లు అంటే ఏమిటి?. for all langunages translate 19thsep 24 Updated

 



లు అంటే ఏమిటి?.


'లు' అనునది ఒక అక్షరము 'లు' అను అక్షరము మిగతా భాషలలో యున్నా అది ఒక్క తెలుగుభాషలోనిదేయని చెప్పవచ్చును. వాస్తవానికి తెలుగు భాషలో 'లు' అను ప్రత్యేక అక్షరము లేదనియే చెప్పవచ్చును. తెలుగులో 'ల' అను అక్షరమున్నదిగానీ 'లు' అను అక్షరము లేదు. భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే. భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును. భాష భావమును తెలుపునదే గానీ లిపితో సంబంధముండవచ్చును, ఉండక పోవచ్చును. భాష, లిపి వేరువేరువయినా భాషకు లిపికి అవినాభావ సంబంధమున్నదనియే చెప్పవచ్చును. ముందు 'భాష' పుట్టుతుంది. తర్వాత 'లిపి' పుట్టుతుంది. భాష పుట్టిన తర్వాత లిపి తయారయిన భాషలు ఎన్నియున్నా, భాష పుట్టిన తర్వాత లిపి తయారుకాకుండా నిలిచిపోయిన భాషలు ఎన్నో గలవు. వాటి వివరమును చూస్తే ఇలా కలదు. మొత్తము ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలున్నట్లు సమాచారము గలదు. లిపి లేని భాషలు 696 గలవు. మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు. వాటిలో లిపి గల భాషలు ఇవియని చెప్పలేము. అట్లే లిపి లేని భాషలు ఇవియని కూడా చెప్పలేము. గుర్తులతోనూ, గీతలతోనూ, వస్తువులతోనూ, చింతగింజలు చూపడముతోనూ అనేక విధముల వ్యక్తము చేయునవిగా యుండుట వలన వాటిలో కొన్నిటికి ప్రత్యేకమైన లిపి యుందని చెప్పలేము. అట్లని లిపే లేదని చెప్పుటకు వీలులేని విధముగా యున్నాయి.


ఒకరి నుండి మరొకరికి భావమును పంపడములో అనగా భావవ్యక్తీకరణలో ముఖ్యమైన పాత్ర పోషించునది భాష అనియే చెప్పవచ్చును. భాష మాట్లాడబడునది, లిపి వ్రాయబడునది. భాషను లిపిచేత వ్రాయ వచ్చును. అలాగే లిపిని భాష చేత చెప్పవచ్చును. అందువలన భాష,లిపి రెండూ అవినాభావ సంబంధము కల్గియున్నవని చెప్పవచ్చును. ప్రపంచములో మొదట జ్ఞాన భావమును వ్యక్తము చేసినప్పుడు ఏర్పడినశబ్దమును 'భాష' అని మొట్టమొదట అన్నారు. ప్రపంచము తయారయి నప్పుడు భాష లేదు. శబ్దము లేని సైగలతో భావమును తెలుపుకొనెడివారు.అటువంటి భాషలు నేడు కూడా రెండు వేలకు పైనే యున్నవని చెప్పుచున్నారు. కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రముశబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు. 


ప్రశ్న :- ప్రపంచములో మొట్టమొదట పలుకబడిన భాష పేరేమిటి?

జవాబు :- ఆ దినములలో 'భాష' అను పేరు లేనిదానివలన మొట్టమొదటిది ఫలానా భాషయని చెప్పుటకు వీలులేదు. ఆ దినము మొట్టమొదటిగాఆకాశభూతము ఏ భావమును వ్యక్తపరచినదో కూడా మనుషులకు తెలియదు. సాధారణ జీవులు అనగా సాధారణ మనుషులు ఎవరుగానీఅంతవరకు శబ్దముతో భావమును వ్యక్తము చేయలేదు. 



ప్రశ్న :- భూమిమీద మనుషులు ఒకరికొకరు మాటలతోగానీ, లేక మాటలను పోలిన శబ్దములతోగానీ ఒకరి విషయమును మరొకరికి తెలుపుకొనుచుందురు. అటువంటప్పుడు మనుషులే మాట్లాడలేదు, కనీసము శబ్దము కూడా చేయలేదు అని మీరంటున్నారు. ఏమీ తెలియని మనుషులకుఆకాశము తన శబ్దముతో తన భావమును తెలిపితే మనిషి తెలియగలడా? జవాబు :- ఎవరి భావమును వారు తెలుపుటకు వారికి తెలిసిన విధముగావారు తమ భావమును వ్యక్తము చేయుదురు. ఎదుటి వ్యక్తి తాము తెలుపు విధానము తెలియునా లేదా అన్నది ఇక్కడ ముఖ్యము కాదు. ఎవరికి


తెలిసిన విధానములో వారు తెలుపడమును భాష అంటున్నాము. భావమును తెలుపు విధానము ఎలాగయినా ఉండవచ్చును. ఇలానే ఉండవలెననునియమము లేదు. ఎదుటివాడు తెలుపు విధానము వినేవాడు తెలిసి యుండవలెనను నియమము లేదు. తెలుగుభాష వచ్చినవానివద్దకు తమిళభాష వచ్చినవాడు వచ్చి వాని భాషలో వాడు మాట్లాడును. వానికి తెలిసిన విధానము ప్రకారము వాడు మాట్లాడినాడు, అయితే ఎదుటి వ్యక్తి తానుమాట్లాడు తమిళ భాష తెలిసియుండవలెనను నియమము లేదు. ఎదుటివాడు తమిళమును తెలియగలిగితే వానికి తమిళములో చెప్పినవిషయము అర్థమగును. మనము మరొక ఊరిలోగల స్నేహితునివద్దకు పోయినప్పుడు స్నేహితుని ఇంటిముందుగల కుక్క మనలను చూచిమొరిగినదనుకొనుము. అప్పుడు ఆ మొరుగుడులో దాని భావము ప్రకారము మీరు ఎవరో క్రొత్తవారు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? అని అడిగినట్లుముందే మొరిగినది. ఆ విషయము మనకు అర్థము కాలేదుగానీ, కుక్క మొరిగింది అని మాత్రము తెలుసు. అలాగే సృష్ట్యాదిలో ఆకాశమునుండి ఒక శబ్దము ఏర్పడినది. అదిభావముతో కూడిన మొదటి శబ్దమయిన దానివలన దానిని 'భాష' అన్నాము. ఆ భాష మనకు తెలిసియుండాలి యను నియమము లేదు. వాస్తవముగాకుక్క మొరుగుడులోని భావముగానీ, తమిళ మాటలలోని భావముగానీ మనకు తెలియనట్లే, ఆకాశము చేసిన శబ్దములోని భావము కూడా మనకుతెలియదనియే చెప్పవచ్చును. ఆకాశము చేసిన శబ్దములో భావముండుట వలన, ఆకాశము కూడా ఒక జీవుడే అయివుండుట వలన, అక్కడ ఆకాశముశబ్దరూపములో చెప్పినదానిని, మొట్టమొదట పలుకబడిన భాషగా చెప్పుచున్నాము. ఆ దినములలో భాషలే లేనిదానివలన భాషల పేర్లు లేవని చెప్పవచ్చును. ఆకాశము పలికిన శబ్దమును భాషగా చెప్పితే, ఆభాషకు క్రొత్త పేరు పెట్టుకోవలసిందే. ఆ దినము మొట్టమొదటిగా చెప్పిన భావములో ఏమి సమాచారమున్నదో, ఆ సమాచారమునకు సంబంధించినపేరును పెట్టుకోవడము మంచిదనుకొంటాను. అయితే ఆ దినము ఆకాశము ఫలానా సమాచారమును తెలిపినదని మనిషికి ఏమాత్రముతెలియదు. తర్వాత జరిగిన కాలములో కూడా తెలియదు. ఆ తెలియని తనము కృతయుగము, త్రైతా యుగము, ద్వాపర యుగము చివరి వరకుకొనసాగినది. ద్వాపరయుగము చివరలో శ్రీకృష్ణుడు అర్జునునకు జ్ఞానమును చెప్పినప్పుడు, భగవద్గీతలో జ్ఞానయోగముయందు మొదటి శ్లోకములో“సృష్ట్యాదిలోనే నేను సూర్యునికి జ్ఞానము చెప్పియుంటిని” అని అన్నాడు. అయితే అక్కడ కూడా ఆకాశవాణి ద్వారా జ్ఞానమును చెప్పి యుంటిననుసమాచారము లేదు. 'తాను మొదటిగా సృష్ట్యాదిలోనే జ్ఞానమును చెప్పాను' అని మాత్రము గలదు. కలియుగములో మూడు వేల ఆరువందల(3600) సంవత్సరములు గడచిన తర్వాత సూర్యగ్రహము భూమిమీద మనుషులకు జ్ఞానమును తెలియజేసినట్లు, జిబ్రయేల్ అను గ్రహముముహమ్మద్ ప్రవక్తగారికి, ఆకాశములో సూర్యుని ద్వారా తెలిసిన జ్ఞానమును తెలియజేయడము జరిగినది. అప్పుడు అంతవరకు తెలియనిరహస్యము తెలిసిపోయినది. 


సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యునకు జ్ఞానము తెలిసినదనిఅర్థమయినది. అయితే ఆ విషయమును జిబ్రయేల్ కూడా అట్లే జరిగినదని చెప్పలేదు. అయితే మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ చెప్పిన ఖుర్ఆన్జ్ఞానములో సూరా 42, ఆయత్ 51నందు చెప్పిన మాటలో కొంత ఆధారము దొరికినది. అక్కడ దేవుడు మనిషికి తెలియజేయు జ్ఞానము మూడు విధములు ఉండుననీ, అందులో "ఆకాశవాణి ద్వారా ఒక విధముగాజ్ఞానమును తెలియజేతును” అని చెప్పడమైనది. ఐదువేల సంవత్సరము లప్పుడు కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పుడు సృష్ట్యాదిలో సూర్యునకుజ్ఞానమును చెప్పియుంటిని అని చెప్పియుండుట వలన, ఆకాశవాణి ద్వారా చెప్పిన జ్ఞానము సూర్యుడు తెలియుటకు అవకాశముండుట వలన, ఆవిషయమును బాగా శోధించగలిగితే సృష్ట్యాదిలో ఆకాశవాణి సూర్యునకు జ్ఞానము చెప్పినదని తెలిసిపోవుచున్నది. చివరకు కొంత శ్రమయైనాసృష్ట్యాదిలో ఆకాశము తన శబ్దము చేత దైవజ్ఞానమును తెలియచేసినదని అర్థమయిపోయినది. అయితే అప్పుడు ఆకాశవాణి పలికిన శబ్దములోనున్నభావము జ్ఞానమే అయినా, అప్పుడు చెప్పిన భాష ఏమిటి? అను ప్రశ్నకు జవాబును చూస్తే, అప్పటి భాష మొదటిది, క్రొత్తది అయినందున దానికిమనమే ఒక పేరును పెట్టుకొని చెప్పుకోవలసియుండును. ఆ దినము చెప్పబడినది దైవజ్ఞానము అయినందున అప్పటి శబ్దమునకు అనగాభావమును తెలిపిన భాషకు “దైవభాష” అని పేరు పెట్టుకొందాము. అలాగే సృష్ట్యాదిలో వచ్చిన భావముతో కూడుకొన్న శబ్దమును ‘దైవభాష' అనుపేరుతో చెప్పుకోవచ్చును. సృష్ట్యాదిలో మొట్టమొదట పలుకబడిన భాష దైవభాష, సృష్ట్యాదిలో పలుకబడిన దైవభాష ప్రతి సంవత్సరము మనముందరవినిపిస్తూనే యున్నది. దైవభాష ద్వారా ఆకాశము ప్రతి సంవత్సరము మానవులకు అందరికీ దైవజ్ఞానమును తెలుపుచూనే యున్నది. అదేవిషయమునే ఖురాన్ గ్రంథములో సూరా 21, ఆయత్ 32లో “ఆకాశము ద్వారా సూచనలను పంపుచున్నానని” చెప్పడము జరిగినది.ద్వారా దేవుడు మనుషులకు చేయు సూచనలనే 'దేవుని జ్ఞానము' అని అంటున్నాము. దేవుని జ్ఞానమును చెప్పబడిన భాషను దైవ భాష అనిచెప్పవచ్చును. అయితే ఆ దైవభాష శబ్దము అందరికీ వినిపించుచుండగా ప్రతి సంవత్సరము అందరము వినగలుగుచున్నాము.



ప్రశ్న :- భూమిమీద ఎన్నో భాషలున్నాయి. వాటికి పేర్లు కూడాఉన్నాయి. లిపి యున్న భాషలు, లిపిలేని భాషలు అని రెండుగా విభజించి చూచిన దైవభాషకు లిపిలేదు. ఇప్పుడున్న 7105 భాషలలో ఏ భాష దైవజ్ఞానమునకు దగ్గరగా యున్నది. ఏ భాషను దైవభాషగా చెప్పవచ్చును?


 జవాబు :- ఆకాశము చేసిన శబ్దమును గ్రహించిన వాడు సూర్యుడు. సూర్యుడు ఎన్నో సంవత్సరములు తాను తెలిసిన జ్ఞానమును నెమరువేసుకొని, తర్వాత భూమిమీద మనుషులకు తెలియజేశాడు. ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీదతన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగుభాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును. 

 

ప్రశ్న :- భారతదేశములోనే పుట్టి పెరిగిన సంస్కృత భాషను చాలామందిపండితులు, బ్రాహ్మణులు, కొందరు జ్ఞానులమని ప్రకటించుకొన్నవారు దైవభాషగా చెప్పుచున్నారు. దైవ అర్చనలను సంస్కృత మంత్రములతోనేచేయుచున్నారు. యజ్ఞ యాగములవద్ద సంస్కృత శ్లోకములను, మంత్రముల వలె చెప్పుచున్నారు. వేదములను సంస్కృత భాషలోనే వ్రాసుకొన్నారు.ఎందరో సంస్కృతమును దైవభాషగా చెప్పుచుండగా, మీరు మాత్రము తెలుగు భాషను 'దైవభాష' అని అంటున్నారు. మీ మాటను వేదపండితులదగ్గర నుండి, గుడిలోని అర్చకుల వరకు ఒప్పుకోరు. వారు సంస్కృతమునే దైవభాష అని అంటారు. దానికి మీరు ఏమి జవాబు చెప్పగలరు? జవాబు :- “ముందు వచ్చిన చెవులకంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి"అని చెప్పినట్లున్నది మీ ప్రశ్న. వెనుక వచ్చిన కొమ్ములు చెవులకంటే పొడవైనా తర్వాత వాడియైనా, అవి ఆవుకు ఎప్పుడో ఒకప్పుడు మాత్రము పనికి వచ్చును. అయితే ముందు వచ్చిన చెవులు ప్రతిక్షణము శబ్దమును వినునట్లుచేయుచుండును. అతిచిన్న శబ్దమును కూడా వినునట్లు శబ్దము వచ్చు దిక్కుకు చెవును త్రిప్పి శబ్దమును వినిపింపజేయును. నాలుగు దిక్కులకుత్రిప్పు చెవుల ముందర ఒక దిక్కుకు కూడా తిరగని కొమ్ములు గొప్పయనుట ఎట్లుండునో, తెలుగు భాషకంటే వెనుక వచ్చిన సంస్కృతము గొప్పయనుటఅట్లే యుండును. తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాషకాగా, సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగుభాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోనిలిపి వలన వ్రాయవచ్చును. 


