pss book: Chapter 1 త్రైత సిద్ధాంత భగవద్గీత: సాంఖ్యయోగం
Part1
Part2
త్రైత సిద్ధాంత భగవద్గీత: సాంఖ్యయోగం
శ్లోకం 11 యొక్క భావము: ( ప్రకృతి , పరమాత్మ గురుంచి ): శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.
శ్లోకం 12 యొక్క భావము: (జీవాత్మ గురుంచి ): నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి పాలించు రాజులు కూడ ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడ మనమందరము లేకపోవుటనునదే లేదు.
శ్లోకం 13 యొక్క భావము: (జీవాత్మ గురుంచి ): దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది.
శ్లోకం 14 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ): పంచతన్మాత్రలచేత, శీతోష్ణములు సుఖదుఃఖములు మానవులకు కల్గుచుండును. శీతోష్ణములు సుఖదుఃఖములు ఎప్పటికి ఉండునవి కావు. అశాశ్వతములైనవి. వచ్చిపోయెడు వాటిని ఆ కొద్దికాలము ఓర్చుకోవలయును.
శ్లోకం 15 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ): ఎవడు సుఖదుఃఖ భేదములెంచుకొనడో, ఎవనికి వాని వ్యథ కలుగదో వాడే అమృతత్వమునకు అర్హుడగును.
శ్లోకం 16 యొక్క భావము: ( ఆత్మ గురుంచి ): సత్తు కనుక ఆత్మకు నాశనము లేదు. శరీరము అసత్తుకనుక దానికి నాశనము తప్పదు నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించినవారికి తెలిసివుండును.
శ్లోకం 17 యొక్క భావము: ( పరమాత్మ గురుంచి ): నాశనములేని పరమాత్మ ప్రపంచమంత వ్యాపించి సర్వము ఇమిడి ఉన్నది. ఇది శరీరంలోపల కూడ ఉన్నది. అట్టి దానిని ఎవడు నాశనము చేయలేడు.
శ్లోకం 18 యొక్క భావము: ( ఆత్మ , పరమాత్మ గురుంచి ): శరీరములలో నిత్యము ఉండువాడైన ఆత్మయు, నాశనములేని వాడు అప్రమేయుడు అయిన పరమాత్మయు నివశించు శరీరమునకు ఎప్పటికైన నాశనము తప్పదు కావున యుద్ధము చేయుము.( ఆత్మ, పరమాత్మ ) .
శ్లోకం 19 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ): జీవాత్మను చంపుదునని ఎవడనుకొనునో మరియు అది చంపబడునని కూడ ఎవడనుకొనునో ఆ ఇరువురు ఙ్ఞానశూన్యులని తెలియుము. జీవాత్మ చావునది కాదు, చంపబడునది కాదు.
శ్లోకం 20 యొక్క భావము: ( పరమాత్మ గురుంచి ): పరమాత్మ పుట్టునది కాదు గిట్టునది కాదు. ఒకప్పుడుండి మరియొకప్పుడు లేదనుటకు వీలుకాదు. నిత్యముండువాడు, పురాణుడు శరీరము చంపబడినను తాను చచ్చువాడు కాదు.
శ్లోకం 21 యొక్క భావము: ( పరమాత్మ గురుంచి ): నిత్యుడు, నాశనములేనివాడు పరమాత్మయని ఎవడు తెలుసుకొనునో, వాడు అట్టి పరమాత్మను ఎట్లు హింసింపగలడు? హింసచేయుటకునైన ఎట్లు తలచును?
శ్లోకం 22 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ): : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.
శ్లోకం 23 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ):- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.
శ్లోకం 24 యొక్క భావము: ( పరమాత్మ గురుంచి ): నిత్యముండువాడు, సర్వ జగత్తంతయు వ్యాపించినవాడు, నిలకడగ ఉండువాడు, చలనము లేనివాడు అయిన సనాతనమైన పరమాత్మ ఛేదింపబడడు, కాలడు, తడుపబడడు, త్రోయబడడు.
