఉంటూ అన్ని జన్మలకు సాక్షిగా
ఉండును. వెనుకటి జన్మ విషయము కూడ జీవునికి తెలియదు. కానీ ఆది నుండి అన్ని జన్మలకు సాక్షిగానున్న ఆత్మకు
98

Page 99
అన్ని జన్మల విషయములు తెలియును. ద్వాపరయుగ అంత్యములో చివరిగా కృష్ణుడు బోయవానికి చెప్పిన విషయమంతా
అతని ఆత్మకు తెలియును. అతను ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఒక రోగముతో బాధపడుచు నావద్దకు రావడము
జరిగినది. అప్పుడు నేను అతనికి కర్మను ఉదహరించుటకు దైవజ్ఞానమును చెప్పు సమయములో, ఆ జీవుడు నిద్రావస్థలోనికి
పోయి లోపలనున్న ఆత్మయే వినుటకు మొదలుపెట్టింది. నేను కృష్ణున్ని గురించి ఆయన చెప్పిన జ్ఞానమును గురించి
చెప్పు సమయములో, అతనిలోని ఆత్మ కృష్ణుని మరణ సమయములో జరిగిన వృత్తాంతమునంతటిని వివరముగా నాకు
చెప్పింది. కావున దానినే నేను మీకు చెప్పాను.
ఇదేదో కాకమ్మ గువ్వమ్మ కథలాంటిది అనుకోవద్దండి. మనిషికి జన్మలున్నది వాస్తవము, పునర్జన్మలో జ్ఞాపకము
అరుదుగా ఎవరికైనా రావచ్చును. అలా వచ్చిన సంఘటనలు కూడ ఎన్నో ఉన్నాయి. జరిగి పోయిన జన్మలలోని
విషయములు జ్ఞాపకము వచ్చుటకు ఒకే ఒక ఆత్మయే కారణము. జీవునికిగానీ, మనస్సుకుగానీ, బుద్ధికిగానీ గతజన్మ
జ్ఞాపకాలు ఉండవు. విషయములను జ్ఞాపకము పెట్టుకొను స్థోమత శరీరములోని మనస్సుకు మాత్రముండును. మనస్సు
చనిపోయిన జన్మలోనే పోతుంది. తర్వాత జన్మలో క్రొత్త మనస్సు వస్తుంది. కావున ప్రస్తుత జన్మలో గతజన్మ జ్ఞాపకాలు
ప్రస్తుతమున్న మనస్సుకు తెలియవు. మనస్సు తర్వాత జ్ఞాపకమును కలుగజేయునది ఆత్మ. ఒక మనిషి నిద్రపోవు
సమయములో మనస్సు బయట అవయవముల సంబంధము కోల్పోయి, బ్రహ్మనాడిలో అణిగి ఉండును. అప్పుడు
శరీరములోని ఆత్మ మనస్సువలె పనిచేసి ఎవరైనా పిలిస్తే, ఆ పిలుపును బుద్ధికి జీవునికి చేర్చి నిద్రనుండి లేచునట్లు
చేయుచున్నది. అంతేకాక ఆత్మ శరీరములో రాత్రింబగళ్ళు అన్ని విషయములకు సాక్షిగా ఉన్నది. ఒక మనిషి ఎన్ని
జన్మలు ఎత్తినా వానిని వీడకుండ ఉండునది ఆత్మ ఒక్కటియే. ఆనాడు కృష్ణుడు చనిపోయినపుడు బోయవాని శరీరములో
జీవునితో పాటు ఉన్న ఆత్మ, కృష్ణుని మరణ సమయములో ఏమి జరిగినది, ఏమి సంభాషణ జరిగినది అన్నిటిని చూచి
ఉన్నది. ఇది సర్వ మానవులలో జరుగు ప్రక్రియయే. కానీ ఎవరికీ శరీరములోపల జరుగు తతంగము తెలియదు.
బోయవాని శరీరములోని ఆత్మ నాకు తెలియజెప్పడము కొందరికి వింతగా కనిపించినా, ఇది వాస్తవముగా కొన్ని
సందర్భములలో జరుగునదే. కృష్ణుని మరణమునకు ఆత్మ సాక్షి అయినందున అప్పటి విషయము ప్రస్తుత జన్మనుండి,
ప్రస్తుత వ్యక్తినుండి చెప్పడము జరిగినది. ఇక్కడ ఇంకొక విశేషము కూడ ఉన్నది. అదేమనగా! ద్వాపరయుగములో
కృష్ణుని మరణ సమయమున ఉన్న అప్పటి బోయవాడు అప్పటినుండి ఎన్నో జన్మలు ధరిస్తూ వచ్చి, చివరికి ప్రస్తుత
జన్మలో నా ముందరకు రావడము జరిగినది. అలా నా ముందరకు వచ్చిన ప్రస్తుత వ్యక్తి క్రైస్తవ మతమునకు చెందిన
వాడు. అప్పటి హిందూమతములోని బోయవాడు ఇప్పటి క్రైస్తవమతములోని వ్యక్తి అని తెలియుచున్నది.
ఇప్పటి క్రైస్తవుడు అప్పటి విషయమును చెప్పడమేమిటి అని ఆశ్చర్య పోనవసరములేదు. మనిషి బ్రతికి
ఉన్నంతవరకే మతము, చనిపోయిన తర్వాత ఎవరు ఏ మతములోనైన కర్మప్రకారము పుట్టవచ్చును. గత జన్మలోని
క్రైస్తవులు ఈ జన్మలో హిందువులుగా పుట్టవచ్చును. ఈ జన్మలోని హిందువులు రాబోవు జన్మలో క్రైస్తవులుగా పుట్టవచ్చును.
ఒక మనిషి ఏ మతములో మనుగడ సాగించాలో వాని కర్మే నిర్ణయిస్తుంది. దానిప్రకారమే కొందరు హిందువులుగా,
కొందరు క్రైస్తవులుగా పుట్టుచున్నారు. ఎవనికైనా పుట్టుకతో వచ్చిన మతము దేవుని సమ్మతితో వచ్చిన దానిగా
లెక్కించాలి. ఎవడైనా ఒక హిందువు, క్రైస్తవ మతములోనికి మారాలని తలచినా, ఒకవేళ క్రైస్తవునిగా మారినా, అది
దేవునికి వ్యతిరేఖ చర్య అగును. దేవుని పరిపాలనను ధిక్కరించినట్లగును. అట్లే ఒక క్రైస్తవుడు హిందువుగా మారాలనినా,
ఒకవేళ మారినా అతను కూడ దేవునికి వ్యతిరేఖి అగును. దేవుని పాలకులు అతని మీద కోపము కల్గియుందురు.
99

Page 100
అందువలన మతమార్పిడి మహాపాపమని, దైవ నిర్ణయమునకు విరుద్ధముగా చేసినట్లగు నని తెల్పుచున్నాము. నేటి
కాలములో మత మౌఢ్యము అన్ని దేశములలో ప్రాకిపోయినది. దానివలననే యుద్దములు జరుగుచున్నవి. హింస
చెలరేగు చున్నది. ఒకరికొకరు కొట్టుకొని చస్తున్నారు. చివరకు మాలాంటివారిని కూడ అగౌరవముగా మాట్లాడుచున్నారు.
ఇటువంటి కాలము వస్తుందని ద్వాపరయుగములోనే కృష్ణుడు చెప్పాడు, అలాగే వచ్చింది. నాది క్రైస్తవము నీది
హిందుత్వము అను అజ్ఞాన రోగము పోవుటకు, ఆ రోజే మందును కూడ తయారుచేసి ఇచ్చిపోయినట్లు తెలియుచున్నది.
ఆనాడు కృష్ణుడు రాబోవు మత రోగమును గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ రోగము వచ్చింది. అయితే
రోగమును గురించి చెప్పినపుడే, రోగము వ్యాప్తి చెందకుండ, రోగము పూర్తి నివారణ అగుటకు ఔషధ జ్ఞానమును
కూడ తెలిపాడు. మతమను రోగమునకు, జ్ఞానమను ఔషధము ఏమిటో ఆ రోజు ఆయన సూచించినా, ఈ రోజు
దానిని తెలియలేని స్థితిలో ఉన్నాము. అందువలన మత రోగము ముదిరి పోవుచున్నది. అలా కాకుండ ఇప్పుడు
మనము కృష్ణుడు సూచించిన విధానమును తెలుసుకొందాము.
దేవుడు మతాన్ని సృష్ఠించలేదు. దేవుడు తన జ్ఞానాన్ని ధర్మముల రూపములో తెలిపాడు. దేవుడు తన శక్తిని
తన వ్యక్తిగ మలచి భూమిమీద జ్ఞానాన్ని బోధించునట్లు చేశాడు. అలా వచ్చిన వ్యక్తిని భగవంతుడని హిందువులు,
ప్రవక్త అని క్రైస్తవులు అంటున్నారు. ఎవరు ఏమనినా వచ్చిన వ్యక్తి దేవుని శక్తియేనని జ్ఞాపకముంచుకోవలెను.
అపారమైన దైవశక్తిలో కొంత భాగము వ్యక్తిగా వచ్చినపుడు, ఆ వ్యక్తికి కూడ ప్రపంచములో గుర్తింపు కొరకు పేరుండును.
ఒక కాలములో ఒక ఊరిలో ఉన్న ప్రవక్తకు గానీ, భగవంతునికి గానీ ఒక పేరుండును. ద్వాపరయుగములో దైవ
భాగములలో ఒక భాగమై వచ్చిన వ్యక్తి పేరు కృష్ణ. కృష్ణుడు ద్వాపరయుగములో ఉత్తర భారతదేశమున మధురలో
పుట్టాడు. భగవంతుడైన కృష్ణుడు దేవుని ధర్మములను తెలిపిపోయాడు. ఆయన పోయిన తర్వాత దాదాపు మూడు వేల
సంవత్సరములకు దైవశక్తి కలియుగమున ఇజ్రయేల్ దేశమున జెరూసలేము నగరమున ఒక వ్యక్తిగా పుట్టినది. ఆ వ్యక్తి
ఏసు అను పేరుతో పిలువబడినాడు. ద్వాపరయుగములో పుట్టిన దైవశక్తి పేరు కృష్ణ అను రెండు అక్షరములు.
కలియుగములో పుట్టిన దైవశక్తి పేరు ఏసు అను రెండక్షరములు. దైవశక్తి భూమిమీదకు రావడమే అరుదు. కొన్ని లక్షల
సంవత్సరములకొకమారు వచ్చు దైవశక్తి, మూడువేల సంవత్సరములకు రెండవమారు రావడము ఆశ్చర్యపడవలసిన
విషయము. భగవద్గీతలో కూడ ధర్మములకు ముప్పు ఏర్పడినపుడు, అధర్మములు చెలరేగినపుడు, అధర్మములను
అణచివేసి తిరిగి ధర్మములను తెలియజేయుటకు యుగ యుగమందు వస్తానన్నాడు. ఆయన మాట ప్రకారము
చూచినా ఒక్కొక్క యుగము కొన్ని లక్షల సంవత్సరముల కాలముంటుంది. అలాంటపుడు అవసరమొచ్చి ప్రతి
యుగమునందు వచ్చినా, ఒక రాకడకు మరొక రాకడకు కొన్ని లక్షల సంవత్సరముల వ్యవధి ఉండును. అలాంటిది
ద్వాపరయుగము అంత్యములో వచ్చిన భగవంతుడు, వెంటనే కలియుగమున కేవలము మూడువేల సంవత్సరములకే
రావడము ఆశ్చర్యపడవలసిన విషయమే అగును. ఒకమారు భూమిమీదకు దైవశక్తి అయిన భగవంతుడు వచ్చి ధర్మములను
నెలకొల్పి పోతే, తిరిగి అవి అధర్మములుగా మారుటకు కొన్ని లక్షల సంవత్సరములు పట్టును. ఆ నేపధ్యములో ఒక్కొక్కమారు
భగవంతుని రాక దాదాపు పది యుగములకు ఒకమారు ఉండవచ్చును. అటువంటిది కృష్ణుడు చనిపోతూనే కలియుగము
వెంటనే ప్రారంభమైనది. భగవంతుడు వచ్చి ధర్మములను తెలియజేసి పోయిన తర్వాత మూడు వేల సంవత్సరము లకే
తిరిగి దైవశక్తి భూమిమీద పుట్టిందని చెప్పితే, మూడు వేల సంవత్సరము లకే ధర్మములు అధర్మములైనాయా? అను
ప్రశ్నరాగలదు. ఒకవేళ అంత తొందరగా ధర్మములు, అధర్మములుగా మారిపోతే, దైవశక్తి భగవంతునిగా ధర్మములను
తెలియజేయుటకు ఒక యుగములోనే ఎన్నో వందలమార్లు భూమిమీదకు రావలసివస్తుంది. అలా జరుగుతుందా? ఒక
100

Page 101
యుగములోనే ధర్మములు అధర్మములుగా ఎన్నో వందల మార్లు మారిపోవునా? అని ప్రశ్నించుకొంటే దానికి జవాబు
ఈ విధముగా గలదు.
దైవశక్తి భగవంతునిగా రావాలంటే అధర్మములు ఒక స్థాయికి పెరగాలి. అధర్మములు ఒక స్థాయిని
అందుకొంటూనే భగవంతుని జన్మ తనకు తానుగా వచ్చును. అలా భగవంతుడు భూమిమీదకు వచ్చి ఒకమారు
ధర్మములను నెలకొల్పిపోతే తిరిగి అవి అధర్మములుగా మారుటకు కొన్ని యుగముల కాలము పట్టును. ఒక అంచనా
ప్రకారము దాదాపు పది యుగములకు ఒకమారు దైవశక్తి మనిషిగా భూమిమీదకు రావచ్చును. దీనినిబట్టి దాదాపు
ఒక కోటి సంవత్సరముల తర్వాత 8 లక్షలనుండి 10 లక్షల సంవత్సరముల లోపల భగవంతునిరాక ఉండవచ్చునని
అను కుంటాము. ఒకమారు భూమిమీద ధర్మములను నెలకొల్పిపోతే తిరిగి అవి అధర్మములుగా మారుటకు దాదాపు
పదియుగముల కాలము పట్టునని తెలియుచున్నది. దీనినిబట్టి భగవంతుని రాక తొందరగా ఉండదని తెలియు చున్నది.
అలాంటపుడు కృష్ణుని తర్వాత కేవలము మూడువేల సంవత్సరము లకే తిరిగి ఏసుగా పుట్టాడని చెప్పడమేమిటి? అని
కొందరు నన్ను ప్రశ్నించ వచ్చును. దానికి మా వద్దనుండి వచ్చు జవాబు ఏమనగా! దేవుడు భూమిమీద ఒకమారు
ధర్మములను నెలకొల్పుటకు కొంతకాలము పట్టును. ద్వాపరయుగ అంత్యములో కృష్ణుడు వచ్చి ఒకమారు అర్జునునికి
మాత్రము ధర్మములను తెలిపాడు. అదియు ఆయన వచ్చిన తర్వాత, సమయమును చూచి దాదాపు 90 సంవత్సరముల
వయస్సులో కేవలము ఒక్కమారు చెప్పడము జరిగినది. ధర్మములను నెలకొల్పుటకు దాదాపు కోటి 10 లక్షల
సంవత్సరములకు ఒకమారు వచ్చు భగవంతుడు కేవలము పది నిమిషముల లోపల ధర్మములను బోధించునా? అలా
బోధించడము సంపూర్ణముగా అధర్మములను లేకుండా చేసినట్లగునా? ధర్మములను నెలకొల్పడము ఎంతో ఉన్నతమైన
పనికాగా, ఆ పని కృష్ణుని జన్మలోనే చేశాడా? ఒకమారు నెలకొల్పబడు ధర్మములు పది కాలములకు పైగా అనగా పది
యుగములకు పైగా ఉండవలసి వస్తున్నది. అంత దీర్ఘ కాలముండవలసిన ధర్మములు అంత సులభముగా కేవలము
కొన్ని నిమిషములలో బోధించునా అని యోచించవలసిన పని ఉన్నది.
అలా యోచిస్తే తెలియు రహస్యమొకటి కలదు. ఈ రహస్యము సులభముగా తెలియుటకు ఒక చిన్న
ఉదాహరణను తీసుకొందాము. ఒక వ్యక్తికి పది లీటర్ల పాలను అమ్మవలెనని అతని యజమాని చెప్పాడు. అప్పుడు ఆ
వ్యక్తి ఒక ఊరిలోనికి పోయి పాలను అమ్మడము మొదలు పెట్టాడు. పాలు ఎవరికి అవసరమో అడిగి పాలను అమ్మినాడు.
కానీ ఆ ఊరిలో కేవలము ఐదులీటర్ల పాలనే అమ్మినాడు. ఇంకా ఐదు లీటర్ల పాలు మిగిలి ఉన్నాయి. అప్పుడు ప్రక్క
గ్రామానికి పోయి మిగిలిన పాలను అమ్మాడు. అమ్మిన పాలు పది లీటర్లు, తిరిగిన ఊర్లు రెండు, అమ్మినవాడు ఒక్కడే.
కానీ ఇక్కడ ఒక తతంగమును గమనిద్దాము. మొదట పాలు అమ్మిన ఊరిలో అందరు శూద్రులే ఉన్నారు. కాబట్టి
అమ్మేవాడు ఏ ఆటంకం లేకుండా అమ్మేశాడు. రెండవ ఊరిలో అందరు బ్రాహ్మణులే ఉన్నారు. వారు బ్రాహ్మణులు
అమ్మే పాలనే కొంటారు. కానీ శూద్రులు అమ్మే పాలనుకొనరు. అమ్మేవాడు బ్రాహ్మణుడు కాడు. కానీ అమ్మవలసిన
పాలు ఐదు లీటర్లు మిగిలి ఉన్నాయి. అందువలన అమ్మవలసిన వ్యక్తి పై అంగీని తీసివేసి, ఒక జంధ్యమును మెడలో
వేసుకొని, పంచెకట్టుకొని ఆ ఊరిలోనికి పోయి పాలను అమ్మినాడు. అంగీలేకుండ క్రింద పంచె మాత్రము కట్టుకొని
వుండుట వలన, అతను బ్రాహ్మణునివలె కనిపిస్తున్నాడు. పైగా తన పేరు శంకరయ్య అయితే శంకరశాస్త్రి అని చెప్పుకొన్నాడు.
పేరులోను, ఆకారములోను బ్రాహ్మణునిగా కనిపించి అమ్మడము వలన అతని ఐదు లీటర్ల పాలను అక్కడి బ్రాహ్మణులు
కొన్నారు. పది లీటర్ల పాలను అమ్మిన తర్వాత పాలవానికి జంధ్యముతో పనిలేదు అలాగే పంచెతో పనిలేదు.
101

Page 102
అందువలన వాడు ఇంటికి పోయి జంధ్యమును, పంచెను తీసివేసి తాను ఎప్పుడూ కట్టుకొనే లుంగీని కట్టుకొని
పడుకొన్నాడు. అక్కడ పది లీటర్ల పాలను అమ్మడము ముఖ్యమైన ఉద్దేశము. ఎన్ని ఊర్లలో అమ్మినావు అనిగానీ,
ఎంతసేపుకు అమ్మినావు అనిగానీ పాల యజమాని అడగడము లేదు. పాల యజమాని యొక్క పాలను పాలవాడు
(పాలను అమ్మువాడు) అమ్మి పెట్టాలి అన్నది నియమము. అంతేగానీ ఈ వీధిలోనే అమ్మాలి, ఆ ఊరిలోనే అమ్మాలి,
గంటలోపే అమ్మాలి, అరగంటలోపే అమ్మాలి అను నియమము లేదు. అందువలన పాలవాడు పది లీటర్ల పాలను
అమ్మితే పాల యజమాని లెక్కలో పాలవాడు ఒకరోజు పని చేసినట్లగును.
పై విధముగ పోల్చుకుంటే పాలయజమాని ఉన్నట్లు పరమాత్మ ఉన్నాడు. పాలవాడు ఉన్నట్లు భగవంతుడున్నాడు.
పాలవాడు అమ్ము పాలు పాలయజమానివి అయినట్లు, భగవంతుడు బోధించు ధర్మములు పరమాత్మవి (దేవునివి).
అమ్మవలసిన పాలు పదిలీటర్లు అయినట్లు తెలుప వలసిన ధర్మములు నూరు శాతము. పాలవాడు పాలను రెండు
ఊర్లలో అమ్మినా పరవాలేదు అన్నట్లు, భగవంతుడు నూరు శాతము ధర్మములను రెండు దేశములలో చెప్పినా ఫరవాలేదు.
పదిలీటర్ల పాలను అమ్మినపుడే పాలవానికి ఒకరోజు పని అయినట్లు లెక్కించబడును. నూరు శాతము ధర్మములను
తెలపినపుడే భగవంతునికి ఒకమారు ధర్మములను బోధించినట్లగును. పాలవాడు పది లీటర్ల పాలను అమ్ముటకు రెండు
ఊర్లలోనికి పోయి రెండు ఊర్లలో కనిపించినట్లు, భగవంతుడు నూరుశాతము ధర్మములను తెలుపుటకు రెండు
దేశములలోనికి పోయి రెండు దేశములలో కనిపించును. ఒక ఊరిలో శూద్రునిగా, ఒక ఊరిలో బ్రాహ్మణునిగా
కనిపించినట్లు ఒక దేశములో ఒక హిందువుల ప్రవక్తగా, మరొక దేశములో క్రైస్తవ ప్రవక్తగా కనిపించును. పాలవాడు
ఉదయము ఆరు గంటలకు ఒక ఊరిలో కొన్ని పాలను అమ్మి, తర్వాత కొంతసేపటికి ఏడు గంటలకు రెండవ
ఊరిలోనికి పోయి అక్కడ వారి కులస్థునిగా కనిపించి, ఏడు గంటలకు పాలను అమ్మినట్లు, భగవంతుడు కృష్ణునిగా
ద్వాపరయుగ చివరిలో దేవుని ధర్మములను బోధించి తర్వాత కొంత కాలమునకు (మూడువేల సంవత్సరములకు)
ఇజ్రాయేలు దేశములోనికి పోయి అక్కడ వారి మతప్రవక్తగా కనిపించి, కలియుగములో దైవధర్మములను బోధించాడు.
పది లీటర్ల పాలను రెండు ఊర్లలో అమ్మినపుడు పాలవానికి ఒకరోజు పని అయినట్లు, భగవంతుడు వేరు వేరు
సమయములలో వేరు వేరు దేశములలో నూరుశాతము ధర్మములను బోధించినపుడే ఆయనకు ఒక అవతారము
పనిపూర్తి అయినట్లగును. పాలవాడు యజమాని పాలను ఎన్ని ఊర్లలో అమ్మినా, ఎంత సమయములో అమ్మినా
పదిలీటర్ల పాలను అమ్మినపుడే యజమాని దృష్ఠిలో ఒకరోజు పాలవాడు పనిచేసినట్లు లెక్కించబడును. అదే విధముగ
భగవంతుడు ఎన్ని దేశములలో ధర్మములను చెప్పినా, ఎంత కాలములో చెప్పినా, నూరుశాతము ధర్మములను
తెలియజేసినపుడే, దేవుని దృష్టిలో భగవంతుడు ఒకమారు భూమిమీద ధర్మములను బోధించినట్లగును.
పాల యజమాని
పాలు
పాలవాడు
పదిలీటర్ల పాలు
రెండు ఊర్లు
శంకరయ్య
శంకరశాస్త్రి
ధర్మములకు అధిపతి అయిన దేవుడు
ధర్మములు
భగవంతుడు
నూరుశాతము ధర్మములు
రెండు భూ భాగములు
కృష్ణ
ఏసు
102

Page 103
పాలవాడు (శూద్రుడు)
భగవంతుడు కృష్ణుడు
పాలవాడు (బ్రాహ్మణుడు)
భగవంతుడు ప్రవక్త
అమ్మిన సమయము
బోధించిన కాలము
ఆరు గంటలపుడు
ద్వాపరయుగములో
ఏడు గంటలపుడు
పాలను అమ్మడము
ఒక రోజు పని
పాలను కొన్నవారు
పాలను కొన్న ఒక ఊరు
పాలను కొన్న రెండవ ఊరు
కలియుగములో
ధర్మములను బోధించడము
ఒక అవతారము యొక్క పని
ధర్మములను తెలుసుకొన్న వారు
మొదట ధర్మములను తెలిసిన దేశము భారత దేశము.
తర్వాత ధర్మములను తెలిసిన దేశము ఇజ్రాయేల్ దేశము.
ఒక పొడుగాటి సరళరేఖ ఉందనుకొనుము. ఆ రేఖకు రెండు ధృవములుండును. ఆ రెండు ధృవములను
కలుపు మధ్యరేఖ ఉండును. రేఖ అనగా గీచిన గీత అని అందరికి తెలుసు. ఒక గీతకు రెండు ధృవములు, ఆ రెండు
ధృవములను కలుపు గీత ఉండును. క్రింది చిత్ర పటములో చూడుము.
3
1
2
చిత్రములో కనిపించు ఒకటవ కొన ఉత్తర ధృవము, అలాగే రెండవకొన దక్షిణ ధృవము. ఒకటి రెండు
కొనలను కలుపుచున్న రేఖను రెండు ధృవములను ఏకస్థాయిగా సమతలముగా చూపుగీత అని అంటున్నాము. గీత ఉ
ంది అంటే ధృవములుంటాయి. రెండు ధృవములు ఉన్నాయి అంటే చూచే దానికి అవి ఒకదానికొకటి వ్యతిరిక్త దిశలలో
ఉండును. వ్యతిరేఖ దిశలలో రెండు ధృవములున్నా, రెండిటిని సమానముగా చూపు గీత ఉండును. మొత్తము మీద
చెప్పాలంటే ఒక గీత మూడు భాగములుగా ఉన్నదని చెప్పవచ్చును. దీనినిబట్టి గీయబడిన గీత కూడ త్రైతముతో
కూడుకొని ఉన్నదని తెలియుచున్నది. ఇపుడు అసలు విషయానికి వస్తాము. భగవంతుడు తెలియ చెప్పినది భగవద్గీత,
భగవంతుడు చెప్పిన గీతకు కూడ త్రైతము వర్తిస్తున్నది. భగవంతుని గీత మూడు భాగములుగా ఉంటూ ముగ్గురు
పురుషులను తెలియజేస్తున్నది. భగవంతుని చేత గీయ బడిన గీతకు కూడ రెండు ధృవములు కలవు. భగవద్గీత కూడ
ఒకకొన ఉత్తర ధృవముగా, రెండవకొన దక్షిణ ధృవముగా ఉన్నది. ఉత్తర ధృవము దేవుడు, దక్షిణ ధృవము జీవుడని
దీని అర్థము. ఉత్తర ధృవముగానున్న మొదటి కొన భాగము పరమాత్మయని, దక్షిణ ధృవముగానున్న రెండవ కొన
భాగము జీవాత్మయనీ, వాటికి మధ్యలోనున్న గీత జీవాత్మను పరమాత్మను ఏకము చేయు ఆత్మ అని తెలియుచున్నది.
సమస్త జగతిలో ఏ జీవాత్మ అయిన పరమాత్మను చేరాలంటే ఆత్మ ద్వారానే సాధ్యమగును. జీవాత్మకు దారి ఆత్మయే.
ఆత్మ దారిలో ప్రయాణిస్తేనే పరమాత్మ అను గమ్యమును చేరవచ్చును. అందువలన దేవున్ని చేరాలను ఏ జీవుడైనా
ఆత్మను అధ్యయనము చేసి తీరాల్సిందే, ఇది శాసనము. ఆత్మను గూర్చి ఆధ్యయనము చేయడమునే ఆధ్యాత్మికము
అంటాము. ఆధ్యాత్మికము తెలియనిది జగతిలో ఎవనికీ ముక్తి లభించదు.
103

Page 104
గీయబడిన గీత మూడు భాగములుగా ఉన్నట్లు, చెప్పబడిన గీత మూడు భాగములుగా ఉన్నది. తన గీత
త్రైతముతో కూడుకొన్నదనీ, మూడు భాగములుగా ప్రజలకు తెలియబడునని తెలిసిన కృష్ణుడు, ఆ రహస్యమును చివరిలో
బోయవానికి చెప్పిపోయాడు. పాలవాడు రెండు ఊర్లలో పాలు అమ్మినట్లు, భగవంతుడు రెండు సమయములలో
రెండు దేశములలో తన బోధను తెలుపవలసి ఉన్నది. భోజనము చేయువాడు మజ్జిగతో తిన్నపుడే అది సంపూర్ణ
భోజనమని అనుకొనునట్లు, చివరిలో మూడవ మారు బోధయొక్క వివరమును తెలిపినపుడు సంపూర్ణముగా చెప్పినట్లు
అగును. గీయబడిన గీత మూడు భాగములున్నట్లు, చెప్పబడిన గీత మూడు భాగములుగా ఉండాలి. అలాగే
చెప్పబడిన గీత మూడు ఆత్మలను తెలుపునదిగా ఉండాలి. ఈ సూత్రము వర్తించినపుడు అది భగవంతుడు మానవునికి
బోధించిన బోధ అగును. ఎప్పుడైతే కృష్ణుడు అర్జునునకు ధర్మములను యుద్ధరంగములో తెలియజేశాడో, అప్పుడు
పాలవాడు తన పాలను ఒక ఊరిలో అమ్మినట్లైనది. ఇంకా కొన్ని ధర్మములనుగానీ లేక ఒక ధర్మమునుగానీ మరియొక
కాలములో మరియొక దేశములో చెప్పవలెనని కృష్ణునికి తెలుసు. అలా రెండవ మారు రెండవ చోట తానే చెప్పవలెనని,
అలా చెప్పిన దానినే మూడవమారు తానే వివరించవలెననీ కూడ కృష్ణునికి తెలుసు. అలా మూడుమార్లు చేసినపుడు
తాను ఒకమారు భూమిమీద ధర్మములను తెలియజేసినట్లగును. అందువలన తన ప్రణాళికను లేక పథకమును
ముందే తెలియజేసినట్లు ఆధారము కొరకు, బోయవానికి తన రెండవ రాకను, మూడవ రాకను గురించిన సమాచారమును
తెలియజెప్పి పోయాడు. ఆ సమాచారముతో బోయవానికి ఏమాత్రము అవసరములేదు. అయినా కృష్ణుడు తన
మరణకాలములో చెప్పాడు. రెండవమారు వచ్చినపుడు ఈ సమాచారమును చెప్పితే ఎవరూ నమ్మరు. కృష్ణుని పేరు
చెప్పుకొని ఏసు గొప్పవాడనిపించు కొన్నాడని ఎవరైనా అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఉద్యోగి
నేను పోయిన జన్మలో మహాత్మాగాంధీనని చెప్పుకొంటే ఎవరూ నమ్మరు. ఆ ఉద్యోగి చెప్పినట్లు, అతను పోయిన జన్మలో
నిజంగా గాంధీయే అయినప్పటికీ ఎవరూ నమ్మే సితిలో ఉండరు. పైగా ఆ మాటను చెప్పుట వలన వీడు తన
అధికారుల వద్ద గౌరవమును సంపాదించుకొనుటకు అలా బొంకుచున్నాడని అందురు.
బొంకుచున్నాడని అందురు. అట్లుకాక గాంధీ బ్రతికి
ఉన్నపుడు, చనిపోకముందు రాబోవు జన్మలో ఫలానా వ్యక్తిగా పుట్టి, ఫలానా ఉద్యోగము చేస్తానని చెప్పియుంటే ప్రస్తుత
కాలములో ఆ వ్యక్తి ఆ ఉద్యోగిగా ఉన్నప్పుడు, ఎవరైనా ఈయన ఫలానా గాంధీ అని గుర్తించగలరు మరియు
గౌరవముగా చూడగలరు.
ఏదైనా జరుగకముందు చెప్పితే చెప్పినవానికి జరిగిన కార్యమునకు విలువ ఉంటుంది. అట్లుకాక జరిగిన
తర్వాత చెప్పితే జరిగిన పనికి గానీ, చెప్పిన వ్యక్తికిగానీ విలువ ఉండదు. అందువలన కృష్ణుడు జరుగబోవు దానిని
గురించి ముందే చెప్పాడు. ఆ విలువైన సమాచారమును వినిన వ్యక్తి అప్పుడే బయటికి చెప్పకపోయినా, తర్వాత
చెప్పుట వలన కృష్ణుడు చెప్పిన సమాచారమునకు విలువ చేకూరినది. కృష్ణుడు బ్రతికివున్నపుడు చెప్పిన గీతయందు,
నేను ధర్మములను సంస్థాపన చేయుటకు యుగ యుగమునందు, నన్ను నేను సృజించుకొని వస్తానని చెప్పాడు. అలాగే
ఏసుగా వచ్చిన సమయములో కూడ తర్వాత నేను వస్తానని చెప్పాడు. కృష్ణునిగా వచ్చినశక్తి, ఏసుగా వస్తానని భగవద్గీతలోను,
ఏసుగా వచ్చిన వ్యక్తి ఆదరణ కర్తగా ఫలానా అడ్రస్ లో వస్తానని బైబిలులోనూ చెప్పలేదు. ముఖ్యముగా ఈ కారణము
చేత కృష్ణుని భక్తులైన వారు ఏసును, ఏసు భక్తులైన వారు కృష్ణున్ని ఏమాత్రము నమ్మకున్నారు. కృష్ణున్ని, ఏసును వేరు
వేరు వ్యక్తులుగా లెక్కించి కృష్ణున్ని క్రైస్తవులు, ఏసును హిందువులు అసూయతో దూషిస్తున్నారు. ఇరువురి రెండు
మతాలను సృష్ఠించుకొని మతముల మబ్బులో ఒక మతమునకు మరొక మతము విరోధము అన్నట్లు ప్రవర్తించుచున్నారు.
దీనికంతటికి కారణము కృష్ణ అను పేరుతో ఐదువేల పదకొండు (5111) సంవత్సరముల క్రితము వచ్చిన వ్యక్తియే,
104

Page 105
రెండువేల పది (2010) క్రిందట ఏసుగా వచ్చాడని ఎవరూ గుర్తించలేక పోయారు. ఇపుడు నేను చెప్పు ఈ సమాచారము
కొంతమంది క్రైస్తవులకు నచ్చక పోవచ్చును. అలాగే కొంతమంది హిందువులకు కూడ నా మీద కోపమును తెప్పించును.
అయినా దేవుని విషయమును తెలిసి, సత్యమును మూసిపెట్టి బయటికి చెప్పకపోతే అది భయంకర పాపమగును.
అందువలన ఎవరు ఏమనుకొనినా తప్పనిసరిగా చెప్పవలసి వచ్చినది.
"సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యముకాదు” అను సూత్రమును అనుసరించి చూస్తే, ఎందరు
కాదు లేదు అనినా సత్యము జీవించియే ఉంటుంది. చివరకు ఎవరైనా సత్యమును ఒప్పుకోక తప్పదు. కృష్ణుడు ఏసుగా
వచ్చాడని చెప్పుట సత్యము, కనుక ఆ మాటను ఆలోచించి చూస్తే ఎవరికైనా సత్యముగా కనిపించును. కృష్ణుని
జీవితము గడిచిపోయి 5111 సంవత్సరములైనది. అలాగే ఏసు జీవితము గడచిపోయి ఇప్పటికి 2010 సంవత్సరములైనది.
ఇద్దరి జీవితములు గడచిపోయినవే కనుక గడచిన వారి చరిత్రను ఎవరూ కాదనలేరు. కృష్ణుడు పుట్టాడు, అలాగే ఏసు
పుట్టాడు. ఎవరికైన జీవితములో జననము మరియు మరణములు రెండు ముఖ్యమైన ఘట్టములు. ఇపుడు ముఖ్య
ఘట్టమైన కృష్ణుని పుట్టుకను, ఏసు పుట్టుకను గమనించి చూస్తాము. కృష్ణుడు పాతబడిన చెరసాలలో, అశుభ్రమైన
చోట, తల్లి ప్రక్కన తండ్రి తప్ప ఎవరూలేని దీనస్థితిలో పుట్టాడు. ఏసు కూడ పాతబడిన పశువులశాలలో, అశుభ్రమైన
చోట, తల్లి ప్రక్కన తండ్రి తప్ప ఎవరూ లేని ధీనస్థితిలో పుట్టాడు. జీవితము యొక్క ప్రారంభ ఘట్టములో జరిగిన
విధానమును ఇటు హిందువులు, అటు క్రైస్తవులు యుక్తినుపయోగించి యోచిస్తే కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒక్కరే అనుటకు
మొదటనే సాక్ష్యము దొరుకుచున్నది. తర్వాత చూస్తే కృష్ణుడు పుట్టడము ప్రమాద సమయము, అలాగే ఏసు పుట్టడము
కూడ ప్రమాద సమయమే. కృష్ణుడు పుట్టాడని తెలియగానే అతనిని చంపుటకు ఆ దేశరాజు సిద్ధముగా ఉన్నాడు.
అలాగే ఏసు పుట్టాడని తెలియగానే అతనిని చంపుటకు కూడ ఆ దేశరాజు సిద్ధముగా ఉన్నాడు. కృష్ణుడు పుట్టగానే
కొద్దిసేపటికే పుట్టిన చోట లేకుండ తండ్రిగానున్న వసుదేవుడు ప్రక్క ప్రాంతమునకు తీసుకెళ్ళాడు. అలాగే ఏసు పుట్టిన
కొద్దిసేపటికే ఆయన తండ్రిగానున్న యోసేపు, పుట్టిన చోట లేకుండ ప్రక్క ప్రాంతమునకు తీసుకెళ్ళాడు. కృష్ణుడుగానీ,
ఏసుగానీ ఇద్దరూ రాత్రిపూటే పుట్టారు. రాత్రి పూట పుట్టినవారు ఆ రాత్రికే పుట్టిన స్థలములో లేకుండ పోయి అక్కడికి
దూరముగా కొంతకాలము అజ్ఞాతముగా పెరిగారు. కృష్ణుడు ఏసు ఇద్దరు ఒకటేనని తెలియుటకు ఒకే పోలికగల
సంఘటనలు వారు పుట్టిన రోజు చోటు చేసుకొన్నాయి. కొంచెము తెలివిని ఉపయోగించి చూచినా, వారిరువురి జనన
రహస్యము తెలిసిపోతుంది. వారు ఇద్దరు ఒక్కరుకాదు అనుటకు వీలులేకుండ, వారిరువురి పుట్టుకలు ఒకే విధముగా
జరిగాయి.
తర్వాత కృష్ణునికి ముప్పయి సంవత్సరముల వయస్సులో అతని జీవితమందు చెప్పుకోదగిన మార్పువచ్చింది.
అలాగే ఏసుకు కూడ ముప్ఫయి సంవత్సరముల వయస్సులో మార్పు కనిపిస్తున్నది. ముప్ఫయి సంవత్సరముల వయస్సులో
కృష్ణుడు మధురను వదలి ద్వారకకు పోయాడు. అలాగే ఏసు కూడ తనకు ముప్పయి సంవత్సరముల వయస్సు రాగానే
తల్లి తండ్రులను వదలి వెళ్ళిపోయాడు. చివరిలో ముఖ్య ఘట్టమైన మరణములో కృష్ణుడు గాయపడి రక్తము కారి
చనిపోయాడు. అలాగే ఏసు కూడ గాయపడి రక్తముకారి చనిపోయాడు. కృష్ణుడు చనిపోవు సమయములో తనవారు
ఎవరూ కృష్ణునివద్ద లేరు. అలాగే ఏసు చని పోవునపుడు కూడ ఆయనవద్ద తనవారు ఎవరూ లేరు. కృష్ణుడు
మరణించునపుడు ఆయన త్రాగేదానికి నీళ్ళు కూడ అక్కడ లేవు. అలాగే ఏసుకు కూడ నీరు దొరకలేదు. కృష్ణుడు తన
కాలికి బలముగా నాటుకొన్న బాణము వలన చనిపోయాడు. అలాగే ఏసు తన కాళ్ళకు బలముగా నాటుకొన్న సీల
105

Page 106
వలన చనిపోయాడు.
ఈ విధముగా కృష్ణుని మరియు ఏసుని జనన మరణములు ఒకే స్థితిగా జరిగిపోయినవి.
భూమిమీద ఆ విధముగ ఎవరికీ జరుగకుండ, కేవలము వీరిద్దరి విషయములలోనే అలా జరగడము, వీరిరువురు
విశేషముగా ఇద్దరు ప్రవక్తలుగా ఉండడము వలన వీరి జనన మరణములను విశ్లేషించి చూడవలసి వచ్చినది. అలా
చూస్తే వీరు ఇద్దరు ఒక్కరేనని తెలియనివారు కూడ తెలుసుకొనునట్లు అలా జరిగిందని తెలియుచున్నది. కృష్ణుడు
చనిపోతూ చెప్పిన మాట సత్యమని తెలియుటకు ఏసు జననము, మరణము రెండు కృష్ణుని జనన మరణములతో
సరితూగునట్లు జరిగినవి. కనిపించని దానిని నమ్మము. కనిపించు దానినే నమ్ముతామను హేతువాదులకు, కనిపించనిది
అసత్యము కనిపించు నదే సత్యము అను నాస్తికవాదులు కూడ ఒప్పుకొనునట్లు కనిపించు సంఘటనలుగానే కృష్ణుని,
ఏసుని జననమరణములు జరిగినవి.
భౌతికముగా కృష్ణుడు ఏసుగా పుట్టాడనీ, కృష్ణుడుగానీ ఏసుగానీ ఇద్దరు ఒక్కరేనని, ఆ ఒక్కరు దైవమునందలి
శక్తియేనని, ఆ దైవశక్తియే, ఒక వ్యక్తియై, అదియే రెండు కాలములలో, రెండు ఆకారములలో, రెండు పేర్లతో చలామణి
అయినదని తెలియుచున్నది. ఒకే దైవశక్తి ధర్మములను పూర్తిగా తెలియజేయుటకు, ధర్మములు అందరికి తెలియ
చేయుటకు మొదట ఒక కృష్ణునిగా పుట్టి, తర్వాత రెండవసారి ఏసుగా పుట్టవలసి వచ్చినది. కనిపించు దానినే నమ్ము
ప్రజలు, వేరు వేరుగా కనిపించు కృష్ణున్ని, ఏసును వేరు వేరుగానే భావించుకొనుచున్నారు. కృష్ణుడుగానీ, ఏసుగానీ
చెప్పని మతములను మనుషులు ఏర్పరచుకొని, ఇది కృష్ణునిది, ఇది ఏసుది అంటున్నారు. అజ్ఞానుల దృష్టిలో కృష్ణుడు,
ఏసు ఇద్దరు వేరు వేరు వ్యక్తులైనా, జ్ఞానుల దృష్ఠిలో ఇరువురు ఒకే శక్తిగానున్న వ్యక్తులని తెలియుచున్నది. నేటి కాలములో
జ్ఞానుల సంఖ్య తగ్గిపోయి, అజ్ఞానుల సంఖ్య పెరిగి పోయినది. అజ్ఞానుల సంఖ్యను తగ్గించి, జ్ఞానుల సంఖ్యను
పెంచుటకు ఎత్తిన ప్రారంభ అవతారమే శ్రీకృష్ణునిది. అలా ప్రారంభమైన అవతారము మూడు అవతారములతో
ముగియును. ఇప్పటికి పరమాత్మ శక్తి మొదటి అవతారముగా కృష్ణుని రూపములో వచ్చి ధర్మములను తెలియ
చెప్పినది. భూమిమీద మనుషులయందు అజ్ఞానమును తీసివేసి జ్ఞానమును కల్గించు కార్యములో మొదటి భాగము
ద్వాపరయుగమున జరిగినది. మూడు భాగములలో ఒక భాగము కృష్ణుని రూపములో నెరవేరినది. రెండవ భాగము
కూడ ఏసు రూపములో నెరవేరినది. ఇప్పటికి రెండు భాగముల కార్యము పూర్తి అయినది. రెండు భాగముల యందు
ధర్మములు చెప్పబడినవి. ఇప్పటికి ప్రత్యక్షముగా ధర్మ సంస్థాపన కార్యము రెండు భాగములుగా, రెండు దేశములలో,
రెండు శరీరముల ద్వారా, రెండు పేర్లు కల్గిన వ్యక్తుల ద్వారా జరిగినప్పటికీ మేము జ్ఞానులము అనుకొను వారు ఎవరు
కూడ ఇంత పెద్ద మహత్కార్యమును గుర్తించలేక పోయారు.
ఒక గీత మూడు భాగములున్నట్లు, త్రైతముతో కూడిన ధర్మములు, త్రి భాగములుగా, త్రి వ్యక్తులద్వారా
బోధించబడును. బోధించువాడు ఒక్కడేనని, బోధించబడునవి ఒకే దేవుని ధర్మములని జ్ఞప్తికుంచుకోవాలి. దైవ
ధర్మములను పూర్తిగా బోధించుటకు కొన్ని వేలసంవత్సరముల కాలము అవసరము. ఇప్పటికి మొదట కృష్ణుడు
బోధించినప్పటినుండి దాదాపు ఐదువేల సంవత్సరములు గడచిపోయినవి. అట్లని ఐదువేల సంవత్సరముల పొడవునా
ధర్మములు బోధించబడలేదు. ద్వాపరయుగ అంత్యములో కృష్ణుని ద్వారా కొన్ని నిమిషముల కాలము ధర్మములు
బోధింపబడినవి. అది మొదటి భాగముకాగా, అప్పటినుండి మూడు వేల సంవత్సరముల తర్వాత ఏసు ద్వారా మూడు
సంవత్సరముల కాలము ధర్మములు బోధింపబడినవి. ఏసు బోధించినది రెండవ భాగముకాగా, అప్పటినుండి ఇప్పటికి
రెండు వేల సంవత్సరములు గడచినవి. మూడవ భాగములోని ధర్మబోధ కృష్ణుడు ఆదర్శకర్త ద్వారా బోధింపబడునని
106

Page 107
చెప్పగా, ఏసు ఆదరణకర్త ద్వారా బోధించ బడునని తెలియజేశాడు. ఆదరణకర్త గానీ, లేక ఆదర్శకర్త గానీ ఎప్పుడు
ఎన్ని సంవత్సరములకు వస్తారో, ఏ దేశములో బోధిస్తారో ఎక్కడ చెప్పబడి ఉండలేదు. ఎప్పటికైనా మూడవ బోధకుడు
వస్తాడు, ఈ మారు పూర్తి ధర్మములను తెలియబరుస్తాడు. అలా మూడవ పురుషునితో ధర్మముల పునరుద్ధరణ, అధర్మముల
అణచివేత కార్యము పూర్తి కానున్నది. మూడు కాలములలో, ముగ్గురు బోధకుల రూపములో చెప్పబడునవి ఒకే దేవుని
ధర్మములని తెలియవలెను. మొదట కృష్ణుడు చెప్పినవి ఒక దేవుని ధర్మములు, తర్వాత ఏసు చెప్పినవి మరొక దేవుని
ధర్మములు కానేకావు. ఇద్దరు చెప్పినవి తర్వాత రాబోవు మూడవవాడు చెప్పబోవునవి, అన్నియు ఒకే దేవుని ధర్మములని
తెలియవలెను. కృష్ణుడు చెప్పినవి హిందూమత ధర్మములని, ఏసు చెప్పినది క్రైస్తవ మత ధర్మములని పొరపాటున కూడ
అనుకోకూడదు. కృష్ణుడుగానీ, ఏసుగానీ మతధర్మములను బోధించలేదు. వారు ఇరువురు బోధించినవి ఒకే దేవుని
ధర్మములు మాత్రమేనని జ్ఞాపకముంచుకోవాలి.
ధర్మముల పునరుద్ధరణ కార్యమును మొదలు పెట్టింది కృష్ణుడు. కృష్ణుడు చాలా తెలివైనవాడు. ముందుగానే
తనయందున్న, తనకు తెలిసిన, తన ధర్మముల ప్రచార కార్యక్రమ పథకమును ఎవరికీ చెప్పక తనయందే నిగ్రహించి
పెట్టుకొని, చివరకు చనిపోయే ముందు బోయవానికి చెప్పాడు. బోయవాడు ఆ విషయమును ఎవరికీ చెప్పడని
కృష్ణునికి తెలుసు. బోయవానికి తప్ప ఎవరికి చెప్పినా, అది వెంటనే అందరికి తెలిసిపోయి, కొంత కాలమునకు
బలహీనపడిన రహస్యమై, చివరకు తెలియకుండ పోవునని కృష్ణుని భావము. అందువలన జీవితకాలమంతయు
తనయందే దాచుకొన్నాడు. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో కృష్ణునికి బాగా తెలుసు. అందువలననే అడుగకున్నా
అర్జునునకు గీతను చెప్పాడు. నీవు నాకు ప్రియుడవు, స్నేహితుడవు కావున నీకు చెప్పుచున్నానని అర్జునున్ని ఉబ్బి
పోవునట్లు చేశాడు. వాస్తవానికి కృష్ణునికి అర్జునుడు ప్రియుడేమి కాదు. కృష్ణునికి జరుగబోవు విషయములన్ని తెలుసు.
ముందే తెలిసిన వాడు కనుక ఎవరితో ఎట్లు మాట్లాడాలో, ఎట్లు మాట్లాడితే జరుగబోవు పనికి సరిపోతుందో తెలిసి
మాట్లాడేవాడు. కృష్ణునికి జరుగబోవు విషయములు తెలుసుననుటకు ఆధారముగా గీతలో విజ్ఞానయోగమందు 26వ
శ్లోకమున ఇలా కలదు.
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణిచ భూతాని మాంతు వేద న కశ్చన ॥.
భావము :- జగతిలో సర్వ జీవరాసులకు జరిగినది, జరుగుచున్నది, జరుగ బోవు విషయములు నాకు తెలుసు. అయితే
నేను ఇటువంటి వానినని ఎవరికీ తెలియదు అన్నాడు.
కృష్ణుడే స్వయముగా పై శ్లోకమున నాకు మూడు కాలములు తెలియునన్నాడు. కానీ ఆయన అంతటి గొప్పవాడని,
ఆయన సాక్షాత్తు దైవములోని అంశ అనీ, జరుగబోవు విషయములు ఆయనకు తెలియునని ఎవరికీ తెలియదు. జ్ఞానము
మీద ఆసక్తి ఉన్నవారు ఎందరో భూమిమీద ఉండగా జ్ఞానము మీద ఆసక్తిలేని అర్జునునికి గీతను చెప్పాడు. అం
చెప్పాడంటే అన్నీ ముందే తెలిసిన కృష్ణుడు అలా చెప్పడమే మంచిదని తలచి చెప్పి వుంటాడు. అలాగే బోయవానికి
కూడ చెప్పియున్నాడు. జరుగబోవు కాలములో ఏమి జరుగును అని కృష్ణునికి తెలియును. అందువలన అన్నిటిని
ఆయన తెలిసే చేశాడని చెప్పవచ్చును. ఆ జన్మ అయిపోయిన తర్వాత మూడువేల సంవత్సరములకు తానే ఏసుగా
వస్తానని కృష్ణునికి తెలుసు. ఆ రహస్యమును బోయవానికి చెప్పినా, అది బయటికి పొక్కదని కూడ తెలుసు. తర్వాత
107

