pss book:gt11 త్రైత సిద్ధాంత భగవద్గీత : భక్తి యోగము వివరము
త్రైత సిద్ధాంతభగవద్గీత ☜ భక్తి యోగము
Audio:
☞అర్జునుడిట్లనియె :-
శ్లోకం|| 1 : ఏవం సతత యుక్తా యే భక్తా స్త్వాం పర్యుపాసతే । యేచాప్యక్షర మవ్యక్తం తేషాం కేయోగవిత్తమాః ||(బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు).
భావము : ఆ విధముగ ఎల్లపుడు ఆత్మతో కూడుకొన్నవాడు, భక్తితో నిన్ను ఉపాసించువాడు, కనిపించని నాశనములేని స్థానమును గురించి ఉపాసించువాడు గలరు. వీరిలో బాగా యోగము తెలిసిన వారు ఎవరు?.
వివరము : విత్= తెలియడము, యోగ= కలయిక, యోగవిత్ అనగ పరమాత్మతో కలియుటకు తెలిసినదని అర్థము. పరమాత్మతో కలియుటకు వెనుక అధ్యాయము చివరి శ్లోకంకములో చెప్పబడినట్లు మూడు మార్గములు కలవు. కర్మయోగము, బ్రహ్మయోగము కాక భక్తియోగమని పేరు పెట్టబడిన మూడవ మార్గమున్నదని తెలుసుకొన్న అర్జునుడు, ఈ మూడు మార్గములలో ఏది పరమాత్మను కలియుటకు తెలిసిన మార్గమని ప్రశ్నించాడు. 1) సతత యుక్తాయే 2) భక్తాః 3) అక్షర మవ్యక్తం అని మూడు భాగములుగ విభజించి వీరిలో ఎవరు నీతో కలయిక తెలిసినవారని అడిగాడు. అర్జునుడు అడిగిన వివరము ఎల్లపుడు ఆత్మతో కూడియున్నవాడైన బ్రహ్మయోగి, భగవంతుని మీద భక్తికల్గి ఎల్లవేళల ఆయన కర్మలాచరించు భక్తియోగి, అవ్యక్తమైన అక్షరమును కర్మనాశనముచే పొందకోరిన కర్మయోగులలో ఎవరు బాగా తెలిసినవారని అడుగగ భగవంతుడేమి సమాధానమిచ్చాడో క్రింద చూద్దాము.
☞శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం|| 2 : మయ్యా వేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాసతే । శ్రద్ధయా పరయో పేతా స్తే మే యుక్తతమా మతాః ||(బ్రహ్మ, కర్మ, భక్తియోగములు).
భావము : పరమశ్రద్ధ కల్గినవారై నాయందు మనస్సునుంచి, నిత్యము నాతో యుక్తము కోరి ఉపాసించువారందరు ఉత్తమయోగులని నా ఒప్పుదల.
వివరము : ఇచట అర్జునుడడిగిన ప్రశ్నలకు వీరు బాగా తెలిసినవారని, వీరు తెలియనివారని చెప్పక శ్రద్ధ కలిగిన వారు ఉత్తములన్నాడు. పరమాత్మను చేరవలెనను కోర్కెతో కర్మ, బ్రహ్మ, భక్తి అను మూడు మార్గములననుసరించు వారిలో 'పరయో శ్రద్ధయా ఉపేతా' 'శ్రేష్ఠమైన శ్రద్ధ కల్గిన' వారందరు శ్రేష్ఠులేనని చెప్పాడు. దీనిని బట్టి ప్రతి దానికి శ్రద్ధ అనునది ముఖ్యమని తెలియుచున్నది. శ్రద్ధలేని భక్తి నిరర్థకమని తెలియుచున్నది.
ఈ కాలములో ఎందరో ధనమున్నవారు వారి లెక్కలో కొద్దిపాటి విలువున్న డబ్బును ఖర్చు పెట్టి పూజలు చేయిస్తున్నారు. 200 రూ॥ ఇచ్చి అభిషేకము, 300 రూ॥ ఇచ్చి మరొక పూజ, 500 రూ॥లు ఇచ్చి మరొక అర్చన చేయించి ఎవరు చేయని పూజలన్ని చేయించాననుకొని తృప్తిపడితే, వాటిని దేవుడు చూడక వానియందు ఎంత భక్తి శ్రద్ధలున్నాయని మాత్రమే చూస్తున్నాడు, కాని ఎంత ఖర్చు పెట్టాడని చూడలేదు. ఒకడు చనిపోతే వానికోసము బాధలేనివాడు ఏడ్వడు. బాధవున్నవాడు మాత్రమే ఏడ్చును. కొన్ని ప్రాంతములలో డబ్బిస్తే కూలికి ఏడ్చేవారున్నారు. ఏడ్వలేని వారు, బాధలేనివారు, పలువురు చూచుటకు కూలి మనుషుల చేత ఏడ్పించుచున్నారు. అలా ఏడ్పించువారియందు బాధలేదు. బాధున్నవారైతే వారే ఏడ్చేవారు. బాధలేదు కావున కూలిచ్చి ఏడిపిస్తున్నారు. అలాగే శ్రద్ధలేని భక్తులు కూలిచ్చి మిగతావారిచేత పూజలు చేయిస్తున్నారు. శ్రద్ధవుంటే వారే స్వయముగ ఎక్కడైన పూజించెడివారు. ఆ శ్రమ మనకెందుకు! ఇంత రేటని డబ్బిస్తే ఆ పూజేదో వారే చేస్తారను శ్రద్ధలేని భక్తులు చాలామంది కలరు.ఏది ఏమైన ఎవరు ఏవిధ పూజలు యోగములు చేసిన అందలి శ్రద్ధయే ముఖ్యము. అందువలన పరమాత్మ వీరు వారు అనక శ్రద్ధవున్న యోగులందరు శ్రేష్ఠులేనన్నాడు.