శ్లోకం 25 యొక్క భావము: ( ఆత్మ గురుంచి ): ఆత్మను తెలియచెప్పుటకు, చింతించి తెలుసుకొనుటకు సాధ్యము కాదు. ఆత్మను ఏ వికారములు అంటవు. అందువలన దానికోసము దుఃఖ పడవలదు.
శ్లోకం 26 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ):- అట్లు కాకుండ వాడు నిత్యము పుట్టి నిత్యము చచ్చునని తెలిసితివేని, ఆ విధంబునైన వాని కొరకు నీవు ఏల దుఃఖపడవలయును.
శ్లోకం 27 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ):- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.
శ్లోకం 28 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ):-జీవ సంభవములెల్ల తెలియబడవు. అట్లే వాని మరణములు కూడ తెలియబడవు. కాని పుట్టుక చావుల మధ్యనగల జీవితము మాత్రము తెలియును. అట్టి జీవునకు నీవు శోకింపతగదు.
శ్లోకం 29 యొక్క భావము: ( జీవాత్మ గురుంచి ):- మధ్య జీవితములో జరుగు పనులను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు. ఆ పనులను ఇంకొకడు ఆశ్చర్యముతో వినుచున్నాడు. మరియొకడు వింతగా చెప్పుకొనుచున్నాడు. కాని జీవాత్మ నిజస్థితిని గూర్చి ఎవడు తెలియడు.
శ్లోకం 30 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ):-సర్వదేహములలోను నివశించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడునవి కావు. కావున అన్ని జీవరాసుల గురించి నీవు బాధపడవలసిన పనిలేదు.
శ్లోకం 38 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): : కష్టసుఖములు, లాభనష్టములు, జయాపజయములను సమముగ తలచి యుద్ధము చేయుము. అట్లు చేయుట వలన పాపకర్మములు పొందవు.
శ్లోకం 39 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): : ఇంతవరకు శరీరములందు ఆత్మల వివరముగల జ్ఞానము తెలియజేసాను. ఇకనుండి కర్మబంధములు కలగని జ్ఞానము తెలియజేతును వినుము.
శ్లోకం 40 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): కర్మయోగమును ఆరంభించి మానుకొనుట వలన ఏ దోషము లేదు. కొద్దిగ ఆచరించినప్పటికి గొప్ప కర్మభయమునుండి కాపాడగలదు.
శ్లోకం 41 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): యోగమునందు బుద్ధిగలవారు ఒకటే నిశ్చయముతో ఉందురు. వేరభిప్రాయములు కల్గువారికి బుద్ధి శాఖోపశాఖలైవుండును.
శ్లోకం 42 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
శ్లోకం 43 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.
శ్లోకం 44 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికి పట్టుబడదు.
శ్లోకం 45 యొక్క భావము: ( బ్రహ్మ యోగము , కర్మ యోగము గురుంచి ): మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
శ్లోకం 46 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): బావి నిండుగవున్న నీరు ఏ విధముగ నిత్యము త్రాగుటకు స్నానము చేయుటకు ఉపయోగపడుచున్నదో, ఆ విధముగనే సర్వ వేదముల నుండి కూడ మనకు నిత్యము ఉపయోగము గలదని బ్రహ్మజ్ఞానియైన వానికి తెలియును.
శ్లోకం 47 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): బావి నిండుగవున్న నీరు ఏ విధముగ నిత్యము త్రాగుటకు స్నానము చేయుటకు ఉపయోగపడుచున్నదో, ఆ విధముగనే సర్వ వేదముల నుండి కూడ మనకు నిత్యము ఉపయోగము గలదని బ్రహ్మజ్ఞానియైన వానికి తెలియును.
శ్లోకం 48 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): కర్మ సంపాదించుటయందే నీకు అధికారము కలదు. కర్మఫలము లందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు.
శ్లోకం 49 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): చేయు పనులయందు కల్గు లాభనష్టముల ఎడల ధ్యాసలేక, మంచి చెడు పనులందు సమబుద్ధి గలవాడై, కార్యములాచరించినవాడు యోగనిష్ఠ ఆచరించిన వాడగును. ఈ విధముగనే నీవు కార్యములు చేయుము.
