pss book:gt4 త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ సన్న్యాస యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత ☜ కర్మ సన్న్యాస యోగము
అర్జునుడిట్లనియె: -
శ్లోకం 1: సన్న్యాసం కర్మణాం కృష్ణ ! పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మేౠ్ర హి సునిశ్చితమ్||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మ సన్న్యాసము చెప్పితివి మరియు కర్మ చేయుట యోగమంటున్నావు. రెండింటిలో ఏది శ్రేష్ఠమో నిశ్చయముచేసి నాకు చెప్పుము.
వివరము : కర్మ అనగ పాపము మరియు పుణ్యము. కార్యమనగ పనులు. కార్యములను (పనులు) గురించి చెప్పునపుడుగాని, కర్మలను (పాపపుణ్యములు) గురించి చెప్పునపుడు గాని, రెండు సందర్భములలోను కర్మ అను పదమునే శ్లోకములో ఉపయోగించారని మరొక మారు జ్ఞప్తి చేయుచున్నాము. ఇచట అర్జునునకు ఒక అనుమానమొచ్చి వెంటనే అడిగాడు. ఈ కాలములో అయితే అటువంటి అవకాశము లేదనుకోండి. చెప్పేది వినక మధ్యలో అడుగకూడదనుట అప్పుడు లేదు. అందువలన సంశయము వస్తూనే ప్రశ్న వేశాడు. అలా అడుగక పోతే ఆ అనుమానము మనసులో ఉండుట వలన తర్వాత విషయము బుర్రకెక్కదు. మనసులో మెదిలిన ప్రశ్నను వెంటనే అడగడము మంచిది.
పరమాత్మలో కలిసిపోవడానికి, జన్మలు లేకుండ మోక్షము పొందడానికి రెండే యోగములు కలవు. అవియే ఒకటి బ్రహ్మయోగము, రెండవది కర్మయోగము. బ్రహ్మయోగములో శరీరముతో జరుగుపనులన్ని వదిలివేసి కూర్చోవడము. రెండవ కర్మయోగములో శరీరముతో జరుగు పనులన్ని చేయడము. ఈ రెండు యోగ విషయములను విన్న అర్జునుడు రెండింటిలో నాకు ఏది శ్రేష్ఠమో తెలుపమన్నాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు వెంటనే జవాబు చెప్పాడు.
శ్రీ భగవంతుడిట్లనియె: -
శ్లోకం 2: సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయ సకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మయోగము, బ్రహ్మయోగము రెండును శ్రేష్ఠమైనవే. కాని బ్రహ్మయోగముకంటే కర్మయోగమే గొప్పది.
వివరము : పరమాత్మను చేరుటకు రెండే యోగమార్గములన్నాము కదా! అందులో ఒకటి మంచిదని మరొకటి మంచిది కాదనుట ఏమిలేదు. రెండును సమానమే అయినవి. రెండును కర్మను కాల్చునవే. రెండిటియందును సాధారణ మానవునికి ఆచరణ యోగ్యమైనది కర్మయోగమే. అందువలన కర్మయోగము సంసారములో చిక్కుకొన్న సాధారణ వ్యక్తుల ఎడల విశిష్ఠత కల్గియున్నదని చెప్పవచ్చును. బ్రహ్మయోగము సంసారములేని వారికి సులభమగును.
శ్లోకం 3: జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ యోనద్వేష్ఠి న కాంక్షతి |
నిర్ద్వంద్వోహి మహాబాహో! సుఖం బందాత్ప్ర ముచ్యతే ||
(కర్మయోగము)
భావము : ఎవనికి అసూయ ప్రేమలు లేవో, ఎవడు సుఖదుఃఖ ద్వంద్వములను వదలివేయునో వాడే నిత్యసన్న్యాసి. వానికి బంధనములు లేవు.
వివరము : మనకు తెలిసినంత వరకు సన్న్యాసులంటే కాషాయరంగు గుడ్డలు ధరించిన వారని, సంసారము వదలివేసి భిక్షాటన చేయువారని సాధారణముగ అనుకొనుచుంటాము. పనులు చేయనివానిని మందలించునపుడు సన్న్యాసివి కావాలనుకున్నావా అనియో లేక ఇట్లుంటే సన్న్యాసులలో కలిసిపోతావనియో అంటుంటారు. దీనిని బట్టి చూస్తే పనులు చేయనివాడు సన్న్యాసి అను భావము అందరిలో ఇమిడిపోయింది. సంసార బాధ్యత లేకుండ పోవడము, పనులు చేయకుండ పోవడమే సన్న్యాసమని అందరు అనుకొన్నంత మాత్రమున అది సత్యము కాదు. నిజమైన సన్న్యాసమేదో భగవంతుడు చెప్పాడు. మనమనుకొన్న భావమునకు వ్యతిరిక్తముగ సన్న్యాసమును గూర్చి భగవంతుడు ప్రకటించాడు. పనులు మానుకోవడము సన్న్యాసముకాదని, ఒక పద్ధతి ప్రకారము పనులు చేయుటే నిజమైన సన్న్యాసమని తెలిపాడు. నిజమైన సన్న్యాసిని బాహ్యముగ గుర్తించుటకు వీలుపడదని, అతను అందరివలె పనులు చేయుచుండునని, అతనికి బాహ్యముగ ఏ గుర్తులుండవని తెల్పాడు.
బయటికి కన్పించు వేషధారులైన ఈ సన్న్యాసులంత ఎవరను ప్రశ్న వచ్చిందను కొంటాము. దానికి జవాబు ప్రేమ అసూయలు, కష్ట సుఖములను ద్వంద్వములైన గుణములు వదలి, వాటి ఫలితముల మీద ఇష్టము లేనివాడై, జరుగుచున్న పనులు కర్మరీత్య జరుగుచున్నవని, వాటి అనుభవములు కర్మరీత్య వచ్చునవేనని, మంచిచెడు అను భేదము లేక శరీరము ద్వారా పనులు చేయుచు, తాను వేరను భావము కల్గియున్న కర్మయోగియే నిజమైన సన్న్యాసి అయినపుడు మిగతావారు కాదనియే అర్థము.
శ్లోకం 4: సాంఖ్యాయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి నపండితాః |
ఏక మప్యాస్థితస్సమ్యక్ ఉభయోర్విన్దతే ఫలమ్ ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మయోగము వేరని, బ్రహ్మయోగము వేరని తెలియనివారనుచుందురు. తెలిసిన వారు రెండిటిలో దేనినాచరించిన ఫలసిద్ధియగునని చెప్పుచుందురు.
వివరము : రెండవ శ్లోకములో కర్మయోగము విశిష్ఠత కల్గినదని చెప్పి, ఇక్కడేమో రెండు వేరువేరని తెలియని వారనుచున్నారని చెప్పడము చూచి ఇదేమిటి రెండురకములుగ చెప్పారని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మేము అక్కడ కూడ రెండు యోగములు పరమాత్మను చేర్చునవేనని చెప్పాము. దేనినాచరించిన ఫలసిద్ధి ఒక్కటే. వాటి విషయములో అవి రెండు ఒక్కటే. కాని ఆచరించు మానవులలో ఏది అనుకూలము, ఏది అనుకూలము కాదు అనుటలో సాధారణ జనులలో కర్మయోగము అనుకూలతలో విశిష్ఠతగాంచినదని చెప్పాము. రెండు యోగములు చూపుదారి ఒక్కటే అయినప్పటికి భార్యపిల్లలున్న వారికి, తప్పక పనులు చేయు ఆవశ్యకత ఉన్నవారికి కర్మయోగము శ్రేష్ఠమైనది. భార్యపిల్లలులేని వారికి, సంసార బాధ్యత లేక పనులు చేయకుండినను జీవితము సాగిపోవు వారికి బ్రహ్మయోగము అనుకూలముగ ఉండును. వీటి తేడాలు ఆచరించు మనుషులకే, కాని యోగములలో లేవని తెలియాలి. ఆ విషయమే క్రింది శ్లోకములో కూడ చెప్పుచున్నారు.
శ్లోకం 5: యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగై రపి గమ్యతే |
ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగము ద్వార ఏ స్థానము ప్రాప్తించుచున్నదో, అదే కర్మ యోగములోను ప్రాప్తించుచున్నది. బ్రహ్మయోగము, కర్మయోగము రెండు సమానమైనవని తెలియువాడే వాస్తవ జ్ఞానదృష్ఠి కలవాడగును.
శ్లోకం 6: సన్న్యాసస్తు మహాబాహో! దుఃఖ మాప్తు మయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాఽధిగచ్ఛతి ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : యోగము లేనివాడు,కర్మను సన్న్యశించనివాడు దుఃఖమునే పొందు చుండును. యోగముతో కూడుకొన్నవాడు, మనస్సును అణచినవాడు పరబ్రహ్మ పదవిని తొందరగ పొందును.
వివరము : ఈ శ్లోకములో ఇక్కడ మేము వ్రాసిన భావమునకు అనేక భగవద్గీతలలోని భావము విభిన్నముగ వ్రాయబడివున్నది. ఒకరుకాదు ఇద్దరుకాదు అందరు అలా వ్రాయడములో శ్లోకముల భావము వివరము తెలిసి వ్రాయబడినవి కావని, ఒకరినొకరు చూచుకొని వ్రాయబడినవని తెలియుచున్నది. పరీక్షలు వ్రాయునపుడు ముందువానిని చూచి వెనుకవాడు వ్రాశాడనుకో, ముందు వానిది తప్పయిన వెనుక వానిది కూడా తప్పగును. ఆ విధముగనే శ్లోకములోని భావమేమిటని చూడక, ముందు ఇతరులు వ్రాసిన దానిననుసరించి వ్రాయుట వలన అందరిది ఒకే భావమై పోయినది. ఇది తప్పా ఒప్పా అని చూడకుండానే వ్రాశారు.
ముందు 4,5 శ్లోకములలో రెండు యోగములు ఒకే సామర్థ్యము కల్గివున్నవని చెప్పిన పెద్దలు, ప్రక్కనే ఉన్న శ్లోకములో మోక్షము పొందుటకు కర్మయోగ సహాయము అవసరము, కర్మయోగ సహాయము లేకుండ కేవలము బ్రహ్మయోగము ద్వార మోక్షము పొందుట కష్టతరము, కర్మయోగము తెలిసిన బ్రహ్మయోగి తొందరగ మోక్షము పొందుననుట విచిత్రము కాదా! ఇచట ప్రతి పద అర్థము వివరించుకొందాము.
1) సన్న్యాసస్తు = సన్న్యసించుట, లేక వదిలివేయుట, లేక లేకుండ చేసుకొనుట, దేనిని వదలుకోవడము, దేనిని సన్న్యసించడమంటే కర్మను సన్న్యసించడమని తెలియుచున్నది. కర్మను సన్న్యసించుటకు రెండు మార్గములున్నవి. ఒకటి సంచితకర్మను వదలించునది బ్రహ్మయోగము, రెండవది ఆగామికకర్మను వదలింపజేయునది కర్మయోగము. రెండు కర్మలను లేకుండ చేయు అర్థముతో 'సన్న్యాసస్తు' అన్నారు. ఈ మాట రెండు యోగములకు సంబంధించినదని తెలియాలి. సన్న్యాసము రెండు యోగములలో సమానముగ ఉన్నదని తెలియాలి.
2) అయోగతః = యోగము లేకుండుట, రెండు యోగములు లేకుండుటని అర్థము, కర్మ సన్న్యాసము కల్గివున్న రెండు యోగములు లేకపోవడము.
3) దుఃఖమాప్తు = దుఃఖము పొందుదువు. యోగములు లేనపుడు జీవుడు కర్మలచే దుఃఖమును పొందుచూనే ఉండును. కర్మలు నశించు యోగమున్నపుడే జీవుడు దుఃఖము పొందడు.
4) యోగయుక్తో = యోగముతో కూడుకొన్నవాడు అనగా పనులు చేయుచున్నను కర్మయోగముతో కూడుకొన్నవాడు.