శ్లోకం|| 3: యే త్వక్షర మనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే । సర్వత్రగ మచిన్త్యచ కూటస్థ మచలం ధ్రువమ్ || (మోక్షము).
శ్లోకం|| 4: సన్నియ మ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః । తే ప్రాప్నువన్తి మా మేవ సర్వభూతహితే రతాః ||(బ్రహ్మయోగము).
భావము : అక్షరమైనది, నిర్ధేశింపబడనిది, కనిపించనిది, ఆలోచనకందనిది, కూటస్థమైనది, అచలమైనది, శాశ్వతమైనది, అంతట వ్యాపించినదియైన పరమాత్మను ఉపాసించువారు.
ఇంద్రియములను నిగ్రహించి, అన్నిటియందు బుద్ధి సమముచేసి, సర్వభూత హితులైన వారు నన్ను పొందగల్గుదురు.
వివరము : ముక్తిని పొందకోరు వారు మూడు మార్గములను అనుసరిస్తారను కొన్నాము కదా! ఆ మూడు మార్గములలో ఏదో ఒక మార్గముననుసరించి పరమ పదమను గమ్యము చేరినవాడు నాశనములేనివాడై పంచభూతములకు అతీతుడగును. పంచభూతములలో ఏ శక్తి వానినేమి చేయలేదు. వాడపుడు పరమాత్మయే. గమ్యము చేరినవాడు ఇచటనున్నాడు అచటలేడని, ఫలానావాడని, నిర్ధేశింపబడనివాడుగ మారియున్నాడు. అప్పుడు వాడు సర్వవ్యాపియైన పరమాత్మయై ఉన్నాడు. గమ్యము చేరినవాడు వ్యక్తుడు కాడు, ఎచటను కనిపించడు, ఎవరి కన్నులు వానిని చూడలేవు, అతడు అవ్యక్తుడైన పరమాత్మగనుండును. అంతేకాక ఎవరి ఆలోచనకందువాడు కాడు. ఏ బుద్ధి అతనిని ఆలోచించి తెలుసుకోలేదు. అతను అంతట వ్యాపించినవాడై, అచలుడై, శాశ్వితుడై, కూటస్థుడై, పరమాత్మగ మారినవాడై ఉండును.
అలా పరమాత్మగ మారవలెననుకొన్నవాడు మూడుమార్గములలో ఏదో ఒక మార్గమనుసరించాలి. అందులో ఒకడు బ్రహ్మయోగమును అనుసరించాడను కొందాము, వాడు ఇంద్రియముల ధ్యాసలలోనికి మనస్సును పోనీయకుండ చేసుకోవాలి. వాని బుద్ధిని సర్వజీవులందు సమముగనున్న ఆత్మమీద సమము చేయాలి. సర్వభూత సన్నిహితుడైన ఆత్మయందే ధ్యాసతో నిలిచిపోవాలి. బ్రహ్మ యోగమాచరించినవాడు పరమాత్మను పొందగలడు.
శ్లోకం|| 5 : క్లేశోఽధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్ । అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||(బ్రహ్మయోగము).
భావము : అట్లు ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు అనుసరించు మార్గము చాలా కష్టమైనది పార్థ! ఇంద్రియములకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గమని తెలియుము.
శ్లోకం|| 6: యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః । అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ||(కర్మయోగము).
భావము : ఎవరైతే సర్వకర్మలు నాకే సమర్పణమొనర్చారో, వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగంబొనర్చి నన్ను ఉపాసించుచున్నారు.
శ్లోకం|| 7 : తేషా మహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ । భవామి న చిరా త్పార్థ ! మయ్యావేశిత చేతసామ్ ||(భక్తి యోగము).
భావము : నాయందే వారి మనస్సును లగ్నము చేసివున్న నాభక్తపరులు కలరు. నేను శీఘ్రముగ వారినందరిని మృత్యు సంసార సముద్రమునుండి బయటపడ వేయుచున్నాను.
వివరము : వరుసగ 5,6,7 మూడు శ్లోకంకములలో బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగము మూడు చెప్పబడినవి. ఈ మూడు విధానములననుసరించి వారిని తప్పక మృత్యుమయమై సారములేనిదైన జన్మకర్మల జలమయమైన సముద్రము నుండి బయటపడవేతును. మోక్షమునిస్తునని పరమాత్మ తెలిపాడు.