శ్లోకం 50 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): కర్మనాశనము చేయు కర్మయోగమునకంటే, నీచస్థితిని కలుగజేయు కర్మ చాలా భేదమైనది. నీవు నీచస్థితిని కలుగజేయు కర్మను విడిచి, ఉన్నత స్థితిని కలుగజేయు కర్మయోగమునే ఆశ్రయింపుము.
శ్లోకం 51 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): కర్మయోగముననుసరించిన వాడు కర్మయైన పాప పుణ్యములను నాశనము చేయుచున్నాడు. అందువలన నీవు కూడ కార్యములను చేయుచు ఆ పనులయందే ఇమిడిన పాపపుణ్యములను పొందని నేర్పరితనమును తెలియుము. అదియే కర్మయోగము.
శ్లోకం 51 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): జ్ఞానపరులు కర్మ ఫలములను వదలి, జన్మ బంధములను విడచి మోక్షమును పొందుచున్నారు.
శ్లోకం 52 యొక్క భావము: ( కర్మ యోగము గురుంచి ): ఎపుడైతే మోహగుణమను కల్మషమును దాటగలవో, అపుడే నీవు ఇంతవరకు వినిన, వినవలసి విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు.
శ్లోకం 53 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): వివిధ శ్రుతుల వలన కలత చెందిన నీ బుద్ధి చలింపనిదై స్థిరమైన సమాధియందు నిలిచినపుడు నీవు యోగము పొందిన వాడవగుదువు.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 54 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): ఓ కృష్ణా! బుద్ధి నిలిచిపోయి సమాధి స్థితిలో ఉన్నవాడు ఏ భాషలో మాట్లాడును? ఏమి మాట్లాడును? ఏ విధముగా కూర్చుండును? ఏమి ఆచరించును?
శ్రీ భగవంతుడిట్లనియె :
శ్లోకం 55 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): ఎప్పుడైతే సర్వ ఆశలు మరియు మనోగతములైనవన్ని ప్రయత్న పూర్వకముగా వదలి ఆత్మయందే జీవాత్మ తృప్తిబొందుచున్నదో అపుడే వానిని స్థిత ప్రజ్ఞుడని చెప్పవచ్చును.
శ్లోకం 56 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): దుఃఖమందు బాధపడని వానిని, సుఖములందు సంతోషించని వానిని, మరియు ప్రేమ, కోపము, భయములేని వానిని మౌనము వహించిన బుద్ధిగల వాడందురు.
శ్లోకం 57 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): ఎవరైతే అన్నిటియందు సంబంధము లేక, శుభాశుభములయందు మనోధ్యాస ఏమాత్రము లేకుండా, సుఖదుఃఖములు అనుభవించకుండునో, అట్టివాని ప్రజ్ఞ గొప్పది.
శ్లోకం 58 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): తాబేలు ఏ విధముగా తన అవయవములను ముడుచుకొనుచున్నదో , ఆ విధముగా మనస్సును ఇంద్రియముల నుండి మరలింపవలెను.
శ్లోకం 59 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): బ్రహ్మయోగమాచరించు యోగి ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయములయందు మనోధ్యాసలేకుండా చేసుకొన్నప్పటికి, వాని తలలోని విషయముల మీద ఆశ అనుగుణము వీడకయుండును. ఆ ఆశయు కొంత కాలము ఆత్మను దర్శించుట వలన నశించిపోవును.
శ్లోకం 60 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): జ్ఞానియైనవాడు యోగ సమయమందు మనస్సు చలించకుండునట్లు ఎంత ప్రయత్నము చేయుచుండిన, యోగభ్రష్టతయను ప్రమాదము కలుగునట్లు ఇంద్రియములు వాని మనస్సును చలింపజేయుచున్నవి.
