20. అప్పుడే అది.. లాభసాటి పెట్టుబడి!
రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఓ
పూట పస్తున్నా.. భవిష్యత్తు
బాగుండాలనే! అయితే,
భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయ
లేకపోతే.. మనం చేసే కష్టం
బూడిదలో పోసిన పన్నీరే! సుదూర
లక్ష్యాలను నిర్దేశించుకొని, జీవితాన్ని
పణంగా పెడతారు కొందరు. ఏండ్ల
కేండ్లు నిరీక్షిస్తారు. తీరా అంతిమ
ఫలితం రుచించకపోవచ్చు.
ద్రవ్యోల్బణంతో బేరీజు వేయకుండా
చేసే పెట్టుబడులు ఫలవంతం కావు.
ఆ రోజుల్లో అయితే.. నేనూ, మీ వదిన పది రూపాయల్లో సినిమాకు వెళ్లి,
ఇంటర్వెల్లో పాప్కార్న్ తిని, రిక్షాలో ఇంటికి వచ్చేవాళ్లం. ఇప్పుడు
ఇద్దరు సినిమాకు వెళ్లాలంటే వెయ్యికి తక్కువ కావడం లేదు' అన్నాడు కాంతా
రావు దీనంగా. రోజులు మారుతున్నకొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కానీ,
ఊహించని పెరుగుదలకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే!
కాంతారావు చిరకాల వాంఛ కారు కొనడం. అది తీరని కోరికగా మిగిలిపోయింది. 1986లో
ఆయన లక్ష రూపాయల పాలసీ తీసుకున్నాడు. అప్పుడు అతని జీతం నెలకు 870. ఆ
పాలసీ మీద గంపెడాశతో చిన్నచిన్న అవసరాలనూ కాదనుకున్నాడు. ఏడాదికి 4,000
ప్రీమియం చెల్లించడం మొదలుపెట్టాడు. 'ఎందుకండీ, ఇన్ని పాట్లు?' అని కాంతారావు భార్య
కాంతమ్మ పెదవి విరిస్తే.. 'మొద్దూ, మూడు లక్షలు వస్తాయే' అన్నాడు. దానికి ఆమె ముక్కున
వేలేసుకొని 'మూడు లక్షలా? ఆ మూడు లక్షలు ఏం చేద్దాం?' అని అడిగింది. 'రెండు లక్షలు
పెట్టి రెండు కార్లు కొంటాను. ఒకటి నీకు, ఒకటి నాకు. ఇంకో లక్షపెట్టి ఈ పెంకుటిల్లు పడగొట్టి
డాబా కట్టించేస్తాను' అనేవాడు ఛాతి వెడల్పు చేసుకొని. ఇలా పాతికేండ్లు కండ్లలో ఒత్తులు
వేసుకొని ఎదురుచూశాడు.
కాలచక్రం గిర్రున తిరిగింది. బీమా కార్యాలయం నుంచి పాలసీ మొత్తం చెక్కు రూపంలో
వచ్చింది. అక్షరాలా మూడు లక్షల రూపాయలు. పాతికేండ్లుగా ఎదురుచూస్తున్న పైకం అది.
కారు కొందామని ఆరాతీస్తే.. బేసిక్ మాడల్ కారే 3.50 లక్షలుగా తేలింది. బీమా
డబ్బుతో రెండు కార్లు, ఒక ఇల్లు కట్టేయొచ్చు అని బలంగా భావించిన కాంతారావుకు ఆ.
క్షణం ప్రపంచం అంతా మిథ్యగా తోచింది. కారు కల కలగానే మిగిలి పోయింది. అర్థం కాని
వారికి ప్రపంచమంతా మిథ్యే! సరిగ్గా అర్థం చేసుకుంటే.. ధనం విలువ ద్రవ్యోల్బణంపైనే ఆ
రపడి ఉందని బోధపడుతుంది.
బీమా పాలసీ తీసుకున్నా, పెట్టుబడి పెట్టినా భవిష్యత్ అవసరాల కోసమే! అయితే, సదరు
పాలసీ రిటర్న్ గానీ, పెట్టుబడికి వచ్చే లాభ శాతం గానీ ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉందో
లేదో చూసుకోవాలి. లాభ శాతం ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉంటేనే పెట్టుబడి సార్థకమై
నట్టు భావించాలి. పదేండ్ల కిందట 10 వేలలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా బతికే
వారు. అదే ఇప్పుడు 25 వేలు లేనిదే ఒక జంట బతకలేని పరిస్థితులు ఉన్నాయి. కారణం
ద్రవ్యోల్బణమే! కొనే వస్తువులు, పొందుతున్న సేవల ధరలు ద్రవ్యోల్బణం మీద ఆధారపడి
ఉంటాయి సాధారణంగా మన దేశంలో ద్రవ్యోల్బణం ఏడు శాతం వరకు ఉంటుంది అంటే
మనం పెట్టే పెట్టుబడిపై లాభం ఏడుశాతానికి మించి ఉంటేనే నిజమైన లాభం పొందగలం.
విద్యారంగంలో ఫీజుల పెరుగుదల ఏడాదికి 12 శాతంగా నమోదవుతున్నది. వైద్యరంగంలో
ఇది 14 శాతంగా ఉంది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే.. ఒక వ్యక్తి పెట్టుబడి ద్వారా పొందే
లాభం కనీసం 12 శాతంగా ఉంటేనే గానీ, ఆ పెట్టుబడి గిట్టుబాటు కాదని తెలుసుకోవాలి.
ఫ్యూచర్ ప్లాన్స్..
మన ఖర్చులు ఆదాయంలో యాభై శాతం దాటకుండా చూసుకోవడం కన్నా గొప్ప ఆర్ధిక
సూత్రం లేదు. మిగిలిన యాభై శాతం కొంత మేరకు, మిగతా ఇన్వెస్ట్మెంట్ డబ్బును
బ్యాంకులో ఎఫ్డి చేసినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది.
ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 7 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వచ్చే నమ్మకమైన రంగాల్లో పెట్టు
బడి పెట్టొచ్చు. షార్టర్మ్ రిస్క్ ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్.
భవిష్యత్తును అంచనా వేయాలి. పదేండ్ల కిందటికి, ఇప్పటికి పరిస్థితులు ఎంత
మారాయో.. కనిపిస్తూనే ఉంది. రాబోయే పదేండ్లలో ఎలా ఉంటాయో కూడా అంచనా
వేయవచ్చు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి.
పదేండ్ల తర్వాత చేయాలనుకున్న కూతురు పెండ్లి కోసం ఇప్పుడు పది లక్షలు దాచిపెటే
సరిపోదు. ఆ పది లక్షలు పెండ్లినాటికి పాతిక లక్షలు అయ్యేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల
విషయంలో స్పష్టత ఉండాలి.