5) ముని = మౌనము వహించిన వాడు. మనస్సు కాని ఇంద్రియములు కాని కదలక బ్రహ్మయోగమాచరించువాడు.
6) బ్రహ్మ = పరమాత్మను లేక మోక్షమును
7) నచిరేణాధి గచ్ఛతి = తొందరగ పొందుదువు
భావము : కర్మనశించు రెండు యోగములు లేకపోయిన దుఃఖము పొందుదువు. కర్మయోగము, బ్రహ్మయోగము పొందినవాడు శీఘ్రముగ మోక్షము పొంది పరమాత్మలోనికి ఐక్యమగును.
శ్లోకం 7: యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి నలిప్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : విశుద్ధాత్ముడై జితేంద్రియుడై సర్వ జీవుల యొక్క ఆత్మను తన ఆత్మగా తలచు యోగికి కర్మలుండవు.
వివరము : గుణములంటని శుద్ధాత్ముడైన జీవుడు, ఇంద్రియముల యొక్క పనులను నిలిపివేసి బ్రహ్మయోగమును పొంది, ఆ యోగములో ఆత్మను చూడగలిగి, మిగత జీవరాసులలోని ఆత్మయు తనలోని ఆత్మవలెనున్నదని తెలుసుకోగల్గిన వానికి, ముందు చేసిన సంచితకర్మలు నశించిపోవును. ఇది పూర్తి బ్రహ్మయోగులకు సంబంధించిన శ్లోకము. క్రింద కర్మయోగమునకు సంబంధించిన శ్లోకములను తెలియజేయుచున్నాడు.
శ్లోకం 8: నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ||
(కర్మయోగము)
శ్లోకం 9: ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్నిమిషన్నపి|
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్ ||
(కర్మయోగము)
శ్లోకం 10: బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతియః |
లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా ||
(కర్మయోగము)
భావము : ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న కర్మయోగి ఏ కార్యమునకు తాను కర్తను కాదని తలచి చూస్తు, వినుచు, తాకుచు, వాసన చూస్తు, తినుచు, నడుస్తు, నిద్రిస్తు, శ్వాస విడుచుచు తీసుకొనుచు, పల్కుచు, మల మూత్రములను విసర్జిస్తు, దేనినైన గ్రహిస్తు, కనులు తెరచుచు మరియు కనులు మూయుచు తమ తమ కార్యములను ఇంద్రియములు చేయుచున్నవని తలచుచుండును. ఈ విధముగ తన శరీరమందు జరుగు పనులను బ్రహ్మార్పణమొనర్చి సంగమనునది వర్జించినవాడు తామరాకుకు నీరంటనట్లు అఖిల పాపములచే అంటబడడు.
వివరము : పైన చెప్పబడిన కార్యములన్ని రెండు రకములుగ విభజింపబడివున్నవి. ఒకటి ఇష్టముండి జరుగునవి, రెండు మన ఇష్టమున్నా లేకున్నా జరుగునవి. బయటనే కాక శరీరములోపల కూడ పనులు జరుగుచూనే ఉన్నవి. వీటిని సైన్సులో కూడ ఇచ్ఛాధీన, అనిచ్ఛాధీన కార్యములంటున్నారు. చూచుట, వినుట, తాకుట, తినుట, నడుచుట మొదలగునవన్ని మన ఇచ్ఛ ప్రకారమే జరుగుచున్నవని ఇటువంటివన్ని ఇచ్ఛాధీన కార్యములని, మనకు తెలియకుండ జరుగు శ్వాస, కనులు మూయుట, తెరచుట అలాగే శరీరములో జరుగు గుండె, మూత్ర పిండముల, జీర్ణాశయముల కార్యములను అనిచ్ఛాధీన కార్యములని అంటున్నారు.
వాస్తవానికి సైన్సు ప్రకారము ఈ మాట తప్పేనని నిరూపించవచ్చును. ఎందుకనగ ఒకానొక సమయములో ఇచ్ఛాధీనముగ కదులు కాళ్ళు, చేతులు కూడ అనిచ్ఛాధీనముగ పనిచేయుచున్నవి. కాలిమీద చిన్నగ ఏదో ప్రాకినట్లనిపిస్తూనే నీకు తెలియకుండానే కాళ్ళు, చేతులు కదులుచున్నవి. నిద్రలో నీకు తెలియకుండానే నీ ఇచ్ఛ లేకుండానే కాళ్ళు చేతులు కదులుచున్నవి. నిద్రలో నడచిపోవువారు కూడ కలరు. దీనిని బట్టి ఇచ్ఛాధీన కార్యములు అనుట సైన్సు ప్రకారము కూడ పూర్తి సత్యము కాదు.
మనకు తెలిసినంతవరకు తెలిసి జరుగునవి, తెలియక జరుగునవని రెండు రకములుగ చెప్పవచ్చును. ఈ మాటను ఎవరు ఖండించలేరు. కొన్ని పనులు జీవునకు తెలిసి జరుగుచున్నవి. కొన్ని తెలియక జరుగుచున్నవి. తెలిసి జరిగెడు పనులు కూడ కొన్ని సమయములలో తెలియక జరుగుచున్నవి. ఉదాహరణకు మూత్రము తెలిసి పోస్తున్నాము. కొన్ని సమయములలో తెలియకనే పోసుకోవడము కూడ జరుగుచున్నది. ప్రతిది నా ఇష్టప్రకారము జరుగుచున్నవనుకోవడము అహముతో కూడిన అజ్ఞానమగును. ఉదాహరణకు నడుస్తున్నపుడు నా ఇష్టప్రకారము నడుస్తున్నాననుకోవడము అజ్ఞానము. ఇందులో అహము నిండివున్నది. కాళ్ళు నడుస్తున్నవని నాకు తెలుస్తుందనుకోవడము జ్ఞానమగును. ఇందులో అహము లేదు. నిద్రలో నడిచినపుడు నీకు తెలియకుండ నడవడమే కదా! అప్పుడు నాకు తెలియకుండ నడవడము జరిగినదనుకోవచ్చును. అట్లుకాక నాఇష్టప్రకారము నడచినామని చెప్పలేము కదా!
శరీరములో జరిగెడి పనులన్నియు మనకు తెలిసి జరుగుచున్నవి. కాని ఇష్టప్రకారము జరుగుచున్నవనుకోకూడదు. ఈ విధముగనే తెలిసిన జ్ఞానియు శరీరములో జరుగు కార్యములన్నిటిని కొన్ని నాకు తెలిసి జరుగుచున్నవి, కొన్ని తెలియక జరుగుచున్నవని, శరీరములో వాటి వాటి కార్యములు అవి చేయుచున్నవని అనుకుంటాడు. అజ్ఞానమున్నప్పుడు ఎలా ఉండునంటే రాత్రి ఇంటి బయట నిద్రపోయినవాడు ఉదయము ఇంటిలో లేయుచున్నాడు. బయటి నుండి ఇంటిలోపలికి ఎప్పుడొచ్చినది నిజంగా తెలియదు, ఎంత యోచించిన అర్థము కాలేదు. ఇతరుల నడిగాడు, కొద్దిగ వర్షము వచ్చినది వెంటనే వచ్చి లోపల పడుకున్నావని చెప్పారు. జరిగినది వాస్తవమే నీకాళ్ళు నడిచినవి. చేతులు కప్పుకున్న గుడ్డలు తీసుకున్నవి. లోపలికి వచ్చి పడుకోవడము జరిగినది. ఇవన్ని తెలియక జరిగాయి. ఈ ఒక్క సంఘటన చాలు మనము మన శరీరమువేరని, మన శరీరమును నడిపించి పనిచేయించు శక్తి వేరొకటున్నదని సులభముగ తెలియగలదు. అప్పటికి తెలియకపోతే నీవెటువంటివాడవంటే! అపుడపుడు అడిగినపుడు నీకు కావలసిన అన్నము, కూరలు పెట్టినంతమాత్రమున ప్రక్కింటావిడను నీ భార్యగ అనుకోవడము ఎంత తప్పో, నీకవసరమైనపుడు అనుకూలముగ కదిలిన అవయవములకు నీవే అధిపతివనుకోవడము కూడ అంతే తప్పగును. ప్రక్కింటావిడకు భర్తవున్నట్లు నీ అవయవములను ఆడించు భర్త ఒకడున్నాడు. ఆ స్థానము నాదేననుకోవడము పొరపాటు.
మన శరీరములో నూటికి ముప్ఫయి పాళ్ళు పనులు తెలిసి జరుగుచున్నవి. డెబ్బయి పాళ్ళు తెలియక జరుగుచున్నవని తెలిసినవాడు, తెలిసీ తెలియక జరిగెడి పనులకు తాను కారణముకాదని, అవి జరుగుటకు కర్మేకారణమని తెలిసినపుడు వాడు నిజమైన కర్మయోగి అగును. జరిగెడి పనులలో కర్మలు వానిని అంటవు. యోగము చేత ఏర్పడు అగ్నికి అవి కాలిపోవును.
శ్లోకం 11: కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |
యోగినః కర్మ కుర్వన్తి సంగమ్ త్యక్త్యాఽఽత్మ శుద్ధయే ||
(కర్మయోగము)
శ్లోకం 12: యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామ కారేణ ఫలే సక్తోనిబధ్యతే ||
(కర్మయోగము)
భావము : శరీరము, మనస్సు, బుద్ధి ఇంద్రియముల చేత జరిగెడి పనులకు సంగమము లేకుండ, ఆత్మశుద్ధియే ఆశయముగ కర్మఫలములందుకాంక్ష మానిన కర్మయోగి పనులు చేయుచున్నను శాంతి పొందును. కర్మయోగికానివాడు కోర్కెలను మానుకోలేక బంధనములో (కర్మలలో) చిక్కుచుండును.
శ్లోకం 13:సర్వ కర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ||
(కర్మయోగము)
భావము : మనసుచే సన్న్యసించి, కర్మకార్యములను తన నవద్వారపుర దేహమునకు విడిచి, కార్యకర్త కాక యోగి సుఖముగ నివశించుచుండును.
శ్లోకం 14: నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||
(ప్రకృతి)
భావము : భూమిమీద కర్మములనుగాని, కార్యములనుగాని, వాటి ఫలితములందు ఆశనుగాని ఆత్మ ఎవనికి కలుగజేయదు, ప్రకృతి స్వభావము చేతనే అవి కల్గుచుండును.
వివరము : స్వధర్మము పరధర్మమును చెప్పినపుడే ఆత్మధర్మము వేరని, ప్రకృతి ధర్మము వేరని చెప్పాము. పరధర్మమైన ప్రకృతి మన శరీరమంతా ఇమిడివున్నది. దాని స్వభావము చేతనే సర్వము జరుగుచున్నవి. జరుగుచున్నవాటిని ఆత్మ సాక్షిగ చూస్తున్నది కాని, ఆత్మ దేనిని కలుగజేయలేదు.
శ్లోకం 15: నాదత్తే కస్యచి త్పాపం నచైవ సుకృతం విభుః |
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః ||
(ప్రకృతి)
భావము : ఎవని పాపముకాని, ఎవని పుణ్యముకాని ఆత్మ తొలగింపదు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడివున్నది. దానిచేత ధరణిలో జనులు భ్రమిస్తున్నారు.