శ్లోకం 61 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): ఇంద్రియములనెల్ల అణచివేసి మనస్సును నాయందు ఎవడుయుంచునో, ఇంద్రియములెవనికి స్వాధీనమైయుండునో అట్టి వాని ప్రజ్ఞ గట్టిది.
శ్లోకం 62 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): విషయముల ధ్యాసలో వాటి సంగమము మానవునకు ఏర్పడుచున్నది. అట్టి సంగమము వలన మానవునకు కోర్కె పుట్టుచున్నది. దాని వలన క్రోధము పుట్టుచున్నది.
శ్లోకం 63 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): క్రోధము వలన సమ్మోహము గల్గును. సమ్మోహము వలన స్మృతి భ్రమించుట, స్మృతి భ్రమించుట వలన బుద్ధి నాశనము, బుద్ధి నాశనము వలన భ్రష్టత్వము పొందుట కల్గును.
శ్లోకం 64 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): రాగద్వేషములను వదలి అట్లే ఇంద్రియ విషయములను వదలి స్వాధీనపడిన మనస్సుగలవాడెపుడైతే అపుడు ప్రసాదంబు కలుగును.
శ్లోకం 65 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): ఆత్మదర్శనము కల్గినపుడే సర్వదుఃఖములకు హాని ఏర్పడును. బుద్ధి సుస్థిరత చెందును. మనస్సు నిర్మలత్వము పొందును.
శ్లోకం 66 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): యోగహీనునికి బుద్ధి నిలకడగ ఉండదు. దైవభావము అతనికి కలుగదు. దైవభావములేని వానికి శాంతి లేదు. శాంతిలేని వానికి సుఖముండదు.
శ్లోకం 67 యొక్క భావము: ( ప్రకృతి గురుంచి ): ఏ మనుష్యుని మనస్సు ఇంద్రియముల వెంట తిరుగుచుండునో వాని బుద్ధియు గాలి వలన నావ కదిలినట్లు చలించుచుండును.
శ్లోకం 68 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): ఎవడు ఇంద్రియముల యొక్క సర్వ విషయములను నిగ్రహించుచున్నాడో అట్టివాని ప్రజ్ఞ నిలకడగా నిలిచినదగును.
శ్లోకం 69 యొక్క భావము: ( బ్రహ్మ యోగము, ప్రకృతి గురుంచి ): సర్వ జీవరాసులకు రాత్రివలె నిద్రించు అజాగ్రత్త ఎందుగలదో అందే బ్రహ్మయోగి జాగ్రత్త కల్గియుండును. ఏదైతే బ్రహ్మయోగికి రాత్రివలె స్థంభించి ఉన్నదో అందే సర్వ జీవరాసులు జాగ్రత్తగానున్నవి.
శ్లోకం 70 యొక్క భావము: ( బ్రహ్మ యోగము గురుంచి ): నిండి నిబిడీకృతముగా ఉన్న సముద్రమునందు నదుల నీరు ఎంత చేరినప్పటి పొంగిపోనట్లు, బ్రహ్మయోగనిష్ఠయందున్న వానికి ఎన్ని కోర్కెలున్నను వాటి ప్రభావమేమి లేకపోవును. బ్రహ్మయోగి కాక కోర్కెలు కోరువానికి ఎప్పటికి ఆత్మదర్శనము లభించదు, శాంతిరాదు.
శ్లోకం 71 యొక్క భావము: ( బ్రహ్మ యోగము , కర్మ యోగము గురుంచి ): సర్వ కోర్కెలను విడనాడి వాటి ధ్యాస ఏమాత్రము లేకుండు వాడును, అట్లే మోహమును, అహంకారమును లేనివాడును తప్పక శాంతి పొందును.
శ్లోకం 72 యొక్క భావము: ( బ్రహ్మ యోగము, కర్మ యోగము గురుంచి ): ఇది దైవమును పొందుస్థితి. ఈ స్థితి పొందినవాడు నాది నావారు అను మోహమును పొందడు. ఈ స్థితి పొందిన వాడు మరణకాలమున మోక్షమును పొందును.