శ్లోకం|| 8 : మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్ధిం నివేశయ । నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః || (బ్రహ్మయోగము).
శ్లోకం|| 9 : అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ ।అభ్యాసయోగేన తతో మామిచ్ఛాఽప్తుం ధనంజయ! ||(బ్రహ్మయోగము).
భావము : నాయందే మనసునుంచి ఎల్లపుడు నన్నే తలచుచుండుము. నాయందే బుద్ధినుంచుము. ఆ తరువాత నన్నే పొంది నాయందే నిలుతువు. ఈ విషయములో అనుమానము లేదు. నీ చిత్తమును స్థిరరీతి నాయందు నిలుపశక్తిలేని ఎడల ఓ అర్జునా! అట్టి శక్తి అభ్యాసయోగమున పొందగలవు.
వివరము : పరమాత్మ అంశయైన ఆత్మ మీదనే మనోధ్యాసనుంచవలెను. ఆత్మ యోచన తప్ప వేరు యోచన బుద్ధికి లేకుండ చేయవలెను. మనో బుద్ధులకు ఇంద్రియ ధ్యాసలు లేని దాని వలన, తదుపరి పరమాత్మనే పొంది పరమాత్మ యందే నిలుతువు.
మనస్సు నిలచుట వలన బుద్ధి నిలచును, బుద్ధి నిలచుట వలన చిత్తము నిలచును. ఇలా ఒకటి నిలిచిన మరొకటి నిలుచునని వెనుక తెలుసుకొన్నాము. చిత్తము స్థిరరీతి నిలువకపోతే మనస్సు, బుద్ధి నిలువలేదనియే చెప్పనగును. అట్లు మనస్సునుగాని, బుద్ధినిగాని, చిత్తమునుగాని నిలుపలేనివానికి అభ్యాసయోగముచేత అట్టి నిలుపగలశక్తి లభించును. యోగాభ్యాసము వలన తప్పక యోగము సాధ్యమగును.
శ్లోకం|| 10 : అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ । మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి ||(భక్తియోగము).
భావము : మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును.
వివరము : ఎంత సాధన చేసినప్పటికి మనస్సు నిలకడ కల్గక ప్రాపంచిక విషయముల మీద చలించుచున్న ఎడల, ఇక ఆ సాధన చేతకాదనిపించిన, ఆ సాధన వదలివేసి పరమాత్మ పనులైన ధర్మప్రచారకార్యములు చేయవలెను. అలా పరమాత్మ పనియైన ధర్మప్రచార సంబంధ కార్యముల చేయుట వలన ముక్తి పొందవచ్చును.
శ్లోకం|| 11 : అథైత దప్యశక్తోఽసి కర్తుం మద్యోగ మాశ్రితః । సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||(కర్మ యోగము).
భావము : భక్తియోగము చేత నాపనులు చేయుటకు కూడ సామర్థ్యములేని వాడవైతే అఖిల కర్మఫలత్యాగివగుము. అట్టికర్మ యోగమున నన్ను పొందగలవు.
వివరము : ఇక్కడ వరుసగ 9,10,11 శ్లోకంకములలో బ్రహ్మ, భక్తి, కర్మయోగముల గూర్చి చెప్పబడియున్నది. 9వ శ్లోకంకమున బ్రహ్మయోగము చేతకాకపోతే బ్రహ్మ యోగ సాధన చేయమన్నాడు. 10వ శ్లోకంకములో ఆ బ్రహ్మయోగ సాధన చేత కాని ఎడల భక్తియోగమాశ్రయించి, పరమాత్మ కార్యములైన ధర్మప్రచార సంబంధ కార్యములు చేయమన్నాడు. ఆ కార్యములు చేతగాని ఎడల 11వ శ్లోకంకమున కర్మయోగమాశ్రయించి కర్మఫలత్యాగివై పాప పుణ్యములను పొందక ఉండమన్నాడు. ఇట్లు ఒకదాని తరువాత మరొక దానికి అవకాశమివ్వమని పరమాత్మ తెల్పాడు.
శ్లోకం|| 12 : శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే । ధ్యానా త్క ర్మఫలత్యాగ స్త్యాగాచ్ఛాన్తి రనన్తరమ్ ||(బ్రహ్మ, కర్మ యోగములు).
భావము : అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.