భాషకు లిపి భార్యవంటిది. భాషకు తగిన లిపియుండుట భర్తకుతగిన భార్యయున్నట్లేయగును. తెలుగు భాషకు లిపియైన అక్షరములు ఎక్కువగా యుండుట వలన తెలుగు భర్తయంతటి పురుషుడు గానీ,తెలుగు లిపి భార్యయంతటి స్త్రీగానీ ఎక్కడా లేరని చెప్పవచ్చును. లిపి లేని భాష పెళ్లికాని పురుషుడులాంటిది. సంస్కృత భాషకు లిపిలేదుఅందువలన సంస్కృత భాష భార్య లేని పురుషుడులాంటిది. సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాతఅది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగావాడబడుచున్నది. అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు. అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోనిపదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది. మతము అను పదముగానీ, శ్రీమతులు అను మొదలగు తెలుగు పదములనుసంస్కృతములో వాడుకోవడము జరిగినది. పెళ్ళికాని ప్రసాద్ పెళ్ళయిన ప్రతాప్కు పోటీయన్నట్లు, లిపియున్న తెలుగు భాషకు లిపిలేని సంస్కృతముభాషను పోటీకి పెట్టడము, తెలుగుకంటే సంస్కృతమే గొప్పయనుట ఒక వింతగాయున్నది. లిపియున్న భాషలు 3570 యుండగా, లిపిలేని భాషలుకేవలము 696 మాత్రమే. ఎరికల, దొక్కల, సుగాలి మొదలగు భాషలకు లిపిలేదు. ఎప్పటికయినా లిపివున్న భాషలకంటే లిపిలేని భాషలు వెనుకపుట్టినవని, చిన్నవని అందరి భావములోయుండగా, అన్నిటికంటే ముందు పుట్టిన తెలుగుకంటే చాలా వెనుక పుట్టిన సంస్కృతమును గొప్పయనుట,ఎక్కువమంది మాట్లాడే తెలుగుకంటే తక్కుమంది వాడే సంస్కృత భాషను గొప్పయనడము తెలివి తక్కువ పనియని చెప్పవచ్చును. అంతేకాక చరిత్రతెలియనివారే అలా మాట్లాడగలరని చెప్పవచ్చును. ప్రపంచములో దైవజ్ఞానము పలుకబడిన మొదటి భాషగా తెలుగును అన్నిటికంటే గొప్పగాచెప్పవచ్చును. ప్రపంచములో మొదట పుట్టిన భాషగా, ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాషగా తెలుగు గొప్పదనిచెప్పడమేకాక, ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి. తన పదములు అన్ని భాషలలోయుండగా, తనకంటేపెద్ద భాష ఏదీ లేదను భావమును వ్యక్తము చేయుచూ, భాషలన్నిటికీ రాజుగా లేక చక్రవర్తిగా తెలుగు భాషయున్నదని చెప్పవచ్చును.


ఎక్కువ భావమును తక్కువ వ్రాతలో ఇముడ్చుకొను పద్యములువ్రాయు సౌకర్యము ఒక్క తెలుగు భాషలోయున్నదని నేడు ధైర్యముగా ఏ కవియైనా చెప్పవచ్చును. కవుల గొప్పతనము ఒక్క తెలుగు భాషలోనేబయటికి చాటబడినది. ఆటవెలది, తేటగీతి అను పద్యములలో కవుల ప్రతిభ ప్రకటితముకాగా, సీస పద్యములలో కవుల నైపుణ్యము మెరిసి పోయింది. తెలుగులో కవులు చూపినంత చాకచక్యమును ఇతర భాషలలోచూపుటకు వీలులేదు. శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతమును, పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగుకంటేగొప్పయనడము ప్రత్యక్ష తప్పుగా కనిపించుచున్నది. అన్ని విధముల సంస్కృత భాషకంటే తెలుగు భాషయే గొప్పయని చెప్పవచ్చును. భూమండలమునకుశక్తినిచ్చు సూర్యుడు పలుకబడిన భాషగా, ఆత్మజ్ఞానమును, ఆత్మను వర్ణించడములో తెలుగుకు తెలుగే సాటియని చెప్పవచ్చును.


ప్రశ్న :- మీరు తెలుగు భాషాభిమానులుగా యున్నారు. అందువలనతెలుగు భాషను అంతగా పొగడుచున్నారు అని అనుకుంటున్నాము. 


జవాబు :- ఊరక అనుకుంటే ఏమీ ప్రయోజనముండదు. నేను కూడాఆధారము లేకుండా ఊరక పొగిడితే నాకు కూడా ఏమీ ప్రయోజనము ఉండదు. నేను అన్నీ విడదీసి చూపుచూ తెలుగు భాష గొప్పదనిచెప్పుచుండగా, నన్ను భాషాభిమానని అనడము మీకు తగునేమో ఒకమారు వెనుతిరిగి ఆలోచించుకోండి. ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంతఅర్ధము, వివరము వేరే భాషలో ఉందేమో మీరే చెప్పండి! “ఆత్మ” అను పదము తెలుగు భాషలోనే పుట్టినది. తెలుగు భాషలోనే సంపూర్ణ అర్థమునుఇచ్చుచున్నది. వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే. సృష్ట్యాదిలో ఆకాశము ద్వారా దేవుడు తన జ్ఞానమును మనుషులకు అందించాడు.ఆకాశము మహాభూతమే అయినా ఒక జీవుడే అయినందున "జీవుడు ఏదీ చేయలేడు” అను సూత్రము ప్రకారము ఆకాశము చెప్పినదని మనముఅనుకొనినా వాస్తముగా ఆకాశము అక్కడ చెప్పలేదు. ఆకాశ జీవునితో సంబంధపడియున్న ఆత్మయే జ్ఞానమును సూర్యునకు అందించినదనిచెప్పవచ్చును. ఆకాశములో అణిగియున్న ఆత్మ అందించిన అప్పటి జ్ఞానము అని తెలిసిపోయినది. అప్పుడు సూర్యునకు అందిన జ్ఞానముమూడు యుగముల తర్వాత మూడు దైవగ్రంథములుగా ప్రపంచమున కంతటికీ, ప్రతి ఒక్కరికీ జ్ఞానమయినది. ఇక్కడ జ్ఞాన జిజ్ఞాసులు కొంతఆలోచించవలసి యున్నది. మూడవ చివరి దైవ గ్రంథమందు మూడవ సూరాలో ఏడవ ఆయత్నందు ఇలా చెప్పారు. (3-7) “దేవుని జ్ఞానముదేవునికి తప్ప మరెవరికీ తెలియదు" అని చెప్పబడియున్నది. అయితే ప్రథమ దైవగ్రంథమందు నేను సృష్ట్యాదిలో సూర్యునికి జ్ఞానముచెప్పియుంటిని అని స్వయముగా దేవుడే చెప్పినట్లు కలదు. "దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు తెలియదు” అని చెప్పడమే కాక “సృష్ట్యాదిలోసూర్యునికి నేనే చెప్పాను” అన్నప్పుడు దేవుడు తప్ప ఎవరూ చెప్పలేదని తెలిసిపోవుచున్నది. ఇంకొక విధముగా చూస్తే దేవుడు ఏదీ చేయువాడుకాదు, ఏదీ చెప్పువాడు కాదు అని చెప్పుటకు దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడని తెలిసినది. క్రియ లేనివాడను ధర్మము ప్రకారము చూస్తే దేవుడుఏమీ చేయలేదు, ఏమీ చెప్పలేదని అర్థమగుచున్నది. దీనిప్రకారమైతే సృష్ట్యాదిలో సూర్యునకు జ్ఞానమును తెలిపి యుంటినను మాట అసత్యమగును. అంతేకాక దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇంకెవరికీ తెలియదు” అనిన దేవుని మాట కూడా అసత్యమగును. ఒకవేళ ఈ మాటలేసత్యమనుకొంటే దేవుడు అన్ని కార్యములు చేసిన వాడగును. ఒక విధముగా చూస్తే దేవుడు పనులు చేయడని తెలియుచున్నది. మరొక విధముగా చూస్తే దేవుడు పనులు చేయునని తెలియుచున్నది. ఈరెండిటి మధ్య ఏది సత్యమో, ఏది అసత్యమో అర్థముకాక మనుషులు తలలు పట్టుకోవలసియుండును.


ప్రశ్న :- మీరు దారి తప్పి ఎక్కడికో పోయి 'దేవుడు సత్యుడో, అసత్యుడో”అని చెప్పుచున్నారు. నేను చెప్పినది మీరు తెలుగు యొక్క భాషాభిమాను లన్నాను. మీరు భాషను గురించి మొదలు పెట్టి వివాదాస్పద విషయము లోనికి పోయారు.


జవాబు :- నన్ను తెలుగు భాషాభిమానులన్నారు. ఆ విషయమై తెలుగుభాష ఎంత గొప్పదో తెలియుటకే ఈ ఉపోద్ఘాతమును చెప్పుచున్నాను. తెలుగు భాష ఒక్కమారు గొప్పదని నేను చెప్పుట వలన, ఎలా గొప్పదనువిషయము మీకు తెలియక నన్ను తెలుగు భాషాభిమానులన్నావు. నాకు ఏ భాషమీద అభిమానము లేదు. అయితే తెలుగు భాషను ఎక్కువగాచెప్పుటకు నావద్ద అనేక కారణములు గలవు. వాటిని తెలియపరచుటకే ముందు ఇదంతా చెప్పవలసిన అవసరమైనది. దేవుడు రెండు రకములచెప్పాడనీ, దేవుడే అసత్యమును చెప్పాడనీ నేను చెప్పుచున్నట్లు నీకు అర్థమయినది. అందువలన నేను వివాదాస్పద మాటలు చెప్పుచున్నట్లునీకు అర్థమయినది. వాస్తవముగా నేను చెప్పునది వివాదస్పదము కాదు. దేవుడు చెప్పినది చెప్పినట్లు చెప్పుచున్నాను. దేవుడు చెప్పిన మాటలలోఅసత్యము ఎక్కడా లేదు. అయితే దేవుడు చెప్పిన జ్ఞానము మనుషులకు అర్థము కాలేదని చెప్పుచున్నాను. దేవుని జ్ఞానము అర్థముకాకపోతే దేవుడుఒకచోట ఒకరకము, మరొకచోట మరొక రకము చెప్పినట్లు తెలియును. అందువలన దేవుని జ్ఞానమును తెలియుటకు ఎంతో శ్రద్ధ అవసరమని చెప్పుచున్నాను.


దేవుడు చెప్పిన జ్ఞానములో “దేవుడు పని చేయువాడు కాదు” అనియున్నది. అదే దేవుని మాటలలో "నేను ఈ విశ్వమునంతటినీ సృష్టించానని” కలదు. అప్పుడు ముందుమాటకు వెనుక మాట పూర్తి విరుద్ధముగాయున్నట్లు తెలియుచున్నది. అలా చెప్పవలసిన అవసరమేమి వచ్చినదనీ ఆలోచిస్తే, రెండుమాటలూ నిజమేనని తెలియుచున్నది. దేవుడు చెప్పినరెండు మాటలు వాస్తవమేనని చెప్పుటకు, ముందు దేవుడు ఎటువంటి వాడో తెలియవలసియున్నది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము.దేవుడు ఒక్కడే అయినా, ఆయన మొత్తము నాలుగు విధముల విభజింప బడియున్నాడు. అందులో మూడు భాగములను ఒక ప్రక్క మరొకభాగమును ఒక ప్రక్క నిలిపి ఆట మొదలిడినాడు. జగన్నాటకము అను ఈ ఆటలో దేవుని నుండి విభజింపబడియున్న పరమాత్మ, ఆత్మ, జీవాత్మమూడూ ఒక ప్రక్క యుండగా, అలాగే ప్రకృతియను ఒక భాగము మరొక ప్రక్క యున్నదని తెలియవలెను. ఇదంతయూ దేవుడు దేవుడుగా యుంటూతననుండి మిగతా భాగములను దేవుడు విభజించాడని తెలియుచున్నది. ప్రకృతి యనగా కనిపించే ప్రపంచమనీ తెలియవలెను. అయితే జీవాత్మ,ఆత్మ, పరమాత్మ కనిపించకయున్నవనీ చెప్పవచ్చును. మూడు ఆత్మలను తెలియుటే నిజమైన జ్ఞానము. ఒక శరీరమును తీసుకొని చూస్తే, కనిపించుశరీరము ప్రకృతితో తయారయినది. కనిపించే ప్రకృతి శరీరములో కనిపించని జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు నివశించుచున్నవి. జీవుడుమాత్రము కర్మబద్ధుడై యుండుట వలన అతడు శక్తిహీనుడు. జీవాత్మ ఏమీ చేయలేనిదిగా యుండి, కర్మలో బంధింపబడియుండుట వలన ఆత్మయేజీవున్ని ఆడించుచున్నది. అలాగే శరీరములోని పరమాత్మ ఆత్మకంటే వేరుగాయుండుట వలన, శరీరములో జరుగు పనులకు సాక్షిగాయుంటూఏమీ చేయక యున్నది. జీవుడు కర్మ ప్రకారము చేయవలసిన పనులను ఆత్మయే చేస్తూ జీవాత్మ చేయునట్లు జీవుని భావమునుబట్టి లెక్కించుచున్నది.ఇక్కడ "జీవుడు ఏమీ చేయలేడు” అను సూత్రము (ధర్మము) నెరవేరుచున్నది. జీవుడు చేయలేడు, జీవుడు చేయుటకు చేతకానివాడు. అందువలన జీవుని కార్యముగా నిర్ణయింపబడిన కర్మను ఆత్మయే చైతన్యమై చేయుచున్నది.జీవుడు చేయని పనిని జీవుని భావమును బట్టి జీవుడు చేసినట్లో, చేయనట్లో లెక్కించబడును.


మరొక గమనింపదగిన విషయము ఏమనగా! దేవుడు ఏమయినాచేయగలడు, అయినా చేయడు. జీవుడు చేతకాక చేయడు, దేవుడు చేతనయి కూడా చేయడు. శరీరములో ఏ పనినీ చేయనివారు ఇద్దరు గలరు. వారేజీవాత్మ, పరమాత్మయని చెప్పవచ్చును. అనగా జీవుడు, దేవుడు ఇద్దరూ పని చేయరు. జీవుడు చేయను చేతకాక చేయలేడు. దేవుడు చేయుటకుచేతనయి కూడా చేయకుండాయున్నాడు. అయితే జీవుడు కర్మప్రకారము చేయవలసిన పనులను మధ్యలోయున్న ఆత్మ చేసిపెట్టుచున్నది. మధ్యలోయున్న ఆత్మ అన్ని పనులు చేయుటకు సిద్ధముగాయున్నది. అయినా ఆత్మ చేయుటకు ఏ పనియూ లేదు. అందువలన చేతకాని జీవుని పనిని,చేతనయ్యే దేవుని పనిని ఆత్మ చేయుచున్నది. ఖాళీగాయున్న ఆత్మ ఊరక యుండక ఇటు జీవుని పనిని, అటు దేవుని పనిని రెండిటినీ చేయుచున్నది.పరమాత్మ, జీవాత్మ మధ్యలో ఏ పని లేకుండా ఆత్మ యున్నది. శరీరములో దేవునికి పనియున్నది, జీవునికి కర్మను అనుభవించే పనియున్నది. దేవునికికర్మ లేదు అయినా జీవుళ్ళకు తన జ్ఞానము తెలిపే పనియున్నది. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు. అటువంటప్పుడుదేవుడే తన జ్ఞానమును తెలియ చెప్పవలసిన అవసరమున్నది. దేవునికి ప్రపంచ సంబంధ పని ఏమీ లేదు. ప్రపంచ సంబంధ ప్రతి పనిని ప్రకృతిజనితమైన మాయయే చేయుచున్నది. మనుషులను పుట్టించుట, జీవింప జేయుట, మరణింపజేయుట మొదలగు కార్యములన్నిటినీ ప్రకృతియేచేయుచున్నది. ఇంకా దేవుడు చేయవలసిన జ్ఞాన సంబంధ కార్యములను దేవుని బదులు ఆత్మయే చేయుచున్నది.


ఆత్మకు పని లేనిదానివలన తానే చైతన్యమై శరీరములోని దేవునిపనిని జీవుని పనిని చేయుచున్నది. శరీరములోని జీవుడు పనులు చేయలేడు అయినా జరిగెడి పనిని నేనే చేస్తున్నానని తాను చేయకున్నా చెప్పుకొంటున్నాడు. దేవుడు అన్నిటికీ అధిపతియైనందున తన పనిని తనవాడు చేశాడని అనుకొని మౌనముగా యుండును. జీవాత్మ, పరమాత్మల మధ్యలోయున్న ఆత్మ స్వయముగా చైతన్యమైయుండుట వలన, తన ఇష్టమొచ్చి నట్లు ప్రవర్తించి తాను ఏమి చేయాలనుకొన్నా చేయగలడు. ఆత్మ అనగా'అణిగియున్నది'. ఆత్మ అనగా ఊరకయుండునది కాదు. ఆత్మ అనగా 'అనుక్షణము పనిచేయునది' అని చెప్పబడుచున్నది. ఆత్మకు కర్మలేదు.ఆత్మ అనగా చేసునది, చేయించునది అని రెండు కార్యములు ఏక కాలములో చేయునది. ఆత్మ అనగా! ఎల్లప్పుడూ పరమాత్మతో లంకె వేయబడియున్నది.అనగా ఎల్లప్పుడూ దేవునితో కలిసి కట్టబడినది. ఆత్మ అనగా! ఎల్లప్పుడూ జీవాత్మతో లంకె వేయబడినది. అనగా శాశ్వతముగా జీవాత్మతోపాటుకలిసియుండునది అని భావము కలదు. ఇంకా చెప్పుచూ పోతే ఆత్మ యొక్క నిజస్థితి ఎంతో గలదు. త్రవ్వేకొద్దీ తెలియగలదు. కర్మతోయున్నజీవాత్మను గురించి పూర్తి చెప్పగలము. అణువణువునా వ్యాపించియున్న పరమాత్మను గురించిన జ్ఞానమునకు అంతుగలదు. అయితే శరీరములన్నిటిలో ఒకే విధముగా, ఒకే ఉద్దేశ్యముతో, ఒకే జ్ఞానముతో యున్న ఆత్మను గురించి పూర్తిగా చెప్పలేము. ఎందుకనగా! జీవాత్మ స్వభావముమరియు పరమాత్మ భావమును రెండిటినీ ఆత్మ ఒకే కాలములో కలిగి యుండును. అందువలన ఇటు పరమాత్మను తెలిసినా, ఆత్మను గురించినసత్యమును తెలియలేము. అట్లే జీవున్ని (జీవాత్మను) గురించి సంపూర్ణముగా తెలిసినా ఆత్మను గురించిన అసలయిన అనుభవమును తెలియలేము.


