70. ఉన్నది ఒకటే జిందగీ.
సంపాదించడం తెలిసినవాళ్లకు
ఖర్చు చేయడంపై కూడా అవగా
హన ఉండాలి. లేకపోతే ఆనందం
దక్కకుండా పోతుంది! పొదుపు,
మదుపు చేసిన మొత్తం ముందుతరా
లకు ఇచ్చేస్తే.. మీ తలరాతకు పరులు
కూడా జాలిపడే పరిస్థితి వస్తుంది.
జీవిత చరమాంకంలో అయినా,
ఖుషీ చేయకపోతే ఎలా? ఉన్నది
ఒక్కటే జిందగీ! మీ లైఫ్ సుఖాంతం
కావాలంటే.. సంపాదించింది
ప్లాన్డ్ గా ఖర్చు చేయడమే మార్గం!
ప్రతి మనిషి జీవితం గందరగోళంగానే మొదలవుతుంది. తల్లి కడుపు నుంచి
బయటపడగానే ఏడ్చేస్తాం. అది ప్రకృతి ధర్మం కాబట్టి... తెలియకపో
యినా పాటిస్తాం. ఆకలి కాగానే తల్లిపాలు తాగుతాం. అది సృష్టివింత కాబట్టి..
తెలియకుండానే చేసేస్తాం. పెరిగి పెద్దయ్యేకొద్దీ మనలో ఆలోచనలు మొదలవు
తాయి. చేయాల్సింది చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. చేయకూడనివి
చేయాలని తాపత్రయపడతాం. అలా తప్పుల మీద తప్పులు చేస్తూ పెరిగి పెద్ద
వుతాము. ఏళ్లొచ్చాక ఎక్కడ తప్పు చేసినా చెల్లుతుందేమో కానీ, ఆర్థిక విషయాల్లో
పొరపాట్లకు తావిస్తే, జీవితం గ్రహపాటుగా మిగిలిపోతుంది.
జీవితం అంతా కుటుంబం కోసం పనిచేసిన వ్యక్తులు.. తమకంటూ ఓ లైఫ్ ఉందని అర్థం.
చేసుకోరు. అలా అర్థం చేసుకున్నవాళ్లు.. ఇదిగో ఈ పార్థసారథి గారిలా జిందగీని ముచ్చటగా
ఎంజాయ్ చేస్తారు. అందుకు ఆయనేం కోట్లు ఖర్చు చేయలేదు. ఒక్కటంటే ఒక్క కోటి రూపా
యలు పదిలం చేశాడు.
పార్థసారథి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. అనుకూలవతి అయిన ఇల్లాలు. మిడిల్ క్లాస్
ఫ్యామిలీ. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లలను బాగా చదివించాడు. సర్వీసులో ఉన్నప్పుడే
పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజినీర్, కూతురు, అల్లుడూ బ్యాంకులో
పనిచేస్తారు. రెండేండ్ల కిందట రిటైర్ అయ్యాడు, శేష జీవితం మనవలు, మనవరాళ్లతో
ఎంజాయ్ చేయాలని ఫిక్సయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపితే కోటి దాకా
వచ్చాయి. ఈ మొత్తాన్ని ఏం చేయాలో పార్థసారథికి అర్థం కాలేదు. అప్పటికే ఇల్లు ఉంది.
ఒకటి రెండు ఆస్తులున్నాయి. 'ఈ కోటి ఏం చేయాలంటూ?' నా సలహా అడిగారు.
జీవితం అంతా కష్టపడిన ఆయన్ను ఈ కోటి రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా
ఉన్నారా?' అని అడిగాను. 'ఓc ఎస్' అన్నారు. ఈ కోటి రూపాయలను కరిగించకుండా..
జీవితాన్ని ఎంజాయ్ చేసే మార్గం ఉందని చెప్పడంతో.. ఆశ్చర్యంగా చూశారు. ఆ కోటి రూపా
యలూ హైబ్రిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఏటా మే 1వ
తేదీన ఆ కోటిపై వచ్చే రిటర్న్స్ మొత్తాన్నీ రూపాయి మిగల్చకుండా విత్ డ్రా చేసి, ఖర్చు చేయా
లనే షరతును ఆయన అంగీకరించారు. అలా ఏడాది (2023-24) తిరిగే సరికి ఆ కోటి
రూపాయలపై అచ్చంగా 30 లక్షల రిటర్న్స్ వచ్చింది (అన్నిసార్లూ ఇలా 30 లక్షలు
వస్తాయన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు తక్కువ రావొచ్చు, అసలేం రాకపోవచ్చు కూడా!
అయినా ఈ సొమ్ము వెకేషన్ నిమిత్తం కాబట్టి రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం
లేదు). అంత పెద్ద అమౌంట్ను ఏం చేయాలని మళ్లీ అడిగారు. ఫ్యామిలీతో ఇంటర్నేషనల్
వెకేషన్కి వెళ్లమని చెప్పాను. కుటుంబంతో పదిరోజులు రెండు దేశాలు చుట్టొచ్చారు పార్థసా
రథి. అప్పటికీ 30 లక్షల్లో సగమే ఖర్చయ్యాయి. దీన్ని ఏం చేయమంటారు?' అని మళ్లీ
సలహా కోరారు. 'కొడుకు, కోడలు, కూతురు, అల్లుడిని పిల్లలతో సహా డిన్నర్కు పిలిచి, ఇకపై
నేను ఉన్నంత వరకు మీ పిల్లల చదువు ఖర్చు ఎంతైనా బాధ్యత నాదేనని' చెప్పమన్నాను!
మార్కెట్ క్రాష్ అయినప్పుడు.. రిటర్న్స్ కొంత కోత పడుతుందేమో కానీ, ఆ కోటి పదికా
లాల పాటూ అలాగే ఉంటుంది. తన పూర్తి పరివారంతో ఏడాదికి ఒక దేశం చుట్టేస్తూ జాయ్
పుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పార్థసారథి. మనవలు, మనవరాళ్లనూ చదివిస్తూ మలిసం
జెలో భారం లేకుండా బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు.
అందరికీ ఇంత ఈజీగా సొల్యూషన్ దొరక్కపోవచ్చు. కానీ,
విదేశాల్లో 'డై విత్ జీరో' కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉంది.
పోయేలోపు ఉన్నదంతా ఖర్చు చేసి లైఫ్ ఎంజాయ్ చేయ
డమన్నమాట. అలాగని జల్సాలకే ఖర్చు పెట్టాలన్న
నియమం లేదు. నలుగురికీ సాయం చేయొచ్చు. పది
మంది ఆకలి తీర్చొచ్చు. ఇలా మీ కష్టార్జితం మీ ఇష్టం వచ్చి
నట్టు వెచ్చించడం అన్నమాట! పార్థసారథి కూడా ఈ
సూత్రాన్నే ఎందుకున్నారు. వారసులకు ఇవ్వాల్సింది
ఆస్తుల మూటలు కాదు. మంచి భవిష్యత్తు. బుద్ధిమంతులు
ఏ ఆస్తి ఇవ్వకున్నా.. హాయిగా బతికేస్తారు. బుద్ధిహీనులకు
ఏడు తరాలకు సరిపడా ఆస్తి ఇచ్చినా ఊడ్చిపడేస్తారు. సో,
మీ కష్టార్జితాన్ని ఎలా వినియోగిస్తారో ఇక మీ ఇష్టం!!