Page 108
చివరికి ఆ రహస్యము ఎవరికి తెలుస్తుందో కూడ ఆయనకు తెలుసు. ఐదువేల సంవత్సరములకు తన మాట క్రొత్తగా
తెలిసినపుడు తెలిసినవారు గ్రంథరూపములోనికి ఈ విషయమును వ్రాస్తారని కూడ తెలుసు. కృష్ణుడు చెప్పిన రహస్యము
ఏసు వచ్చి పోయిన తర్వాత తెలియడమే మంచిదని కృష్ణుడు అనుకొన్నాడు. కృష్ణుడు స్వయముగా ఏసుగా జన్మించి
అక్కడ కూడ తాను ఎంతటివాడైనది, ఎవరైనది, ఎవరి అంచనాకు దొరకకుండా చేశాడు. అలా చేయుటకు కారణము
ఏమనగా! కృష్ణ, ఏసు పాత్రలలో కేవలము దైవధర్మములను చెప్పిపోవడమే అక్కడి ఉద్దేశము. అక్కడ ఆయన ఎవరనునది
తెలియుట అవసరము లేదు.
జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి తెలిసిన కృష్ణుడు తాను ఎవరైనది కేవలము జ్ఞానులకు,
యోగులకు మాత్రమే తెలియాలనీ, అజ్ఞానులకు ఏమాత్రము తెలియకూడదనుకొన్నాడు. అందువలన కృష్ణుడు ఎవరో,
అజ్ఞానులైన వారికి ఎవరికీ తెలియకుండ పోయినది. కృష్ణుడు తన పథకమును జ్ఞానులకు, యోగులకు మాత్రము
తెలియునట్లు చేశాడు. జ్ఞానులకు, యోగులకు ఏసుగా రాకముందే తెలిస్తే జ్ఞానుల వలన, యోగులవలన తన పనికి
ఆటంకమేర్పడునని, తాను రచించుకొన్న పథకము ప్రకారము ఏసుగా తన జీవితము సాగదని తెలిసి, ఏసు పోయిన
తర్వాత రెండువేల సంవత్సరములకు తన జన్మల రహస్యమును తెలియునట్లు చేశాడు. అలా చేయుట వలన కృష్ణునికి
మూడవరాక, ఏసుకి రెండవ రాక అయిన ఆదరణకర్త విషయము జ్ఞానులకు, అజ్ఞానులకు తెలిసినా ఫరవాలేదనుకొన్నాడు.
కృష్ణుని మొదటి రాకలో ఆయన గొప్ప ధనికుడుగా వచ్చాడు. ఆయనకు రెండవ రాకలో ఏసు చాలా బీదవాడు,
కట్టుకొనే దానికి రెండవ వస్త్రము కూడాలేని వాడు. కృష్ణుడు బంగారు ఆభరణములు ధరించి పట్టువస్త్రములు కట్టినవాడు,
ఏసు జన్మలోనున్నపుడు నూలువస్త్రము కూడ సరిగాలేనివాడుగా కనిపించాడు. ఇక మూడవ అవతారములో ఎవరికి
తెలియకుండునట్లు ధనికుడుకాక, బీదవాడుకాక మధ్య రకముగా ఉండునని తెలియుచున్నది.
భగవంతుడి మొదటి జన్మయందు కృష్ణుడు అర్జునునికి చెప్పిన భగవద్గీతలో తాను దేవుడనని ప్రకటించుకొనినా,
విశ్వరూపమును చూపినా దానిని ఎవరూ నమ్మకుండునట్లు ప్రవర్తించాడు. రెండవ జన్మ అయిన ఏసుగా వచ్చినపుడు
తాను దేవుడు పంపగా వచ్చిన దేవుని కుమారుడనని ఒక ప్రక్క చెప్పుచూనే, మరొక ప్రక్క తాను దేవుడు ఇద్దరము
ఒక్కటేనను సత్యమును చెప్పాడు. మూడవ రాక అయిన ఏసు చెప్పిన ఆదరణకర్త తాను దేవుడనని కానీ, దేవుడు
పంపగా వచ్చిన వాడననిగానీ ఏమాత్రము చెప్పకుండ సాధారణ వ్యక్తిగానే ప్రకటించుకొనును. సాధారణ వ్యక్తిగానున్న
ఆదరణకర్తను కనుగొనుటకు వీలుకాదు. కానీ కృష్ణుడు ఆయన పేరును గురించి చెప్పాడు, మూడవ వాడు “ఆదర్శకర్త”
అను పేరుతో చలామణి అగునని చెప్పుట వలన మూడవ అవతారమును గుర్తించుటకు అవకాశము గలదు. దైవ
ధర్మములను తెలుపు సుధీర్ఘకార్యము మూడవ రాకతో అయిపోవును. మూడవ రాకతో దైవమార్గములో అంతవరకు
తెలియని విధానమంతయు తెలియబడును. దైవధర్మములలో అతి చిన్న సూత్రములు కూడ తెలియబడును. అట్లు
తెలియబడడమే కాక మూడవరూపములో వచ్చిన భగవంతుడు తన మొదటి జన్మ అయిన కృష్ణావతారముతో తెలిపిన
ధర్మములను, రెండవ జన్మ అయిన ఏసు అవతారములో చెప్పిన వాక్యములను, తన మూడవ జన్మలో వివరించి
చెప్పును. మూడవ జన్మతో దైవధర్మములను తెలుపు కార్యము ముగియుచున్నది. అంతవరకు ఏమి తెలియకుండినా
తెలియ చెప్పవలసిన బాధ్యత మూడవ జన్మలోనే ఉన్నది.
ఐదువేల సంవత్సరముల పూర్వము భగవద్గీతను చెప్పినా, అది వ్యాసుని చేత సంస్కృతములో వ్రాయబడినా,
వ్యాసుడు వ్రాసిన దానిని ఎందరో పండితులు, స్వాములు తమ తమ భాషలలోనికి మార్చి వివరించి వ్రాసినా, కృష్ణుడు
108

Page 109
మూడవ అవతారముగా వచ్చు వరకు దాని నిజార్థము ఎవరికీ తెలియదు. అంతవరకు అందరు చెప్పుకొన్నది కృష్ణుడు
చెప్పిన భావము కాదు. ఎంత పెద్ద పేరుపొందిన స్వామీజీలు చెప్పినా, వ్రాసినా దేవుని ధర్మముల వాస్తవ భావములు
దేవునికే తెలుసు మనుషులకు తెలియదు అను సూత్రము ప్రకారము భగవద్గీత సరిగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఈ
మాటతో స్వామీజీలందరు నాకు వ్యతిరేకులై పోతారని తెలుసు. అయినా సూత్రము ప్రకారము చెప్పుచున్నానని, ఎవరినీ
కించపరుచుటకు కాదని గ్రహించవలెను. భగవద్గీత పుట్టి ఐదువేల సంవత్సరములైనా, అది మనకు అర్థము కాలేదని
ఒప్పుకోక తప్పదు. భగవద్గీత అర్థము కావాలంటే తిరిగి కృష్ణుడే వచ్చి, ఆనాడు ఏ భావములో చెప్పాడో ఆ భావమును
వివరించి చెప్పితే, అప్పుడు భగవద్గీత యొక్క భావము తెలియును. అందువలన కృష్ణుడు మూడవ అవతారములో,
మూడవ పురుషునిగా వచ్చినపుడు గీతను సంపూర్ణముగా తెలియజెప్పును. కృష్ణుడు చెప్పిన మాటను కృష్ణుడే వివరించి
చెప్పితే అప్పుడు అర్థమగును తప్ప వేరేవారు ఎవరు చెప్పినా చెప్పువారికి కూడ తెలియదనే చెప్పవచ్చును. కావున అది
మనకు కూడ తెలియదు.
రెండవ అవతారమైన ఏసు జన్మలో తాను చెప్పినదంతా చెప్పి చివరిలో ఇలా అన్నాడు. “ఇప్పుడు నేను
చెప్పినది మీకు ఎవరికీ అర్థము కాదు. నా తర్వాత వచ్చు ఆదరణకర్త నేను చెప్పిన విషయములను తీసుకొని వివరించి
చెప్పును. అప్పుడు మీకు నా మాటలు అర్థమవును” అన్నాడు. కృష్ణుడు ఏసుగానున్నపుడు చెప్పిన ఈ మాటను బట్టి
రెండు వేల సంవత్సరముల నుండి ఏసు చెప్పిన మాటలు అర్థము కాలేదని తెలియుచున్నది. కృష్ణుని మూడవ
అవతారములోనే ఏసు చెప్పిన మాటలు కూడ వివరించి చెప్పబడును. అప్పుడు ఏసు ఎవరో, ఆయన చెప్పిన మాటలు
ఏమిటో, ఆయన మాటలకు భావము ఏమిటో తెలియును. అంతవరకు మేము బోధకులము అని ఏసు పేరును
చెప్పుకొనుచు, ఆయన బోధలను వివరించినా, ఏసు చెప్పినట్లు ఆదరణకర్త చెప్పువరకు అర్థముకావు. ఏసు మాటప్రకారము
ఆదరణకర్త ద్వారానే ఏసు చెప్పిన మాటల వివరము ఏమిటో తెలియును. కానీ అంతవరకు ఏ బోధకుడు చెప్పినా
అర్థము కావు. అట్లు అర్థమైనాయంటే ఏసు మాట అసత్యమగును. ఏసు మాట ఎప్పటికీ అసత్యముకాదు. కావున
మనకు ఇంతవరకు ఏసు చెప్పిన మాటలు ఎంత విలువైనవో అర్థము కాలేదని ఒప్పుకోవడము మంచిది.
ఏసు చెప్పిన మాటలేకాదు, కృష్ణుడు చెప్పిన గీత కూడ అర్థము కాలేదని ఒప్పుకోక తప్పదు. మనకు
ద్వాపరయుగములోని గీత, కలియుగములోని ఏసు వాక్యములను వివరించి చెప్పుటకే మూడవ అవతారమున్నదని
తెలియవలెను. మూడవ అవతారములో కృష్ణుడు, ఏసు కలిసివున్నారు. కావున కృష్ణుని మాటకు కృష్ణుడు, ఏసు
మాటలకు ఏసు మూడవ పురుషుని నుండి వివరించి చెప్పగలరని అనుకోవచ్చును. మూడవ వాడు అలా గతములోని
వాక్యములకు వివరమును చెప్పుచు, సందర్భాను సారము తాను చెప్పవలసిన దానిని కూడ చెప్పుచూ పోవును.
ఒకవైపు గతములో తానే చెప్పిన గీతకు, వాక్యములకు సరియైన భావమును తెలియజేస్తూ మధ్య మధ్యలో అంతవరకు
మిగిలిపోయిన ధర్మములను, సృష్ట్యాదినుండి తెలియని క్రొత్తగానున్న ధర్మముల వివరమును తెలియజేస్తూ పోవును.
ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అది ఏమనగా! మూడవ అవతారములో కృష్ణుడు, ఏసు కలిసి ఉన్నారు.
గతములో కృష్ణుడు చెప్పిన మాటకు కృష్ణుడు, ఏసు చెప్పిన మాటలకు ఏసు మూడవ అవతారము నుండి చెప్పునన్నారు.
ఒక మనిషిలో రెండు దయ్యాలు దూరుకొని వుండి మాట్లాడినట్లు మూడవ అవతారమైన మనిషిలో దయ్యాలవలె
కృష్ణుడు, ఏసు ఇద్దరు ఉన్నారా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మీకు సులభముగా అర్థమగుటకు
మేము అలా చెప్పాము. కానీ మూడవ అవతారములో ప్రత్యేకించి కృష్ణుడు, ఏసు ఉండరు. ద్వాపర యుగములో ధర్మ
109

Page 110
ప్రచార నిమిత్తము దేవుని నుండి భగవంతునిగా ఏ శక్తి కేటాయించ బడిందో, ఆ శక్తియే రెండవమారు పుట్టింది.
అప్పుడు గుర్తింపుకొరకు ఆ శరీరమునకు ఏసు అని పేరు పెట్టబడింది. పాలవాడు బ్రాహ్మణ వీధిలోనికి పోయి
శంకరయ్య అను తన పేరును శంకరశాస్త్రి అని మార్చుకొని పాలను అక్కడ అమ్మినట్లు, కృష్ణుడే ఇజ్రాయేల్ దేశమున
తన పేరును ఏసుగా చెప్పుకొని ధర్మములను తెలియజెప్పాడని గ్రహించవలెను. అలా పేరును మార్చుకొని చెప్పిన శక్తి
అయిన కృష్ణుడే, మూడవ అవతారములో "ఆదర్శకర్త" అను పేరును పెట్టుకొని వస్తాడని ద్వాపరయుగములో చివరి
సమయములో బోయవానికి చెప్పి పోవడము జరిగినది. ఏసుగానున్నపుడు “ఆదరణకర్త” వస్తాడని చెప్పిన కృష్ణుడు
మొదట ద్వాపరయుగములో బోయవానికి చెప్పినపుడు వచ్చే మూడవ వాడు “ఆదర్శ కర్త” అను పేరు కల్గివుంటాడని
చెప్పాడు. ఇక్కడ ఆదరణకర్త, ఆదర్శకర్త అను రెండు పేర్లు కనిపిస్తున్నవి. చెప్పినవాడు ఒకే శక్తి (ఒకే వ్యక్తి) అయినపుడు
రెండు పేర్లు చెప్పడమేమిటి? ఏది నిజమని నమ్మాలి అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా!
ఈ ప్రపంచమును, అందులోని జీవరాసులను సృష్టించిన దేవుడే సాక్షాత్తు భగవంతునిగా అవతరించినపుడు,
తన మూడు అవతారములలో ఒక దానిలో ఒక పేరును చెప్పి, రెండవ దానిలో మరొక పేరును చెప్పడ మేమిటి? అని
నా బుద్ధికి కూడ మీకు వచ్చిన ప్రశ్నే వచ్చింది. మీకు బాగా అర్థమగుటకు శరీరములో ప్రశ్న ఎలా పుట్టుచున్నది.
దానికి జవాబు ఎలా వస్తున్నదో, శరీరము లోపల జరుగు దానిని వివరిస్తూ చెప్పుకొందాము. నాలోని బుద్ది రెండు
పేర్లు ఎందుకు చెప్పాడని ఒక ప్రక్క ప్రశ్నించింది, అదే బుద్దే దేవుడు నిజమే చెప్పుతాడు అబద్దము ఎందుకు చెప్పుతాడని
మరొక ప్రక్క నుండి జవాబు చెప్పింది. నేను నా బుద్దికి ప్రక్కన వుండి చూస్తున్నాను. నా బుద్ధి ఒక ప్రక్క ప్రశ్నవేసింది.
మరొక ప్రక్క జవాబు చెప్పింది. తర్వాత వెంటనే బుద్ధి మరొక ప్రశ్నను ప్రశ్నించింది. నీవన్నట్లు దేవుడు నిజమే చెప్పితే
ఏదో ఒక దానిని చెప్పవచ్చును కదా! బుద్ధియే ఇలా జవాబు
ఇలా జవాబు అలా రెండు పేర్లు చెప్పుటకు కారణము
ఉంటుంది. దానికి నా బుద్ధియే మళ్ళీ అడిగింది. ఆ కారణమేదో చెప్పు లేకపోతే భగవంతుడు చెప్పింది తప్పు అని
ఒప్పుకో అన్నది. ఆ మాటకు భగవంతుడు తప్పు చెప్పునా ఎప్పటికీ చెప్పడు. అలా రెండు పేర్లు చెప్పడానికి కారణమును
చెప్పుతాను విను అని బుద్ధి బుద్ధికే చెప్పింది. నేను గమనిస్తుండగా నా ప్రక్కనున్న బుద్ధి రెండు రకములుగా ప్రశ్న
జవాబుగా మాట్లాడుకోవడము జరిగింది. నా ఒక్కనికే కాదు ప్రతి శరీరములోను బుద్ధి రెండు రకములుగా ప్రతి
విషయమును విడదీయును. ప్రస్తుతానికి నా శరీరములో నేను చూస్తుండగా నా బుద్ధి భగవంతుడు రెండు పేర్లను
ఎందుకు చెప్పాడో వివరిస్తుంది. దానినే బయటికి మీకు తెలియునట్లు వివరిస్తున్నాను చూడండి.
చెప్పుచున్నది.
భూమి మీదున్న మనుషులలో మూడు రకములవారున్నారని చెప్పవచ్చును. ఒక రకము మనుషులు దేవుని
మీద విశ్వాసము కలవారు, రెండవ రకము వారు దేవుని మీద విశ్వాసములేనివారు. మూడవ వారు దేవుడను విషయమే
తెలియక తటస్థముగా ఉండువారు. మూడవ రకము వారు త్రవ్వేది లేదు, పూడ్చేది లేదు అన్నట్లు దేవుని గురించి
ఉన్నాడనిగానీ, లేడనిగానీ మాట్లాడరు. ఎవరైనా దేవుడున్నాడని చెప్పినా వింటారు. అంతేకాని తర్వాత ఆ మాటను
పట్టించుకోరు. దేవుడు లేడని చెప్పే వారి మాటలను కూడ వింటారు. కానీ ఆ మాటలను కూడ పట్టించుకోరు.
మేము అలాంటి వారిని చాలామందిని చూచాము. మంచి జ్ఞానముగల గ్రంథములను వారికి ఇచ్చాము. ఇస్తే తీసుకొంటారు
కానీ వారు చదువరు. వారు చదవరని తెలిసి, మనమే జ్ఞానమును అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పాలని చెప్పితే
వింటారు. కానీ విన్నదానికి ఏమాత్రము స్పందన ఉండదు. అటువంటివారు ఎవరు చెప్పినా వింటారు. కానీ వారిలో
మార్పు ఉండదు. అటువంటి మనుషులందరిని ఒక రకముగా చెప్పవచ్చును. అటువంటి వారు భూమిమీద ఎక్కువ
110

Page 111
శాతము మంది ఉన్నారు. వారి దారిలో వారు పోవడము తప్ప వారు ఎవరి దారికీ రారు. మిగత మనుషులలో
కొందరు దేవుని మీద విశ్వాసము గలవారు గలరు. అయితే వారికి దేవుని మీద విశ్వాసము ఉండినా, అందరు ఒకే
దారిలో పోకుండ అనేకరకములుగా వారు దేవున్ని ఆరాధిస్తున్నారు. వారిలో కొందరిది మంచి మార్గముకావచ్చు,
కొందరిది అంత మంచి మార్గము కాకపోవచ్చు. ఇట్లు విశ్వాసుల రకమే కాకుండ అవిశ్వాసము గలవారు కూడ
భూమిమీద కొందరున్నారు. వారే పూర్తి నాస్తికులు, అటువంటి వారు పూర్తిగా దేవుడే లేడనుచుందురు.
స్థూలమైన ప్రపంచ చదువులు చదివిన కొందరు, తమకు కొద్ది మాత్రము విజ్ఞానము తెలిసినంత మాత్రమున,
విజ్ఞానమంతా తెలిసి పోయిందను భ్రమలో మునిగిపోయి, చివరకు దేవుడే లేడనుచుందురు. దేవుడు అనుమాట
కేవలము కొందరి భ్రమయేనని చెప్పుచుందురు. అన్నీ తామే చేసుకొంటున్నామని, మనము కనుగొన్న యంత్రముల
చేత పరికరముల చేత మనము సుఖములను అనుభవిస్తున్నామని చెప్పు కొంటున్నారు. మన మేధస్సు చేత ఎన్నో
కనుగొన్నాము, తర్వాత ఎన్నో కనుగొంటాము అని చెప్పచూ, ఈ దినము సెల్ఫోన్లో మాట్లాడుచున్నా మన్నా, కంప్యూటర్ల
చేత పనిని చేయిస్తున్నామనినా, విమానములో క్షణాలలో గమ్యమును చేరుచున్నామనినా ఇదంతయు మనిషి కనుగొన్న
సైన్సు వలన జరుగుచున్నది. సైన్సును తెలియని మనుషులు తమను తాము నమ్మక దేవున్ని మూఢముగా నమ్ముచున్నారని
చెప్పుచు, దేవున్ని నమ్మువారిని తెలివి తక్కువ వారిగా భావించుచుందురు. దేవున్ని అసూయతో మాట్లాడు చుందురు.
ఇటువంటి వారిని గురించి ఒక ఉదాహరణను చెప్పుకొందాము. ఒకడు తన తమ్మునికి నీతిని చెప్పుచు నేను వేరొకరి
మీద ఆధారపడి బ్రతకడము లేదు, నా కాళ్ళమీద నేను నిలబడి బ్రతుకుచున్నావు. నీవు అలాగే నీ కాళ్ళ మీద నిలబడు
అన్నాడట. ఆ మాటను విన్న వాని తమ్ముడు నీవు నీ కాళ్ళ మీద నిలబడలేదు, నేను నా కాళ్ళ మీద నిలబడలేను.
ఇద్దరము కలిసి భూమిమీద నిలబడినామని అన్నాడట. తమ్ముడు తెలివి తక్కువవాడని అన్న తమ్మునికి తెలివిగా నీతిని
చెప్పాడు. కానీ తమ్ముడు అడిగిన మాటను బట్టి అన్నయే తెలివితక్కువవాడని తెలియుచున్నది. నా కాళ్ళ మీద నేను
నిలబడినాననుకోవడము కేవలము భ్రమ మాత్రమే. అట్లు అనుకొనువాడు తాము ముందునుండి భూమిమీద నిలబడినానను
మాటను మరచి పోయాడు. దీని ప్రకారము విజ్ఞానము తెలిసినవాడు తమ విజ్ఞానమునకు ఆధారమైన మెదడును
దేవుడే ఇచ్చాడని, దేవుడిచ్చిన మెదడు లేకుండ ఎవడు విజ్ఞానికాడని, శరీరములోని మెదడే సమస్త విజ్ఞానములకు
ఆధారమని తెలియక, నేను విజ్ఞానినని అనుకోవడము నేలను విడిచి సాము చేసినట్లగును. అలాగే భూమిమీద నిలబడిన
విషయమును మరచిపోయి నా కాళ్ళ మీద నేను నిలబడినాను అన్నట్లుంటుంది.
సమస్త జ్ఞానమునకు, విజ్ఞానమునకు దేవుడే ఆధారమని తెలియక, మేము విజ్ఞానులమనుకొను వారి మెదడులోని
ఆలోచనలను, ఊహలను దేవుడే అందిస్తుండగా, ఏ శాస్త్రజ్ఞుడు ఏది కనిపెట్టినా అతనికి ఆ ఊహను అందించిన వాడు
శరీరములోని దేవుడే అయివుండగా, అది తెలియక నేనే కనుగొన్నాననుకోవడము, భూమిని వదలి తన కాళ్ళమీద తాను
నిలబడినా నని చెప్పినట్లుంటుంది. అటువంటి వాడు తమ మేధస్సుకు తామే కారకులమను అహముతో నిండినవాడై,
తమ శరీరములోని దేవున్ని కూడ నిందించుచున్నారు. నాకు తెలియకుండ నాలో ఎవడున్నాడని ప్రశ్నించుచుందురు.
అటువంటి వారిని గురించి కృష్ణుడు భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అను అధ్యాయమున 18వ
శ్లోకమందు ఇలా అన్నాడు.
అహంకారం బలం దర్పం కామం దంచ సంశ్రితాః |
మా మాత్మ పరదేహేషు ప్రద్విషన్తో భ్య సూయకాః ॥
111

Page 112
భావము :- “అటువంటి వారిలో అహంకారము పూర్తిగ ఉండగా కామము, క్రోధము, గర్వము బలముగా పనిచేయగా,
తమ శరీరములలోను మరియు ఇతరుల శరీరములలోను ఉన్నటువంటి నన్ను అసూయతో ద్వేషించుచున్నారు.” అని
కృష్ణుడు చెప్పాడు. అటువంటి వారిని తాను ఏమి చేయునో కూడ ప్రక్క శ్లోకములలో చెప్పాడు.
19 శ్లో॥
20 శ్లో॥
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్।,
క్షిపా మ్యజస్ర మశుభా నాసురీ స్వేవ యోనిషు ॥
ము
ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని,
మా మప్రా స్ట్యైవ కౌత్తేయ! తతోయాన్యధమాం గతిమ్ ||.
11.
భావము : "కౄరులు, ద్వేషులు, శుభమును దూషించు ఆ నరాధములను అసుర యోనులయందే త్రోసి, సంసార
దుఃఖగతులను పొందునట్లు చేయుదును. అట్లు అసుర యోనులందు జన్మించినవారు జన్మ జన్మకు అజ్ఞానులగుచు,
నన్ను పొందు జ్ఞానము యొక్క విధానమే తెలియలేరు. అటువంటివారు జన్మ జన్మకు అధమగతిని పొందుచుందురు.
వారికి నా జ్ఞానము యొక్క గట్టే దొరకదు” అని కృష్ణుడు నాస్తికవాదులను గురించి ముందే చెప్పాడు.
దేవుని మీద ఎటువంటి నమ్మకము లేకుండ దేవున్ని దూషించు వారు, దేవుని స్థాయిని కించపరుస్తూ మాట్లాడువారు,
అన్ని పనులకు తమ తెలివి తప్ప దేవుని ప్రమేయము లేదనువారు, విజ్ఞానము (సైన్సు) ను అడ్డము పెట్టుకొని సైన్సుకు
ఆధారమైన దేవున్ని లేడనువారు ఎవరయితే ఉన్నారో, అటువంటి వారు ఎప్పుడైనా దేవుని జ్ఞానమేమిటో చూడాలనుకొనినా,
వారికి తన జ్ఞానము యొక్క గట్టు దొరకకుండా చేస్తానని దేవుడే చెప్పాడు. నేటికాలములో దైవజ్ఞానము ఎన్నో
గ్రంథరూపములలో మరియు దృశ్య రూపములైన డి.వి.డిలలోను దొరుకుచున్నది. అటువంటపుడు జ్ఞానమును
తెలుసుకొనుటకు గురువు దగ్గరకు పోనవసరములేదు. దేవుడు నా జ్ఞానము మీకు దొరకదు అనినా, అది బజారులో
డబ్బు పెట్టితే గ్రంథరూపములలో, దృశ్యరూపములలో దొరుకుచున్నది కదా! అని కొందరు తెలివైనవారు అనుకొనుచున్నారు.
మేము గురువు దగ్గరకు పోకున్నా ఆయన జ్ఞానము మా ఇంటికే వస్తావుంది, మాకు జ్ఞానము తెలుస్తావుంది అనుకొను
వారు కలరు. దేవుని మీద విశ్వాసము లేనివారికి, జ్ఞానము మీద శ్రద్ధ కలిగినా, గురువు మీద విశ్వాసము లేనివారికి
గురువు యొక్క జ్ఞానము మీద శ్రద్ధ కలిగినా, జ్ఞానము గ్రంథరూపములలో దొరికినా గ్రంథములోని జ్ఞానము
తలలోనికి ఎక్కదు. అది ఎందుకు ఎక్కదు అనగా! తెలియబడే జ్ఞానములో అనేక సంశయములు ఏర్పడి జ్ఞానము
అర్థము కాకుండాపోవును. ఒకవేళ అర్థమైనా, దాని అనుభవము లేక ఆచరణ వారిలో లేకుండ పోవును. ఇట్లు రెండు
రకములుగా జ్ఞానము వానికి అంటకుండ పోవుచున్నది.
ఇపుడు అసలు విషయానికి వస్తాము. పరమాత్మ శక్తి భగవంతునిగా భూమిమీదికి వచ్చినపుడు దాని కార్యము
పూర్తి అగుటకు మూడుమార్లు భగవంతుడు అవతరించాలనుకొన్నాము. మొదటి అవతారముగా వచ్చిన వాడు కృష్ణుడు.
రెండవ అవతారముగా వచ్చినవాడు ఏసు, తర్వాత మూడవ అవతారము వస్తుందని మొదటి అవతార కృష్ణుడు
చెప్పాడు. కృష్ణుడు మూడవ అవతారమును గురించి "ఆదర్శకర్త" అను పేరును చెప్పాడు. ఏసు రెండవ అవతారమును
గురించి “ఆదరణకర్త” వస్తాడని చెప్పాడు. ఈ విధముగా కృష్ణుడు, ఏసు రెండు వేరు వేరు పేర్లను చెప్పడము వలన
కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒకటికాదు అని తెలిసిపోవును. ఇద్దరు ఒకటైతే మూడవ అవతారమును గురించి వేరు వేరు
పేర్లను ఎందుకు చెప్పుదురను ప్రశ్నవచ్చును. ప్రత్యక్షముగ ఏసు, కృష్ణుడు వచ్చే వ్యక్తి పేరును వేరువేరుగా చెప్పుట
112

Page 113
వలన, చెప్పిన వీరు ఇరువురు ఒకటికాదని నిరూపణగా తెలిసిపోవు చున్నది. అలా కృష్ణుడు, ఏసు వేరు వేరని
ఆధారముతో తెలియడము వలన అజ్ఞాన ద్వారము తెరుచుకొన్నట్లే, జ్ఞాన ద్వారము మూసుకొన్నట్లే అగుచున్నది. దీనినిబట్టి
అవిశ్వాసులకు, నన్ను దూషించు అసూయపరులకు నా జ్ఞానము లభించదు అనుమాట ఇక్కడ జ్ఞాపకము వస్తున్నది.
దేవుని మీద అసూయ కల్గి జ్ఞానము మీద ప్రేమకల్గినంత మాత్రమున వారికి జ్ఞానము లభించదు అను వాక్యము
ఇటువంటి చోట నెరవేరుతుందని అర్థమగుచున్నది. వాస్తవముగ కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒకటేనని చెప్పుకొంటూ,
మనము ఎన్నో ఆధారములను చూపుకొంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు కృష్ణుడు, అటు ఏసు అదే పనిగా
ఇద్దరూ రాబోవు వానిని గురించి వేరువేరు పేర్లను చెప్పారు. ఇక్కడ అలా చెప్పవలసిన పని ఏమొచ్చింది అని యోచిస్తే,
అవిశ్వాసులకు తమ జ్ఞానము దొరకకూడదని, వారికి వీరి మీద అనుమానము వచ్చి వారు ఇద్దరు ఒకటికాదని
నిర్ణయించుకొనుటకు అలా పేర్లను ముందుగా చెప్పారని తెలియుచున్నది. కృష్ణుడు మేధావి అగుట వలన, తనకు
ఇష్టము లేనివారిని దూరము చేయుటకు అల్లిన పథకమే మూడవవాని పేరును రెండు రకములుగా చెప్పడమని
అర్థమగుచున్నది. ఈ పేర్లు అజ్ఞానులకు, అవిశ్వాసులకు తప్ప జ్ఞానులకు, విశ్వాసులకు అవసరములేదు.
మూడవ అవతారముగా రాబోవు వాడు ఆదర్శకర్త అయినా, ఆదరణ కర్త అయినా సృష్ఠికర్తలోని భాగమే
అగును. ఆదరణకర్త, ఆదర్శకర్త అను పేర్లు అజ్ఞానుల కొరకు కృష్ణుడు, ఏసు తెలివిగా చెప్పారు. అజ్ఞానులకు
అనుమానము వచ్చుటకు, ఆ అనుమానము పెనుభూతమై జ్ఞానమార్గము నకు ఆటంకమేర్పరుచుటకు ఉద్దేశపూర్వకముగ
కృష్ణుడు, ఏసు రెండు పేర్లను చెప్పారు. ఆ పేర్లు అజ్ఞానుల మీద ప్రభావము చూపును, జ్ఞానులు ఆ పేర్ల మాయలో
చిక్కుకోకుండ ఒక నిర్ణయానికి వస్తారు. కృష్ణుడు, ఏసు చెప్పిన రెండు పేర్లను ఏక పేరుగా మార్చుకొంటారు. అదెలా
అనగా! కృష్ణుడు చెప్పిన “ఆదర్శకర్త" లోనూ, ఏసు చెప్పిన “ఆదరణకర్త" లోనూ సమానముగానున్న అక్షరములు,
సమానముగా లేని అక్షరములు గలవు. రెండిటిలోను సమానముగానున్న అక్షరములు ఆ... కర్త, రెండిటియందు సమానముగా
లేనివి దర్శ, దరణ. రెండు పేర్లలోను సమానముగా లేని అక్షరములను తొలగించి చూస్తే రెండిటియందు “ఆకర్త”
మాత్రము మిగులును. దీనిప్రకారము జ్ఞానులైనవారు మూడవ అవతారములో వచ్చువానిని “ఆకర్త" అను పేరుతో
చెప్పుకుంటే సరిపోతుంది. ఆకర్త అను పదము కృష్ణుడు చెప్పిన దానికి, ఏసు చెప్పిన దానికి సరిపోవును. రెండు
పేర్లను వడపోస్తే వచ్చినది “ఆకర్త" ఇక ఆయనవస్తే ఎట్లుంటుందో!
మూడవ అవతారము కృష్ణుని లెక్కలో “ఆదర్శకర్త", ఏసు లెక్కలో “ఆదరణకర్త” ఇప్పటినుండి మా లెక్కలో
“ఆకర్త”. కృష్ణుడు, ఏసు ఇద్దరు చెప్పిన రెండు పేర్లలోను దర్శ, దరణ అను శబ్దములను తీసివేస్తే మిగిలినది ఆకర్త.
కావున ఆకర్త అను పేరు ఇద్దరు చెప్పిన దానికి సంబంధించినదేనని అనుకోవలెను. భగవంతుని మూడవరాకలో
ఒకమారు దైవ ధర్మముల ప్రచార కార్యము పూర్తి అగును. దీనినిబట్టి
“ దేవుడు మూడు ఆత్మలుగా (జీవాత్మ, ఆత్మ, పరమాత్మలుగా) ఉన్నాడు." అని తెలియుచున్నది.
భగవంతుడు మూడు (కృష్ణ, ఏసు, ఆకర్త) అవతారములుగా ఉన్నాడు." అని తెలియుచున్నది.
"మనిషి మూడు మాయలు (తామస, రాజస, సత్వగుణములు)గా ఉన్నాడు." అని తెలియు చున్నది.
మూడు మాయలలో చిక్కుకొన్న మనిషికి దైవ ధర్మములను తెలుపుటకు, మూడు అవతారములుగా భగవంతుడు
వచ్చి, మూడు ఆత్మల త్రైతమును (భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16,17 శ్లోకముల భావమును) తెలుపుచున్నాడు.
అందువలన భగవంతున్ని ఒక అవతారము నకు పరిమితి చేయకూడదు. రెండు మూడు వేల సంవత్సరముల తేడాతో
113

Page 114
ఆయన మూడు అవతారములు అయిపోవును. ఆ లెక్క ప్రకారము ఐదు ఆరు వేల సంవత్సరములలోనే భగవంతుని
మూడు రాకలు ఒకమారు అయిపోవును. అలా ఒకమారు మూడు రూపములతో వచ్చిన భగవంతుడు ప్రతిష్ఠించిన
ధర్మములు దాదాపు పది యుగముల కాలమునకు తిరిగి అధర్మములుగా మారవచ్చును. అప్పటికి తిరిగి భగవంతుని
అవసరము ఏర్పడవచ్చును. ప్రస్థుతము ధర్మప్రతిష్టాపన కార్యక్రమములో భగవంతుని రెండు అవతారములు వేరువేరు
దేశములలో, వేరువేరు పేర్లతో, వేరువేరు మతములయందు వచ్చి పోయినవి. ఇక మిగిలినది కృష్ణుడు చెప్పిన ఆదర్శకర్త,
ఏసు చెప్పిన ఆదరణకర్త, మేము చెప్పిన ఆకర్త యొక్క అవతారము. మూడవ అవతారము ముఖ్యమైనదిగా ఉంటుంది.
ఎందుకనగా! కృష్ణుడు గీత రూపములో చెప్పిన జ్ఞానము గానీ, ఏసు వాక్యము రూపములో చెప్పిన జ్ఞానముగానీ
ఇంతవరకు ఎవరికీ అర్థము కాలేదు. అర్థము కాలేదు అని చెప్పుటకు ఆధారము ఆ రెండు జ్ఞానములు రెండు
మతములుగా మారిపోయినవి. మతము ఎప్పటికీ దేవున్ని తెలుపలేదు. దేవుడు చెప్పిన జ్ఞానము, మతము నీడలో
ఎప్పటికీ అర్థము కాదు. అందువలన మతాభిమానులు ఎప్పటికీ జ్ఞానాభిమానులు కాలేరు అను సూత్రము ప్రకారము,
ఏ మతములోనైనా మతమును గురించి గొప్పగా చెప్పుకొను వాడుకానీ, మతవ్యాప్తి చేయాలనుకొను వాడుగానీ, దేవుని
జ్ఞానమును తెలియలేడు.
భగవంతుడు రెండుమార్లు భూమిమీదకు వచ్చి దైవధర్మములను రెండు దేశములలో తెలిపిపోయినా, ఇప్పటికీ
కూడ వాటి సారాంశము తెలియబడలేదు. మతముల ప్రభావము ఎక్కువగావున్న ఈ కాలములో, దైవముకంటే ధనమునే
ఎక్కువ విలువగా చూచు ఈ కాలములో, భగవంతుని మూడవ రాక రావలసియున్నది. భగవంతుని మూడవ రాకలో
భగవంతుడు ఎక్కువ మతఛాందస్సులతో ఇబ్బందులు పడవలసి వస్తుంది. అంతేకాక ఇంతవరకు మిగిలిపోయిన
ధర్మములను కూడ తెలుపవలసియున్నది. ఒక ప్రక్క మాయా ప్రభావముతో బాగా ప్రచారమైన, కొన్ని లక్షలమంది
అభిమానమును పొందిన గురువుల మధ్యలో, వారికి వ్యతిరేకమైన ధర్మము లను వివరించవలసియున్నది. “ఆకర్త”
తెలుపు ధర్మములు ఇటు నాస్తికులకు కానీ, అటు ఆస్తికులకుకానీ మ్రింగుడుపడవు. మూడవ అవతారమైన ఆకర్త
యొక్క బోధలు కొందరికి అర్థముకానివై, ఈయన దేవుడున్నాడని ఆస్తికత్వమును బోధిస్తున్నాడా? లేక దేవుడు లేడని
నాస్తికత్వమును బోధిస్తున్నాడా? అని అనుకొందురు. మరికొందరు మూడవ రూపములో భగవంతుడు చెప్పు బోధలను
అందుకోలేక అవగాహనలోపముతో, ఈయన పరమతమును బోధిస్తున్నాడా? లేక స్వమతమును బోధిస్తున్నాడా? అని
అర్థము కాని స్థితిలో ఆయనను గురించి చర్చించుకొందురు. బయటి గురువులను పోల్చిచూచితే వారివద్ద లక్షలమంది
చేరి గొప్పగ కనిపిస్తుంటే, వారికంటే అన్నివిధముల తక్కువగా కనిపించి, జ్ఞానములో గురువుల అందరి కంటే గొప్పగ
కనిపించును. దేశములోని గురువులు, గురు శిష్యులు ఏదో ఒక సాధన చేసి మోక్షమును పొందాలని ప్రయత్నము
చేయుచుండగా, ఆకర్త మాత్రము దేవుని జ్ఞానమును తెలుసుకొనుటకంటే ధ్యానము చేయుట వృథాపని అని బోధించును.
భూమిమీద గురువులు వారివారి మత సాంప్రదాయములను వారు అనుసరిస్తూ, వారి శిష్యులను అనుసరించునట్లు
చేయుచుండగా, ఆకర్త మాత్రము అన్ని మతములవారిని ఒకే దేవుని జ్ఞానము క్రిందికి తెచ్చి, నాది ఫలానా మతము అని
చెప్పకుండ, అందరిది ఒకే మతమన్నట్లు చేయును. అన్ని మతముల వారు ఆకర్త వద్ద ఏకమతముగా ప్రవర్తించుదురు.
ఒకే జ్ఞానము, ఒకే దేవుడు అను సూత్రమునకు కట్టుబడి యుందురు.
సృష్ఠి మొదటి కాలములో మనుషులయందు మతము అనునది లేదు. తర్వాత కాలములో మాయ ప్రభావము
వలన మనిషి మేధస్సులో మతము అనునది ముఖ్య స్థానమును ఆక్రమించినది. ఆకర్త దృష్టిలో మనిషిని దేవుని
114

Page 115
మార్గమునుండి తప్పించునది మతమని, మొదట తన జ్ఞానము ప్రారంభించడములో మతమును నిర్మూలించడమే
ధ్యేయముగా పెట్టుకొనును. మతము లేని మనిషిగా ఎవడు మారగలడో వాడు నావాడని ఆకర్త చెప్పును. ఇక్కడ మీకు
ఒక ప్రశ్న రాగలదు. అదేమనగా! రాబోవు భగవంతుని మూడవ అవతారము పేరు “ఆకర్త” లేక “ఆదర్శకర్త” లేక
“ఆదరణకర్త” అని చెప్పుకొన్నాము. ఆకర్త రాబోతాడని మీరే చెప్పారు. ఆకర్త వచ్చిన తర్వాత మిగిలిన ధర్మములను
బోధించును, ముందు బోధించిన ధర్మములను వివరించును అన్నారు. ఇప్పుడేమో ఆయన రాక ముందే ఆయన ఈ
విధముగా తన బోధలను చెప్పునని, ఈ విధముగా మతముల నుండి మనిషి దృష్టిని దేవునివైపు మరల్చునని, మతములేని
మనుషులను తయారు చేయునని చెప్పుచున్నారు. ఈ విషయములన్నిటిని ఆకర్త మీకు నిద్రయందు కలలో చెప్పాడా?
మెలుకువయందు చెవిలో చెప్పాడా? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నాకు ఆకర్త చెవిలో
చెప్పలేదు, కలలో చెప్పలేదు. ఆకర్తగా రాబోవు కృష్ణుడు
ఆకర్తగా రాబోవు కృష్ణుడు ఆకర్తను గురించి బోయవానికి కొన్ని విషయములను
చెప్పిపోయాడు. ఆ విషయములనే బోయవాని ఆత్మ నాకు చెప్పగా, నేను మీకు చెప్పుచున్నాను తప్ప స్వయముగా నేను
చెప్పలేదు. ఈ నా మాటలను వినిన తర్వాత కూడ బుద్ధిలో చురుకుదనము కలవారు, పెద్దగా మెదడును
ఉపయోగించువారు కొందరు ఇంకొక విధముగ కూడ అడుగవచ్చును. అదేమనగా! భారత, భాగవతములలో కూడ
చెప్పని బోయవాని పాత్రను నీవే కల్పించి, కృష్ణుడు బోయవానికి చెప్పాడని, బోయవాని ఆత్మ నాకు చెప్పిందని నమ్మించి
మీస్వంత భావములను మాకు చెప్పుచున్నారు తప్ప కృష్ణుడు బోయవానికి చెప్పలేదు, బోయవాడు నీకు చెప్పలేదు అని
నన్ను నిలదీసి అడుగవచ్చును. దానికి నా జవాబు ఏమనగా!
పూర్వము పెద్దలు, ఒక సామెతను చెప్పేవారు, "కడుపు చించు కొనినా గారడివిద్య అనే వారుంటారు.” అని
పెద్దలు చెప్పిన సమత (సామెత) నాకు ఇక్కడ జ్ఞాపకము వచ్చింది. అంతేకాక “అతి తెలివి దురిత లక్షణము" అని కూడ
పెద్దలనెడివారు. ఏ దానికైనా ఒక పరిమితి ఉంటే బాగుంటుంది. అందువలన గీతలో కృష్ణుడు కూడా మితమైన నిద్ర,
మితమైన ఆహారము, మితమైన పని అని అన్నాడు. మితమైన పని అనగా శరీరముతో చేసేది కాదు. బుద్ధితో చేసే
పనిని కూడ లెక్కించుకోవాలి. అందువలన పెద్దలు అతి తెలివి దురిత లక్షణము అన్నారు. ఒక పరిమితి లేకుండా
అతిగా యోచిస్తే అది చెడుకు దారితీస్తుంది. ఎంతో వివరముగా శాస్త్రబద్దముగా చెప్పుచున్నప్పటికీ చెప్పిన దానిని
గురించి ఇందులో మంచివుందా, చెడువుందా అని తెలుసుకోక, నాకు తెలివివుంది అని ప్రశ్నించడము చెడుకు దారితీస్తుంది
తప్ప మంచికి దారితీయదు. వాలి వాలము (తోక) దగ్గర పుట్టాడు అని రామాయణములో వ్రాస్తే ప్రశ్నించని వారు,
ద్రోణుడు దొన్నెయందు (కుండయందు) పుట్టాడు అని భారతములో చెప్పితే విని ప్రశ్నించనివారు, హనుమంతుడు
పర్వతమును ఎత్తుకొని వచ్చాడని వ్రాస్తే అడ్డముగా నమ్మేవారు, భీముడు గాలికి పుట్టాడు, కర్ణుడు చెవిలో పుట్టాడు అంటే
వినేవారు అక్కడ ప్రశ్నించకుండ, ఆ మాటలు శాస్త్రబద్దత కాదని తెలిసినా ఊరకుండి, ఇక్కడ నేను చెప్పిన మాటలు
అశాస్త్రీయము కాకున్నా ప్రశ్నించడము మంచిదా అని అడుగుచున్నాను. ఇటువంటి సందర్భములోనే పెద్దలు “కడుపు
చించుకొనినా గారడివిద్య అనువారుంటారు.” అని అన్నారు.
గారడివిద్యలో మనిషిని అడ్డముగా సగభాగానికీ రంపముతో కోసి రెండు ముక్కలుగా విడదీసి చూపుతారు.
అలా చూపినపుడు మనిషి నడుము భాగమునుండి విడిపోయి రెండు భాగములుగా కనిపించును. కానీ అక్కడ రక్తము
కారదు. రక్తము కారలేదంటే మనిషి రెండు ముక్కలుగా తెగి పోయాడు అన్నది అసత్యము. మనకు తెలియని పద్ధతిని
ఉపయోగించి అసత్యమును సత్యముగా చూపుచున్నారు. అయినా అది అసత్యమని చెప్పుటకు అక్కడ రక్తము కారలేదు.
115

Page 116
అది నిజము కాదని, అలా చూపడము గారడివిద్య యొక్క పనితనమని మనందరికి తెలుసు. మనిషిని రెండు ముక్కలుగా
చేయడము స్టేజి (వేదిక) మీద గారడివిద్య కావచ్చును. అదే నడి బజారులో ఒకరు ఇంకొకరిని కత్తితో రెండు ముక్కలు
చేస్తే అక్కడ రక్తము కారిపోతుంది. ముక్కలైన వాడు చనిపోతాడు. అప్పుడు అది గారడివిద్య కాదు, జరిగినది సత్యమని
తెలియుచున్నది. అలా జరిగిన దానిని గారడివిద్య అని ఎందుకు అనలేదనగా, ముక్కలైనవాడు చనిపోయాడు. వానినుండి
రక్తము కారిపోవడము వలన వాడు చనిపోయాడు. చంపినవానిని హంతకుడు అంటాము. జరిగిన దానిని హత్య
అంటాము. అప్పుడు చంపినవాడు గారడివాడు కాదు, జరిగినది గారడివిద్య కాదు. ఇన్ని విపులముగా తెలిసినపుడు,
దాని ప్రకారమే శాస్త్రబద్ధముగానున్న విషయములను మేము చెప్పినపుడు, మా మాటలు సత్యమా, అసత్యమా అని
ఎందుకు తెలియలేదని ప్రశ్నించుచున్నాను. కొన్ని ఆధారములతో యోచిస్తే ఏది నిజమో, ఏది నిజము కాదో మీకే
అర్థమవు తుంది. ఎదురుగా కనిపిస్తున్నా త్రొంగి చూడడము, నిక్కి చూడడము, ఎగిరి చూడడమునకు అర్థమే లేదు.
ఈ ఆధ్యాయము మొదటిలో కృష్ణుని మరణము లోకానికి కనువిప్పు అని మొదలుపెట్టి చెప్పాము. నరకాసురుడు
చనిపోతే ప్రజలకు సంతోష మైనది. కానీ ఇక్కడ కృష్ణుడు చనిపోతే లోకానికి కనువిప్పు అని మేము చెప్పలేదు. కృష్ణుని
మరణము లోకానికి కనువిప్పా? అన్నాము. దానినిబట్టి మరణసమయములో ఏదో గొప్ప రహస్యమున్నదనీ, అది తెలిస్తే
ఇంతవరకు కన్నులు మూసుకొన్నవారు కళ్ళు తెరుచుకొంటారని అర్థమవుచున్నది. ఇక్కడ ముఖ్యమైన ఘట్టము ఏమనగా!
ఇంతవరకు ఏ విషయములో గ్రుడ్డిగా ఉన్నాము? ఇప్పటినుండి దేనియందు చూపుకల్గి వుండాలి? అని ప్రశ్న వచ్చుచున్నది.
మనకు ఇంతవరకు వున్న గ్రుడ్డి తనమేమిటో, అది కృష్ణుని మరణమును తెలుసుకొనుట వలన ఎలా చూపుగల్గుతుందో,
అందరము తెలుసుకోవాలి. నేడున్న ప్రపంచ జనాభాలో 80 శాతము క్రైస్తవులున్నారు. రెండవస్థానమును ఆక్రమించినది
ఆ తర్వాత హిందూమతము. హిందూమతము నేడు చివరి స్థానములో
ఉన్నది. కృతయుగము, త్రేతాయుగము గడిచిపోగా ద్వాపరయుగము మొదటిలో హిందూమతము ప్రపంచ వ్యాప్తంగా
ఖండాంతరముల వరకు వ్యాపించి ఉండెడిది. నేడు మనము హిందూమతముగా పిలుచుకొనునది ఆనాడు హిందూమతము
అను పేరుతో లేదు. ద్వాపరయుగము మొదటి కాలములో “మతము” అనుపేరు భూమిమీదనే లేదు. అప్పటికాలములో
“పథము” అను పేరుండెడిది. హిందూ అను పదము 'ఇందూ' అను పదముగా, అర్థముతో కూడుకొన్నదై ఉండెడిది.
ఆనాడు ఇందూపథము అనునది ప్రపంచవ్యాప్తముగా ఉండెడిది. ప్రపంచములోని మనుషులందరు మేము ఇందువులము
అని చెప్పుకొనెడివారు. పథము అనగా మార్గము అని అర్థము 'ఇందు' అనగా చంద్రుడు అని అర్థము. జ్యోతిష్యశాస్త్రము
ప్రకారము జ్ఞానమునకు చంద్రుడు అధిపతియైన దానివలన, ఆ రోజు దైవ జ్ఞానముకలవారిని ఇందువులు అని చెప్పెడివారు.
జ్ఞానమార్గములో నడిచేవారందరిని జ్ఞానపథములోని వారని అనెడివారు. అందువలన జ్ఞానులు మాది ఇందూపథము
అని చెప్పెడివారు. మేము ఇందువులము, మాది ఇందూపథము అని తల ఎత్తి చెప్పుకొను రోజులు పూర్వముండెడివి.
కాలక్రమమున మాయా ప్రభావము ఎక్కువై పోయి, మనుషులందరు గ్రుడ్డివారై పోయి పథమును మతముగా, ఇందువును
హిందువుగా మార్చుకొన్నారు.
ఇస్లామ్మతము. తర్వాత బౌద్ధమతము, ఆ తర్వాత హిందూమతము. హిం
ఒకానొకరోజు ప్రపంచ వ్యాప్తముగానున్న ఇందువులకు కేంద్ర బిందువుగా భారతదేశముండెడిది. దైవజ్ఞానము
మొదట భారతదేశములోనే పుట్టింది. అది పెరిగి విశ్వవ్యాప్తమైనది. కానీ నేడు అది తరిగిపోయి చివరకు భారతదేశములో
కూడ 'ఇందువు' అను పేరు కనిపించకుండ పోయినది. భారతదేశములో మిగిలిన కొద్దిమంది తమ చరిత్రను మరచి
పోయి, మేము హిందువులము అని అర్థమేలేని పేరును చెప్పుకొంటున్నారు. దైవజ్ఞానమునకు సంబంధించిన ఇందువు
116