పరమాత్మ మరియు జీవాత్మతో ఎప్పటికీ కలిసియుండును, కనుక మధ్యఆత్మను గురించి, రెండు అనుభవములతో కూడిన అనుభవమును గురించి ఎవరూ చెప్పలేరు. భూమిమీద పుట్టిన ఏ జీవాత్మ ఆత్మను గురించి పూర్తిగా చెప్పలేదు.


ప్రశ్న :- మీరు ఆత్మను గురించి ఎవరూ చెప్పలేరు అని చెప్పుచూనేఆత్మను గురించిన రహస్యమంతయూ చెప్పుచున్నారు కదా! మీరు చెప్పిన దానితో ఆత్మను గురించిన రహస్యమంతయూ తెలియుచున్నది కదా!జవాబు :- నేను చెప్పిన దానితో ఆత్మ విషయమంతయూ అర్థమయివుంటే నీవు తిరిగి మాట్లాడలేవు. నిజము చెప్పాలంటే ఆత్మను గురించిసంపూర్ణముగా తెలిసినవారు ఎవరూ మరుక్షణమే శరీరముతో యుండక, శరీరమును వదలి మోక్షమును పొందును. మోక్షమును పొందాలంటేపరమాత్మ జ్ఞానము తెలియాలని కొందరు, దేవున్ని గురించి పూర్తిగా తెలియాలని కొందరు చెప్పుచుందురు. ఇంకా జీవుని కర్మంతయూఅయిపోయిన తర్వాత జీవుడు మోక్షమును పొందునని చెప్పుచుందురు. నాకు తెలిసిన సత్యము తెలిస్తే ఎవరూ ఆ మాటను అనరు. ఎందుకనగా!జీవుని కర్మ పూర్తిగా అయిపోవాలంటే అది జీవుని చేతిలో లేదు. అది అంతయూ ఆత్మచేతిలోనే యున్నది. ఆత్మ తనకు ఇష్టమైతేనే కర్మను పూర్తిగాదహించగలదు. లేకపోతే కర్మను సశేషము చేయుచునేయుండును. శేషము లేకుండా జీవుని లెక్క చేయువాడు ఆత్మయేనని మరువకూడదు. దేవునికిధర్మమున్నది. అయితే ఆత్మకు ధర్మము అనునదిలేదు. ఆత్మధర్మ మని బ్రహ్మవిద్యా శాస్త్రమును వెదకినా, ఏ పేజీలోనూ ఆత్మ యొక్క ధర్మముకనిపించదు. దేవుని ధర్మములు ఇవియని చెప్పవచ్చును. అయితే ఆత్మ ధర్మమిదియని ప్రపంచములో ఎవడూ చెప్పలేడు. ఎందుకనగా! ఆత్మకుధర్మములు లేవు. ఆత్మ ధర్మములకు అతీతముగా యున్నది. అందువలన భగవద్గీతా గ్రంథములో మోక్ష సన్న్యాస యోగము అను అధ్యాయమునచివరిలో 61, 62, 63, 64, 65, 66 శ్లోకములను చూచిన ఈ విధముగా గలదు చూండి. 61, 62 శ్లోకముల తర్వాత అనగా 63వ శ్లోకముతోభగవద్గీత పూర్తి అయిపోయినది. అంతవరకు ఆత్మ అణిగి తనను గురించి ఏమాత్రము బయటపడకుండా, భావములో అందరినీ తనవరకు రాకుండాచేసుకొన్నది. అయితే చివరిలో ఉన్న సత్యమును తెలిపి ముగింపు చేసినా, ఎవరి దృష్ఠి తనపైన పడకుండా అందరి దృష్టిని దేవుడయిన పరమాత్మమీదికే మళ్ళించినది. ఇప్పుడు ఈ చిన్న గ్రంథమును వ్రాయుచున్న నేను నా స్వయం రచన అయిన “త్రైత సిద్ధాంత భగవద్గీత”లో ఆరు శ్లోకములవివరమును వ్రాశాను. అయితే 61వ శ్లోకములో వ్రాసిన వివరము ఆ దినము నాకు తెలిసి, నేను అక్కడున్న సత్యమును వ్రాయక కొంత దారితప్పి వ్రాయడమైనది. అలా తెలిసి దారి తప్పించి వ్రాయవలసి వచ్చినది. నేను దారి తప్పి అయినా మీ దృష్టినంతటినీ పరమాత్మ మీదికి ప్రాకునట్లేచేశాను. అక్కడ నేను చేసినది రవ్వంత కూడా తప్పు లేదని అందరికీ తెలియగలదు. ఇక 62వ శ్లోకము యొక్క భావములో కూడా అదే పనినిచేశాను. ఇకపోతే 63వ శ్లోకములో ప్రత్యేకించి చివరిగా “రహస్యములలో కెల్ల రహస్యమైన దానిని చెప్పుచున్నానని” చెప్పి ప్రజల దృష్టిని కొంతదారిలోనికి తెచ్చి చెప్పినట్లయినది. అక్కడ ఆ మాట చెప్పిన తర్వాత వ్రాసే మేము ఎంతో మెలుకువతో వ్రాయవలసి యున్నది. అంతేకాక మిగతాచివరిలో మిగిలిన మూడు శ్లోకములను గురించి చదువువారు ఎంతో జాగ్రత్తగా చదువవలసియున్నది. ఎందుకనగా! చివరిగా రహస్యములలోనేపెద్ద రహస్యమని చెప్పియుండడము వలన భగవద్గీత గ్రంథమును చదివిన శ్రద్ధకంటే ఎక్కువ శ్రద్ధపెట్టి చూడవలసియున్నది. 64వ శ్లోకములో అప్పుడున్న శ్రద్ధకంటే మరింత శ్రద్ధను పెట్టి చూడమని రెండవమారుచెప్పాడు. ఇంతవరకు చెప్పిన సారాంశమును చెప్పుచున్నాను, నీవు నాకు ఇష్టుడవగుట వలన చెప్పుచున్నానని ఇంకా జాగ్రత్త పరచాడు. అంటేచివరిలోని రెండు శ్లోకములు ముఖ్యములలోకెల్లా ముఖ్యమైనవని అర్థమగుచున్నది. అంత ముఖ్యమైన రెండు శ్లోకములను నేను "త్రైతసిద్ధాంత భగవద్గీత”లో వ్రాయడము జరిగినది. అయితే 61, 62 శ్లోకములలో అదే పనిగా దారి తప్పించి వ్రాసినట్లు ఇక్కడ వ్రాయలేదుగానీ, 65, 66 శ్లోకములలో కొంతవరకు దారి చూపి చెప్పడమైనది. అయినా పూర్తి సత్యమును అక్కడ రెండు శ్లోకములలో కూడా చెప్పలేదు.ఇదంతయూ నాకు తెలిసి వ్రాసినదేయని ఇప్పుడు కూడా చెప్పుచున్నాను. ముఖ్యముగా చెప్పునదేమనగా! నేను చివరిలో చెప్పిన సారాంశములో ప్రజలదృష్ఠిని కొంతవరకు సత్యము వైపు మళ్ళించి చెప్పాను. దాదాపు మూడు వంతులు సత్యమును చెప్పానుగానీ, నా ధర్మమును అనుసరించి అదే పనిగా,నాలుగు వంతుల వివరములో దాదాపు మూడువంతుల సత్యమునకు దగ్గరగా తీసుకొని పోయి, ఒకవంతు మాత్రము సత్యమునకు దూరము చేశాను.

కొంత రహస్యమును రహస్యముగానే ఉండునట్లు చేశాను.


ప్రశ్న :– ఇంతవరకు మీరెంతో సత్యవంతులని మీ మాటను అన్ని విధములాఒప్పుకొను వారిలో నేనూ ఒకడిని. అయితే మీరే స్వయముగా భగవద్గీత చివరిలో ప్రజలను తప్పుదారి పట్టించానని చెప్పడమేకాక, అదే పనిగాతెలిసి తప్పు భావములోనికి పోవునట్లు చేశానని చెప్పారు. మీరు ప్రజలకు భగవద్గీత భావమును తెలియజేయాలను ఉద్దేశ్యముతో భగవద్గీతను 'సిద్ధాంతభగవద్గీత'గా వ్రాశారు. మీరు వ్రాసిన భగవద్గీత ప్రజలు చదివిన తర్వాత ఇంతవరకూ తెలియని జ్ఞాన రహస్యములు ఎన్నో తెలిసాయని సంతోష పడుచున్నారు. భూమిమీద ఎవరూ చెప్పని వివరమును మేము తెలియగలిగిజ్ఞానమార్గములో ఎంతో ముందుకు పోయామని సంతోషపడుచున్నాము. ఇంతవరకు ఇతరులకంటే మాకు తెలిసినదే ఎక్కువ అని మేము అనుకొనుచుండడగా, జ్ఞానము తెలిసినదని ఎంతో తృప్తిగా యుండగా, భగవద్గీత చివరిలో నేను పూర్తి సత్యమును చెప్పలేదని చెప్పడము మాకు విచిత్రముగాయున్నది. మేము భగవద్గీత చివరిలోని ఆరు శ్లోకములను తిరిగి జాగ్రత్తగా చూడవలసిన అవసరమున్నదని తెలిసినది. అయినా మేము అక్కడ చూచినా!మాకు ఏమి తెలియగలదు? అదే పనిగా మీరు వదలినది మాకు తెలియాలంటే తిరిగి మేము మిమ్ములను ఆశ్రయించి అడుగవలసినదే.


భూమిమీద ఎవరయినా తాను చేసిన గొప్పతనమును చెప్పుకొంటారు గానీ, ఎవరూ తాను చేసిన పొరపాట్లనుగానీ, తప్పులనుగానీ బయటికి చెప్పరు. తాను తెలియక చేసినది తప్పని తర్వాత తెలిసినాదానిని బయటకు రాకుండా జాగ్రత్తపడి చూచుకుంటారు. అయితే మీరు ఏమాత్రము దాచుకోకుండా మీరు చేసిన పొరపాటును చెప్పడము ఒకవిధముగా గొప్పతనమేయని చెప్పవచ్చును. అదియూ తెలిసి ప్రజలకు సత్యమును దాచానని చెప్పడము మరీ విచిత్రము. ఇప్పుడు మేముమిమ్ములను అడుగుచున్నది ఏమనగా! మీరు ఆ విధముగా తెలిసి ఎందుకు అలా చేశారు? అక్కడ ఎందుకు అలా చేశారో మాకు తెలియదు.

ఇప్పటికయినా మీరు సత్యమును తెలియజేస్తారని కోరుచున్నాము.


జవాబు :- మీరు చెప్పినట్లు ఎవరు తప్పు చేసినా తమ తప్పును బయటపెట్టరు. అలా చెప్పితే తమ గౌరవము తగ్గుతుందని చెప్పరు. అయితే అక్కడ నేను తప్పు చేయలేదు. నా ధర్మమును అనుసరించి ప్రవర్తించడము


జరిగినది. మీరు నన్ను ఎంత గొప్పగా భావించుకొనినా, నేను కూడాఒక జీవాత్మనే. నాకు ఆత్మ రహస్యము తెలిసినా, నా ధర్మము ప్రకారము చెప్పకూడదు. ఒకవేళ చెప్పితే నా కర్మంతయూ శేషము లేకుండా పోవును.తర్వాత మీతో మాట్లాడుటకు నేను మీ ముందర ఉండను. కావున నేను భగవద్గీత తర్వాత మీతో ప్రత్యక్షముగా మాట్లాడి చెప్పవలసిన జ్ఞానసమాచారమును ఎంతో చెప్పాలను ఉద్దేశ్యముతోనే ఆ రోజు అలా చేశానని చెప్పుచున్నాను. అయినా అది నా తప్పుకాదు, నా హద్దును దాటి నేనుప్రవర్తించలేదు. నేను చేసినది నా ధర్మము, కావున అది నా తప్పుకాదని ఈ రోజు సత్యమును చెప్పాను. ఇప్పుడు ఆ రహస్యమును మీరు చెప్పమనిఅడిగారు. మీరు అడిగినది మంచిదే. అయితే నేను ఇప్పుడు కూడా చెప్పను. అన్నీ నేను చెప్పితే మీరు వెదికేది ఏమున్నది! మీరు కొంతయినాశ్రమించాలి, కావున అక్కడ చివరి రెండు శ్లోకముల వివరమును మీకే వదలి వేయుచున్నాను. మూడు వంతులు చెప్పి ఒక వంతును మాత్రముదాచిపెట్టడము జరిగినది. ఆ ఒక్కవంతు కూడా మీరు తెలియకపోతే మీరు చేసేదేముంటుంది! నేను ఒక జీవుడుగా నావంతు జ్ఞానమునునేను చెప్పడము జరిగినది. ఇప్పటికి కూడా నా హద్దును నేను దాటను. నా ధర్మము ప్రకారము నేను నడువక తప్పదు. అందువలన ఆ చివరి రెండు శ్లోకముల వివరమును మీరే తెలియవలసియుంటుంది.


ప్రశ్న :- "మీరు జీవుడనని మమ్ములను మభ్యపెట్టి అసలయిన జ్ఞానమునుచెప్పకుండా తప్పించుకొంటున్నారు” అని మేము అనుకొంటున్నాము. మిమ్ములను మేము సాధారణ జీవునిగా భావించుకోవడము లేదు. జ్ఞానమునుసంపూర్ణముగా చెప్పుటకు భువికి దిగివచ్చిన గురువుగా లెక్కించు కొన్నాము. మీరు తప్ప మాకు జ్ఞాన రహస్యములను చెప్పువారు లేరు. అందువలన

దయచేసి భగవద్గీతలోని చివరి ఆరు శ్లోకములకు పూర్తి వివరమును

అందిస్తారని కోరుచున్నాము.


జవాబు :- మీరు ఎంత పొగిడినా నేను సాధారణ జీవాత్మనేయని నాకుతెలుసు. నేను జీవాత్మగా ఎన్నో అనుభవములను అనుభవిస్తున్నాను. నా అనుభవములను మీరు చూచినట్లయితే నన్ను జీవాత్మయని మీరే చెప్పగలరు.ప్రపంచ విషయములు నిత్య అనుభవములుగా యున్నాయి. వాటిని వదలి ప్రక్కనబెట్టి జ్ఞానమార్గములో కల్గిన అనుభవములను ఒకటి, రెండు చెప్పెదనువినుము. బహుశా 1998 చివరిలో మరియు 1999 మొదటిలో నేను త్రైత సిద్ధాంతమును ఆధారము చేసుకొని భగవద్గీతను వ్రాయడము జరిగినది.భగవద్గీతను దాదాపు మూడు నెలల కాలము వ్రాయడము జరిగినది. చివరి రోజు భగవద్గీత చివరి శ్లోకములను వ్రాయుచున్నాము. ఆ దినము చివరిఆరు శ్లోకములు వ్రాయడము జరుగుచున్నది. భగవద్గీత చివరి అధ్యాయము మోక్ష సన్న్యాస యోగము మొత్తము 78 శ్లోకములు గలవు. అయితేమేము వ్రాసిన భగవద్గీతలో చివరి శ్లోకము 66 వ దయినది. చివరిలోని ఆరు శ్లోకములు మూడు భాగములుగా చేసుకొన్నాము. 61, 62 శ్లోకములలోని భావమును అదే పనిగా దారితప్పించి వ్రాశాము. అందులో సత్యమును సూచాయగా చెప్పి మిగతా భావమును అంతటినీ దేవుని మీదికి అనగా'పరమాత్మ' మీదికి దృష్టి మరల్చి వ్రాశాము. అక్కడ 61, 62 శ్లోకముల వద్ద ఎంతో జాగ్రత్తగా వ్రాయవలసి వచ్చినది. 63, 64 శ్లోకములలోచివరిలో చెప్పు 65, 66 శ్లోకముల ప్రాముఖ్యతను గురించి చెప్పుచూ రహస్యములలోకెల్ల రహస్యమును చెప్పుచున్నానని రెండు శ్లోకములభావములలో చెప్పడమైనది. చివరి 65, 66 శ్లోకములను వ్రాయుచున్నప్పుడు మూడు వంతులు సత్యము ఒకవంతు అసత్యమును కొలత వేసి చెప్పవలసి వచ్చినది. అప్పుడు హృదయములో సంతోషమో లేక దుఃఖమో చెప్పలేము గానీ ఏదో ఉండేది. అయినా జాగ్రత్తగా ఆ రెండు శ్లోకములకు భావమునుచెప్పి భగవద్గీతను ముగించడమైనది. ఎప్పుడయితే భగవద్గీతలోని చివరి రెండు శ్లోకముల భావమును వ్రాయడము అయిపోయినదో, అప్పుడునేను ఒక జీవున్ని అయినందున ఆపుకోలేకుండా పది నిమిషముల కాలము ఏడ్వడము జరిగినది. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు. ఏదో తెలియనిఅనుభూతి నన్ను ఏడ్పునకు గురి చేసింది. 