వివరము : ఎవడు ఎంత యోగమాచరిస్తే అంత కర్మ కాలిపోవునని ముందే చెప్పుకొన్నాము. ఆత్మ ఎవని కర్మను తొలగించదు. తొలగించుకోవడమేదో ఎవనికొద్ది వాడు చేసుకోవలసిందే. అదియును యోగపద్ధతి ద్వారానే సాధ్యమగును. అట్లుకాక అజ్ఞానులు మేము ఎన్నో ఆరాధనలు చేస్తున్నాము, మా పాపమును దేవుడు తీసివేస్తాడనుకోవడము పరిపాటిగవుంది. ఉదయము నుంచి పాపము పనులు చేసి సాయంకాలము నమస్కరిస్తే దేవుడు క్షమిస్తాడని కొందరనుకొంటారు. మరికొందరు మేము చేసిన పాపములు పోయి మాకు లాభము చేకూర్చమని కదా మేము వేల డబ్బు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తున్నాము అంటున్నారు. అజ్ఞానము జ్ఞానమును కప్పివేయడము వలన, భూమిమీద పాపముల నివృత్తి కోసము అనేక ఆరాధనలు ఏర్పడి, అవి చేయువారికి దేవుడు పాపములేకుండ చేస్తాడని భ్రమింప జేయుచున్నవి. వాస్తవానికి ఇవన్నియు మానవుడు భ్రమతో చేయుచున్నవని తెలియాలి.
శ్లోకం 16: జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః |
తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ||
(ఆత్మజ్ఞానము)
భావము : జ్ఞానముచేత ఎవరి అజ్ఞానమంతయు లేకుండపోవునో, అట్టివారికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశిస్తు వారికున్న భ్రమలన్ని తొలగిపోవును.
వివరము : ఆరాధిస్తే పాపములు పోతాయని భ్రమించువారికి ఆత్మజ్ఞానము కల్గుటచే, వారికున్న అజ్ఞానమంతయు తొలగిపోయి జ్ఞానచూపు కలుగుట వలన, కర్మలు పోవు మార్గము బాగా కనిపించును. అంతవరకు వారికున్న అంధత్వము తొలగిపోవును. స్వచ్ఛమైన జ్ఞానదృష్ఠి చేత పాపములు పోవుటకు యోగమార్గము తప్ప వేరులేదని, అది తన మీదనే ఆధారపడివున్నదని తెలియును. తెలిసిన తర్వాత యోగమార్గమున ప్రయాణించుటకు ప్రయత్నించును.
శ్లోకం 17: తద్భుద్ధయ స్తదాత్మానః స్తన్నిష్ఠా స్తత్పరాయణాః |
గచ్ఛన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః ||
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మయందు ధ్యాసకల్గి, మనోబుద్ధి నిష్టలన్నియు ఆత్మయందే నిలిపి, యోగమాచరించువారు జ్ఞానాగ్నిచేత కల్మషములన్నియు కాల్చివేయబడినవాడై జన్మలులేని మోక్షము పొందును.
వివరము : ఆత్మజ్ఞానము కల్గినవాడు తన పాపపుణ్యములెలా పోవునో తెలిసిన వాడై, బ్రహ్మయోగమాచరించవలెనని తలంపు కల్గి తన మనస్సును బుద్ధిని ప్రక్క ధ్యాసలకు పోనీయక ఉంచుట వలన లభించునది ఆత్మప్రాప్తియని గ్రహించి, ఆ విధముగనే ఆచరించి అతని కర్మనంతయు నాశనము చేసుకొని తిరిగి పుట్టనటువంటి స్థితిని పొందును. అట్టి బ్రహ్మయోగము నాచరించు వాని అనుభూతులెట్లుండుననగా!
శ్లోకం 18: విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః ||
(బ్రహ్మయోగము)
భావము : విద్యయు వినయము కల్గు విప్రులందును, గోవులందును, ఏనుగు లందును, కుక్కలందును, కుక్కలను తిను చండాలునియందును పండితుల దృష్ఠి సమముగా ఉండును.
వివరము : ఈ శ్లోకములో ఉచ్ఛము, నీచము, మధ్యము, మూడు చెప్పి వాటిని సమానముగ చూచువారు యోగి అని చెప్పారు. మనుషులలో ఉచ్ఛము బ్రాహ్మణులను, నీచము కుక్కమాంసమును తిను చండాలుడని చెప్పడమైనది. అట్లే జంతువులలో ఉచ్ఛమమైన ఆవును, మధ్యమమైన ఏనుగును, నీచమైన కుక్కను చెప్పడమైనది. ఈ విధముగ ఉచ్ఛ నీచ జీవరాసులలోను, మధ్యమమైన వాటిలోను, ఆత్మ సమానముగ ఉన్నదని బ్రహ్మయోగి గ్రహించగలడు. ముందు తన శరీరములో ఆత్మను చూచినవారు మిగతా శరీరములలో ఎట్లున్నది తెలియగలరు. తన శరీరములో ఆత్మ ఎట్లున్నదో, ఎక్కడ ఉన్నదో, ఎంత ఉన్నదో, ఏమి చేయుచున్నదో తెలిసినవారు మిగత అన్ని ఉచ్ఛనీచ శరీరములలో కూడ తన శరీరములో ఉన్నట్లే తలచి, తన శరీరములో ఎక్కడుందో అక్కడే ఉన్నదని, తనయందెంతున్నదో అంతే ఉన్నదని, తనయందేమి చేయుచున్నదో అదే పని చేయుచు సమానముగ ఉన్నదని తెలుసుకోగలరు. అందువలన బ్రహ్మయోగి ఏ జీవరాసిని చూచిన దానియందున్న ఆత్మను తన ఆత్మవలె తలంచును.
కొందరేమో ఉచ్ఛనీచములు తలచకుండ రెంటిని సమానముగ ఆదరించ వలెనని, అదే సమత్వమని చెప్పారు. అది బాహ్య ఆదరణే అగును. అలాగైతే ఆవును ఆదరించినట్లు కుక్కను ఆదరించగలము కాని, వానపామును ఆదరించినట్లు నాగుపామునాదరించలేము. జింకను దగ్గరకు తీసుక్కున్నట్లు పులిని దగ్గరకు తీసుకోలేము. ప్రకృతి సహజత్వము వలన వాటి గుణములు, నడవడిక వేరు వేరుగ ఉండును. అందువలన మనము పొరపాటుగ ఒకటిగ చూచిన అవి అట్లుండవు. కావున మనము వాటి ప్రకృతి సహజత్వమును వదిలి వాటిలోని ఆత్మయొక్క సహజత్వమును చూడాలి. అన్నింటియందు పరధర్మములు ఎలా ఉన్నా స్వధర్మము మాత్రము ఒక్కటేనని గ్రహించవలెను.
శ్లోకం 19: ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ర్బహ్మణి తే స్థితాః ||
(బ్రహ్మయోగము)
భావము : ఎవని మనస్సు సర్వ జీవరాసులందు సమత్వమును గ్రహించునో, అతడు ఇహమందే సంసార సముద్రమును దాటినవాడగుచున్నాడు. నిర్దోషమైన అందరియందు సమముగ గల ఆత్మను తలంచుటవలన వాడు ఆత్మను పొందును.
వివరము : ఇక్కడ కొంత లోతుగ యోచించాలి. బ్రహ్మయోగమాచరించి ఆత్మను తెలిసి, అది అందరియందు ఒకే విధముగ ఉన్నదని గ్రహించుట వలన, ఆ జన్మలోనే మోక్షము వచ్చినట్లు తలచకూడదు. మోక్షము రావాలంటే కర్మ నిశ్శేషముగ పోవాలి. కర్మ నిశ్శేషముగ పోవాలంటే కొన్ని జన్మలు పట్టును. ఇక్కడ బ్రహ్మయోగమున ఇహమునందే సంసారమును జయించినవాడగును, అనుటలో దేహము ఉన్నట్లే మరియు మరణించకనే శరీరములో జీవుడు ఉన్నట్లే యోగ సమయములో బయటి ప్రపంచముతో సంబంధము లేకుండ పోవుచున్నాడు. కనుక వాడు ఆ సమయములో జగతిలో కర్మను జయించినట్లే వాడు ఆత్మను పొందుచున్నాడు. కాని పరమాత్మను పొందలేదని గ్రహించాలి. పరమాత్మను పొందిన వానికి పునర్జన్మవుండదు. ఆత్మను పొందినవాడు జన్మనే స్థంభింపచేసినంత యోగ్యతను పొందినట్లు కనిపించును. ఆత్మనే పొందివున్నాడు కనుక జన్మ తప్పదు. ఆ జన్మలోనే కర్మ అయిపోయినట్లయితే పరమాత్ముని చేరి మోక్షము పొందగలడు. బ్రహ్మయోగి యోగములో ఎట్లుండునది క్రింది శ్లోకములో చెప్పుచున్నాడు.
శ్లోకం 20: నప్రహృష్యేత్ర్పియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం |
స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః ||
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మవిదుడు తన అజ్ఞానమునంతయు వదిలి బుద్ధిని ఆత్మయందే నిలుపును. వానికెంత సంప్రీతి కల్గిన సంతోషపడడు. అట్లే ఇష్టములేనిది కల్గిన బాధపడడు.
వివరము : బ్రహ్మయోగము ఆచరించునపుడు వాని మనస్సు బయటి విషయములను సేకరించక కదలకుండా ఉండి, మనోదృష్ఠియంతయు ఆత్మ మీద కేంద్రీకరించి, ఆత్మయొక్క అనుభవము ఏమిటో, దాని సమాచారము ఏమిటో గ్రహించి బుద్ధికి తెలియజేయుచుండును. బుద్ధియు ఆత్మ విషయములను మనస్సు ద్వారా గ్రహించి గ్రహించిన దానిని జీవునకు అందిస్తున్నది. జీవుడు మనస్సు చూపిన విషయమునే బుద్ధి ద్వార చూస్తూవుండును. మనస్సు బాహ్య విషయములను తెచ్చిపెట్టినపుడు వాటిని గుణములతో యోచించుట బుద్ధిపని. ఇప్పుడు మనస్సు గుణములతో సంబంధములేని లోపలి ఆత్మ విషయమును తెచ్చినది కావున గుణములతో సంబంధములేకుండ బుద్ధి యోచిస్తున్నది. మనస్సు బుద్ధికి ఏ విషయమును అందించిన దాని అనుభూతిని పొందడము జీవుని పని. ఇప్పుడు యోగ సమయములో బయటి విషయములైన ప్రకృతి విషయములను కాక లోపలి ఆత్మ విషయమును మనస్సు తెచ్చినది కనుక దానినే జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ విధముగ బుద్ధికి, మనస్సుకు, జీవునకు లోపలి విషయమైన ఆత్మ ధ్యాసయే సరిపోయినది. బయటి ధ్యాస ఏమాత్రము లేదు. కావున బయట ఎంత సంప్రీతి కల్గిన అట్లే ఎంత అసంప్రీతి కల్గిన దానిని గ్రహించు స్థితిలో లేడు. అటువంటప్పుడు వానికి సంప్రీతిలో సంతోషము గాని, అసంప్రీతిలో దుఃఖముగాని రెండు లేవు. యోగనిష్టలో ఉన్నపుడు మణులు, బంగారము వాని ముందర పెట్టి నీకేనని చెప్పిన అతడు సంతోషించలేడు.
శ్లోకం 21: బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా విన్దత్యాత్మనియ్సఖమ్ |
సబ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖ మక్షయ మశ్నుతే ||
(బ్రహ్మయోగము)
భావము : బాహ్యస్పర్శ శబ్దాదులందు సంబంధపడక అంతరాత్మలోనే సుఖము పొందునతడు బ్రహ్మయోగి అనబడును. వానికి అక్షయమైన సుఖము కలుగును.
వివరము : బ్రహ్మయోగమాచరించు యోగి ఆత్మానందము పొందును. ఆ అనుభూతి ఆ యోగికి మాత్రమే తెలియును. దానిని బయటికి చెప్పుటకు వీలులేదు. అక్షయమైన ఆత్మను పొందుటవలన అక్షయమైన సుఖము కలుగుచున్నది. తన శరీరములో ఉన్నది ఒకటే ఆత్మ. యోగి అనుభవించునది ఒకే సుఖము. ఎప్పుడు యోగము ఆచరించిన అదే సుఖము పొందును. అందులో ఏ తేడా ఉండదు. అక్షయ సుఖము అంటే ఎడతెరపిలేకుండా ఎల్లవేళల జీవితాంతము వరకు ఉండునదని అనుకోకూడదు. ఎంతసేపు యోగములో ఉండునో అంతసేపు అక్షయసుఖము ఏర్పడును. అంతేగాని యోగములో లేని సమయములో బాహ్య ప్రపంచములో ఉన్నప్పుడు కూడా ఆ సుఖమే ఉండుననుకోకూడదు.