వివరము : ప్రస్తుత కాలములో చాలామంది జ్ఞానము తెలియకనే అభ్యాసము చేయుటకు మొదలు పెట్టుచున్నారు. ఒక ఊరికి పోవాలనుకొన్నవాడు ఆ ఊరికి పోవుదారి ఏదో పూర్తిగా ఇతరుల ద్వారా తెలుసుకొని, ఇది సరియైన దారియని నిశ్చయము చేసుకొని, ఆ దారివెంట ప్రయాణించినట్లయిన గమ్యము చేరగలడు. అట్లుకాక దారి తెలియకనే ప్రయాణించుట ముఖ్యమని పోతూ, ఊరు వస్తుందనుకొంటే ఏ ఊరొచ్చునో! నీవు చేరవలసిన ఊరు రాకపోవచ్చును. అట్లే మోక్షమను గమ్యము చేరుటకు జ్ఞానమను దారిని పూర్తిగ తెలిసివుండాలి. జ్ఞానము తెలియకనే సాధన చేయువారు వృథా ప్రయాసపడినట్లగును. పూర్తి జ్ఞానము చెప్పకనే ఉపదేశమిచ్చు గురువులు, జ్ఞానము తెలుసుకోకనే ఉపదేశము తీసుకొను శిష్యులు ముఖ్యముగ "శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్" అను విషయము గుర్తుంచుకోవాలి. జ్ఞానము తెలిసిన తరువాత జ్ఞానము ప్రకారము అభ్యాసము చేయాలి. అలా అభ్యాసము చేయుట వలన చివరకు సిద్ధికల్గును. అటువంటి మనోసాధన చేయలేని ఎడల ఆ అభ్యాసముకంటే కర్మఫలత్యాగము శ్రేష్ఠమైనది. సాధన రూపముగలేని కర్మయోగము ఆచరించుటవల్ల మోక్షసిద్ధి ప్రాప్తించును. మనో నిలకడమీద ఆధారపడిన బ్రహ్మయోగ సాధనకంటే కర్మయోగసాధన సులభమైనదని తెలియాలి.
శ్లోకం|| 13 : అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ । నిర్మమో నిరహంకార స్సమదుఃఖసుఖః క్షమీ || (కర్మయోగము).
శ్లోకం|| 14: సన్తుష్ట స్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।మయ్యర్పితమనోబుద్ధి ర్యో మద్భక్త స్సమేప్రియః ||(కర్మయోగము).
భావము : సర్వ జీవరాసులందు ద్వేషములేక, కరుణ స్నేహముకల్గి, మమత విడిచి, అహంకారములేకుండ, కల్గెడి సుఖదుఃఖములను సమముగ చూచుచు, ఓర్పుకల్గి వుండువాడు, ఎల్లపుడు సంతృప్తికల్గిన కర్మయోగియై మనోబుద్ధియందు మోక్షము పొందవలెనను దృఢనిశ్చయము కల్గివుండు భక్తునియందు నాకధిక ప్రేమ.
వివరము : సాధ్యమైనంతవరకు సర్వజీవరాసుల ఎడల స్నేహము కరుణకల్గి, ద్వేషము మోహము లేకుండ మసలుకొనుచు, అహంకారము లేకుండ జరిగెడి పనులలో వచ్చు సుఖదుఃఖములను ఓర్పుతో సమముగ లెక్కించుచు, సుఖములకు పొంగక దుఃఖములకు కృంగకవుంటూ, ఎల్లప్పుడు తనకు లభించిన వాటితోనే తృప్తిపొంది, మోక్షమును చేరవలెనను గట్టి సంకల్పము మనసులోకల్గి, బుద్ధితో అదే అభిప్రాయము కల్గి అహమును హెచ్చరించుచు, ఎప్పటికప్పుడు అహమును బుద్ధిచేత అణచివేయు వాడు నాకు మిగుల ప్రియుడని పరమాత్మ చెప్పాడు.
శ్లోకం|| 15: యస్మాన్నో ద్విజతే లోకో లోకా న్నో ద్విజతే చ యః । హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్సచ మే ప్రియః ||(బ్రహ్మయోగము).
భావము : అర్జునా! ఎవని వలన ప్రపంచమునకు భయములేదో, ప్రపంచముచే ఎవడు భయపడడో, వాడు కోపమును, భయమును, సంతోషమును మనో వ్యాకులతను పొందడు, వాడే నాకు పరమప్రియుడు.
శ్లోకం|| 16: అనపేక్ష శ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారమ్భ పరిత్యాగీ యో మద్భక్త స్స మే ప్రియః ||(బ్రహ్మయోగము).
భావము : దేనియందు ఆశలేనివాడును, మనో శుభ్రతకల్గినవాడును, పట్టుదల కల్గిన వాడును, ఎవరి పక్షము లేనివాడు, దేనిని ఆరంభించక వదలివేసిన బ్రహ్మయోగి అయిన భక్తుడు నాకధిక ప్రియుడు.
శ్లోకం|| 17: యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి ।శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః ||(కర్మయోగము).
భావము : సంతోషపడక అట్లే దుఃఖమును పొందక, ద్వేషమందక, అభిలాషియు కాక, మంచిచెడు పుణ్యపాపములను పొందక, వాటిని పరిత్యజించినవాడు ఎవడో వాడు నాకు మిగులప్రియుడు.
శ్లోకం|| 18: సమ శ్శత్రౌ చ మిత్రేచ తథా మానావమానయోః । శీతోష్ణ సుఖదుఃఖేషు సమ స్సంగ వివర్జితః || (బ్రహ్మ, కర్మయోగములు).