Page 117
అను పేరును వదలిపెట్టి, భౌగోళిక సంబంధమైన ఒక ప్రాంతము పేరును, ఒక నది పేరును చెప్పుకొంటూ మేము
హిందువులము అంటున్నారు. అలా చెప్పుకోవడము తప్పు. మనలను మనము తగ్గించుకొని చెప్పుకొంటున్నాము.
మనది ఉన్నతమైన పేరు, ఉన్నతమైన పథము అని మేము చెప్పినా వినే స్థితిలో లేని చెవిటివారై పోయారు. మన
చరిత్ర ఇది, మనము ఇందువులము, మనది ఇందూ పథము అని మేము ఒక గ్రంథమును వ్రాసి ఉచితముగా పంచితే,
మహానందిలో మేము పరమతమును గురించి ప్రచారము చేస్తున్నామని మా మీద కేసులు పెట్టి కోర్టుకు త్రిప్పుచున్నారంటే,
మనది పూర్వపు ఇందూ జాతేనా అని అనుమానము రాక తప్పదు. ఇవి మన సాంప్రదాయములు అని “ఇందూ
సాంప్రదాయములు" అను పేరుతో ఒక గ్రంథమును వ్రాసి విడుదల చేస్తే, ఇందూ అని పేరు పెట్టడము తప్పు అని
విశ్వహిందూ పరిషత్వారు గుంతకల్లులో మామీద భౌతిక దాడులకు పూనుకోవడము పర మతముల ముందర సిగ్గుచేటు
కాదా! అడిగితే వివరముగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పుతామనినా వినకుండా, మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”
ను చూపించినా, ఆ భగవద్గీతను నడి బజారులో హిందూ సమాజమువారే నిప్పుపెట్టి కాల్చారంటే, పూర్వమున్న ఇందువుల
ఆత్మలు ఆ దృశ్యమును చూచి వారిని శపించకుండ వదలరనిపిస్తుంది.
నేడు ఏమాత్రము ఇందూ సంస్కృతిని తెలియని హిందూసంస్థలు అనేకము పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలలో
ఉన్నవారికి పూర్వము ఇందూ మతము విశ్వవ్యాప్తముగ వుండెడిదనిగానీ, ఈశ్వరుడు తన తలమీద చంద్రవంకను
ధరించడము వలన, మనకు ఆ రోజు సంపూర్ణ జ్ఞానముండుట వలన, మనము ఇందువులుగా ఉండెడివారమని గాని
తెలియదు. ఇందూ మతము (ఇందూపథము) యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలియనివారు, కృష్ణుడు చెప్పిన భగవద్గీతకు
విలువనివ్వనివారు, మేము హిందువులమని, మతాన్ని రక్షించేదానికి మేము సంఘములుగా ఏర్పడినామని చెప్పు
కొంటున్నారు. హిందూమతము ఎందుకు క్షీణించుచున్నదో, దానికిగల కారణమేమిటో ఏమాత్రము అర్థము చేసుకోవడము
లేదు. ఇతర మతములవారు వారి ప్రవక్తలు చెప్పిన మాటలను చెప్పి, వారి మతములను అభివృద్ధి చేసుకొంటూ
పోతుంటే, దిన దినమునకు హిందూమతము క్షీణించి పోవుచున్నది. హిందూసంస్థలు తమ జ్ఞానమును తెలుసుకొని,
జ్ఞానమును బోధించి క్షీణించి పోవుచున్న మతమును రక్షించుకోవాలి. కానీ అలా కాకుండ పర మతముల మీద
దాడులను చేస్తు హిందూమతమును రక్షిస్తామనడము, రోగానికి మందు ఇవ్వకుండ విషము ఇచ్చినట్లవుతుంది. మేము
చెప్పు బోధలు నేడు ఎంతో ప్రశంసింపబడుచున్నవి. దీనిని మించిన జ్ఞానములేదు అని ప్రజలందరు అనుచుండగా,
మా జ్ఞానమును ఏమాత్రము చూడకుండ, చదవకుండ మమ్ములను అవమానపరిస్తే నేడున్న హిందూ సమాజము
గ్రుడ్డిది అనక ఏమనాలి?
మతము అను పేరుతో అజ్ఞానము నిండిన మనుషులు గుంపులుగా చేరి, హిందువులే ఇందుత్వమునకు సమాధికట్టు
సమయము వచ్చినది. కావున భగవంతుని మూడవ అవతారమైన ఆకర్త రాక ఇంతలోనే ఉంటుందనుకొంటాము.
ఇందూ ధర్మములకు పూర్తి ముప్పు ఏర్పడిన ఈ సమయములోనే, భగవంతుని రాక ఉంటుందని అనుకుంటున్నాము.
నేడు హిందూసంఘములు జ్ఞానములేనివైన దానివలన, ఇప్పటికే ఉత్తరాంధ్ర సగానికి సగము హిందూమతమును
వదలి పోయినది. కావున హిందువుల సంఘములకు ఇప్పటికైనా కనువిప్పు కలిగి, జ్ఞాన ప్రచారముతోనే హిందూ
మతము రక్షించబడుతుందని, జ్ఞానములేకుండా సంఘములు పెట్టుకొని రాజకీయపార్టీలవలె మెలిగితే ప్రజలు ఛీకొట్టి
పరాయి మతములోనికి పోవుదురని తెలియాలి. అందువలన ఇప్పటికైనా జ్ఞానులకు, గురువులకు విలువనిచ్చి వారి
సలహాలతో జ్ఞానమును ప్రచారము చేసి, దానిద్వారా హిందుత్వమును కాపాడు ప్రయత్నము చేయమని చెప్పుచున్నాము.
117

Page 118
రాబోవు కాలములో ప్రజలు మతముల భ్రమలో మునిగిపోయి, దైవత్వమును మరచి పోవుదురను ఉద్దేశముతోనే
మతముల విషయమును తన మరణములో కృష్ణుడు చెప్పి పోయాడు.
నేడు మతములను మార్చుకొను వారికి కనువిప్పు కలుగులాగున కృష్ణుడు తన మరణములో బోయవానికి
రాబోవు క్రైస్తవమతమును గురించి చెప్పి దాని ప్రవక్తను నేనేనని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమగుటకు మేము
మతము అను పదమును వాడుచు చెప్పుచున్నాము. ఆనాడు కృష్ణుడు మతమను పేరును ఉపయోగించలేదని
జ్ఞప్తికుంచుకోవలెను. ధర్మములను నెలకొల్పు కార్యములో మూడుమార్లు, మూడు కాలములలో చెప్పవలసిన బాధ్యత
కృష్ణునికున్నది. అందువలన రెండవ అవతారముగా ఏసు పేరుతో వస్తానని చెప్పాడు. ఏసు పేరుతో వచ్చి అక్కడకూడ
ధర్మములను తెలియజేస్తానన్నాడు తప్ప ఒక మతమును స్థాపిస్తానని ఆయన చెప్పలేదు. ఏసు చెప్పిన బోధ నలుగురు
శిష్యులు వ్రాసిన నాలుగు సువార్తల రూపములో ఉన్నది. కానీ మొత్తము బైబిలు రూపములో లేదు. అందువలన ఈ
గ్రంథములో ఎక్కడ బైబిలు అను పదమును వాడలేదని గ్రహించాలి. ఏసు చెప్పిన వాక్యములను ఎవడు గ్రహించునో
వాడు నిజముగా ఏసు భక్తుడగును. ఏసు భక్తుడు అయినవాడు కృష్ణుడు ఏసు ఇద్దరూ ఒకరేనని గ్రహించును. అట్లు
గ్రహించని వానికి ఏసు చెప్పిన జ్ఞానము అర్థము కాలేదని, వాడు ఏసు భక్తుడుకాదని అర్థమగును. నేడు ఎవరైనా నేను
ఏసును విశ్వసిస్తున్నాను అనినా, వాడు నేను క్రైస్తవున్ని అని ఏసు క్రైస్తవ దేవుడని, హిందువుల దేవుడు వేరని అనుకోవడము
వలన వాడు ఏసును విశ్వసించిన వాడు కాదని, కనుక నిజమైన క్రైస్తవుడు కాదని అర్థమగు చున్నది. దీనికంతటికి
మూలము కృష్ణుని మరణములో జరిగిన సమాచారము ఎవరికీ తెలియక పోవడము వలన, కృష్ణుడు ముందే చెప్పినట్లు
ఏసుగా వచ్చినా, ఏసు నా దేవుడనుచు కృష్ణున్ని దూషించువారు కలరు. అలా ఏసు భక్తులు కృష్ణున్ని దూషిస్తే ఏసును
దూషించినట్లే అగును. అదే విధముగ కృష్ణుని భక్తులు ఏసుని దూషించినా, ఏసే కృష్ణుడైన దానివలన వారు కృష్ణున్ని
దూషించినట్లగును. కృష్ణుడు ఏసుగా పుట్టుతానని ముందే చెప్పినట్లు తెలియుట వలన, ఇటు హిందువులకు అటు
క్రైస్తవులకు కనువిప్పు కలిగి, ఇప్పటి నుండి తమ ప్రవర్తనను మార్చుకొని, ఎవరు ఏ మతములో ఉండినా దేవుడే
అందులో పుట్టించాడని తలచి, మతమును మారకుండా వుండి కృష్ణున్ని, ఏసును సమానముగా చూచు హిందువులు,
ఏసును కృష్ణున్ని సమానముగా చూచు క్రైస్తవులు సమాజములో తయారు కాగలరని తలచుచున్నాను. ఏసు చెప్పిన
నాలుగు సువార్తలను మాత్రము క్రైస్తవులు చదవాలి. నాలుగు సువార్తలతో సహా మొత్తము బైబిలును చదువువాడు
ఏసును గౌరవించనట్లే, ఆయన బోధలకు ప్రాధాన్యత ఇవ్వనట్లే. అటువంటి వాడు క్రైస్తవుడు కాడు. అదే విధముగా
కృష్ణుడు చెప్పిన కేవలము 17 అధ్యాయములు భగవద్గీతను హిందువులు చదవాలి. గీతతో సహా వేదములను చదివినా
లేక గీతను వదలి వేదములను చదివినా వాడు కృష్ణున్ని గౌరవించనట్లే. ఆయన బోధలకు ప్రాధాన్యత ఇవ్వనట్లే.
అటువంటివాడు హిందువు (ఇందువు) కాడు. ఈ విధముగా లెక్కించి చూచితే ఈనాడు సరియైన హిందువులేడు.
అలాగే సరియైన క్రైస్తవుడు లేడు. అందువలన నేడు ఈ గ్రంథమును చదివి కృష్ణుని మరణ సమయములో జరిగిన
రహస్యమును ఎవరైతే తెలుసుకొందురో వారందరికీ కనువిప్పుకల్గును. మనము నీది ఆ మతము, నాది ఈ మతమని
చెప్పుకోవడము ఒకే వంశములో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు తమ వంశమును గురించి తెలియక అన్న ఒక వంశము
పేరు, తమ్ముడు మరొక వంశము పేరు చెప్పితే స్వంత తండ్రినే మార్చినట్లుగును కదా! అందువలన ఇప్పటినుండైనా
కొన్ని వేల సంవత్సరముల వెనుక ఏమి జరిగినదని యోచించి, తమ తమ మతములు పూర్వము లేనేలేవని గ్రహించి,
అప్పుడున్నది ఒకే ఒక పథము మాత్రమేనని, అదియే “ఇందూపథమని” తెలిసి, ఇందూపథములోనే నేడున్న క్రైస్తవులు,
హిందువులు పూర్వముండెడి వారిని, ఆ ఇందూపథమును మరచిపోయిన దానివలన హిందూమతము, క్రైస్తవమతమని
118

Page 119
వేరువేరుగా చీలిపోయాయని తెలుసుకొంటే, ఈనాటికీ రెండిటియందు ఒకే బోధ ఉన్నదనీ, రెండిటినీ తెలిపినవాడు ఒకే
భగవంతుడని తెలియగలదు.
తెలుపలేదు.
జరుగబోవు విషయమును తెలిసిన కృష్ణుడు తన మరణ సమయము వరకు రాబోవు తన జన్మలను గురించి
చివరి మరణ సమయములో బోయవానిని అడ్డము పెట్టుకొని, భవిష్యత్తు అవతారములను గురించి
చెప్పాడు. బోయవాడు విన్న దానిని తిరిగి చెప్పు సమర్థుడు కాదని తెలిసి కృష్ణుడు వానికే చెప్పాడు. అట్లు చెప్పుట
వలన వాని ఆత్మ ఆ విషయమును స్వీకరించి, తన మూడవ అవతార సమయము సమీపించి నపుడు ఆత్మే
విషయమును బయటికి తెలుపునట్లు భగవంతుడు నిర్ణయించాడు. అప్పటికి పెరగవలసిన అజ్ఞానమంతా పెరిగి, మత
ద్వేషములు ఎక్కువై మానవుడు ఆధ్యాత్మికమను దారిని వదలి, మాయ దారిన పోవునపుడు, మూడవ పురుషుడుగా
వచ్చినవాడు తన జ్ఞానమును తెలియబరచి ధర్మములను పూర్తిగా నెలకొల్పును. ఇక్కడ ముఖ్యముగ గమనించ వలసిన
విషయమేమనగా! నేను అన్నదానము చేస్తాను. నేను అన్నమును పెట్టడము వలన మా దగ్గరున్నవారంతా ఆకలి
లేనివారగుదురు. ఎవరికీ ఆకలి లేకుండా చేస్తానన్నప్పుడు, నావద్దనున్న వారందరికి ఆహారము దొరకకుండ పోయి
పూర్తి ఆకలికొనిన వారైనపుడు, నేను ఇచ్చిన ఆహారము వలన వారి ఆకలి పూర్తిగ తీరిపోతే, అప్పుడు నేను చెప్పినట్లు
అందరి ఆకలి తీర్చినట్లగును. నేను అన్నమును వండి సిద్ధముగా పెట్టుకొనినా, ఆ సమయానికి ఆకలికొనిన వారు
ఎవరూ లేకపోతే నేను ఎవరి ఆకలి తీర్చనట్లే కదా! అందువలన ఎదుటివారు ఆకలితోనున్నపుడే నా కార్యము
నెరవేరును. అదే విధముగానే దేవుడు నేను భగవంతునిగా వచ్చి అధర్మములను లేకుండ చేస్తానన్నాడు. ఆయన పని
అధర్మములను రూపుమాపి ధర్మములను తెలియపరచడమైనపుడు, ఆయన వచ్చినపుడు ధర్మములను ఆహారము
లేకుండాపోయి అధర్మములను ఆకలి వుండాలి. అపుడు ధర్మములను ఆహారముతో అధర్మములను ఆకలిని తీర్చినవాడగును.
అప్పుడు ప్రక్కవారి దృష్ఠిలో ఎదుటివాని ఆకలి తీర్చినవాడగును. భగవంతుడు కృష్ణుని రూపములో ఉన్నపుడు చెప్పిన
మాట నెరవేరుటకు, తన మూడవ అవతార సమయము నకు భూమిమీద పూర్తి అజ్ఞానమును పెరుగునట్లు చేశాడు.
ఇక దాన్ని రూపుమాపి ధర్మములను నెలకొల్పి తనమాటను నిలబెట్టుకొనును. ఈ విధముగా దేవుడు భూమిమీదకు
భగవంతుడుగా వచ్చి, మూడు అవతారములను ధరించి తిరిగి దేవునిగా మారిపోవుచున్నాడు. ద్వాపర యుగములో
దేవుడు కృష్ణునిగావచ్చి, ధర్మములను గీత రూపములో చెప్పి పోయి, తర్వాత మూడు వేల సంవత్సరములకు ఏసుగా
వచ్చి అప్పుడు కూడ ధర్మములను తెలియజేసి, మూడవ అవతారముగ 'ఆకర్త' రూపములో వచ్చి తనకార్యమును
అంతటితో పూర్తి చేయును. అలా పూర్తి చేసిన భగవంతుడు తిరిగి దేవునిగా మారిపోవును. అందువలన మొదట
కృష్ణుడు దేవుడు, తర్వాత కృష్ణుడు భగవంతుడు ఆ తర్వాత కృష్ణుడు దేవుడగును. అందువలన కృష్ణుడు దేవుడు
మరియు భగవంతుడని చెప్పవచ్చును.
మా కృష్ణమందిరము
స్వార్థపరులు చెప్పినట్లు “మా కృష్ణమందిరము” అని అనడమేమిటని కొందరు మనసులోనైనా అనుకోవచ్చును.
ప్రపంచ విషయములో స్వార్థ ముండకూడదు. కానీ దేవుని విషయములో అందరికీ స్వార్థముంటేనే మంచిది. దేవుని
విషయములలో ఎంత స్వార్థముంటే అంత త్వరగా దేవున్ని చేరవచ్చును. దేవుని విషయములలో నేను స్వార్థపరున్నే,
అందువలన కొన్ని అసలైన రహస్యములను ఇంతవరకు మీకు చెప్పలేదు, చెప్పనుకాక చెప్పను. అయినప్పటికీ
119

Page 120
లెక్కలో కాకుండ మీ లెక్కలో రహస్యములైన మా కృష్ణమందిరము యొక్క విషయములను కొన్నిటిని మాత్రమే తెలియజేస్తాము
చూడండి. అనంతపురము జిల్లా, తాడిపత్రి మండలములో నున్న చిన్న పొడమల గ్రామమునందు క్రీస్తుశకము 2003 వ
సంవత్సరము లో కృష్ణ మందిరమును నిర్మించాము. ఎటువంటి చందాలు వసూలు చేయకుండ మాస్వంత డబ్బుతో,
మాచేతనైనంత వరకు నిర్మించు కొన్నాము. తర్వాత అదే విధానముగా ప్రతి సంవత్సరము మాచేతనైనంత వరకు
అభివృద్ధి చేసుకొంటూ వచ్చాము. మొదట కృష్ణప్రతిమను ప్రతిష్ఠించునపుడు మేము అందరివలె మూడు రోజులు
ధాన్యములో పెట్టి, మూడు రోజులు నీళ్ళలో పెట్టి, తర్వాత మూడు రోజులు యజ్ఞములు చేసి ప్రతిష్ఠించలేదు.
ప్రతిష్ఠించునపుడు ఒక్క వేదమంత్రమును కూడ చదవలేదు. స్వయముగా నా చేతుల మీదుగా రాత్రిపూట అందరు
నిదురించుచుండగా అక్కడున్న వారికి కూడ తెలియకుండ ప్రతిష్ఠించాము. ఇదేమైనా ప్రతిష్ఠా అని మీరనుకోవచ్చు.
“దేవున్ని పూజించడముకంటే దేవున్ని సేవించడము గొప్ప” అను సూత్రమును చెప్పు నేను, ఆ దినము ఆర్భాటముగా
చేయు ప్రతిష్ఠకంటే సేవ చేయడము మంచిదని అనుకొన్నాను, అలాగే చేశాను. అదే సంవత్సరము ఆ ప్రాంతములో
మలేరియా వ్యాధి 90 శాతము తగ్గి పోయినట్లు అక్కడివారే చెప్పగా విన్నాము.
మేము 1980వ సంవత్సరము “ప్రబోధాశ్రమము” ను స్థాపించి, దాని ఆధ్వర్యములో 1991లో “ప్రబోధ
సేవాసమితి” అను సంస్థను తయారు చేశాము. 2004వ సంవత్సరము “ఇందూ జ్ఞానవేదిక” అను మరియొక సంస్థను
స్థాపించడము జరిగినది. ప్రబోధాశ్రమము యొక్క ఆధ్వర్యములో ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక అను రెండు
సంస్థలు పని చేయుచున్నవి. శ్రీకృష్ణుని జ్ఞానమును ప్రచారము చేయుట మరియు మాచే రచించిన గ్రంథములను
ప్రచురించుట మొదలగు జ్ఞానసేవా కార్యములను రెండు సంస్థలు చేయుచున్నవి. అద్వైతమును ప్రచారమును చేసిన
ఆది శంకారాచార్యులవలె మరియు విశిష్టాద్వైతమును ప్రచారము చేసిన రామానుజాచార్యులవలె మేము త్రైత సిద్ధాంతముతో
కృష్ణుని గీతను ప్రచారము చేయుచున్నాము. కృష్ణుని జ్ఞానమును సిద్ధాంతముతో శాస్త్ర బద్ధముగా ప్రచారము చేయుచున్న
మాకు, కృష్ణుడే మూలదైవము. అందువలన మేము కృష్ణమందిరమును స్థాపించాము. నాకు నేను పాతవాడినే అయినా
ప్రజలకు మాత్రము నేను క్రొత్త, నా సిద్ధాంతము క్రొత్త. కావున నేను త్రైత సిద్ధాంతమును ప్రచారము చేయడములో
ఇటు హిందూసంస్థల నుండి, అటు క్రైస్తవసంస్థల నుండి కొన్ని ఆటు పోట్లు ఎదుర్కొనవలసి వచ్చినది. వాటిని
లెక్కచేయక మేము 50 గ్రంథములను వ్రాసి, మా సంస్థల ద్వారా ప్రచారము చేయడము వలన ప్రజలు మా జ్ఞానము
యొక్క ఔన్నత్యమును గురించి తెలుసుకొని మా గ్రంథములను మించిన గ్రంథములు ఇంతవరకు భూమిమీద లేవు అని
చెప్పుకోవడము వలన, మరియు కాలజ్ఞానమును చెప్పిన బ్రహ్మముగారు తన కాలజ్ఞానము నందు "ప్రబోధాశ్రమము
ఉన్నతమైన జ్ఞానము కలది” అని చెప్పడము వలన, మేము ఉత్సాహముతో జ్ఞానప్రచారము చేయుచున్నాము. అంతేకాక
బ్రహ్మముగారి కాలజ్ఞానములో "ప్రబోధాశ్రమము వారి ఆది గుణమెల్ల శయనాధిపతికి ఉన్నది" అని వ్రాయడము వలన
వాటిని చూచిన కొందరు మమ్ములను గౌరవించను మొదలుపెట్టారు. ఇవన్నీ తెలియక ముందు త్రైతసిద్ధాంతము అని
పేరు వింటూనే, మేము క్రైస్తవుల బోధను చెప్పువారమని హిందువులు, క్రైస్తవ మతములోని త్రిత్వము అను పేరుకు
దగ్గరగా కనిపించు త్రైతము అను పదమును చూచి, ఈ పేరుతో మనలను దగ్గర చేసుకొని చివరకు, హిందుమతములోనికి
మార్చువారమని క్రైస్తవులు అనుకోవడము జరిగినది. మొదట అలా అనుకొనినా ఇప్పుడు మా బోధలను చదివిన
తర్వాత, హిందువులలో పెద్ద జ్ఞానులైన వారుకూడ మమ్ములను పొగడి మా వద్దకు రావడము, అలాగే క్రైస్తవులలో
ఎందరో పాస్టర్లు, ఫాదర్లు వచ్చి మమ్ములను ప్రశంసించడము జరుగుచున్నది. ఇస్లామ్ మతము వారికి మా బోధలు
మా
120

Page 121
బాగా నచ్చడము వలన మూడు మతములవారిలో కొందరు జ్ఞానములో మమ్ములను అనుసరించువారు కావడము
జరుగుచున్నది.
బ్రహ్మముగారు కాలజ్ఞానమున కలియుగములో 5000 సంవత్సరములకు అనగా క్రీస్తు శకము 1900వ
సంవత్సరములనుండి భూమిమీద అధర్మములు వృద్ధిపొంది ధర్మములు అడుగంటిపోవును అని వ్రాశారు. తర్వాత
కలియుగములో 5108 సంవత్సరములకు (క్రీస్తుశకము 2008 నుండి) తన కాలజ్ఞానము నెరవేరుటకు ప్రారంభమగును
అని చెప్పాడు. 5110 సంవత్సరములకు (క్రీ॥ 2010) ఆధ్యాత్మిక యోగ పురుషుడు ప్రకాశమగును అని వ్రాశారు.
ఆయన చెప్పినట్లు మా బోధలు రెండు సంవత్సరముల నుండి ప్రచారములోనికి వచ్చుటవలన "త్రైత సిద్ధాంత ఆదికర్త
ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు” అను పేరు బాగా ప్రచారమై పోయినది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము.
మేము దాదాపు ఐదు సంవత్సరముల క్రితము ఒక బోర్డును కృష్ణమందిరములో పెట్టాము. అందులో ఇక్కడికి కనిపించని
దేవతలు, మహర్షులు, ఖగోళములోని అనేక గ్రహముల జీవులు వస్తుంటారు. అందువలన ఇక్కడికి వచ్చు మనుషులు
ఎవరైనా చెడు భావముతో, చెడు ఉద్దేశముతో వస్తే వారికి కనిపించని దేవతల వలన, గ్రహముల వలన తీరని నష్టము
ఏర్పడవచ్చును అని వ్రాశాము. ఈ మధ్యన ఆరు నెలల క్రిందట మాకు దొరికిన బ్రహ్మముగారి కాలజ్ఞానము లో
“మహాదేవతలందరూ ఆనందాశ్రమము వద్దే ఉన్నారు” అని వ్రాసి యుండడమును గమనించాము. గతములో మేము
ఎన్నోమార్లు కృష్ణమందిరములో ఉన్నది కృష్ణుని విగ్రహము కాదు, కృష్ణుని ప్రతిమవున్నది. ఇక్కడి కృష్ణ ప్రతిమ
చాలాశక్తివంతమైనది. అందువలన భూమిమీద కనిపించకుండా ఉన్న దేవతలు, మహర్షులు, ఖగోళములోనున్న గ్రహములు
ఇక్కడికి వచ్చి పోతున్నారని చెప్పాము. కృష్ణుని దర్శనార్థము వెంకటేశ్వర స్వామి కూడ వచ్చి పోయినట్లు మాకు
తెలిసింది. మా మీద దురుద్దేశముతో ఇక్కడికి వచ్చిన ప్రజలు దేవతలు వచ్చిన సమయములో ఇక్కడేవుంటే వారి
దృష్టిలో పడితే చెడు భావమున్న వారు దేవతల కోపమునకు గురి అగుదురు. అందువలన తీరని నష్టము ఏర్పడుతుందని
వివరముగా చెప్పాము.
మేము స్వయముగా ప్రతిష్ఠించిన ప్రతిమలో భగవతాశక్తి ఉండుట వలన, దేవతలందరు ఆయనను దర్శించుకొనుటకు
వచ్చుచున్నారు. వారికి భగవంతుని దర్శన భాగ్యమును కల్గించిన మమ్ములను దీవించి పోవుచున్నారు. ఇదంతా
కట్టుకథ అని అనుకోవద్దండి. మీకు నమ్మశక్యము కాని విషయమైనప్పటికీ మేము చెప్పునది నూరుపాళ్ళు సత్యమే.
ఎందుకనగా! బ్రహ్మముగారు కూడా తన కాలజ్ఞానములో “శయనాధిపతికి సర్వధా ఆనందం, బ్రహ్మాది దేవతలెల్ల
దీవించేరు. జారు వాక్యములు ఆడిన వారెల్ల నాశనమై పోయ్యేరు. కీడు దలచిన వారెల్లా ధూళియై పొయ్యేరు”. అని
వ్రాశారు. దీనినిబట్టి దేవతలు చాలామంది ఇక్కడికి వస్తున్నారని తెలియుచున్నది. బ్రహ్మముగారి వాక్యములు ఇప్పుడు
ఆరు నెలల క్రితము మాకు తెలిసాయి. కానీ మేము ఐదు సంవత్సరముల పూర్వమే ఈ మాటలను చెప్పాము.
కొందరు ఇక్కడికి వచ్చి పోయిన వారము దినములకే ఆరోగ్యము అంతా బాగున్నా చనిపోవడము జరిగింది. మమ్ములను
దూషించిన కొందరు తీవ్రమైన కష్టాలలో కూరుకపోవడము, కొందరికి భయంకరమైన రోగములు వచ్చి ఎంతో కాలము
అనుభవించడము జరిగినది. వీటన్నిటిని గమనించిన మేము దానికి కారణమును తెలుసుకొని ఐదు సంవత్సరములపుడే
బోర్డుమీద దేవతలు వచ్చు విషయము వ్రాసి పెట్టాము. కొందరు ఇక్కడకు రాకముందే కొన్ని నయముకాని రోగములతో
బాధపడువారు నావద్దకు వచ్చి తమ బాధను చెప్పుకొన్నపుడు, నేను ఎవరికీ నయము చేయలేను, నావలన ఎవరికీ
స్వస్థత జరుగదు. కానీ నీకు కృష్ణుని మీద భగవంతుడను భక్తి కల్గి, కర్మలను పోగొట్టు యోగ్యత ఆయనకున్నదను
121

Page 122
భావముతో, కృష్ణ మందిరము వద్దకు వచ్చి మూడు లేక ఐదు రోజులు మందిరము ముందర నిద్రపోతే రాత్రిపూట
వచ్చు దేవతలు వారిని చూచి, వారు వీరి రోగములను లేకుండ చేయవచ్చును అని చెప్పాను. మందిరమువద్ద నిద్రించు
వారిని చూచి వీరు కృష్ణుని భక్తులని ప్రేమతో లేక దయతో వచ్చిన దేవతలు వారి రోగములను ఎందరికో లేకుండ
చేయడము జరిగింది. కొందరు బాగైపోయిన తర్వాత కృష్ణున్ని, మమ్ములను మరచిపోయిన వారు కూడ ఉన్నారు.
అటువంటి వారికి తిరిగి ఏదైనా రోగము వచ్చి అక్కడికి పోతే బాగవుతుందని వచ్చినా, వారు ఎన్ని రోజులున్నా వారికి
ఏమాత్రము నయము కావడములేదు. దీనినిబట్టి కృష్ణమందిరము అక్కర తీర్చే ఆసుపత్రిలాంటిది కాదని తెలియుచున్నది.
మందిరములోనున్న నేనుగానీ, గర్భగుడిలోనున్న కృష్ణుడుగానీ తటస్థముగా ఉంటాము. ఎవరికీ రోగాలు పోవాలి
అనుకోము. కృష్ణుడు ఎవరి గోడు వినడు, వినినా పట్టించుకోడు. దానివలన అక్కడికి పోయి ఆయనకెందుకు మ్రొక్కాలి
అని అనుకోవద్దండి. కృష్ణుడు పట్టించుకోక పోయినా అక్కడికి వచ్చు ఆయన సేవకులైన దేవతలు ప్రజలను పట్టించుకొని
వారి సమస్యలను తీర్చుతారు. ఒక సమస్యను పరిష్కరించుటకు తమ చేతకాకపోతే తమకంటే పెద్ద దేవతలకు చెప్పి
వారిచేత పరిష్కరింపజేస్తారు. అది అక్కడికి వచ్చిన ప్రజల మనోభావములను బట్టి ఉంటుంది. చెడు భావముంటే
చెడు, మంచి భావముంటే మంచి మా కృష్ణుని వద్ద జరిగి తీరుతుంది.
ఇంత చెప్పినా ఇదంతా తమ గొప్పను చెప్పుకునే దానికని అనుకొను వారు కూడ కలరు. అటువంటి వారికి
కృష్ణమందిరము ఎంత శక్తివంతమై నదో చెప్పుటకు, ఒక జరిగిన సంఘటనను వివరిస్తాను చూడండి. కృష్ణ మందిరమునకు
ముందు భాగమున ఒక చిన్న రూమును కట్టించి దానిలో మంగళషాపు కావలసిన సామగ్రిని సమకూర్చి, మా భక్తుడైన
మంగళ వెంకటేష్ అను వ్యక్తిని అందులో పెట్టడము జరిగినది. కృష్ణమందిరము లో కృష్ణుని వద్ద తల వెంట్రుకలు
గొరిగించుకొను వారికి అందుబాటులో ఉంటాడను ఉద్దేశముతో అతనిని ఉంచడము జరిగినది. దాదాపు ఆరు
సంవత్సరముల క్రితము సాయంకాలము ఆరుగంటల సమయములో చీకటి పడు సమయములో, మందిరము ముందర
వెంకటేష్ షాప్ ప్రక్కన రోడ్డులో ముగ్గురు ఆడవారు పొలము పనులనుండి ఇంటికి పోతూ, సరిగ్గా మందిరము
ముందర మంగళిషాప్ దగ్గరకు వచ్చినపుడు షాపు మూసివుండడము చూచి, ఊరకనే పోకుండా వారిలో ఒకామె చిన్న
మంగళోడు ఇక్కడుంటాడు, పెద్దమంగళోడు పైన మేడమీద ఉంటాడని నన్ను, వెంకటేషన్ను ఎగతాళిగ మాట్లాడడము
జరిగినది. ఆ మాటను అక్కడే చాటునవున్న వెంకటేష్ విన్నాడు. మాట్లాడినవారు వెంకటేషన్ను గమనించలేదు. వెంకటేష్
కూడ ఆ విషయము విననట్లు పట్టించుకోలేదు. తర్వాత ఏడు రోజులకు మమ్ములను ఎగతాళిగ మాట్లాడిన ఆడ మనిషికి
పాము కరవడము జరిగినది. ఆ ప్రాంతములో ఎవరికి పాము కరచిన ప్రక్కన పది కిలోమీటర్ల దూరములోనున్న కావేటి
సముద్రము అను ఊరులో మందు ఇస్తారు. పాము కరిచిన ఆడమనిషిని వారి బంధువులు కావేటి సముద్రమునకు
తీసుకొనిపోయి మందును తిని బాగైందని నమ్మకము కల్గిన తర్వాత ఇంటికి రావాలని వచ్చారు. ఊరిలోని వారు
మందిరము ముందర రోడ్డు ద్వారానే పోవాలి, రావాలి. సరిగ్గా వెంకటేష్ షాప్ ముందర వారము రోజుల క్రితము
ఎగతాళిగ మాట్లాడిన స్థలములోనికి అడుగుపెట్టగానే మాట్లాడిన ఆమెకు ప్రాణము పోవడము జరిగినది. అక్కడికి
వస్తూనే ఆమెకు ప్రాణము పోవడమును వెంకటేష్ ప్రత్యక్షముగ చూచాడు. తర్వాత ఆ విషయమును మాకు తెలిపాడు.
ఏ జాగాలో మాట్లాడిందో అదే జాగాలోనికి రాగానే ప్రాణము పోయిందని, మొదట వారము క్రిందట మాట్లాడినపుడు
చూచానని, తర్వాత ఇప్పుడు చనిపోయింది కూడ చూచానని చెప్పాడు. అప్పటి ఆ విషయము తెలియని మేము
యోచించగా ఆమె మమ్ములను దూషించినపుడు ఎవరైన దేవతలు ఆ సమయానికి అక్కడ వుండి, ఆమె మాట్లాడడమును
చూచి వుంటుంటారని వారికి కోపము వచ్చి వుంటుందని, వారే ఆ విధముగ చంపివుంటారని మాకు అర్థమైనది.
122

Page 123
మేము చంపినాము అని బయటికి తెలియుటకే ఏ స్థలములో దూషించినదో అదే స్థలములో ఆ దేవతలు ప్రాణము
పోవునట్లు చేశారని అనుకున్నాము.
అనవసరముగా మమ్ములను దూషించడము వలన ఎంతటి అనర్థము జరిగిందో అర్థమైంది. దీనిని బట్టి
భూమిమీద ఎక్కడలేని భగవత్ శక్తి కృష్ణ ప్రతిమయందు కలదని, ఆ శక్తిని దర్శించుకొనుటకు సకల దేవతలు వస్తున్నారని
తెలియుచున్నది. వచ్చు దేవతలకు కోపము వస్తే చెడును, దయవస్తే మంచిని కూడా కలుగ చేస్తారనుటకు మరియొక
నిదర్శనమును చూస్తాము. హైదరాబాద్లో నాకు పరిచయమున్న వ్యక్తి అన్నకు ఆరోగ్యము చెడిపోయింది. ఆసుపత్రిలో
ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు. అటువంటి సమయములో నావద్దకు వచ్చి వారి పరిస్థితిని
చెప్పుకొని బాధపడ్డారు. దానికి “నేను ఏమీ చేయలేను, మీకు కృష్ణుని మీద విశ్వాసముంటే కృష్ణమందిరము వద్దకు
పోయి భక్తిగవుండండి" అని చెప్పాము. వారు వెంటనే కృష్ణమందిరము వద్దకు వచ్చి ఉండడము జరిగింది. 15
రోజులలో ఆయన పూర్తి ఆరోగ్యమును పొందాడు. రోగము బాగైన తర్వాత అతను తిరిగి దేవుడను భావముతో
మందిరమునకు రాలేదు, కృష్ణుని జ్ఞానమును గురించి ఏమాత్రము తెలుసుకోలేదు. తర్వాత రెండు సంవత్సరములకు
అతనికి అనారోగ్యమైంది. అప్పుడు వారు నన్ను అడిగితే “భక్తి, జ్ఞానమున్నపుడే ఇక్కడికి రావలెను. అట్లు కాకుండ
ఇదేదో రోగములు నయము చేయుటకున్న ఆసుపత్రిలాగ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తే రోగములు పోవు” అని
చెప్పి రావద్దని చెప్పాము. మేము ఆ మాట చెప్పిన తర్వాత వారము దినములకే అతను చనిపోవడము జరిగినది.
మొదట రోగమొచ్చినపుడు ఒక చుక్క నీరుగానీ, ఒక మెతుకు అన్నముగానీ గొంతులోనికి పోయేదికాదు. శ్వాస
ఆడుటకు గొంతులో జిగురు (మ్యూకస్) లాంటిది అడ్డుపడేది. అటువంటి ప్రమాద స్థితిలోనున్న వ్యక్తి బ్రతికి బయటపడడము
ఇక్కడికి వచ్చిన దేవతల పనేనని అర్థమగుచున్నది. మందిరములోని కృష్ణునికి ఎటువంటి శ్రమలేకుండ ఇక్కడికి వచ్చిన
దేవతలే భక్తుల సమస్యలను కూడ తీర్చుచుందురు.
ఇక్కడి కృష్ణమందిరము ఖరీదైన ఆలయముగా కనిపించదు. స్థూలముగా కనిపించుటకు చిన్నదే అయినా,
సూక్ష్మముగానున్న కృష్ణ భగవానుడు దేవతలందరికంటే గొప్పవాడు. భూమిమీద ప్రజలు మ్రొక్కుచున్న పెద్ద దేవతలు
కూడ అప్పుడప్పుడు వచ్చి పోవడము జరుగుచున్నది. మాకు తెలిసిన తర్వాత, మేము దేవతలు ఇక్కడికి వస్తున్నారని
ఒక బోర్డు మీద వ్రాయడము జరిగినది. దేవతలు వచ్చి పోవుచున్నారనుటకు ఎన్నో ఆధారములున్న తర్వాతనే మేము
బయటికి తెలిపాము. నిత్యము రాత్రిపూట 1 నుండి 3 గంటల వరకు కనీసము పదిమంది చిన్న పెద్ద దేవతలు వచ్చి
పోవడము జరుగుచున్నది. ఇంతగా ప్రభావముగల కృష్ణమందిరము ఇక్కడున్నదని ఈ ఊరి ప్రజలకుగానీ, ప్రక్కనేనున్న
తాడిపత్రి ప్రజలకుగానీ తెలియదు. ఈ మందిరము యొక్క గొప్పతనము తెలిసిన కొందరు దూరప్రాంతమైన
విజయనగరము, విశాఖపట్టణము నుండి కూడ వచ్చి రాత్రిపూట నిద్రించి పోవుచున్నారు. ఆ విధముగా భక్తిగా వచ్చి
సేవ చేసుకొన్న వారికి భయంకర రోగములు కూడ పోయిన సంఘటనలు ఎన్నో కలవు. మేము ఇక ఎక్కువగా
వ్రాయదలచుకోలేదు. చివరిగా చెప్పునదే మనగా! కృష్ణుడు భగవంతునిగా వచ్చిన దైవశక్తి. కావున భగవంతుడు
దేవతలందరికీ పూజ్యుడే. దేశములో ఎన్నో కృష్ణ దేవాలయములుండినా అక్కడ ఎక్కడా లేకుండ ఇక్కడి కృష్ణ మందిరములోనే
ఆ శక్తి వచ్చి చేరడము ఆశ్చర్యమే అయినా ఇది వాస్తవము. కృష్ణుడు చెప్పిన జ్ఞానము ఎక్కడుంటుందో ఆయన అక్కడే
ఉంటాడు అను మాట ప్రకారము ఆయన చెప్పిన జ్ఞానము నూటికి నూరుపాళ్ళు ఇక్కడే ఉన్నది. కావున కృష్ణుడు ఇక్కడే
ఉన్నాడు. కృష్ణున్ని అన్ని దేవాలయములలో పూజించినట్లు కూడ మేము పూజించడము లేదు. మా గుడిలో ప్రస్థుతానికి
123

Page 124
పూజారే లేడు. కృష్ణున్ని పూజించడముకంటే ఆయనకు సేవ చేయడము ముఖ్యమైన పని అని మేము చెప్పినట్లు ఇక్కడ
సాధారణ పూజ తప్ప ప్రత్యేక పూజలుండవు. ఆయన సేవకంటే మించిన ఆరాధన లేదు. కావున ఈ గ్రంథము
చదివినవారు కూడ వచ్చి కృష్ణున్ని దర్శించుకొని ఆయన జ్ఞానమును తెలుసుకొని సేవ చేయండని తెలుపుచు
ఇంతటితో ముగిస్తున్నాము.
చివరి మాట - నేటి సమాజము
సమాజము అనగా సమానముగా పుట్టినదని అర్థము. మనకు రెండు సమాజములు కలవు. ఒకటి లోపలి
సమాజము, రెండు బయటి సమాజము. బయటి సమాజమును గురించి అందరికి తెలుసు. కానీ లోపలి సమాజమును
గురించి ఎవరికీ తెలియదనే చెప్పవచ్చును. సమాజము అనగా ఏమిటి? మాకు తెలియకుండ నీకు తెలిసిన సమాజ
మేమిటి? అని కొందరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి నా సమాధానము ఏమనగా! సమాజము అను శబ్దములో
రెండు పదములు ఇమిడివున్నవి. ఒకటి సమ, రెండు జము. “సమ” అనగా నీకు ఏదైతే ఉందో అందరికీ అదే ఉంది,
లేక అందరికీ ఏదైతే ఉందో నీకూ అదే ఉంది అని అర్ధము. దీనినిబట్టి సమానముగా పుట్టినది సమాజమని తెలియుచున్నది.
ఇక్కడ అందరికి ఏది సమానముగా ఉంది అని ప్రశ్న వస్తే “జము” లేక “జమ్” అని కలదు. జమ్ అనగా పుట్టడము
అని లేక జన్మించడము అని అర్థము. ఒకే విధముగా బయటి ప్రపంచములోని మనుషులంతా జన్మిస్తున్నారు. కాబట్టి
మనుషులందరిని సమాజము అంటున్నాము. ఇకపోతే లోపలి సమాజము అనగా శరీరములోపల జీవునితోపాటు
సమానముగా పుట్టుచున్న పదునాలుగు (14) చైతన్య భాగస్వాములను మరియు జీవునితో సహా కలిపి లోపలి సమాజము
అంటున్నాము. బయటి సమాజములో ఎంతమందైనా ఉండవచ్చును. కానీ లోపలి సమాజములో మొత్తము పదిహేనుమంది
మాత్రము గలరని తెలియుచున్నది. బయటి సమాజము కనిపిస్తుంది కావున దానిని కనిపించే స్థూలసమాజము అంటాము.
లోపలి సమాజము లోని పదిహేను మందికి పేర్లు ఉన్నా, పదిహేను మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని
చేస్తున్నా, వారు మాత్రము ఎవరికి కనిపించరు. కావున లోపలి సమాజమును కనపరాని సమాజము అంటాము.
కనిపించే
సమాజమును గురించి అందరికి
తెలుసు. కసవురాని సమాజమును గురించి ఎవరికీ తెలియదు.
కనిపించే సమాజమును గురించి అందరికి తెలుసు, కనపరాని సమాజమును గురించి ఎవరికీ తెలియదు.
కనపరాని సమాజములోని వారికి పేర్లున్నా మరియు పనులున్నా వారు కనిపించని దానివలన వారిని గూర్చి ఎవరికీ
తెలియదు. పేర్లు, కార్యములు అన్నీ తెలిసినా కేవలము కనిపించని దానివలన, లోపలి సమాజమును ఏమాత్రము
ఎవరు గ్రహించడము లేదు. బయటి సమాజములోని వారి అందరి పేర్లు తెలియకున్నా, అందరి పనులు తెలియకున్నా,
కేవలము కనిపించే దానివలన దానిని గురించి అందరు తెలుసునని మాట్లాడుదురు. ఈ రెండు సమాజములలో
మనిషికి ఏది ముఖ్యము అని ప్రశ్నవస్తే, బయట అందిరి మధ్యలో తిరుగుచున్నాము కాబట్టి బయటి సమాజములో
ఎలా మెలగాలో తెలిసివుండాలి. అలాగే లోపలి సమాజములో నీ పాత్ర ఏమిటో తెలిసి వుండాలి. ఒక విధముగా
రెండు సమాజములు మనిషికి ముఖ్యమైనవే. ఒక మనిషి సంపూర్ణముగా జీవించాలి అంటే అతడు రెండు సమాజములను
గురించి తెలిసివుండాలి. నేటికాలములో లోపలి సమాజమును గురించి ఎవరికీ తెలియదు. కావున అటువంటి మనిషి
అసంపూర్ణముగా జీవించినట్లే, అనగా అతనిది సంపూర్ణ జీవితము కాదు. సమ్ అనగా బాగా అని, పూర్ణమ్ అనగా
పూర్తిగా అని అర్థము. సంపూర్ణముగా అనగా బాగా తెలిసి అని అర్ధము. భూమిమీద మానవులు సంపూర్ణముగా
తెలియక అసంపూర్ణ జీవితమును గడుపుచున్నారని తెలియుచున్నది.
124

Page 125
ఒక మనిషి భౌతిక సమాజములో జీవించునపుడు తన శరీరములోని ఆధ్యాత్మిక సమాజమును గురించి కూడ
తెలిసివుండాలి. అలా ఆధ్యాత్మికము తెలియకుండ కేవలము భౌతికముగా జీవించువానిని అజ్ఞాని అనియు, అసంపూర్ణ
జీవి అనియు అనవచ్చును. మనిషి అలా అజ్ఞాని కాకుండ, అసంపూర్ణ జీవితమును గడపకుండ, ఇటు బయట అటు
లోపల సమాజములను గురించి తెలిసి బ్రతుకునట్లు, దేవుని ధర్మములను భగవంతుడు జ్ఞాన రూపములో తెలియజేసాడు.
బయట సమాజములో ఒక మనిషి కార్యములను చేయుచున్నపుడు, మాట్లాడునపుడు, కుటుంబముతో ఉన్నపుడు, భార్య
ఎడల, పిల్లల ఎడల, బంధువుల ఎడల సక్రమముగా ఎలా ప్రవర్తించాలో నియమించి తెలియజేయునది లోపలి సమాజము.
బయటి సమాజములోనే మనిషికి ఘోరమైన పాపములు అంటుకొనుచున్నవి. బయటి సమాజములోనే ఘోరమైన బాధలు
అనుభవించవలసియున్నది. బయటి సమాజములో పాపములను అంటించు కోకుండ, సక్రమముగా బ్రతకాలంటే
భౌతికముతో పాటు, ఆధ్యాత్మికమును కూడ తెలిసివుండాలి. కనిపించని ఆధ్యాత్మికమును ధర్మబద్దముగా జ్ఞానరూపములో
భగవంతుడు తెలియజేయుటకే వచ్చును. ఆధ్యాత్మికమును తెలియజేయాలి అంటే దేవుని ధర్మములు మనిషికి తెలియాలి.
దేవుని ధర్మములతో కూడుకొన్నదే ఆధ్యాత్మికము. దేవుని ధర్మములు ఇప్పటికి రెండుమార్లు భూమిమీద కేవలము
మూడు వేల సంవత్సరముల వ్యవధిలోనే తెలియబడినాయి. ఇంత తక్కువ కాలములోనే దేవుని ధర్మములు సంపూర్ణ
జ్ఞానరూపముతో తెలియబడినప్పటికీ, ఒక్క ధర్మమును కూడ మనిషి గ్రహించలేదు. దేవుని అంశ భూమిమీదికి భగవంతునిగా
వచ్చి ధర్మములను తెలియజెప్పినా ఎందుకు మనిషి గ్రహించలేదు. గ్రహించకుండ పోవుటకు కారణమేమి అని
చూచినట్లయితే ఈ విధముగా తెలియుచున్నది.
మనిషి శరీరములో ముఖ్యమైనది తల. పైకి కనిపించే తలలో కనిపించని రహస్యము ఎంతో ఉన్నది. అందువలన
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగము అను అధ్యాయములో మొదటి శ్లోకములోనే
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్॥
భావము : శరీరమునకు పైన మూలమున్నదని చెప్పాడు. దానికి కొమ్మలు క్రిందకలవని కూడ చెప్పాడు. దీనిని
తెలిసినవాడు మాయను తెలిసినట్లేనని చెప్పాడు. పైన తలలోని మూలమును తెలిస్తే మాయనేకాక దేవుని జ్ఞానమును
కూడ తెలిసినట్లే అగును. అందువలన తలలోని కొంత రహస్యమును మనము వివరించుకొందాము. తలలోని కొంత
రహస్యమును తెలుసుకొనుట వలన ప్రస్తుత కాలములో దేవుని ధర్మములను మనిషి ఎందుకు తెలుసుకోలేక పోయాడో
కొంత వరకు అర్థమగును. తలలో నాలుగు చక్రముల అమరిక ఒకటున్నదని ముందే చెప్పుకొన్నాము. అందులో క్రింది
చక్రము ఒకటి కలదు కదా! దానినే మాయచక్రము అనీ, గుణచక్రము అనీ చెప్పుకొన్నాము. ఈ చక్రము మూడు చుట్టు
కొలతలలో, మూడు భాగములుగా విభజించబడి ఉన్నది. ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క పేరు కలదని ముందే చెప్పుకొన్నాము.
గుణచక్రము ఆకారమును కూడ చిత్రరూపములో తెలుసుకొన్నాము. చక్రములోని ఒక్కొక్క భాగములో 6+6 గుణములు
మొత్తము 12 కలవని కూడ చెప్పుకొన్నాము. వీటిలో ఆరు మంచి గుణములుకాగా, ఆరు చెడు గుణములుగా ఉన్నవి.
మంచి చెడు 12 గుణములు పేర్లు కలిగివున్నవి. వీటికి అనుసంధానమై రెండు గుంపులకు ఒక శ్రద్ధ కలదు. ఒక
గుణభాగములోని గుంపుకు ఒక శ్రద్ధ అనునది ఉండగా, మిగత రెండు గుణ భాగముల గుంపుకు రెండు శ్రద్ధలు ఉ
౦డును. శ్రద్ధ అనునది గుణము కాదు. శ్రద్ధ అనునది ప్రత్యేకమైనది. శ్రద్ధ అనునది ఒక చాయలాంటిది. దాని చాయ
(నీడ) అరు గుణముల మీద పడుచుండును. గుణముల మీద శ్రద్ధయొక్క చాయపడడమేకాక అ గుణ భాగములోనున్న
125

Page 126
కిరణము వంగదు.
జీవున్ని అక్కడున్న గుణముల లోని ఒక గుణమునతో శ్రద్ధ అనుసంధానము చేయుచుండును. బాగా అర్థమగుటకు ఒక
ఉదాహరణను చెప్పుకొందాము. సూర్యుడు ప్రకాశించు నపుడు సూర్యరశ్మిపడని స్థలములు కూడ ఎన్నో ఉండును.
ఇంటిలోని అన్ని జాగాలలోనికి సూర్యరశ్మి పడదు కదా! అలాగే శరీరములో జీవుడు సూర్యుడులాంటివాడు జీవునికి
కొంత వెలుగువుండును. జీవుని వెలుగు నేరుగా ఏ గుణము మీదపడదు. గుణము ఒక ఇల్లులాంటిది. జీవుని వెలుగు
గుణము అను గృహము లోపలపడవలెను. సూర్యకిరణము సూర్యుని చుట్టు నిటారుగానే పయనించును, కానీ ఎక్కడ
సూర్యకిరణము వంగకపోవడము వలన గృహములోనికి సూర్యకిరణము అన్ని స్థలములోనికి
పోజాలదు. ఇంటి ముఖద్వారము ద్వారా సూర్యకిరణము నేరుగా ఎదురుగానున్న రూములోని గోడకు పడవలనంటే,
సూర్య కిరణమును వంచి ద్వారము ద్వారా నేరుగానున్న గోడకు పడునట్లు చేయవచ్చును. అలా చేయుటకు ఒక
పరికరము అవసరము. సూర్య కిరణమును వంచి పంపునది మనము ముఖము చూచుకొను అద్దము మాత్రమే. అద్దము
సూర్యకిరణమును ఎక్కడికైనా పంపగలదు. అలాగే శరీరములోని జీవుడు తనకాంతిని నేరుగా ఏ గుణము మీదికి
పంపలేడు. జీవుని కాంతిని ఎప్పుడు ఏ గుణము మీదికి పంపవలెనో అప్పుడు జీవుని కాంతిని ఆ గుణము మీదికి
పంపుటకు మన శరీరములోని శ్రద్ధ అను అద్దము కలదు. అద్దము సూర్యకిరణమును ఎలాగ ఎక్కడికైనా వంచిపంపగలదో,
అదే విధముగా శ్రద్ధ జీవుని కాంతిని ఏ గుణము మీదికైనా పంపగలదు. బయటి అద్దము ఎలాగ పనిచేయుచున్నదో,
అలాగే లోపల శ్రద్ధ అనునది పని చేయు చుండును. బయటి అద్దము దానంతటికది పని చేయదు. దానిని పని
చేయించుటకు ఒక మనిషి అవసరము. ఒక మనిషి అద్దమునుండి సూర్య కిరణమును ఎక్కడికి పంపవలెనో,
ఇంటిలోనికి పంపవలెనో, ఆ ఇంటిలోని ఏ గదిలోనికి పంపవలెనో తెలిసిపంపును. అలాగే శ్రద్ధ అనునది స్వయముగ
జీవుని కాంతిని ఏ గుణము మీదికి పంపలేదు. దానిని నియమించి పని చేయించునది ప్రారబ్ధకర్మ అనునది ప్రత్యేకముగా
ఒకటి గలదు. ప్రారబ్ధకర్మకు శ్రద్ధను ఎప్పుడు ఏ గుణము మీదికి పంపవలెనో తెలిసివుండును. దానిప్రకారమే జీవుని
వెలుగును శ్రద్ధ ద్వారా గుణముల మీదికి పంపుచున్నది. ప్రారబ్ధకర్మ తెలిపిన ప్రకారము శ్రద్ద గుణము మీదికి జీవుని
కాంతిని పంపుచున్నది. అప్పుడు జీవుడు ఆ గుణముతో ఏకమైపోవుచున్నాడు. అనగా ఆ గుణమును
తగులుకొనినవాడగుచున్నాడు. అలా ఏ గుణము మీద జీవునిక్రాంతి ప్రసరించుచున్నదో, ఆ గుణభావమును జీవుడు
పొందుచున్నాడు. శరీరములో జీవుడు గుణముల భావమును ఈ విధముగా పొందుచున్నాడని ఇంతవరకు ఎవరికీ
తెలియదు. మేము ఎంత సులభముగా చెప్పినా ఇది పెద్ద రహస్యమేనని తెలియవలెను. ఇక్కడనే ఎవరికీ తెలియని
రహస్యములలో కెల్ల రహస్యమైన విషయము ఇంకొకటి గలదు. అదేమనగా!
గుణచక్రములోని మూడు గుణభాగములకు మధ్యలో ఒక భాగము కలదని, అదియే కృష్ణుడు ధరించిన
నెమలిపింఛమందు మధ్యలోగల నల్లని గుర్తని చెప్పుకొన్నాము. ఆ మధ్యలోని గుర్తు ఆత్మకు నిలయమని చెప్పుకొన్నాము.
మధ్యలోని భాగము చుట్టువున్న మూడు వలయములలో మూడు శ్రద్దలు గలవు. అలాగే మధ్యలోనున్న ఆత్మ భాగములో
కూడ ఒక శ్రద్ధ గలదు. ఈ శ్రద్ధ ప్రత్యేకమైనది. ఇది మూడు గుణములలోని శ్రద్ధలాగ ఉండదు. దీనిమీద ప్రారబ్ధకర్మ
ప్రభావముండదు. ఈ శ్రద్ధ సర్వ స్వతంత్రమైనది. గుణచక్రములోని మూడు భాగములలో ఏదో ఒక భాగములోనున్న
జీవుడు స్వయంప్రకాశముకలవాడు. అతని ప్రకాశము గుణ భాగములో మాత్రము ప్రాకగలదు. జీవుని కిరణములు
ఒక గుణ భాగముకంటే ఎక్కువ దూరముపోలేవు. గుణముల మధ్యలోనున్న భాగములో గల ఆత్మ కూడ స్వయం
ప్రకాశము గలదియే. అయితే ఆత్మ ప్రకాశము తన భాగములోనేకాక, తర్వాత మూడు గుణభాగములలోనేకాక,
126