జ్ఞాన విషయములో ఆ రోజు ఎలా ఏడ్చానో నాకు బాగా గుర్తున్నది.అప్పటికి భగవద్గీత నాకు ఏడవ రచన అనుకుంటాను. తర్వాత ఇప్పటి వరకు 68 గ్రంథములను వ్రాయడము జరిగినది. ఇప్పటికి ఈ చిన్నగ్రంథముతో మొత్తము 69 గ్రంథములు వ్రాసినట్లగును. ఈ రోజు 15-02-2016 తేదీన సాయంకాలము ఆరు గంటలప్పుడు ఆత్మనుగురించి వ్రాయునప్పుడు “బ్రహ్మవిద్యా శాస్త్రములో ఆత్మ ధర్మములను గురించి వెదకినా ఏ పేజీలో దొరకదు. దేవునికి ధర్మములున్నాయనిచెప్పవచ్చును. అయితే ఆత్మకు ధర్మములున్నవని ప్రపంచములో ఎవడూ చెప్పలేడు. ఎందుకనగా! ఆత్మకు ధర్మములు లేవు. ఆత్మ ధర్మములకుఅతీతముగా యున్నది” అని వ్రాయడము జరిగినది. ఈ వాక్యములను వ్రాసిన వెంటనే నాకు తెలియకుండానే నాలో ఏదో అనుభూతి కలిగివ్రాతను ఆపివేసి దాదాపు పది నిమిషములు ఏడ్వవలసి వచ్చినది. ఏడుపు ఎందుకొస్తున్నదో అప్పటికి తెలియకపోయినా తర్వాత నేను జీవాత్మనే కదా!అందువలన ఏదో ఒక అనుభూతి హృదయములో కలుగును కదా! అందువలన ఏడుపు వచ్చిందిలే! అని అనుకోవడము జరిగినది. 1999వసంవత్సరము ఏడ్చినది నాకు జ్ఞాపకమునకు వచ్చినది. ఆ రోజు కలిగిన అనుభూతికి నేడు కలిగిన అనుభూతికి ఏమాత్రము తేడా లేదు. అలాజరుగడము దాదాపు పదహారు సంవత్సరముల తర్వాతయని జ్ఞాపకము వచ్చినది. ఇదంతయూ జరిగిన సత్యము అయినందున నేను సాధారణజీవాత్మనేనని నేను మరచుటకు వీలులేదు కదా! మీరు ఎలా పొగడినా నేను నా కంటే పెద్దవాడిని కాలేను కదా!


ప్రశ్న :- భగవద్గీతలో మోక్షసన్న్యాస యోగమను అధ్యాయమున చివరిలోగల ఆరు శ్లోకములను ఒకమారు మాకు చెప్పవలెనని కోరుచున్నాము. జవాబు :- మీరు ఇప్పుడు అడిగినా నేను అప్పుడు చెప్పిన భావమునేచెప్పెదను తప్ప వేరు చెప్పునది ఏమీ ఉండదు. ఇప్పుడు రెండవ మారు చూచుట వలన మీలో శ్రద్ధ ఎక్కువయివుంటే అప్పటికంటే కొంత ఎక్కువభావమును గ్రహించగలరు. నేను ఇంతగా చెప్పిన తర్వాత మీరు రెండవ మారు మా భావమును చూడుట వలన ఎంతో కొంత మేలు జరుగగలదని అనుకొంటున్నాను.


భగవద్గీత 18వ అ. 61వ శ్లో॥

శ్లో॥ ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశార్జునతిష్ఠతి |

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥

(పరమాత్మ)

భావము :- సర్వజీవరాసులు శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసిఉండి, యంత్రమునెక్కి ఆడించువానివలె తన మాయచేత సర్వభూతములను ఆడించుచున్నాడు.


వివరము :- సర్వజీవరాసులు అనేక విధములుగా కదలుచూ కొన్నిఆడుచుండగా, కొన్ని పోట్లాడుచుండగా, కొన్ని రమించుచుండగా, కొన్ని పరుగిడుచుండగా, కొన్ని ఎగురుచూ, కొన్ని దుముకుచున్నవి. అట్లు నానా రకములుగా కనిపించు జీవరాసుల శరీరములలోని హృది స్థానములోపరమాత్మ నివాసముంటున్నాడు. శరీరమంతయూ నాడులచే వ్యాపించి, నాడులచే కదిలింపబడుచున్నది. నాడులకన్నిటికీ కేంద్రము మెదడు. మెదడునుండి వచ్చు ఆదేశములు నాడుల ద్వారా శరీరమంతయూ ప్రాకి శరీరమును కదిలించి, ఆడించి, పాడించి అనేకములుగా చేయుచున్నవి. మెదడునుండి ప్రసారమగు ఆదేశము లెక్కడివి? ఎవరివి? అను ప్రశ్న వేసుకొనిన, మెదడు భాగమునే హృదయమనుచున్నాము కదా! హృదయములోనేపరమాత్మ ఉన్నది. కర్మచక్రములోని కర్మానుసారము 'మాయ' అను పరికరములైన బుద్ధి, చిత్తము, మనస్సు ద్వారా ఆదేశము పంపుచూ దాని ప్రకారము నరములను లాగి శరీరమును ఆడునట్లు చేయుచున్నాడు.


యంత్రము మీద పని చేయువాడు యంత్రము మీటలను(స్విచ్లను) త్రిప్పుచూ యంత్రముచే పని చేయించినట్లు దేహారూఢుడైన (దేహమునెక్కి ఉన్నవాడైన) పరమాత్మ మొత్తము శరీరమను యంత్రములోనిమనో, బుద్ధి, చిత్తములను గుణములతో సరిచేర్చి ఉన్న కర్మప్రకారము ఆడించుచున్నాడు. పరమాత్మ శరీరమును ఆడించుటకు ఆత్మయను విద్యుత్తును, మనోబుద్ధి చిత్తములను ముఖ్య అనుబంధ మీటలను, గుణములను చక్రములను, కర్మయను పద్ధతినిఉపయోగించి కష్ట సుఖములను ఉత్పాదనలను తయారు చేయుచున్నాడు. ఈ విధానము తెలియనివారు పరమాత్మ శరీరమునునాడులచేత బొమ్మవలె ఆడించుచున్నాడని అనుకోక, అన్నిటికీ తామే కారణమని అజ్ఞానులు తలపోయుచున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రతి పని తామే చేసినట్లే అనిపించుచుండును. ఎందుకనగా! బొమ్మలాటలో బొమ్మలనుఆడించువాడు కనిపించక, బొమ్మలు కదలుట మాత్రమే అగుపించునట్లు, మనిషిచేత జరుగుచున్న కార్యములలో లోపల ఆడించు పద్ధతికానీ,ఆడించువాడుకానీ తెలియక, పైకి ఆడేవారు మాత్రము కనిపిస్తుండుట వలన, ప్రతి ఒక్కరూ తమచేత జరుగు పనులను తామే చేయునట్లనుకొనుచున్నారు. ప్రతి కదలిక ప్రతి పని నాదికాదు, నేను చేయలేదు, పరమాత్మ, ఆత్మ (బలము) చేత ఇంద్రియములు అనబడు శరీర భాగములనుకర్మప్రకారము కదిలించుచున్నాడనీ, తానందుకు కారణము కాదనీ ఎవడు తెలియునో, వాడు అహమును వదలిన వాడగుచున్నాడు. శరీరముతో ఏపని జరిగినా దానికి తాను కర్తనుకాదని తెలుసుకొను చున్నాడు. దానివలన జరుగు పనులకు వానికి సంబంధము ఏమాత్రము లేదని చెప్పవచ్చును.ఈ సూత్రము ప్రకారము ఒక శరీరము చేత లోకములోని వారందరూ చంపబడినప్పటికీ అందులోని జీవుడు హంతకుడు కాడనీ, వానికిపాపమంటదనీ చెప్పాడు.


భగవద్గీత 18వ అ. 62వ శ్లో॥

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత!

తత్త్వసాదాత్ప రాంశాస్త్రం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥

(పరమాత్మ)


భావము :- సర్వ భావములలో పరమాత్మను శరణువేడుము. ఆయన

అనుగ్రహము వలన ప్రకృతికంటే అన్యమైన శాంతిని మరియు శాశ్వతమైన

మోక్ష స్థానమును పొందవచ్చును.


వివరము :- బయటి ప్రపంచములో ఎవడెంత గొప్పదనము, హోదా కల్గి ఉన్నప్పటికీ, లోపల పరమాత్మ వలననే సర్వమూ జరుగుచున్నవని తెలిసి,అన్నిటికీ మూలకర్తయైన పరమాత్మను తనకున్న అన్ని మనోభావముల ద్వారా శరణువేడి, గొప్పగా తలచుకొని, తనదేమీలేదనీ, ఉన్నదంతాపరమాత్మదేననీ, తాను పరమాత్మ ఆడించునట్లు ఆడు ఆటబొమ్మలాంటి వాడినని తలచి, ఆయనకున్న అనేక అంశలలో ఒక అంశచేతనే సర్వప్రపంచమును నడుపగల గొప్పవాడనీ, “నేను అనుకుంటే నీవు నీవుగానే ఉంటావు, నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు.” అనువాక్యము ప్రకారము ఆయన తలచితే జీవుడు జీవుడుగానే ఉండగలడనీ, ఆయన తలచితే జీవుడు అంతటా అణువణువునా వ్యాపించి పరమాత్మయందైక్యము కాగలడనీ తెలిసి మ్రొక్కుట వలన, ఆరాధించుట వలన ఎవడైనాకాని పరమాత్మ అనుగ్రహము పొంది, ఆయన ప్రసాదించు శాంతిని పొంది, ప్రకృతికంటే అన్యమైన మోక్షమును (పరమాత్మను) పొందగలడు.


భగవద్గీత 18వ అ. 63వ శ్లో॥

శ్లో॥ ఇతితే జ్ఞాన మాఖ్యాతం గుహ్యాదుహ్యతరం మయా |

విమృణ్యైత దశేషేణ యధేఛ్ఛసి తధాకురు ॥ (జ్ఞానము)



భావము :- రహస్యములలోకెల్ల అత్యంత రహస్యమైన జ్ఞానమును నీకునేను చెప్పితిని. దీనిని శేషము లేకుండా వివరించుకొని చూచి ఎట్లు నీకిష్టమో అట్లు చేయుము.


వివరము :- ఇంతవరకు భగవంతుని చేత చెప్పబడిన జ్ఞానము చాలారహస్యమైనది. ఒక విధముగా విప్పి చెప్పినా అర్థముకానిది. పరమాత్మకు తప్ప ఎవరికీ తెలియనిది. పరమాత్మ ద్వారా విన్నప్పటికీ కొందరికి అర్థముకాక రహస్యముగానే ఉండును. కావున రహస్యములలోకెల్ల రహస్యమైనదని చెప్పవచ్చును. ఇంతటి గొప్ప జ్ఞానము తెలియవలెననిన, ఎన్నో జన్మలుజ్ఞానసంబంధ సుకృతముంటేనే సాధ్యమగును. లేకపోతే ఈ జ్ఞానము మీ దగ్గరికే రాదు. ఒకవేళ ఈ వివరములు దగ్గరికొచ్చినా చదువువారేదూరమగుదురు. ఇంత వివరముగా చెప్పబడినదియు హద్దులు గీచి చూపిన గీతను ఎవరైనా వినినా, చదివినా అంతటినీ విశధీకరించి బాగా యోచించిఎట్లు మీకిష్టమో అట్లే నడుచుకోవచ్చును. భగవంతుడు తెల్పెడి జ్ఞానము నంతటినీ తెల్పి, ఎవరినీ ఇట్లే నడుచుకోమని బలవంతపెట్టక నీ ఇష్టమన్నాడు.జ్ఞానము కర్మాతీతమైనది. జ్ఞానము కర్మనుబట్టి నిర్ణయింపబడి నీకు అంటునది కాదు. జ్ఞానము శ్రద్ధానుసారము లభ్యమగునది. శ్రద్ధ ఎవరిఇష్టానుసారము వారికి పుట్టునది. స్వయముగా పుట్టునది (స్వయంభూ) శ్రద్ధ అయిన దానివలన నీ ఇష్టమని చెప్పాడు.


భగవంతుడు జ్ఞానము అజ్ఞానము అనియూ, ప్రకృతి పరమాత్మఅనియూ, మాయ ఈశ్వరుడు అనియూ రెండు మార్గములు సూచించి నీవు ఏ మార్గములో పోతావో పొమ్మన్నాడు. ఆయన మన మీదనే బాధ్యతఉంచినప్పటికీ, నిజ జ్ఞానము తెలిసినవాడు 'నేను' అను అహమును పొందక, నా ఇష్టమని మోహమునబడక, సర్వమూ పరమాత్మయేనని నమ్మిభక్తి నంతయూ ఆయన మీదనే చూపుచూ శరణుపొందిన, ఆయన మరియు ఆయన జ్ఞానము సులభముగా అర్థమగును. అటువంటి శరణ్యము లేకుండానా బుద్ధిని ఉపయోగించి జ్ఞానము తెలుసుకొంటాననుకోవడము కూడా పొరపాటే. అట్లు పరమాత్మ జ్ఞానము తెలుసుకొనుటకు చాలా కాలముపట్టును. శరణువేడిన వానికి తొందరగా జ్ఞానము లభ్యమగుటయే కాక జన్మలోనే మోక్షము దొరుకును.




భగవద్గీత 18వ అ. 64వ శ్లో॥

శ్లో॥ సర్వగుహ్యతమం భూయ శ్శృణు మే పరమం వచః |

ఇఫ్రో సిమేదృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ॥ (గీతా సారాంశము)


భావము :- సర్వ రహస్యములలో ఉత్తమమగు పరమవచన సముదాయ

మును మరల వినము. నీవు నాకు మిగుల ఇష్టుడవగుటచే హితము కోరి

చెప్పుచున్నాను.


వివరము :- వాస్తవానికి ముందు చెప్పిన 63వ శ్లోకముతోనే భగవద్గీతఅయిపోయినప్పటికీ నిజానికి మన హితము కోరి గీత యొక్క సారాంశమును రెండు శ్లోకముల రూపముగా భగవంతుడు చెప్పాడు.వాటికంటే ముందున్న ఈ శ్లోకములో నీవు నాకు ఇష్టుడవనీ, నీ మేలు కోరియని చెప్పడము విశేషము. పరమాత్మ ఎందుకూ పనికిరాని మనలనుగొప్పగా గుర్తించి అలా చెప్పాడంటే ఆయనలోని గొప్పతనమేమిటో చెప్పనలవికాదు. ఆయన అంతగా చివరిలో మన మీద శ్రద్ధవుంచి చెప్పిన గీత మొత్తము సారాంశమేదో క్రింద చూచెదము.


భగవద్గీత 18వ అ. 65వ శ్లో॥

శ్లో॥ మన్మనా

భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే ॥ (గీతా సారాంశము)


భావము :- నన్ను నీ మనుస్సున తలంపుము. నీవు నా భక్తునిగాఉండుము. నన్నే పూజించుము. నన్నే నమస్కరింపుము. నన్నే పొందగలవు. ఇది సత్యము. నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి

చెప్పుచున్నాను.