శ్లోకం 22: యే హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే |
ఆద్యన్తవన్తః కౌన్తేయ నతేషు రమతే బుధః ||
(బ్రహ్మయోగము)
భావము : బాహ్యేంద్రియములనుండి పుట్టు సుఖములు దుఃఖహేతువులు. అవి వచ్చుచు పోవుచువుండును. వాటిని జ్ఞానులు లెక్కచేయరు. మరియు వాటి వలన సంతోషింపరు.
శ్లోకం 23:శక్నోతీ హైవ యస్సోఢుం ప్రాక్చరీర విమోక్షణాత్ |
కామ క్రోధోద్భవం వేగం సయుక్త స్ససుఖీ నరః ||
(బ్రహ్మయోగము)
భావము : శరీరమును విడువక మునుపే కామ క్రోధములు వాటి వేగమును లేకుండ చేసి శాంతము దాల్చు సమర్థుడెవడో వాడే బ్రహ్మయోగయుక్తుడు, వాడే ఆత్మ సుఖము పొందువాడు.
శ్లోకం 24: యో ఽ న్త సుఖో ఽ న్త రారామ స్తథా ఽ న్త ర్జ్యోతి రేవ యః |
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూ ఽతో ధి గచ్చతి ||
(బ్రహ్మయోగము)
భావము : ఎవడు అంతరమున సుఖము పొందుచున్నాడో, అంతరమున ఆత్మారాధన చేయుచున్నాడో, ఎవని లోపల జ్ఞానాగ్ని జ్యోతివలె వెలుగుచున్నదో అట్టివాడు బ్రహ్మయోగియై బ్రహ్మమునే పొందును.
శ్లోకం 25: లభన్తే బ్రహ్మ నిర్వాణ మృషయః క్షీణ కల్మషాః |
ఛిన్న ద్వైధాయతాత్మాన స్సర్వభూత హితే రతాః ||
(బ్రహ్మయోగము)
భావము : సర్వభూత హితము సల్పుచున్నవాడై, పాపము క్షీణింప చేసుకున్న వాడై సంశయము లేకుండ చేసుకొన్నవాడై, ఎవడు ఉన్నాడో వాడు బ్రహ్మయోగియై ఆత్మ స్థానము పొందుచున్నాడు.
శ్లోకం 26: కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ||
(బ్రహ్మయోగము)
భావము : కామమును, క్రోధమును వీడగల్గువాడు, జ్ఞానముచే ఇంద్రియములను నిగ్రహించినవాడు, భూమిమీదనే ఆత్మస్థానము పొందియున్నాడు.
శ్లోకం 27: స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం శ్చక్షుశ్చై వాంతరే భ్రువోః |
ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యన్త రచారిణౌ ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 28: యతేంద్రియ మనోబుద్ధిర్ముని ర్మోక్ష పరాయణః |
విగతేచ్ఛా భయక్రోధో యస్సదాముక్త ఏవసః ||
(బ్రహ్మయోగము)
భావము : బాహ్య శబ్దాది ఇంద్రియ విషయములను వదిలి, కనుబొమ్మల మధ్యలో మనోదృష్ఠినివుంచి, ముక్కురంధ్రములలో సంచరించు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములను సమానముగా నిలిపివేసి, స్వాధీనపడిన ఇంద్రియములు కలవాడై, మనస్సుచే రాగభయ ద్వేషములను వదలి, మోక్షమే పరమాశయముగ తలచుచు బ్రహ్మయోగులు సదా ఆత్మను అనుభవించుదురు.
వివరము : మనస్సుకు దృష్ఠి కలదు. దానినే మనోదృష్ఠి అనగలము. అట్లే చెవులకు, నాలుకకు, చర్మమునకు కూడా దృష్ఠికలదు. వంటలో ఉప్పు ఎంత ఉన్నది చూచి చెప్పుతామనుట వినియే ఉంటాము. ఆ మాటను బట్టి నాలుకకు రుచిని చూచు దృష్ఠి ఉన్నదని తెలియుచున్నది. అట్లే ఐదు జ్ఞానేంద్రియములకు చూపు కలదనియే చెప్పవచ్చును. వాటి చూపు వలననే ప్రపంచములోని విషయములను అవి చూడగల్గి ఆ చూచిన విషయమును మనస్సుకు చూపితే మనస్సు బుద్ధికి చూపును. బ్రహ్మయోగములో బాహ్య జ్ఞానేంద్రియములైన ఐదింటిని చూడకుండా చేసి, వాటి విషయములను మనస్సుకు తెలియకుండా చేసి, అనగా మనోదృష్ఠిని వాటినుండి మరలించి కనుబొమ్మల మధ్యలో తల లోపలి భాగమున చూచినపుడు ఏమి కనిపించకపోవును. ఇది సాధన పొందిన యోగి యొక్క విషయము. ఏది కనిపించని స్థితిలో ఉన్నదేదో మనస్సు చూస్తు, బుద్ధి గ్రహిస్తుండి పోవును. ఎప్పుడైతే మనస్సు బయటి విషయముల మీదలేదో అప్పుడు ముక్కు రంధ్రములలోని శ్వాస కూడ క్రమేపి తక్కువై ఉన్నదా లేదా అనిపించును. అటువంటి సమయములో ఆత్మయేదో దానిని మనస్సు చూస్తూవుండి బుద్ధికి తెలియపరుస్తున్నది. ఆ అనుభవమును మనోబుద్ధుల ద్వారా జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ బ్రహ్మయోగ పద్దతి తెలిసినవాడు ఎల్లప్పుడు ఆ పద్దతిలోనే ఉండగల్గి ఆత్మానుభవమును పొందుచున్నాడు. అట్లు చేయుట వలన వానిలోని సంచితకర్మ కాలిపోయి మోక్షము పొందుటకు అర్హుడగును.
శ్లోకం 29: బోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాన్తి మృచ్ఛతి ||
(ఆత్మ)
భావము : యజ్ఞ తపములు స్వీకరించువాడనై, సర్వ గుణములకు మహేశ్వరుండనై, సర్వ జీవరాసులకు సుహృదయుడైన నన్ను తెలుసుకొనుట వలన నరుడు శాంతి చెందగలడు.
వివరము : శరీరములో జరుగు యజ్ఞ తపస్సులకు అధిపతి ఆత్మ. అట్లే సర్వ లోకములకు అధిపతి ఆత్మ. ఇచ్చట లోకములను మాటకు గుణములని అర్థము చేసుకోవాలి. ఉదాహరణకు ఒక గురువు శిష్యుని 'లోకము ఎట్లున్నది శిష్యా!' అనగా శిష్యుడు జవాబుగా 'ఎవని లోకము వానిది గురువుగారు' అన్నాడట. ఎవని గుణములలో వాడు ఉన్నాడని శిష్యుని జవాబు. ఇంకను త్రిలోకములని పెద్దలు చెప్పుట వినియే ఉందుము. ఊర్థ్వ, మధ్య, పాతాళ లోకములు అనుట కూడ వినియే ఉందుము. మూడు లోకములు అనగ మూడు గుణములని తెలియాలి. అట్లే ఊర్థ్వలోకము అనగ సాత్త్వికగుణము అనియు, మధ్యలోకము అనగా రాజస గుణమనియు, పాతాళము అనగా తామసమని తెలియాలి. మూడు లోకములకు అనగా మూడు గుణములకు అధిపతి మధ్యలోవున్న ఆత్మయని తెలియాలి. అట్లు మూడు గుణములను వదలి వాటిమధ్యలో అధిపతిగా ఉన్న ఆత్మను తెలియుట చేత నరుడు శాంతిని పొందుచున్నాడు. శరీరములో గుణములులేని ప్రశాంత కాలమును శాంతి అనుచున్నాము.
--------------------------------------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత ☜ కర్మ సన్న్యాస యోగము
అర్జునుడిట్లనియె: -
శ్లోకం 1:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మ సన్న్యాసము చెప్పితివి మరియు కర్మ చేయుట యోగమంటున్నావు. రెండింటిలో ఏది శ్రేష్ఠమో నిశ్చయముచేసి నాకు చెప్పుము.
వివరము : కర్మ అనగ పాపము మరియు పుణ్యము. కార్యమనగ పనులు. కార్యములను (పనులు) గురించి చెప్పునపుడుగాని, కర్మలను (పాపపుణ్యములు) గురించి చెప్పునపుడు గాని, రెండు సందర్భములలోను కర్మ అను పదమునే శ్లోకములో ఉపయోగించారని మరొక మారు జ్ఞప్తి చేయుచున్నాము. ఇచట అర్జునునకు ఒక అనుమానమొచ్చి వెంటనే అడిగాడు. ఈ కాలములో అయితే అటువంటి అవకాశము లేదనుకోండి. చెప్పేది వినక మధ్యలో అడుగకూడదనుట అప్పుడు లేదు. అందువలన సంశయము వస్తూనే ప్రశ్న వేశాడు. అలా అడుగక పోతే ఆ అనుమానము మనసులో ఉండుట వలన తర్వాత విషయము బుర్రకెక్కదు. మనసులో మెదిలిన ప్రశ్నను వెంటనే అడగడము మంచిది.
పరమాత్మలో కలిసిపోవడానికి, జన్మలు లేకుండ మోక్షము పొందడానికి రెండే యోగములు కలవు. అవియే ఒకటి బ్రహ్మయోగము, రెండవది కర్మయోగము. బ్రహ్మయోగములో శరీరముతో జరుగుపనులన్ని వదిలివేసి కూర్చోవడము. రెండవ కర్మయోగములో శరీరముతో జరుగు పనులన్ని చేయడము. ఈ రెండు యోగ విషయములను విన్న అర్జునుడు రెండింటిలో నాకు ఏది శ్రేష్ఠమో తెలుపమన్నాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు వెంటనే జవాబు చెప్పాడు.
శ్రీ భగవంతుడిట్లనియె: -
శ్లోకం 2:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మయోగము, బ్రహ్మయోగము రెండును శ్రేష్ఠమైనవే. కాని బ్రహ్మయోగముకంటే కర్మయోగమే గొప్పది.
వివరము : పరమాత్మను చేరుటకు రెండే యోగమార్గములన్నాము కదా! అందులో ఒకటి మంచిదని మరొకటి మంచిది కాదనుట ఏమిలేదు. రెండును సమానమే అయినవి. రెండును కర్మను కాల్చునవే. రెండిటియందును సాధారణ మానవునికి ఆచరణ యోగ్యమైనది కర్మయోగమే. అందువలన కర్మయోగము సంసారములో చిక్కుకొన్న సాధారణ వ్యక్తుల ఎడల విశిష్ఠత కల్గియున్నదని చెప్పవచ్చును. బ్రహ్మయోగము సంసారములేని వారికి సులభమగును.
శ్లోకం 3:
(కర్మయోగము)
భావము : ఎవనికి అసూయ ప్రేమలు లేవో, ఎవడు సుఖదుఃఖ ద్వంద్వములను వదలివేయునో వాడే నిత్యసన్న్యాసి. వానికి బంధనములు లేవు.