Page 127
శరీరమంతా కాలు గోరు వరకు, తల వెంట్రుకల వరకు ప్రాకివుండును. జీవాత్మ ఆత్మ రెండు పరమాత్మనుండి వచ్చినవే,
అయినా జీవాత్మ అనుభవించువాడు, ఆత్మ అనుభవింపజేయువాడు. అంతేకాక ఆత్మ శరీరములో అనేక పనులను
ఎవరికీ తెలియకుండ చేయుచు శరీరమును నడిపించుచున్నది. శరీరము మొత్తము ఆత్మ కిరణములు ఆక్రమించి,
శరీరములో ప్రతి పనిని చేయుచున్నవి. జీవాత్మ గుణ భావమును పొందడము మరియు అహం భావమును పొందడము,
ఆత్మ శరీరముద్వార చేయించిన పనిలోని కష్టసుఖములను అనుభవించడము మాత్రము చేయుచున్నది. గుణ భావమును,
అహం భావమును పొందడములో జీవునికి ఏ అనుభూతి (అనుభవము) లేదు. కానీ కష్టసుఖములను మాత్రము
అనుభవిస్తున్నాడు.
ఆత్మ శరీరమంతా వ్యాపించి జీవాత్మకంటే ఎన్నో విధముల గొప్పదిగా ఉన్నది. అయినప్పటికీ మూడు గుణ
భాగములలో శ్రద్ధ ఉన్నట్లే ఆత్మ భాగములో కూడ శ్రద్ధ కలదు. ఆత్మ భాగములోనున్న శ్రద్ధ ప్రత్యేకమైనదని తెలుసుకొన్నాము
కదా! ఈ
ఈ శ్రద్ధ జీవునియొక్క కర్మ ఆధీనములోనిది కాదు. ఇది కేవలము జీవాత్మ ఇష్ట ప్రకారము మాత్రమే పని
చేయును. గుణములలోని శ్రద్ధ జీవుని కిరణములను గుణముల మీదికి ప్రసరింపజేయుచుండగా, ఆత్మ భాగములోని
శ్రద్ధ ఆత్మ కిరణములనే జీవుని మీదికి ప్రసరింపజేయును. గుణములలోనున్న శ్రద్ధను ప్రారబ్ధకర్మ పని చేయించగా,
ఇక్కడ శ్రద్ధను జీవుని ఇష్టము పని చేయుస్తున్నదని చెప్పుకొన్నాము కదా! జీవుడు గుణములను ఏవగించుకొని, గుణముల
మీద పని చేయునది తన శ్రద్ధకాదనీ, గుణముల మీద కర్మ శ్రద్ధ పని చేయిస్తున్నదనీ, మొత్తము శరీరము లోపలగల
ఆధ్యాత్మిక సంఘమునంతటిని తెలిసినపుడు, తనకు కూడ శ్రద్ధవున్నదని తన శ్రద్ధ ఎంత పని చేస్తే అంత ఆత్మజ్ఞానము
లభించునని అర్థమైనపుడు, ఆత్మ భాగములోని శ్రద్ధ కదిలి పనిచేయుటకు మొదలుపెట్టును. అప్పుడు శ్రద్ధ అక్కడ గల
ఆత్మకిరణములను జీవాత్మ మీదికి ప్రసరింపజేయును. అలా జీవుని యొక్క శ్రద్ధ ఆత్మ భాగమునుండి ఆత్మ కిరణములను
ప్రసరింపగా, జీవునికి ఆత్మ యొక్క విషయము (ఆత్మజ్ఞానము) కొద్ది కొద్దిగా అర్థమగుటకు మొదలు పెట్టును. ఇదంత
జరుగుటకు మొదట బాహ్యసంఘములో ధర్మములు తెలిసివుండాలి. బాహ్య ప్రపంచములో దైవధర్మములు తెలిసినపుడు
మనిషికి దైవజ్ఞానము అర్థమగును. అప్పుడు లోపలనున్న జీవాత్మ స్పందించి లోపలనున్న సంఘమును తెలుసుకొనుటకు
మొదలుపెట్టును. లోపలనున్న సంఘమును తెలుసుకొన్న తర్వాత జీవునికి ఆత్మజ్ఞానము మీద ఇష్టము కల్గును. అప్పుడు
జీవుని ఇష్టము ప్రకారము ఆత్మ భాగములోని శ్రద్ధ పని చేయును. ఒక మనిషి ధర్మవరునిగా మారాలంటే ఈ
విధముగా బాహ్యములో జ్ఞానము, అంతరములో జ్ఞానము తెలిసినపుడే సాధ్యమగును. అనగా బాహ్య సంఘమును,
అంతరసంఘమును బాగా తెలియవలసివున్నది.
ప్రస్తుత కాలములో ఇప్పటికే భగవంతుడు రెండుమార్లు ధర్మములను తెలియజెప్పిపోయాడు. ఆయన ప్రచారములో
భాగముగా మూడవ మారు వచ్చి చెప్పవలసివున్నది. ఇప్పటికి రెండుమార్లు చెప్పినా, బాహ్యసంఘములో దైవధర్మములనే
ఎక్కువగా చెప్పడము జరిగినది. ఇక మూడవమారు వస్తే ఎక్కువగా అంతర్ సంఘమును గురించి చెప్పవలసివున్నది.
అప్పటికి భగవంతుని ధర్మప్రచారము పూర్తి అగును. ఇంతవరకు మనుషులు ఎందుకు మారలేదు, ఇంతవరకు ధర్మములు
ఎందుకు ప్రచారము కాలేదు. ధర్మములు ప్రచారమైనా అవి ఎందుకు పూర్తిగా అర్థము కాలేదు అని ప్రశ్నించుకొని
చూస్తే, అలా జరుగుటకు ధర్మములు మూడవమారు ప్రచారము కావలసి వున్నది. మూడవమారు ప్రచారమైనపుడే
ధర్మప్రచారము పూర్తి అగును. అంతేకాక ఇప్పటివరకు చెప్పియున్న బోధలలో రెండు సమాజములను చెప్పినప్పటికీ,
మూడవమారు చెప్పు బోధలలో అంతర్ సమాజమును గురించి ఎక్కువ చెప్పబడును. ప్రస్తుత కాలములో శరీరాంతర్గత
127

Page 128
సమాచారమును గురించి ఎవరికీ ఏమాత్రము అర్థముకాలేదు. అందువలన ఎక్కడైనా స్వాములు, గురువులు, బోధకులు
చెప్పు బోధలలో శరీరాంతర్గత సమాచారమును గురించి చెప్పడము ఉండదు. భగవంతుడు రెండుమార్లు ధర్మములను
చెప్పినా, వాటి మీద ఎవరికీ ఆసక్తి లేకపోవడము వలన, ఎక్కడైన ఆసక్తివున్నవారు ఉండినా, వారికెవరికి సరిగా అర్థము
కాకపోవడము వలన, అంతర్గత సమాజమును గురించి తెలియకుండ పోయినది. మనిషి దైవత్వమును చేరుటకు
అంతర్గతము ఎంత అవసరమో ఎవరికీ ఏమాత్రము అర్థము కాకుండపోయినది. అందువలన మూడవ మారు వచ్చు
భగవంతుడు ముందు రెండుమార్లు చెప్పిన ధర్మములను వివరించి అర్థమగునట్లు చెప్పడమేకాక, అంతర్గత సమాజమును
గురించి, అందులో జీవుడు ఎలా ఉండాలో దానిని గురించి వివరముగా చెప్పిపోవును.
గతములో రెండుమార్లు దేవుని అంశ భగవంతుని రూపములో దేవుని ధర్మములను తెలియజేస్తే,
గుణరూపములోనున్న మాయ వాటిని అర్థమైనట్లు మానవున్ని మభ్యపరచి, దేవుని మార్గములోనికి మనిషి పోయినట్లు
నమ్మించి, తన మార్గములోనే ఉంచుకొన్నది. అందువలన మూడవమారు వచ్చు భగవంతుడు మాయ ఉనికిని, మాయ
విధానమును, మాయ కార్యములను కూడ వివరించి చెప్పి, మాయబారిలో పడిన మనిషిని బయటపడునట్లు చేయును.
దేవునిది జ్ఞానమార్గమైతే, మాయది దేవుని మార్గమునకు వ్యతిరేఖమైన మార్గము. మనుషులను మాయ తన మార్గములో
నడిపించుకొనుటకే ప్రయత్నించుచుండును. ఆ లెక్క ప్రకారము మాయది ఒక మార్గము, దేవునిది ఒక మార్గము
మొత్తము రెండు మార్గములున్నవని తెలియుచున్నది. మాయ, దేవుని రెండు మార్గములను గుర్తించునట్లు రెండు
మార్గములకు రెండు వేరువేరు పేర్లు కలవు. దేవుని మార్గమును పథము అంటాము. మాయ మార్గమును మతము
అంటాము. భగవంతుడు తన బోధలో ఎక్కడ మతము అను పదమును ఉపయోగించలేదు. భగవంతుడు ఎక్కడ
చెప్పినా జ్ఞానమార్గమనియో లేక జ్ఞాన పథమనియో చెప్పాడు. మతము అనునది మాయకు సంబంధించిన దారి,
కావున దేవుడు ఆ మాటను ఎక్కడ ఉపయోగించి ధర్మములను తెలుపలేదు. భగవంతుడు రెండుమార్లు జ్ఞానమును
బోధిస్తే, దానిని మానవులకు అర్థమైనట్లు నమ్మించిన మాయ, భగవంతుని ఒక్కొక్క రాకను ఒక్కొక్క మతముగా మలిచి,
కృష్ణుడు చెప్పినది హిందూమతమనీ, ఏసు చెప్పినది క్రైస్తవమతమనీ మనుషులను నమ్మునట్లు చేసింది. దేవుని అంశ
అయిన భగవంతుడు చెప్పిన జ్ఞానము యొక్క సారాంశమును తెలియని మనుషులు, రెండుమార్లు రెండు రూపములలో,
రెండు దేశములలో చెప్పిన భగవంతుడు ఒక్కడేనని తెలియక, తమ తలలోని మాయవలలో చిక్కుకొని కృష్ణుడు, ఏసు
వేరువేరు మతముల, వేరువేరు వ్యక్తులనీ, వారు బోధించినది వేరువేరు బోధలను భ్రమలో పడిపోయారు. అలా దేవుని
పథమును వదలి మాయ మతములో చిక్కుకొని మేము ఫలానా మతమువారమనీ చెప్పుకొనుచు, మా మతము అభివృద్ధి
కావాలని తమ మతమును పెంచుకొను ప్రయత్నము చేయుచున్నారు. తమ మతమును పెంచుకోవాలంటే ఇతర మతమును
తగ్గించాలి. ఇతర మతమువారు వారి మతమును వదలి తమ మతములోనికి వచ్చినపుడే తమ మతము పెరుగుతుంది.
ఒక మతము తరగకుండ మరొక మతము పెరగదు. అలా ఒక మతము తగ్గిపోవాలంటే, అనేక విధముల ఆచరణలతో
ఒక మతమును ఇతర మతమువారు తగ్గించవలసి ఉన్నది. తమ మతములోని బోధను చెప్పి బోధతో ఒప్పించి, ఇతర
మతముల వారిని తమ మతము లోనికి చేర్చుకోవచ్చును. లేకపోతే దౌర్జన్యముతోకానీ, హింసతోకానీ, బయట పెట్టికానీ
ఇతర మతము వారిని తమ మతములోనికి వచ్చునట్లు చేసుకోవచ్చును.
ఈ కాలములో కొందరు తమ మతములోని జ్ఞానముతో కొందరిని ఆకర్షించుటకు ప్రయత్నించుచుండగా,
చాలామంది హింసామార్గమును ఉపయోగించి పరమతమును నాశనము చేస్తే తమ మతము గొప్పదగునని, ఆ
128

Page 129
మతమువారు బయపడి తమ మతములోనికి వచ్చుదురని ప్రయత్నించు చున్నారు. ఈ విధముగ చివరకు మాయతో
కూడుకొన్న మతములన్ని హింసామార్గములో పయణించుచున్నవి. మేము ఇందూ మతములో పుట్టిన దానివలన
మనది ఇందూ మతముకాదు, మనది వాస్తవానికి ఇందూ పథము అని తెలియజెప్పుటకు ఇందూమతము ×, ఇందూపథము
4 అని ఒక గ్రంథమును ప్రచురించితే, మమ్ములనే క్రైస్తవులని ప్రచారము చేసి, మా మీద నంద్యాల కోర్టులో కేసులు
పెట్టిన మహనంది హిందువులు ప్రస్తుత కాలములో ఉన్నారంటే మతము అను మాయ మనిషిలో ఎంత లోతుగా
దూరిపోయిందో అర్థమగు చున్నది. దేవునికి సంబంధించిన జ్ఞాన పథము ఏమాత్రము మచ్చుకైన కనిపించకుండ
పోయినది. ఈ మతము ఆ మతము అనకుండ అన్ని మతములు హింసా విధానమునే ఎన్నుకొని తమ మతమును
పెంచుకొనుటకు ప్రయత్నించుచున్నారు. తలలోని మాయ నీ మతములోని దేవుడే నిజమైన దేవుడు, ఇతర మతములోని
దేవుడు దేవుడే కాదు అని తెల్పుట వలన, మనిషి ప్రత్యక్షముగా రెండవ మతములోని దేవున్ని నిందించను మొదలు
పెట్టుచున్నాడు. మనిషిలోని దేవుని మీద విశ్వాసమే అదే దేవున్ని దూషించునట్లు చేయడమేకాక, అదే దేవున్ని విశ్వసించిన
వానిని చంపునట్లు కూడ చేయుచున్నది. అన్ని మతముల వారు అందరిని సృష్టించినది దేవుడే అంటారు. అంతలోనే
నీ మతము, నీ దేవుడు అని దేవున్ని రెండుగా చేసి మాట్లాడుతారు. దీనినంతటిని గమనిస్తే దైవపథము తెలియని
దానివలన మనిషి మాయ మతములో పడిపోయి చివరకు దైవమును చేరలేడని అర్థమగుచున్నది.
ఇంతవరకు మనము చెప్పుకొన్న కోవలోనే హిందూమతము, క్రైస్త మతము అనునవి తయారైనవి. నేడు
హిందూమతములో దేవుని గుడిఉన్నా, దేవతల గుడులు అనేకము తయారైపోయి, ఎవరు దేవుడు అను గుర్తింపే లేకుండ
పోయినది. అలాగే క్రైస్తవమతములో ప్రార్థనా మందిరమును కట్టుకొని ఏసునే చంపిన శిలువను (పెద్ద శిలువ లేక
కొండ శిలువ) చర్చీల మీద పెట్టుకోవడము జరుగుచున్నది. హిందువులకు దేవతలంటే ఏమిటో, దేవుడంటే ఏమిటో
అర్థము కాకుండ పోయినది. అలాగే క్రైస్తవులకు శిలువ అంటే ఏమిటో, దేవుడంటే ఏమిటో అర్థము కాకుండ పోయినది.
ఈ విధముగ ప్రజలలో కొందరియందు దైవభక్తి ఉండినా, చివరకది దయ్యము భక్తిలాగ మారిపోయింది. ఇది దేవునిభక్తి
అని చెప్పుటకు వీలు లేకుండ పోయినది. మా మాటలు కొంత విడ్డూరముగా ఉన్నా క్రైస్తవులు శిలువకు దగ్గరగా ఉండి,
దేవునికి దూరముగానున్న మాట వాస్తవమే. అలాగే హిందువులు దేవతలకు దగ్గరగా ఉండి దేవునికి దూరముగానున్న
మాట వాస్తవమే. ప్రజలందరూ దేవుని జ్ఞానమును తెలుసుకొని దేవునికి దగ్గర కావాలని చెప్పుచున్నాము తప్ప వేరు
భావము ఏమిలేదని అందరు గ్రహించాలి. అంతేకాక మనుషులందరికి తండ్రి ఒక్కడేనని, అందరము ఆయన సృష్ఠిలోని
వారమేనని, ఆయన తప్ప ఈ విశ్వములో వేరే దేవుడే లేడని తెలియాలి. మధ్యలో మనుషులు కల్పించు కొన్నవే
మతములనీ, మతములను బట్టి దేవుడులేడని, జ్ఞానపథమును బట్టి దేవుడున్నాడని ప్రతి ఒక్కరు తెలియాలి. అప్పుడైతేనే
మనిషి మాయనుండి బయటపడగలడు. ఇప్పటికాలములో మతము పేరు చెప్పుకొను ప్రతి మనిషి మాయలోనున్నట్లేనని
అర్థమగుచున్నది. అలా తనకు తెలియకుండానే మాయలో చిక్కుకొన్న మనిషి, నేను జ్ఞానములో ఉన్నాననుకొనినా, నాకు
దేవుని మీద విశ్వాసముందని అనుకొనినా, ప్రత్యక్షముగా దైవభక్తిని వ్యక్తము చేయుచుండినా, అతడు మాత్రము దైవదూషకుడే,
దేవునికి నిత్యము విరోధియే. ఈ మాట కూడ విచిత్రముగా కనిపించినా నా మాట వాస్తవమే అనుటకు ఈ విధముగా
చెప్పుచున్నాను చూడండి.
ఎప్పుడైతే మతద్వేషము మదిలో ఉన్నదో, అప్పుడు అతడు ఆ మత దేవున్ని నిందించుచున్నట్లే అగును. ఇతర
మత దేవున్ని అసూయతో, ద్వేషముతో అతను దేవుడే కాడు అన్నపుడు ఆ మాట నేరుగా తన దేవునికే తగులును. తన
129

Page 130
దేవుని మీద విశ్వాసముతో ఉంటూ, మా దేవుడే నిజమైన దేవుడు అని పొగిడినప్పటికీ, ఇతర మత దేవున్ని దూషించుట
వలన అది తన దేవున్ని దూషించినట్లే అగును. ఉదాహరణకు ఒక క్రైస్తవుడు తన ఏసు మీద భక్తితో హిందూమతములోని
కృష్ణున్ని దేవుడే కాదనినా, తన ఏసే దేవుడని కృష్ణున్ని దూషించినా, ఆ దూషణ ఏసును దూషించినట్లే అగును. క్రైస్తవుడు
కృష్ణున్ని దూషించితే అతను వాస్తవముగ ఏసును దూషించినట్లగును. అలాగే ఒక హిందువు ఏసును చులకన
భావముతో చూచినా, ఆయనను దూషించినా అది కృష్ణున్ని దూషించినట్లగును. అట్లగుటకు కారణము మరొకమారు
జ్ఞాపకము చేస్తే కృష్ణుడు, ఏసు ఇద్దరు ఒక్కరే కనుక ఒకరిని దూషించితే మరొకరిని దూషించినట్లగును. ఇప్పుడు
కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! ఇద్దరు ఒకటేనను విషయము మాకు తెలియదు. మా మతముయొక్క
ఏసును వందమార్లు నమస్కరించిన మేము కృష్ణున్ని దేవుడుకాడు అని ఒకమారు అనినా, ఆయననే వందమార్లు
మ్రొక్కినట్లు, ఒకమారు దూషించినట్లు అగును కదా! తెలియక ఒకమారు దూషించినా, వందమార్లు నమస్కరించాము
కదా! అప్పుడు దూషణకంటే మ్రొక్కినదే ఎక్కువగును కదా అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
నీవు బజారులో పోవునపుడు ప్రతి దినము నిన్ను చూచి ఒక మనిషి నమస్కారము పెట్టుచుండెననుకొనుము. అట్లు ఒక
సంవత్సరకాలము జరిగినది. అనగా 365 దినములు నిన్ను చూచి నమస్కరించిన మనిషి ఒక రోజు నిన్ను చూచి
పొరపాటుగ వేరే వ్యక్తి అనుకొని, తనకు సరిపోని పాత శత్రువువలె కనిపించడము వలన అతనికి కోపము వచ్చింది.
ఆ కోపములో ఉన్నట్లుండి కాలులోని చెప్పును తీసుకొని నీవైపు చూపి దగ్గరకురా చెప్పుతో కొట్టుతానన్నట్లు సైగ
చేశాడు. అప్పుడు నీవు ఇతను 365 రోజులు నాకు నమస్కరించాడు ఒకరోజు చెప్పుతో కొట్టితే కొట్టనీలే అని
అనుకుంటావా? లేక అతని మీద కోపమును తెచ్చుకొంటావా? ఎవరికైనా కోపమే వస్తుంది. ఇన్ని రోజులు మ్రొక్కినాడు
ఒకరోజు కొట్టితే ఏమైతుంది అని ఎవడు అనుకోడు. ఎంతటి తెలివున్న వాడైనా ఎదురు దాడికైనా దిగుతాడు. లేకపోతే
తర్వాత నీకత చూస్తానని అనుకుంటాడు.
త్రైత సిద్దా
130

Page 131
ఆ విధముగ ఏ దేవున్నయినా ఒక ప్రక్క మ్రొక్కుతూ, ఒక ప్రక్క దూషిస్తే మ్రొక్కిన దానికంటే ఎక్కువగా
దూషించిన దానినే తీసుకుంటారు. నీవు ఏ మతములో ఉండినా, నీవు మ్రొక్కుచున్న దేవుడు ఎవరైనా, ఇతర మతములో
ఉండు దేవుడు కూడ నీ దేవుడే అగుట వలన, నీవు ఎవరిని దూషించినా అది నీ దేవున్ని దూషించినట్లే అగును.
అందువలన కృష్ణున్ని దూషించినా ఏసును దూషించినా అసలైన సృష్ఠికర్తను దూషించినట్లే అగును. మొత్తము మీద
క్రైస్తవులు చాలామంది హిందువులను తమ మతములోనికి ప్రవేశించునట్లు చేసుకొన్నారు. మిగిలిన హిందువులు తమ
మతమును కాపాడుకోవాలని మతభక్తిని పెంచుకొనుటకు, కొన్ని సంఘములను తయారు చేసుకొన్నారు. బలప్రయోగముతో
మతమును కాపాడుకోవాలని హిందువులు ప్రయత్నించుచుండగా, ఆశలను చూపి రోగాలు పోతాయని, సుఖాలు వస్తాయని,
కష్టాలుపోతాయని క్రైస్తవులు ప్రచారము చేసి తమ మతమును పెంచుకొనుచున్నారు. చివరకు ఇరు మతముల వారు
దేవుడు చెప్పిన జ్ఞానమును మరచిపోయారు. ఏ మతములలో ఉండినా, ఏ మతములో చేరినా ఏమి ప్రయోజనములేదు.
దేవుడు చెప్పిన జ్ఞానపథములో పయణించి నపుడే మనిషి జీవితమునకు సార్థకత ఏర్పడును. అంతవరకు మతము
మనిషికి ఏ విధముగా ఉపయోగపడక పోగా, మనిషిని నాశనము చేయును. అందువలన ఇప్పటినుండైన నీవు
ఎవరో, ఈ సమాజమేమిటో తెలుసుకో, దానికి జవాబు దొరకాలంటే కనిపించని నీ శరీరములోపలి సమాజమును
గురించి తెలుసుకో. అప్పుడు సర్వ జగత్తుకు సృష్టికర్త ఎవరో, అందరికి అధిపతి ఎవరో, పరమాత్మ అనబడు దేవుడు
ఎవరో కొంతవరకైనా అర్థమగుతుంది.
ఇట్లు
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
131
----
Page 1
30
తీర్పు
దేవుని తీర్పు
(The Judgement Of God)
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
బ్రహ్మ
చక్రం
కాల
చక్రం
కర్మ
చక్రం
చక్రం
-బ్రహ్మనాడి
ఇందూ జ్ఞానవేదిక
ప్రచురించిన వారు
ఇందూ జ్ఞాన వేదిక
(Regd.No. : 168/2004)

Page 2
తీర్పు
(ది జడ్జిమెంట్ ఆఫ్ గాడ్)
తీర్పు అనగా తీర్చబడునది అని అర్ధము. ఇంకా వివరముగా చెప్పుకొంటే ఒక విషయములో తప్పు ఒప్పులను
లెక్కించి, ఏది తప్పో, ఏది ఒప్పో వివరించడమే కాకుండా, ఒప్పుకు అక్షనూ తప్పుకు శిక్షనూ తీర్చి చెప్పు దానిని తీర్పు
అంటాము. ఉదాహరణకు న్యాయస్థానమును (కోర్టును) అందరూ చూచియే ఉంటారు. న్యాయస్థానములో (కోర్టులో)
ఒక న్యాయమూర్తి (జడ్జి) ఉంటాడు. జడ్జి ముందర ముద్దాయి ఉంటాడు. ముద్దాయి చేసిన పనిలో మంచి చెడులను
ముద్దాయి చేతగానీ, ముద్దాయి ఎన్నుకోబడిన న్యాయవాది (అడ్వకేట్) చేతగానీ వివరించబడుతుంది. పూర్తి విచారణ
జరిగిన తర్వాత న్యాయమూర్తి (జడ్జి) తనకు తెలిసిన చట్టము ప్రకారము అందులోని తప్పు ఒప్పులను గ్రహించి తీర్పు
చెప్పును. బయట కనబడు కోర్టులు మనుషులు తయారు చేసుకొన్నవే, వీటిని ఉదాహరణకు మాత్రము చెప్పాము.
వాస్తవానికి మనకు కనిపించని న్యాయస్థానము ఒకటి కలదు. అది అతిపెద్ద న్యాయస్థానము. ఆ న్యాయస్థానములో
కుల మత భేదములు లేకుండా అన్ని మతములవారు విచారించబడుదురు. విశేషమేమంటే న్యాయస్థానమూ కనిపించదు,
తీర్పు చెప్పు న్యాయమూర్తీ కనిపించడు. కనిపించని న్యాయస్థానములో, కనిపించని దేవుడే న్యాయమూర్తిగా ఉండును.
ఏ తీర్పయినా దేవుని ద్వారానే వచ్చును. అందువలన దానిని దేవుని తీర్పు అనవచ్చును. దానినే కొందరు “ది
జడ్జిమెంట్ ఆఫ్ గాడ్" అంటారు. కనిపించని న్యాయస్థానములో ఎలా విచారణ జరుగుతుందో, ఎలా తీర్పు చేయబడుతుందో
ఎవరికీ తెలియదు. తీర్పులోని శిక్ష ఏమిటి అను విషయము కూడా ఎవరికీ తెలియదు. విచారణగానీ, తీర్పుగానీ,
శిక్షగానీ లేక అక్ష గానీ ఎవరికీ తెలియవు. అయితే తీర్పు చేయబడిన శిక్ష మాత్రము తప్పనిసరిగా ఎవరైనా
అనుభవించవలసిందే. బయటి కోర్టులో విచారణ, తీర్పు, శిక్ష ముందే తెలియును. ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తే,
ఆ ముద్దాయికి అది ముందే తెలిసిపోవును. అలాగే జైలు శిక్షగానీ ముందే తెలియును. అయితే కనిపించని లోపలి
కోర్టులో విధించిన శిక్ష అమలు జరుగబోవుటకు ఒక్క క్షణము ముందు కూడా తెలియదు.
ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును, అదేమనగా! కోర్టును గురించిగానీ, జడ్జిని గురించిగానీ, శిక్షను
గురించిగానీ విన్నాము, అయితే 'అక్ష' అను పదమును గురించి ఎప్పుడూ వినలేదు, అలాగే అది ఎలా అమలు జరుగునో
కూడా తెలియదు, అంతకూ అది ఏమిటి? అని ప్రశ్నించ వచ్చును. దానికి నా అధికారియైన ఆత్మ నా ద్వారా ఇలా
తెలియజేస్తున్నది. అందువలన మేము (నా ఆత్మ+నేను) ఇద్దరమూ చెప్పునదేమనగా! "క్ష" అను శబ్ధము నాశనమును
సూచించును. శిక్ష అనగా నాశనమునకు సంబంధించినదని అర్ధము. శారీరకముగాగానీ, మానసికముగాగానీ కలుగు
నాశనమును శిక్ష అంటాము. శరీర మరియు మానసిక నాశనము బాధతో కూడుకొని ఉంటుంది. అటువంటి బాధ
కలుగుటను శిక్ష అంటాము. బయట కనిపించు కోర్టును న్యాయస్థానముగా, అందులోని జడ్జిని న్యాయమూర్తిగా
చెప్పుకొన్నాము. ఇది ఉదాహరణ మాత్రమే. అసలు న్యాయస్థానము శరీరములోనే గలదు. అందులో న్యాయమూర్తి
ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనను ఎవరూ చూడలేదు. దండనాధికారిగా ఒకడున్నాడనుటకు నిరూపణగా భగవద్గీతా
గ్రంథములో విభూతి యోగము అను అధ్యాయములో 29వ శ్లోకమున "యమ స్సంయమతా మహమ్” అను వాక్యముగలదు.
దాని అర్థము "శిక్షించు వారిలో యముణ్ణి నేను" అని గలదు. యముడు అంటే ఆయన ఎక్కడో ప్రత్యేకమైన యమలోకములో
ఉంటాడనీ, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ అనుకోవద్దండి. పురాణాల కథలలోనికి పోకుండా, ఆధ్యాత్మిక విషయములోకి
వచ్చి చూస్తే, మన శరీరములో కనిపించక ఉన్నవాడే నిజమైన యముడని తెలియగలదు. ఏ తప్పుకు ఏ శిక్షనో దానిని
ముందే 'దేవుడు' అను యముడు ఆదిలోనే నిర్ణయించి ఉన్నాడు. తప్పులకు శిక్షలు ముందే నిర్ణయించబడియున్నవి.
వాటి ప్రకారము మనిషి చేసిన తప్పేమిటో గ్రహించి దానికి తగిన శిక్షను అమలు చేయువాడు మరొకడు గలడు.
2

Page 3
సృష్టికంటే ముందే అన్నీ దేవుని చేత నిర్ణయించబడియున్నవి. సృష్ఠి తర్వాత దేవుడు పని చేయనివాడుగా,
రూపములేనివాడుగా, పేరులేనివాడుగా ఉన్నాడని ఎవరూ మరువకూడదు. ఆధ్యాత్మిక చట్టము ప్రకారము (ధర్మము
ప్రకారము) దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడని జ్ఞాపకముంచుకోవలెను. దేవుడు అన్నిటికీ అతీతుడుగా
ఉన్నాడు. విశ్వమునంతటినీ సృష్టించినవాడు, పాలించువాడు, నాశనము చేయువాడు దేవుడే అయినా, ఆ ఏర్పాట్లన్నిటినీ
దేవుడు సృష్ఠికి పూర్వమే చేసిపెట్టాడు. అందువలన దేవున్ని సృష్ఠి, స్థితి, లయలకు కారణభూతుడని చెప్పవచ్చును. ఇదే
విషయము అందరికీ తెలియునట్లు ప్రపంచ భాష అయిన ఆంగ్ల భాషలో దేవున్ని God (గాడ్) అని మూడక్షరముల
సమ్మేళనముతో చెప్పడము జరిగినది. దేవుడు సృష్టిని తయారు చేసినవాడు కావున ఆయనను Generator (జనరేటర్)
అని ఇంగ్లీషు భాషలో చెప్ప వచ్చును. అలాగే పాలించువానిని Operator (ఆపరేటర్) అని అనవచ్చును. అట్లే
లయము చేయువాడు లేక నాశనము చేయు వానిని Destroyer (డిస్ట్రాయర్) అని అనవచ్చును. దేవుడు జనరేటర్,
ఆపరేటర్, డిస్ట్రాయర్ కావున ఆయనకు గుర్తుగా Generator పదమునుండి మొదటి అక్షరమైన “ఆ” ని తీసుకొని,
తర్వాత పదమైన Operator పదమునుండి మొదటి అక్షరము “0” ని తీసుకొని, చివరి Destroyer అను పదమునుండి
మొదటి అక్షరమైన “D” అను అక్షరమును తీసుకొని మూడక్షరములను కలిపి “GOD" అన్నారు. గాడ్ (GOD) అను
మూడు అక్షరముల సమ్మేళనము సృష్ఠి, స్థితి, లయ కర్తయిన దేవునికి గుర్తుగా ఉన్నది. అంతేగానీ అది వాస్తవానికి
పేరుకాదు. దేవునికి పేరు లేదు, ఆయనకున్న గొప్పతనమునకు సంబంధించిన బిరుదులను గాడ్ అనీ, దేవుడనీ,
పరమాత్మయనీ, ఈశ్వరుడనీ, పురుషోత్తముడనీ, సర్వాంతర్యామి అనీ, సర్వధారి అనీ, సృష్ఠి కర్తయనీ, ఆదిమధ్యాంత
రహితుడనీ, విశ్వవ్యాపి అని ఎన్నో బిరుదులతో పిలువడము జరుగుచున్నది.
ఎవరి ఊహకు అందనివాడు దేవుడు, ఎవరికీ తెలియనివాడు దేవుడు. అన్నిటికీ కారణకర్తయిన దేవున్ని
ఆంగ్లభాషలో GOD (గాడ్) అనినా, తెలుగు భాషలో అందరికీ పరిచయమున్న దేవుడు అను బిరుదుతోనే మనము
చెప్పుకొందాము. దేవుడు మూల పురుషునిగా ఉన్నా ఏమీ చేయనివాడుగా ఉన్నాడు. అలాంటపుడు ప్రస్తుతము
మనిషి చేయుచున్న తప్పులను గుర్తించి దానికి దేవుడు నిర్ణయించిన చట్టము లేక ధర్మము ప్రకారము శిక్షలను అమలు
చేయువాడు మరొకడు కలడని చెప్పాము కదా! ఆ రెండవవాడు మనిషి చేయుచున్న తప్పులను పాపములుగా గుర్తించి
లిఖించుకొని, తర్వాత ఆ పాపములకు పరిహారముగా శిక్షలను అనేక విధములుగా అమలు చేయుచున్నాడు. అదే
విధముగా మనిషి చేయుచున్న ఒప్పులను పుణ్యములుగా గుర్తించి లిఖించుకొని, తర్వాత ఆ పుణ్యములకు పరిహారముగా
ఎన్నో విధముల అక్షలను కూడా అమలు చేయుచున్నాడు. శిక్షలనుగానీ, అక్షలనుగానీ ముందే నిర్ణయించినవాడు
మొదటివాడైన యముడు (దేవుడు) కాగా, వాటిని అమలు చేయువాడు రెండవవాడైన చిత్రగుప్తుడు. యముడు, చిత్రగుప్తుడు
అను పేర్లను విన్నవారు కొందరుండినా, వారి భావములో యమలోకములో యముడున్నాడనీ, అలాగే చిత్రగుప్తుడు
ఉన్నాడనీ పురాణగాథలననుసరించి అనుకోవడము జరుగుచున్నది.
అయితే ఇక్కడ ముఖ్యముగా తెలుసుకోవలసినది ఏమనగా! తెలుగులో “దేవులాడబడేవాడు దేవుడు లేక
వెతకబడేవాడు దేవుడు” అని అర్థమునిచ్చు పదముండినా, ఆంగ్లములో సృష్టి, స్థితి, లయలకు కారకుడను అర్థమునిచ్చు
GOD (గాడ్) ఉండినా, దండనాధికారి అయిన దానివలన దేవున్ని 'యమ' అని పిలుస్తున్నాము. 'యమ' అను పదము
దేవునికే వర్తిస్తుంది. ఒక మనిషి ఉన్నత ఉద్యోగి అయినా, దేశానికి రాజయినా, మంత్రయినా, ఏ హెూదాలో ఉండినా,
వాడు మూడవవాడైన జీవుడు మాత్రమే అగును. మొదటివాడు అన్నిటికీ కారణమైన పరమాత్మ (దేవుడు)కాగా, రెండవవాడు
3

Page 4
అన్నిటినీ అమలు చేయు చిత్రగుప్తునిగా ఉన్నాడు. వివరముగా చెప్పుకొంటే మొదటివాడు మూలపురుషుడైన యముడుకాగా,
శిక్షలను, అక్షలను అన్నిటినీ అమలు చేయువాడు చిత్రగుప్తుడనబడు రెండవవాడని చెప్పవచ్చును. ఇక మూడవవాడు
మనిషి శరీరములోపల ఉండి శిక్షలను నరకముగా, అక్షలను స్వర్గముగా అనుభవించువాడైన జీవుడని చెప్పవచ్చును.
విశ్వములో పురుషతత్త్వము కలవారు ముగ్గురు మాత్రమే కలరు. ఆ ముగ్గురిలో చివరి పురుషుడు లేక
మూడవ పురుషుడు జీవాత్మగా ఉన్నాడు. రెండవ పురుషుడు రహస్యముగా గుప్తాత్మగా ఉన్నాడు. ఇక మొదటి
పురుషుడే మూడవ పురుషునికంటే, రెండవ పురుషునికంటే ఉత్తముడైన పురుషోత్తమునిగా ఉన్నాడు. కావున ఆది
పురుషుడైన దేవున్ని పురుషోత్తమ అని కూడా అన్నాము. అక్షకు అర్థము చెప్పుకోవడానికి ముందు ఇవన్నీ చెప్పుకోవలసిన
అవసరమున్నది. ఈ ముగ్గురు పురుషులను విడదీసి చెప్పుచూ మేము "త్రైత సిద్ధాంతము”ను ప్రతిపాదించాము. త్రైత
సిద్ధాంత జ్ఞానము జ్ఞానములలోకెల్ల ఉత్తమమైన జ్ఞానమని గర్వముగా చెప్పుచున్నాను. ఇదే త్రైత సిద్ధాంతమును
ఇందుత్వమునకు మూల గ్రంథమైన భగవద్గీతలో చూస్తే, పురుషోత్తమప్రాప్తి యోగమున 16, 17, 18 శ్లోకములలో
ఇలా ఉన్నది.
16వ శ్లో॥
17వ శ్లో॥
18వ శ్లో॥
ద్వావిమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ |
II
క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః ।
యో లోకత్రయ మావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః ॥
యస్మాత్ క్షర మతీతోహ మక్షరాదపి చోత్తమః |
అతోస్మిలోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః ॥
16వ భావము :- లోకములో రెండు రకముల పురుషులున్నారు. వారినే క్షరుడు, అక్షరుడని చెప్పుచున్నాము. క్షరుడు
సర్వజీవ శరీరములలో కలడు. వానితో పాటు అక్షరుడు కూడా ఉన్నాడు.
17వ భావము :- పరమాత్మ అనబడు పురుషుడు కూడ వేరొకడు గలడు. వానినే ఉత్తమ పురుషుడు అని అనుచున్నాము.
ముల్లోకములను ఆవహించి వాటిని భరించు ఉత్తమ పురుషున్ని ఈశ్వరుడనుచున్నాము.
18వ భావము :- క్షరునికంటే అధికుడగుట వలన, అక్షరునికంటే ఉత్తముడగుట వలన, నన్నే లోకమున వేద
స్వరూపమైన లేక గుణ స్వరూపమైన ప్రకృతి పురుషోత్తమునిగా చెప్పుచున్నది.
ఈ మూడు శ్లోకములలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని ముగ్గురు పురుషులను గురించి చెప్పడము
జరిగినది. మొత్తము విశ్వములో ఈ ముగ్గురే పురుషులు కలరు. వీరి మినహా పురుషుడనేవాడే లేడు. ముగ్గురు
పురుషులలో క్షరుడు అనగా నాశనమగువాడని అర్థము. అక్షరుడనగా నాశనములేనివాడని అర్థము. ఇకపోతే వీరిద్దరికీ
పెద్ద మరియు ఉత్తముడైన వాడు పురుషోత్తమునిగా చెప్పబడుచూ, చావు పుట్టుకలు లేనివాడుగా ఉన్నాడు. పరమాత్మ
అనబడు దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉండడమే కాకుండా అందరి శరీరములలోనూ ఉన్నాడు. అందరికీ దేవుడనే
వాడు ఒకడున్నాడని తెలుసు. అయితే చాలామందికి తాను జీవున్నని తెలియదు. ఇకపోతే మధ్యలోనున్న అక్షరుడే
ఎవరికీ తెలియడు. అక్షరుడనబడేవాడే మనిషి చేయు కర్మలన్నిటిని లెక్కించి లిఖించువాడనీ, వాటిని తిరిగి అమలు
4

Page 5
పరుచువాడనీ ఎవరికీ తెలియదు. ప్రతి మనిషి శరీరములో జీవునితోపాటు ఉంటూ, ప్రతి కదలికను తానే కలుగజేస్తూ
శరీరములోపలి అవయవములనూ, బయటి అవయవములనూ నడిపి జీవుని చేత కర్మలను అనుభవింపజేయువాడు
రెండవవాడైన అక్షరుడే. ఇప్పుడు అక్షరుడు అను శబ్దము తెలిసిపోయింది. కావున అక్షకు కూడ అర్థమును సులభముగా
చెప్పుకోవచ్చును.
నీ శరీరములో నీవు శిక్షనుగానీ, అక్షనుగానీ అనుభవించు జీవునివి మాత్రమే. నీ శరీరమును కదిలించి రూప,
శబ్ద, స్పర్శ, రుచి, వాసన అను ఇంద్రియజ్ఞానములనిచ్చి, నీ చేత కష్టసుఖములు అనుభవించునట్లు చేయు అక్షరుడు నీ
శరీరములో నీ ప్రక్కనే ఉన్నా నీకు తెలియదు. అట్లే ఈ ప్రపంచములో ఎవరికీ తెలియదు. ప్రస్తుత కాలములో రెండవ
పురుషుని గుర్తింపేలేదు. తాను జీవుడనను విషయమునే భూమిమీద 95 శాతము ప్రజలు మరచిపోయారు. ఐదు
శాతము మంది నాస్తికులైపోయి, ఆది పురుషుడైన దేవున్నే లేడంటున్నారు. ఇతర మతముల పేర్లు పెట్టుకొన్న వారికి
పురుషుల జ్ఞానమే తెలియదు. తన శరీరములో తనకూ, తన శరీరమునకూ అధిపతియైన వాడొకడున్నాడనీ, తన
శరీరము మీద తనకు ఏ అధికారమూలేదనీ, తన శరీరమును తనలోనే తనకు పొరుగువాడిగా ఉన్న అక్షరుడు
నడిపిస్తున్నాడనీ, తనకు శరీరము మీద ఏ అధికారమూ లేదనీ, అందువలననే తనకు చెప్పకుండానే శరీరములోనికి
రోగములు వస్తున్నవనీ ఎవరూ గ్రహించలేక పోవుచున్నారు. ఎవరూ గుర్తించనట్లు శరీరములో అక్షరుడనబడు
రెండవవాడున్నాడు.
శరీరములో రహస్యముగా ఎవరూ గుర్తించలేనట్లున్న అక్షరున్ని గుప్తుడు అన్నారు. గుప్తుడు అనగా తెలియకుండ
దాగి ఉన్నవాడని అర్థము. శరీరములో ప్రత్యక్షముగా పనులు చేయుచున్నా, ప్రతి కదలికకు కారణమైవున్నా, మాయ
అను ముసుగును కప్పి ప్రత్యక్షముగా ప్రక్కనే ఉన్నా తెలియకుండా ఉండడము పెద్ద చిత్రము. ఆలోచిస్తే చిత్రముగా
తెలియబడువాడు అక్షరుడు. కావున రెండవ వానిని చిత్రగుప్తుడు అన్నారు. మన శరీరములో విచిత్రముగా, రహస్యముగా
ఉన్నాడు కావున చిత్రగుప్తుడు అనవలసి వచ్చినది. క్షరుడు మూడవవాడైన జీవాత్మకాగా, అక్షరుడు రెండవ వాడైన ఆత్మ
లేక చిత్రగుప్తుడు. ఆది పురుషుడైన పరమాత్మ మూలపురుషుడైన దేవుడు. దేవుడు పనిచేయనివాడు అందువలన
క్రియారహితుడని ఆయనను అనుచున్నాము. ఇకపోతే జీవుడు శరీరములోపల చిన్న కేంద్రములో ఉండి, ఏమీ చేయలేక
తన వరకు వచ్చినవాటిని మాత్రమే అనుభవించుచున్నాడు. శరీరములోపలనున్న జీవుడు కూడా క్రియలను ఆచరించువాడు
కాడు. అయితే ఈ మాట చాలామందికి అసత్యముగా, ఆశ్చర్యముగా కనిపించినా, జీవుడు అనుభవించు పని తప్ప ఏ
పనినీ చేయడనుట సంపూర్ణమైన సత్యము. పూర్తి ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ సువిశాల విశ్వములో సర్వజీవుల
శరీరములనూ ఆడించి నడిపించువాడు ఒకే ఒక ఆత్మ. అదియే అక్షరాత్మయై చిత్రగుప్తునిగా ఎవరికీ తెలియకుండా
ఉన్నది.
ఒక శరీరములోనున్న ఆత్మ మరొక శరీరమును హత్య చేయుచున్నది. ఒక శరీరమును బలవంతునిగా చేసి
శక్తినిచ్చి కొట్టుచున్నది. మరొక శరీరమును బలహీనునిగా చేసి దెబ్బలు తినునట్లు చేయుచున్నది. ఈ విధముగా
అందరి శరీరములలోనున్న ఆత్మ, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా నడుపుచూ చిత్ర విచిత్రములు చేయుచున్నది. అయితే
ఈ ఆత్మ విషయము తెలియనివారు అందరూ తామే అన్ని పనులూ చేయుచున్నట్లు భ్రమించుచున్నారు. అదియే పెద్ద
అజ్ఞానమై, తమ భావముల చేతనే పాపపుణ్యములు ఏర్పడుచున్నవని తెలియలేక పోవుచున్నారు. అందువలననే హత్య
చేసినది ఆత్మయితే, హత్యా పాపమును అనుభవించునది జీవాత్మగా ఉన్నది. అలాగే కొన్ని మంచి పనులను చేసినది
5

Page 6
ఆత్మే అయినా జీవాత్మ తానే చేశానని అనుకోవడము వలన దానికి ప్రతిఫలితముగా పుణ్యము వచ్చుచున్నది. జీవుడు
తాను చేయని పనులను అజ్ఞానము వలన అహము చేత నేనే చేశానని అనుకోవడము వలన వచ్చిన పాపములను
శిక్షగా, అలాగే వచ్చిన పుణ్యమును అక్షగా అనుభవించుచున్నాడు. తనపాలిట వచ్చిన పాపమునుగానీ, పుణ్యమునుగానీ
అనుభవించకుండా తప్పించుకోవాలని ఎందరు ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎంతమంది దేవతలకు మ్రొక్కినా, నీ
పొరుగుననే నీ శరీరములోనున్న ఆత్మయిన చిత్రగుప్తుడు ఏమాత్రము వదలకుండా అనుభవించునట్లు చేయును. ఎవడు
ఏ విధముగా శిక్షను అనుభవించునది అనుభవించేంతవరకు ఎవనికీ తెలియదు. అలాగే ఎవడు ఏ విధముగా ఎంత
అక్షను అనుభవించేది అనుభవించేంతవరకు ఎవరికీ తెలియదు.
ఒక కార్యము జరుగుటకు కర్మ కారణమై ఉండును. కార్యము జరిగితే కారణమైన కర్మ (పాపముగానీ లేక
పుణ్యముగానీ) తీరిపోవును. కార్యము జరిగినప్పుడు ఆ కార్యములోని పాపపుణ్యములు క్రొత్తగా వచ్చినప్పటికీ, అవి
ఆత్మను అంటవు. కార్యము చేసినది చిత్రగుప్తుడైన ఆత్మే కావున ఆ కార్యములో వచ్చు ఫలితమైన కర్మ ఆత్మను
చేరవలసియుండినా, అది ఆత్మను చేరలేదు. అగ్నిలోనికి వచ్చిపడిన ఏ మిడతగానీ, ఏ పురుగుగానీ, ఏ కట్టెగానీ
కాలిపోకతప్పదు. అదే విధముగా రెండవ పురుషుడైన ఆత్మ శరీరమునకు అధిపతియై, శరీరమంతా వ్యాపించియుండి,
శరీరము చేత చేయించిన పనిలో తయారై వచ్చిన ఏ పాపముగానీ, ఏ పుణ్యముగానీ, ఎంత పెద్ద కర్మగానీ ఆత్మను
అంటదు. మూడవవాడైన జీవాత్మ శరీరములో లోపల ఒక్కచోట ఉన్నా, అది ఏ పనీ చేయలేదు, కావున జీవున్ని కూడా
కర్మ అంటుటకు వీలులేదు. అయితే జీవుడు తాను చేయని పనిని తాను చేసినట్లు అనుకోవడము వలన కార్యములో
తయారైన కర్మ వచ్చి జీవున్ని చేరుచున్నది. ఈ విధముగా ప్రపంచములో శరీరమును ధరించి పుట్టిన జీవుడు తాను
చేయని కార్యమునకు కర్మబద్ధుడగుచున్నాడు.
జీవున్ని అంటుకొనియున్న కర్మను రెండవవాడూ మరియు శరీరములో జీవునికి పొరుగువాడైన ఆత్మ, జీవుని
కర్మకు తగిన కార్యములను చేసి, ఆ కార్యములలోని కష్ట సుఖములను జీవుని చేత అనుభవింప చేయుచున్నది. తనకు
సంబంధము లేకున్నా, తాను చేయకున్నా జీవాత్మ అనవసరముగా కర్మను తన నెత్తిన వేసుకొని తిరిగి పుట్టి అనుభవించు
చున్నది. జీవుడు శరీరములోని “అహము” అను భాగము యొక్క మాటవిని, తాను అహం భావమును పొంది చేయని
కార్యములకు కర్మను మూట గట్టుకొనుట వలన, జీవుడే కర్మను అనుభవించవలసి వచ్చినది. అనుభవించువాడు
జీవుడు అయితే, అనుభవింప చేయువాడు చిత్రగుప్త బిరుదాంకితుడైన ఆత్మని తెలిసి పోయినది. మనిషిని నడిపించి
ఆడించి జీవున్ని అనుభవింపజేయువాడు ఆత్మయితే, శరీరములోపల కూడా దేవుడు ఉంటూ సాక్షిగా ఉన్నాడు.
నడిపించబడువాడు లేక ఆడించబడువాడు లేక తోలబడువాడు జీవాత్మయితే నడిపించువాడు, ఆడించువాడు, తోలువాడు
రెండవవాడైన ఆత్మగా ఉండగా పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. దీనినే లేక ఈ విషయమునే "త్రైత సిద్ధాంతము”
అంటున్నాము. మూడు ఆత్మల ఈ త్రైత సిద్ధాంతము భగవద్గీతలోను, బైబిలులోనూ, ఖుర్ఆన్ గ్రంథములలోనూ
తెలుపబడినది. అయినా మతాల మత్తున్న వారికి ఈ మూడు ఆత్మల విషయము ఏమాత్రము తెలియకుండా పోయినది.
కావున తిరిగి మేము ఇప్పుడు జ్ఞాపకము చేయవలసి వచ్చినది. ఉదాహరణకు ఖుర్ఆన్ గ్రంథములో మూడు ఆత్మల
విషయము 'ఖాఫ్' అనబడు 50వ సురాలో 21వ ఆయత్నందు ఇలా కలదు.
1) “దివ్య ఖుర్ఆన్” గ్రంథములో 50-21 :- “ప్రతి వ్యక్తీ తనవెంట ఒక తోలేవాడూ, ఒక సాక్ష్యము
చెప్పేవాడూ ఉన్న స్థితిలో వస్తాడు.” అని వ్రాయబడినది.
6