వివరము :- ఎవడైతే పరమాత్మను మనసులో తలచుచుండునో, పరమాత్మకుభక్తునిగా ఉంటూ ఆయననే పూజించి, నమస్కరించుచున్నాడో వాడు పరమాత్మనే పొందగలడు. వాడే పరమాత్మకు మిక్కిలి ప్రియుడు.మాట నిజము. అంత గొప్ప పరమాత్మకు ఇంత చిన్నవాడు ప్రియుడా! అను అనుమానము పెట్టుకోవలసిన అవసరము లేదు. ఎందుకనగా!

పరమాత్మయే స్వయముగా ప్రతిజ్ఞ చేసి చెప్పాడు.


పరమాత్మ నిరాకారముగా ఉన్నప్పుడు కానీ, లేక పరమాత్మ సాకారరూపమున ఉన్నప్పుడుకానీ ఆయన మీదే భక్తి, ఆయన మీదే ఆరాధన, ఆయన మీదనే నమస్కారము, ఆయన మీదనే మనోధ్యాస కల్గియుండడమేమహాభాగ్యమగును. వాని పద్ధతే వానిని పరమాత్మునికి ప్రియుని చేసి ఆయన సన్నిధికి చేర్చును. ఇది ఎంతో గొప్ప సారాంశమైన సందేశము.


భగవద్గీత 18వ అ. 66వ శ్లో॥

శ్లో॥ సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || (గీతా సారాంశము)


భావము :- సర్వ ధర్మములను సంపూర్ణముగా వీడి నన్ను మాత్రమే నీవు

శరణుకోరుము. నిన్ను పాపనియచంబులో నుండి ముక్తుని చేతును.

దుఃఖింపకుము.


వివరము :- భగవద్గీత అంతయూ ధర్మములు బోధించి, వాటిచేతనే


కర్మయోగము, బ్రహ్మయోగమును సూచించి, ఆ రెండు యోగముల ద్వారాకర్మను నాశనము చేసుకొని మోక్షము పొందమని తెలిపిన భగవంతుడు, గీత మొత్తము సారాంశములో ఇంతవరకు చెప్పిన యోగధర్మములను వీడినన్నే శరణు పొందమన్నాడు. రెండు యోగ పద్ధతులు పరమాత్మను చేర్చు మార్గములు కాగా, చివరిలో చెప్పిన సారాంశములో "సూక్ష్మములోమోక్షమని” చాలా దగ్గర దారిలో పరమాత్మను చేరు ఉపాయమును చెప్పాడు. గీతా సారాంశమైన రెండు శ్లోకములలో ముందు చెప్పినది పరమాత్మసాకారముగా ఉన్నప్పుడే కాక, నిరాకారముగ ఉన్నప్పుడు కూడా ఆచరించవలసిన భక్తి మార్గమును బోధించగా, ఇక్కడ చివరి మాటగాపరమాత్మ కేవలము సాకారముగా లేక భగవంతునిగ సాధారణ మానవ ఆకారములో ఉన్నప్పుడు, ఏ గుర్తింపులేనివాడై కనుగొనుటకు కష్టమైనపుడుకనుగొన్నప్పటికీ, కొద్దిఅనుమానమున్నా, దానిని పెద్దది చేసి తనకు దూరముగా పంపు సాకారమును అతి కష్టము మీద తెలిసి, అనుమానము లేని భక్తిగలవారికి చెప్పిన మాటలని గ్రహించాలి.


సాక్ష్యాత్తూ పరమాత్మ అయిన సాకారమును కనుగొన్నవానికిధర్మములతో కూడా పనిలేదు. గీత పొడవునా విన్న ధర్మములను కూడా వదలి గీత చివరిలో పరమాత్మను భగవంతునిగా శరణు పొందిన వానిని,ఆయన వాని కర్మనంతటినీ క్షమించి లేకుండా చేసి, తనయందే చేర్చుకొనును. రెండు యోగముల ద్వారా కొన్ని జన్మల వరకు అయిపోని కర్మ, మూడవదైనభక్తియోగముతో ఒకే జన్మలో అయిపోయి ఆ జన్మలోనే పరమ తండ్రి, పరలోక రాజ్యాధిపతి అయిన పరమాత్మను చేరవచ్చును. కర్మయోగము,బ్రహ్మయోగముల ద్వారా కర్మ కాలిపోవలసి వున్నది. కానీ చివరిలో చెప్పిన భక్తియోగములో జ్ఞానాగ్ని లేదు, యోగ సాధన లేదు, యోగి కృషి లేదు.కేవలము శరణు వేడి తన్నుతాను పూర్తి సమర్పించుకొని తాను శూణ్యముగా నిలిచిపోవడమే. అంతమాత్రముననే భయంకర కర్మలన్నీ నిష్ఫలమైపోవును. పరమాత్మయే స్వయంగా కర్మలన్నిటినీ క్షమించివేసి తనవద్దకు చేర్చుకొనును.


ప్రశ్న :- సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా సూర్యుడు జ్ఞానమును విన్నాడని

అన్నారు కదా! ఇంతవరకు మీరు చెప్పిన సమాచారము సంపూర్ణముగా

సూర్యునికయినా అర్థమయినదా?


జవాబు :- సూర్యుడు గ్రహములలో పెద్ద గ్రహము అయినా ఆయనకూడా ఒక జీవుడే. దేవుడు చెప్పిన జ్ఞానమును అందరికంటే ఎక్కువగా, అందరికంటే బాగా గ్రహించుకొన్నవాడు సూర్యుడే. అయితే భగవద్గీతచివరి ఆరు శ్లోకములను వ్యాసుడు వ్రాశాడు. సూర్యుడు విన్నప్పుడు ఆయనకు తెలిసిన జ్ఞానము భగవద్గీతగా లేదు. సూర్యుడు భూమిమీదచెప్పిన తర్వాత అది భగవద్గీతగా వ్రాయబడినది. సూర్యుడు మొదట జ్ఞానమును విన్న తర్వాత దానిని కొన్ని సంవత్సరములు నెమరు వేసుకొనిదేవుడు చెప్పిన జ్ఞానములోని సంపూర్ణ భావమును తెలియగలిగాడు. సూర్యుడు పెద్ద గ్రహము అయినందున ఆయన మొదట అంతా తెలియకున్నా, కొన్ని సంవత్సరములు నెమరు వేసుకొని చూచుట వలన, ఆయనకు దైవజ్ఞానము సంపూర్ణముగా అర్థమయినది. సూర్యునకు అర్థమయినతర్వాతనే ఆయన అందరికీ తెలిపాడు. తనతో పాటు ఆకాశములో యున్న అన్ని గ్రహములకు, భూతములకు జ్ఞానమును తెలియజేయడమైనది.అప్పుడే మహాజ్ఞానియైన జిబ్రయేల్ గ్రహము కూడా జ్ఞానమును సంపూర్ణముగా తెలియగలిగింది. కొన్ని సంవత్సరముల తర్వాత భూమిమీదతెలుగు భాషయున్నప్పుడు, సూర్యుడు దక్షిణ భారతదేశమున జ్ఞానమును తెలుపడమైనది. సూర్యుడు తెలిపిన జ్ఞానమునే కృష్ణుడు ద్వాపర యుగమున అర్జునునికి చెప్పగా, ఆ సమాచారము అంతటినీ వ్యాసునిచే భగవద్గీతగ్రంథముగా వ్రాయబడినది. జిబ్రయేల్ గ్రహము భూమిమీద గల ముహమ్మద్ ప్రవక్తగారికి సూర్యుడు చెప్పిన జ్ఞానమునే చెప్పగా, తర్వాత అదే జ్ఞానమే అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథముగా తయారైనది.


సూర్యుని వలన సృష్ట్యాదిలో ఆకాశము చెప్పిన జ్ఞానము క్రిందప్రపంచమంతా వ్యాపించగా, పైన విశ్వాంతరాళము వరకు వ్యాపించినది. సూర్యుడు సంపూర్ణ జ్ఞానమును గ్రహించినవాడై దక్షిణ భారత దేశమునతన జ్ఞానమును మనువు అను వ్యక్తికి చెప్పిపోవడము జరిగినది. అయితే ఆ రోజులలో భూమిమీద ఏర్పడిన భాష ఒకటే ఒకటి. ఆ ఒక్క భాషకుపేరు లేదు. రెండవ భాషయే భూమిమీద లేనప్పుడు అప్పుడున్న భాషకు పేరు పెట్టవలసిన అవసరము ఆనాడు ఏర్పడలేదు. అయితే సూర్యుడు15 కోట్ల కిలోమీటర్ల దూరమునుండి వచ్చి జ్ఞానమును చెప్పి ఆ భాషకు సూర్యుడే పేరుపెట్టి పోయాడు. సూర్యుడు దేవుని జ్ఞానమును బాగాగ్రహించినవాడు, గనుక తాను మాట్లాడిన భాష పేరు కూడా జ్ఞానముతో కూడుకొని యుండవలెనని తలచినవాడై, జ్ఞానమునకు గుర్తుగా యుండునట్లుపేరును ఉంచడము జరిగినది. నేడు మనము మాట్లాడు భాష తెలుగు భాషయని అందరికీ తెలుసు. అయితే భాషకు “తెలుగు” అని పేరుపెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు. నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే అని తెలియవలెను. సూర్యుడు జ్ఞానమును చెప్పిభాషకు పేరుపెట్టిపోయిన తర్వాత, సూర్యునకు తెలుగు భాషలో పేర్లు పెట్టబడినవి. మొదట భూమి మీద జ్ఞానమును తెలిపినవాడు సూర్యుడేకనుక ఆయనకు 'ఆదిత్యుడు' అని పేరు వచ్చినది. ఆదిత్యుడు అని చెప్పగా తెలుగు భాషలో మొదటి గురువని అర్థము. ప్రపంచములోని ప్రజల అందరికీ మొదటి గురువు సూర్యుడేయని తెలుపు నిమిత్తము“ఆదిత్యుడు” అను పేరును సూర్యునకు మనువే నామకరణము చేశాడు. తర్వాత చాలా పేర్లు సూర్యునకు తెలుగు భాషలోనే తయారయినవి.


ప్రశ్న :- ఈనాడు మనము చెప్పుకొను “తెలుగు” అను పదము సూర్యుడుపెట్టిన పేరని ఎవరికీ తెలియదు. భూమిమీద ఇంకాకొన్ని భాషలు వచ్చినప్పుడు వాటికి పేర్లు పెట్టడము జరుగుచుండును కదా! అలా వేరేభాష భూమిమీద తయారయిన తర్వాత మొదటి భాషయిన దానికి తెలుగు అని పేరు పెట్టారని అనుకుంటాను. అలా కాకుండా రెండవ భాషలేనప్పుడే మొదటి భాషకు పేరు పెట్టారా?


జవాబు :- భూమిమీద ఏదీ రెండవ భాషలేనప్పుడే మొదటి భాషయినదానికి సూర్యుడు తెలుగు భాషయని పేరు చెప్పాడు. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. మొదటి భాషలోనూ సూర్యుడు (ప్రకాశించువాడు), రవి (కాల్చువాడు), ఆదిత్యుడు (మొదటి గురువు) అయినవాడు, ఆకాశములో నివసించువాడు, దైవజ్ఞానమును మొదట గ్రహించిన వాడుఅయిన సూర్యుడు మొదట మాట్లాడిన భాష అయినందున, అది జ్ఞానముతో కూడుకొనియుండు పేరునే సూర్యుడు భాషకు గుర్తుగా పెట్టడము జరిగినది.అయితే కొన్ని యుగముల పర్యంతము పైన సూర్యుడున్నా, క్రింద ఆయన పేరు పెట్టిన భాషయున్నా, సూర్యుడు పెట్టిన పేరిదియని ఎవరికీ ఇంతవరకుతెలుగు భాషకు పేరుపెట్టిన వాడు సూర్యుడుయని కూడా ఎవరికీ తెలియదు. పేరు పెట్టినవాడు పైన, పేరుపెట్టబడిన భాష క్రిందయున్నా, పేరుపెట్టినవాడు మొదటి గురువయినా, పేరుపెట్టబడిన భాష పెద్ద అర్థముతోయున్నా, ఆదిభాష అయినా, ఇటు భాష విషయముగానీ, తెలియదు.


అటు సూర్యుని విషయముగానీ ఏమాత్రము తెలియకుండాపోయినది.ఇప్పుడు పైనగల ఆదిత్యుని గురించి తెలియకపోయినా, క్రిందగల ఆదిభాష అయిన తెలుగు భాషను గురించి తెలుసుకొందాము.


మనిషికి ప్రకృతితో తయారయిన శరీరముండగా, శరీరములోమూడు ఆత్మలు నివసించుచున్నవి. అవియే భగవద్గీతలో క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని చెప్పబడినాయి. ఇంజీలుగ్రంథములో కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మయని ముగ్గురుగా చెప్పబడ్డారు. చివరి దైవగ్రంథమయిన ఖుర్ఆన్ఘయందు త్రోలబడేవాడు, త్రోలేవాడు,సాక్షిగా చూస్తూయుండేవాడు అని ముగ్గురుగా చెప్పబడ్డారు. మూడు దైవగ్రంథములలో మూడు మతముల వారు చదువుచుండినా ఈ ముగ్గురుదైవజ్ఞానమునకు ముఖ్యమైన సూత్రధారులు అని తెలియలేక పోయారు. ఆధ్యాత్మిక విద్యయంతా ఈ మూడు ఆత్మల చుట్టూ తిరుగుచుండును. ప్రపంచములోని జ్ఞానమునకు మూడు ఆత్మలే ఆధారము. హిందూ మతములో దేవుడు మూడవ పురుషుడుగా చెప్పబడుచున్నాడు. క్రైస్తవములో పరిశుద్ధాత్మయను మూడవ ఆత్మయే దేవునిగా యున్నది. ఇస్లామ్ మతములో అల్లాహ్ అని చెప్పబడు దేవుడు మనుషుల శరీరములోనే సాక్షిగాయున్న వాడేనని వారికి కూడా తెలియదు.


హిందువులయినవారు పరమాత్మయనీ, లేక దేవుడనీ చెప్పబడుమూడవ ఆత్మ (మూడవ పురుషుడు) మానవ శరీరములోనే యున్నాడని తెలియక బయట దేవున్ని వెదకుచున్నారు. నీవు వెదకుచున్న దేవుడుఅయిన పరమాత్మ, వెదకుచున్న నీవు ఇద్దరూ శరీరములోనే యున్నారని ఆదిత్యుడు మొదటనే చెప్పియున్నాడు. ఎక్కడయినా ఒకరున్నప్పుడు అతనిని ఏకవచనముగా వాడు, వీడు అని చెప్పుదుము. వారు, వీరు అని అనము.వారు, వీరు అని అంటే బహువచనమగును. మన శరీరములో జీవుడు ఏకవచనముగా అనగా ఒక్కడుగానే ఉన్నానని అజ్ఞానముచేత అనుకోవడముజరుగుచున్నది. వాస్తవముగా జీవుడు ఒక్కడు శరీరములో ఏకముగా లేడు. జీవునితోపాటు ఆత్మ, పరమాత్మ ఇద్దరున్నారు. మొత్తము శరీరములోముగ్గురు బహువచనముగా చెప్పబడుచున్నారు. ఎక్కడయినా బహు వచనముగా పదము చివర "లు" అను అక్షరమును ఉంచుదుము.'ఉరుము' అనునది ఏకవచనమగును. 'ఉరుములు' అనునది బహువచన మగును. మొదట ఏకవచనమయిన 'ఉరుము' అను పదమునకు ఒక్క'లు' అను అక్షరమును కలిపితే అది బహువచనముగా మారిపోవును. గుడ్డ ఏకవచనముకాగా, గుడ్డలు బహువచనమగుచున్నది. అలాగే 'కర్మ'అనునది ఏకవచనము కాగా 'కర్మలు' బహువచనమగును. ఒక్క ‘లు’ చేరడము వలన బహువచనముగా మారిపోవుచున్నది.


ఏకవచనము బహువచనము( పట్టిక 43 పేజీ లో  చూడండి).


ఈ విధముగా చెప్పుచూ పోతే ఒక్క 'లు' అను అక్షరముతో ఏక వచనము బహువచనముగా మారిపోవుచున్నది.