వివరము : మనకు తెలిసినంత వరకు సన్న్యాసులంటే కాషాయరంగు గుడ్డలు ధరించిన వారని, సంసారము వదలివేసి భిక్షాటన చేయువారని సాధారణముగ అనుకొనుచుంటాము. పనులు చేయనివానిని మందలించునపుడు సన్న్యాసివి కావాలనుకున్నావా అనియో లేక ఇట్లుంటే సన్న్యాసులలో కలిసిపోతావనియో అంటుంటారు. దీనిని బట్టి చూస్తే పనులు చేయనివాడు సన్న్యాసి అను భావము అందరిలో ఇమిడిపోయింది. సంసార బాధ్యత లేకుండ పోవడము, పనులు చేయకుండ పోవడమే సన్న్యాసమని అందరు అనుకొన్నంత మాత్రమున అది సత్యము కాదు. నిజమైన సన్న్యాసమేదో భగవంతుడు చెప్పాడు. మనమనుకొన్న భావమునకు వ్యతిరిక్తముగ సన్న్యాసమును గూర్చి భగవంతుడు ప్రకటించాడు. పనులు మానుకోవడము సన్న్యాసముకాదని, ఒక పద్ధతి ప్రకారము పనులు చేయుటే నిజమైన సన్న్యాసమని తెలిపాడు. నిజమైన సన్న్యాసిని బాహ్యముగ గుర్తించుటకు వీలుపడదని, అతను అందరివలె పనులు చేయుచుండునని, అతనికి బాహ్యముగ ఏ గుర్తులుండవని తెల్పాడు.
బయటికి కన్పించు వేషధారులైన ఈ సన్న్యాసులంత ఎవరను ప్రశ్న వచ్చిందను కొంటాము. దానికి జవాబు ప్రేమ అసూయలు, కష్ట సుఖములను ద్వంద్వములైన గుణములు వదలి, వాటి ఫలితముల మీద ఇష్టము లేనివాడై, జరుగుచున్న పనులు కర్మరీత్య జరుగుచున్నవని, వాటి అనుభవములు కర్మరీత్య వచ్చునవేనని, మంచిచెడు అను భేదము లేక శరీరము ద్వారా పనులు చేయుచు, తాను వేరను భావము కల్గియున్న కర్మయోగియే నిజమైన సన్న్యాసి అయినపుడు మిగతావారు కాదనియే అర్థము.
శ్లోకం 4:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మయోగము వేరని, బ్రహ్మయోగము వేరని తెలియనివారనుచుందురు. తెలిసిన వారు రెండిటిలో దేనినాచరించిన ఫలసిద్ధియగునని చెప్పుచుందురు.
వివరము : రెండవ శ్లోకములో కర్మయోగము విశిష్ఠత కల్గినదని చెప్పి, ఇక్కడేమో రెండు వేరువేరని తెలియని వారనుచున్నారని చెప్పడము చూచి ఇదేమిటి రెండురకములుగ చెప్పారని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మేము అక్కడ కూడ రెండు యోగములు పరమాత్మను చేర్చునవేనని చెప్పాము. దేనినాచరించిన ఫలసిద్ధి ఒక్కటే. వాటి విషయములో అవి రెండు ఒక్కటే. కాని ఆచరించు మానవులలో ఏది అనుకూలము, ఏది అనుకూలము కాదు అనుటలో సాధారణ జనులలో కర్మయోగము అనుకూలతలో విశిష్ఠతగాంచినదని చెప్పాము. రెండు యోగములు చూపుదారి ఒక్కటే అయినప్పటికి భార్యపిల్లలున్న వారికి, తప్పక పనులు చేయు ఆవశ్యకత ఉన్నవారికి కర్మయోగము శ్రేష్ఠమైనది. భార్యపిల్లలులేని వారికి, సంసార బాధ్యత లేక పనులు చేయకుండినను జీవితము సాగిపోవు వారికి బ్రహ్మయోగము అనుకూలముగ ఉండును. వీటి తేడాలు ఆచరించు మనుషులకే, కాని యోగములలో లేవని తెలియాలి. ఆ విషయమే క్రింది శ్లోకములో కూడ చెప్పుచున్నారు.
శ్లోకం 5:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగము ద్వార ఏ స్థానము ప్రాప్తించుచున్నదో, అదే కర్మ యోగములోను ప్రాప్తించుచున్నది. బ్రహ్మయోగము, కర్మయోగము రెండు సమానమైనవని తెలియువాడే వాస్తవ జ్ఞానదృష్ఠి కలవాడగును.
శ్లోకం 6:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : యోగము లేనివాడు,కర్మను సన్న్యశించనివాడు దుఃఖమునే పొందు చుండును. యోగముతో కూడుకొన్నవాడు, మనస్సును అణచినవాడు పరబ్రహ్మ పదవిని తొందరగ పొందును.
వివరము : ఈ శ్లోకములో ఇక్కడ మేము వ్రాసిన భావమునకు అనేక భగవద్గీతలలోని భావము విభిన్నముగ వ్రాయబడివున్నది. ఒకరుకాదు ఇద్దరుకాదు అందరు అలా వ్రాయడములో శ్లోకముల భావము వివరము తెలిసి వ్రాయబడినవి కావని, ఒకరినొకరు చూచుకొని వ్రాయబడినవని తెలియుచున్నది. పరీక్షలు వ్రాయునపుడు ముందువానిని చూచి వెనుకవాడు వ్రాశాడనుకో, ముందు వానిది తప్పయిన వెనుక వానిది కూడా తప్పగును. ఆ విధముగనే శ్లోకములోని భావమేమిటని చూడక, ముందు ఇతరులు వ్రాసిన దానిననుసరించి వ్రాయుట వలన అందరిది ఒకే భావమై పోయినది. ఇది తప్పా ఒప్పా అని చూడకుండానే వ్రాశారు.
ముందు 4,5 శ్లోకములలో రెండు యోగములు ఒకే సామర్థ్యము కల్గివున్నవని చెప్పిన పెద్దలు, ప్రక్కనే ఉన్న శ్లోకములో మోక్షము పొందుటకు కర్మయోగ సహాయము అవసరము, కర్మయోగ సహాయము లేకుండ కేవలము బ్రహ్మయోగము ద్వార మోక్షము పొందుట కష్టతరము, కర్మయోగము తెలిసిన బ్రహ్మయోగి తొందరగ మోక్షము పొందుననుట విచిత్రము కాదా! ఇచట ప్రతి పద అర్థము వివరించుకొందాము.
1) సన్న్యాసస్తు = సన్న్యసించుట, లేక వదిలివేయుట, లేక లేకుండ చేసుకొనుట, దేనిని వదలుకోవడము, దేనిని సన్న్యసించడమంటే కర్మను సన్న్యసించడమని తెలియుచున్నది. కర్మను సన్న్యసించుటకు రెండు మార్గములున్నవి. ఒకటి సంచితకర్మను వదలించునది బ్రహ్మయోగము, రెండవది ఆగామికకర్మను వదలింపజేయునది కర్మయోగము. రెండు కర్మలను లేకుండ చేయు అర్థముతో 'సన్న్యాసస్తు' అన్నారు. ఈ మాట రెండు యోగములకు సంబంధించినదని తెలియాలి. సన్న్యాసము రెండు యోగములలో సమానముగ ఉన్నదని తెలియాలి.
2) అయోగతః = యోగము లేకుండుట, రెండు యోగములు లేకుండుటని అర్థము, కర్మ సన్న్యాసము కల్గివున్న రెండు యోగములు లేకపోవడము.
3) దుఃఖమాప్తు = దుఃఖము పొందుదువు. యోగములు లేనపుడు జీవుడు కర్మలచే దుఃఖమును పొందుచూనే ఉండును. కర్మలు నశించు యోగమున్నపుడే జీవుడు దుఃఖము పొందడు.
4) యోగయుక్తో = యోగముతో కూడుకొన్నవాడు అనగా పనులు చేయుచున్నను కర్మయోగముతో కూడుకొన్నవాడు.
5) ముని = మౌనము వహించిన వాడు. మనస్సు కాని ఇంద్రియములు కాని కదలక బ్రహ్మయోగమాచరించువాడు.
6) బ్రహ్మ = పరమాత్మను లేక మోక్షమును.
7) నచిరేణాధి గచ్ఛతి = తొందరగ పొందుదువు.
భావము : కర్మనశించు రెండు యోగములు లేకపోయిన దుఃఖము పొందుదువు. కర్మయోగము, బ్రహ్మయోగము పొందినవాడు శీఘ్రముగ మోక్షము పొంది పరమాత్మలోనికి ఐక్యమగును.
శ్లోకం 7:
(బ్రహ్మయోగము)
భావము : విశుద్ధాత్ముడై జితేంద్రియుడై సర్వ జీవుల యొక్క ఆత్మను తన ఆత్మగా తలచు యోగికి కర్మలుండవు.
వివరము : గుణములంటని శుద్ధాత్ముడైన జీవుడు, ఇంద్రియముల యొక్క పనులను నిలిపివేసి బ్రహ్మయోగమును పొంది, ఆ యోగములో ఆత్మను చూడగలిగి, మిగత జీవరాసులలోని ఆత్మయు తనలోని ఆత్మవలెనున్నదని తెలుసుకోగల్గిన వానికి, ముందు చేసిన సంచితకర్మలు నశించిపోవును. ఇది పూర్తి బ్రహ్మయోగులకు సంబంధించిన శ్లోకము. క్రింద కర్మయోగమునకు సంబంధించిన శ్లోకములను తెలియజేయుచున్నాడు.
శ్లోకం 8:
(కర్మయోగము)
శ్లోకం 9:
(కర్మయోగము)
శ్లోకం 10:
(కర్మయోగము)
భావము : ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న కర్మయోగి ఏ కార్యమునకు తాను కర్తను కాదని తలచి చూస్తు, వినుచు, తాకుచు, వాసన చూస్తు, తినుచు, నడుస్తు, నిద్రిస్తు, శ్వాస విడుచుచు తీసుకొనుచు, పల్కుచు, మల మూత్రములను విసర్జిస్తు, దేనినైన గ్రహిస్తు, కనులు తెరచుచు మరియు కనులు మూయుచు తమ తమ కార్యములను ఇంద్రియములు చేయుచున్నవని తలచుచుండును. ఈ విధముగ తన శరీరమందు జరుగు పనులను బ్రహ్మార్పణమొనర్చి సంగమనునది వర్జించినవాడు తామరాకుకు నీరంటనట్లు అఖిల పాపములచే అంటబడడు.
వివరము : పైన చెప్పబడిన కార్యములన్ని రెండు రకములుగ విభజింపబడివున్నవి. ఒకటి ఇష్టముండి జరుగునవి, రెండు మన ఇష్టమున్నా లేకున్నా జరుగునవి. బయటనే కాక శరీరములోపల కూడ పనులు జరుగుచూనే ఉన్నవి. వీటిని సైన్సులో కూడ ఇచ్ఛాధీన, అనిచ్ఛాధీన కార్యములంటున్నారు. చూచుట, వినుట, తాకుట, తినుట, నడుచుట మొదలగునవన్ని మన ఇచ్ఛ ప్రకారమే జరుగుచున్నవని ఇటువంటివన్ని ఇచ్ఛాధీన కార్యములని, మనకు తెలియకుండ జరుగు శ్వాస, కనులు మూయుట, తెరచుట అలాగే శరీరములో జరుగు గుండె, మూత్ర పిండముల, జీర్ణాశయముల కార్యములను అనిచ్ఛాధీన కార్యములని అంటున్నారు.
వాస్తవానికి సైన్సు ప్రకారము ఈ మాట తప్పేనని నిరూపించవచ్చును. ఎందుకనగ ఒకానొక సమయములో ఇచ్ఛాధీనముగ కదులు కాళ్ళు, చేతులు కూడ అనిచ్ఛాధీనముగ పనిచేయుచున్నవి. కాలిమీద చిన్నగ ఏదో ప్రాకినట్లనిపిస్తూనే నీకు తెలియకుండానే కాళ్ళు, చేతులు కదులుచున్నవి. నిద్రలో నీకు తెలియకుండానే నీ ఇచ్ఛ లేకుండానే కాళ్ళు చేతులు కదులుచున్నవి. నిద్రలో నడచిపోవువారు కూడ కలరు. దీనిని బట్టి ఇచ్ఛాధీన కార్యములు అనుట సైన్సు ప్రకారము కూడ పూర్తి సత్యము కాదు.