Page 7
2) "అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్" అనుదానియందు 50-21 :- "ప్రతి వ్యక్తి తనవెంట తనను
తీసుకొచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు." అని వ్రాయబడియున్నది.
3) “దివ్య ఖుర్ఆన్ సందేశం" అను గ్రంథములో 50-21:- "ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో,
మరియొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది.” అని వ్రాయబడియున్నది.
4)
“ఖురాన్ మజీద్” అను గ్రంథములో 50-21 :- "ప్రతి మానవుడూ వచ్చును. అతని వెంట నొకడు
తీసుకొని వచ్చువాడునూ, మరొకడు సాక్షియునుందురు.” అని వ్రాయబడియున్నది.
శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎలా సంస్కృత భాషలో శ్లోకముల రూపముగా వ్రాయబడినదో, అలాగే జిబ్రయేల్
చెప్పిన ఖుర్ఆన్ గ్రంథము అరబ్బీ భాషలో వాక్యముల రూపముగా వ్రాయబడినది. అరబ్బీ వాక్యములను తెలుగులోనికి
అనువదించిన వారు కొన్ని పదముల మార్పుతో వ్రాసినా, భావము మాత్రము ఒక్కటిగానే ఉన్నట్లు తెలియుచున్నది.
భగవద్గీత మూల గ్రంథము సంస్కృత భాషలో ఉండుట వలన గీతలోని సంస్కృత శ్లోకమును చెప్పి, దాని వివరమును
తెలుగులో చెప్పినట్లు, ఖుర్ఆన్ గ్రంథములో కూడా ముందు అరబ్బీ భాషలోని వాక్యమును (ఆయత్ను) చెప్పి దాని
వివరము చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మనకు కావలసినది దైవజ్ఞానము, కావున భాషకంటే భావము ముఖ్యము.
అరబ్బీ భాషను తెలిసినవారు కొందరు ఖురాన్ జ్ఞానులు తెలుగులో భావమును వ్రాయడము జరిగినది. నలుగురు
ముస్లీమ్ పండితులు వ్రాసిన నాలుగు ఖుర్ఆన్ గ్రంథములను చూచాము. అందరి భావము ఒక్కటిగానే ఉన్నదానివలన,
ఖుర్ఆన్ వాక్యము యొక్క నిజ భావము మనకు తెలిసినట్లే అయినది. ఖుర్ఆన్దాయందు అరబ్బీ భాషలో 50-21 ఇలా
ఉన్నది. “వ-జాఅత్ కుల్లు-నఫ్సిమ్ -మఅహా-సా ఇఖున్. వ షహీద్.”
ఖుర్ఆన్ గ్రంథములో చెప్పినట్లు సాక్షిగాయున్నవాడు దేవుడైతే, నిన్ను తోలేవాడు లేక తనను తీసుకొచ్చేవాడు
అని చెప్పబడినవాడు చిత్ర గుప్తమైన ఆత్మగాయున్నది. నిన్ను తోలేవాడు ఆత్మయితే నీవు జీవాత్మగా యున్నావు. జీవాత్మ
అనబడువాడు తాను స్వయముగా ఏమీ చేయలేడు. తీసుకురాబడేవాడుగా, తోలబడేవాడుగా ఉన్నాడు. దీనినిబట్టి పని
చేసేవాడు ఆత్మయనీ, సాక్షిగా చూచేవాడు దేవుడనీ, అనుభవించేవాడు జీవాత్మయనీ తెలిసిపోయినది. శరీరములో
జీవుడు విషయ సుఖములను అనుభవించుచున్నాడనీ, ఆత్మ శరీర భాగములకు శక్తినిచ్చి నడిపించుచు జీవున్ని
అనుభవింపజేయుచున్నదనీ, జ్ఞానదృష్టి గలవారికి మాత్రమే తెలియునని భగవద్గీతయందు పురుషోత్తమప్రాప్తి యోగమున
9,10 శ్లోకములలో ఈ విధముగా భగవంతుడు చెప్పుచున్నాడు చూడండి.
9వ శ్లో॥ :
శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవచ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయా నుపసేవతే ॥
10వ శ్లో॥ :
ఉత్రామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ॥
9వ భావము :- శబ్దమును అందించు చెవిని, చూపునందించు కన్నును, స్పర్శనందించు చర్మమును, రుచిని అందించు
నాలుకను, వాసనను అందించు ముక్కును మరియు మనస్సును జీవాత్మ అధిష్ఠించియుండి ఎల్లప్పుడు విషయ
అనుభవములనబడు సుఖదుఃఖములను అనుభవించుచున్నాడు.
7

Page 8
10వ భావము :- జీవాత్మ శరీరమును ధరించి, లోపల గుణములతో కూడుకొనియుండి బయటినుండి వచ్చు విషయ
సుఖములను లేక విషయ దుఃఖములను అనుభవించుచుండును. ఆత్మల జ్ఞానములేని మూఢులకు ఈ విధానము
కనిపించదు. జ్ఞాననేత్రము కల్గినవారికి మాత్రము శరీరములో జీవుడు ఉన్న స్థితి తెలియుచున్నది.
ఇక్కడ విశేషమేమంటే శరీరములోనున్న కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుకకు శక్తినిచ్చి నడిపించువాడు
గుప్తముగా శరీరమంతా వ్యాపించియున్న ఆత్మ. గుప్తమైనవాడు శరీర అవయవములను నడుపుచూ వాటిద్వారా
లోపలనున్న జీవున్ని కష్టసుఖములనుభవించునట్లు చేయుచున్నాడు. ఆత్మ నడిపించు ఇంద్రియముల ద్వారా జీవుడు
అనుభవములను పొందుచున్నాడను విషయము జ్ఞానదృష్ఠియున్న వారికి మాత్రమే తెలియును, జ్ఞానదృష్టిలేని వారికి
ఏమాత్రము తెలియదని స్పష్టముగా గీతలో చెప్పబడినది. అంతేకాక అందరినీ ఆడించు ఆత్మ శరీరములో ఉన్న
విషయము ప్రయత్నము చేయు యోగులకు మాత్రమే తెలియుననీ, యోగులు గాని వారికి, ప్రకృతి దృష్ఠి కల్గినవారికీ
ఆత్మ తెలియదనీ, అదే అధ్యాయములో 11వ శ్లోకమున కలదు చూడండి.
11వ శ్లో॥
యతన్తో యోగిన శ్చైనం పశ్యన్త్యాత్మ వ్యవస్థితమ్ |
యతన్తో ప్యకృతాత్మానో నైనం పశ్యన్య చేతసః ॥
భావము :- ప్రయత్నము చేయు యోగులు మాత్రము ఆత్మ శరీరమంతా ఏ విధముగా ఆవహించియున్నది తెలియగలరు.
ప్రకృతి జ్ఞానమును తెలిసినవారికి స్థూలము తప్ప సూక్ష్మమైన ఆత్మ తెలియబడదు.
వస్త్రము ధరించిన మనిషి వస్త్రము నేను కాదు, నేను వస్త్రములోపలయున్నానని జ్ఞప్తి కల్గియుండును. ధరించిన
వస్త్రమును కూడా నేనే అని తెలివి తక్కువవాడు కూడా అనుకోడు. అయితే జీవుడు శరీరమును వస్త్రమువలె
ధరించియుండి, శరీరము వేరు నేను వేరను జ్ఞప్తిలేక, శరీరమును చూచుకొని శరీరమును నేనే అనుకొనుచున్నాడు.
శరీరమునే తానుగా అనుకొన్నవాడు శరీరము ద్వారా జరుగు పనులన్నీ తానే చేయుచున్నానని అనుకోవడము
జరుగుచున్నది. జీవుడు ఏ విధముగా అనుకొనినా, శరీరము ద్వారా జరుగు పనుల వలననే జీవుడు దుఃఖములను
పొందుచున్నాడు. శరీరములోని బుద్ధి తాను కాకున్నా తనను గొప్ప ప్రతిభావంతునిగా చెప్పుకొనుచుండును. అయినా
తన బుద్ధి చేతనే కష్టములు కూడ ఎందుకు వస్తున్నవని తెలియలేక పోవుచున్నాడు. శరీరములో నివసించు జీవునికి
తెలియకుండానే శరీరములోని ఆత్మే జీవున్ని కష్టసుఖములపాలు చేయుచున్నది. జీవుడు తన శరీరములోనే అనుభవించు
కష్టములను శిక్ష అనుచున్నామనీ, అలాగే జీవుడు అనుభవించు సుఖములను అక్ష అనుచున్నామనీ చెప్పుకొన్నాము.
మీరు మొదటనే అక్ష అనగా ఏమి? అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇప్పుడు రాబోతుంది చూడండి.
కష్టమును సూచించు శిక్షలోగానీ, సుఖమును సూచించు అక్షలో గానీ రెండు పదములలో "క్ష" అను శబ్దము
కలదు. “క్ష” అనగా నాశనమని, క్షీణించి పోవడమని అర్థముగలదు. "శి" అనగా అడ్డులేకుండా లేక శీఘ్రముగా అని
అర్థము. తొందరగా నాశనము చెందడమును, ఆటంకము లేకుండా బలహీనపడిపోవడమును శిక్ష అంటున్నాము.
అలాగే అక్ష అను పదములో 'అ' కారము అడ్డుకలిగించునది లేక నివారించునది అని అర్థము నిచ్చుచున్నది. అశ్రద్ధ
అను పదమును తీసుకొని చూస్తే శ్రద్ధ లేకుండాపోవడము అని చెప్పవచ్చును. వివేకమునకు “అ” అను శబ్దమును
చేర్చితే అవివేకమగును ఉన్న వివేకము క్షీణించి పోయినదనీ లేకుండా పోయినదని తెలియుచున్నది. అలాగే “క్ష” అను
శబ్దమునకు “అ” అను శబ్దమును చేర్చితే నాశనము లేదని, బలహీనత లేదని తెలియుచున్నది. నాశనములోనూ,
8

Page 9
బలహీనతలోనూ జీవుడు బాధపడుచున్నాడు. అందువలన ఆటంకములేని లేక తొందరగా పొందు బాధను శిక్ష అని
పెద్దలు చెప్పారు. అలాగే బలహీనతను లేకుండా నాశనము లేకుండా ఉన్నప్పుడు పొందు సుఖమును అక్ష అని చెప్పడము
జరిగినది.
శరీరములో జీవుడు పొందు దుఃఖమును శిక్ష అనియూ, అలాగే జీవుడు పొందు సుఖమును లేక సంతోషమును
అక్ష అనియూ అంటున్నాము కదా! ఒక జీవుడు పొందు శిక్షలు, అక్షలు ప్రకృతి మార్గములోనివీ, దైవమార్గములోనివీ
అని రెండు రకములుగలవు. ప్రకృతి మార్గములో ప్రతి మనిషి శిక్ష అక్షలను అనుభవిస్తున్నాడు. అవి పాపపుణ్యములనబడు
కర్మ మూలముగా వచ్చుచున్నవనీ, వాటిని విధిగా అనుభవింపజేయువాడు ఆత్మని తెలుసుకొన్నాము. దైవమార్గములో
శిక్ష అక్షలున్నా, వాటిని కూడా విధించువాడు ఆత్మే అయినా, అవి కర్మనుబట్టి ఉండవు. బయట కోర్టులో శిక్షలు
చట్టమునుబట్టియుంటే, ప్రకృతి జనిత శరీరములోని శిక్షలు కర్మను బట్టియుంటే, దైవమార్గములోని శిక్షలు ధర్మాధర్మములను
బట్టియుండును. ఇక్కడ కొంత వివరముగా అర్థము చేసుకోవలసినదేమనగా! మనిషి చేత చేయబడు పనిగానీ, మాట్లాడు
మాటలుగానీ, బుద్ధిచేత చెప్పబడు సిద్ధాంతములుగానీ, ఆలోచనలుగానీ ప్రతిభలుగానీ అన్నీ ఆత్మవలననే కలుగుచున్నవి.
జీవుని ఇచ్చను అనుసరించి ఏదీ ఉండదు. అన్నీ ఆత్మ వలననే జరుగుచుండును. మనిషి తన అజ్ఞానముచేత ఆత్మ
చేయు అన్ని పనులనూ తానే చేయుచున్నానని భ్రమించినా, భ్రమించకపోయినా ఆత్మే సర్వమునూ చేయుచున్నది. ఏ
పనీ జీవుడు చేయుటకు హక్కుగానీ, అవకాశముగానీ లేదు. అన్నీ కర్మననుసరించి ఆత్మ శరీరము చేత చేయించు
చుండును.
అయితే దైవమార్గములో మాత్రము ఏ జీవునికి కర్మ ఉండదు. దైవమార్గములో కర్మను అనుసరించే పనులు
జరుగుననుట ఏమాత్రమూ లేదు. ప్రకృతి మార్గములో కార్యముల విషయములో ఏ హక్కూలేని జీవునికి, దైవమార్గములో
సంపూర్ణమైన స్వాతంత్ర్యము కలదు. జీవుడు దైవ మార్గములో తన ఇష్టప్రకారము చేయుటకు పూర్తి హక్కు కలిగియున్నాడు.
దైవమార్గములోని పనులన్నీ జీవుని ఇష్టము మీద ఆధారపడియుండును. ప్రపంచ విషయములలో జీవునికి ఏ విధముగా
అస్వతంత్రత కలదో, అట్లే దైవ మార్గములో జీవునికి పూర్తి స్వతంత్రత కలదని చెప్పవచ్చును. ప్రపంచ సంబంధమైన
పనులన్ని కర్మాధీనము ప్రకారముండగా, దైవసంబంధ పనులన్ని ఏమాత్రము కర్మకు సంబంధము లేకుండా అంతా
జీవుని ఇష్టము ప్రకారము జరుగును. దైవ సంబంధ కార్యములు జీవునికి జన్మ హక్కుగా ఉన్నవి. అయితే అవి జీవుని
ఇష్టము మీద ఆధారపడియుండును. దైవమార్గములో ఇష్టమున్నవాడు తన ఇష్టప్రకారము ఎంతయినా సాధించగలడు.
ఎంతటి జ్ఞానమునైనా పొందగలడు. ప్రతి మనిషికి దైవమార్గములో ఎంతయినా ముందుకు పోవు అవకాశముండినా,
జీవునికి ఇష్టము లేని దానివలన దైవమార్గములో ప్రయాణించలేక పోవుచున్నాడు. కొందరికి దైవమార్గములో ఇష్టమున్నా
అది అంతంతమాత్రముగానే ఉన్నది. కావున వారికి జ్ఞానము అంతంతే లభించుచున్నది. ఇష్టమునే శ్రద్ధ అని కూడా
అంటాము. మనిషికున్న శ్రద్ధనుబట్టి జ్ఞానము లభించుచున్నది. ఎంత శ్రద్ధవున్నవారికి అంత లభించుచున్నది.
అందువలననే గీతలో జ్ఞాన యోగమందు 39వ శ్లోకమున "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెప్పియున్నారు. కర్మవాన్
లభతే కార్యమ్ అన్నట్లు కర్మనుబట్టి కార్యములు జరుగును, మనిషి శ్రద్ధనుబట్టి జరుగవు.
మనిషి కర్మనుబట్టి జరుగు కార్యములలో శిక్ష అక్ష రెండూ ఉన్నట్లు, మనిషి (జీవుని) యొక్క శ్రద్ధనుబట్టి జరుగు
జ్ఞానములో కూడా శిక్ష అక్షలు రెండూ ఉన్నవి. వీటిని కూడా దేవుడు నిర్ణయించినట్లు ఆత్మ చేయుచున్నది. ప్రపంచ
విషయములోగానీ, పరమాత్మ విషయములో గానీ జీవుడు కార్యరూపముగా ఏమీ చేయకున్నా, రెండు మార్గములలోనూ
9

Page 10
కార్యరూపముగా చేయునది ఆత్మేనని తెలియాలి. శరీరమును ఏ మార్గములో నడుపవలసివచ్చినా, శరీరమునకు
అధిపతియైన ఆత్మ నడుపవలసిందేగానీ జీవుడుగానీ, దేవుడుగానీ శరీరమును నడుపరు. జీవుడు కూడా దేవునివలె ఏ
కార్యమును చేయకుండా శరీరములో తనవరకు వచ్చిన అనుభవములను మాత్రము పొందుచున్నాడు. ఇటు జీవుడుగానీ,
అటు దేవుడుగానీ చేయని కార్యములన్నిటినీ, మధ్యలోనున్న ఆత్మ ఒక్క క్షణము కూడా ఊరక ఉండక ఎల్లప్పుడు
చేయుచునే ఉన్నది. ఒక సైంటిస్టు ఒక కొత్త సూత్రము ప్రకారము ఒక క్రొత్త ఔషధమును కనుగొనినా, క్రొత్త పరికరమును
కనుగొనినా అదంతయు అక్షరాలా ఆత్మే చేస్తున్నా నేను కనుగొన్నానని వాడు (జీవుడు) అనుకొనును. ఫలానావాడు
కనుగొన్నాడని ప్రక్కవారందరూ అనుకొంటారు. వాస్తవానికి అందరిదీ పొరపాటే.
ప్రపంచ కార్యములలో పండితుని దగ్గరనుండి పామరుని వరకూ, పారిశ్రామికవేత్తనుండి పనివాని వరకూ,
మేధావి నుండి సామాన్యుని వరకూ, సైంటిస్టు నుండి మతిలేని శాడిష్టు వరకూ, రాజునుండి పేదవాని వరకూ ప్రపంచ
సంబంధముగా ఆత్మే అహర్నిశలు అన్ని పనులు చేయుచున్నది కదా! అదే విధముగా దైవమార్గములో గొప్ప జ్ఞాని
నుండి చిన్న జ్ఞాని వరకు ఆత్మే అందరినీ నడుపుచున్నది. ఎవరి శ్రద్ధనుబట్టి వానికి జ్ఞానము అర్థమగునట్లు ఆత్మే
చేయుచున్నది. జ్ఞానమార్గములో ఎవరిని ఎంత స్థాయికి తీసుకపోవాలో అంతస్థాయికి తీసుకొని పోవునది ఆత్మేనని
మరువకూడదు.
అలాగే దైవమార్గములో తప్పుకు తగిన శిక్ష, ఒప్పుకు తగిన అక్షను అమలు చేయువాడు కూడా
ఆత్మేనని తెలియవలెను. ప్రపంచ విధానములోగానీ, పరమాత్మ విధానములోగానీ ఆత్మ చేయని పనంటూ ఏదీ లేదు.
దీనినిబట్టి చూస్తే తీర్పులలో కూడా ప్రకృతి తీర్పు, పరమాత్మ తీర్పని రెండు రకములుగా విభజించుకొని
చూడవచ్చును. ప్రకృతి తీర్పు శరీరము మీద పడుతుంది, దానివలన స్వర్గ, నరకములనువాటిని కష్ట సుఖ రూపములలో
అనుభవించవలసి వస్తుంది. పరమాత్మ తీర్పు అనునది సూక్ష్మరూపమైన జీవుని మీద పడుతుంది, దానివలన జన్మ,
మోక్షములను పొందవలసి వస్తుంది. ప్రపంచ సంబంధ తీర్పులోని శిక్షకంటే, పరమాత్మ తీర్పులోని జన్మలు భయంకర
మైనవని చెప్పవచ్చును. ప్రపంచ సంబంధ తీర్పులో వచ్చు పాపము మరుజన్మలో శిక్షగా అనుభవించవచ్చును. అయితే
పరమాత్మ తీర్పులో వచ్చు జన్మలు ఒక్క జన్మతో అయిపోవు, యుగముల పర్యంతము ఉండును. అందువలన పరమాత్మ
తీర్పు చాలా భయంకర మైనది. పరమాత్మ తీర్పులో వచ్చు అక్ష వస్తే అది జన్మలు లేకుండా మోక్షమును కలుగజేయును.
శిక్ష వస్తే జన్మ పరంపరలో మానవుడు (జీవుడు) చిక్కుకొనును. చాలామందికి శిక్ష అను పదము సుపరిచయమే, కానీ
అక్ష అను పదము అందరికీ బహుశా తెలియదనియే చెప్పవచ్చును. కొంత ఆలోచించి చూస్తే అక్ష అనునది పూర్వము
మనుషుల మధ్యలో ఉన్న పదమే. పూర్వము అక్ష అని పిలువబడు పదము నేడు మోక్షముగా పిలువబడుచున్నది.
పూర్వము “అక్ష” గా నున్న పదము కాలక్రమమున “మోక్ష” అను పదముగా మారిపోయినది. “క్ష” ముందర “అ”
పోయి “మో” రావడము జరిగినది. తర్వాత కొంత కాలమునకు మోక్ష అను శబ్దము మోక్షముగా చెప్పబడుచున్నది.
పూర్వము అక్ష అను పదమును ప్రపంచ సంబంధ కష్టములు తొలగిపోయినప్పుడు కూడా వాడెడివారు. నేడు కూడా
ప్రపంచ కష్టాలనుండి బయటపడినప్పుడు, కష్టాలనుండి మోక్షము లభించింది అనడము జరుగుచున్నది. కాలగమనములో
‘అ’ ‘మో’ గా మారినా పదములో ముఖ్యమైన అర్థము కల్గియున్న “క్ష” మాత్రము మారలేదు.
తీర్పులో శిక్ష ఉండవచ్చును. అలాగే అక్ష (మోక్ష) ఉండవచ్చును. తీర్పు ప్రపంచ సంబంధమైనది కావచ్చు లేక
పరమాత్మ సంబంధమైనదీ కావచ్చును. రెండు విధముల తీర్పులను ముందే దేవుడు నిర్ణయించి ఉండగా దానినే ఆత్మ
అమలు జరుపుచున్నది. ఆత్మ అమలు జరిపినా మొదటికది దేవుని తీర్పనియే చెప్పవచ్చును. మనిషికి సంభవించు
10

Page 11
ప్రపంచ సంబంధ కష్టసుఖములుగానీ, జన్మ మోక్షములుగానీ ఏదైనా దేవునికి తెలియకుండ జరుగవు. ఏదైన దేవుని
తీర్పును అనుసరించే ఉండునని జ్ఞాపకముంచుకోవలెను. దేవుని తీర్పు ఎలాగుండునో ముందుగా ఎవరికీ తెలియదు.
అయితే ఎవనికి ఏ తీర్పు తీర్చబడినదో, ఎవడు ఏమి అనుభవించునో అన్నీ దేవునికి ముందే తెలుసు. ఇదే విషయమును
గురించి భగవద్గీతయందు విజ్ఞానయోగములో 26వ శ్లోకమున ఇలా చెప్పబడినది చూడండి.
26వ శ్లో॥
వే దాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన ॥
భావము :- సర్వ జీవరాసులకు జగతిలో జరిగినవి, జరుగుచున్నవి, భవిష్యత్తులో జరుగబోవు విషయములన్నీ నాకు
తెలుసు. అయితే అందరి భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన నేను ఎవరికీ తెలియబడలేదు.
అందరూ దేవునికి తెలుసు, కానీ దేవుడు ఎవరికీ తెలియడు. దేవుడు పురుషుడుకాగా, ఆత్మ, జీవాత్మలు కూడా
పురుషులుగానే ఉన్నారు. రెండవ పురుషుడైన ఆత్మ శరీరములో అన్ని కార్యములూ చేయుచున్ననూ, ఆత్మ ఏ కార్యమునకూ
కర్త కాదు. కర్మప్రకారము నిమిత్తమాత్రముగా ఆత్మ పని చేయుచున్నది. అందువలన ఆత్మను కర్తకాదన్నాము.
అన్నిటికీ కారణకర్తగా మూలపురుషుడైన దేవుడున్నా, ప్రస్తుతము ఆయన స్థబ్ధునిగా ఉన్నాడు. ఆత్మ శరీరములో
మాత్రము విధిని అనుసరించి చేయుచున్నది. శరీరముల బయట అనంత విశ్వములోనూ, శరీరములోపలనూ కార్యము
లన్నిటికీ కర్తయై కార్యములను చేయించునది ప్రకృతియని చెప్పవచ్చును. దేవుని తర్వాత దేవునంతటి శక్తి కలది
ప్రకృతి. ప్రకృతిని అనుసరించియే ఆత్మ కూడా పని చేయుచుండుట వలన, ప్రస్తుత కర్తగానున్నది ప్రకృతియని
చెప్పవచ్చును. ఇదే విషయమునే భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగమందు 30వ శ్లోకమున ఇట్లు చెప్పారు చూడండి.
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
30వ శ్లో॥
యః పశ్యతి తథాత్మాన మకర్తారం స పశ్యతి ॥
భావము :- సర్వ కార్యములు ప్రకృతి చేత చేయబడుచున్నవని ఎవడు తెలియునో, వాడు ఏ కార్యమునకు కర్త ఆత్మకాదని
తెలిసియుండును. అలా తెలిసిన వానిని నిజమైన జ్ఞానదృష్టి కలవాడని చెప్పవచ్చును.
శరీరములోపల ఆత్మ అన్నీ చేయుచున్నా, శరీరము బయట విశ్వమంతా ప్రకృతి ఆవహించియుండి ఎండ,
గాలి, వాన, మంచుగా ఉంటూ, భూకంపములు, సునామీలు, టోర్నడోలు (సుడిమేఘములు) తుఫాను మేఘములు
(క్యుములోనింబస్ మేఘములు) గా ఉంటూ బయట కార్యములన్నిటినీ ప్రకృతి చేయుచున్నది. విశ్వములోని ప్రకృతి
స్వతంత్రము కలదిగా ఉన్నది. ఆత్మ శరీరములో శరీరమునకు అధిపతిగా ఉంటూ మనిషి కర్మను అనుసరించి మనిషి
చేత పనిని చేయించుచుండును. ఆత్మ తన ఇష్టము ప్రకారము నడుచుకొనక, కర్మనుబట్టి మనిషిని నడిపించుట వలన
ఆత్మ స్వయముగా కర్తకాదు. అంతేకాక మనిషికి (జీవునికి) ఉన్న పాపము లేక పుణ్యము ప్రకారము నడిపించుటే
ఆత్మయొక్క పనిగా ఉన్నది. అంతేగానీ ఎవని పాపమునుగానీ, ఎవని పుణ్యమునుగానీ ఆత్మ తొలగించదు. అంతేకాక
కర్మలనుగానీ, కార్యములను చేయవలెనను ఆశను గానీ, కార్యమునకు నేనే కర్తనను భావమునుగానీ ఆత్మ కలుగజేయదు.
జీవుని స్వంత భావము వలననే అవన్నియు జీవునికి కల్గుచున్నవి. ఇదే విషయమునే భగవద్గీతలో కర్మ సన్యాస
యోగము అను అధ్యాయమున 14,15 శ్లోకములలో ఇలా చెప్పారు చూడండి.
11

Page 12
14వ శ్లో॥
15వ శ్లో॥
3
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ॥
నా దత్తే కస్యచి త్పాపం నచైవ సుకృతం విభుః |
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః ॥
14వ భావము :- పాపపుణ్యములను కర్మలనుగానీ, జరిగిన పనిలో నేనే కర్తనను భావమునుగానీ, కర్మ ఫలములందు
ఆసక్తిని గానీ ఆత్మ కలుగజేయదు. అవన్నియు జీవుని స్వంత భావము (ఇష్టము) చేత వచ్చును.
15వ భావము :- శరీరమునకు అధిపతిగాయున్న ఆత్మ ఎవని పాపమును గానీ, ఎవని పుణ్యమునుగానీ తొలగించదు.
ఆత్మజ్ఞానమంతయు అజ్ఞానము చేత కప్పబడియున్నది. అందువలన ఆత్మ విషయము ఎవరికీ తెలియకున్నది.
జీవునియొక్క శరీరమంతయు ప్రకృతిచేత తయారు చేయబడివున్నది. పంచ భూతములుగాయున్న ప్రకృతి 25
భాగములుగా విడిపోయి 25 శరీర భాగములుగా మరియు వాటికి అనుబంధ అవయవములుగా తయారైనది. ప్రకృతి
చేత తయారైన శరీరములో ప్రకృతి భాగములకు శక్తినిచ్చి నడిపించునది ఆత్మ. ప్రకృతి చేత శరీరము తయారవడమే
కాకుండా శరీరములోని గుణములు కూడా ప్రకృతి చేతనే తయారైనవి. కనిపించని గుణములు మనిషి తలలో ఉంటూ,
మనిషికి కర్మలను అంటగట్టుచున్నవి. చేయించునది ఆత్మయినా, మంచి చెడు కార్యములను గుణముల ప్రేరణ వలన
ప్రకృతి కల్గించుచున్నది. ప్రకృతి యొక్క స్వభావము చేత కార్యముల మీద ఇష్టము కల్గడమూ, కార్యములు జరుగడము
వలన వాటి ద్వారా పాపపుణ్యములు రావడము జరుగుచున్నది. బయట కనిపించు ప్రకృతి, శరీరములో కనిపించని
గుణములుగా ఉన్నది. గుణములన్నిటినీ కలిపి మాయ అంటున్నాము. దీనినిబట్టి కనిపించెడి ప్రకృతి దేహములో
కనిపించని మాయగా ఉన్నదని చెప్పవచ్చును. మనుషులలోని కార్యములయందాసక్తికి, కర్మలకు ప్రకృతి కర్తయైయుండగా,
ఆత్మ శరీరమునకధిపతియై శరీర భాగములకు శక్తినిచ్చి నడిపించుచూ కర్మలను శిక్ష అక్షలుగా అనుభవింపజేయుచున్నదని
తెలుసుకొన్నాము. ఇంతవరకు తెలుసుకొన్న జ్ఞానము బాగా జ్ఞప్తికి వుండుటకు క్రింద ఒక పట్టికను చూపుచున్నాము.
రూప, నామ, క్రియలు
లేనివాడు
అన్నిటికి
చావు పుట్టుకలకు
జనన మరణలకు
పాప పనులను
చేయువాడు
సృష్టికర్త
మూలకర్త
ప్రస్తుత కర్త
శరీరము కదిలించి
అన్ని పనులు చేయువాడు
↓
↓
↓
↓
↓
పరమాత్మ
పరమాత్మ
దేవుడు
ప్రకృతి
ఆత్మ
అక్షరుడు
(పురుషోత్తముడు)
(దేవుడు)
(పురుషోత్తముడు)
(మాయ)
(అక్షరుడు)
(ఆత)
పుణ్య కార్యములను
మంచి చెడు కార్యములను
చేయువాడు
చేయనివాడు
సంబంధములేని కర్మను
అంటించుకొనువాడు
కష్ట సుఖములను
శరీరమునకు
జీవులకు
అనుభవించువాడు
అధిపతి
అధికారి
1
చిత్రగుప్తుడు
జీవుడు
క్షరుడు
జీవుడు
ఆత్మ
ప్రకృతి
(ఆత్మ)
(క్షరుడు)
(జీవుడు)
(క్షరుడు)
(చిత్రగుప్తుడు)
(మాయ)
12

Page 13
ఇంతవరకు ప్రాథమికముగా పురుషులైన మూడు ఆత్మలను గురించీ, స్త్రీ అయిన ప్రకృతిని గురించీ, శరీరములో
అధిపతిగాయుండి అన్నిటినీ చేయిస్తున్న చిత్రగుప్త ఆత్మను గురించీ తెలుసుకొన్నాము. అట్లే జీవుడు తాను చేయని తప్పు
ఒప్పులకు అజ్ఞానము చేత అనవసరముగా బాధ్యుడై కష్టసుఖములను పొందుచున్నాడని కూడా తెలుసుకొన్నాము.
ఇంకా తీర్పులలో రెండు రకముల తీర్పులున్నవని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు మాచే వ్రాయబడు ఈ గ్రంథములోని
ముఖ్య అంశము తీర్పు అనునదే, కావున ఇక తీర్పును గురించే ఎక్కువగా చెప్పుకొందాము. తీర్పులలో ప్రకృతి
సంబంధమైన శిక్షలనూ అక్షలనూ అందరూ ప్రత్యక్షముగా అనుభవించుచున్నప్పటికీ, మనిషికున్న అజ్ఞానము చేత
పుణ్యములకు స్వర్గలోకమూ, పాపములకు నరకలోకమూకలదని అనుకొనుచున్నాడు. అన్ని మతములవారు తమ మత
గ్రంథములని చెప్పు మూల గ్రంథములలో స్వర్గము, నరకము అను మాటలుండడము వాస్తవమే. స్వర్గము సుఖముల
నిలయమనీ, నరకము బాధల నిలయమనీ ఉన్నమాట కూడా వాస్తవమే. అయితే వాటికి ప్రత్యేక లోకములున్నవని
ఎంతమాత్రము చెప్పలేదు. మనిషి అజ్ఞానము చేత లేని విషయమును ఊహించుకొని, తనకు తెలియని, ఎవరూ
చూడనిదైన స్వర్గ, నరకములను ప్రత్యేక లోకములుగా చెప్పుకొనుచున్నాడు. అలా గ్రుడ్డిగా చెప్పుకోవడము తప్ప, వారు
ఊహించుకొన్న లోకముల అడ్రస్ వారికే తెలియదు. సృష్టి మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ఎవడూ స్వర్గ నరక
లోకములకు పోలేదు. ఎవరూ వాటిని చూడలేదు. తమ వాదన గెలుచుట కొరకు మేము చూచాము అని ఎవరైనా
అనినా, వారి మాట పూర్తి అసత్యము.
స్వర్గ నరకములు అనునవి మనిషి అనుభవించు అనుభూతులు మాత్రమే. కానీ అవి ప్రత్యేకమైన లోకములు
కావు. సుఖమును స్వర్గమనీ, కష్టమును నరకమనీ అనవచ్చును. అట్లు కాకుండా శాస్త్రబద్ధత ఏమాత్రము లేకుండా,
మూఢముగా అనుకొంటే, అది అజ్ఞానమగును కానీ జ్ఞానము కాదు. 'తాను చెడిన కోతి వనమెల్ల చెరిసె' అన్నట్లు,
కొందరు బోధకుడు తప్పుగా బోధించి అందరినీ తప్పుదోవ పట్టించుచున్నారు. ఇలా ప్రపంచ విషయములలో తప్పుగా
భావించుకొనినా, దానివలన పాపము వచ్చును. పాపము వలన శిక్ష నరకమును అనుభవించడమే అగును. నరకము
అంటే ఎల్లప్పుడు ఉండునది కాదు. ఎంత పాపము వచ్చిన వానికి అంతే నరకముండును. బాధను అనుభవించు ఐదు
లేక పది నిమిషములను నరకము అనవచ్చును. నరకము క్షణ కాలముండవచ్చును, ఎక్కువ కాలముండవచ్చును.
నరకము జీవునికి సంక్రమించిన పాపమును బట్టి యుండును. అలాగే స్వర్గము కూడా జీవునికి వచ్చిన పుణ్యమునుబట్టి
యుండును. మనిషి జీవితములోనే స్వర్గ సుఖములు, నరక బాధలు కలవు. స్వర్గమంటే సుఖము అని అర్థమగునట్లు
స్వర్గ సుఖములు అనియూ, నరకము అంటే బాధ అని అర్థమగునట్లు నరక బాధలనీ అనడము జరుగుచున్నది.
ప్రపంచములో ఒకే సమయమునందు ఎన్నో సుఖములను అనుభవించు వారినీ, అట్లే ఎన్నో బాధలు అనుభవించువారినీ
ప్రత్యక్షముగా చూస్తూనే ఉన్నాము. ఇతరులను చూడడమే కాకుండా, స్వయముగా మనమే ఎన్నో సమయములలో స్వర్గ
సుఖములనూ, నరక యాతనలనూ అనుభవించాము. సుఖదుఃఖములన్నియు ఈ భూమిమీదనే స్వర్గ, నరకములను
పేరుతో జరుగుచున్నవి. భగవద్గీతలోగానీ, బైబిల్లో గానీ, ఖుర్ఆన్ గ్రంథములోగానీ స్వర్గ లోకము, నరక లోకము అని
వ్రాసియుండుట వాస్తవమే అయినా స్వర్గ నరక లోకములు ఎక్కడో ఉన్నట్లు అనుకోకూడదు. ఈ నా మాట రుచిలేనిదిగా
కొందరికి కనిపించినా, చాలామందికి చేదుగా మరియు కఠినముగా కనిపించవచ్చును. జ్వరము వచ్చిన వారికి నాలుక
రుచిని గ్రహించలేని స్థితిలోవుండి తీపి పదార్థము కూడా చేదుగా ఉన్నట్లు కనిపించును. పదార్థము తీపిదైనమాట
మాట వాస్తవమే అయినా వానికున్న రోగము వలన చేదుగా తెలిసియుండవచ్చును. అంతమాత్రమున తీపిని చేదు
అనుట అసత్యమగును కదా!
13

Page 14
ఆలోచన అనగా లోతుగా చూడడము అని అర్థము. ఇంకా దీర్ఘముగా చూడడము అని కూడా అర్థము కలదు.
“ఆ” అను దీర్ఘము గల అక్షరమునకు లోతుగా, దీర్ఘముగా అని విశేషతగలదు. లోచన అను పదమునకు “ఆ” అను
అక్షరము విశేషముగా ఉన్నట్లు చెప్పుచున్నాము. లోచన అనగా కనిపించునది లేక చూడబడునది అని అర్థము.
లోచనములు అనగా అద్దములు అని కూడా అంటాము. బాగా కనిపించునట్లు చేయు కంటి అద్దములను సులోచనములు
అని అంటాము. ముఖ్యముగా ఇప్పుడు మేము చెప్పునది ఏమనగా! లోచనము అను పదమునుండి పుట్టిన శబ్దము
లోకము. లోకము అనగా కంటికి బాగా కనిపించునదని అర్థము. మనము ఏ లోకమును గురించి చెప్పుకొనినా,
లోకములన్నియు కనిపించునవనియే అర్థము. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. స్వర్గలోకము అంటే అర్థమేమిటి
అనగా! కనిపించెడి సుఖములు అని చెప్పవచ్చును. అలాగే నరకలోకము అంటే అర్థమేమిటనగా! కనిపించెడి
బాధలని చెప్పవచ్చును. స్వర్గలోకము అను పేరులో కనిపించెడి సుఖము అని అర్థముండగా, స్వర్గ లోకము ఎక్కడో
మనకు కనిపించకుండ ఉన్నదనుట శాస్త్రబద్దమా? ధర్మబద్దమా? అని ప్రశ్నించుచున్నాను.
ఎప్పుడు మనిషియొక్క జీవుని యొక్క) అనుభవములో సుఖము తెలియుచున్నదో, అప్పుడు (ఆ జీవుడు)
స్వర్గమును పొందుచున్నట్లేయగును. అలాగే ఎప్పుడు మనిషియొక్క అనుభవములో శరీరమందే జీవుడు బాధను
అనుభవిస్తున్నాడో, అప్పుడు అతను నరకమును పొందుచున్నట్లేయగును. ఈ విధముగా సుఖదుఃఖములనబడు స్వర్గ
నరకములు మనిషి భూమిమీదనే ప్రత్యక్షముగా అనుభవించి చూస్తున్నాడు. ఎంతోమంది అనుభవించే వారినీ చూస్తున్నాడు.
అయినా లోకమంటే అర్థము తెలియక స్వర్గలోకము పైన ఎక్కడో ఉన్నదనీ, నరకలోకము క్రింద ఎక్కడో కలదని కథలు
చెప్పు కోవడమూ, పురాణములు వ్రాసుకోవడము జరిగినది. ఆత్మను అధ్యయనము చేయడమును ఆధ్యాత్మికము అంటాము.
ఎవరికీ ఆత్మే తెలియబడనపుడు ఆధ్యాత్మికము ఎలా తెలుస్తుంది? కొందరికి అద్వైతము తెలుసు, మరి కొందరికి
ద్వైతము తెలుసు, కానీ ఎవరికీ త్రైతము తెలియదు. అందులో గుప్తమైన ఆత్మ ఒకటున్నదని ఎవరికీ తెలియదు.
అందువలన ఆధ్యాత్మిక అను పేరుండినా అదేమిటో పూర్తిగా తెలియదని చెప్పవచ్చును.
విచిత్రమేమంటే మేము ఆధ్యాత్మికులమని పేరు పెట్టుకొన్న ఎందరో స్వామీజీలు, గురువులుగా చలామణి
అగుచున్న వారూ, మనిషి చనిపోయిన తర్వాత ముందు స్వర్గానికి తర్వాత నరకానికి పోతారు అని చెప్పుచున్నారు.
అలా చెప్పువారు అసత్యమును చెప్పినట్లగుచున్నది. అంతేకాక దేవుడు ఏర్పరచిన విధానమునకు వ్యతిరేఖముగా
బోధించినట్లగుచున్నది. ఒక సాధారణ మనిషి తాను రోడ్డు రవాణా సంస్థకు అధికారి కాకున్నా R.T.O నని చెప్పుకొంటూ,
రోడ్డు మీద పోవు వాహనములను ఆపి వారినుండి అపరాధ రుసుమును వసూలు చేస్తే అది తప్పగును. చట్టమునకు
వ్యతిరేఖమగును. అతడు చట్టము దృష్టిలో నేరస్థుడగును. అలాగే గురువు హెూదాగానీ, స్వామీజీ అధికారముగానీ
లేనిదే ప్రజల ముందు స్వామీజీగా, గురువుగా గుర్తింపబడి ప్రజలనుండి గౌరవ మన్ననలను పొందితే దేవుని చట్టములో
అది వ్యతిరేఖమగును. ధర్మము దృష్ఠిలో శిక్షార్హుడగును.
ఈ విషయమై కొందరు ఏమనుచున్నారనగా! మాకు గురువులుగా ఉన్నవారు అలాగే బోధించారు. వారి
తర్వాత గురువులైన మేము మా గురువు చెప్పిన బోధనే సనాతనముగా బోధించుచున్నాము. ఒకవేళ తప్పు అయితే అది
మా గురువుదగును కదా! మాదెలా తప్పగును అని అడుగుచున్నారు. అంతేకాక గురువు చెప్పిన దానిని బోధించడమే
మా సనాతన ధర్మము అంటున్నారు. అటువంటి వారికి గురువు అంటే అర్థము తెలియదు, ధర్మము అంటే ఏమిటో
అర్థము తెలియదు. సనాతనము అంటే కూడా వివరము తెలియదు. అయినా అన్ని పదాలూ వాడేస్తున్నారు. దేవుడు
14

Page 15
ఎవరో, భగవంతుడు ఎవరో తెలియదు. దేవుడన్నా భగవంతుడన్నా రెండు ఒక్కటే కదాయను హిందువులు ఉండడము
వలన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇందూ (హిందూ) ధర్మము నేడు క్షీణించిపోయి, అది ఎక్కడున్నదో కూడా తెలియని
అగాధమునకు వెళ్ళిపోయింది. ఇందూ ధర్మరక్షణ పేరుతో ఎందరో ఉండినా వారు కూడా అశాస్త్రీయముగా బోధించుచూ,
పురాణగాధలను చెప్పడము వలన ఇందువులకు తమ ధర్మమేదో, తమ దేవుడెవరో తెలియక అయోమయ స్థితిలో
ఉండి ఇతర మతబోధనలవైపు చూస్తున్నారు. కొంతమంది ఏకంగా మతమునే మార్చుకొనుచున్నారు.
ఐదువేల సంవత్సరముల పూర్వమే, భగవద్గీత కృష్ణుని చేత చెప్పబడకనే, భారత దేశమంతటా వేదములు,
పురాణములు బాగా ప్రచారమైయుండెడివి. వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులలో ఎక్కడో సుదూరములో
యమలోకమున్నదనీ, అక్కడికి పోయివచ్చిన వారున్నారని వ్రాయడము జరిగినది. అలాగే పురాణములలో సతీసావిత్రి
తన భర్త ప్రాణములను యమధర్మరాజుతో వాదించి వెనక్కు తెచ్చుకొని సజీవున్ని చేసుకొందని వ్రాయబడి ఉన్నది.
ఇంకా కొందరు తాము చూచివచ్చిన వారివలె యమలోకమునకు పోవుటకు వైతరణీ నది దాటి పోవలెననీ, ఆ నది
అంతయు దుర్వాసనతో కూడుకొని రక్తమాంసముల ప్రవాహమె ఉన్నదని వ్రాశారు. గరుడ పురాణమును ప్రత్యేకించి
యమలోకమును గురించి చెప్పుటకే వ్రాశారు. ఫలానా పని చేసిన వానికి ఫలానా పాపము వచ్చుననీ, ఫలానా
పాపము వచ్చిన వారికి యమలోకములో ఫలానా శిక్ష ఉంటుందని వ్రాయడము జరిగినది. యమలోకములో పాపములను
గురించి చిత్రగుప్తుడు ఒక గ్రంథమును వ్రాసియున్నాడనీ, దానిలో అందరి పాపములున్నవనీ, మనిషి చనిపోయి
యమలోకమునకు పోయినప్పుడు వాడు జీవితములో చేసుకొన్న పాపములు చిట్టాను చిత్రగుప్తుడు విప్పి చెప్పగా,
వాటిని వినిన యమధర్మరాజు వాని పాపములకు తగిన శిక్ష వేయుననీ చెప్పడము జరిగినది. అంతేకాక యమధర్మరాజు
విధించిన శిక్షలను అమలు చేయడానికి లెక్కలేనంతమంది యమకింకరులున్నారని, వారు దయా దాక్షిణ్యము లేకుండా
శిక్షలు అమలు చేయుదురని, యమలోకమంతయు మనుషుల ఆర్తనాదములతో నిండియుండుననీ చెప్పడము జరిగినది.
గరుడ పురాణములో నరకము ప్రత్యక్షముగా కనిపించునట్లు వ్రాయడమే కాకుండా, యమకింకరులు పాపులను నూనెలో
వేయించుదురనీ, అగ్నిలో వేసి కాల్చుదురనీ, శూలములతో పొడుచుదురనీ, పెద్ద బండరాళ్ళను మీదికి త్రోసి మనుషులను
నలిగిపోవునట్లు చేయుదురనీ అనేక హింసలను వ్రాశారు. పాపములు అయిపోవునంతవరకు మనిషిని యమకింకరులు
బాధించి వదలివేయగా, అక్కడినుండి మనిషి తన పుణ్యమును అనుభవించుటకు స్వర్గలోకమునకు పోయి పుణ్యము
అయిపోవువరకు స్వర్గలోకములో రంభ ఊర్వశుల మధ్య ఎన్నో సుఖములను అనుభవించి, తర్వాత త్రిమూర్తులలో
ఒకరైన బ్రహ్మవద్దకు పోయి క్రొత్తగా తలవ్రాతను వ్రాయించుకొని తిరిగి భూమిమీదికి వచ్చి పుట్టునని వ్రాశారు.
ఇలా చెప్పుచూపోతే అదే ఒక గ్రంథమవుతుంది. నాలుగు వేదములనూ, పదునెనిమిది పురాణములను వ్యాసుడు
ద్వాపరయుగములో వ్రాశాడు. వేదములను వ్రాయడము వలన ఆయనను వేదవ్యాసుడు అన్నారు. ఎందరో మహర్షులు
బోధలుగా చెప్పిన విషయములను సేకరించి వాటిని ఉపనిషత్తులుగా వేదముల చివరి భాగములో వ్రాయడము జరిగినది.
ఎవరైతే ఉపనిషత్ను చెప్పారో వారి పేరునే ఆ ఉపనిషత్తుకు పెట్టడము జరిగినది. ఉదాహరణకు తైత్తరీమహర్షి చెప్పిన
బోధను వ్యాసుడు ఉపనిషత్తుగా వ్రాస్తూ ఆ ఉపనిషత్తుకు దానిని చెప్పిన తైత్తరీయ మహర్షి పేరును ఉంచుతూ
తైత్తరీయోపనిషత్తు అని పేరు పెట్టడము జరిగినది. ఈ విధముగా అన్ని ఉపనిషత్తులకు వాటిని చెప్పిన వారి పేర్లనే
వ్యాసుడు ఉంచాడు. వేదములను స్వయముగా వ్యాసుడే వ్రాశాడు. నాల్గు వేదములనే కాకుండా పదునెనిమిది
పురాణములను కూడా వ్రాశాడు. తనకు మంచి పనిగా త్రోచి వ్యాసుడు వ్రాసిన వ్రాతల వలన సత్యము మరుగునపడిపోయి
15

Page 16
అసత్యము బయటికి వచ్చినది. వ్యాసుడు వ్రాసిన వ్రాతల వలన ధర్మము మరుగునపడిపోయి అధర్మము బహిర్గతమైనది.
అప్పటి కాలములో వ్యాసుడు మాత్రమే పేరు పొందిన రచయితగా ఉండుట వలన, అందరూ వాటిని చదవడమూ,
అధర్మవరులుగా మారిపోవడమూ జరిగినది. ఇదంత వాస్తవముగా జరిగిన సత్యమే అయినా, ఇందులో కనిపించని
సత్యమొకటియున్నది. అదియే అందరికీ ముఖ్యమైన రహస్యము.
బయటికి కనిపించని రహస్యమైన సత్యమేమనగా! వ్యాసుడు అసత్యమునూ, అధర్మమునే తన వ్రాతలో వ్రాసినా,
వాస్తవానికి వ్రాసిన వాడు వ్యాసుడు ఏమాత్రము కాదు. ఈ మాట కొంత ఆశ్చర్యమును కలిగించినా వ్యాసుడు మనకు
కనిపించు వ్యక్తిగాయున్నా, వ్యాసుడు తన శరీరములో కేవలము జీవాత్మగాయున్నాడు. శరీరములోని జీవుడు ఎవడైనా
సుఖదుఃఖములను అనుభవించుటకే ఉన్నాడుగానీ, పనిని చేయుటకు గాదు. జీవుడు అన్ని విధముల గ్రుడ్డివాడు,
తనవరకు వచ్చిన దానిని అనుభవించడము తప్ప ఏ పనినీ చేయలేని అంగహీనుడు. అన్ని అంగములు శరీరమునకున్నవి
గానీ తనకు లేవు. శరీరము అంతయు ఆత్మది జీవునది కాదు. జీవుడు శరీరములో ఒక భాగమేగానీ, స్వయముగా
దేనినీ చేయలేడు, జీవునికి కార్యములు చేయు శక్తియులేదు. శరీరములో జరుగు ప్రతి చిన్న కార్యము రెండవవాడూ,
చిత్రగుప్తుడు అయిన ఆత్మ వలననే జరుగుచున్నది. అటువంటపుడు ఎంతో పెద్ద కార్యమైన వేదముల, పురాణముల
రచనలను చేసినది ఆత్మయే.
పైకి కనిపించునది వ్యాసుడున్న శరీరమే అయినా, లోపల చేయునది వాస్తవానికి వ్యాసుడుకాదు. స్వర్గ
నరకములను గురించిన అసత్యమును ఆధ్యాత్మికమును గురించిన అధర్మమునూ స్వయముగా ఆత్మే ఎందుకు వ్రాసింది.
ఆధ్యాత్మికమంతయు ఆత్మను గురించి తెలుసుకోవడము కొరకు ఉన్నదే కదా! అలాంటపుడు తన విషయమునే తాను
ఎందుకు ప్రక్కదోవ పట్టించి చెప్పినదను ప్రశ్న రాగలదు. దేవుని మార్గములో ఇది పెద్ద తప్పయినా, తప్పని ఆత్మకు
తెలిసినా, ఆత్మ అలా చేసింది అంటే దానికి బలమైన కారణముంటుంది. ఆ కారణమును గురించి చెప్పడము ఇప్పుడు
సమయోచితము కాదు, సందర్భము వస్తే తప్పనిసరిగా వివరిస్తాము. మనుషులందరికీ ఆత్మ మరొకటున్నదనీ, శరీరము
దానిదేననీ, దానితోపాటు శరీరములో నేనున్నానని ఏమాత్రము తెలియదు. తెలిసినదంతా శరీరమే నేనూ, నేనే శరీరము
అనునది మాత్రమే. శరీరము ద్వారా జరిగెడి పనినంతా నేనే చేశాను అను భావము తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ
గ్రంథమును వ్రాయుచున్నది నేనేననీ, జీవుడైన నేను అనుకొనుటకు ఏ అడ్డంకూ లేదు. అయినా నేనెవరో నాకు
తెలుసు. ఈ గ్రంథమును నేను వ్రాసినట్లు గ్రంథ రచయిత అని నా పేరున్నా, ఆ విధముగా పైకి నా పేరుపెట్టి వ్రాసినది
స్వయముగా ఆత్మని తెలుసు. అయినా ఏ పనినీ ఖండించనూలేనూ అట్లే చేయనూలేను. అందువలన చాలా
గ్రంథములలో ముందే 'దీనిని వ్రాసినది నేను కాదు, నా పొరుగువాడైన ఆత్మని' చెప్పాను. అలా చెప్పడము కూడా నా
చేత కాదు, అయితే నేను కాదు అను నా భావమును ఆత్మే శరీరము చేత వ్రాయించింది. చూచారా! ఇంత తెలిసినా
నేను ఎప్పటికీ ఏమీ చేయలేని వానినే. అయితే మీకు అర్థమగునట్లు ప్రబోధానందుని పేరుతోనే వ్రాయడము జరిగినదని
తెలుసుకోండి.
ఇది తీర్పుకు సంబంధించిన గ్రంథము. తీర్పు అనగా తప్పు ఒప్పులను తేల్చి శిక్షనుగానీ, అక్షనుగానీ అమలు
చేయుటకు న్యాయమూర్తి చేత నిర్ణయించబడునది. బయట కోర్టులలోనే తీర్పులు శిక్షలు ఉంటాయి. ప్రతి మనిషికీ
లోపల కనిపించని న్యాయస్థానము (కోర్టు), కనిపించని న్యాయవాది, కనిపించని న్యాయమూర్తి ఉన్నారు. ఎవరికీ
తెలియని అంతరంగములోని కోర్టులో విచారణ ఎలా ఉంటుందో, తీర్పు ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలాగున
16