శ్లోకం|| 19: తుల్య నిన్దా స్తుతి ర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ । అని కేతః స్థ్సిరమతి ర్భక్తిమాన్ మే ప్రియో నరః ||(కర్మయోగము).
భావము : మిత్రులయందు, శత్రువులయందు, మానావమానములందు, శీతోష్ణ సుఖదుఃఖములందు సమతకల్గినవాడు, పాపపుణ్యములను సమానముగ వర్జితము చేసినవాడు, స్థుతియు, నిందయు సమముగ తలచి దొరికిన దానితో తృప్తిచెంది గృహములు మొదలగు నివాసస్థలముల మీద ఆశలేని స్థిర మనస్కుడగువాడు నాకు ప్రియుడు.
శ్లోకం|| 20: యే తు ధర్మ్యా మృత మిదం యథోక్తం పర్యుపాసతే । శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః ||(బ్రహ్మ, కర్మయోగములు).
భావము : ఎవరు నా పరమపదము మీద శ్రద్ధగలిగి, ఈ మృతములేని ధర్మము లను ఏ విధముగ చెప్పియున్నారో, ఆ విధముగ ఉపాసించు భక్తుడు నాకు పరమప్రియుడు.
వివరము : మోక్షమే జీవితాశయముగ ఉన్నవాడు అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ కలిగి పరమాత్మ సంబంధమైన ధర్మములను పూర్తిగ తెలుసుకొనును. అమృతమైన ధర్మములు ఎలావున్నవో అలాగే ఆచరించి పరమాత్మను చేరవలెనని ప్రయత్నము చేయువారెవరైతే ఉన్నారో వారు పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రులుగనున్నారు.
ఈ అధ్యాయములో పరమాత్మకు ప్రియులైన వారిని గురించి చెప్పుచు, ఎవరైతే ధర్మాచరణ చక్కగ కల్గియున్నారో వారందరు ఇష్టులేనన్నాడు. అంతేకాక పరమాత్మను చేరు మార్గములు రెండేకాదు మరొక మార్గమున్నదని గుర్తు చేశాడు. ఆయనకు ఇష్టమైనవారు కొందరున్నారంటే, ఇష్టములేని వారు కూడ ఉన్నారని అర్థమగుచున్నది. పరమాత్మకు అందరు సమానమే కదా! ప్రియులు, అప్రియులు కూడ ఉందురా! అని కొందరడుగవచ్చును. వాస్తవముగ ఆయనకు అందరు సమానులే, కానీ మనమే కొందరము దగ్గరగ పోవుచున్నాము. కొందరము దూరముగ పోవుచున్నాము. అందువలన ఒకప్పుడు వెనుక అధ్యాయములలో అజ్ఞానులకు దవ్వు, జ్ఞానులకు దాపు అని ఆయనే చెప్పివున్నాడు. మనకున్న జ్ఞాన అజ్ఞానములను బట్టి మనమే ఆయనను ప్రియునిగ, అప్రియునిగ చేసుకొనుచున్నాము. పుట్టినపుడు సామాణ్యులమైన మనము పెరిగిన తరువాత మాణ్యులమగుచున్నాము లేక నీచులము అగుచున్నాము. అట్లే పుట్టినపుడు దైవము దృష్ఠిలో సమానులమైన మనము పెరిగిన తరువాత జ్ఞానమార్గముననుసరించి పురుషోత్తముడైన దైవమునకు దగ్గర కావచ్చును, లేక అజ్ఞాన మార్గమనుసరించి దూరము కావచ్చును. అది మన అనుకరణను బట్టి ఉండునని తెలియవలెను.
---------------------------
☞అర్జునుడిట్లనియె :-
శ్లోకం|| 1 : ఏవం సతత యుక్తా యే భక్తా స్త్వాం పర్యుపాసతే । యేచాప్యక్షర మవ్యక్తం తేషాం కేయోగవిత్తమాః ||(బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు).
భావము : ఆ విధముగ ఎల్లపుడు ఆత్మతో కూడుకొన్నవాడు, భక్తితో నిన్ను ఉపాసించువాడు, కనిపించని నాశనములేని స్థానమును గురించి ఉపాసించువాడు గలరు. వీరిలో బాగా యోగము తెలిసిన వారు ఎవరు?.
☞శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం|| 2 : మయ్యా వేశ్య మనో యేమాం నిత్యయుక్తా ఉపాసతే । శ్రద్ధయా పరయో పేతా స్తే మే యుక్తతమా మతాః ||(బ్రహ్మ, కర్మ, భక్తియోగములు).
భావము : పరమశ్రద్ధ కల్గినవారై నాయందు మనస్సునుంచి, నిత్యము నాతో యుక్తము కోరి ఉపాసించువారందరు ఉత్తమయోగులని నా ఒప్పుదల.
శ్లోకం|| 3: యే త్వక్షర మనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే । సర్వత్రగ మచిన్త్యచ కూటస్థ మచలం ధ్రువమ్ || (మోక్షము).
