పలావు, బిరియాని.
తయారుచేయు విధానము.
బియ్యము, తగినంత నీరు పోసి పదినిముషములు నానబెట్టవలెను.
కూరగాయలను కావలసిన విధముగా ముక్కలుగా తరిగి వుంచుకోవాలి.
మసాలాదినుసులు నూరుకొని ఉంచుకోవాలి.
బాణలి, కుక్కరు, పానులోగానీ నూనె గానీ, నెయ్యిగానీ వేసి మసాలాదినుసులు
వేయించుకోవాలి.
అందులోనే కూరగాయముక్కలు వేసి కలియబెడుతూ పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.
తగిన కొలతల ప్రకారం మారిన మసాలా వేసుకోవాలి.
కూరగాయముక్కలు వేయించు సమయంలో వేరొక స్టవ్పై వెడల్పు కలిగిన బాణలి పెట్టి
నానబెట్టిన బియ్యముపోసి హాఫ్ టీస్పూన్ నెయ్యి వేసి ఒక నిముషము తడి ఇంకేదాకా
వేయించాలి. (ఈ ప్రకారము చేసిన బిరియానీ చేసినప్పుడు అన్నము మెతుకులుగా విడివిడిగా
వుంటుంది).
బాణలి స్టవ్ మీద మంచి దించి, కాగిన నీరు, కుక్కర్లో పోసి మూతపెట్టి వెయిట్ పెట్టి సెగను
తగ్గించి పదినిముషములుంచవలెను.
పై ప్రకారము చేసిన తక్కువ సమయంలో బిరియానీ తయారగును.
బాస్మతి బియ్యము ఒకటినర్ర కప్పుల వరకు ప్రెషర్ట్పన్లో బిరియాని చేయవచ్చు. ఎక్కువ
చేయుటకు ప్రెషర్ కుక్కర్ వాడవలెను.
మరొక పద్ధతి...
ఒక బరువుగల పాత్రలో పై ప్రకారము చేయవలెను. వేయించిన బియ్యము గిన్నెలో పోసిన
తరువాత పైన మూత బిగుతుగా పెట్టి సన్నని సెగలో తడి పూర్తిగా పోయేవరకూ
ఉడికించవలయును.
ఫ్రైడ్ రైస్ (కలుపుడు అన్నము)..
తయారుచేయు విధానము.
సాధారణంగా మనం సాధారణ బియ్యములో అన్నము వండే విధానము
బియ్యము 2,3 సార్లు శుభ్రముగా కడిగి తగినంత నీటిలో అరగంటసేపు నానపెట్టవలెను.
పూర్తిగా నీటిని వంపివేసినతర్వాత సరిపడా నీరు పోసి, కుక్కర్లో పెట్టి ఉడకపెట్టవలెను.
వెడల్పుగల గిన్నెలోగానీ, పళ్ళెములోగానీ అన్నము పరిచి, చల్లారపెట్టి, మెతుకులు విడి విడిగా
వుండునట్లు చేయాలి.
ఫ్రైడ్ రైస్ గానీ, మిక్స్డ్ రైస్ గానీ వెరైటీలు తయారు చేయుటకు అన్నము కొంచెము బిరుసుగానే
పుండాలి.
అన్నము 2 లేక 3 గంటలు ముందుగానే వండి, చల్లారిన తరువాత వాడినచో రుచి
పెరుగుతుంది.
వేడి అన్నములో కలుపుడు అన్నము కలిపిన అన్నము ముద్దగా అవుతుంది.
అన్నము కుక్కర్లో గాక వేరుగా వుడక పెట్టవలసిన ఒకటి బియ్యానికి ఒకటినర్ర నీరు కలపాలి.
తెర్లటం ప్రారంభం కాగానే నానబెట్టిన బియ్యము పోసి, ఒక టీస్పూన్ నూనె గానీ, నెయ్యిగానీ,
ఉప్పుగానీ వేసిన మెతుకులు విడివిడిగా ఉండునట్లుగా అన్నము ఉండును.
అన్నము సగము వుడికిన వెంటనే అన్నమువారు పట్టాగానీ, గుడ్డలోగానీ గంజి వడకట్టాలి.