ప్రశ్న :– ఇంతవరకు తియ్యని జ్ఞానమును చెప్పి, ఇంకా ఎంతో జ్ఞానమునువింటామని మమ్ములను నోరు ఊరించి ఒక్కమారు గొడ్డుకారము పెట్టినట్లు, ఒక్కమారుగా ఎంతో పెద్ద జ్ఞానమును వీడి, క్రిందికి వచ్చి బడిలో చెప్పినట్లుఏకవచనము, బహువచనములు చెప్పుచున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పదములకంటే ఏకవచనములు, బహువచనములు మాకు ఇంకా ఎక్కువతెలుసు. ప్రపంచ చదువు వలన మాకు సంతోషము కలుగదు. మాకు కావలసినది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానమయిన ఆధ్యాత్మిక విద్యనే చెప్పండి.ప్రపంచ విద్యలలో విసిగియున్నాము. మాకు కావలసినది పరమాత్మ విద్య అయిన బ్రహ్మవిద్యను గురించే చెప్పమని ప్రార్థించుచున్నాము.


జవాబు :- నీకు దైవజ్ఞానము మీద శ్రద్ధయుందో లేదో చూస్తామని ఏకవచనము బహువచనము అని చెప్పాను. నీవు దైవజ్ఞానమే కావాలని కోరుకొంటున్నావు, కావున బ్రహ్మవిద్య అయిన దైవజ్ఞానమునే చెప్పెదనువినుము. నీ శరీరములో నీవు అనబడు జీవాత్మవు నివసించుచున్నావు. నీతో పాటు ఇంకా ఇద్దరుకలరని మూడు దైవగ్రంథములలో చెప్పారు.వారే ఆత్మ, పరమాత్మయని పిలువబడుచున్నారు. దేవుడు సృష్ట్యాదిలో ఒక ప్రకృతిగా, మూడు ఆత్మలుగా విడిపోయాడని చెప్పుకొన్నాము. ప్రకృతి శరీరముగా తయారుకాగా, మూడు ఆత్మలు శరీరములో ఉన్నాయి. అయితేప్రతి మనిషి జ్ఞానము తెలియనివాడై శరీరములో తాను ఒక్కడేయున్నట్లు అనుకొనును. తనను ఒక్కనిగానే శరీరములో యున్నట్లు అనుకోవడమువలన తాను ఏకవచనములోనికి మారిపోవుచున్నాడు. శరీరములో తాను బహువచనముగా యున్నాననీ, తనతోపాటు ఇంకా ఇద్దరున్నారనీ తెలియగలిగితే అతడు జ్ఞానియగును. అలా జ్ఞాని అయితే వాని కర్మ గతులు మారిపోవును. ఇదంతయూ బ్రహ్మవిద్యలో యుండే విధానమే.ఏకవచనమును బహువచనముగా మార్చగలుగు సత్తా “లు” అను అక్షరము నకు కలదని తెలియునట్లు పైన కొన్ని ఏకవచన పదములకు ఒక్క 'లు'ను కలిపి బహువచనముగా మార్చివేశాము. ఏకవచనమును బహు వచనముగా మార్చగల శక్తిగల 'లు' అను అక్షరమును సూర్యుడు మాట్లాడినభాషలో యుండునట్లు చేసి ఆ దినమున్న భాషకు “తెలుగు” అని పేరు పెట్టాడు. 'తెలుగు' అను మూడు అక్షరములలో ఎంతో జ్ఞాన అర్థముండు నట్లు సూర్యుడు 'తెలుగు' అను పేరును పెట్టాడు.


ప్రశ్న:- ఏకవచనమును బహువచనముగా మార్చుటకు 'లు' కు శక్తియున్నదని చెప్పారు కదా! పైన మీరు చెప్పిన బహువచన పదములలో 'లు' అను అక్షరము పదము చివరిలో యున్నది. పదము చివరిలో యుంటే ఏదయినాబహువచనము కాగలదు. అయితే 'తెలుగు' అను పేరులో ఏమి గొప్పతన మున్నదో మాకు అర్థము కాలేదు. 'లు' బహువచనముగా ఎవరినిమార్చినదో? మధ్యలో యుంటే బహువచనమెలా అవుతుంది? ఈ 'తెలుగు' అను పదములో ఏమి జ్ఞాన అర్థముగలదో మాకు అర్థమగునట్లు దయచేసి తెలుపగలరని కోరుచున్నాను.



జవాబు :- ప్రపంచ విషయములోని పదములకు దైవ విషయములోనిపదములకు అర్థము వేరువేరుగా యుండును. దైవికముగా అర్థమును తెలియుటకు ప్రయత్నిస్తే పూర్వము సూర్యుడు తాను తెలిపిన బోధలోదేవుడు మూడు విధముల, మూడు ఆత్మలుగా విభజించాడని తెలియునట్లు, మొదట తాను (సూర్యుడు) మాట్లాడిన భాషకు “తెలుగు” అని పేరుపెట్టాడు. 'తెలుగు'లో మూడు అక్షరములు గలవు. అలాగే దేవుని భాగములో మూడు ఆత్మలు గలవు. ఒకటి పరమాత్మ కాగా, రెండవది ఆత్మకాగా,మూడవది జీవాత్మగా యున్నది. జ్ఞానము తెలియని మనుషులకు జీవాత్మ ఒక్కటే తెలియును. పరమాత్మ, ఆత్మ శరీరములోనే యున్నారను విషయముఅజ్ఞానులకు తెలియదు. సూర్యుడు చెప్పిన మాట ప్రకారము మనిషి శరీరములో మూడు ఆత్మలు గలవను జ్ఞానమునకు గుర్తుగా, మూడుఅక్షరముల పేరును, తాను చెప్పిన భాషకు 'తెలుగు' అను పేరు పెట్టడము జరిగినది. తెలుగు పదము చివరిలో 'గు' అను అక్షరము జీవాత్మకుగుర్తుగా గలదు. తెలుగు అను పేరులో మొదటి అక్షరము 'తె' అనునది పరమాత్మకు గుర్తుగా యున్నది. తెలుగు పదములో మధ్య అక్షరము 'లు’అనునది కలదు. అయితే 'లు' అను అక్షరము శరీరములోని మధ్యాత్మకు గుర్తుగా ఉంచబడినది. జీవుడు ఒకవైపు దేవుడు మరొకవైపు ఉండగా వారి ఇరువురినీ కలిపి లు అను అక్షరము బహువచనము చేయుచున్నది.


తెలుగు పదములో దేవుడు అను ఏకవచనమును, జీవుడనుఏకవచనమును కలుపుచూ ఆత్మ ఇద్దరితో సంబంధపడియుండి, రెండు ఆత్మలను కలిపి బహువచనము చేయుచున్నది. పరమాత్మకు గుర్తుగాయున్న 'తె' ను, జీవాత్మకు గుర్తుగాయున్న 'గు' ను కలుపు ఆత్మకు గుర్తుగా యున్న “లు” అను అక్షరమును తీసుకొని 'తెలుగు' పదముగా చెప్పారు.పరమాత్మకు గుర్తు “తె” అనియూ, ఆత్మకు గుర్తుగా “లు” అనియూ, జీవాత్మకు గుర్తుగా “గు” అను అక్షరమును చెప్పుచూ మూడింటినీకలిపి “తెలుగు” అని పలుకడములో జ్ఞానము ఇమిడియున్నట్లు సూర్యుడు బాగా ఆ పేరును ఎన్నుకొన్నాడు. శరీరములో ఇటు పరమాత్మ తోనూ,అటు జీవాత్మతోనూ ఆత్మ సంబంధము కల్గియున్నది. రెండు ఆత్మలతో అనుసంధానముగా యున్న ఆత్మ, ఏకముగా యున్న జీవుని, ఏకముగాయున్న దేవున్ని కలిపి మూడు ఆత్మలుగా బహువచనముతో చెప్పునట్లు చేయుచున్నది.


శరీరములో పని చేయలేని జీవాత్మతో కలిసి తోడుగాయుండి జీవునిపనినంతటినీ ఆత్మే చేయుచున్నది. అలా చేయడమును ఆత్మ చాలా గోప్యముగా పెట్టుచూ తాను ఏమీ చేయనట్లుండుట వలన జరిగెడి పనినిజీవాత్మయే చేసినది అని అందరూ అనుకోవడము జరుగుచున్నది. శరీరములో ఆత్మ జీవుని పనిని చేసినా, అది జీవునికి కూడా తెలియనిదానివలన జీవుడు కూడా జరిగిన పనిని తానే చేశానని అనుకొంటున్నాడు. ఆత్మ శరీరములో అణిగి యుండి ఎవరికీ తెలియని దానివలన, ఆత్మనుఎవరూ గుర్తించలేక పోవడమేకాక, ఆత్మ పనిని కూడా ఎవరూ గుర్తించలేక పోవుచున్నారు. సూర్యుడు దైవజ్ఞానమును తెలియజేసినప్పుడు, ఆత్మనుఎవరికీ తెలియనట్లు, శరీరములోని జీవునికి కూడా తెలియనట్లు, జీవునికి దేవునికి మధ్యలో తెలియకుండాయుండునట్లు చేశాడు. ఆత్మ అటుదేవునితోనూ ఇటు జీవునితోనూ రెండువైపులా రెండు ఆత్మలతో కలిసియున్నదని తెలియుటకు రెండు కొమ్ములున్న “లు” అను అక్షరమును'తె' కు, 'గు' కు మధ్యలో సూర్యుడు వుంచి 'తెలుగు' అని చెప్పాడు. 'లు’ కు రెండు చేతులులాగా రెండు కొమ్ములు ఉండుట వలన, ఒక చేతితో పరమాత్మను, ఒక చేతితో జీవాత్మను పట్టుకొని యుండు మూడక్షరముల 'తెలుగు' పదమును క్రిందగల పటములో చూడవచ్చును.


పటము 47 పేజీ లో  చూడండి .


ఇప్పుడు ‘లు' అంటే ఏమిటి? అను ప్రశ్నకు 'లు' అంటే “ఆత్మ”యనితెలిసినది. ఇక్కడ 'తెలుగు' అను మూడక్షరముల పేరును మొదటి భాషకు నామకరణము సూర్యుడు చేశాడు. మూడు ఆత్మలకు గుర్తుగా 'తెలుగు'అను మూడు అక్షరములను గుర్తించి చెప్పడమైనది. పైన గల చిత్రపటమును చూచిన తర్వాత 'తె' అను పరమాత్మతో 'లు' అను ఆత్మ కొంత కలిసియున్నట్లుతెలియడమే కాక, ప్రక్కనే గల జీవాత్మతో అంటీ అంటక ప్రక్కనేయున్నట్లు తెలియుచున్నది. పరమాత్మలో కొంత తగులుకొనియున్న ఆత్మ జీవాత్మతోపూర్తి అంటుకోక జీవాత్మ ప్రక్కనే యున్నదని తెలిసినది. పరమాత్మకు, జీవాత్మకు మధ్యలో ఆత్మయుండుట వలన ఆత్మను మధ్యాత్మయని కూడాఅనవచ్చును. పరమాత్మకు, జీవాత్మకు అంటుకొనీ అంటుకోక దగ్గరగా యుండుట వలన, మధ్యాత్మను అనుసంధాన ఆత్మయని అనవచ్చును.ఆత్మను మూడు దైవగ్రంథములలో చెప్పియున్నా, ఆత్మయను పేరుతో ఎవరూ చెప్పకుండా ఆత్మ మాయ చేసినది. ఆత్మయొక్క అసలు సిసలుపేరు 'ఆత్మ' అయినా 'మధ్య దైవగ్రంథములో తండ్రియని' చెప్పబడినది. 'చివరి దైవ గ్రంథములో త్రోలేవాడనీ, దూతయనీ' చెప్పబడినది. 'ప్రథమదైవగ్రంథములో ఆత్మను ఆత్మనియే' చెప్పారు, అయినా ఎవరూ ఆత్మను ఆత్మగా కాకుండా అటు పరమాత్మగానో, ఇటు జీవాత్మగానో లెక్కించారు

తప్ప మధ్య ఆత్మగా ఎవరూ గుర్తించలేదు.


భగవద్గీతలో ఆత్మను గురించి అనేకమార్లు చెప్పడము జరిగినది.ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో ఆత్మయొక్క సమాచారమును అనగా ఆత్మను గురించి, ఆత్మయను పదమును ఉపయోగించి చెప్పినది మొత్తముపదహారుమార్లు గలదు. సాంఖ్యయోగములో 55వ, మరియు 64వ శ్లోకములలోనూ, కర్మయోగములో 17వ శ్లోకములోనూ, జ్ఞానయోగములో27వ మరియు 41వ శ్లోకములలోనూ, ఆత్మసంయమ యోగములో 5, 10, 18, 25, 26, 32వ శ్లోకములలోనూ, రాజవిద్యా రాజగుహ్యయోగములో 34వ శ్లోకములో, విశ్వరూప సందర్శన యోగమున 3వ శ్లోకములో, దైవాసుర సంపద్విభాగ యోగమున 17వ శ్లోకములోనూ,మోక్ష సన్న్యాస యోగమున 16, 37వ శ్లోకములలోనూ ఆత్మయను పేరును చెప్పడమైనది. మొత్తము పదహారుమార్లు ఆత్మయను పదము వచ్చినా,(చెప్పినా) అక్కడ ఆత్మను ఆత్మగా ఎవరూ గుర్తించలేదు. ఆత్మను జీవాత్మ అనియో, ఆత్మను పరమాత్మ అనియో గుర్తించగలిగారు, అదే వ్రాసుకొన్నారు.చాలా సందర్భములలో ఆత్మను మనస్సుగా కూడా చెప్పుకొన్నారు. మూడు దైవ గ్రంథములలో ఆత్మయొక్క ప్రస్థావన వచ్చినా, అక్కడ ఆత్మను వేరుగాతలచుకోవడము జరిగినది, అలాగే జరుగుచున్నది. అందువలన దేవుడు ఆత్మను గురించి తెలిపినా, మనిషి తెలుసుకొనే స్థితిలో లేడు. అందువలన భూమిమీద ఇంతవరకు ఆత్మనునది ప్రత్యేకముగా ఒకటున్నదని ఎవరికీ తెలియకుండా పోయినది.


ఆత్మ శరీరములో రాజుగా యున్నది. ఆత్మ శరీరములో చైతన్యశక్తిగాయుంటూ ఎవరికీ తెలియకుండా యున్నదనియే చెప్పవచ్చును. ఆత్మ శరీరములో బయట ఎవరికీ తెలియక అణిగియున్నది. జీవ శరీరములుఎక్కడున్నవో అక్కడంతా ఆత్మ, పరమాత్మ రెండూ గలవు. 'తెలుగు' అను పదములో 'తె' కు అతుక్కొని 'గు' కు ఆనుకొని 'లు' యున్నట్లు, ఆత్మపరమాత్మతో పూర్తి సంబంధపడియున్నదని తెలియుచున్నది. అంతేకాక ఆత్మ జీవాత్మకు దగ్గరగాయుండి జీవుని భావమును ప్రతి క్షణముతెలియుచున్నది. 'తెలుగు' అను మూడక్షరముల చిత్రపటములో మధ్యలో యున్న ‘లు’ అను ఆత్మ, పరమాత్మయను 'తె' అను అక్షరముతో అంటుకొనియున్నట్లు చూపాము. అట్లు చూపడము వలన మధ్యలోయున్న ఆత్మ పరమాత్మతో కలిసియున్నదని తెలియగలదు. ఒకవైపు 'తె' అను అక్షరముతోకలిసియున్న ‘లు’ మరొకవైపు 'గు' అను జీవాత్మకు దగ్గరగాయున్నట్లు ‘గు’ కు ప్రక్కగాయున్నట్లు తెలియుచున్నది. దానివలన పరమాత్మతో ఆత్మఅంటుకొని, జీవాత్మతో ఆనుకొని యున్నదని తెలియుచున్నది. అంటుకొని, ఆనుకొని ఆత్మయున్నదని తెలియునట్లు, ఎవరితో అంటుకొనియున్నదో,ఎవరితో ఆనుకొనియున్నదో తెలియునట్లు 'తెలుగు' అను మూడక్షరముల చిత్రపటమును మీకు చూపడము జరిగినది.