Page 17
వివరించాలనుకొన్నాము. కనిపించని న్యాయస్థానమును వివరించుటకు ముద్దాయిలు ఎలా ఉంటారో, ఎవరు
ముద్దాయిలవుతారో కొంత చెప్పుకోవలసియున్నది. ప్రపంచ సంబంధ తీర్పులను గురించి, ప్రపంచ సంబంధ ముద్దాయిలను
గురించి మనము చెప్పుకోవలసిన అవసరములేదు. ప్రపంచ సంబంధ హత్యలు గానీ, దొంగతనములుగానీ,
వ్యభిచారములుగానీ, అసత్యములుగానీ, దౌర్జన్యములుగానీ, హింసించుటగానీ, మోసములుగానీ మొదలగు అన్ని
కార్యములకు సంభవించు పాపములన్నిటిని ఆత్మ ఆగామికర్మగా వ్రాసి పెట్టుచుండును. తర్వాత కాలములో ఆగామికర్మ
ప్రారబ్ధకర్మయై శిక్షగా పరిగణింపబడును. వాటి వివరమును మేము ఇప్పుడు చెప్పదలచుకోలేదు. ఇప్పుడు మేము
చెప్పునది ప్రపంచ సంబంధము కాకుండా పరమాత్మ సంబంధమైన విషయములను మాత్రమేనని తెలుపుచున్నాము.
ప్రపంచ సంబంధమైన విషయములు పాపపుణ్యములుగా చిత్రగుప్తుడైన ఆత్మ చేత వ్రాయబడి శిక్ష అక్షలుగా అమలు
జరుగుచున్నవి. పరమాత్మ సంబంధ దైవ విషయములు జ్ఞాన అజ్ఞానములుగా ప్రకృతి చేత గుర్తింపబడియుండి లేక
వ్రాయబడి జన్మ మోక్షములుగా ప్రకృతిచేతనే అమలు జరుగుచున్నవి.
ప్రపంచ సంబంధ కార్యములలో మంచి పనులకు పుణ్యమూ, చెడు పనులకు పాపమూ వచ్చుచుండును. ఏవి
మంచి కార్యములు? ఏవి చెడు కార్యములు అని తెలియుట న్యాయ అన్యాయములను బట్టి యుండును. జరిగిన పని
న్యాయ సమ్మతమైతే మంచి పనియనీ, అన్యాయమైనదైతే ఆ పని చెడుదనీ చెప్పవచ్చును. ప్రపంచ కార్యములు న్యాయ
అన్యాయముల మీద ఆధారపడియున్నట్లు, దైవ సంబంధ కార్యములు ఏవైనా జ్ఞాన అజ్ఞానము మీద ఆధారపడియుండును.
ప్రపంచ విషయములలో ఏది న్యాయమో, ఏది అన్యాయమో సరిగా నిర్ణయించుటకు చట్టము అనునది గలదు. చట్టము
లేకపోతే ఎవని పని వానికి న్యాయముగనే కనిపించును. అట్లు కాకుండ ఏది న్యాయమో తేల్చి చెప్పుటకు చట్టము
అనునది హద్దుగా ఉన్నది. అలాగే దైవమార్గములో జ్ఞానమునుబట్టి ఎవని సాధన, బోధన సరియైనదో, ఎవని బోధనలుగానీ,
సాధనలుగానీ సరికావో ఖచ్ఛితముగా నిర్ణయించి చెప్పునది ధర్మము. బయటి ప్రపంచములో న్యాయమును నిర్ణయించుటకు
చట్టము ఉన్నట్లు, అంతరంగములో జ్ఞానమును నిర్ణయించుటకు ధర్మమున్నది.
దైవమార్గములో అజ్ఞానముగా ప్రవర్తించితే ఇది ధర్మవిరుద్ధము అని తెలియుటకు మనిషికి ముందు జ్ఞానమూ,
ధర్మమూ తెలిసియుండాలి. ఏ ప్రభుత్వమైతే చట్టమును తయారు చేసిందో, ఆ ప్రభుత్వమే తన చట్టమిదియని తెలియజేయాలి.
అలాగే ఏ దేవుడైతే ధర్మమును నిర్ణయించాడో, ఆ దేవుడే తన ధర్మమిదియని తెలియజేయాలి. ఇతరులు తెలుపుటకు
వీలులేదు. ప్రభుత్వ చట్టము ప్రభుత్వమునకే తెలిసినట్లు, దేవుని ధర్మము దేవునికే తెలుసు. ప్రభుత్వము ద్వారానే
చట్టము బయటకు రావాలి. అలాగే దేవుని ద్వారానే ధర్మము బయటికి రావాలి. దేవుని ధర్మము దేవుడు తెలుపనిదే
ఇతరులకు ఎవరికీ తెలియదు, అది అందరికీ రహస్యమే. ఇదే విషయమునే భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్య
యోగమను అధ్యాయమున మొదటి శ్లోకములోనే భగవంతుడు ఇలా చెప్పుచున్నాడు.
1వ శ్లో॥
ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యాం మ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞాన సహితం యద్దా త్వా మోక్ష్యసే శుభాత్ ॥
భావము :- ఇది అతిరహస్యమైన జ్ఞానము. ఎవరికీ తెలియని నా జ్ఞానమును విజ్ఞాన సహితముగా విశదముగా
చెప్పుదును వినుము. దీనిని తెలియుట చేత అన్ని అశుభములు తొలగి మోక్షమును పొందుదువు.
17

Page 18
దేవుని ధర్మము అతి రహస్యమైనదని దేవుడే చెప్పునప్పుడు అది ఎవరికీ తెలియని విషయమని స్పష్టముగా
తెలియుచున్నది. దేవుని జ్ఞానము దేవుని ద్వారానే తెలియబడుతుందనుటకు పై శ్లోకమే సాక్ష్యమని చెప్పవచ్చును. ఇదే
విషయమునే ఖుర్ఆన్ గ్రంథములో అలీ ఇమ్రాన్ అను 3వ సురలో 7వ ఆయత నందు కూడా ఇలా సారాంశము
గలదు. “దేవుడు ప్రజలకు ఖుర్ఆన్ గ్రంథమును ఇచ్చాడు. అందులో 'ముతషాభిహాత్' అనబడు చాలా రహస్యమైన
విషయములు గలవు. వాటి జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదని” చెప్పబడినది. ఇక్కడ కూడా ఎవరికీ
తెలియనిది దేవుని జ్ఞానమనీ, దానిని దేవుడు చెప్పితేనే అర్థము కాగలదు అని ఉన్నది కదా! దేవుని జ్ఞానము దేవునికి
తప్ప ఎవరికీ తెలియనప్పుడు, ఆయన తెలియజెప్పితే తప్ప ఇతరులకెవరికీ తెలియదు. ఇక్కడ ముఖ్యమైన సమస్య
ఏమిటంటే! దేవుడు పని చేయనివాడు, కనిపించనివాడు, పేరులేనివాడు అయినప్పుడు మనుషులకు ఎవరికీ తెలియని
తన ధర్మమును భూమిమీద మనుషులకు ఎలా తెలియజేస్తాడు అను సంశయము రాక తప్పదు. ఇట్లు ప్రశ్న రాగలదని
గ్రహించిన దేవుడు ముందే దానికి జవాబుగా ఖుర్ఆన్ గ్రంథములో ఇలా వ్రాశాడు. 42వ సురా 51వ ఆయత్నందు
సారాంశము ఇలా కలదు. "దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు. అయితే వహీ ద్వారా (దివ్యవాణి ద్వారా)
లేదా తెర వెనుకనుంచి, లేదా ఒక దూతను (వ్యక్తిని) పంపడము ద్వారా తన జ్ఞానమును (ధర్మమును) తెలియజేయును.
వచ్చిన దూత (భగవంతుడు) దేవుని సందేశము ప్రజలకు అందిస్తాడు.” ఈ విధముగా దేవుడు మూడు విధములుగా
అవసరమును బట్టి తెలియజేస్తాడు. సృష్ఠి తయారైన మొదటిలో దివ్యవాణి ద్వారా తన ధర్మమును సూర్యునికి చెప్పినట్లు
భగవద్గీతలో కలదు. గీతయందు జ్ఞానయోగమను అధ్యాయమున ఒకటవ శ్లోకములోనే ఆ విషయము గలదు.
తెరవెనుకనుండి అనగా చెప్పేవ్యక్తియున్నా, కనిపించకుండ మాట్లాడడమును తెరవెనుకనుండి అన్నారు. ఆ విధముగా
ముహమ్మద్ ప్రవక్తకు జిబ్రయేల్ కనిపించకుండా చెప్పాడు. ఇక దేవుడు పంపగా వచ్చిన దూత కృష్ణుడు అని సులభముగా
చెప్పవచ్చును. కృష్ణున్ని ఖురాన్ ప్రకారము దేవుని వద్దనుండి వచ్చిన వ్యక్తిగా, మన లెక్కలో భగవంతునిగా చెప్పవచ్చును.
ఈ విధముగా దేవుడు ఎక్కడా ఎవరితోనూ ప్రత్యక్షముగా మాట్లాడ కుండా, తన ధర్మమును ఇప్పటికే మూడు
విధములుగా, మూడు ప్రాంతములలో, మూడు యుగములలో తెలియజేశాడని చెప్పవచ్చును. కృతయుగము మొదటిలోనే
అనగా సృష్ట్యాదిలోనే శబ్ధరూపములో చెప్పాడు. ద్వాపరయుగము చివరిలో భగవంతునిగా లేక దేవునివద్దనుండి పంపబడిన
వ్యక్తిగా శ్రీకృష్ణుడు వచ్చాడు. కలియుగములో జిబ్రయేల్ అనునతడు ఉండి, ముహమ్మద్ ప్రవక్తకు కనిపించకుండా
ఉంటూ దేవుని జ్ఞానమును చెప్పడము జరిగినది. ఇప్పటికి మూడు విధముల మూడు సమయములలో దేవుడు తన
జ్ఞానమును తెలియజేశాడు. మూడుమార్లు తెలియజేసిన జ్ఞానము మూడు గ్రంథముల రూపముగా ఉన్నది. మూడు
గ్రంథముల రూపములో జ్ఞానమున్నా అది ఇప్పటి మానవులకు అర్థము కాలేదు. కావున మూడు గ్రంథములలోని
జ్ఞానమును వివరించి చెప్పుటకు భగవంతుడు మరొకమారు రావలసియున్నది.
దేవుడు మనిషికి తెలియవలసిన తన ధర్మములను జ్ఞానరూపముతో తెలుపగా, అది కాస్త మూడు మతములుగా
తయారైనది. అది తయారు కాలేదు కానీ మనుషులే అలా మతములుగా జేశారు. దేవుడు తన జ్ఞానమును ధర్మములుగా
చెప్పాడుగానీ, మతములుగా చెప్పలేదు. మనిషి దేవుడు చెప్పిన జ్ఞానమును తన స్వార్ధముతో మతాలుగా రూపుమార్చాడు.
దేవుని జ్ఞానమును అడ్డము పెట్టుకొని దానిని చూపించుచూ తమ మతమును పెంచుకోవాలని చూస్తున్నాడు. మతమను
గుంపును పెంచుకొనుటకు దేవుని జ్ఞానమును ఉపయోగించుకొనుచూ దేవుని జ్ఞానమును కించపరచుచున్నారు. దేవుడిచ్చిన
గ్రంథమును తమ మతగ్రంథమని చెప్పుకొంటున్నాడు. దేవుని జ్ఞానమును ఉపయోగించుకొని జన్మలనుండి కడతేరి
18

Page 19
మోక్షమును పొందక, దేవుని గ్రంథమును తమ మతగ్రంథమని చెప్పుకోవడము వలన, దేవుని దృష్టిలో మత పెద్దలు
దోషులగుచున్నారు.
ఆయా మతములలో ఆయా బోధకులు ఒకవైపు దైవజ్ఞానమును చెప్పుచున్నామని చెప్పుచూ, వారికి వాక్యముల
నిజభావము తెలియకపోవడము వలన, తమకిష్టమొచ్చినట్లు చెప్పుటకు మొదలుపెట్టారు. తప్పు భావములను చెప్పుట
వలన తమ బోధలను విన్నవారందరూ అదియే నిజమని నమ్మి, తమ బోధకులు చెప్పినట్లే నడుచుకోవడము వలన
చెప్పిన వాడూ, విన్నవారూ అందరూ దేవుని మార్గములో దోషులగుచున్నారు. అటువంటి వారికి న్యాయస్థానము,
విచారణ చివరకు శిక్ష తప్పవు. గురువులు చెప్పినట్లు విన్నాము మాదేమి తప్పు అనినా, అతను శిక్షనుండి తప్పించుకోలేడు.
దైవమార్గము అంటే ఏమిటో తెలియక, దైవమార్గములోనికి రానివానికి, ప్రకృతి సంబంధ పాపముల శిక్షలు తప్ప,
దైవసంబంధ శిక్షలుండవు. దేవుని మార్గమును అనుసరిస్తున్నానని చెప్పుకొనుచూ శిష్యులుగా ఉండినా, గురువులుగా
ఉండినా, స్వామీజీలుగా ఉండినా, ఎవరు ఏ స్థాయిలో ఉండినా వారు దేవుని దృష్టిలో దోషులే, కావున వారికి విచారణ
తప్పదు.
ఈ మా మాటలను విన్న కొందరు లేక అన్ని మతములలోని అందరూ మా మాటలను వ్యతిరేఖించి “మేమెలా
దోషులమవుతాము? మా గ్రంథములను మేము బాగా అర్థము చేసుకొన్నాము, దేవుడు చెప్పినట్లే నడుస్తున్నాము. దేవుడు
చెప్పిన జ్ఞానమునకు మినహా మేము ఏ ప్రక్క దారిలోనూ పోలేదు. దేవుడు చెప్పినట్లే దేవున్నే ఆరాధిస్తున్నాము. అన్ని
విధముల దేవుడు చెప్పినట్లు నడుచుకొను మమ్ములను, దోషులుగా నిలబడ వలసివస్తుంది, శిక్షలు తప్పవు అనడము
సమంజసమా” అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! దైవమార్గములో పోవువారిని, దేవుని
జ్ఞానము ప్రకారము నడుచుకొనువారిని గురించి నేను చెప్పడము లేదు. దేవుని జ్ఞానమును చెప్పుకొనుచు తన
మతము మీద వ్యామోహము గల వారిని గురించి చెప్పుచున్నాను. గుమ్మడికాయ దొంగ అంటే అందరూ ఉలికిపడవలసిన
పనిలేదు. మా మతమువేరు, మీ మతమువేరు అను వారిని గురించీ, మా దేవుడువేరు మీ దేవుడు వేరు అనువారిని
గురించీ, మా గ్రంథమువేరు, మీ గ్రంథము వేరు అను వారి గురించీ చెప్పుచున్నాము.
సర్వ సృష్ఠికి దేవుడు ఒక్కడే అధిపతియైనప్పుడు మీ దేవుడు మా దేవుడు అనడము తప్పుకాదా! క్రైస్తవులకు,
హిందువుల కృష్ణుడంటే హేళన భావము. అట్లే హిందువులకు ఏసుప్రభువు అంటే ఎలర్జీగ అవుతుంది. ఇకపోతే
హిందువులకంటే, క్రైస్తవులకంటే మేమే సరియైన మార్గములో ఉన్నామనీ, మా అమ్మాయిని వివాహమాడాలంటే మా
మతములోనికి రావలసిందేనని ముస్లీమ్లు అంటున్నారు. ఎంతోగొప్ప జ్ఞానిని అనుకొన్న వానికి కూడా మతము అను
రోగము లేదేమో గుండెలమీద చేయివేసుకొని చెప్పండి. మూడు మూల గ్రంథములైన భగవద్గీత, బైబిలు, ఖురాన్లలో
ఒకే భావమునిచ్చు జ్ఞానమున్నదనీ, మూడు గ్రంథములను మూడు కాలములలో, మూడు ప్రాంతముల వారికిచ్చినవనీ,
మూడు గ్రంథములలో చెప్పినది ఒకే దైవము యొక్క జ్ఞానమనీ, ఎవరు ఎలా చెప్పుకొనినా మనుషులందరికీ దేవుడు
ఒక్కడేనని మతములకు అతీతముగా మేము జ్ఞానమును చెప్పితే, మా జ్ఞానము మాకే తెలుసు మీకు తెలియదనిన
ముస్లీమ్లు ఉన్నారు, క్రైస్తవులూ ఉన్నారు. హిందువులైతే ఏకంగా మమ్ములను క్రైస్తవమును బోధించుచున్నారని
ఆరోపించడము జరిగినది. మతాతీత జ్ఞానమును చెప్పిన దానివలన మేము స్వయముగా హిందూ, క్రైస్తవ, ముస్లీమ్
అను మూడు మతముల నుండి ఎన్నో దాడులను, ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ఇటువంటి అనుభవములు మాకున్నపుడు
ఎవరిని మతముల మమకారము లేని వారిగా చెప్పవలెను? అందరూ మతముల మత్తు పూర్తి ఎక్కినవారుగా ఉన్నారు.
19

Page 20
దేవుడు చెప్పని మతమును సృష్టించుకొన్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్ఠిలో ముద్దాయిలే. ఈ విధముగా చెప్పుచూపోతే
అన్ని మతములలోనూ మేము భక్తులమూ, జ్ఞానులమూ అనుచూ సృష్టికర్తయిన దేవుని ఎడల తమకు తెలియకుండానే
వ్యతిరిక్తముగా ప్రవర్తించుచున్నారు.
భూమిమీద మనుషులకు దేవుడు మూడు విధానములుగా జ్ఞానము తెలియజేశాడు. దివ్యవాణిగా సృష్ట్యాదిలో
ఒక్కమారే చెప్పాడు. తెరవెనుక ఉన్న జ్ఞానినుండి ఒక్క మహమ్మద్ ప్రవక్తకేగాక, ఎన్నోమార్లు ఎందరికో బోధించాడు.
అలాగే తాను పంపు దూత ద్వారా అనగా తన అంశతో పంపబడు భగవంతుని ద్వారా ద్వాపరయుగములో ఒక్కమారే
కాకుండా గతములో ఎన్నోమార్లు బోధించాడు. తర్వాత రాబోయే కాలములో కూడా ధర్మములకు ముప్పు వచ్చినప్పుడు,
అధర్మములు పెరిగిపోయినప్పుడు, తిరిగి ఇదే విధముగా చెప్పుతానని కూడా చెప్పాడు. ద్వాపరయుగము తర్వాత
కూడా దేవునివద్దనుండి పంపబడిన దూత వచ్చిపోయినట్లు కొన్ని ఆధారములున్నవి. ఈ విధముగా దేవుడు మనుషులకు
తన ధర్మమును తెలుపుటకు అనేకమార్లు ప్రయత్నము చేయుచుండగా, మనిషి తనవరకు వచ్చిన దేవుని జ్ఞానమును
తప్పు భావముతో అర్థము చేసుకొని దేవునికి వ్యతిరిక్తముగా బోధించడమూ, దేవుడు చెప్పినట్లు ఆరాధించక, తన
ఇష్టమొచ్చినట్లు ఆరాధించడము వలన అటువంటి మనుషులు దేవుని ధర్మము ఎడల నేరస్తులు కారా? వారు శిక్షార్హులు
కారా అని ప్రశ్నించుచున్నాను.
మనుషులు మతాలను సృష్టించుకొనినా, నాకు తెలిసినంతవరకు మూడు మతముల వారికి మూడు గ్రంథములను
దేవుడు ఏర్పరచాడు. మూడు గ్రంథములలోను దేవుడు తన జ్ఞానమును నింపి ఇచ్చాడు. వాటిలో ఒక గ్రంథమందు
దైవజ్ఞాని అయిన ఒక గ్రహము కనిపించకుండ బోధించిన దేవుని జ్ఞానము కలదు. రెండు గ్రంథములందు దేవునివద్దనుండి
పంపబడిన దూత (దేవుని అంశతో తయారై వచ్చిన భగవంతుడు) చెప్పిన జ్ఞానము కలదు. భవిష్యత్తు కాలములో
ఎవరైనా దేవుని జ్ఞానము మాకు తెలియదు అనకుండా, దేవుడు మాకు తన జ్ఞానమును తెలియబరచలేదు అనకుండా,
ముందే తాను జ్ఞానమును బోధించినట్లు సాక్ష్యముగా తన జ్ఞానమును గ్రంథ రూపములో ఇచ్చాడు.
ఏదైనా తెలియని విషయము మన మధ్యకు వచ్చినప్పుడు, దాని వాస్తవికతను చూచుటకు, దానిలో అసత్యము
ఏదైనా ఉందా అని చూచుటకు, దానికి సంబంధించిన శాస్త్రమును ఆధారము చేసుకొని చూడవలసి ఉంటుంది.
జలములో ఎన్ని రసములున్నాయి? లేక ఎన్ని వాయువులు ఉన్నాయి? అని చూచుటకు దానికి సంబంధించిన రసాయన
శాస్త్రమును చూస్తాము. అలాగే ఒక లెక్కను సరియైనదా కాదా అని చూచుటకు గణిత శాస్త్రమును ఆధారము చేసుకొని
చూస్తాము. మనిషి శరీరములోని గుండె వివరము తెలియాలంటే దానికి ఆధారమైన భౌతికశాస్త్రమును చూస్తాము. ఈ
విధముగా ప్రపంచ విషయములనూ, ప్రపంచ జ్ఞానములనూ తెలియుటకు పంచశాస్త్రములు గలవు. వాటి పేర్లు
వరుసగా 1) గణిత శాస్త్రము 2) ఖగోళశాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము 5) జ్యోతిష్య శాస్త్రము.
ప్రకృతి లేక ప్రపంచ విషయములకు సంబంధించినవి ఐదు శాస్త్రములుకాగా, ప్రకృతిని సృష్టించిన దేవుని విషయమును
గురించి సత్యాసత్య నిర్ధారణకు బ్రహ్మవిద్యాశాస్త్రమును ప్రమాణముగా చూడవలసి యుంటుంది. మనిషి దేవుని
విషయములను తెలియుటకు దేవుని గ్రంథమును చూడవలసిందే. దైవశాస్త్రము (బ్రహ్మవిద్యా శాస్త్రము) భగవద్గీత,
బైబిల్, ఖుర్ఆన్ గ్రంథములలో ఉన్నది. దైవవిషయములను నిర్ధారించుకొనుటకు హిందువు అయితే భగవద్గీతనూ,
క్రైస్తవుడయితే బైబిల్నూ, ముస్లీమ్ అయితే ఖుర్ఆన్ గ్రంథమునూ చూడవలసియుంటుంది.
20

Page 21
ఇక్కడ ఒక విషయమును గ్రహిస్తే ఒక ముస్లీమ్ను మీ దైవ గ్రంథమేది అని ప్రశ్నిస్తే, వెంటనే పవిత్ర ఖుర్ఆన్
గ్రంథమని చెప్పుచున్నారు. అట్లే క్రైస్తవున్ని మీ దైవగ్రంథమేది అని ప్రశ్నిస్తే, పరిశుద్ధ బైబిల్ అని జవాబు చెప్పగలడు.
అలాగే హిందువు అయిన 25 సంవత్సరముల వయస్సున్న M.B.A స్టూడెంట్ను మీ దైవగ్రంథమేది అంటే నాకు
తెలియదు అన్నాడు. మరియొకనిని అడిగితే రామాయణము అన్నాడు. మీ దేవుడెవరు అని ప్రశ్నిస్తే రాముడు అని
జవాబిచ్చాడు. క్రైస్తవులనుగానీ, ముస్లీమ్లను గానీ కేవలము ఐదు సంవత్సరముల పిల్లవానిని ప్రశ్నించినా, వారి
గ్రంథమును, వారి దేవున్ని సులభముగా చెప్పగలుగుచున్నాడు. అయితే ఒక్క హిందూమతములో 25 సంవత్సరముల
వయస్సున్న వారిని అడిగినా, ఒకరు తెలియదంటే, మరొకరు రామాయణమంటే, ఇంకొకరు వేదములనీ, మరొకరు
ఉపనిషత్తులనీ అనేక రకముల జవాబులను చెప్పుచున్నారు. పదింటికి ఒకడైనా మా గ్రంథము భగవద్గీత అని చెప్పడము
లేదు. భారత దేశము హిందూదేశముగా పేరుగాంచినా, ప్రస్తుత కాలములో 50 లక్షల మంది సన్యాసులుగా ఉండినా,
పదివేలమందికంటే అధికముగా బోధించు స్వామీజీలు ఉండినా, చివరకు పదింటికొకనికైనా హిందువుల గ్రంథము
భగవద్గీత అని తెలియకపోవడము ఆశ్చర్యము. ఇంకా ఆశ్చర్యకర విషయమేమంటే హిందువులలో ఐదుశాతము
మంది మాత్రమే భగవద్గీతను చదివారు, 95 శాతము చదువలేదు. ఇంకా వివరముగా చూస్తే క్రింది విధముగా గలదు.
భగవద్గీతను ఏమాత్రము తెలియనివారు నూటికి 80 మంది హిందువులు గలరు.
భగవద్గీతను గురించి విని కూడా దానిని చూడనివారు నూటికి 10 మంది హిందువులుగలరు.
భగవద్గీతను చూచి కూడా దానిని చదవనివారు నూటికి 5 మంది హిందువులు గలరు.
భగవద్గీతను చూచి దానిని శ్రద్ధగా చదివినవారు నూటికి 5 మంది మాత్రమే గలరు.
భారతదేశములో మొదటవున్న హిందువుల సంఖ్య తగ్గుచూపోయి క్రైస్తవుల సంఖ్య వేగంగా, ముస్లీమ్ల సంఖ్య
నిదానముగా పెరుగుచూ వచ్చాయి. ఇదే సమయములో హిందూ మతరక్షణ కొరకు అనేక సంఘములు అనేక పేర్లతో
పుట్టుకొచ్చాయి. హిందూ ధర్మమంటే ఏమిటో తెలియని వారు హిందూ రక్షణ అను పేరును పెట్టుకొని, గ్రుడ్డిపాము
తన పిల్లలనే తిన్నట్లు హిందూ (ఇందూ) ధర్మమును బోధించు మమ్ములనే పరాయి మతముల క్రిందికి లెక్కగట్టారు.
క్రైస్తవులనుగానీ, ముస్లీమ్లనుగానీ ధర్మమును గురించి ప్రశ్నించు స్థోమతగల మమ్ములను కూడా ధర్మము, జ్ఞానము
తెలియని హిందువులు హేళన చేయుచున్నారు. మతము పేరుతో హిందువులు కొందరు గుంపులుగా ఏర్పడి రాజకీయముగా
ముందుకు పోవుచూ, దైవత్వ విధానమును ప్రపంచ సంబంధ రాజకీయమునకు ఉపయోగించుకొంటున్నారు. ఇది
దేవుని విధానములో నేరమగును.
ఏ మతములోగానీ దైవ విధానమునకు, దైవ జ్ఞానమునకు ఆటంకము కలుగకుండుటకు, వారు చేయు తప్పు
ఒప్పులను సూచించుటకూ, బ్రహ్మవిద్యా శాస్త్రమును దేవుడు వారివారి మతములలో గ్రంథ రూపములో ఇచ్చాడు.
దైవజ్ఞానమను పేరుతో మనిషి ఇష్టమొచ్చినట్లు తన భావములను చెప్పుకోకుండా నిలిపివేయుటకు చెక్పోస్టు (తనిఖీ
కేంద్రము) లాంటిది శాస్త్రము. పాలలోనికి నీరు కలిపినట్లు, స్వచ్ఛమైన దైవజ్ఞానములోనికి మనుషుల స్వార్ధ జ్ఞానము
కలిసినా, పాలలో నీరు శాతమును చూపుయంత్రములాగా బ్రహ్మవిద్యాశాస్త్రము దైవజ్ఞానములో కలిసిన మనుషుల
జ్ఞానమును బయటికి చూపగలదు. మనిషి ఎక్కడైనా, ఎంత పెద్దస్వామివద్దనైనా జ్ఞానమును వింటే దానిలో
శాస్త్రబద్దతయుందో లేదో గమనించి, శాస్త్రీయమైన దానిని గ్రహించి, శాస్త్రీయము కానిదానిని వదలివేయమని
21

Page 22
చెప్పుచున్నాము. ఏయే మతములలో ఎవరెవరు అశాస్త్రీయముగా వారి జ్ఞానమును చెప్పుకొంటున్నారో, ఎటువంటివారు
దేవుని కోర్టులో దోషులుగా, శిక్షార్హులుగా నిలబడగలరో, వారివారి జ్ఞానమునుబట్టి చూస్తాము. నేను ఎవరికీ అర్ధము
అయినా కాకపోయినా నేను స్వచ్ఛమైన ఇందువును. అంతేకాకుండా నాకు నేను స్వయముగా పెట్టుకోని ఒక బిరుదు
కలదు, అదియే “ఇందూ ధర్మప్రదాత”. శాస్త్రీయమైన ఇందూ ధర్మములతో (దైవ జ్ఞాన ధర్మములతో) మొదట ఇందూ
(హిందూ) మతములోని లోటుపాట్లను గురించే చెప్పుకొందాము.
సరిగ్గా నిన్నటిదినము 19-03-2013 మంగళవారము జమ్మల మడుగు దగ్గరగల వద్దిరాల గ్రామస్థుడు
ఒకరు మా ప్రబోధాశ్రమమునకు వచ్చి మా భక్తులతో దైవజ్ఞానమును గురించి వాదించి పోయాడు. ఆయన వాదన
ఇలా ఉన్నది. దేవున్ని ఇంతవరకు ఎవరూ చూడలేదని, దేవుడు ఎవరికీ కనిపించడనీ మీరు చెప్పుచున్నారు. మీమాట
పూర్తి అసత్యము, దేవున్ని చూచిన వారు ఎందరో ఉన్నారు. రామక్రిష్ణ పరమహంస “నేను దేవున్ని చూచాను” అని
చెప్పాడు కదా! అంతేకాక చాలామంది మేము చూచామని చెప్పారు. అటువంటపుడు మీరు ఎవరూ చూడలేదని
ఎందుకు చెప్పుచున్నారని వాదించాడు. దానికి మావారు వివరంగా చెప్పను ప్రయత్నిస్తే, అతను నాకు జ్ఞానమంతా
తెలుసు, మీరు నాకేమి చెప్పవలసిన అవసరము లేదన్నాడట. సరే ఆయన మాట ప్రకారమే ఆయన జ్ఞానమును తెలిసి
మాట్లాడుచున్నపుడు, ఆయన జ్ఞానమును మనము విన్నప్పుడు, అది సరియైనదో కాదో అని మనము చూచుకోవలసిన
అవసరమున్నది. పాలను పాలడిగ్రీ యంత్రముతో పరీక్షించి, పాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసుకొన్నట్లు, ఇప్పుడు
ఆ వ్యక్తి చెప్పిన జ్ఞానము సరియైనదో కాదో, బ్రహ్మవిద్యా శాస్త్రమును ఆధారము చేసుకొని, మనుషులకు దేవుడు
కనిపిస్తాడా లేదాయని చూడవలసియున్నది.
మేము దేవున్ని చూచాము అనువారు ఇస్లామ్లో తప్ప క్రైస్తవములోనూ, హిందువులలోనూ అక్కడక్కడ
ఉన్నారు. రామక్రిష్ణ పరమహంసను వివేకానందుడు మొదట కలిసినప్పుడు “నీవు దేవున్ని చూచావా? నాకు చూపగలవా”
అని అడిగాడు. అప్పుడు రామక్రిష్ణ పరమహంసగారు "నేను దేవున్ని చూచాను, నీకు చూపగలను" అన్నాడు. నేను
చూచాను నీకు చూపగలను అనుట వలన వివేకానందుడు అంతటితో గురువును అన్వేషించుట మానివేసి పరమహంస
దగ్గర శిష్యునిగా చేరాడు. ఈ విషయము "స్వామి వివేకానంద ప్రామాణిక సమగ్ర జీవితగాథ" అను గ్రంథములో 84వ
పేజీయందు ఇలా కలదు.
వివేకానందుడు : "మహాశయా, మీరు భగవంతున్ని కళ్ళారా చూచారా?
రామక్రిష్ణ
: అవును చూచాను. ఎంతో స్పష్టముగా నిన్ను చూస్తున్నంత స్పష్టముగా, ఇంకా స్పష్టముగా నీతో
మాట్లాడుచున్నట్లు మాట్లాడవచ్చు. చూడవచ్చును.
అదే 84వ పేజీలో క్రింది పేరాలో వివేకానందుడు అన్నమాటలను గమనిద్దాము "ఆయన అప్పటి మాటలు,
కాసేపటిక్రితం ప్రవర్తించిన తీరు ఎంతో విరుద్ధముగా కనిపించాయి. అలా అయితే కొన్ని సమయాలలో స్పష్టంగానూ,
మరికొన్ని సమయాలల్లో పిచ్చిపట్టినట్లు ఉంటారాయన, బహుశా సగం పిచ్చేమో అని అనిపించింది.” ఈ విధముగా
పరమహంసను గురించి చాలామార్లు వివేకానందుడు అనుకోవడము జరిగినది. దేవున్ని నేను చూచాను నీకు చూపుతానని
చెప్పిన రామకృష్ణ చాలాకాలము వరకు ఏమీ చూపలేదు. చివరకు రామకృష్ణులవారికి వ్యాధి ముదిరి మరణ కాలము
దగ్గరైనప్పుడు తనకు దేవున్ని చూపుతానని ఇంతకాలమూ చూపని దానివలన వివేకానందుడు సహనము కోల్పోయి
మాట్లాడిన మాటలను అదే గ్రంథములో 172 పేజీలో చూడవచ్చును.
22

Page 23
నరేంద్రుడు
660"
మ”
: దేవుడు, గీవుడు అంటూ ఏదీ లేదు. ఇదిగో నేను ఈ చెట్టును చూస్తున్నాను. ఆ విధముగా ఎవరైనా
దేవున్ని చూచారా?
: ఎందుకు, గురుదేవులు చూచారుకదా!
నరేంద్రుడు : అది ఆయన మనోభ్రాంతి దృశ్యము కావచ్చు.
తర్వాత కొన్ని దినములకు పరమహంస రామకృష్ణులు చని పోయారు. పరమహంస అస్తికల కలశమును,
ఆయన పటమును ఉంచిన గదిలో పరమహంసకు పూజ చేయాలని శిష్యులందరూ ప్రారంభించినపుడు పూజా
మందిరములో నిలబడే, ఆరాధనను ప్రతిఘటిస్తూ వాడిగా వేడిగా వివేకానందుడు వాదించసాగాడు. మరొక శిష్యుడు
స్వామి రామక్రిష్ణానంద కూడా యుక్తమైన జవాబిచ్చాడు. కాసేపటికల్లా వాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. అప్పుడు
స్వామి రామకృష్ణానంద గారు స్వామీజీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ పూజమందిరమునుండి బయటికి త్రోసివేశాడు.
చూచారా వివేకానందుడు రామకృష్ణ పరమహంసగారి ఆరాధనలో తనకు పరమహంసగారు దేవున్ని చూపకుండా
చనిపోయాడను ఆవేదనతో అలా ప్రవర్తించాడని అర్థమగుచున్నది. దేవుడు కనిపిస్తాడనడము అసత్యమని వివేకానందునికి
బాగా తెలిసిపోయింది. అందువలన ఒక భక్తుడు నాకు దేవుడు కనిపించలేదు జీవితమే వృథా అని అన్నప్పుడు
ప్రక్కనేవున్న వివేకానందుడు “ఇదిగో నీ ప్రక్కనే కత్తివుంది, తీసుకొని పొడుచుకో” అని హేళనగా అన్నాడు. ఈ విధమైన
ఆయన మాటలు దేవుడు ఎవరికీ కనిపించడు అను ఉద్దేశ్యమును బయల్పరుచుచున్నవి.
ఇదంతయు యదార్థముగా జరిగిన సంఘటనలుకాగా, ఆ సంఘటనలలో రామకృష్ణుడు దేవున్ని వివేకానందునికి
చూపలేదని స్పష్టముగావుంటే, రామక్రిష్ణపరమహంస చూచాడు అని అనుట జ్ఞానము తెలిసినవాడు మాట్లాడు మాటయేనా?
నేను చూచాను అని చెప్పిన రామకృష్ణ పరమహంసనే వివేకానందుడు తిక్కవాని క్రిందికి లెక్కవేయగా! వద్దిరాల నుండి
వచ్చిన వానిని పూర్తి మతిలేని వాని క్రిందికి జమకట్టవలసిందే. నోరుందని దేవుని జ్ఞానమును అశాస్త్రీయముగా
మాట్లాడితే, అది దేవుని మాటకు వ్యతిరేఖమై పోవుట వలన, ఎవడైన దేవుని శిక్షకు గురికావలసిందే. ఇప్పుడు
పొగరుబట్టి దైవజ్ఞానమునకు విరుద్ధముగా మాట్లాడితే, శిక్ష అమలు జరుగునప్పుడు అన్ని పొగరులు అణిగిపోయి,
ఎందుకు చేసుకొన్నాను ఈ పాపమును అని రోదించవలసియుంటుంది జాగ్రత్త.
ఇట
ఇక బ్రహ్మవిద్యా శాస్త్రబద్దముగా దేవుడు ఎవరికీ కనిపించడూ, ఎవరితోనూ మాట్లాడడు అనుటకు
భగవద్గీతలోనూ, అటు ఖుర్ఆన్ మరియు బైబిల్ గ్రంథములోనూ ఆధారములు గలవు, వాటిని ఇప్పుడు చూస్తాము.
భగవద్గీతయందు విజ్ఞాన యోగమను అధ్యాయములో...
24వ శ్లో॥ అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యస్తే మామబుద్ధయః |
పరం భావ మజానన్తో మమావ్యయ మనుత్తమమ్ ||
25వ శ్లో॥
నాహం ప్రకాశ స్వర్వశ్య యోగమాయా సమావృతః |
మూడో యం నాభిజానాతి లోకో మా మజ మవ్యయమ్||
26వ శ్లో॥
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణిచ భూతాని మాంతు వేదన కశ్చన ॥
23

Page 24
భావములు :- అన్నిటికంటే ఉత్తమమైనదీ, నాశనములేనిదీ అయిన దైవత్వమును తెలియని బుద్ధిహీనులైన కొందరు,
ఎవరికీ కనిపించని నన్ను మేము చూచాము అంటున్నారు. యోగమాయ గప్పియున్న నన్ను చూచుటకు ఏ మానవునికీ
చేతకాదు. ఇటు పుట్టుకగానీ, అటు మరణముగానీ లేని నేను ఎట్లున్నది అజ్ఞానులైన మనుషులకు తెలియదు. ఈ
జగతిలో సర్వజీవరాసులకు జరుగుచున్న వర్తమాన కాలమూ, జరిగినట్టి భూతకాలమూ, అట్లే జరుగబోవు భవిష్యత్తు
కాలములోని సమాచారము నాకు తెలుసు. త్రికాలములు తెలిసిన నేను ఎట్లున్నదీ ఎవరికీ తెలియదు.
ఇంతేకాక రాజవిద్యా రాజగుహ్య యోగము అను అధ్యాయములో నాల్గవ శ్లోకమున ఒక వాక్యము. "మయాతత
మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా" అని కలదు. దీని భావము "నేను ఇంద్రియములకు అగోచరునిగా ఉంటూ, ఈ
ప్రపంచమునంతటిని వ్యాపించియున్నాను.” ఈ మాటలన్నియు స్వయముగా భగవంతుడు చెప్పిన మాటలు. అందువలన
ఇవన్నియు బ్రహ్మవిద్యా శాస్త్రమునకు సంబంధించినవిగా లెక్కించుచున్నాము. నేను ఏ ఇంద్రియములకు తెలియను,
నన్ను ఎవరూ చూడలేరు అని దేవుడు చెప్పిన మాటలను అతిక్రమించి, నేను చూచాను అని ఎవడైనా అంటే, వాడు
అశాస్త్రీయముగా దేవుని ధర్మమునకు వ్యతిరేఖముగా మాట్లాడి నట్లగును. దేవుని మాటనుకాదనిన వాడు ఆయననూ,
ఆయన జ్ఞానమునూ దూషించినట్లగును. దైవదూషణ పాపము వానికి సంభవించును. దేవున్ని నేను చూచాను, నేను
మాట్లాడినాను అనినవారు ఎవరైనాగానీ, స్వామీజీలుగానీ, దైవమార్గములో నేరస్థులగుదురు, శిక్షార్హులగుదురు.
దేవున్ని ఎవరూ చూడలేరు, ఆయన ఎవరితోగానీ ప్రత్యక్షముగా మాట్లాడడు అనుటకు ఖుర్ఆన్ గ్రంథములో
సురా 6, ఆయత్ 103 నందు ఇలా కలదు. “ఎవరి చూపులు కూడా ఆయన్ను (దేవున్ని) అందుకోజాలవు. (అల్లాహ్ ను
ఎవరూ చూడలేరు) ఆయన మాత్రము అందరి చూపులను అందుకోగలడు. (అల్లాహ్ అందరినీ చూస్తున్నాడు.) ఆయన
సూక్ష్మదృష్ఠి కలవాడు, సర్వమూ తెలిసినవాడు. ఈ వాక్యములో దేవున్ని ఎవరూ చూడలేరుగానీ, దేవుడు అందరినీ
చూడగలడు అనివుంది. అంతేగాక 42వ సురాలో 51వ ఆయత్నందు కూడా ఇలా కలదు. " ఏ మానవుని తోనూ
దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడడము అనేది జరుగదు.” ఈ విధముగా దేవుడు తన గ్రంథములో చెప్పియుండగా,
ఆయన మాటలనుకాదని, మేము చూచాము, మేము మాట్లాడాము అంటే వారు ఎవరిని చూచారో? ఎవరితో మాట్లాడారో
వారికే తెలియాలి. వారు చూచినది మాత్రము దేవున్నికాదని బ్రహ్మవిద్యాశాస్త్రమే చెప్పుచున్నది. ఒక గురువు మీకు
దేవున్ని చూపుతాను ఫలానా దినము తనవద్దకు రమ్మని తన శిష్యులకు చెప్పాడట. దేవున్ని చూడాలనుకొను శిష్యులందరూ
ఆ దినము ఆసక్తిగా గురువువద్దకు పోయారు. అప్పుడు నేను దేవున్ని చూపుచున్నాను జాగ్రత్తగా చూడండి అని గురువు
చెప్పగా, మరీ జాగ్రత్తగలిగి పూర్తి ఎరుకగా శిష్యులు చూస్తున్నప్పుడు, తమ మధ్యలోనున్న శూన్యమైన బయలును చూపి
ఇదే దేవుని ఆకారము ఎవరూ చూడనిది ఇపుడు మీరు చూడగలిగారు అని చెప్పాడట. అప్పుడు ఒక శిష్యుడు లేచి ఈ
బయలును ప్రతి దినము మేము చూస్తునే ఉన్నాము. మేమే కాకుండా మా వెంటవుండే కుక్కలు, మా ఇంట్లోవుండే
పిల్లులు
లి చూస్తున్నాయి అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు "బయలే దేవుడు, బయలు దేవుడని ఇంతవరకు
మీకు తెలియదు కదా!” అన్నాడట. కొందరు ఆయన మాటలను గ్రుడ్డిగా నమ్మారు. కానీ కొందరు ప్రకృతిని చూపి
పరమాత్మ అంటున్నారు. ప్రకృతిని చేసినవాడు పరమాత్మ. ప్రకృతి కనిపిస్తున్నది, పరమాత్మ కనిపించడని ఈయనకు
తెలియదు కాబోలు అని అనుకొన్నారు. అంతటితో ఆ గురువును వదలి నిజమైన జ్ఞానము కొరకు అన్వేషణ సాగించారు.
నేటి కాలములో ఆధ్యాత్మికత అను పేరున్నదిగానీ, అందులో ఆత్మా లేదు, ఆధ్యయనమూ లేదు. మీకు
అర్థమగుటకు చిన్న ఉదాహరణను చెప్పుతాము చూడండి. నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఇల్లిల్లు తిరిగి జ్యోతిష్యము
24

Page 25
చెప్పి డబ్బు సంపాదించుకొనేవారిని చూచాను. “ఎరుక చెప్పుతాము” అని కొందరు ఆడవారు తలమీద బుట్టలు
పెట్టుకొని ఊరంతా తిరిగేవారు. ఊరిలో ఎవరో ఒకరు లేక కొందరు వారి చేత భవిష్యత్తును చెప్పించుకొనెడివారు.
ఎరుక చెప్పువారు చెప్పించుకొనువారి చేయి పట్టుకొని దేవతల పేర్లన్నీ చెప్పుచూ “అంబపలుకు, జగదాంబపలుకు,
కంచిమీనాక్షి పలుకు, మధుర కనకలక్ష్మి పలుకు" అనుచూ ఒక పాటలాగా దీర్ఘముగా వారికి తోచిన వాటిని వారు
చెప్పుచుందురు. దానిని “ఎరుక” అంటారు. ఎరుక అంటే జ్ఞానము అని అర్థమొస్తుంది. అయితే ఆ పదమును
జ్యోతిష్యము అని వాడుట సరికాదు. కానీ పూర్వము అలాగే అనెడివారు. పూర్వము ఎరుకల వారు ఎరుక చెప్పడము
ఒక విధమైన జ్యోతిష్యముకాగా, చిన్న పంజరములో చిలుకను పెట్టుకొని ఊరంతా తిరిగి చిలుకతో జ్యోతిష్యము చెప్పెడి
వారిని చూచాము. ఇంకా ఒక పుస్తకము లోనికి ఒక పుల్లను పెట్టి ఏ పేజీ తెరుచుకొంటే ఆ పేజీలో ఉన్న విషయమును
చదివి చెప్పెడివారిని చూచాను. అది కూడా ఒకరకమైన జ్యోతిష్యమే. ఇకపోతే తెల్లని గవ్వలను క్రిందవేసి అవి ఎన్ని
బోర్లపడినాయి, ఎన్ని వెల్లకిల పడినాయి అని చూచి వాటితో జ్యోతిష్యము చెప్పువారినీ చూచాము. కొందరు పంచాంగమును
చూచి జ్యోతిష్యమును చెప్పేవారిని కూడా చూచాము. కొందరు సంఖ్యాశాస్త్రము అని పేరుపెట్టి మనిషి పేరులోని
అంకెలనుబట్టి జ్యోతిష్యమును చెప్పువారు కూడా కలరు. ఈ విధముగా చెప్పుచూపోతే సమాజములో ఎన్నో రకముల
జ్యోతిష్యములు ప్రబలియున్నవి. వీటిలో శాస్త్రీయత ఉన్నది ఏదో ఒకటి నిజమైన జ్యోతిష్యమగును గానీ, శాస్త్రీయతలేనిది
జ్యోతిష్యముకాదని చెప్పవచ్చును. శాస్త్రీయతలేని జ్యోతిష్యము పేరుకు జ్యోతిష్యమగునుకానీ, అందులో సత్యము
ఏమాత్రము ఉండదు. అటువంటి వాటినన్నిటినీ మూఢనమ్మకముతో కూడుకొన్నవని చెప్పవచ్చును.
విధములుగా
అదే విధముగా ఆధ్యాత్మికము కూడా అనేక విధములుగా ప్రజలకు బోధింపబడుచున్నది. ఎరుక జ్యోతిష్యము,
పుల్ల జ్యోతిష్యము, గవ్వ జ్యోతిష్యము, చిలుక జ్యోతిష్యము అని అనేక రకముల జ్యోతిష్యములు అశాస్త్రీయముగా ఎలా
వ్యాపించి ఉన్నవో, అదే విధముగా నేటి కాలములో ప్రజలకు అనేక పద్ధతులుగా ఆధ్యాత్మికము చెప్పబడుచున్నది. ఏ
విధముగా అనేక రకముల జ్యోతిష్యులున్నారో, అదే విధముగా అనేకరక ఆధ్యాత్మిక బోధకులు కూడా ఉన్నారు.
జ్యోతిష్యములు ఎన్నియున్నా అవి ఎలా శాస్త్రబద్ధము కాకుండా అసత్యముగా ఉన్నవో, అట్లే నేటి అనేక రక ఆధ్యాత్మిక
బోధలు ఏమాత్రము శాస్త్రీయతలేనివై పోయాయి. జ్యోతిష్యము పదిలేక పదిహేను రకములుగా ఉంటే, ఆధ్యాత్మికము
మాత్రము దాదాపు రెండు మూడు వందల రకములుగా ఉన్నవని చెప్పవచ్చును. ఇన్ని వందల రకములలో పూర్తి
శాస్త్రీయమైనది దీపముపెట్టి వెదకినా కనిపించకుండా పోయినది. అయినా మనిషి బోధకుల వెంటపడుతూనే ఉన్నాడు,
బోధకులు వారివారి బోధలను చెప్పుతూనే ఉన్నారు. ఈ విధముగా నేటి ఆధ్యాత్మికము దారితప్పి నడుస్తున్నది. ఇంతమంది
బోధకులలో నా బోధ గొప్పదని ఒకరుంటూ వుంటే, లేదు అన్నిటికంటే నా బోధే గొప్పదని మరొకరంటున్నారు. ఈ
విధముగా నేను గొప్ప, నా బోధ గొప్ప అనుచూ బోధకులందరూ దేశములో డబ్బుకొరకు, పేరు ప్రఖ్యాతులకొరకు
ప్రాకులాడుచున్నారు తప్ప దేవుని జ్ఞానము కొరకు ఏమాత్రమూ కనీస ప్రయత్నము కూడా చేయలేదని అర్థమగుచున్నది.
కొందరి దృష్ఠిలో ఆధ్యాత్మిక బోధ ఒక వ్యాపారములాగ మారిపోయినది. ఆధ్యాత్మికము పవిత్రమైనదనీ, శక్తితో
కూడుకొన్నదనీ బోధకులు కూడా అనుకోవడములేదు. ఇదంతా నా అనుభవముతో చెప్పుచున్నాను. నా అనుభవమేమిటో
క్రింద వ్రాస్తున్నాను చూడండి.
దాదాపు ముప్పయి సంవత్సరముల క్రిందట నేను కర్నూలు జిల్లాలో ఒక స్వామీజీని కలిసాను. నేను ఏ
గుర్తింపూలేని సాధారణ వ్యక్తిగా ఆయనను కలిసాను. అప్పటి కాలములో ఆయన బాగా ఉపన్యాసములు చెప్పి మంచి
25