గంజి నీరు పూర్తిగా వడగట్టిన వెంటనే వెడల్పుగల పళ్ళెములో పరిచి చల్లారనివ్వాలి.
బాసుమతి బియ్యము పదినిముషములు నానబెట్టిన చాలు. ఎక్కువసేపు నానబెట్టిన
బియ్యములో గల సువాసన కోల్పోవును.
కాలిఫ్లవర్ బిర్యానీ..
కావలసిన వస్తువులు.
బాస్మతి బియ్యం -రెండు కప్పులు ( 400 గ్రాములు),
పెద్ద ఉల్లిపాయలు- 4 ,
కాలీఫ్లవర్ -రెండు మీడియం సైజు ,
పచ్చిమిరపకాయల -6,
కమ్మటి చక్కని పెరుగు -హాఫ్ కప్పు ,
నూనె -తగినంత ,
తురుమున కొబ్బరి -రెండు టేబుల్ స్పూన్లు,
ధనియాలు జీలకర్ర పొడి - 1 స్పూను,
ఉప్పు -తగినంత,
నెయ్యి -4 స్పూను,
జీడిపప్పు -20 పలుకులు,
కరి- వేపాకు- తగినంత ,
కొత్తిమీర తగినంత ,
నిమ్మకాయలు రెండు,
మసాలా పొడి రెండు టీ స్పూన్లు,
ఆవాలు ముప్పావు టీ స్పూన్లు,
ఇంగువ కొద్దిగా,
పసుపు పొడి హాఫ్ టీ స్పూన్లు ..
తయారుచేయు విధానము.
బియ్యము శుభ్రముగా కడిగి పావుగంట నీటిలో నానబెట్టవలెను.
ఉల్లిపాయలను అంగుళము పొడవు గల ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.
కాలీఫ్లవరు శుభ్రముగా కడిగి చిన్న చిన్న గుర్తులుగా తరిగి ఉంచుకోవాలి.
బరువుగల పాత్రలో కొంచెంగా నూనె వేడిచేసి ఆవాలు వేయించవలెను. ఆవాలు వేగిన
తరువాత తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, కర్వేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి.
అందులోనే ఉల్లిపాయముక్కలు, కాలీఫ్లవర్ గుత్తులు వేసి వేయించాలి.
బియ్యం వడపోసి అందులో వేసి ఒక నిముషము తడిపోయేదాకా వేయించాలి.
వేడినీరు నాలుగు కప్పులుపోసి తగినంత ఉప్పు, పసుపు వేసి ఆ నీరు కాగి తెర్లడం ప్రారంభము
కాగానే చిలికిన పెరుగు, ధనియాలపొడి, జీలకర్రపొడి, మసాలాపొడి వేయాలి.
సెగను తగ్గించి గాలిపోని విధంగా, మూత బిగువుగా పెట్టాలి.
పావుగంట లేక 20 నిముషములపాటు నీరు పూర్తిగా ఇంకిపోయేవరకూ ఉడికించాలి. తరువాత
మూత తీసి నెయ్యి వెయ్యాలి.
తురిమిన కొబ్బరి, సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లి, వడ్డించేటప్పుడు నిమ్మకాయ ముక్కలు
కోసి నిమ్మకాయముక్క ఇవ్వాలి.
మరో విధానము..
కాలీఫ్లవర్ బదులు క్యాబేజి వాడి చేసుకోవచ్చు. క్యాబేజీలో ఉడికిన బఠానీలను వేసుకోవచ్చు.
తెల్ల శనగల పలావు. ( CHANNA PALAV).