మనకు తెలిసినంతవరకు తెలిసి జరుగునవి, తెలియక జరుగునవని రెండు రకములుగ చెప్పవచ్చును. ఈ మాటను ఎవరు ఖండించలేరు. కొన్ని పనులు జీవునకు తెలిసి జరుగుచున్నవి. కొన్ని తెలియక జరుగుచున్నవి. తెలిసి జరిగెడు పనులు కూడ కొన్ని సమయములలో తెలియక జరుగుచున్నవి. ఉదాహరణకు మూత్రము తెలిసి పోస్తున్నాము. కొన్ని సమయములలో తెలియకనే పోసుకోవడము కూడ జరుగుచున్నది. ప్రతిది నా ఇష్టప్రకారము జరుగుచున్నవనుకోవడము అహముతో కూడిన అజ్ఞానమగును. ఉదాహరణకు నడుస్తున్నపుడు నా ఇష్టప్రకారము నడుస్తున్నాననుకోవడము అజ్ఞానము. ఇందులో అహము నిండివున్నది. కాళ్ళు నడుస్తున్నవని నాకు తెలుస్తుందనుకోవడము జ్ఞానమగును. ఇందులో అహము లేదు. నిద్రలో నడిచినపుడు నీకు తెలియకుండ నడవడమే కదా! అప్పుడు నాకు తెలియకుండ నడవడము జరిగినదనుకోవచ్చును. అట్లుకాక నాఇష్టప్రకారము నడచినామని చెప్పలేము కదా!
శరీరములో జరిగెడి పనులన్నియు మనకు తెలిసి జరుగుచున్నవి. కాని ఇష్టప్రకారము జరుగుచున్నవనుకోకూడదు. ఈ విధముగనే తెలిసిన జ్ఞానియు శరీరములో జరుగు కార్యములన్నిటిని కొన్ని నాకు తెలిసి జరుగుచున్నవి, కొన్ని తెలియక జరుగుచున్నవని, శరీరములో వాటి వాటి కార్యములు అవి చేయుచున్నవని అనుకుంటాడు. అజ్ఞానమున్నప్పుడు ఎలా ఉండునంటే రాత్రి ఇంటి బయట నిద్రపోయినవాడు ఉదయము ఇంటిలో లేయుచున్నాడు. బయటి నుండి ఇంటిలోపలికి ఎప్పుడొచ్చినది నిజంగా తెలియదు, ఎంత యోచించిన అర్థము కాలేదు. ఇతరుల నడిగాడు, కొద్దిగ వర్షము వచ్చినది వెంటనే వచ్చి లోపల పడుకున్నావని చెప్పారు. జరిగినది వాస్తవమే నీకాళ్ళు నడిచినవి. చేతులు కప్పుకున్న గుడ్డలు తీసుకున్నవి. లోపలికి వచ్చి పడుకోవడము జరిగినది. ఇవన్ని తెలియక జరిగాయి. ఈ ఒక్క సంఘటన చాలు మనము మన శరీరమువేరని, మన శరీరమును నడిపించి పనిచేయించు శక్తి వేరొకటున్నదని సులభముగ తెలియగలదు. అప్పటికి తెలియకపోతే నీవెటువంటివాడవంటే! అపుడపుడు అడిగినపుడు నీకు కావలసిన అన్నము, కూరలు పెట్టినంతమాత్రమున ప్రక్కింటావిడను నీ భార్యగ అనుకోవడము ఎంత తప్పో, నీకవసరమైనపుడు అనుకూలముగ కదిలిన అవయవములకు నీవే అధిపతివనుకోవడము కూడ అంతే తప్పగును. ప్రక్కింటావిడకు భర్తవున్నట్లు నీ అవయవములను ఆడించు భర్త ఒకడున్నాడు. ఆ స్థానము నాదేననుకోవడము పొరపాటు.
మన శరీరములో నూటికి ముప్ఫయి పాళ్ళు పనులు తెలిసి జరుగుచున్నవి. డెబ్బయి పాళ్ళు తెలియక జరుగుచున్నవని తెలిసినవాడు, తెలిసీ తెలియక జరిగెడి పనులకు తాను కారణముకాదని, అవి జరుగుటకు కర్మేకారణమని తెలిసినపుడు వాడు నిజమైన కర్మయోగి అగును. జరిగెడి పనులలో కర్మలు వానిని అంటవు. యోగము చేత ఏర్పడు అగ్నికి అవి కాలిపోవును.
శ్లోకం 11:
(కర్మయోగము)
శ్లోకం 12:
(కర్మయోగము)
భావము : శరీరము, మనస్సు, బుద్ధి ఇంద్రియముల చేత జరిగెడి పనులకు సంగమము లేకుండ, ఆత్మశుద్ధియే ఆశయముగ కర్మఫలములందుకాంక్ష మానిన కర్మయోగి పనులు చేయుచున్నను శాంతి పొందును. కర్మయోగికానివాడు కోర్కెలను మానుకోలేక బంధనములో (కర్మలలో) చిక్కుచుండును.
శ్లోకం 13:
(కర్మయోగము)
భావము : మనసుచే సన్న్యసించి, కర్మకార్యములను తన నవద్వారపుర దేహమునకు విడిచి, కార్యకర్త కాక యోగి సుఖముగ నివశించుచుండును.
శ్లోకం 14:
(ప్రకృతి)
భావము : భూమిమీద కర్మములనుగాని, కార్యములనుగాని, వాటి ఫలితములందు ఆశనుగాని ఆత్మ ఎవనికి కలుగజేయదు, ప్రకృతి స్వభావము చేతనే అవి కల్గుచుండును.
వివరము : స్వధర్మము పరధర్మమును చెప్పినపుడే ఆత్మధర్మము వేరని, ప్రకృతి ధర్మము వేరని చెప్పాము. పరధర్మమైన ప్రకృతి మన శరీరమంతా ఇమిడివున్నది. దాని స్వభావము చేతనే సర్వము జరుగుచున్నవి. జరుగుచున్నవాటిని ఆత్మ సాక్షిగ చూస్తున్నది కాని, ఆత్మ దేనిని కలుగజేయలేదు.
శ్లోకం 15:
(ప్రకృతి)
భావము : ఎవని పాపముకాని, ఎవని పుణ్యముకాని ఆత్మ తొలగింపదు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడివున్నది. దానిచేత ధరణిలో జనులు భ్రమిస్తున్నారు.
వివరము : ఎవడు ఎంత యోగమాచరిస్తే అంత కర్మ కాలిపోవునని ముందే చెప్పుకొన్నాము. ఆత్మ ఎవని కర్మను తొలగించదు. తొలగించుకోవడమేదో ఎవనికొద్ది వాడు చేసుకోవలసిందే. అదియును యోగపద్ధతి ద్వారానే సాధ్యమగును. అట్లుకాక అజ్ఞానులు మేము ఎన్నో ఆరాధనలు చేస్తున్నాము, మా పాపమును దేవుడు తీసివేస్తాడనుకోవడము పరిపాటిగవుంది. ఉదయము నుంచి పాపము పనులు చేసి సాయంకాలము నమస్కరిస్తే దేవుడు క్షమిస్తాడని కొందరనుకొంటారు. మరికొందరు మేము చేసిన పాపములు పోయి మాకు లాభము చేకూర్చమని కదా మేము వేల డబ్బు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తున్నాము అంటున్నారు. అజ్ఞానము జ్ఞానమును కప్పివేయడము వలన, భూమిమీద పాపముల నివృత్తి కోసము అనేక ఆరాధనలు ఏర్పడి, అవి చేయువారికి దేవుడు పాపములేకుండ చేస్తాడని భ్రమింప జేయుచున్నవి. వాస్తవానికి ఇవన్నియు మానవుడు భ్రమతో చేయుచున్నవని తెలియాలి.
శ్లోకం 16:
(ఆత్మజ్ఞానము)
భావము : జ్ఞానముచేత ఎవరి అజ్ఞానమంతయు లేకుండపోవునో, అట్టివారికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశిస్తు వారికున్న భ్రమలన్ని తొలగిపోవును.
వివరము : ఆరాధిస్తే పాపములు పోతాయని భ్రమించువారికి ఆత్మజ్ఞానము కల్గుటచే, వారికున్న అజ్ఞానమంతయు తొలగిపోయి జ్ఞానచూపు కలుగుట వలన, కర్మలు పోవు మార్గము బాగా కనిపించును. అంతవరకు వారికున్న అంధత్వము తొలగిపోవును. స్వచ్ఛమైన జ్ఞానదృష్ఠి చేత పాపములు పోవుటకు యోగమార్గము తప్ప వేరులేదని, అది తన మీదనే ఆధారపడివున్నదని తెలియును. తెలిసిన తర్వాత యోగమార్గమున ప్రయాణించుటకు ప్రయత్నించును.
శ్లోకం 17:
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మయందు ధ్యాసకల్గి, మనోబుద్ధి నిష్టలన్నియు ఆత్మయందే నిలిపి, యోగమాచరించువారు జ్ఞానాగ్నిచేత కల్మషములన్నియు కాల్చివేయబడినవాడై జన్మలులేని మోక్షము పొందును.
వివరము : ఆత్మజ్ఞానము కల్గినవాడు తన పాపపుణ్యములెలా పోవునో తెలిసిన వాడై, బ్రహ్మయోగమాచరించవలెనని తలంపు కల్గి తన మనస్సును బుద్ధిని ప్రక్క ధ్యాసలకు పోనీయక ఉంచుట వలన లభించునది ఆత్మప్రాప్తియని గ్రహించి, ఆ విధముగనే ఆచరించి అతని కర్మనంతయు నాశనము చేసుకొని తిరిగి పుట్టనటువంటి స్థితిని పొందును. అట్టి బ్రహ్మయోగము నాచరించు వాని అనుభూతులెట్లుండుననగా!
శ్లోకం 18:
(బ్రహ్మయోగము)
భావము : విద్యయు వినయము కల్గు విప్రులందును, గోవులందును, ఏనుగు లందును, కుక్కలందును, కుక్కలను తిను చండాలునియందును పండితుల దృష్ఠి సమముగా ఉండును.
వివరము : ఈ శ్లోకములో ఉచ్ఛము, నీచము, మధ్యము, మూడు చెప్పి వాటిని సమానముగ చూచువారు యోగి అని చెప్పారు. మనుషులలో ఉచ్ఛము బ్రాహ్మణులను, నీచము కుక్కమాంసమును తిను చండాలుడని చెప్పడమైనది. అట్లే జంతువులలో ఉచ్ఛమమైన ఆవును, మధ్యమమైన ఏనుగును, నీచమైన కుక్కను చెప్పడమైనది. ఈ విధముగ ఉచ్ఛ నీచ జీవరాసులలోను, మధ్యమమైన వాటిలోను, ఆత్మ సమానముగ ఉన్నదని బ్రహ్మయోగి గ్రహించగలడు. ముందు తన శరీరములో ఆత్మను చూచినవారు మిగతా శరీరములలో ఎట్లున్నది తెలియగలరు. తన శరీరములో ఆత్మ ఎట్లున్నదో, ఎక్కడ ఉన్నదో, ఎంత ఉన్నదో, ఏమి చేయుచున్నదో తెలిసినవారు మిగత అన్ని ఉచ్ఛనీచ శరీరములలో కూడ తన శరీరములో ఉన్నట్లే తలచి, తన శరీరములో ఎక్కడుందో అక్కడే ఉన్నదని, తనయందెంతున్నదో అంతే ఉన్నదని, తనయందేమి చేయుచున్నదో అదే పని చేయుచు సమానముగ ఉన్నదని తెలుసుకోగలరు. అందువలన బ్రహ్మయోగి ఏ జీవరాసిని చూచిన దానియందున్న ఆత్మను తన ఆత్మవలె తలంచును.