శ్లోకం|| 4: సన్నియ మ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః । తే ప్రాప్నువన్తి మా మేవ సర్వభూతహితే రతాః ||(బ్రహ్మయోగము).
భావము : అక్షరమైనది, నిర్ధేశింపబడనిది, కనిపించనిది, ఆలోచనకందనిది, కూటస్థమైనది, అచలమైనది, శాశ్వతమైనది, అంతట వ్యాపించినదియైన పరమాత్మను ఉపాసించువారు.
ఇంద్రియములను నిగ్రహించి, అన్నిటియందు బుద్ధి సమముచేసి, సర్వభూత హితులైన వారు నన్ను పొందగల్గుదురు.
శ్లోకం|| 5 : క్లేశోఽధికతర స్తేషా మవ్యక్తాసక్త చేతసామ్ । అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||(బ్రహ్మయోగము).
భావము : అట్లు ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు అనుసరించు మార్గము చాలా కష్టమైనది పార్థ! ఇంద్రియములకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గమని తెలియుము.
శ్లోకం|| 6: యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః । అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ||(కర్మయోగము).
భావము : ఎవరైతే సర్వకర్మలు నాకే సమర్పణమొనర్చారో, వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగంబొనర్చి నన్ను ఉపాసించుచున్నారు.
శ్లోకం|| 7 : తేషా మహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ । భవామి న చిరా త్పార్థ ! మయ్యావేశిత చేతసామ్ ||(భక్తి యోగము).
భావము : నాయందే వారి మనస్సును లగ్నము చేసివున్న నాభక్తపరులు కలరు. నేను శీఘ్రముగ వారినందరిని మృత్యు సంసార సముద్రమునుండి బయటపడ వేయుచున్నాను.
శ్లోకంకములలో బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగము మూడు చెప్పబడినవి. ఈ మూడు విధానములననుసరించి వారిని తప్పక మృత్యుమయమై సారములేనిదైన జన్మకర్మల జలమయమైన సముద్రము నుండి బయటపడవేతును. మోక్షమునిస్తునని పరమాత్మ తెలిపాడు.
శ్లోకం|| 8 : మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్ధిం నివేశయ । నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః || (బ్రహ్మయోగము).
శ్లోకం|| 9 : అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ ।అభ్యాసయోగేన తతో మామిచ్ఛాఽప్తుం ధనంజయ! ||(బ్రహ్మయోగము).
భావము : నాయందే మనసునుంచి ఎల్లపుడు నన్నే తలచుచుండుము. నాయందే బుద్ధినుంచుము. ఆ తరువాత నన్నే పొంది నాయందే నిలుతువు. ఈ విషయములో అనుమానము లేదు. నీ చిత్తమును స్థిరరీతి నాయందు నిలుపశక్తిలేని ఎడల ఓ అర్జునా! అట్టి శక్తి అభ్యాసయోగమున పొందగలవు.
మనస్సు నిలచుట వలన బుద్ధి నిలచును, బుద్ధి నిలచుట వలన చిత్తము నిలచును. ఇలా ఒకటి నిలిచిన మరొకటి నిలుచునని వెనుక తెలుసుకొన్నాము. చిత్తము స్థిరరీతి నిలువకపోతే మనస్సు, బుద్ధి నిలువలేదనియే చెప్పనగును. అట్లు మనస్సునుగాని, బుద్ధినిగాని, చిత్తమునుగాని నిలుపలేనివానికి అభ్యాసయోగముచేత అట్టి నిలుపగలశక్తి లభించును. యోగాభ్యాసము వలన తప్పక యోగము సాధ్యమగును.
శ్లోకం|| 10 : అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ । మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి ||(భక్తియోగము).
భావము : మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును.
శ్లోకం|| 11 : అథైత దప్యశక్తోఽసి కర్తుం మద్యోగ మాశ్రితః । సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||(కర్మ యోగము).
భావము : భక్తియోగము చేత నాపనులు చేయుటకు కూడ సామర్థ్యములేని వాడవైతే అఖిల కర్మఫలత్యాగివగుము. అట్టికర్మ యోగమున నన్ను పొందగలవు.
శ్లోకం|| 12 : శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే । ధ్యానా త్క ర్మఫలత్యాగ స్త్యాగాచ్ఛాన్తి రనన్తరమ్ ||(బ్రహ్మ, కర్మ యోగములు).
భావము : అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.
శ్లోకం|| 13 : అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ । నిర్మమో నిరహంకార స్సమదుఃఖసుఖః క్షమీ || (కర్మయోగము).
శ్లోకం|| 14: సన్తుష్ట స్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।మయ్యర్పితమనోబుద్ధి ర్యో మద్భక్త స్సమేప్రియః ||(కర్మయోగము).
భావము : సర్వ జీవరాసులందు ద్వేషములేక, కరుణ స్నేహముకల్గి, మమత విడిచి, అహంకారములేకుండ, కల్గెడి సుఖదుఃఖములను సమముగ చూచుచు, ఓర్పుకల్గి వుండువాడు, ఎల్లపుడు సంతృప్తికల్గిన కర్మయోగియై మనోబుద్ధియందు మోక్షము పొందవలెనను దృఢనిశ్చయము కల్గివుండు భక్తునియందు నాకధిక ప్రేమ.