Page 26
పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పేరును కొంతమార్చి చెప్పితే ప్రనాధ చైతన్య స్వామి. అప్పటికాలములో హిందూమత
రక్షణ సంఘములన్నీ ఆయనను గొప్పగా పొగిడేవి. ఎందుకనగా ఆ స్వామీజీ హిందూ మతమును గొప్పగ చెప్పుచూ
ఇస్లామ్ మతమునూ, క్రైస్తవ మతమునూ ఎక్కువ దూషించడమూ విమర్శించడమూ చేసెడివాడు. అప్పటికాలములో
ధైర్యముగా మాట్లాడే స్వామి అని చాలామంది ఆయనను పొగుడుచుండెడివారు. ఆ స్వామివద్ద ఒక రోజంతా గడిపాను.
రాత్రి అన్నము తిన్న తర్వాత 8 గంటల నుండి 2 గంటల వరకు అనగా ఆరు గంటలసేపు కూర్చున్న వారము
లేవకుండ మాట్లాడినాము. నేను ఎన్నో ప్రశ్నలను అడుగుచూ వచ్చాను. ఆయన పురాణములనూ, ఇతిహాసములనూ
వాడుకొంటూ ఒక్కొక్కప్పుడు భగవద్గీత నూ, ఉపనిషత్తులనూ వాడుకొంటూ జవాబులు చెప్పుచూవచ్చాడు.
చెప్పడములో కొన్ని విషయములను ముందు ఒకరకముగా చెప్పి వాటినే తర్వాత ఇంకొక రకముగా చెప్పవలసి వచ్చినది.
అలాగే ముందు ఆయనే అవును అని చెప్పిన మాటలను చివరకు ఆయనే సందర్భమునుబట్టి కాదనవలసి వచ్చినది.
చివరకు ఆయనకే తాను ఒకే విషయమును రెండు రకములుగా మాట్లాడినానని అర్థమైనది. అదే విషయమునే నేను
కూడా 'అప్పుడేమో అలా చెప్పారు చివరకు ఇప్పుడు ఇలా చెప్పుచున్నారే' అని అడిగాను. దానికి ఆయన నేను
ఆశ్చర్యపోయే విషయమును చెప్పాడు. అదేమనగా! "కొన్ని చోట్ల అలాగే మాట్లాడవలసివస్తుంది. అలా మాట్లాడితేనే
ప్రజలకు సంతోషము, అలా మాట్లాడకపోతే వారికి మనము నచ్చము.” అన్నాడు. అప్పుడు నేను "ప్రపంచ విషయములనైతే
ఎలామార్చి మాట్లాడినా ఫరవాలేదు. ఇది దేవుని విషయముకదా శాస్త్రబద్ధమై ఎప్పటికీ ఒకేలాగుండునది కదా!
అలాంటపుడు ఒకమారు ఒకరకము, మరొకమారు ఇంకొకరకము చెప్పితే దేవుని జ్ఞానమును చిన్నబుచ్చినట్లు కాదా.”
అని అడిగాము. దానికి జవాబుగా ఆయన “నేను ఏమీ దాచకుండా ఉన్న సత్యమును చెప్పుతాను విను. నిజంగా
చెప్పితే దేవుడూ లేడు, దయ్యమూ లేదు. ఆ విషయమును గురించి మాట్లాడుకోవడమే వృథా ప్రయాస” అని నవ్వుతూ
చెప్పాడు. అప్పుడు నాకు పూర్తి ఆశ్చర్యమై “మీరు సమాజములో పేరున్న స్వామీజీగా ఉన్నారు. ఎన్నో ఊర్లలో
పెద్దపెద్ద సభలలో వారము రోజులు ప్రవచించి మంచిపేరు తెచ్చుకొన్నారు. దేవున్ని గురించి, దైవజ్ఞానమును గురించి
ఎన్నో ఉపమానములను చెప్పి పామరులకు కూడ అర్థమగులాగున బోధించారు. అటువంటి మీరే దేవుడులేడు,
దయ్యములేదు అనడము నాకు ఆశ్చర్యముగా ఉంది. దేవుడు లేనప్పుడు, ఆ విషయము మీకు తెలిసినప్పుడు, మీరు
కాషాయములను ధరించి స్వామీజీగా ఉంటూ అలా ఎందుకు బోధించాలి? అని అడిగాను.
అప్పుడు ఆయన మరొక ఆశ్చర్యకరమైన విషయమును సున్నితముగా ఏమాత్రము తొణకకుండా ఈ విధముగా
చెప్పాడు. "నేను ప్రజల కొరకు చెప్పాను. నా కొరకు కాదు. నాకు దేవుడున్నాడను నమ్మకము లేదు. ప్రజలకు
దేవునిమీద నమ్మకముంది. కావున వారికొరకు చెప్పాను. వారము రోజులకు లక్షరూపాయలు డబ్బు ఇచ్చి మాకు
దేవుని జ్ఞానమును గురించిన ప్రవచనాలు చెప్పండి అని అడిగారు. కావున నేను డబ్బు తీసుకొన్నందుకు చెప్పాను.
వారికి ప్రవచనము కావాలి, నాకు డబ్బు కావాలి. అందువలన నాకు దేవుడు లేడని తెలిసినా, వారికి ఉన్నాడని
చెప్పడము అవసరము. కాబట్టి వారికి ఏ విధముగా నచ్చితే ఆ విధముగా చెప్పాను. సినిమాలో యన్.టి. రామారావు
రాముడు లేక కృష్ణుని వేషము వేసి పాత్రకు తగినట్లు నటిస్తున్నాడు. వాస్తవానికి ఆయన రాముడుగానీ, కృష్ణుడుగానీ
కాదు కదా! నటించినందుకు ప్రతిఫలముగా డబ్బులు తీసుకొంటున్నాడు కదా! రాముని వేషము వేసినవాడు రాముడే
అయి వుండవలసిన పనిలేదు కదా! అలాగే దేవుని ఉపన్యాసము చెప్పాను. చెప్పినంతమాత్రమున నిజముగా స్వామియో
లేక భక్తుడో అయివుండవలసిన పనిలేదు. ఇప్పుడు భక్తి జ్ఞానమును గురించి ఉపన్యాసములు చెప్పువారందరికీ నిజముగా
26

Page 27
దేవుని మీద భక్తి ఉందనుకోవడము పొరపాటు" అన్నాడు. ఇదంతయు వినిన నేను కొంత ఆశ్చర్యపోయినా,
ఉన్నదున్నట్లు చెప్పినందుకు ఒక విధముగా ఆయనను పొగడవలసిందేననుకొన్నాను.
ఆధ్యాత్మికము అనునది ఉన్నత పదమే అయినా అందులో ఆత్మగానీ, ఆధ్యాయనముగానీ లేదని చెప్పుకొన్నాము
కదా! నేడు జ్యోతిష్యము అనునది కొన్ని రకములే అయితే, ఆధ్యాత్మికము అను పేరు గలది అనేక రకములుగా
ఉన్నదని కూడా చెప్పుకొన్నాము. ఒక గురువేమో నాసికాగ్రము మీద ధ్యాస నిలుపవలెనంటాడు. మరొక గురువేమో
ముక్కు మీద కాదు, దాని అగ్రము మీద అంతకూ కాదు. ముక్కులోపలి శ్వాస మీద ధ్యాసను పెట్టవలెనంటాడు. ఒక
గురువేమో ముక్కుమీద వద్దు శ్వాసమీద వద్దు, మనస్సు మీద పెట్టుకోమంటాడు. మరొక గురువేమో “మనస్సు
ఎక్కడుండేది, ఎట్లుండేది తెలియదు. అది ఎక్కడుండేది తెలియనప్పుడు దానిమీద ధ్యాసను ఎలా పెట్టుతావు? వారు
చెప్పినదంతా అబద్దము, నేను చెప్పునది మాత్రమే సత్యము. నీ ధ్యాసను భూృమధ్య స్థానములో పెట్టు" అని అనుచున్నారు.
మరొక గురువేమో నేను మంత్రో పదేశమును ఇస్తాను, దానిని నిత్యము కొంతసేపు ధ్యానించుకొనుచూవుండు, దానివలన
జన్మలు లేకుండా పోతాయి అనుచున్నాడు. బ్రహ్మకుమారి సమాజమను వారు ఓంశాంతి అంటారు. శివుడు గుండ్రని
ఎర్రని వెలుగుగా ఉన్నాడంటారు. పిరమిడ్వాళ్ళు పిరమిడ్లో ధ్యానముచేయి అంటారు. రామకృష్ణ పరమహంస
మఠమువారు అంతా కాళీమాతనే అంటారు. బాబాలుగానున్న వారేమో వేరే ధ్యానమువద్దు, వేరే ధ్యాసవద్దు నేనే దేవున్ని
అనుచున్నారు. కొందరు స్వామీజీలేమో నన్ను తాకితే మీకు మోక్షము వస్తుంది అంటున్నారు. కొందరేమో దేవుడు
నగ్నముగా పుట్టించితే తిరిగి దేవుని దగ్గరకు పోవుటకు నగ్నముగానే ఉండవలెనంటారు. ఇలా చెప్పుకొంటూపోతే
కొన్ని వందల విధానములు భక్తి, ధ్యానము, యోగము, దీక్ష, ఉపాసన అను పేర్లతో ఉంటూ ఒక్కొక్క దానియందు ఎన్నో
చీలికలు కల్గియున్నవి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానమును బోధించుచూ ఆధ్యాత్మికమను దానిని హద్దూ పద్దూ
లేనిదానిగా, ఇష్టారాజ్యముగా చేశారు. ఎవరికి తోచింది వారు చెప్పుచూ ఇదియే నిజమైన జ్ఞానమంటున్నారు.
ఎన్నో విధములుగానున్న ఆధ్యాత్మికమును చూచి కొందరు ఎటూ పోకుండా దేవుని జ్ఞానమునే నమ్మకుండా
పోయారు. కొందరు దొరికిన దానితో తృప్తిచెంది గ్రుడ్డికంటే మెల్ల మేలన్నట్లు, ఏదీ లేకుండా ఉండే దానికంటే, ఏదో
ఒకటి ఉంటే చాలులే అనుకొన్నారు. కొందరేమో జీవితములో ఒకమారు ఏదో ఒక గురువువద్ద ఉపదేశము తీసుకొంటే
చాలు అని అనుకొనువారు కూడా కలరు. ఇలా ఎన్ని రకముల గురువులు ఉన్నారో, అన్ని రకముల శిష్యులు కూడా
ఉన్నారు. ఇకపోతే లక్షకొకరు దేవుని జ్ఞానమును తెలుసుకోవాలను ప్రయత్నమును చేయుచున్నారు. దేవుని మీద పూర్తి
ఇష్టత కల్గి, దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలుసుకోవాలనుకొనువారు కూడా లక్షకొకరు, పదిలక్షలకొకరు, కోటికొకరు
అక్కడక్కడ కనిపిస్తున్నారు. అటువంటి వారికి ఎంత పెద్దస్వామి చెప్పినదైనా అది అశాస్త్రీయమైతే దానిని వారు
ఒప్పుకోవడములేదు. అది నిజమైన జ్ఞానము కాదని వారికి తెలిసిపోవుచున్నది. అటువంటి బోధలతో వారు తృప్తి
చెందక వారికి కావలసిన సంపూర్ణమైన బోధ కొరకు అన్వేషణ సాగిస్తూనే ఉంటారు. అటువంటి శ్రద్ధగలవారికి
తప్పనిసరిగా వారికి కావలసిన జ్ఞానమును దేవుడు అందునట్లు చేస్తాడు. దేవుడు చేస్తాడు అంటే దేవుడు స్వయముగా
చేయడు. దేవుని బాధ్యతలను స్వీకరించి పని చేయుచున్న ప్రకృతియే చేస్తుందని అర్థము.
ఆధ్యాత్మికము కొందరి స్వామీజీల చేతులలో నాటకీయమైనది. స్వామీజీలు అసలైన దేవున్ని వదలిపెట్టి తామే
స్వయముగా దేవుళ్ళను సృష్టించుచున్నారు. వారికి తగిన జ్ఞానమునూ, దానికి తగిన ఆచార వ్యవహారములనూ తయారు
చేయుచున్నారు. ఇట్లు ఏదో ఒక విధముగా తమ ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తున్నారు. అటువంటి కోవలోనే
27

Page 28
దేవుడు చెప్పని మతములను మనిషి తయారు చేసుకొన్నాడు. కొందరు సృష్టించిన కొన్ని భక్తి విధానములే కాకుండా,
పెద్ద గుంపుగా తయారగుటకు మత విధానములనే మనిషి సృష్టించాడు. మతము అను అంధత్వములో దేవుని
జ్ఞానమును మనిషి వక్రీకరించుకొన్నాడు. మనిషి తన మత చాంధసముతో దేవుని జ్ఞానమును అశాస్త్రీయము చేశాడు.
మనిషి బయట సమాజములో దొంగతనము చేస్తే కోర్టు, విచారణ, శిక్ష వుంటుంది. అలాగే అత్యాచారము చేసినా,
హత్య చేసినా, ఇతరులను హింసించినా మొదలగు ఎటువంటి తప్పుచేసినా కోర్టు శిక్ష ఉంటే, ఏకంగా దేవుని విషయములోనే
తప్పు చేస్తే కోర్టు, విచారణ, శిక్ష ఉండదా? అని అంటే, తప్పనిసరిగా ఉంటుందనియే చెప్పాలి. బయటి సమాజములో
కోర్టులో ఏదో ఒక ఉపాయముతో నేరమును చేయనివానిగా తప్పించుకొని బయటపడవచ్చునుగానీ, దేవుని విషయములో
జరిగిన తప్పునుండి ఎవడూ తప్పించుకోలేడు. ఎవని తెలివి తేటలుగానీ, ధనము హెూదాలుగానీ దేవుని శిక్షనుండి
బయటపడవేయలేవు. దేవుని విషయములోగానీ, దేవుని జ్ఞాన విషయములోగానీ తప్పుచేసినవానికి దాని విచారణ
కనిపించదు. శిక్షను వేయువాడు కనిపించడు, శిక్ష ఏమైనది ఎవరికీ తెలియదు. అది అనుభవానికి వచ్చినప్పుడు కూడా
అది దేని మూలముగా వచ్చిన శిక్షని కూడా తెలియదు. బయటి సమాజములో ప్రపంచ సంబంధ నేరములు చేస్తే,
బయట ప్రపంచములోనే శరీరముతో ఉన్నప్పుడే అనుభవిస్తున్నాడు. అలాగే కనిపించని దేవుని విషయములోగానీ,
జ్ఞానము ఎడలగానీ చేసిన తప్పుకు శిక్షను మనిషి ఈ కనిపించే ప్రపంచములోనే అనుభవించవలసి వుంటుంది.
భారతదేశములో మనకు భగవంతుడు ఐదువేల సంవత్సరముల పూర్వము దైవజ్ఞానమును బోధించాడు. ఆనాడు
అధర్మములు వ్యాపించి ధర్మములు తెలియకుండా పోయాయను ఉద్దేశ్యముతో దేవుని అంశ లేక శక్తి భగవంతుడు
అనబడు వ్యక్తిగా వచ్చి దేవుని ధర్మములను బోధించి పోయాడు. ద్వాపరయుగము అంత్యములో ప్రపంచ సంబంధముగ
ఇప్పుడున్నంత అన్యాయములు అక్రమములు ఆనాడు లేవు. అంతేకాక దైవజ్ఞానసంబంధముగా ఈనాడున్నంత గురువులు,
ఈనాడున్నంత అనేక భక్తి విధానములు, ఈనాడున్నంత దేవతల గుడులు, ఈనాడ్నుంత స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు,
ఈనాడున్నంత ఉపదేశములు, ఈనాడున్నంత అనేకరక ఆరాధనలు ఆనాడు లేవనియే చెప్పవచ్చును. అయితే ఆ
దినములలోనే ధర్మములకు ముప్పు ఏర్పడినదని దేవుడు భగవంతునిగా వచ్చి తన విషయములను తానే చెప్పిపోయాడు.
ఆనాడు ఎందరో మహర్షులున్నా భగవంతుడు రావలసిన పని వచ్చినది. ఆనాడు అధర్మములు ప్రబలుటకు ఒకే ఒక్క
కారణము కలదు. కృష్ణునికంటే ముందు పుట్టిన వ్యాసుడు చేసిన పనివలన ధర్మములకు ముప్పు ఏర్పడినదని
చెప్పవచ్చును.
వ్యాసుడు వ్రాసిన నాల్గువేదములు, 1108 ఉపనిషత్తులు. 18 పురాణములు ఆనాడు ప్రజలలోనికి చొచ్చుకొని
పోయాయి. అప్పటి కాలములో విద్యావేత్త, కవి, ప్రజ్ఞాశాలి అని పేరుగాంచిన వ్యాసుడు వ్రాసిన గ్రంథముల మీద
ప్రజలకు గౌరవముండుటచేత, అప్పటికాలములో ఇతర గ్రంథములు ఏవీ లేనిదానివలన, వ్యాసుని గ్రంథములను
అందరూ చదివారు. పందుల రక్తమును పీల్చిన దోమల వలన ప్రజలకు మెదడు వాపు వ్యాధి వచ్చినట్లు, వ్యాసుడు
వ్రాసిన గ్రంథములలోని మాయ ప్రభావము వలన ప్రజలలో అధర్మములు వ్యాపించినవి. వేదములు, పురాణములు,
ఉపనిషత్తులు అందరికీ నేటికినీ బాగా కనిపిస్తున్నవి, వాటిలో మాయతో కూడిన అధర్మములున్నవని ఇప్పటికీ ఎవరికీ
తెలియదు. మనకు తెలియని విషయమును గ్రహించిన దేవుడు భగవంతుని ద్వారా తన ధర్మములను తెలియజేశాడు.
అయినా భగవంతుడు చెప్పిన భగవద్గీతలో అసలైన దేవుని ధర్మములున్నాయని కూడా చాలామందికి తెలియదు. భగవద్గీత
నేడు కోర్టులో సాక్ష్యులవద్ద సాక్ష్యము చెప్పుటకు గ్రంథమును ప్రమాణము చేయుటకు చూపుచున్నారు. అయితే
28

Page 29
గీతమీద ప్రమాణము చేయువానికి భగవద్గీత అంటే ఏమిటో? భగవద్గీతలో ఏమున్నదో కూడా తెలియదు. ఈ విధముగా
చూస్తే వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ప్రాకినట్లు భగవద్గీత పుట్టి ఐదువేల సంవత్సరములైనా ప్రజలలోనికి
ప్రాకలేదనియే చెప్పవచ్చును.
నేడు భూమిమీదున్న లక్షలాది గ్రంథములలో ముందు వచ్చినదీ, మనిషి జీవితమునకు అవసరమైన దేవుని
ధర్మములుగలదీ, భగవద్గీతయని చెప్పవచ్చును. తర్వాత అదే కోవకు చెంది ధర్మములు బోధించినది భగవద్గీత తర్వాత
మూడు వేల సంవత్సరములకు వచ్చిన బైబిలు గ్రంథము. ఆ తర్వాత ఆరు వందల సంవత్సరములకు వచ్చిన గ్రంథము
ఖుర్ఆన్ గ్రంథమని చెప్పవచ్చును. ఈ మూడు గ్రంథములు దైవజ్ఞానమునకు ధర్మములకు మూలగ్రంథములని
చెప్పవచ్చును. మొదట భగవద్గీత వ్యాసుని చేత సంస్కృత భాషలో హిందీలిపితో వ్రాయబడినది. తర్వాత వచ్చిన బైబిలు
హెబ్రిభాషలో వ్రాయబడినది. ఆ తర్వాత వచ్చిన ఖుర్ఆన్ అరబ్బీ భాషలో వ్రాయబడినది. మొదట చెప్పిన భగవద్గీత
కేవలము ఐదు లేక పది నిమిషములలో చెప్పినదే. అది కృష్ణుడు చెప్పగా అర్జునుడు విని కొద్ది రోజుల తర్వాతే
వ్యాసునికి చెప్పగా, ఆయన వినిన సారాంశమును విపులముగా విడదీసి శ్లోకముల రూపములో వ్రాయడము జరిగినది.
మొదట అర్జునుడు విన్నది కొద్ది నిమిషముల సారాంశమే అయిన దానివలన విన్నది విన్నట్లు వ్యాసునికి తెలుపడము
జరిగినది. దానివలన కృష్ణుడు చెప్పిన కొద్దిపాటి సమాచారము ఉన్నదున్నట్లు వ్యాసుని వరకు చేరినదని చెప్పవచ్చును.
విన్న దానిని పూర్తిగా వ్యాసుడు వ్రాయడము జరిగినది. అక్కడి వరకు కూడా దేవుని జ్ఞానము చెక్కుచెదరకుండా
శ్లోకముల రూపములో ప్రజలవరకు చేరినది. ఈ విధముగా వచ్చిన సంస్కృత భగవద్గీతను సంస్కృతము తెలిసినవారందరు
ఇతర భాషలలోనికి అనువదించి వ్రాయడము జరిగినది. ఇప్పుడు మనవరకు సంస్కృతము, తెలుగు వచ్చినవారు
తెలుగులోనికి వ్రాయడము జరిగినది. అలా వ్రాసిన భగవద్గీతలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని మధ్యరకమువి
అనేక రకములు కనిపిస్తున్నవి.
సంస్కృత భాషలోయున్న గ్రంథము ఒకే పరిమాణములో ఉండగా తెలుగులోనికి అనువదించినవి చిన్నవి,
పెద్దవి అయినాయంటే వాటిలో ఏదో హెచ్చుతగ్గులు జరిగిందని సులభముగా తెలిసిపోవుచున్నది. ఒకే శ్లోకమునే
అనువదించిన వ్యక్తి యొక్క భావమునుబట్టి ఎక్కువగా కొంత మంది, తక్కువగా కొంతమంది వ్రాయడము జరిగినది.
శ్లోకములోని సత్యము ఒక్కటే అయినా, వ్రాసిన వారి భావములోనికి చేరినవి కొన్ని సత్యములు మరికొన్ని అసత్యములుండుట
వలన వ్యక్తి వ్యక్తికీ రచనలు పొడుగు పొట్టి అయిపోయాయి. అందువలన కొన్ని చిన్న భగవద్గీతలు, కొన్ని పెద్దభగవద్గీతలు
బయటికి వచ్చాయి. మూడు సంవత్సరముల క్రితము వరకు విద్యాప్రకాశానందగిరి వ్రాసిన 'గీతామకరందము' అను
భగవద్గీత అందరి భగవద్గీతలకంటే మిక్కిలి పెద్దదిగా ఉండెడిది. గీతామకరందము 1100 పేజీల గ్రంథముకాగా,
దాని తర్వాత 2000 పేజీల గ్రంథముగా సుందర చైతన్య స్వాములవారు వ్రాసిన 'చైతన్య భగవద్గీత' మిక్కిలి పెద్దదిగా
ఉన్నది. 200 పేజీల భగవద్గీతకు, 2000 పేజీల భగవద్గీతకు శ్లోకములలో ఏమీ తేడాయుండదు. అయితే భావములలో
ఎంతో తేడాయున్నదని చెప్పవచ్చును. భగవద్గీత శ్లోకముల వరకు భావము చెడిపోకుండా ఉన్నదున్నట్లుండగా, మిగతా
రచయితల అనువాదములో భగవంతుడు చెప్పిన భావము కొంతమారిపోయి, రచయితల భావము అందులో చేరినదని
చెప్పవచ్చును. ఈ విధముగా కృష్ణుడు చెప్పిన భావము కొన్ని గీతలలో 50 శాతము మారిపోయివుండగా, కొన్నిటిలో
60,70,80 శాతము కూడా మారిపోయినదని చెప్పవచ్చును. కొందరు వ్రాసిన భగవద్గీతలలో కేవలము 10 శాతము
మాత్రము మారిపోయి 90 శాతము భగవంతుని భావమున్నదని చెప్పవచ్చును. 20,30,40 శాతము భావమార్పిడి
29

Page 30
జరిగిన గీతలను కూడా చూచాను. చిన్న సైజు (పరిమాణములో)నున్న గ్రంథములలో ఎక్కువ భగవంతుని భావమున్నట్లు
తెలియుచున్నది. ఏది ఏమైనా భగవద్గీత శ్లోకముల రూపములో ఈ దినము కూడా మనముందున్నందుకు
సంతోషించవచ్చును. ఎందుకనగా రచయిత శరీరములోనున్న ఆత్మ అందిస్తే 100 శాతము భగవంతుని భావమున్న
భగవద్గీత బయటికిరావచ్చును, ఎక్కడైనా ఈ పాటికి వచ్చియుండవచ్చును.
నాకు తెలిసినంత వరకు గీతలోని ఆధ్యాయములలో రెండవ దానిగా చెప్పబడు సాంఖ్యయోగములో 11,19,
22, 23, 47 శ్లోకములకు భగవంతుడు చెప్పిన భావము ప్రకారము ఇంతవరకు ఎవ్వరూ వ్రాయలేదని తెలియుచున్నది.
ఒక్క అధ్యాయములోనే ఐదు శ్లోకములకు అర్థము లేదంటే గీతలో ఎన్ని శ్లోకములకు సరైన భావము బయటికి రాలేదో
సరిగా చెప్పలేము. ఇదంతా ఉదాహరణకు చెప్పేదే అని తెలుసుకోండి. గీతలో ఈ ఐదు శ్లోకములకు ఎవరైనా
సరియైన భావము వ్రాయగలరేమోగానీ, ఖుర్ఆన్ గ్రంథములో సురా 6, ఆయత్ 95 కు గానీ, సురా 50, 21
ఆయత్కు గానీ ఎవరూ సరియైన వివరము చెప్పలేరనియే చెప్పవచ్చును. ఈ రెండు సురాలలో రెండు వాక్యములకు
వేయి సంవత్సరములు పరిశోధన చేసి చూచినా తెలియని భావముండుట వలన బహుశా వీటి భావము ఎవరికీ
తెలియదనియే చెప్పవచ్చును. ఇది కూడా ఉదాహరణ నిమిత్తమే చెప్పాము. ఖుర్ఆన్ గ్రంథములోనికి పోయి చూస్తే
అందులోనున్న దేవుని భావము చాలామందికి అర్థము కాలేదనీ, తిరిగి దేవుడే చెప్పేంతవరకు అర్థము కాదనీ చెప్పవచ్చును.
ఒక విషయము ఒకరినుండి బయటికి వచ్చినప్పుడు అది వాక్యముగా ఉండును. దేవుని నుండి వచ్చినా,
మనిషి నుండి వచ్చినా మొదట అది వాక్యముగా ఉండును. 'వాక్యము అను పదమునుండి పుట్టినది వాదము.' మొదట
పుట్టిన వాక్యమును అనుసరించి తర్వాత ఎవరు చెప్పినా దానిని అనువాదము అంటాము. అనువాదము అనగా
మొదటి దానిని అనుసరించి వివరము చెప్పునదని అర్థము. ఎక్కడైనా మొదటి దానిని అనుసరించి చెప్పునప్పుడు వ్యక్తి
రెండవవాడే, వాదము లేక వాక్యము రెండవదే అగును. వ్యక్తి మారినప్పుడు వాక్యము యొక్క అనుకరణ కూడా
మారియుండవచ్చును, ఉండకపోవచ్చును. ఎవడైతే మొదట చెప్పిన వ్యక్తి యొక్క భావము నూరుశాతము
గ్రహించుకొంటాడో, వాడు తన అను వాదమును మొదట చెప్పినవాని భావమునకు సరిపోవునట్లు వ్రాయగలడు, లేక
చెప్పగలడు. మొదటి భావమును గ్రహించలేనివాడు మొదటి వాని భావమును వదలి ప్రక్కకు పోగలడు. ఉదాహరణకు
ఒక వ్యక్తి తనవద్దయున్న రెండవవానికీ, మూడవవానికీ అన్నము తినే తట్టను (పల్లెమును) తీసుకొనిరా అని
చెప్పాడనుకొనుము. అప్పుడు రెండవవాడు భోజనగదిలోనున్న ఒక పల్లెమును తెచ్చాడు. మూడవవాడు అట్లు కాకుండా
అప్పుడు అన్నము తింటున్న వ్యక్తినుండి తట్టను బలవంతముగా తీసుకొచ్చాడు. మొదటివాడు చెప్పినది అన్నము తట్టను
తీసుకురమ్మనగా, రెండవ వానికి అన్నము తినే దానికి ఉపయోగపడే పల్లెమని అర్థమై ప్రక్కన ఖాళీగాయున్న పల్లెమును
తెచ్చాడు. మూడవవానికి ప్రస్తుతము అన్నము తింటున్న పల్లెమునే తీసుకరమ్మని అర్ధమై అన్నము తింటున్న వానిదగ్గరినుండి
అన్నముతో సహా పల్లెమును తెచ్చాడు. ఇప్పుడు రెండవ, మూడవ వానిలో ఎవరిది సరియైన భావమో మనకు తెలియాలంటే
మొదటివాడు అన్నము తినే పల్లెము అని అన్నప్పుడు వాడు ఏ భావముతో చెప్పాడో, ఆ భావము తెలిస్తేగానీ ప్రక్కనున్న
మనకుకూడా ఏది సరియైనదో అర్థము కాదు. అలాగే భగవద్గీతలోగానీ, మిగత మూల గ్రంథములలోగానీ, చెప్పబడిన
దేవుని వాక్యములు పూర్తి అర్థముకాక సందిగ్ధములో ఉండిపోయాయి. అవి పూర్తిగా సరియైన భావముతో అర్థము
కావాలంటే తిరిగి దేవుడే వచ్చి చెప్పవలసిందే. సందిగ్ధముతో కూడుకొన్న కొన్ని సూక్ష్మమైన జ్ఞానవాక్యములు దేవునికి
తప్ప ఏ మనిషికీ తెలియవని ఖురాన్ గ్రంథములో సురా 3, ఆయత్ 7లో చెప్పబడినది. “భగవద్గీతలో ఆదిలో చెప్పిన
30

Page 31
జ్ఞానము రాజవిద్యగానున్నది. అలాగే రాజ (పెద్ద) రహస్యముగా ఉన్నది. అందువలన ఇప్పుడు తిరిగి వివరముగా
చెప్పుచున్నాను విను అర్జునా” అని భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు.
దేవుడు చెప్పిన భగవద్గీత మనయొద్ద ఉండినా, అనువాదములో కొంత తేడా రావడములో పూర్తి అర్ధము
కాకపోయినదని చెప్పవచ్చును. కొందరు మనుషులు గీతయొక్క భావమును అక్కడక్కడ తప్పుగా వ్రాయడమే గాక,
వారి స్వార్థముకొరకు కొన్ని శ్లోకములను సృష్టించి కలుపడము కూడా జరిగినది. అటువంటి శ్లోకముల వలన దేవుని
భావమునకు వ్యతిరేఖ భావము గీతలోనే కనిపించుచున్నది. మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత” గ్రంథములో
మనుషులు వ్రాసిన శ్లోకములను గుర్తించి తీసి వేయడము జరిగినది. దేవుడు సృష్ఠిని తయారు చేసినప్పుడే తనకు
ప్రత్యర్థిగా ఉండుటకు, స్త్రీ స్వరూపమై తోడుగాయుండుటకు ప్రకృతిని తయారు చేశాడు. ప్రకృతి దేవుని ఆజ్ఞతో
జీవరాసులనందరినీ పాలించుచున్నది. ప్రతి మనిషి లోను శక్తిగాయుండుటకు ఆత్మ వెలసియుండగా, పనిని ప్రేరేపించు
గుణములుగా ప్రకృతియున్నదని చెప్పవచ్చును. ప్రకృతి చేత తయారైన గుణములనే మాయ అనికూడా అంటున్నాము.
గీతను వ్రాయుటకు మాయ సంబంధ గుణములు తప్పు ఆలోచనలనిచ్చి మనిషిని ప్రేరేపించగా, ఆత్మ హస్తములను
కదలించి వ్రాయించుచున్నది. గీతను అనువదించడములో ప్రేరేపణ, ఆలోచన, ఆచరణ అన్నియూ గుణములు
మరియు ఆత్మ చేయగా శరీరములోని జీవుడు ఆ కార్యములో ఎటువంటి భాగస్వామి కాలేదు. అయినా జీవుడు తన
అజ్ఞానముచేత ఆ పనిని తానే చేసినట్లనుకొనుచున్నాడు. ఆ కార్యములోని చెడుకుగానీ, మంచికిగానీ తానే బాధ్యుడవు
చున్నాడు. గీతను తప్పుగా వ్రాయునట్లు చేసినది మాయ (గుణములు) కాగా, శరీరమును కదలించి పనిని చేసినది
ఆత్మ. జీవుడు తాను చేయని పనికి అనవసరముగా అజ్ఞానముతో బాధ్యుడైనా, తప్పు భావమును సృష్టించి వ్రాయించినది
ప్రకృతి జనితమైన మాయ, దానికితోడు ఆత్మ. వీరిద్దరు దేవుని చేత నిర్మించబడినవారై దేవుని యొక్క ధర్మమును,
శక్తిని తెలిసినవారైయుండి, ఎందుకిలా తప్పుగా గీతను వ్రాయించారు అని ప్రశ్నించుకొంటే, దేవుడు తనకు ఇష్టములేని
వారు తననుండీ, తన జ్ఞానమునుండీ దూరముగా పోవుటకు తన మాయచేత, ఆత్మచేత అలా చేయించాడని తెలియుచున్నది.
ఇదంతా తెరవెనుక ఎవరికీ తెలియకుండా జరుగు తతంగమిదియని చెప్పవచ్చును.
తెర ముందర ఆ కార్యములోని తప్పుకు జీవుడే బాధ్యుడగుచున్నాడు. తాను చేయకున్నా తానే చేశానని జీవుడు
అనుకోవడము వలన, గీతను తప్పు భావములతో అనువదించినందుకు జీవుడే శిక్షార్హుడగుచున్నాడు. కావున
ఆధ్యాత్మికములో ముందుకు పోవుటకు స్వయం హక్కుదారుడుగా జీవుడుండి, దేవుడు అవకాశమిచ్చినా దానిని
వినియోగించుకోకుండా, అన్నిటిలోను అహమును పొందుచుండుట వలన, చేయని తప్పులకు శిక్షార్హుడగుచున్నాడు.
దేవుని మార్గములో కర్మ ఆటంకము లేకుండుట వలనా, కర్మప్రకారము జ్ఞానము లభిస్తుందను నియమము లేనందునా,
శ్రద్ధయుంటే ఎంతటి జ్ఞానమునైనా తెలుసుకోవచ్చును. అవకాశమున్నా మనిషి తన శ్రద్ధను బయటి ప్రపంచము మీద
పెట్టుట వలన, దేవునికి ఇష్టము లేనివాడగుచున్నాడు. దేవునికి ఇష్టములేని వానిని ప్రకృతి మాయరూపమై తన
గుణముల ద్వారా దేవుని మార్గమునుండి దూరముగా పోవునట్లు చేయుచున్నది. అందువలననే వేమనయోగి తన
పద్యములలో “పతి యొప్పిన సతి ఒప్పును” అని అన్నాడు. పతి అనగా పరమాత్మ అనియూ, సతి అనగా ప్రకృతియనియూ
తెలియవలెను.
దేవుని విషయములో సర్వస్వతంత్రుడైన జీవాత్మ, ఏమాత్రము దేవుని విషయము మీద శ్రద్ధలేనివాడగుట చేత,
ప్రకృతి సంబంధ విషయము మీదనే ఆసక్తిని చూపుట వలన, జీవుడు దేవుని విషయములో తప్పు చేసిన వాడగుచున్నాడు,
31

Page 32
శిక్షార్హుడగుచున్నాడు. దేవుడు తన జ్ఞానమును భగవంతుని ద్వారా భూమిమీద తెలియునట్లు చేసినప్పటికీ, భగవంతుడు
భగవద్గీతలో చెప్పని అనేక ఆరాధనలను జీవుడు స్వయముగా సృష్టించుకొనుచున్నాడు.
దేవుడు తనను ఎలా ఆరాధించాలో, తన జ్ఞానముచేత దేవున్ని ఎలా తెలియవచ్చో, దేవున్ని తెలుపుటకు
ఉపయోగపడు ధర్మములేవో, దేవున్ని తెలుసుకొనుటకు ఏమాత్రము పనికిరాని అధర్మములేవో, పూర్తి వివరముగా
చెప్పినప్పటికీ, ధర్మములను ఏమాత్రము గుర్తించక, ఆచరించకపోవడమే కాకుండా, దైవమార్గమునకు, గమ్యమునకు
ఆటంకమైన అధర్మములను ఆచరించుచున్నాడు. ఇటువంటి అధర్మ విషయములలో ఏ జ్ఞానమూ తెలియని సాధారణ
మనిషికంటే మాకు జ్ఞానము తెలుసునను స్వామీజీలు మొదలగువారు దైవదృష్ఠిలో నేరస్థులగుచున్నారు. జ్ఞానులమూ,
స్వాములమూ అనువారు ఎట్లు ధర్మములను గుర్తించక అధర్మ ఆచరణ చేయుచున్నారో కొంత వివరముగా తెలుసుకొందాము.
భగవద్గీతలో జ్ఞానయోగమందు ఏడవ శ్లోకమున చెప్పిన భావమిలాగలదు. "భూమిమీద ఎప్పుడెప్పుడు ధర్మమునకు
ముప్పు కలిగి, అధర్మము అభివృద్ధి చెందునో, అప్పుడప్పుడు నన్ను నేను తయారు చేసుకొని వస్తాను" అని దేవుడు
భగవంతుని రూపముతో చెప్పాడు. ఆ విధముగా చెప్పడమే కాకుండా, అప్పుడు తాను వచ్చినది ధర్మములను
తెలియజెప్పుటకేనని చెప్పి, తాను ఏ విధమైన అధర్మములతో తెలియబడడో, ఏ విధమైన ధర్మములతో తెలియబడునో
కూడా వివరముగా చెప్పాడు.
ఉదాహరణకు ఒక స్వామీజీ భగవద్గీతను పది రోజులు బాగా ఉపన్యసించి మంచి పేరు తెచ్చుకొన్నాడు.
భగవద్గీతను చెప్పునప్పుడు ఎన్నో ఉపమానములను చెప్పి అందరికీ అర్థమయ్యేటట్లు బోధించాడు. ఆయన బోధలు
వినిన చాలామంది ఆ దినమునుండి అసలైన దేవుడు ఒకడున్నాడనీ, ఆయనే సర్వమునకు అధిపతియనీ, ఆయనను
ఆరాధించుట వలననే మోక్షము లభించుననీ తెలియగలిగారు. అప్పటినుండి ఇతర దేవతలనుగానీ, చెట్టుకు, పుట్టకు
పూజచేయడముగానీ, పితృదేవతలకు గుడ్డలు సమర్పించడముగానీ, పూజించి కొబ్బరికాయలు కొట్టడముగానీ మానివేశారు.
ఎందుకలా మానివేశారని ఇతరులు వారినడిగితే జీర్ణానంద స్వామి చెప్పిన గీతా బోధను విన్న తర్వాత భగవద్గీత బాగా
అర్థమైనది. జీర్ణానందస్వామి భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయమున 25వ శ్లోకమును చెప్పి
దాని భావమును తెలియజేసిన తర్వాత ఇక ఎవరినీ పూజించకూడదనుకొన్నాము అన్నారు. వారు వినిన దేమనగా!
యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృ వ్రతాః |
భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినోపి మామ్ ||
25వ శ్లో॥
భావము :- “దేవతలను పూజించువారు దేవతలలోనికే పోయి చేరుతారు. పితృ దేవతలను (పెద్దలను) పూజించువారు
పితృ దేవతలలోనికే పోయి చేరుతారు. పాములను, ఆవులను, చెట్లను మొదలగు జీవరాసులను పూజించువారు
వాటిలోనికే పోయి జన్మిస్తారు. నన్ను పూజించువారు మాత్రము నాలోనికే వచ్చి చేరుతారు” అని ఉన్నది. ఈ శ్లోకమును
దీని భావమును వినినవారు దేవున్ని ఆరాధించి దేవునిలోనికే చేరాలనుకొన్నారు. దేవుడు తప్ప ఇతరులెవరూ
వద్దనుకొన్నారు. ఆ విధముగా కొందరు ఆ శ్లోకమును విని మారిపోయి ఉండగా, కొన్ని రోజుల తర్వాత ఒక టీ.వీ
లో
'యాన్తి దేవవ్రతాన్ దేవాన్' అను శ్లోకమును బోధించిన జీర్ణానందస్వామి
భాగ్యలక్ష్మి గుడిలో భాగ్యలక్ష్మికి పూజ చేయుచూ కనిపించాడు. ఆయన బోధ వలన మారిన వారందరూ ఆ దృశ్యమును
చూచారు. అప్పుడు వారికి ఒక ప్రశ్న వచ్చినది. సృష్టికంతటికీ దేవుడే గొప్పయనీ, ఆయననే ఆరాధించవలెననీ,
ప్రోగ్రామ్లో భగవద్గీతనూ అందులోని ఆ
32

Page 33
ఆయనను ఆరాధించితే ఆయనవద్దకు పోగలరు, లేకపోతే మీరు ఆరాధించిన వారివద్దకే పోతారనీ మా అందరికి
చెప్పిన జీర్ణానందస్వామి ఎందుకలా దేవుడు కానటువంటి దేవతను పూజించుచున్నాడని అనుకొన్నారు.
ఇప్పుడు మనకు తెలియకుండానే నేరము, కోర్టు, విచారణ, శిక్ష అవి జరిగిపోవుచుండును. దేవుని జ్ఞానమైన
భగవద్గీతలో దేవుని ఆరాధనను కృష్ణుడు గొప్పగ చెప్పుచూ, దేవతలను పూజించడము చేసిన వారందరు అజ్ఞానులని
కూడా చెప్పారు. విజ్ఞానయోగము 20, 23వ శ్లోకములను చూస్తాము.
20వ శ్లో॥
కామైస్మైసైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః |
తంతం నియమ మాస్థాయ ప్రకృత్యా నియతాస్స్వయా॥
23వ శ్లో॥
అంత వత్తు ఫలం తేషాం తద్భవ త్యల్ప మేధసామ్ ।
దేవాన్ దేవ యజోయాంతి మద్భక్తా యాంతి మామపి ॥
20వ భావము :- ప్రపంచ సంబంధములైన పాపముల చేత, ఆశలలో మునిగిన అజ్ఞానులు కొందరు, నన్ను వదలి
ఇతర దేవతల నియమము ప్రకారము వారిని పూజించుచుందురు.
23వ భావము :- స్వల్పబుద్ధికలవారు పొందు ఫలితము కూడా స్వల్పము గానే ఉండును. దేవతలను ఆరాధించు
దేవతా భక్తులందరు దేవతలను చేరగా, నా భక్తులు మాత్రము నన్ను చేరగలరు.
దేవుడు భగవంతునిగా భగవద్గీతలో ముందే చెప్పిన ఈ మాటలను బట్టి ఇప్పుడు జీర్ణానందస్వామి చేసినది
తప్పా కాదా? యని మనము ఆలోచిస్తాము. భగవద్గీతను పరిపూర్ణముగా తెలిసిన జీర్ణానందస్వామికి దేవుడు చెప్పిన
మాటలు శ్లోకములు జ్ఞాపకమున్నా వాటిని ఇతరులకు చెప్పేదానికే నేర్చుకొన్నాడు. విజ్ఞాన యోగములో 20వ
శ్లోకమున చెప్పినట్లు ప్రపంచ సంబంధ ఆశలతో కూడుకొన్నవారు, ఆ ఆశలచేత జ్ఞానమును మరచిపోయినవారై,
అజ్ఞానులగుచూ దేవతల నియమముల ప్రకారము వారిని పూజింతురని ఉన్నట్లు, జీర్ణానందస్వామి తనలోని ఆశచేత
దేవతను పూజిస్తే ఆమె తనకు మంచి చేయునను భావముతో భాగ్యలక్ష్మి గుడిలోనికి పోయి పూజ చేయడము జరిగినది.
భగవద్గీతను చదివిన సామాన్య మనిషికైనా అందులో దేవునికి దేవతలకు ఉన్న తారతమ్యము తెలిసిపోవును. అటువంటి
విధానము భగవద్గీతలో ఉన్నప్పుడు, ఇతరులకు గీతను బోధించు స్థోమతకల్గియున్న స్వామీజీయే ఇక్కడ దేవుడు గొప్పయని
చెప్పి, అక్కడ పోయిన తర్వాత తన మాటను మరచిపోయి, దేవునికంటే దేవతయే గొప్పన్నట్లు, ఒక స్త్రీ స్వరూప
దేవతలను పూజించడము మనకు ఎట్లున్నా, అది దేవుని న్యాయస్థానములో గొప్ప నేరమగును.
విశ్వమును అందులోని జీవజాలమును సృష్టించి, తనచేత సృష్ఠింపబడిన సృష్ఠి ఎల్లకాలము సాగునట్లు ఏర్పాటు
చేసిన దేవుడు నన్ను తెలుసుకోండి, నా వలననే అన్నీ మీకు జరుగుచున్నవి, మీకున్న ఈ జన్మలు లేకుండా పోవాలంటే
నా జ్ఞానమే ఆధారమని ఆయన జ్ఞానమును గీతలో తెల్పితే, ఆ మాటను లెక్క చేయకుండా ప్రవర్తించువారు ఎవరైనా,
దేవుని శిక్షకు అర్హులు కాకతప్పదు. దేవుడు చెప్పకపోతే మాకు తెలియదు అని తప్పించుకొనుటకు అవకాశమున్నది.
అటువంటి అవకాశము లేకుండా కొందరికి భగవద్గీత రూపములోనూ, మరికొందరికి బైబిలు రూపములోనూ, ఇంకా
కొందరికి ఖుర్ఆన్ గ్రంథరూపములోనూ దేవుడు తన ధర్మములను సంపూర్ణముగా తెలిపియున్నాడు. దేవుడు ముందే
33

Page 34
తన జ్ఞానమును తెలిపి యుండగా, దేవుడు చెప్పిన జ్ఞానమును తెలుసుకోవడమే జీవిత సారాంశమని తెలియక, ప్రపంచములో
డబ్బు సంపాదించడమే జీవిత సారాంశముగా కొందరు పెట్టుకొన్నారు. సామాన్య మనిషిని అటుంచి మాకు జ్ఞానము
తెలుసునని బోధించు స్వామీజీలే దేవుని మార్గములో ఎక్కువగా శిక్షార్హులగుచున్నారని చెప్పవచ్చును.
సాధారణ మనిషి దేవుని మార్గమును అనుసరించాలంటే ముందు ఏమి చేయాలో, ఎలా అనుసరించాలో
తెలియుటకు ఒక గురువును ఆశ్రయించి, వారు చెప్పినట్లు చేయుటకు పూనుకొనును. ప్రస్తుత కాలములో గానీ,
కొంత పూర్వకాలములోగానీ ఒక వ్యక్తి గురువును ఆశ్రయించితే, గురువు ముందుగా ఆశ్రయించిన వ్యక్తికి గురూపదేశము
ఇచ్చి తన శిష్యుడిగా చేసుకొనును. దానితో ఆ వ్యక్తి (శిష్యుడు) ఆ గురువును వదలి ప్రక్క గురువు దగ్గరకు పోకుండా
చేసుకోవడము జరుగును. అలా అప్పటినుండి వాడు తనవాడు అన్నట్లు గురువు శిష్యున్ని గురూపదేశముతో బంధించు
కొనుచున్నాడు. అప్పటినుండి ఇతరుల గ్రంథములు చదవకూడదనీ, ఇతరుల బోధలు వినకూడదని చెప్పి, శిష్యునికి
ప్రక్క చూపులేకుండా చేయుదురు. తర్వాత తాను మొదట ఉపదేశముగా చెప్పిన మంత్రమును ప్రతి దినము ధ్యానించవలెనని
చెప్పుదురు. అలా ప్రతి దినము ధ్యానము (మెడిటేషన్) చేయడమే జీవితములో ముఖ్యమనీ, అలా చేయడము వలననే
మనిషి దేవుని మార్గములో ప్రయాణించి చివరకు దేవున్ని చేరగలడని చెప్పుదురు. అంతేకాకుండా మధ్యమధ్యలో
యజ్ఞములు చేయించడమూ, వేదములను చదివించడమూ, దానములను చేయించడమూ జరుగుచున్నది. ఏదైన ఒక
దానిని ధ్యానించడమును తపస్సు అనికూడా అనవచ్చును.
ప్రపంచములో ఒకవ్యక్తి తాను స్వామిగానో, గురువుగానో ఇతరులకు తెలియుటకు బయటికి కనిపించు
యజ్ఞములు, దానములు, వేదాధ్యయనములు, తపస్సులను ముఖ్యముగా చేయుచున్నాడు. ఈ నాలుగు చేయగలిగితే
సమాజములో ఒక జ్ఞానిగా, స్వామిగా, గురువుగా తెలియగలడు. ఒక గురువుగాయున్న స్వామీజీ తాను ఈ నాలుగు
పనులలో కొన్నిటిని ఎక్కువగా, కొన్నిటిని తక్కువగా చేయుచూ, తనను ఆశ్రయించిన శిష్యుల చేత కూడా చేయించుచుండును.
అట్లు గురువులవద్ద చేరిన శిష్యులు కూడా యజ్ఞ, దాన, వేదాధ్యయన, తపస్సులను చేయుచూ, ఇతరు లెవ్వరూ చేయని
గొప్ప కార్యములను చేసినట్లు తలచుకొనుచుందురు. ప్రపంచములో కూడా ఈ నాలుగు కార్యములే దైవమార్గములో
గొప్ప విలువైన కార్యములుగా ప్రజలు లెక్కించుచున్నారు. ఈ నాలుగు కార్యములను మహర్షులను వారు కూడ చేస్తూ
వచ్చారు. కృతయుగము తర్వాత వచ్చిన త్రేతాయుగములో (తైతాయుగములో) త్రికాల జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ద్రావిడ
బ్రాహ్మణుడు అయిన రావణబ్రహ్మ ఈ నాలుగు కార్యములను పూర్తిగా వ్యతిరేఖించాడని, జరుగుచున్న యజ్ఞములను
ధ్వంసము చేయించాడని విన్నాము. బ్రహ్మజ్ఞాని అని పేరుగాంచిన ఒక వ్యక్తి అలా ఎందుకు వ్యతిరేఖించాడు, అందరికీ
గొప్ప కార్యములుగా కనిపించినవీ, నేటికినీ ఎందరో పేరుపొందిన స్వామీజీలు చేయుచున్నవీ, అయిన యజ్ఞములను
ఎందుకు భగ్నము చేశాడు అని తెలియుటకు, మనము బ్రహ్మవిద్యా శాస్త్రమును ప్రమాణముగా తీసుకొని చూడవలసిందే.
శాస్త్రము వలననే ఏది అశాస్త్రీయము, ఏది శాస్త్రీయమని తెలియగలదు. చేయుచున్న వ్యక్తులను బట్టి ఒక కార్యము
సరియైనదో, కాదో చెప్పకూడదు. ముందే నిర్మించబడియున్న శాస్త్రమునుబట్టి ఒక కార్యము సరియైనదో, కాదో
చెప్పవచ్చును. ఇప్పుడు అందరూ గొప్పగ ఆచరించు యజ్ఞ, తపస్సు, దాన, వేదాధ్యయనములను కార్యములు దైవమార్గములో
జ్ఞానులమనువారు చేయునవి, కావున వీటిని షట్ శాస్త్రములలోని బ్రహ్మవిద్యా శాస్త్రముచేత విడదీసి చూడవలసి యున్నది.
ప్రస్తుత కాలములో బ్రహ్మవిద్యా శాస్త్రమేది అని చూస్తే మూడు గ్రంథములలో అది కనిపిస్తున్నది. హిందువులకు
(ఇందువులకు) భగవద్గీతలో, క్రైస్తవులకు బైబిల్లో, ముస్లీమ్లకు ఖుర్ఆన్ గ్రంథములో దేవునికి సంబంధించిన బ్రహ్మవిద్యా
34

Page 35
శాస్త్రము యొక్క సూత్రములు తెలియుచున్నవి. ఇపుడు మనము ఇందువులము (హిందువులము) కాబట్టి భగవద్గీతా
శాస్త్రమును చూడవలసిందే. భగవద్గీత నూటికి నూరుపాళ్ళు బ్రహ్మవిద్యా శాస్త్రమైన దానివలన, అందులో మొదటినుండి
చివర వరకు పరిశీలించి చూస్తే, విశ్వరూప సందర్శనయోగమను ఆధ్యాయములో 48 మరియు 53 శ్లోకములలోనూ,
దానికంటే ముందున్న అక్షర పరబ్రహ్మ యోగములో చివరి 28వ శ్లోకములోను బాహ్యయజ్ఞములను గురించీ,
వేదాధ్యయనమును గురించీ, దానములనూ, తపస్సులను గురించి చెప్పడము జరిగినది. వాటిని క్రింద వివరిస్తాము
చూడండి. ముందు అక్షర పరబ్రహ్మ యోగములోని 28వ శ్లోకమును చూస్తాము.
28వ శ్లో॥
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరంస్థాన ముపైతి చాద్యమ్||
భావము :- “నేను చెప్పిన జ్ఞానమును తెలిసినవాడు వేదముల వలన, యజ్ఞముల వలన, దానముల వలన, తపస్సుల
వలన వచ్చు పుణ్య ఫలములను అతిక్రమించినవాడై, యోగియై పరమమైన మోక్షపదమును పొందగలడు.”
భగవంతుడు చెప్పిన ఈ మాటనుబట్టి చూస్తే మనకు అర్థమగు విషయమేమనగా! వేదముల వలనగానీ,
యజ్ఞముల వలనగానీ, తపస్సుల వలనగానీ, దానముల చేతగానీ ప్రపంచ సంబంధ ఫలితమైన పుణ్యము లభించుచున్నది.
పాపపుణ్యములు రెండూ ప్రపంచ సంబంధ ఫలితములని జ్ఞాపకముంచుకోవలెను. ఈ రెండు ఫలితముల వలన
కష్టసుఖములు లభించునని చెప్పుకొన్నాము. ప్రపంచ సంబంధ ఫలితముకంటే గొప్పది దైవసంబంధ ఫలితము.
దైవసంబంధ ధర్మాధర్మముల వలన జన్మ, మోక్షములు కలుగుచుండును. కష్టముంటే సుఖముండదు. అట్లే జన్మవుంటే
మోక్షముండదు. కష్టసుఖములు, జన్మ మోక్షములు ప్రకృతి పరమాత్మ యొక్క వేరువేరు ఫలితములు. ప్రకృతి సంబంధమైనవి
కష్టసుఖములు, ఇవి మనిషి చేయు పాపపుణ్యముల చేత వస్తున్నవి. అలాగే దైవసంబంధ మైనవి జన్మ మోక్షములు.
ఇవి మనిషి ఆచరించు ధర్మములను బట్టి, అధర్మములనుబట్టి లభించుచున్నవి. ఈ శ్లోకములో చెప్పిన యజ్ఞ, దాన,
వేద, తపస్సులు నాలుగు కార్యములు ప్రకృతికి సంబంధించినవా లేక పరమాత్మకు సంబంధించినవాయని చూస్తే,
దైవమునకు సంబంధించిన కార్యములుగానే అందరూ చేస్తున్నారు. అయితే గీతలో చెప్పినట్లు ఈ కార్యములకు
పుణ్యఫలితము వస్తున్నదనీ, పుణ్యమువలన సుఖములను అనుభవించుటకు జన్మ కలుగుచున్నదని చెప్పవచ్చును.
భగవద్గీతలో ఈ కార్యములను ప్రకృతికి సంబంధించిన కార్యముగా ప్రకటించారా అని చూస్తే, మోక్షము కాకుండా
జన్మను కలుగజేయు అధర్మ కార్యములుగా కనపడుచున్నవి. ఈ మాట అందరికీ ఆశ్చర్యముగనే ఉన్నందున ఇంకా
లోతుగా చూడవలసిన అవసరమున్నది.
దైవమార్గములో ధర్మకార్యముల వలన వచ్చు ఫలితము మోక్షము. మోక్షము అనగా జన్మనుండి విడివడి
(జన్మించిన శరీరమునుండి బయటికి వచ్చి) దేవునియందైక్యమై పోవుట. ఎప్పుడైతే జీవుడు దేవునియందైక్యమై పోవునో,
అప్పుడు అంతవరకు తెలియని దేవుడు తెలియబడును. జీవునికి దేవుడు తెలియబడినప్పుడు తర్వాత జీవుడనువాడుండడు.
వాడు దేవునిలో కలిసిపోయి శరీరమునుండి, కర్మనుండి విముక్తుడగుచున్నాడు. కర్మనుండి విడుదలను పొందడమునే
మోక్షము అంటున్నాము. ధర్మముల వలన మోక్షము లేక దైవదర్శనము లభిస్తే అధర్మమువలన జన్మయే లభించు
చున్నది. అధర్మముల వలన లభించు జన్మలో, అధర్మముల వలన లభించు పుణ్యముతో సుఖములు లభించుచున్నవి.
ఆ విషయమునే పై శ్లోకములో “వేద, యజ్ఞ, దాన, తపస్సుల వలన లభించు పుణ్యఫలములకంటే, నా జ్ఞానము ధర్మము
35