సృష్ఠి తయారయిన తర్వాత మొదట తయారయిన భాష తెలుగుభాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది. భాష తయారయిన కొంతకాలమునకు ఆకాశ గ్రహమైన సూర్యుడు భూమిమీదికివచ్చి, మనువు అను మనిషికి తెలిసిన భాషలోనే మాట్లాడి జ్ఞానము చెప్పడమైనది. ఆదిత్యుడయిన సూర్యుడు ఆదిలో మొదటిగా మాట్లాడినభాషకు సూర్యుడే పేరుపెట్టిపోయాడు. భూమిమీద జ్ఞానము తెలిపిన తొలి భాషగా భవిష్యత్తులో అందరికీ తెలియులాగా యుండునట్లు మరియుతెలిపిన జ్ఞానములో మూడు ఆత్మల విషయమే ముఖ్యముగా కలదని తెలియునట్లు, 'తెలుగు' అను మూడక్షరముల పేరును ఆదిత్యుడు పెట్టడముజరిగినది. అంతేకాక అంతవరకు తెలుగు భాషకు లేని లిపిని సూర్యుడే సూచించి పోయాడు. సూర్యుడు సూచనప్రాయముగా మొదట తెలియజేసినది ‘ఓం’ అను అక్షరమును. సూర్యుడు మొదట తెలియజేసిన 'ఓం' ను లిపితో తెలుగు లిపియంతయూ వ్రాయబడినది. మొదట వ్రాసినఅక్షరమును అప్పటినుండి ఇప్పటివరకు మొదటి అక్షరముగా చెప్పుకొను చున్నాము. దానినే 'ప్రణవాక్షరము' అని అంటున్నాము. ప్రణవాక్షరము అనగా "మొదట పుట్టిన ముఖ్యమైన అక్షరము” అని చెప్పవచ్చును.


ప్రశ్న :- మీరు మొదట పుట్టిన భాషకే 'తెలుగు' అని పేరు పెట్టారనిఅంటున్నారు. ఇప్పుడు ప్రపంచములో గల 7105 భాషలలో తెలుగు భాషయే మొదట పుట్టినదనుటకు ఆధారముగానీ, సాక్ష్యముగానీ ఏదయినాఉన్నదా? మీ మాటను మేము నమ్మగలముగానీ, ఇతరులు నమ్మరు కదా! వారు ప్రశ్నిస్తే మేము ఏమి చెప్పవలెను? మీరు చెప్పారంటే అది నూటికినూరుపాళ్ళు నిజమైయుంటుంది. అయినా మా అజ్ఞానము కొలది మేము ప్రశ్నించుచున్నాము. దయచేసి తెలుపవలెనని కోరుచున్నాము.


జవాబు :- మొదటి భాష తెలుగు అనుటకు 'తెలుగు' అను మూడక్షరములే సాక్షిగాయున్నాయి. 'తెలుగు' అను మూడు గుర్తులు మూడు ఆత్మలకు సాక్ష్యముగాయున్నాయి. సూర్యుడు 'తెలుగు' అను మూడు శబ్దములను మూడక్షరములని చెప్పాడు. అంతవరకు మాట్లాడుచున్న భాషకు పేరులేదు. అట్లే లిపియూ లేదు. మొదట సూర్యుడు మాట్లాడిన భాష సూర్యుని చేతనేతెలుగు అను మూడు ప్రత్యేకమయిన శబ్దములతో కూడిన పేరుపెట్టాడు. అప్పుడే తెలుగు భాషకి లిపిని సూచించి 'ఓం' అని ప్రారంభించి పోయాడు.సూర్యుడు మొదట ప్రారంభించిన 'ఓం' శబ్దమును లిపిగా చెప్పినవాడు సూర్యుడే. అందువలన ఆ విషయము మరువనట్లు ఎక్కడయినా ముందు'ఓం' ను వ్రాయుట హిందువులకు పరిపాటిగాయుండెడిది. ప్రతి మాట ముందర, ప్రతి మంత్రము ముందర 'ఓం' శబ్దమును ఉచ్ఛరించుటఉండెడిది. ఈ మధ్యకాలములో మాటల ముందర 'ఓం' శబ్దము పోయినది. కేవలము మంత్రముల ముందర మాత్రమే 'ఓం' శబ్దమును ఉచ్ఛరించడముగానీ, వ్రాయడముగానీ జరుగుచున్నది. మా మాట నిజమని తెలియుటకు 'ఓం' ప్రణవాక్షరముగా నేటికీ మిగిలియున్నది. అంతేకాక తెలుగుశబ్దములోని మూడు గుర్తులకు, అనగా తెలుగు శబ్దమునకు లిఖించిన లిపిని కేవలము లిపి అని అనకుండా లిపికి ప్రత్యేకమయిన పేరుపెట్టడముజరిగినది. లిపి లిఖించవచ్చును. లిఖించిన సమాచారమును 'లేఖ' అనడము జరుగుచున్నది. అయితే భాషకు 'తెలుగు' అను పేరుపెట్టిన సూర్యుడు

లిపికి 'అక్షరము’ అని కూడా పేరుపెట్టాడు.


దేవుడు సృష్ఠిని తయారు చేయకముందే సృష్ఠికొరకు ముందుతనను నాలుగు విధములుగా విభజించుకొన్నాడు. ముందు తననుండి ప్రకృతిని బయటకు తీశాడు. తర్వాత తనను మూడు రకములుగావిభజించాడు. ఆ విధముగా విభజింపబడిన మూడును ఒకదానిని పరమాత్మయనీ, రెండవ దానిని ఆత్మయనీ, మూడవ దానిని జీవాత్మయనీచెప్పడమైనది. మూడు ఆత్మలను ఒకవైపు, ప్రకృతిని ఒకవైపు రెండు విధములుగా చేశాడు. ప్రకృతి మార్పుచెందునదిగా, నాశనమగునదిగా చెప్పాడు. మూడు ఆత్మలను నాశనము లేనివని చెప్పాడు. క్షరము అనగా‘నాశనము’ అని అర్థము. ప్రకృతితో తయారయిన శరీరము నాశనమగునది కావున దానిని 'క్షరము' అని అన్నారు. ఆత్మలు ప్రకృతికంటే భిన్నముగాయుండి నాశనము లేనివిగాయుండుట వలన ఆత్మలను 'అక్షరములు’ అని అన్నాడు. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఆత్మలు నాశనములేనివగుట వలన వాటిని 'అక్షరములు' అని అనడము జరుగుచున్నది. అక్షరములు అనగా నాశనముకానివని అర్థము ఉండుట తెలిసిన విషయమేకదా! సూర్యుడు తెలుగు అని భాషకు పేరుపెట్టి లిపిని చూపినప్పుడు, తెలుగు అను మూడు శబ్దములు మూడు ఆత్మలకు గుర్తుగా ఉన్నాయికావున, ఆత్మలు నాశనము కావని తెలియునట్లు 'తెలుగు' అను మూడు శబ్దముల లిపిని, మూడు అక్షరములు అని చెప్పాడు. అప్పటినుండి లిపికి'అక్షరములు' అను పేరు వచ్చినది. ఆ దినము జ్ఞానసంబంధముగా పెట్టిన పేరు నేటికీ భాషకు తెలుగుయనీ, లిపికి అక్షరములనీ చెప్పడముచూస్తూనేయున్నాము. నేను చెప్పిన విధముగానే భాషకు మరియు భాషకు గల లిపికి పేరుపెట్టడమైనది. భాషకు తెలుగు అని చెప్పడములో పరమాత్మ,ఆత్మ, జీవాత్మయను భావము గలదు. తె-పరమాత్మ, లు-ఆత్మ, గు-జీవాత్మయని నిర్ణయించి చెప్పడమైనది. తెలుగు భాషకుగల లిపినిప్రత్యేకముగా అక్షరములని జ్ఞాన సంబంధ, ఆత్మ సంబంధమైన పేరుపెట్టాడు. దీనితో తెలుగు, అక్షరములు అను మాట స్థిరస్థాయిగా నిలిచిపోయినది.తెలుగు అక్షరములను విడదీసి చెప్పితే, 'తెలుగు' భాష, 'అక్షరములు' లిపి యగును. నేడు అనేక భాషలున్నవి. వాటిలో కొన్నిటికి లిపియున్నది.అయినా ఆ భాష పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క


తెలుగు భాషకే కలదనీ, తెలుగు భాష "జ్ఞానచిహ్నము”గా భూమిమీద తయారయినదనీ, ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదని చెప్పుచున్నాము.


ప్రశ్న :- ఎవరికీ తెలియదని మీరు చెప్పినప్పుడు అందరిలో మీరు కూడాఒక్కరు కదా! మీకెలా తెలిసినది?


జవాబు :- అందరిలో నేను ఒక్కడినే! అయితే నేను ఒక్కడిని అందరివలె'గు' గా లేను, 'తె' గా కూడా లేను. 'లు' కు దగ్గరగా అనగా ఆనుకొని యుండుట వలన 'లు' యొక్క శక్తి నాకు కొంతవచ్చి మీకు తెలియనిదినేను చెప్పుచున్నానని మీరు అనుకోవచ్చును కదా! నేను దేవునితో అంటుకొనిలేను, ఆత్మతో ఆనుకొనియున్నాను, అనగా దగ్గరగా యున్నాను.నా ప్రక్కనే ఆత్మ యుండుట వలన, ఆత్మకు తెలిసిన రహస్యమును నేను కొంత అడిగి తెలుసుకొని మీకు చెప్పుచున్నాను అని మీరు అనుకోవచ్చును కదా!


ప్రశ్న :- శరీరములో మీరున్నారు, ఆత్మయున్నది. మీరు ఎట్లున్నారో మేముశరీరములో అట్లేయున్నాము. మేము కూడా ఆత్మప్రక్కనే యున్నాము కదా! మేము అడిగితే చెప్పని ఆత్మ మీరు అడిగితే చెప్పడమేమిటి?


జవాబు :- నీ ప్రక్కన ఆత్మ, ఆత్మ ప్రక్కన నీవు ఉండుట వాస్తవమే! అయితేఆత్మ యుందని నీకు ఇంతవరకూ తెలియదు. ఇప్పుడిప్పుడే మేము చెప్పడము వలన తెలిసింది. అయితే నీవు ఆత్మ విషయమును పూర్తితెలియకముందే అడుగుచున్నావు. ఆత్మ సులభముగా ఎవరికీ అర్థమవునది కాదు. ఇప్పుడు నీవు అడిగినా ఆత్మవైపు తిరిగి అడుగలేదు. ఆత్మ నీవెనుకవైపు వుంటే ముందువైపు అడుగుచున్నావు. అట్లే ఆత్మ నీముందువైపు ఉన్నప్పుడు వెను తిరిగి వెనుకవైపు అడుగుచున్నావు. అందువలన నీకు

ఆత్మ ఏమీ చెప్పలేదు.


ప్రపంచములో ఇంతవరకు ఎవరికీ తెలియనిది ఆత్మ. ఆత్మనుతెలియుటకు బ్రహ్మవిద్యను ఎంతో నేర్వవలసియున్నది. ఆత్మను గురించి తెలియుముందు ఇటు పరమాత్మ జ్ఞానమును, అటు జీవాత్మ విషయమునుపూర్తిగా తెలియవలసియున్నది. మీకు సంపూర్ణముగా ఆత్మను గురించి తెలియాలంటే మూడు దైవగ్రంథములను అసూయ లేకుండా భక్తిశ్రద్ధలతోచదువవలసియుంటుంది. నా మతము, నీ మతము అను దురభిప్రాయము లను పెట్టుకోకుండా, మొట్టమొదట సూర్యుడు భూమిమీద చెప్పిన జ్ఞానమేమూడు గ్రంథములలో యున్నదను సత్యము తెలిసి మూడు గ్రంథములలోని జ్ఞానమును తెలియండి. అప్పుడు ఆత్మ చేయు వింతలు, విశేషములుఅన్నియూ తెలియగలవు. ఆత్మ ప్రక్కనేయున్నా మనకు తెలియకుండా చేస్తున్నదంటే అది వింత కాదా! ప్రపంచములో ఎంతో మేథావిగాయున్నవాడు ఆత్మ విషయములో పూర్తి అజ్ఞానిగా యున్నాడంటే, ఆత్మ వానిని మాయచేసి వాని చూపును తనవైపు లేకుండా చేయడము వింతకాదా!ఇట్లు ఆత్మ మనుషులను అనేక రకములుగా స్వయముగా నడుపుచూ ఎవరికీ తెలియకుండా, ఏమీ చేయనట్లుండడము విశేషము కాదా! మీకుఆత్మ విషయము బాగా అర్థమగుటకు ఆత్మను గురించిన కొంత సమాచారమును క్రింద చూడండి.


01. సమస్త జీవరాసులందు కలిసియున్నది ఆత్మ!

02. అఖిల జీవులందు ఒకే చైతన్యముగనున్నది ఆత్మ!

03.గాలిలో గంధము కలిసి కనిపించనట్లు, శరీరములో కంటికి కనిపించక ఉన్నది ఆత్మ!

04. సాక్షియై అన్ని శరీరములందున్న అందరిలో ఉన్నది ఆత్మ!

05. శక్తిరూపములో శరీరమంతయూ వ్యాపించియున్నది ఆత్మ!

06. సమస్త జీవులందు కార్యరూపమై ఉన్నది ఆత్మ!

07. సమస్త జీవులందు చైతన్యముగనున్నది ఆత్మ!

08.మూడు ఆత్మలలో రెండవదైనది మధ్యాత్మ!

09. అఖిల జీవరాసులందు అన్ని పనులు చేయిస్తున్నది ఆత్మ!

10. సమస్త జీవరాసులందు చైతన్యరూపమై ఖండ ఖండములుగా శరీరములో వ్యాపించి ఉన్నది ఆత్మ!

11. సర్వ జీవరాసులందు నివశిస్తూ, ఆయా శరీర ఆకారము కల్గియున్నది ఆత్మ!

12. శరీరమను గుడిలో దీపమై శరీరమంతటికీ వెలుగు నిచ్చుచున్నది ఆత్మ!

13. సమస్త శరీరములలో జీవునితోపాటు ఉంటూ, ఆ శరీరమునకు శక్తినిచ్చుది ఆత్మ!

14. ముగ్గురు పురుషులలో అక్షర పురుషుడై శరీరములోనున్నది ఆత్మ!

15. ప్రతి శరీరములో జీవాత్మలకు సాక్షిగాయున్నది ఆత్మ!

16. ఇంద్రియములకు శక్తినొసగునది ఆత్మ!

17.కొలిమి మంటకు గాలితిత్తి, తిత్తిని కదిలించు కట్టె, కట్టెకు చివర కూర్చొని కదిలించుచున్న వ్యక్తి, ఎలాగ అనుసంధానమై ఉన్నారో, అలాగే శరీరములో ముక్కులలోని శ్వాసకు ఊపిరితిత్తులు, తిత్తులకు బ్రహ్మనాడి, నాడికి చివరలోవుండి అన్నిటినీ కదిలించునది ఆత్మ!

18. శరీరములో శ్వాసను నడిపించునది ఆత్మ!

19. సమస్త జీవులందు ఒకేపని చేయుచున్నది ఆత్మ!

20. రెండవ ఆత్మయై శరీరములో అన్ని పనులూ చేయుచున్నది ఆత్మ!

21. శరీరములో నివాసముంటున్న మూడు ఆత్మలలో అహర్నిశలు జీవున్ని కాచుకొనియుండునది, రెండవది ఆత్మ!

22. ముగ్గురు పురుషులలో మధ్యవాడై, పూజ్యుడైయున్నది ఆత్మ!

23.సమస్త సజీవ శరీరములందు నఖ, శిఖ పర్యంతమూ వ్యాపించి శరీరములోని అన్ని అవయవముల చేత పనులు చేయించుచున్నది ఆత్మ!

24.శరీరములోని జీవునికి సాక్షిగానున్నది ఆత్మ!

25. పూలహారములో ఆధారమై దాగియున్న దారమువలె శరీరములో కనిపించక శరీరములకంతటికీ ఆధారమైయున్నది ఆత్మ!

26.శరీరాంతర్గతములలో ఉండి జ్ఞానము చేత పొగడబడునది ఆత్మ!

27.సమస్త జీవ శరీరములలో మూడు గుణముల మధ్య సాక్షిగా యున్నది ఆత్మ!

28. అఖిల జీవులతో కూడియున్నది ఆత్మ!

29.సమస్త జీవరాసులయందు గల మూడు ఆత్మలలో మధ్యనున్నది ఆత్మ!

30. చిన్న చీమలలోనూ పెద్ద ఏనుగులోనూ ఒకే విధానము కల్గి కర్మను పాలించునది ఆత్మ!

31. శరీరములోని అన్ని భాగములకు శక్తి నిచ్చుచూ ఎవరికీ తెలియకుండా వున్నది ఆత్మ!

32.అందరి శరీరములలో ఎవరికీ తెలియకుండా నిదురలోనూ, మెలుకువలోనూ అందరియందూ పనిచేయుచున్నది ఆత్మ!