కావలసిన వస్తువులు,
బాస్మతి బియ్యం 400గ్రాములు,
తెల్లకాబూలీ శనగలు 100గ్రాములు,
పెద్దసైజా టమోటాలు 6,
కొబ్బరి సగం చిప్ప,
సాంబారు ఉల్లిపాయలు 100గ్రాములు,
వెల్లుల్లి 15పాయలు,
నూనె 6 టీ స్పూన్స్,
పంచదార 1 టీ స్పూన్,
కొత్తిమీర 1 కట్ట,
పచ్చిమిరప 4,
ఎండు మెంతిఆకులు 1 టీ స్పూన్,
గరంమసాలాపొడి 2 టీ స్పూన్స్,
దాల్చినచెక్క 2 అంగుళముల ముక్క,
యాలకులు 5,
లవంగాలు 4,
చిరంజి ఆకులు 2,
నెయ్యి 5 టీ స్పూన్లు,
ఉప్పు తగినంత.
నూరుకోవలసినవి..
సాంబారు ఉల్లిపాయలు 20,
ఎండుమిరపకాయలు 15,
జీలకర్ర,2 టీ స్పూన్లు,
వెల్లుల్లి10పాయలు
తురిమిన పచ్చికొబ్బరి 4 టేబుల్ స్పూనులు,
తయారుచేయు విధానము.
నూనె రెండు టీస్పూన్లు వేసి వేడిచేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయించాలి.
చల్లారిన తరువాత తురిమిన కొబ్బరి కలిపి మెత్తగా నూరుకోవలయును.
శనగలు నీళ్ళలో వేసి పదిగంటలసేపు నాననివ్వాలి.
బియ్యము శుభ్రముగా కడిగి పదినిముషముల సేపు వానపెట్టాలి.
నీళ్ళను వంచి బాణలిలో పోసి రెండు టీస్పూన్ల నూనెవేసి కాగాక బియ్యము తడి ఇంకేవరకూ
వేయించాలి.
శనగలు కుక్కర్లో పావుగంట లేదా ఇరువది నిముషాలు ఉడికించాలి.
టమోటాలు కొద్దినిముషములు మరగకాచిన నీళ్ళలో వేసి తర్వాత తీసి చల్లటినీటిలో వేయాలి.
ఒక నిముషము తర్వాత దానిపై తోలుతీసి, నూరి వడకట్టాలి. ఈ ప్రకారం చేయుటను బ్లాంచింగ్ అంటారు.
కొబ్బరి తురుము, కొంచెం నీరు పోసి మెత్తగా నూరి రెండుసార్లుగా కొబ్బరిపాలు తీసి ఉంచాలి.
వెల్లుల్లి తొక్కతీపి ఉంచాలి.
బరువుగల ఇత్తడి పాత్రలో నూనెవేసి కాగాక దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, చిరంజి ఆకువేసి వేయించాలి.
తర్వాత వెల్లుల్లి వేసి వేగేదాకా వేయించాలి.
దాంట్లో నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగాక రుబ్బిన మసాలావేసి సన్నటి సెగలో కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి.
టమోటాముద్ద, కస్తూరిమెంతి, ఉప్పు, కొద్దిగా పంచదార, మసాలాపొడివేసి కొంచెంసేపు
ఉడకనివ్వాలి.
దాంట్లో ఉడికిన సెనగలు, కొబ్బరిపాలు పొయ్యవలెను.
అవి కాగి తెర్లడం మొదలుపెట్టాక వెంటనే బియ్యంపోసి బాగా కలపాలి.
ఒక పళ్ళెములో గట్టిగా మూసి దానిపై ఏదైనా బరువు పెట్టి పావుగంట లేక ఇరువది నిముషములు
సన్నని సెగలో ఉడకనివ్వాలి. మధ్యలో కలియపెట్టటం చేయకూడదు.
సన్నగా తరిగిన కొత్తిమీర, వేయించిన జీడిపప్పు పైన అలంకరించి వడ్డించాలి.
బాసుమతి బియ్యం ఎక్కువసేపు నీటిలో నానపెట్టరాదు. కడగరాదు. ఆ విధంగాచేస్తే
బియ్యములో గల సువాసన పోతుంది.
పలావ్, ఫ్రైడ్ రైస్ చేయునప్పుడు బరువుగల ఇత్తడి పాత్రలుగానీ ప్రెషర్ కుక్కర్ నీ
ఉపయోగించాలి. మామూలు స్టీల్ పాత్రలో అన్నం అడుగంటే అవకాశముంది.