కొందరేమో ఉచ్ఛనీచములు తలచకుండ రెంటిని సమానముగ ఆదరించ వలెనని, అదే సమత్వమని చెప్పారు. అది బాహ్య ఆదరణే అగును. అలాగైతే ఆవును ఆదరించినట్లు కుక్కను ఆదరించగలము కాని, వానపామును ఆదరించినట్లు నాగుపామునాదరించలేము. జింకను దగ్గరకు తీసుక్కున్నట్లు పులిని దగ్గరకు తీసుకోలేము. ప్రకృతి సహజత్వము వలన వాటి గుణములు, నడవడిక వేరు వేరుగ ఉండును. అందువలన మనము పొరపాటుగ ఒకటిగ చూచిన అవి అట్లుండవు. కావున మనము వాటి ప్రకృతి సహజత్వమును వదిలి వాటిలోని ఆత్మయొక్క సహజత్వమును చూడాలి. అన్నింటియందు పరధర్మములు ఎలా ఉన్నా స్వధర్మము మాత్రము ఒక్కటేనని గ్రహించవలెను.
శ్లోకం 19:
(బ్రహ్మయోగము)
భావము : ఎవని మనస్సు సర్వ జీవరాసులందు సమత్వమును గ్రహించునో, అతడు ఇహమందే సంసార సముద్రమును దాటినవాడగుచున్నాడు. నిర్దోషమైన అందరియందు సమముగ గల ఆత్మను తలంచుటవలన వాడు ఆత్మను పొందును.
వివరము : ఇక్కడ కొంత లోతుగ యోచించాలి. బ్రహ్మయోగమాచరించి ఆత్మను తెలిసి, అది అందరియందు ఒకే విధముగ ఉన్నదని గ్రహించుట వలన, ఆ జన్మలోనే మోక్షము వచ్చినట్లు తలచకూడదు. మోక్షము రావాలంటే కర్మ నిశ్శేషముగ పోవాలి. కర్మ నిశ్శేషముగ పోవాలంటే కొన్ని జన్మలు పట్టును. ఇక్కడ బ్రహ్మయోగమున ఇహమునందే సంసారమును జయించినవాడగును, అనుటలో దేహము ఉన్నట్లే మరియు మరణించకనే శరీరములో జీవుడు ఉన్నట్లే యోగ సమయములో బయటి ప్రపంచముతో సంబంధము లేకుండ పోవుచున్నాడు. కనుక వాడు ఆ సమయములో జగతిలో కర్మను జయించినట్లే వాడు ఆత్మను పొందుచున్నాడు. కాని పరమాత్మను పొందలేదని గ్రహించాలి. పరమాత్మను పొందిన వానికి పునర్జన్మవుండదు. ఆత్మను పొందినవాడు జన్మనే స్థంభింపచేసినంత యోగ్యతను పొందినట్లు కనిపించును. ఆత్మనే పొందివున్నాడు కనుక జన్మ తప్పదు. ఆ జన్మలోనే కర్మ అయిపోయినట్లయితే పరమాత్ముని చేరి మోక్షము పొందగలడు. బ్రహ్మయోగి యోగములో ఎట్లుండునది క్రింది శ్లోకములో చెప్పుచున్నాడు.
శ్లోకం 20:
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మవిదుడు తన అజ్ఞానమునంతయు వదిలి బుద్ధిని ఆత్మయందే నిలుపును. వానికెంత సంప్రీతి కల్గిన సంతోషపడడు. అట్లే ఇష్టములేనిది కల్గిన బాధపడడు.
వివరము : బ్రహ్మయోగము ఆచరించునపుడు వాని మనస్సు బయటి విషయములను సేకరించక కదలకుండా ఉండి, మనోదృష్ఠియంతయు ఆత్మ మీద కేంద్రీకరించి, ఆత్మయొక్క అనుభవము ఏమిటో, దాని సమాచారము ఏమిటో గ్రహించి బుద్ధికి తెలియజేయుచుండును. బుద్ధియు ఆత్మ విషయములను మనస్సు ద్వారా గ్రహించి గ్రహించిన దానిని జీవునకు అందిస్తున్నది. జీవుడు మనస్సు చూపిన విషయమునే బుద్ధి ద్వార చూస్తూవుండును. మనస్సు బాహ్య విషయములను తెచ్చిపెట్టినపుడు వాటిని గుణములతో యోచించుట బుద్ధిపని. ఇప్పుడు మనస్సు గుణములతో సంబంధములేని లోపలి ఆత్మ విషయమును తెచ్చినది కావున గుణములతో సంబంధములేకుండ బుద్ధి యోచిస్తున్నది. మనస్సు బుద్ధికి ఏ విషయమును అందించిన దాని అనుభూతిని పొందడము జీవుని పని. ఇప్పుడు యోగ సమయములో బయటి విషయములైన ప్రకృతి విషయములను కాక లోపలి ఆత్మ విషయమును మనస్సు తెచ్చినది కనుక దానినే జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ విధముగ బుద్ధికి, మనస్సుకు, జీవునకు లోపలి విషయమైన ఆత్మ ధ్యాసయే సరిపోయినది. బయటి ధ్యాస ఏమాత్రము లేదు. కావున బయట ఎంత సంప్రీతి కల్గిన అట్లే ఎంత అసంప్రీతి కల్గిన దానిని గ్రహించు స్థితిలో లేడు. అటువంటప్పుడు వానికి సంప్రీతిలో సంతోషము గాని, అసంప్రీతిలో దుఃఖముగాని రెండు లేవు. యోగనిష్టలో ఉన్నపుడు మణులు, బంగారము వాని ముందర పెట్టి నీకేనని చెప్పిన అతడు సంతోషించలేడు.
శ్లోకం 21:
(బ్రహ్మయోగము)
భావము : బాహ్యస్పర్శ శబ్దాదులందు సంబంధపడక అంతరాత్మలోనే సుఖము పొందునతడు బ్రహ్మయోగి అనబడును. వానికి అక్షయమైన సుఖము కలుగును.
వివరము : బ్రహ్మయోగమాచరించు యోగి ఆత్మానందము పొందును. ఆ అనుభూతి ఆ యోగికి మాత్రమే తెలియును. దానిని బయటికి చెప్పుటకు వీలులేదు. అక్షయమైన ఆత్మను పొందుటవలన అక్షయమైన సుఖము కలుగుచున్నది. తన శరీరములో ఉన్నది ఒకటే ఆత్మ. యోగి అనుభవించునది ఒకే సుఖము. ఎప్పుడు యోగము ఆచరించిన అదే సుఖము పొందును. అందులో ఏ తేడా ఉండదు. అక్షయ సుఖము అంటే ఎడతెరపిలేకుండా ఎల్లవేళల జీవితాంతము వరకు ఉండునదని అనుకోకూడదు. ఎంతసేపు యోగములో ఉండునో అంతసేపు అక్షయసుఖము ఏర్పడును. అంతేగాని యోగములో లేని సమయములో బాహ్య ప్రపంచములో ఉన్నప్పుడు కూడా ఆ సుఖమే ఉండుననుకోకూడదు.
శ్లోకం 22:
(బ్రహ్మయోగము)
భావము : బాహ్యేంద్రియములనుండి పుట్టు సుఖములు దుఃఖహేతువులు. అవి వచ్చుచు పోవుచువుండును. వాటిని జ్ఞానులు లెక్కచేయరు. మరియు వాటి వలన సంతోషింపరు.
శ్లోకం 23:
(బ్రహ్మయోగము)
భావము : శరీరమును విడువక మునుపే కామ క్రోధములు వాటి వేగమును లేకుండ చేసి శాంతము దాల్చు సమర్థుడెవడో వాడే బ్రహ్మయోగయుక్తుడు, వాడే ఆత్మ సుఖము పొందువాడు.
శ్లోకం 24:
(బ్రహ్మయోగము)
భావము : ఎవడు అంతరమున సుఖము పొందుచున్నాడో, అంతరమున ఆత్మారాధన చేయుచున్నాడో, ఎవని లోపల జ్ఞానాగ్ని జ్యోతివలె వెలుగుచున్నదో అట్టివాడు బ్రహ్మయోగియై బ్రహ్మమునే పొందును.
శ్లోకం 25:
(బ్రహ్మయోగము)
భావము : సర్వభూత హితము సల్పుచున్నవాడై, పాపము క్షీణింప చేసుకున్న వాడై సంశయము లేకుండ చేసుకొన్నవాడై, ఎవడు ఉన్నాడో వాడు బ్రహ్మయోగియై ఆత్మ స్థానము పొందుచున్నాడు.
శ్లోకం 26:
(బ్రహ్మయోగము)
భావము : కామమును, క్రోధమును వీడగల్గువాడు, జ్ఞానముచే ఇంద్రియములను నిగ్రహించినవాడు, భూమిమీదనే ఆత్మస్థానము పొందియున్నాడు.
శ్లోకం 27:
(బ్రహ్మయోగము)
శ్లోకం 28:
(బ్రహ్మయోగము)
భావము : బాహ్య శబ్దాది ఇంద్రియ విషయములను వదిలి, కనుబొమ్మల మధ్యలో మనోదృష్ఠినివుంచి, ముక్కురంధ్రములలో సంచరించు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములను సమానముగా నిలిపివేసి, స్వాధీనపడిన ఇంద్రియములు కలవాడై, మనస్సుచే రాగభయ ద్వేషములను వదలి, మోక్షమే పరమాశయముగ తలచుచు బ్రహ్మయోగులు సదా ఆత్మను అనుభవించుదురు.
వివరము : మనస్సుకు దృష్ఠి కలదు. దానినే మనోదృష్ఠి అనగలము. అట్లే చెవులకు, నాలుకకు, చర్మమునకు కూడా దృష్ఠికలదు. వంటలో ఉప్పు ఎంత ఉన్నది చూచి చెప్పుతామనుట వినియే ఉంటాము. ఆ మాటను బట్టి నాలుకకు రుచిని చూచు దృష్ఠి ఉన్నదని తెలియుచున్నది. అట్లే ఐదు జ్ఞానేంద్రియములకు చూపు కలదనియే చెప్పవచ్చును. వాటి చూపు వలననే ప్రపంచములోని విషయములను అవి చూడగల్గి ఆ చూచిన విషయమును మనస్సుకు చూపితే మనస్సు బుద్ధికి చూపును. బ్రహ్మయోగములో బాహ్య జ్ఞానేంద్రియములైన ఐదింటిని చూడకుండా చేసి, వాటి విషయములను మనస్సుకు తెలియకుండా చేసి, అనగా మనోదృష్ఠిని వాటినుండి మరలించి కనుబొమ్మల మధ్యలో తల లోపలి భాగమున చూచినపుడు ఏమి కనిపించకపోవును. ఇది సాధన పొందిన యోగి యొక్క విషయము. ఏది కనిపించని స్థితిలో ఉన్నదేదో మనస్సు చూస్తు, బుద్ధి గ్రహిస్తుండి పోవును. ఎప్పుడైతే మనస్సు బయటి విషయముల మీదలేదో అప్పుడు ముక్కు రంధ్రములలోని శ్వాస కూడ క్రమేపి తక్కువై ఉన్నదా లేదా అనిపించును. అటువంటి సమయములో ఆత్మయేదో దానిని మనస్సు చూస్తూవుండి బుద్ధికి తెలియపరుస్తున్నది. ఆ అనుభవమును మనోబుద్ధుల ద్వారా జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ బ్రహ్మయోగ పద్దతి తెలిసినవాడు ఎల్లప్పుడు ఆ పద్దతిలోనే ఉండగల్గి ఆత్మానుభవమును పొందుచున్నాడు. అట్లు చేయుట వలన వానిలోని సంచితకర్మ కాలిపోయి మోక్షము పొందుటకు అర్హుడగును.
శ్లోకం 29:
(ఆత్మ)
భావము : యజ్ఞ తపములు స్వీకరించువాడనై, సర్వ గుణములకు మహేశ్వరుండనై, సర్వ జీవరాసులకు సుహృదయుడైన నన్ను తెలుసుకొనుట వలన నరుడు శాంతి చెందగలడు.