33. అద్వైతాది మహా మునులు శరీరములో ఉన్నది నేను ఒక్కడినేనని చెప్పుకొనుచుండినప్పటికీ ఆత్మ మాత్రము వేరుగాయుండి జీవుని  కర్మ ననుసరించి శరీరమును కదిలించుచూ, జరిగెడి ఏ కర్మకూ బాధ్యుడు కానిది ఆత్మ!

34. శరీరములో అణువణువునా వ్యాపించి విధిని అనుసరించి శక్తినిచ్చునది ఆత్మ!

35. శరీరములో బాహ్య ప్రపంచముతో సంబంధము పెట్టుకొని ఎల్లవేళలా పనిచేయుచున్నది ఆత్మ!

36. శరీరములో ఏమాత్రము నిద్రలేకుండా ఎల్లప్పుడూ మేల్కొని పనిచేయుచున్నది ఆత్మ!

37. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగా, జీవాత్మకు తోడున్నది ఆత్మ!

38. శరీరాంతర్గతమై బాహ్య దృష్ఠికి కనిపించక, జీవాత్మలైన స్వాములు, మునులు కూడా నేనే ఆత్మనని తలపోయునట్లు చేసి తాను మాత్రము వేరుగానున్నది ఆత్మ!

39. జీవాత్మకు పరమాత్మకు మధ్యనగలది ఆత్మ!

40. చెట్టులో తేమ వ్యాపించినట్లు, శరీరములో శక్తిగా వ్యాపించి యున్నది ఆత్మ!

41. ఇనుముతో కలిసిన అగ్నికి కూడా కొలిమి దగ్గర సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు, జీవునితో చేరి శరీరమంతా వ్యాపించి అప్పుడప్పుడు ఆకలికి శక్తిహీనత చెందుచున్నది ఆత్మ!

42. శరీరములో బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకొని శరీరమంతా వ్యాపించియున్నది ఆత్మ!

43. జీవాత్మకు పెద్దవాడు, పరమాత్మకు చిన్నవాడయినది ఆత్మ! జీవుని పాత్రదారునిగా ఆడించునది ఆత్మ!

44. సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలిసి నివాసము చేయుచున్నా నాశనముకానిది ఆత్మ!

45. శరీరమందు మాత్రము శక్తిగయున్న రెండవది ఆత్మ! 

46. శరీరమందు కర్మానుసారము కదలికలిచ్చుచూ, కర్మానుసారము రోగములు కలుగజేయుచూ, వాటిని అనుభవింపజేయునది ఆత్మ!

47. శరీరములోని మూడు ఆత్మలలో మధ్య ఆత్మయై శరీరమును నడిపించు శక్తియున్నది ఆత్మ!

48.శరీరములో ఎవరూ గుర్తించలేని విధముగా శరీర ఆకృతిని పోలియుండునది ఆత్మ!

49. శరీరములోని బ్రహ్మనాడిని స్థావరముగ ఏర్పరచుకొని శరీర మంతటా నఖ శిఖ పర్యంతము వ్యాపించి శరీరాకృతిని పోలియున్నది ఆత్మ!

50. శరీరము లోపల జరుగు సమస్త కార్యములకు సాక్షియైయున్నది ఆత్మ!

51. అకాల మరణము పొందినవానికి శరీరము పోయినప్పటికీ అదే శరీరాకృతి కల్గి, సూక్ష్మముగా కనిపించక వాని కర్మానుసారము ఆడించునది ఆత్మ!

52.మరణముండి నాశనము లేనిది ఆత్మ!

53. ఆకాశముననున్న సూర్యుడొక్కడే ప్రపంచమంతటినీ తన వెలుగుచే ప్రకాశింపజేసినట్లు, బ్రహ్మనాడియందుండి శరీరమంతటా చైతన్యముగా వ్యాపించియున్నది ఆత్మ! 

54.శరీర గృహములో యజమానియైనది ఆత్మ!

55.హృది మధ్యలో నివాసముజేయుచూ సూత్రధారియైయుండి జీవుని పాత్రదారునిగా ఆడించునది ఆత్మ!

56.సమస్త జీవులందు ఏకకార్య స్వరూపుడయినది ఆత్మ! 

57.పురుషులందు రెండవ వాడయిన అక్షర పురుషుడు ఆత్మ!

58. సమస్త జీవులందు కదలిక శక్తినిచ్చునది ఆత్మ!

59. ముందు తానుండి తన వెనుక జీవున్ని పెట్టుకొనినది ఆత్మ!

60. పరమాత్మ ప్రక్కనుంచుకొని జీవునితో కలిసియుండి శరీరముతో పనులు చేయునది ఆత్మ!

61. అన్ని జీవులందు వేరువేరుగా కలిసియున్నది ఆత్మ!

62. శరీరము వెలుపల ఏమాత్రము లేక లోపల మాత్రము చైతన్యముగానున్నది ఆత్మ!

63. అఖిల జీవులందు కలిసియున్నది ఆత్మ!

64. మూడు గుణములకు వేరుగ వున్నది ఆత్మ!

65. జీవుల ప్రక్కనేనున్నది ఆత్మ!

66. కాగిన ఇనుములో అగ్నియున్నట్లు, సమస్త జీవుల శరీరములందు ఇమిడియున్నది ఆత్మ!

67. సూర్యుడొక్కడు ఈ లోకమును ప్రకాశింపజేయునట్లు, శరీరమంతటినీ తానొక్కడే ప్రకాశింపజేయునది ఆత్మ!

68. నాశరహితుడై నాశనముకాగల జీవాత్మతో కూడివున్నది ఆత్మ!

69. పూసల మధ్యలో దారమున్నట్లు, జీవుల శరీర మధ్యలో శరీరమంతటికీ ఆధారమైయున్నది ఆత్మ!

70. ఎడతెరిపి లేకుండా ఎల్లకాలములందు జీవునితో కలిసియున్నది ఆత్మ!

71. చర ప్రకృతియైన శరీరమంతటా వ్యాపించియున్నది ఆత్మ!

72. పంచభూత నిర్మాణమైన శరీరమునకు ఆధారముగనున్నది ఆత్మ!

73. పరమాత్మయూకాక, జీవాత్మయూకాక కేవలము ఆత్మయై జీవాత్మతో పాటు శరీరములోనున్నది ఆత్మ!

74. మొదటిదయిన జీవాత్మకు, మూడవదయిన పరమాత్మకు మధ్య సంధానమైయున్న రెండవది ఆత్మ!

75. కాగిన ఇనుములో ఇనుమంతయూ అగ్ని వ్యాపించి యున్నట్లు, శరీరమంతా వ్యాపించియున్నది ఆత్మ!

76. పరమాత్మ పాలించు విశ్వమను సామ్రాజ్యములో శరీరమను సామంత రాజ్యమునకు రాజయినది ఆత్మ!

77. ప్రపంచమంతటికీ గల ముగ్గురు పురుషులలోనూ మధ్య పురుషుడుయై అక్షర పురుషుడని పేరుగాంచి, క్షరపురుషునివద్ద నిలచినది ఆత్మ!

78. శరీరములో సకలేంద్రియములకు శక్తినిచ్చునది ఆత్మ!

79. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములకు ఇరుసుగ నున్నది ఆత్మ!

80. జ్ఞానులయందునూ, అజ్ఞానులయందునూ, మూర్ఖులయందునూ, తెలివైన వారియందునూ, మంచివారియందునూ, చెడువారి యందునూ, అన్ని మతములవారియందునూ ఒకే పద్దతి కల్గి, ఒకే విధముగా రాగము (ప్రేమ) గానీ, ద్వేషముగానీ లేకుండా వర్తించునది ఆత్మ!

81. పురుషాకృతియైన ఈశ్వరలింగము మీద ముగ్గురు పురుషుల గుర్తుగయున్న మూడు విభూతి రేఖలలో మధ్య రేఖగా గుర్తింపబడి యున్నది ఆత్మ!

82.శరీరములోనే దృష్ఠినిల్పి దేవుని తెలియవలెనని ప్రయత్నించు యోగులకు తెలియబడు రెండవది ఆత్మ!

83. పూలమాలకు ఆధారమైన దారమువలె, శరీరమునకు ఆధారమై యున్నది ఆత్మ!

84.సకల శరీరములందు మూడవస్థలలో చైతన్యమునిచ్చునది ఆత్మ!

85.పాపము చేయునపుడు, పుణ్యము చేయునపుడు ఒకే విధముగా శరీరమునకు శక్తినిచ్చి, ఏ కర్మ అంటకుండా ఉండునది ఆత్మ!

86. భువిలో ఎన్ని జీవరాసులున్నాయో అన్నిటిలోనూ అన్ని ఆత్మలుగా విభజించబడి, పరమాత్మ ప్రతినిధిగా ప్రకృతిలో కలిసి శరీరములో పనిచేయుచున్నది ఆత్మ!

87.ఏ విషయముతో సంబంధము లేకుండా శరీరములోని కర్మ ప్రకారము శరీరమును నడిపించునది ఆత్మ!

88. శరీరములోని బ్రహ్మనాడి యొక్క ఏడు ద్వారముల ద్వారా మరియు గ్రంథుల యొక్క ఏడు ద్వారముల ద్వారా శరీరమును పాలించునది ఆత్మ!

89. సమస్త జీవరాశుల బుద్ధికి సమానముగా అర్థమగునది ఆత్మ!

90. అయమాత్మ బ్రహ్మమని సమస్తయోగుల చేత ఉచ్ఛరించబడునది ఆత్మ!

91. జాగ్రత్త, స్వప్న, నిద్రయనబడు మూడవస్థలకు సాక్షిగనున్నది ఆత్మ!

92.మూడు ఆత్మలయందు మధ్య ఆత్మయై, సమస్త యోగులచే ఆరాధింపబడునది ఆత్మ!

93. శరీరములోని 25 భాగములకు అతీతముగాయుండి, శరీరమంతటికీ శక్తినొసగునది ఆత్మ!

94. పరమాత్మకంటే తక్కువవాడై, జీవాత్మకంటే ఎక్కువ వాడైయున్నది ఆత్మ!

95. ఇంటిలో విద్యుచ్ఛక్తిలాగా, శరీరములో చైతన్య శక్తియైయున్నది

96.ఆత్మ!యోగులయందునూ, భోగులయందునూ సమాన వృత్తి కలిగి యున్నది ఆత్మ!

97. శరీరములో అణువణువునా వ్యాపించి శరీరాంతర్గత పనులకు కారణశక్తియై యున్నది ఆత్మ!

98.అండజ, పిండజ, ఉద్భిజములైన మూడు రకముల జీవరాశులలో ఏ జీవరాశియందైనాగానీ, ఒకే సిద్దాంతము, ఒకే నిర్ణయముగా, ఒకే పద్ధతిగా పనిచేయునది ఆత్మ!

99. జీవాత్మ ఏ శరీరములో ప్రవేశించినా, దానివెంట ఆ శరీరములో ప్రవేశించి అక్కడ కర్మరీత్యా ఏమి జరుగవలెనో, ఆ పనులను శరీరము ద్వార చేయించునది ఆత్మ!

100. శరీరములో పని తాను చేసి ఫలితమును జీవాత్మకు అందించేది ఆత్మ!

101. శరీరములోని ప్రాణమునకు ఆధారమై ఆడించుచున్నది ఆత్మ!

102. నేను పుట్టినప్పటినుండి నాలో అన్ని పనులకు సాక్షిగయుంటూ ప్రారబ్ధమును నాచేత అనుభవింపజేయునది ఆత్మ!

103. శరీరమనెడి రథమునకు సారథిగయుండి, ఇంద్రియములనెడి గుఱ్ఱములను త్రోలు సారథియై, శరీర రథమును అధిష్ఠించి యున్న జీవునికి సుఖదు:ఖములనెడి అనేక ప్రదేశములను చూపుచున్నది. ఆత్మ!

104. చెట్టుకు తాట అనుబంధమై ఉన్నట్లు, శరీరములోని జీవాత్మకు శక్తి రూపములో అనుబంధమైయున్నది ఆత్మ!

105. సంసారమను నాటకమునకు పరమాత్మ సూత్రధారికాగా, నాటకమును వీక్షించుచూ నాటకములోని భావములను అనుభవించు ప్రేక్షకుడు జీవుడుకాగా, నాటకమును ఆడునది ఆత్మ!

106. శరీరములో ఆత్మ చేస్తున్నప్పటికీ జీవాత్మ తాను చేసినట్లు తలచితే, ఆ పనిలోని కర్మను జీవునికి అంటగట్టునది ఆత్మ!

107. శరీరములో ప్రారబ్దకర్మ ప్రకారము సుఖదు:ఖములను ఆడించుచూ, అహము పొందిన జీవాత్మ పాలిట చిత్రగుప్తుడుయై, ఆగామి కర్మను అంటగట్టునది ఆత్మ!

108. మంచి చెడు కర్మలను తారతమ్యము లేకుండా ఆచరించుచూ, పాపపుణ్యములకు సంబంధము లేనిది ఆత్మ!

109. అజ్ఞానులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచూ ఆగామి కర్మను అంటగట్టుచూ, జ్ఞానము తెలిసిన యోగులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచూ, ఆగామి కర్మను అంతము చేయుచున్నది ఆత్మ!

110. శరీర యంత్రాంగములో 24 భాగములను ఒక్క జీవుని కొరకు నడిపిస్తూ పరమాత్మకు బంటుగ నిలిచినది ఆత్మ!

111. శరీరములో ఆత్మ ఏమి చేయుచున్నది ఎవరికీ తెలియనీయకుండా నిద్రించు సమయములో కూడా శ్వాసను నడుపుచున్నది. అటువంటి ఆత్మ ఉనికిని తెలియక అన్ని నేనే చేయుచున్నానని జీవుడు భ్రమిస్తున్నప్పటికీ ఏ పనినీ జీవునికి వదలక అన్ని పనులనూ ఎంతో ఓర్పుగా చేయుచున్నది ఆత్మ!

112. శరీరములో తప్ప బయట ఎక్కడా ఏ వస్తువందూ లేనిది ఆత్మ!

113. శరీరములో బుద్ధికి తెలియని విద్యలయిన, జంతువు చిన్నతనము లోనే నీటిలో ఈదడమును, దూడ పాలపొదుగును గుర్తించడమును, ఐదు సంవత్సరముల చిన్నవయసు మనిషికి పాండిత్యము కలుగడము మొదలగు వాటిని తెలియజేయుచూ ఏమీ తెలియని దానివలెనున్నది ఆత్మ!

114. జీవుడు ధరించిన శరీరము ఎంత పరిమాణముండునో అంతే లావు, అంతే ఎత్తు కల్గి ఆ శరీర ఆకృతిని కల్గియున్నది ఆత్మ!

115. శరీరములో అంతటా వ్యాపించియుండి, కర్మవుంటే చేతిలోనో, కాలిలోనో శక్తి లేకుండా చేసి, అవిటివానిగా కనిపింపజేయుచూ జీవునికి కర్మను అనుభవింపజేయునది ఆత్మ!

116. శరీరములో ప్రారబ్ధకర్మను జీవుని చేత అనుభవింపజేయు యమధర్మరాజుయై, అహముగల వానికి ఆగామికర్మను తలకు ఎక్కించడములో చిత్రగుప్తుడుయై చలామణి అగునది ఆత్మ!

117. మరణములోనూ, పుట్టుకలోనూ జీవునివెంట వుండి మరణము నుండి పుట్టుక వరకు గుణములనూ, జీవుని కర్మ సముదాయమునూ తీసుకువస్తున్నది ఆత్మ!

118. శరీరములో అన్ని పనులు చేయుచూ, ఏ ఒక్క పనిని కూడా నేను చేశానని బయటికి తెలుపక, ఎన్నో విజ్ఞాన పరికరములను కనిపెట్టించు యోచనను ఇచ్చినప్పటికీ ఏమీ తెలియని జీవుడు నేను కనిపెట్టానని చెప్పుకొనుచున్నప్పటకీ ఊరక చూస్తుండినది ఆత్మ!

119. చావులోనూ, పుట్టుకలోనూ సాక్షీభూతుడుయై ఆ సమయములో ఏమి జరుగుచున్నదో ఎవరికీ తెలియని రహస్యమును తెలిసినది ఆత్మ!

120. చెట్టులో చెట్టు ఆకృతిని పోలియుండి, జంతువులో జంతువు ఆకృతిని పోలియుండి, మనిషిలో మనిషి ఆకృతిని పోలియుండి అనేక శరీరములలో ఆ శరీరములవలె అనేక ఆకారములు కల్గియున్నది ఆత్మ!


అసత్యమును వేయిమంది చెప్పినా అది  సత్యము కాదు 

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024