శ్లోకం|| 15: యస్మాన్నో ద్విజతే లోకో లోకా న్నో ద్విజతే చ యః । హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్సచ మే ప్రియః ||(బ్రహ్మయోగము).
భావము : అర్జునా! ఎవని వలన ప్రపంచమునకు భయములేదో, ప్రపంచముచే ఎవడు భయపడడో, వాడు కోపమును, భయమును, సంతోషమును మనో వ్యాకులతను పొందడు, వాడే నాకు పరమప్రియుడు.
శ్లోకం|| 16: అనపేక్ష శ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారమ్భ పరిత్యాగీ యో మద్భక్త స్స మే ప్రియః ||(బ్రహ్మయోగము).
భావము : దేనియందు ఆశలేనివాడును, మనో శుభ్రతకల్గినవాడును, పట్టుదల కల్గిన వాడును, ఎవరి పక్షము లేనివాడు, దేనిని ఆరంభించక వదలివేసిన బ్రహ్మయోగి అయిన భక్తుడు నాకధిక ప్రియుడు.
శ్లోకం|| 17: యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి ।శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః ||(కర్మయోగము).
భావము : సంతోషపడక అట్లే దుఃఖమును పొందక, ద్వేషమందక, అభిలాషియు కాక, మంచిచెడు పుణ్యపాపములను పొందక, వాటిని పరిత్యజించినవాడు ఎవడో వాడు నాకు మిగులప్రియుడు.
శ్లోకం|| 18: సమ శ్శత్రౌ చ మిత్రేచ తథా మానావమానయోః । శీతోష్ణ సుఖదుఃఖేషు సమ స్సంగ వివర్జితః || (బ్రహ్మ, కర్మయోగములు).
శ్లోకం|| 19: తుల్య నిన్దా స్తుతి ర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ । అని కేతః స్థ్సిరమతి ర్భక్తిమాన్ మే ప్రియో నరః ||(కర్మయోగము).
భావము : మిత్రులయందు, శత్రువులయందు, మానావమానములందు, శీతోష్ణ సుఖదుఃఖములందు సమతకల్గినవాడు, పాపపుణ్యములను సమానముగ వర్జితము చేసినవాడు, స్థుతియు, నిందయు సమముగ తలచి దొరికిన దానితో తృప్తిచెంది గృహములు మొదలగు నివాసస్థలముల మీద ఆశలేని స్థిర మనస్కుడగువాడు నాకు ప్రియుడు.
శ్లోకం|| 20: యే తు ధర్మ్యా మృత మిదం యథోక్తం పర్యుపాసతే । శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః ||(బ్రహ్మ, కర్మయోగములు).
భావము : ఎవరు నా పరమపదము మీద శ్రద్ధగలిగి, ఈ మృతములేని ధర్మము లను ఏ విధముగ చెప్పియున్నారో, ఆ విధముగ ఉపాసించు భక్తుడు నాకు పరమప్రియుడు.
--------------------------------------------------
☞అర్జునుడిట్లనియె :-
శ్లోకం|| 1 : (బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు).
భావము : ఆ విధముగ ఎల్లపుడు ఆత్మతో కూడుకొన్నవాడు, భక్తితో నిన్ను ఉపాసించువాడు, కనిపించని నాశనములేని స్థానమును గురించి ఉపాసించువాడు గలరు. వీరిలో బాగా యోగము తెలిసిన వారు ఎవరు?.
☞శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం|| 2 : (బ్రహ్మ, కర్మ, భక్తియోగములు).
భావము : పరమశ్రద్ధ కల్గినవారై నాయందు మనస్సునుంచి, నిత్యము నాతో యుక్తము కోరి ఉపాసించువారందరు ఉత్తమయోగులని నా ఒప్పుదల.
శ్లోకం|| 3: (మోక్షము).
శ్లోకం|| 4: (బ్రహ్మయోగము).
భావము : అక్షరమైనది, నిర్ధేశింపబడనిది, కనిపించనిది, ఆలోచనకందనిది, కూటస్థమైనది, అచలమైనది, శాశ్వతమైనది, అంతట వ్యాపించినదియైన పరమాత్మను ఉపాసించువారు.
ఇంద్రియములను నిగ్రహించి, అన్నిటియందు బుద్ధి సమముచేసి, సర్వభూత హితులైన వారు నన్ను పొందగల్గుదురు.
శ్లోకం|| 5 : (బ్రహ్మయోగము).
భావము : అట్లు ఆత్మను ఉపాసించునట్టి బ్రహ్మయోగులు అనుసరించు మార్గము చాలా కష్టమైనది పార్థ! ఇంద్రియములకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గమని తెలియుము.
శ్లోకం|| 6: (కర్మయోగము).