Page 36
తెలియుట వలన వాడు యోగియై మోక్షమును పొందుచున్నాడు.” అని చెప్పాడు. దీనినిబట్టి యజ్ఞ, దాన, తపస్సు,
వేదములు దైవమార్గములోనున్న అవి అధర్మములనీ, యోగము అనునది ధర్మము అనీ తెలియుచున్నది. వేద, యజ్ఞ,
దాన, తపస్సులు నాలుగు అధర్మములనీ, వాటి వలన దేవుని తెలియుటకు ఏమాత్రము శక్యముకాదనీ విశ్వరూప
సందర్శన యోగమున 48, 53వ శ్లోకములలో చెప్పబడుచున్నది, చూడండి.
48వ శ్లో॥
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర చక్రియాభిర్న తపొభిరుగ్రైః
וט
ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర॥
భావము :- ఓ అర్జునా! వేదములు చదువుట వలన, యజ్ఞములు చేయుట వలన, దానములను ఇచ్చుట వలన,
ఉగ్రమైన తపస్సు చేయుట వలన ఇప్పుడు నీవు చూచిన ఈ రూపమును చూచుటకు శక్యముకాదు.
నేను చెప్పిన ధర్మముల వలన దేవుడు తెలియబడును అని అక్షర పరబ్రహ్మయోగము చివరి శ్లోకములో చెప్పిన
భగవంతుడు, ఈ నాలుగు కార్యముల వలన దేవున్ని చూచుటకు శక్యముకాదు అని చెప్పడము జరిగినది. దీనితో
భగవంతుడు ఈ నాలుగు పనులను అధర్మ కార్యములుగా ప్రకటించినట్లయినది. అధర్మకార్యముల వలన సుఖములకు
కారణమైన పుణ్య జన్మకలుగుననీ, మోక్షము లభించదనీ అర్థమగుచున్నది. ఇదే విషయమునే దృఢపరుస్తూ 53వ
శ్లోకములో కూడా చెప్పడము జరిగినది చూడండి.
53వ శ్లో॥
నాహం వేదైర తపసా న దానేన న చేజ్యయా
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా॥
భావము :- వేదముల చేతగానీ, తపముల చేతగానీ, దానములచేతగానీ, యజ్ఞములచేతగానీ నా రూపము చూచుటకు
సాధ్యముకాదు. ఇపుడు నీవు చూచిన విశ్వరూపము ఈ నాలుగు కార్యముల వలన శక్యముకాదు.
48వ శ్లోకము విశ్వరూపముతో ఉన్నప్పుడే చెప్పినది కాగా, 53వ శ్లోకము విశ్వరూపమును వదలి సాధారణ
కృష్ణుడుగా ఉన్నప్పుడు చెప్పినది. ఈ రెండు శ్లోకములలోనూ ఒకే భావము తెలియపరచబడినది. ఈ నాలుగు
కార్యముల వలన నేను ఏమాత్రము తెలియబడనని చెప్పడమేకాక, రాజ విద్యా రాజగుహ్య యోగమున 25వ శ్లోకమున
దేవతలను పూజించు వారుగానీ, పితృ దేవతలను పూజించువారుగానీ, జీవములైన చెట్లను, జంతువులనూ, మనుషులను
పూజించువారు గానీ చనిపోయిన తర్వాత ఎవరిని పూజించారో, వారి దగ్గరకే పోవుదురు తప్ప నా వద్దకు రాలేరు
అన్నాడు. భగవంతుడు చెప్పిన ఈ మాటలనుబట్టి శాస్త్రప్రమాణముగా దేవునివద్దకు చేర్చని కార్యములన్నియూ,
అధర్మయుతములని అర్థమైపోవు చున్నది. దేవునివద్దకు చేర్చునవి మాత్రమే ధర్మములని తెలియుచున్నది. యజ్ఞముల
ద్వారా ఇతర దేవతలను పూజించుచున్నారు. కావున అన్ని రకముల ఆరాధనలను యజ్ఞముల క్రిందికే చేర్చి చెప్పవచ్చును.
ఇవన్నియు అధర్మములని చెప్పినా దేవుని మాటను లెక్కించక తమ ఇష్టానుసారము అన్యదేవతారాధన చేయువారిని,
యజ్ఞములు చేయువారిని, తపస్సు చేయువారినీ, అధర్మయుతులుగా దేవుడు లెక్కించుచున్నాడు. భూమిమీద అధర్మములు
ఉండకూడదని అదే పనిగా దేవుడు అవతరించి ధర్మములు తెలియజేయగా, దేవుని ఉద్దేశ్యమునూ, శ్రమను గుర్తించక
అదే పనిగా అధర్మములను ఆచరించితే దేవునికి కోపము రాదా! దేవుడు భగవంతుడై శరీరమును ధరించి వచ్చి
భూమిమీద అనేక అవమానములకు ఓర్చి కొన్ని సంవత్సరముల కాలము తన జ్ఞానమునూ, ధర్మములనూ తెలియజేస్తే,
ఆయన శ్రమను ఏమాత్రము లెక్కచేయక, దేవుడు చెప్పాడే అని గౌరవము కూడా లేకుండా, ధర్మములవైపు ఏమాత్రము
36

Page 37
చూడకుండా, అధర్మములను ఆచరిస్తే దేవున్ని కించపరచినట్లు కాదా! అటువంటపుడు దేవునికి కోపము రాదా!
వస్తుంది.
ఆయన కోపము మనుషుల కోపమువలె ఉండదు. ఆయన ఇప్పుడు ఎవరినీ కోపగించుకోడు. సృష్ట్యాదిలోనే
ఇటువంటి వారికి ఇది, ఈ పని చేసిన వారికి ఈ శిక్షయని ముందే తీర్పు తీర్చి పెట్టాడు. ఆ తీర్పులను శాస్త్రీయముగా
నిర్ణయించి పెట్టాడు. అలా సృష్ట్యాదిలో నిర్ణయించిన తీర్పు ప్రకారమే నేడు తప్పు చేసినవారికైనా శిక్షలుంటాయి.
దేవుడు శాస్త్రబద్దముగా నిర్ణయించిన తీర్పులనుండి ఎవడూ బయటపడుటకు అవకాశములేదు. నేడు మనిషి తన
ఇష్టమొచ్చినట్లు అలవాట్లు నేర్చుకొని, నన్ను తప్ప ఎవరినీ ఆరాధించవద్దు అని దేవుడు చెప్పినమాటకు, అట్లు చెప్పితే
మా మనో భావములు దెబ్బతింటాయి అని, ఇది మా సనాతన ధర్మమని అరచినా దేవుడు ఒప్పుకోడు. నేను
సనాతనున్ని సనాతనముగానున్న నన్ను ఆరాధించడము సనాతన ధర్మమవుతుందిగానీ, నిన్న నేడు నీవు అలవాట్లు
చేసుకొన్నవి సనాతన ధర్మములెట్లగునని దేవుడు ప్రశ్నించగలడు. అంతేకాక నీకు మనస్సును, బుద్ధిని ఇచ్చినది నేను,
శరీరములోనున్న మనో బుద్ధులు నావే అయినప్పుడు, నీ మనోభావమేదో అది నా మీద ఉండవలెను గానీ, నీ
ఇష్టమొచ్చిన దేవతల మీద పెట్టుకొని అవి వదలమని మంచి మాటలు చెప్పితే, మా మనోభావము దెబ్బతింటుంది
అనడము భార్య నా మనస్సు వేరేవాని మీద ఉందని భర్తతో చెప్పినట్లు కాదాయని దేవుడు ప్రశ్నించగలడు. భగవద్గీతలో
రాజవిద్యా రాజగుహ్య యోగమున 34వ శ్లోకములో ఈ విధముగా అంటున్నాడు చూడండి.
34వ శ్లో॥
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు।
మామే వైష్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణః||
భావము :- "నీ భక్తిని నామీదే చూపు, నీ మనస్సును నామీదే ఉంచు, నీవు నన్నే నమస్కరించు, నీవు నన్నే పూజించు,
నన్నే ఆశ్రయించు నన్నే పొందగలవు". అని చెప్పియుండగా! మనిషి తన ఇష్టమొచ్చిన వారిని పూజించడము
నమస్కరించడము చేస్తూ, ఎవరైనా వారి మంచికోరి దేవున్ని తప్ప ఇతరులను పూజించవద్దు, నమస్కరించవద్దు అంటే,
మూతి ముడుచుకొని అట్లు చెప్పితే మా మనోభావములు దెబ్బతింటాయి అంటే, జేబు దొంగతనములకు అలవాటుపడిన
వానిని చూచి పోలీస్ "దొంగతనము చేయుట మంచిది కాదు, పని చేసి బ్రతుకు" అని చెప్పితే దొంగ “అట్లు చెప్పితే
మా మనోభావాలు దెబ్బతింటాయి” అన్నాడట. పోలీసు ఆ మాట విని " నీ మనోభావాలు నీ క్రింది జోబిలో ఉన్నాయా,
పై జోబీలో ఉన్నాయా” అని అడిగాడట. ఆ విధముగా ఇది దైవజ్ఞానము కదా! మన మంచికే చెప్పుచున్నారు కదా
అనుకోకుండా, దీనిని వ్రాసిన మాకు కూడా వ్యతిరేఖముగా మాట్లాడువారుండవచ్చును. మీరు నన్ను ఏమనుకొనినా
మంచిదేగానీ, మీరు మాత్రము దేవుని తీర్పును శిక్షను జ్ఞాపకములో ఉంచుకోమని చెప్పుచున్నాను. దేవుడు మనిషికి
జ్ఞానమును తెలుపు నిమిత్తము హిందువుల (ఇందువుల) మైన మనకు భగవద్గీతా గ్రంథము నిచ్చాడు. ఇది నా
శాస్త్రము అని (బ్రహ్మ విద్యాశాస్త్రమని) చెప్పాడు. అయితే మనిషి దేవుడిచ్చిన గ్రంథమును (శాస్త్రమును) వదలి ఎవడో
గొట్టముగాడు చెప్పిన గుండు సాధననో లేక గుండుగాడు చెప్పిన గొట్టము సాధననో పట్టుకొని ఇదియే జ్ఞానము,
ఇదియే సాధన అంటే దేవునికి కోపము రాదా? అటువంటి వారిని గురించి భగవంతుడు తన గీతలో ఏమనుచున్నాడో,
దైవాసుర సంపద్విభాగయోగమునందు 23వ శ్లోకమును చూస్తాము.
37

Page 38
23వ శ్లో॥
యశ్శ్యాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః।
న స సిద్ధి మవాప్నోతి న సుఖం నపరాం గతిమ్ ||
భావము :- “బ్రహ్మవిద్యా శాస్త్ర విధానమును వదలి ఆశల చేత ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తించువాడు సుఖమును పొందలేడు,
దేనినీ సాధించలేడు, మోక్షమును పొందలేడు” అని చెప్పారు. బ్రహ్మవిద్యా శాస్త్రమునుకాదని, నాది ఫలానా సిద్ధాంతమనియో,
నాది ఫలానా పీఠమనియో, నాది ఫలానా సాధన అనియో, నాది ఫలానా ఆరాధన అనియో, నాది ఫలానా మత
మనియో, ఫలానా సాంప్రదాయమనియో, ఇట్లు ఎన్ని చెప్పుకొనినా, ప్రజల దృష్ఠిలో పెద్ద స్వామిగా పేరుగాంచియున్నా,
ఎటువంటివాడైనా దేవుని దృష్ఠిలో నేరస్థుడే అగును. అటువంటి వానికి గానీ, అధర్మములను ఆచరించు ఎటువంటివానికి
గానీ శిక్ష తప్పదు. శిక్ష ఎట్లుంటుందో ఉదాహరణకు గీతలో దైవాసుర సంపద్విభాగయోగమను అధ్యాయమున 19,
20 శ్లోకము లను ఒకమారు చూస్తాము.
19వ శ్లో॥
తా నహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపా మ్యజస్ర మశుభా నా సురీష్వేవ యోనిషు||
భావము :- క్రూరత్వముతో కూడుకొన్నవారిని, అసూయ నిండిన వారిని, మంచిని దూషించువారిని, నరులలో
అధములైనవారిని అసుర గర్భములలో పుట్టినట్లు చేసి, సంసార దుఃఖములను పొందునట్లు చేయుచుందును.
ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని ।
20వ శ్లో॥
మా మప్రాప్యైవ కౌక్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్ ||
భావము :- “అసుర యోనులందు జన్మించువారు జన్మ జన్మకు అజ్ఞానులగుచూ, నన్ను తెలియు జ్ఞానము యొక్క గట్టు
ఏమాత్రము లభించక అంతకంతకు అధమగతికి పోవుచుందురు”.
ఇంతవరకు శిక్ష తప్పదు అని చెప్పుచూ వచ్చాముగానీ శిక్ష ఎట్లుంటుందో చెప్పుకోలేదు. అయితే ఇప్పుడు
దేవుడు చెప్పిన మాటలలోనే శిక్ష విషయము సూచాయగా తెలిసింది. రాక్షస గుణములుగలవారి గర్భములలో పుట్టి
దుఃఖములను పొందడమే కాకుండా కాలము గడుచు కొలది, జన్మలు మారుకొలది జన్మజన్మకు కొంత అధోగతికి
పోవుచుందురనీ, అటువంటి వారికి దేవున్ని తెలుసుకొను జ్ఞానము యొక్క గట్టు ఏమాత్రము దొరకదని చెప్పబడియున్నది
కదా! దీనిని విన్న తర్వాత ఇప్పుడొక ప్రశ్న రాగలదు. అదేమనగా! రాక్షస యోనులందు పుట్టువారు జన్మజన్మకు
జ్ఞానము యొక్క గట్టు దొరకక క్రింది స్థితికి దిగజారి పోవుచుందురని చెప్పారు కదా! అధర్మములనాచరించి శిక్షను
పొందినవాడు ఎన్ని జన్మలు అలా అసుర యోనులందు పుట్టవలసియున్నది? ఎన్ని జన్మలకు శిక్ష అయి పోవును? అని
అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఏ శిక్షకైనా కాలపరిమితి ఉండుట బయట కోర్టులో చూచాము. అలాగే
దేవుని కోర్టులో దేవుని తీర్పులో కూడా కొంత కాలపరిమితి ఉంటుందని అనుకొంటున్నాము. బయటి శిక్షలకు ఒకే
జన్మలో కొన్ని సంవత్సరముల కాలము శిక్ష అమలులో ఉండును. అదే లోపలి కోర్టులో దైవమార్గములో తప్పుచేసిన
వారికి విధించబడు శిక్ష కొన్ని జన్మలని శ్లోకము యొక్క భావములోనే తెలిసిపోయినది. ఎన్ని జన్మల శిక్ష లేక ఎంతకాలము
శిక్ష అని చూస్తే దానికి ఒక ఆధారము దొరికినది. ఒక మూల గ్రంథములో ఈ విధముగా చెప్పబడినది. “మనుష్యులు
చేయు ప్రతి పాపమును, దూషణయు క్షమించబడునుగానీ, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యులకు
38

Page 39
విరుద్ధముగా మాట్లాడువారికి పాప క్షమాపణ కలదుగానీ, పరమాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందై
ననూ, రాబోవు యుగమందైననూ పాపక్షమాపణ లేదు.”
ప్రపంచ విషయములలోగానీ, ప్రపంచ మనుషుల విషయములో గానీ పాపమును చేసియుంటే, అటువంటి
పాపమును జ్ఞానము చేత కాల్చి వేసుకోవచ్చును. ప్రపంచ సంబంధమైన పాపములను చేసుకొన్నవాడు జ్ఞానిగా మారుటకు
అవకాశమున్నది. దైవజ్ఞానమును తెలుసుకొని జ్ఞానిగా మారినవాడు ఎంత దుర్మార్గుడైనాగానీ, ఎంత పాపాత్ముడైనాగానీ,
వాని పాపము జ్ఞానాగ్ని చేత దహించివేయబడును. అట్టివాడు కొద్ది కాలములోనే పాపములనుండి బయటపడిపోవును.
అటువంటివాడు దుర్మార్గునిగా పేరు తెచ్చుకొన్నవాడైనా, నా లెక్కలో వాడు సత్పురుషడనియే చెప్పవచ్చును. ఇదే
విషయమును గీతయందు రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయమున 30వ శ్లోకములో చెప్పడమైనది.
30వ శ్లో॥ అపిచేత్సు దురాచారో భజతే మా మనన్య భాక్
సాధురేవస మన్తవ్య స్సమ్యగ్వ్య వసితోహిసః ॥
భావము :- " ఈ ప్రపంచములో దురాచారములతో కూడుకొన్న ఎంతటి దుర్మార్గుడైనాగానీ, అన్యచింతలేకుండా నన్నే
ఆరాధించు వానిని సాధువని చెప్పవచ్చును. ఎందుకనగా వాడు నిశ్చయ జ్ఞానము తెలిసినవాడు”.
ప్రపంచ సంబంధ పాపములను చేసుకొన్నవాడు తన పాపములను దైవజ్ఞానముచేత లేకుండా చేసుకోవచ్చునూ,
మంచివానిగా చెప్పబడవచ్చును. అయితే దైవ సంబంధముగ తప్పు చేసినవానికి జ్ఞానము తెలుసుకొను అవకాశమే
ఉండదనీ, జ్ఞానము యొక్క గట్టు ఏమాత్రము దొరకకుండా చేస్తానని దేవుడే చెప్పాడు. ప్రకృతి సంబంధ విషయములో
పాపమును పొందినవాడు పాపక్షమాపణ పొందవచ్చును. దైవసంబంధ విషయములలో అధర్మముగా ప్రవర్తించిన
వానికి అటువంటి అవకాశమే ఉండదు. దేవుని చేత తీర్పు తీర్చబడిన వానికి జ్ఞానము యొక్క గట్టు దొరకదని
చెప్పాడు. ఈ విధానము ఒక హిందువులకేకాక మిగతా అన్ని సమాజముల వారికి ఒకే విధముగా వర్తించును.
హిందూ సమాజములో ఉంటూ మేము హిందువులము అని చెప్పు చాలామందికి వారి గ్రంథమేదో కూడా తెలియదు.
అయితే మిగతా సమాజములైన ముస్లీమ్లకు, క్రైస్తవులకు వారి గ్రంథము ఫలానాయని బాగా తెలుసు. ముస్లీములు
దైవ జ్ఞానము కొరకు ఖుర్ఆన్ గ్రంథమునూ, క్రైస్తవులు బైబిల్ గ్రంథమునూ చూడడమే కాకుండా బైబిల్కు ముందు
'పరిశుద్ధ' అను పదము నుంచి పరిశుద్ధ బైబిలు అనియూ, ఖుర్ఆన్కు ముందు 'పవిత్ర' అను పదమునుంచి పవిత్ర
ఖుర్ఆన్ అనియు గౌరవ పూర్వకముగా చెప్పుచుందురు. హిందువులు భగవద్గీతకు ముందు అటువంటి గౌరవ పదములను
ఉంచలేదు. అయితే ఇప్పుడు మేము, మా అనుచరులు భగవద్గీతకు ముందు “పరమ పవిత్ర పరిశుద్ధ” అను పదములను
చేర్చి, 'పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత' అని చెప్పుచున్నాము. ముందర గౌరవ పదములను చూచినవారికి
గ్రంథము ఎటువంటిదో చదవకనే తెలియగలదు. గ్రంథము ముందర గౌరవ ప్రదమైన పేర్లు ఉండినా, గ్రంథములలో
దైవజ్ఞానము నింపబడియున్నా ఇటు క్రైస్తవులు అటు ముస్లీమ్లు వారివారి గ్రంథములనుండి ఎంత తెలియాలో అంత
తెలియలేక పోయారని చెప్పవచ్చును.
ఇందువుల (హిందువుల) గ్రంథమైన భగవద్గీత హిందువుల వద్దయున్నా, కొందరు దానిని శ్రద్ధగా చదివినా,
అందులోని జ్ఞానమును తెలుసుకోలేక పోవుచున్నారు. జ్ఞానము తెలియకపోవడమే కాకుండా పైగా కొన్ని సంశయములు
ఏర్పడుచున్నవి. విశ్వరూప సందర్శన యోగములో యజ్ఞములను చేయుట అధర్మమనీ, వాటి వలన దేవుడు తెలియబడడనీ
39

Page 40
చెప్పబడియున్నది. ఇదే యజ్ఞములను గురించి కర్మయోగమను అధ్యాయములో 10 నుండి 16 శ్లోకముల వరకు
యజ్ఞములు చేయాలి అనియూ, యజ్ఞముల చేతనే దేవతారాధన చేయాలని చెప్పడమైనది. యజ్ఞము చేయడము మనిషియొక్క
కర్తవ్యమనీ, యజ్ఞములు చేయక పోవడము దొంగతనముతో సమానమని 12వ శ్లోకమునగలదు. దేవుడు వేదములనూ,
యజ్ఞములనూ, తపస్సులనూ అధర్మములుగా విశ్వరూప సందర్శనయోగములో చెప్పినవాడు, కర్మయోగములో యజ్ఞములను
తప్పక చేయాలి అని ఎందుకు చెప్పాడు. పరస్పర విరుద్ధమైన మాటలలో ఏది నమ్మాలి అను సంశయము రాగలదు.
ఈ విధమైన అనుమానములు వచ్చి చాలామంది గీతనుండి ఏమీ తెలియలేక పోయారు. భగవద్గీతను చదివిన తర్వాత
జ్ఞానము తెలియకపోవడమేకాక, అంతుకుముందు లేని సంశయములు కూడా పుట్టుకు రావడము జరిగినది. ఐదువేల
సంవత్సరముల క్రిందట పుట్టిన భగవద్గీతలోనే ఇటువంటి లోపములున్నాయని ఒక ఇందువుగా (హిందువుగా) నేను
ఒప్పుకొంటున్నాను. అటువంటి లోపములు గీతలో కనిపించకుండా చేయుటకు మావంతు కృషి చేశాము. లోపరహిత
భగవద్గీతగా "త్రైత సిద్ధాంత భగవద్గీత"ను లోకమునకు చూపాము. దేవుని సేవలో ఒక భాగముగా ఆ కార్యమును
చేశాము.
భగవద్గీతలో కూడా మనుషులను ప్రక్కదారి పట్టించుటకు, దేవుని వైపు పోకుండా చేయుటకు, అక్కడక్కడ
అనుమానములు కల్గునట్లు మాయ తన జ్ఞానమును కూడా గీతలో ఉంచినది. దేవునికి తెలియకుండా ఏమీ జరుగదని
జ్ఞాపకముంచుకోవలెను. భగవద్గీతలో ఒక రకముగా తన ప్రభావమును చూపిన మాయ (సాతాన్) బైబిలు గ్రంథములో
మరొక రకముగా తన ప్రభావము చూపినది. బైబిలు గ్రంథములో సాతాన్ ప్రభావమేమిటో ఎవరికీ తెలియదు. గీతలో
మాయ ప్రభావమేమిటో ఇంతవరకు హిందువులకు కూడా తెలియదు. మొట్టమొదట మేము ఇది మాయ జ్ఞానమని
చెప్పాము. అదే విధముగా బైబిలులో కూడా మనిషిని దేవుని మార్గమునుండి ఎలా ప్రక్క దారిలోనికి పంపించాలో, ఆ
విధమైన ఏర్పాటు మరొక విధముగా చేసిపెట్టింది. ఆ సాతాన్ ప్రయత్నము మేము బయటికి చెప్పలేకపోయినా, ఒక
విషయమును మాత్రము మొదటినుండి చెప్పు చున్నాము. బైబిలు 66 భాగములుగా ఉన్నది. అందులో ఏసుప్రభువు
ప్రత్యక్షముగా జీవించినప్పుడు చెప్పిన మాటలున్న మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అను నాలుగు భాగములు గలవు.
ఈ నాలుగు సువార్తలను మాత్రము చదవండి మిగతా 62 భాగములు మీకు అవసరములేదు అని చెప్పుచున్నాము.
అర్థము చేసుకొను శక్తియున్నవానికి ఒక్క యోహాన్ సువార్త చాలునని కూడా చెప్పాము. అయినా చెవిటివాని ముందు
శంకు ఊదినట్లు మా మాటను ఎవరూ పట్టించుకోలేదు. పైగా మా క్రైస్తవుల గ్రంథమును గురించి హిందువుగానున్న
ఆయనకేమి తెలుసు అని అన్నారు. బైబిలులో దేవుని జ్ఞానమే కాకుండా, సాతాన్ ప్రభావము కూడా ఎవరికీ కనిపించకుండా
ఉండగా, ఖుర్ఆన్ గ్రంథము మరొక విధముగా ఉన్నది.
ఏది జరిగినా దేవుని అనుమతితోనే జరుగును. దేవునికి తెలియకుండా ఏదీ జరుగదని జ్ఞాపకముంచుకోవలెను.
ముస్లీమ్లను కూడా సైతాన్ (సాతాన్ లేక మాయ) అనునది ప్రక్కదారి పట్టించుటకు ప్రయత్నము చేసినది. ఇస్లామ్లోనేకాక
అన్ని మతములలోనూ దాని ప్రభావమున్నది. ముస్లీమ్లను సైతాన్ (మాయ) ఎలా మోసగించుచున్నదో, దేవుని
మార్గములో ఉన్నావని చెప్పుచూ ఎలా ప్రక్క దారి పట్టిస్తున్నదో, నాకు తెలిసినా దానిని బయటికి చెప్పుటకు నేను
సిద్ధముగా లేను. ఎందుకనగా నాకు తెలిసినది సత్యమో కాదో. అందువలన అది నా వరకే ఉంటుంది.
ముస్లీమ్ సమాజములోనున్నవారికి నేను చెప్పునదేమనగా! ఖుర్ఆన్ నిజముగా దైవగ్రంథము. అందులోని 112వ
సురాలోని నాలుగు ఆయత్లను బాగా అర్థము చేసుకోండి. ఆ ఒక్క సురాతోనే దేవుడంటే ఏమిటో, ఎంత శక్తిగలవాడో
అయినా
40

Page 41
మీకు తెలియగలదు.
ఇంకా ముఖ్యముగా చెప్పునదేమనగా ఇస్లామ్లో ఖుర్ఆన్ గ్రంథమునుమించినది లేదు.
అటువంటపుడు మీకు హదీసులెందుకు? ఖుర్ఆన్ గ్రంథము ప్రక్కలో దానికి సమానముగా ఏ గ్రంథమును చేర్చవద్దండి.
సైతాన్కు తమను దైవమార్గము నుండి తప్పించు అవకాశము ఇవ్వద్దండి.
మాయను దేవుడే సృష్ట్యాదిలోనే తయారు చేశాడు. దేవుని ఆజ్ఞతోనే మాయ పని చేయుచున్నది. దేవుని శక్తితో
పనిచేయు మాయ చాలా బలాఢ్యమైనది. దేవుని మీద శ్రద్ధలేని వానిని దేవునివైపు రానివ్వదు. దేవుని మీద ఇష్టములేని
వారిని దేవునివైపు పోకుండా చేయుటకు మాయ కాపలాగావుంటూ, అన్ని మతములలోనూ శ్రద్ధలేని వారిని దూరముగా
పంపుటకు కావలసిన ఏర్పాట్లన్నియు చేసిపెట్టుకొన్నది. ఆ ప్రయత్నములలోని భాగమే భగవద్గీతలో అధర్మ శ్లోకములు
గలవు. మిగత అన్ని మతములలో మాయ ప్రయత్నము కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు మనము ఒక్క హిందువుల
గ్రంథమైన భగవద్గీతలోనే కాకుండా బయట వేదములలో, పురాణములలో మాయ ఎక్కువగా నిండుకొని ఉన్నది. అన్ని
మతముల వారు తాము సక్రమముగా ఉన్నామని అనుకొంటున్నారు గానీ, తమను మాయ ఏమైనా మభ్యపెట్టిందేమోనని
ఎవరూ చూచుకోవడములేదు. జాగ్రత్తగాయున్నవారినే వదలిపెట్టని మాయ, జాగ్రత్తగా లేని వారిని వదలి పెట్టుతుందను
కోవడము పొరపాటు.
ఇంతవరకు హిందువులను గురించి వారు చేయుచున్న అధర్మములను గురించి చెప్పుకొన్నాము. అయితే
దేవుడు చెప్పునది ఒక హిందువులకే కాదు. ఆయన సర్వమానవులకు అధిపతి అయినందున, ఆయన బోధలు సర్వ
జీవరాసులకు సంబంధించినవైనందున, ఆయన తీర్పు అందరికీ ఒకే విధముగా ఉండును. ఇదంతయు సత్య ప్రకటన
కొరకు చెప్పునదేగానీ, ఎవరినీ కించపరచుటకుకాదని ముందే తెల్పుచున్నాము. హిందువులను వదలి క్రైస్తవులను
ముస్లీమ్లను చూస్తే, ఇద్దరికీ దేవుడు ఒకే జ్ఞానమును చెప్పియున్నా వీరిద్దరిలో మరణము గురించి, పుట్టుకను గురించి
చాలా అభిప్రాయభేదములున్నవి. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టడడముగానీ, బ్రతకడముగానీ జరుగదని
ముస్లీమ్లు అనుచుండగా, ఏసుప్రభువు చనిపోయి తిరిగి బ్రతికాడని క్రైస్తవులు అనుచున్నారు. ఎటు తిరిగి మా
ఖుర్ఆన్ జ్ఞానమే గొప్ప అని ముస్లీమ్లు, కాదు మా బైబిలు జ్ఞానమే గొప్పయని క్రైస్తవులు అనడము జరుగుచున్నది.
రెండు జ్ఞానములు ఒక్కటే అయినా వాటిని వేరువేరుగా అర్థమగునట్లు చేసి అభిప్రాయ భేదములను మాయ ఏర్పరచినదని
ఇరువురూ గ్రహించ లేకపోయారు. ఇరువురూ ఒకరి జ్ఞానమును మరొకరు ప్రత్యక్షముగా నిందించుకోవడము వలన
పరోక్షముగా దేవున్ని, దేవుని జ్ఞానమును నిందించినట్లగుచున్నది. దానివలన దేవుని న్యాయస్థానములో (కోర్టులో)
ఇరువురూ దోషులుగా నిలబడవలసి వస్తుందని, శిక్ష పడుతుందని వారికి అర్థము కాలేదు. ఎక్కడ ఏమీ మాట్లాడినా
ఫరావాలేదుగానీ, దేవుని విషయములో చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుందని మరువకూడదు.
మనుషులు మతముగా విభజింపబడియున్నా దేవుని దృష్ఠిలో అందరూ సమానమే. ఎవరు తప్పుచేసినా
హిందువులకు ఒక రకము శిక్ష, ముస్లీమ్లకు ఒక రకము శిక్ష ఉండదు. అందరికీ సమానమైన తీర్పు, సమానమైన శిక్ష
ఉంటుంది. దేవుని విషయములో ఎవరైనా తప్పు చేయుచున్నప్పుడు, అది తప్పు అని మనకు తెలిస్తే, అది దేవుని
విషయమైనందువలన, తప్పు చేయువారిని జాగ్రత్త పరచడము అందరి బాధ్యత. అందువలన నాకు తెలిసినంత వరకు
దేవుని మార్గములో మనిషి చేయు తప్పులను గురించి చెప్పుచున్నాను. ఖుర్ఆన్ గ్రంథములో అలీ ఇమ్రాన్ అను
మూడవ సురాలో ఏడవ ఆయత్నందు ముతషాభిహత్ అను వాక్యములు ఖుర్ఆన్ గ్రంథములో ఉన్నాయనీ, ఆ వాక్యములకు
అర్థము దేవుడు తప్ప మరి ఎవ్వరు ఎరుగరు అని చెప్పబడియున్నది. దీనినిబట్టి ఏ మనిషికీ ఆ వాక్యముల జ్ఞానము
41

Page 42
తెలియదనియేగా అర్థము. దేవుని విషయము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియనప్పుడు, మనుషులకు దేవుడు
తప్ప ఇతరులెవరూ బోధించలేరనియేగా అర్థము. ఎక్కడైనా దేవుని ధర్మములను సక్రమముగా ఎవడైనా బోధిస్తూ వుంటే
వానిని మనిషి అనుటకు వీలులేదు. ఎందుకనగా ఏ మనిషికీ దేవుని సూక్ష్మజ్ఞానము తెలియదని తన గ్రంథములో
దేవుడే చెప్పాడు. భూమిమీద మనుషులకు జ్ఞానము తెలియజేయుటకు ఏ మనిషీ యోగ్యుడుకానప్పుడు, ఏ మనుష్యునికీ
దేవుని జ్ఞానము తెలియనప్పుడు, దేవుడే చెప్పవలసి వస్తున్నది. దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు అని అదే
ఖుర్ఆన్ గ్రంథములో 42వ సురా 51వ ఆయత్నందు కలదు. అలాంటపుడు దేవుడు ప్రత్యక్షముగా కాకుండా
పరోక్షముగా మారువేషములో వచ్చి మాట్లాడాలి. ఆయన వచ్చి చెప్పినప్పుడు అసలైన జ్ఞానము ప్రజలకు తెలుస్తుంది.
అంతవరకు తెలియుటకు అవకాశమేలేదు. దేవుడు ఏదో ఒక విధముగా భూమిమీద అవతరిస్తాడు అనుటకు ఖుర్ఆన్
గ్రంథమందే సాక్ష్యము గలదు. సురా 89, ఆయత్ 22లో "దైవదూతలు బారులు తీరియుండగా దేవుడు అవతరిస్తాడు.
(23) ఆ రోజు నరకము ముందుకు తీసుకరాబడుతుంది. ఆనాడు మనిషికి జ్ఞానోదయమౌతుంది. కానీ ఆ రోజు
జ్ఞానము కలిగి ఏమి లాభము (24) అయ్యో నా జీవితము కొరకు ముందే జాగ్రత్తపడి జ్ఞానము తెలిసియుంటే ఎంత
బాగుండేది అని అనుకుంటాడు.
ఈ మూడు వాక్యములను చూస్తే దేవుడు అవతరించి తెలియజేసినప్పుడే మనిషికి జ్ఞానము తెలుస్తుందనీ, అలా
తెలిసినప్పుడు ఇంత కాలము జ్ఞానము మీద శ్రద్ధ లేక కాలమును ఎంత వృథా చేసుకొన్నానని అనుకొంటాడని
అర్థమగుచున్నది. నా జ్ఞానము నాకు తప్ప ఎవరికీ తెలియదు. నేను ఏతెంచి (అవతరించి) మనుషులకు చెప్పునప్పుడు
మనిషి జ్ఞానమును తెలిసి పశ్చాత్తాపపడుతాడని ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు సూచనగా చెప్పియున్నా, దేవుడు
ఎప్పటికీ అవతరించడు అనుట దేవుని మాటకు విరుద్ధము కాదా? అట్లు మాట్లాడినవారు అంతరంగ న్యాయ స్థానములో
శిక్షార్హులు కాదా? 42వ సురా 51వ ఆయత్లో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడడు అని చెప్పి తన జ్ఞానమును మూడు
విధములుగా మనుషులకు తెలియజేస్తాడు అని ఉన్నది. అందులో మూడవది తన దూత ద్వారా తెలియజేస్తాను
అన్నాడు. ఆ దూత ఎవరో? ఏ ముస్లీమ్ అయినా చెప్పగలడా? పురుషోత్తమ మహారాజు వద్దకు అలెగ్జాండరు చక్రవర్తి
దగ్గరనుండి దూత వచ్చాడు. పురుషోత్తముడు మహా ధైర్యశాలి. ఆయన ఎవరికీ లొంగలేదు. అటువంటి వానితో
సమయస్ఫూర్తితో తెలివిగా మాట్లాడ వలసియుంటుంది. పురుషోత్తముడు అడుగు ప్రశ్నకు అప్పటికప్పుడు జవాబు
చెప్పవలసియుంటుంది. అటువంటపుడు సాధారణ దూత ఎటువంటి నిర్ణయమునూ తీసుకోలేడు. అవసరాన్నిబట్టి
మాట్లాడవలసియుంటుంది. కావున దూత వేషములో అలెగ్జాండరే పురుషోత్తముని వద్దకు వచ్చాడు. వచ్చిన వానిని
దూతయని అందరూ అనుకొనినా వాస్తవానికి వచ్చినవాడు చక్రవర్తియే కదా! అలాగే దేవుడు మారువేషములో మనిషివలె
వచ్చి తన జ్ఞానమును బోధించిపోవును.
చూడండి.
భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 11వ శ్లోకములో పై మాటకు సాక్ష్యముగా ఇలా ఉన్నది
11వ శ్లో॥
అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్||
భావము :- “సర్వ జీవరాసులకు సృష్టికర్తనైన, దేవుడనైన నేను మానవ శరీరమును ధరించి వచ్చినప్పుడు నన్ను జూచి,
42

Page 43
నా యొక్క దైవ భావమును తెలియలేక నరులు మూఢులగుచు నన్ను అవమానింతురు.” ఈ భావము లోని విషయమును
చూస్తే దేవుడు మనిషి శరీరము ధరించిరాడని ఎవరూ చెప్పుటకు వీలులేదు. భగవద్గీతలో కూడా ధర్మములు భూమిమీద
తెలియకుండాపోయినప్పుడు వాటిని తెలియజేయుటకు వస్తానని చెప్పాడు. అలా వచ్చినవాడు ఎవరిచేతనూ గుర్తింపబడక
మనిషివలె నటించి, మనిషివలె జీవించి చివరకు తన జ్ఞానమును తెలిపిపోవును. అట్లు వచ్చిన వానిని ఈయన ఫలానా
అని ఎవరూ గుర్తించలేరు. తాను ఫలానా అని చెప్పినా దేవున్ని గుర్తించలేని పరిస్థితిలో మనిషి ఉన్నాడు. అందువలన
దేవుడు భగవంతుని వేషములో మనిషిగా వచ్చిపోతాడని ఎవరికీ తెలియదు. భగవద్గీతలో నా జ్ఞానమును తెలియజెప్పుటకు
వస్తానని, అట్లు వచ్చిన నన్ను ఎవరూ గుర్తించక సాధారణ మనిషివలె భావించి అజ్ఞానులైన వారు అవమానింతురని
కూడ చెప్పాడు.
బైబిలు గ్రంథమును చూస్తే యోహాను 8వ అధ్యాయములో 23వ వాక్యము “మీరు ఈ లోక సంబంధులు, నేను
ఈ లోక సంబంధుడను కాను.” అని ఉన్నది. ఆ ఒక్క మాటనుబట్టి ప్రభువుగా వచ్చినవాడెవడో తెలియవచ్చును.
అయితే మాయ మభ్యపరచి ఆయనను సాధారణ మనిషిగానే అర్థమగునట్లు చేయును. ఒక సందర్భములో (యోహాను
8-19 వ వాక్యమునందు) వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడుగగా! యేసు మీరు నన్నైననూ, నా తండ్రినైననూ
ఎరుగరు. నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను. ఈ 19వ వాక్యములో నేను,
నాతండ్రియని విభజించి చెప్పిన ఏసు ప్రక్కమాటలోనే నన్ను తెలిసినవారు నా తండ్రిని కూడా తెలిసినవారగుదురని
చెప్పడములో కూడా వచ్చినవాడు ఎవడో అర్థము కాగలదు. అయినా ఎవరూ ఆయనను గుర్తించలేరు. ఇంకొకచోట
(యోహాను 8,24 వాక్యము) నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని
వారితో చెప్పెను. ఈ వాక్యము పూర్తి విప్పి చెప్పినట్లున్నది. దేవున్నిగానీ, దేవుని జ్ఞానమునుగానీ తెలిసిన వానికి
పాపములన్నీ నశించి కర్మ విముక్తుడగునని భగవద్గీతలోయున్నట్లు నేను దేవున్నని నమ్మకపోతే మీ పాపము నశించదని
చెప్పినమాట భగవద్గీతలో చెప్పినమాటకు సమానమగుచున్నది. దేవుడు దేవునిగా వస్తానని ఎక్కడా చెప్పలేదు. దేవుడు
భగవంతునిగా వస్తానని చెప్పాడు. తన ధర్మములను బోధించుటకే అలా వస్తానని చెప్పాడు. అందరికీ దేవుడనైన నేను
మానవ శరీరము ధరించి వస్తే అజ్ఞానులు నా గొప్పతనమును తెలుసుకోలేక అవమానింతురని కూడా చెప్పాడు.
కొంత జ్ఞానమున్నవాడు దేవుని రాకను గుర్తించుటకు అవకాశమున్నా దేవుడు అవతరించడు, అవతరించినవాడు
దేవుడు కాదు అంటే అది దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడినట్లు కాదా! దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడుట వలన
మనిషి శిక్షార్హుడగుచున్నాడు.
దేవునికి మతమూ, మతస్థుడు అను తారతమ్యము ఉండదు. ఎవరైనా ఆయన లెక్కలో తప్పుచేసినవారగుదురు.
దేవుడు భూమిమీదికి మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు ఎవరూ ఆయనను గుర్తించలేరు. తనతో సమానముగానున్న
మనిషిని దేవునిగా ఒప్పుకొనుటకు అన్నీ అడ్డము వస్తాయి. అప్పుడంటే కాదు. అయితే ఆయన వచ్చిపోయిన
తర్వాతనైనా వచ్చి జ్ఞానము చెప్పినవాడు ఫలానావాడు అని గుర్తించకపోవడము అజ్ఞానము కాదా! గుర్తించకపోవడమే
కాకుండా దేవుడు మనిషిగా రాడు అని చెప్పుచూ నేను వస్తానని చెప్పిన దేవుని మాటకు వ్యతిరేఖముగా చెప్పుట దేవుని
మాటను కించపరిచినట్లు కాదా! ఇటువంటివారికి తీర్పు ఉండదంటారా! శిక్షపడదంటారా! మేము ఇంతవరకు
సక్రమమైన జ్ఞానమునే మాట్లాడినామనుకొనువారంతా ఒకమారు వెనుతిరిగి చూచుకోండి. మీరు చేసినది తప్పో
ఒప్పో తెలియగలదు. మీకు తెలిసినా తెలియకున్నా మీరు పప్పులో కాలు వేశారు. మీరు చేసినది ముమ్మాటికి తప్పే.
43

Page 44
ఇప్పటినుంచయిన మతము అను మత్తులోనుండి బయటపడి నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలియుటకు ప్రయత్నించు.
ఇంత చెప్పినా దేవుడు ఎక్కడో పైన ఉంటాడు, ఆయన మనిషిగా రాడు అని అనువారిని ఎవరూ రక్షించలేరు.
క్రైస్తవ మతములోని క్రైస్తవులలో ఏసుప్రభువును గురించి భిన్నాభి ప్రాయములు కలవు. ఏసు మీదనే సరియైన
అభిప్రాయము లేనివారు ఆయన చెప్పిన బోధల మీద ఏకాభిప్రాయముతో ఉంటారను నమ్మకములేదు. ఏసును
కుమారుడు అనియు దేవున్ని తండ్రి అనియు కొందరనుచున్నారు. దేవుని కుమారుడు ఏసు అని కొందరనుచుండినా,
ఏసును తండ్రి అని అనుచున్నారు. స్వయముగా ఏసే తనను పంపినవాడు దేవుడైన తండ్రి అని చెప్పుట బైబిల్లో
గలదు. దానినిబట్టి కొందరు దేవున్ని తండ్రియని ఏసును కుమారుడని అనడము జరుగుచున్నది. దేవుడు అందరికీ
తండ్రి అయినందున ప్రజలకు కూడా దేవుడు తండ్రియనీ, ఆ లెక్కప్రకారము దేవునికి కుమారుడుగా చెప్పబడిన ఏసు
మనుషులకు సోదరుడని లెక్కించి, క్రైస్తవులలో జ్ఞానులుగా చెప్పుకొను కొందరు ప్రభువును మా సోదరుడు అంటున్నారు.
మాకంటే ముందు పుట్టినవాడు కనుక మాకు అన్న అవుతాడని చెప్పుచున్నారు. అదే నేపథ్యములో మా అన్న అయిన
ఏసు ఈ విధముగా చెప్పాడని ఆయన చెప్పిన మాటలను చెప్పుచున్నారు. దేవుడు అవసరమొచ్చినప్పుడు మనిషిగా
వచ్చి తన జ్ఞానమును చెప్పి పోతానని అనేకమార్లు చెప్పి, అలాగే ఆయనకు అవసరమొచ్చినప్పుడు ఒక్కొక్కమారు
ఒక్కొక్క రూపముతో, ఒక్కొక్కమారు ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క మారు ఒక్కొక్క విధానముతో వచ్చి లోకములో మనిషి
కాకున్నా మనిషివలె నటించి చివరకు తన జ్ఞానమును చెప్పిపోయాడు. ఎన్నిమార్లు వచ్చినా, ఎన్ని పేర్లు చెప్పినా
వచ్చినవాడొకడే అను విషయమును ఎవరూ గ్రహించలేక పోయారు. ఆయన వచ్చినప్పుడు చెప్పిన జ్ఞానము తప్ప
ఆయన ఆకారములు గానీ, వచ్చినప్పుడు చెప్పిన పేర్లుగానీ, ఆయన చెప్పిన మిగతా మాటలుగానీ అన్నీ కల్పితములే.
దేవుడు తండ్రి తాను కుమారుడనని చెప్పినది నిన్ను మాయలో వేయుటకే గానీ వేరుగాదు. వాస్తవానికి తండ్రి ఆయనే,
కుమారుడు ఆయనే. నేను ఫలానా అని ఆయన కొన్నిచోట్ల సత్యము చెప్పినా, మనిషికి ఆయనను గుర్తించు
జ్ఞానములేనందున కొన్నిచోట్ల నేను వేరు దేవుడువేరన్నట్లు చెప్పాడు. అదే కోవలోనే నేను కుమారుడు, నా తండ్రి
దేవుడన్నాడు. ఆ మాటతో చాలామంది దేవుడు వేరనీ, ఏసు వేరని అనుకొన్నారు. ఏసుప్రభువు చెప్పిన మాటలు
ఒకమారు తానే దేవుడనని చెప్పి అంతలోనే దేవుడు వేరన్నట్లుండును. వాస్తవానికి ఆయన కొన్నిచోట్ల తనంతటతానే
నేను దేవుడనని సూచన కల్గించినా గ్రుడ్డి ప్రజలు ఆయనను గుర్తించలేక పోయారు.
గుర్తించకపోయినా ఫరవాలేదుగానీ, తాము జ్ఞానులమని చెప్పుకొను ఒక తెగవారు ఏసును మా అన్న, మా
సోదరుడు అని చెప్పడము విచిత్రముగాయున్నది. నేను ఎల్లప్పుడూ ఉన్నవాడినని దేవుడు తప్ప ఎవడైనా ధైర్యముగా
చెప్పునా? మనిషి అయినవాడు ఎవడూ చెప్పలేని మాటను ఏసు చెప్పినట్లు యోహాను సువార్త 8వ అధ్యాయములో
57,58 వాక్యములలో కలదు. (57) నీ కింకనూ యాభైసంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని
ఆయనతో చెప్పగా! (58) అబ్రహాము పుట్టకమునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. చూచారా!
సాధారణ మనిషి ఎవడైనా ఇలా చెప్పగలడా? ద్వాపరయుగములో కృష్ణుడు అర్జునునితో కూడా ఇట్లే అన్నాడు. “నీవు
ఇప్పుడు పుట్టియున్నావు కదా! సూర్యుడు సృష్ట్యాదిలో పుట్టాడు కదా! అప్పుడు ఆయనకు నీవు ఎట్లు జ్ఞానము
చెప్పితివి?” అని అర్జునుడు ప్రశ్నించగా! అప్పుడు కృష్ణుడు “నేను అప్పుడూ ఉన్నాను ఇప్పుడూ ఉన్నాను, నాకు
అన్నియు జ్ఞాపకమున్నాయి” అన్నాడట. ఈ మాటలన్నిటినీ క్రోడికరించి కొంత జ్ఞానదృష్టితో చూస్తే, దేవుని జ్ఞానము
దేవునికే తెలుసు మరి ఎవ్వరికీ తెలియదు. కావున దేవుని జ్ఞానము భూమిమీద లేకుండా పోయినప్పుడు, దేవుడు
44

Page 45
మనిషి వేషముతో వచ్చి తానే జ్ఞానమును చెప్పిపోవునని తెలియుచున్నది. దేవుడు కూడా నేను మీ మధ్యలోనికి
ధర్మములకు ముప్పు కల్గినప్పుడు వచ్చి ధర్మసంస్థాపన చేసి పోతానని గీతలో చెప్పాడు, బైబిల్లో చెప్పాడు. దేవుడు ఆ
విధముగా చెప్పియుండగా! దేవుడు అవతరించడు అని దేవుని మాటకు వ్యతిరేఖముగా చెప్పు వారినీ, దేవుడు మనిషిగా
వచ్చినా ఆయనను గుర్తించక ఆయననే అవమానించిన వారినీ, దేవుని కోర్టులో ప్రకృతి ముద్దాయిగా నిలబెట్టగలదు.
దేవుడు మనిషివలె (భగవంతుడుగా) ఎదురుగా ఉండి మాట్లాడినా లెక్క చేయక హేళన చేసిన వారినీ, తన గ్రంథములలో
ఎంతగా చెప్పినా తన మాటలను పెడచెవిన పెట్టి దేవుడు మనిషివలె రాడు అను వారినీ, దేవుడు ఒకే శిక్షకు గురి
అగునట్లుగా దేవుని తీర్పు జరుగును.
దేనినుండైనా తప్పించుకోవచ్చును గానీ, దేవుని తీర్పునుండి తప్పించుకొనుటకు ఎవరికీ తరముగాదు. అప్పుడు
తెలియక మాట్లాడినాను అని చెప్పినా, మా గురువు లేక బోధకుడు చెప్పిన మాటలు విని ఆ విధముగా మాట్లాడినాను,
అందులో నా తప్పేమి లేదనినా, మత్తుపానీయము త్రాగి ఎరుకలేని స్థితిలో అలా మాట్లాడినాననినా, ఏ విధముగా
చెప్పినా నీమాటవినువారు ఎవరూ ఉండరు. తీర్పు జరుగుతుంది, శిక్ష అమలవుతుంది. అప్పుడు నీవు జ్ఞానమును
తెలుసుకోవాలనినా అది ఏమాత్రము దొరకదు. ఎంత ప్రయత్నించినా జ్ఞానము గట్టు దొరకకుండా పోతుంది. అందువలన
ఇప్పటినుండి దేవునికీ, దేవుని జ్ఞానమునకు విధేయుడవై ఉండుము.
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
45
----

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024