వివరము : శరీరములో జరుగు యజ్ఞ తపస్సులకు అధిపతి ఆత్మ. అట్లే సర్వ లోకములకు అధిపతి ఆత్మ. ఇచ్చట లోకములను మాటకు గుణములని అర్థము చేసుకోవాలి. ఉదాహరణకు ఒక గురువు శిష్యుని 'లోకము ఎట్లున్నది శిష్యా!' అనగా శిష్యుడు జవాబుగా 'ఎవని లోకము వానిది గురువుగారు' అన్నాడట. ఎవని గుణములలో వాడు ఉన్నాడని శిష్యుని జవాబు. ఇంకను త్రిలోకములని పెద్దలు చెప్పుట వినియే ఉందుము. ఊర్థ్వ, మధ్య, పాతాళ లోకములు అనుట కూడ వినియే ఉందుము. మూడు లోకములు అనగ మూడు గుణములని తెలియాలి. అట్లే ఊర్థ్వలోకము అనగ సాత్త్వికగుణము అనియు, మధ్యలోకము అనగా రాజస గుణమనియు, పాతాళము అనగా తామసమని తెలియాలి. మూడు లోకములకు అనగా మూడు గుణములకు అధిపతి మధ్యలోవున్న ఆత్మయని తెలియాలి. అట్లు మూడు గుణములను వదలి వాటిమధ్యలో అధిపతిగా ఉన్న ఆత్మను తెలియుట చేత నరుడు శాంతిని పొందుచున్నాడు. శరీరములో గుణములులేని ప్రశాంత కాలమును శాంతి అనుచున్నాము.
-----------------------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత ☜ కర్మ సన్న్యాస యోగము
అర్జునుడిట్లనియె: -
శ్లోకం 1:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మ సన్న్యాసము చెప్పితివి మరియు కర్మ చేయుట యోగమంటున్నావు. రెండింటిలో ఏది శ్రేష్ఠమో నిశ్చయముచేసి నాకు చెప్పుము.
పరమాత్మలో కలిసిపోవడానికి, జన్మలు లేకుండ మోక్షము పొందడానికి రెండే యోగములు కలవు. అవియే ఒకటి బ్రహ్మయోగము, రెండవది కర్మయోగము. బ్రహ్మయోగములో శరీరముతో జరుగుపనులన్ని వదిలివేసి కూర్చోవడము. రెండవ కర్మయోగములో శరీరముతో జరుగు పనులన్ని చేయడము. ఈ రెండు యోగ విషయములను విన్న అర్జునుడు రెండింటిలో నాకు ఏది శ్రేష్ఠమో తెలుపమన్నాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు వెంటనే జవాబు చెప్పాడు.
శ్రీ భగవంతుడిట్లనియె: -
శ్లోకం 2:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మయోగము, బ్రహ్మయోగము రెండును శ్రేష్ఠమైనవే. కాని బ్రహ్మయోగముకంటే కర్మయోగమే గొప్పది.
శ్లోకం 3:
(కర్మయోగము)
భావము : ఎవనికి అసూయ ప్రేమలు లేవో, ఎవడు సుఖదుఃఖ ద్వంద్వములను వదలివేయునో వాడే నిత్యసన్న్యాసి. వానికి బంధనములు లేవు.
శ్లోకం 4:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మయోగము వేరని, బ్రహ్మయోగము వేరని తెలియనివారనుచుందురు. తెలిసిన వారు రెండిటిలో దేనినాచరించిన ఫలసిద్ధియగునని చెప్పుచుందురు.
శ్లోకం 5:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగము ద్వార ఏ స్థానము ప్రాప్తించుచున్నదో, అదే కర్మ యోగములోను ప్రాప్తించుచున్నది. బ్రహ్మయోగము, కర్మయోగము రెండు సమానమైనవని తెలియువాడే వాస్తవ జ్ఞానదృష్ఠి కలవాడగును.
శ్లోకం 6:
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : యోగము లేనివాడు,కర్మను సన్న్యశించనివాడు దుఃఖమునే పొందు చుండును. యోగముతో కూడుకొన్నవాడు, మనస్సును అణచినవాడు పరబ్రహ్మ పదవిని తొందరగ పొందును.
భావము : కర్మనశించు రెండు యోగములు లేకపోయిన దుఃఖము పొందుదువు. కర్మయోగము, బ్రహ్మయోగము పొందినవాడు శీఘ్రముగ మోక్షము పొంది పరమాత్మలోనికి ఐక్యమగును.
శ్లోకం 7:
(బ్రహ్మయోగము)
భావము : విశుద్ధాత్ముడై జితేంద్రియుడై సర్వ జీవుల యొక్క ఆత్మను తన ఆత్మగా తలచు యోగికి కర్మలుండవు.
శ్లోకం 8:
(కర్మయోగము)
శ్లోకం 9:
(కర్మయోగము)
శ్లోకం 10:
(కర్మయోగము)
భావము : ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న కర్మయోగి ఏ కార్యమునకు తాను కర్తను కాదని తలచి చూస్తు, వినుచు, తాకుచు, వాసన చూస్తు, తినుచు, నడుస్తు, నిద్రిస్తు, శ్వాస విడుచుచు తీసుకొనుచు, పల్కుచు, మల మూత్రములను విసర్జిస్తు, దేనినైన గ్రహిస్తు, కనులు తెరచుచు మరియు కనులు మూయుచు తమ తమ కార్యములను ఇంద్రియములు చేయుచున్నవని తలచుచుండును. ఈ విధముగ తన శరీరమందు జరుగు పనులను బ్రహ్మార్పణమొనర్చి సంగమనునది వర్జించినవాడు తామరాకుకు నీరంటనట్లు అఖిల పాపములచే అంటబడడు.
శ్లోకం 11:
(కర్మయోగము)
శ్లోకం 12:
(కర్మయోగము)
భావము : శరీరము, మనస్సు, బుద్ధి ఇంద్రియముల చేత జరిగెడి పనులకు సంగమము లేకుండ, ఆత్మశుద్ధియే ఆశయముగ కర్మఫలములందుకాంక్ష మానిన కర్మయోగి పనులు చేయుచున్నను శాంతి పొందును. కర్మయోగికానివాడు కోర్కెలను మానుకోలేక బంధనములో (కర్మలలో) చిక్కుచుండును.
శ్లోకం 13:
(కర్మయోగము)
భావము : మనసుచే సన్న్యసించి, కర్మకార్యములను తన నవద్వారపుర దేహమునకు విడిచి, కార్యకర్త కాక యోగి సుఖముగ నివశించుచుండును.
శ్లోకం 14:
(ప్రకృతి)
భావము : భూమిమీద కర్మములనుగాని, కార్యములనుగాని, వాటి ఫలితములందు ఆశనుగాని ఆత్మ ఎవనికి కలుగజేయదు, ప్రకృతి స్వభావము చేతనే అవి కల్గుచుండును.
శ్లోకం 15:
(ప్రకృతి)
భావము : ఎవని పాపముకాని, ఎవని పుణ్యముకాని ఆత్మ తొలగింపదు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడివున్నది. దానిచేత ధరణిలో జనులు భ్రమిస్తున్నారు.
శ్లోకం 16:
(ఆత్మజ్ఞానము)
భావము : జ్ఞానముచేత ఎవరి అజ్ఞానమంతయు లేకుండపోవునో, అట్టివారికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశిస్తు వారికున్న భ్రమలన్ని తొలగిపోవును.
శ్లోకం 17:
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మయందు ధ్యాసకల్గి, మనోబుద్ధి నిష్టలన్నియు ఆత్మయందే నిలిపి, యోగమాచరించువారు జ్ఞానాగ్నిచేత కల్మషములన్నియు కాల్చివేయబడినవాడై జన్మలులేని మోక్షము పొందును.
శ్లోకం 18:
(బ్రహ్మయోగము)
భావము : విద్యయు వినయము కల్గు విప్రులందును, గోవులందును, ఏనుగు లందును, కుక్కలందును, కుక్కలను తిను చండాలునియందును పండితుల దృష్ఠి సమముగా ఉండును.
శ్లోకం 19:
(బ్రహ్మయోగము)
భావము : ఎవని మనస్సు సర్వ జీవరాసులందు సమత్వమును గ్రహించునో, అతడు ఇహమందే సంసార సముద్రమును దాటినవాడగుచున్నాడు. నిర్దోషమైన అందరియందు సమముగ గల ఆత్మను తలంచుటవలన వాడు ఆత్మను పొందును.
శ్లోకం 20:
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మవిదుడు తన అజ్ఞానమునంతయు వదిలి బుద్ధిని ఆత్మయందే నిలుపును. వానికెంత సంప్రీతి కల్గిన సంతోషపడడు. అట్లే ఇష్టములేనిది కల్గిన బాధపడడు.
శ్లోకం 21:
(బ్రహ్మయోగము)
భావము : బాహ్యస్పర్శ శబ్దాదులందు సంబంధపడక అంతరాత్మలోనే సుఖము పొందునతడు బ్రహ్మయోగి అనబడును. వానికి అక్షయమైన సుఖము కలుగును.
శ్లోకం 22:
(బ్రహ్మయోగము)
భావము : బాహ్యేంద్రియములనుండి పుట్టు సుఖములు దుఃఖహేతువులు. అవి వచ్చుచు పోవుచువుండును. వాటిని జ్ఞానులు లెక్కచేయరు. మరియు వాటి వలన సంతోషింపరు.
శ్లోకం 23:
(బ్రహ్మయోగము)
భావము : శరీరమును విడువక మునుపే కామ క్రోధములు వాటి వేగమును లేకుండ చేసి శాంతము దాల్చు సమర్థుడెవడో వాడే బ్రహ్మయోగయుక్తుడు, వాడే ఆత్మ సుఖము పొందువాడు.
శ్లోకం 24:
(బ్రహ్మయోగము)
భావము : ఎవడు అంతరమున సుఖము పొందుచున్నాడో, అంతరమున ఆత్మారాధన చేయుచున్నాడో, ఎవని లోపల జ్ఞానాగ్ని జ్యోతివలె వెలుగుచున్నదో అట్టివాడు బ్రహ్మయోగియై బ్రహ్మమునే పొందును.
శ్లోకం 25:
(బ్రహ్మయోగము)
భావము : సర్వభూత హితము సల్పుచున్నవాడై, పాపము క్షీణింప చేసుకున్న వాడై సంశయము లేకుండ చేసుకొన్నవాడై, ఎవడు ఉన్నాడో వాడు బ్రహ్మయోగియై ఆత్మ స్థానము పొందుచున్నాడు.
శ్లోకం 26:
(బ్రహ్మయోగము)
భావము : కామమును, క్రోధమును వీడగల్గువాడు, జ్ఞానముచే ఇంద్రియములను నిగ్రహించినవాడు, భూమిమీదనే ఆత్మస్థానము పొందియున్నాడు.
శ్లోకం 27:
(బ్రహ్మయోగము)
శ్లోకం 28:
(బ్రహ్మయోగము)
భావము : బాహ్య శబ్దాది ఇంద్రియ విషయములను వదిలి, కనుబొమ్మల మధ్యలో మనోదృష్ఠినివుంచి, ముక్కురంధ్రములలో సంచరించు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములను సమానముగా నిలిపివేసి, స్వాధీనపడిన ఇంద్రియములు కలవాడై, మనస్సుచే రాగభయ ద్వేషములను వదలి, మోక్షమే పరమాశయముగ తలచుచు బ్రహ్మయోగులు సదా ఆత్మను అనుభవించుదురు.
శ్లోకం 29:
(ఆత్మ)
భావము : యజ్ఞ తపములు స్వీకరించువాడనై, సర్వ గుణములకు మహేశ్వరుండనై, సర్వ జీవరాసులకు సుహృదయుడైన నన్ను తెలుసుకొనుట వలన నరుడు శాంతి చెందగలడు.