భావము : ఎవరైతే సర్వకర్మలు నాకే సమర్పణమొనర్చారో, వారు ఇతర ఏ కర్మలు అంటని రీతిలో కర్మయోగంబొనర్చి నన్ను ఉపాసించుచున్నారు.
శ్లోకం|| 7 : (భక్తి యోగము).
భావము : నాయందే వారి మనస్సును లగ్నము చేసివున్న నాభక్తపరులు కలరు. నేను శీఘ్రముగ వారినందరిని మృత్యు సంసార సముద్రమునుండి బయటపడ వేయుచున్నాను.
శ్లోకంకములలో బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగము మూడు చెప్పబడినవి. ఈ మూడు విధానములననుసరించి వారిని తప్పక మృత్యుమయమై సారములేనిదైన జన్మకర్మల జలమయమైన సముద్రము నుండి బయటపడవేతును. మోక్షమునిస్తునని పరమాత్మ తెలిపాడు.
శ్లోకం|| 8 : (బ్రహ్మయోగము).
శ్లోకం|| 9 : (బ్రహ్మయోగము).
భావము : నాయందే మనసునుంచి ఎల్లపుడు నన్నే తలచుచుండుము. నాయందే బుద్ధినుంచుము. ఆ తరువాత నన్నే పొంది నాయందే నిలుతువు. ఈ విషయములో అనుమానము లేదు. నీ చిత్తమును స్థిరరీతి నాయందు నిలుపశక్తిలేని ఎడల ఓ అర్జునా! అట్టి శక్తి అభ్యాసయోగమున పొందగలవు.
శ్లోకం|| 10 : (భక్తియోగము).
భావము : మనస్సు నిల్పు అభ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును.
శ్లోకం|| 11 :
(కర్మ యోగము).
భావము : భక్తియోగము చేత నాపనులు చేయుటకు కూడ సామర్థ్యములేని వాడవైతే అఖిల కర్మఫలత్యాగివగుము. అట్టికర్మ యోగమున నన్ను పొందగలవు.
శ్లోకం|| 12 : (బ్రహ్మ, కర్మ యోగములు).
భావము : అభ్యాసముకంటే జ్ఞానము మేలు, ధ్యానము జ్ఞానముకంటే గొప్పది, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. మనిషికట్టి త్యాగముచే శాంతికల్గును.
శ్లోకం|| 13 : (కర్మయోగము).
శ్లోకం|| 14: (కర్మయోగము).
భావము : సర్వ జీవరాసులందు ద్వేషములేక, కరుణ స్నేహముకల్గి, మమత విడిచి, అహంకారములేకుండ, కల్గెడి సుఖదుఃఖములను సమముగ చూచుచు, ఓర్పుకల్గి వుండువాడు, ఎల్లపుడు సంతృప్తికల్గిన కర్మయోగియై మనోబుద్ధియందు మోక్షము పొందవలెనను దృఢనిశ్చయము కల్గివుండు భక్తునియందు నాకధిక ప్రేమ.
శ్లోకం|| 15: (బ్రహ్మయోగము).
భావము : అర్జునా! ఎవని వలన ప్రపంచమునకు భయములేదో, ప్రపంచముచే ఎవడు భయపడడో, వాడు కోపమును, భయమును, సంతోషమును మనో వ్యాకులతను పొందడు, వాడే నాకు పరమప్రియుడు.
శ్లోకం|| 16: (బ్రహ్మయోగము).
భావము : దేనియందు ఆశలేనివాడును, మనో శుభ్రతకల్గినవాడును, పట్టుదల కల్గిన వాడును, ఎవరి పక్షము లేనివాడు, దేనిని ఆరంభించక వదలివేసిన బ్రహ్మయోగి అయిన భక్తుడు నాకధిక ప్రియుడు.
శ్లోకం|| 17:
(కర్మయోగము).
భావము : సంతోషపడక అట్లే దుఃఖమును పొందక, ద్వేషమందక, అభిలాషియు కాక, మంచిచెడు పుణ్యపాపములను పొందక, వాటిని పరిత్యజించినవాడు ఎవడో వాడు నాకు మిగులప్రియుడు.
శ్లోకం|| 18: (బ్రహ్మ, కర్మయోగములు).
శ్లోకం|| 19: (కర్మయోగము).
భావము : మిత్రులయందు, శత్రువులయందు, మానావమానములందు, శీతోష్ణ సుఖదుఃఖములందు సమతకల్గినవాడు, పాపపుణ్యములను సమానముగ వర్జితము చేసినవాడు, స్థుతియు, నిందయు సమముగ తలచి దొరికిన దానితో తృప్తిచెంది గృహములు మొదలగు నివాసస్థలముల మీద ఆశలేని స్థిర మనస్కుడగువాడు నాకు ప్రియుడు.
శ్లోకం|| 20: (బ్రహ్మ, కర్మయోగములు).
భావము : ఎవరు నా పరమపదము మీద శ్రద్ధగలిగి, ఈ మృతములేని ధర్మము లను ఏ విధముగ చెప్పియున్నారో, ఆ విధముగ ఉపాసించు భక్తుడు నాకు పరమప్రియుడు.