24. నలభైలో నడుం బిగించాలి!
ఒక విద్యార్థికి పదో తరగతి తర్వాత
నాలుగు మార్గాల కూడలి తారసప
డుతుంది. తన ఆసక్తి మేరకు దారి
ఎంచుకుంటాడు. ఉద్యోగి జీవన
గమనంలో 40 ఏండ్లప్పుడు కీలక
కూడలి ఎదురవుతుంది. బాధ్యతలు,
భవిష్యత్ అవసరాలు హెచ్చరిస్తుం
టాయి. వీటిని సమర్థంగా
ఎదుర్కొంటూ ముందుకు నడిస్తే ఏ
ఇబ్బందీ ఉండదు! అప్పుడు దారి
తప్పితే, యాభైలలో 'అమ్మో! ఒకటో
తారీఖు' అనుకునే పరిస్థితి వస్తుంది.
నడి వయసుకు నాంది నలభైతోనే మొదలవుతుంది. ఆర్థికంగా లోటుపాట్లు
ఉంటే సరిదిద్దుకోవాల్సిన వయసు అది. గతంలోని పెట్టుబడులను సమీక్షిం
చుకొని, భవిష్యత్ అవసరాలను బేరీజు వేసుకోవాలి. నలభైలో ఉన్న వ్యక్తికి
కుటుంబ బాధ్యతలు అధికంగానే ఉంటాయి. 27 ఏండ్లప్పుడు పెండ్లయి ఉంటే..
నలభైకి వచ్చేసరికి పిల్లల వయసు కాస్త అటూ ఇటూగా 12-14 ఏండ్ల వరకు
ఉంటుంది. ఇంకో ఆరేండ్లు గడిస్తే పై చదువులు మొదలవుతాయి. నలభయ్యో
పడిలో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులు డెబ్బైకి చేరువగా ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న
వారికి అండగా ఉండాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. వీటన్నిటినీ సమర్థంగా
ఎదుర్కోవాలంటే.. నడి వయసులో నడుం బిగించాల్సిందే!
జరిగిందేదో..
ముప్పయిల్లో ఉన్నప్పుడు ఉడుకు రక్తం పరవళ్లు తొక్కుతుంటుంది. ఉద్యోగంలో అంచెలం
లుగా పైకి ఎదగాలనే పట్టుదల ఉంటుంది. నలభైకి వచ్చేసరికి ఆ పట్టు కొంత సడలుతుంది.
ఎన్నాళ్లని ఉద్యోగం చేస్తాం' అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, కుటుంబ పరిస్థి
తులు ఉద్యోగం నుంచి తప్పుకోనివ్వవు సరికదా అదనపు రాబడి మార్గాల గురించి ఆలోచిం
చేలా చేస్తుంది. పిల్లలు పదో తరగతికి వచ్చే వరకు వాళ్ల పై చదువుల గురించి ఆలోచించకపోతే
తల్లిదండ్రులుగా వెనకబడ్డట్టే! 'జరిగిందేదో జరిగిపోయింది' అని మెట్ట వేదాంతం వల్లించినా..
పిల్లలకు కలిగే నష్టాన్ని పూడ్చలేం! అందుకే, పిల్లలు కలిగిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే పదహా
రేండ్ల తర్వాత వాళ్ల చదువులకు అందొచ్చే విధంగా పాలసీ గానీ, మ్యూచువల్ ఫండ్స్లో గానీ
ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అన్నిటికీ మించి ఆరోగ్య బీమా, జీవిత బీమా తప్పనిసరిగా తీసుకోవా
ల్సిందే .మరో రెండేండ్లు పోతే బీమా షరతులు మరింత పెరుగుతాయి.
ఆస్తులు పెంచుకునేలా..
సరైన అవగాహన లేకుండా చేసే ఇన్వెస్ట్మెంట్ అవసరానికి ఆదుకోకపోవచ్చు. 'నడి వయ
వచ్చి ఏం ఇన్వెస్ట్ చేయలేదు.. ఎలా?' అని బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు.
విద్యాభ్యాసంలో కాలేజీ ఏజ్ ఎంత ప్రాధాన్యమైనదో, సగటు ఉద్యోగికి 40 ఏండ్ల తర్వాత
వృత్తిగత జీవితం అంత ముఖ్యమైనది. 40 నుంచి 55 ఏండ్ల మధ్య ఎంత ప్రణాళికా బంధంగా
నడుచుకుంటే.. పదవీ విరమణ తర్వాత అంత హాయిగా జీవితం సాగి పోతుంది. పిల్లల చదు
అయిపోగానే, వాళ్ల పెండ్లిళ్లు ముందుకొస్తాయి. వాటన్నిటినీ అంచనా వేస్తూ ఆర్థిక
మూలాలను బలపర్చుకోవాలి. ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తుండాలి.
మిగులు బడ్జెట్ ఉండేలా చూసుకోవాలి. లిక్విడ్ అసెట్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పు
ఒక ఇల్లు ఉండి రెండో ఇల్లు కొనుగోలు చేసే శక్తి కూడా ఉన్నట్లయితే తీసుకోవడం
మంచిది. దానిని పిల్లల పేరిట కాకుండా.. పదవీ విరమణ తర్వాత అద్దె రూపంలో మీకు
అండగా ఉండేవిధంగా మీ పేరిటే ఉండేలా చూసుకోవాలి. అందు బాటులో ఉన్న పెన్షన్ పాల
సీలలో మంచిదాన్ని ఎంపిక చేసుకొని కష్టమైనా ప్రీమియమ్లు చెల్లిస్తూ ఉండాలి. ఇవన్నీ
చేయడానికి నలభై సరైన వయసు. సగం జీవితం అయిపోయిందని పరుగు ఆపకుండా.
అందుబాటులో ఉన్న దారుల్లో మన్నికైన దాన్ని ఎంచుకోండి. మీ బాధ్యతలను సమర్థంగా
నిర్వర్తించాననే తృప్తితో యాభైలోకి అడుగుపెట్టండి.
ముందస్తుగా స్పందిస్తేనే..
బిడ్డ పుట్టగానే ఓ ప్లాట్ తీసుకొని 'హమ్మయ్య! వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఇది ఉంది' అన
కుంటారు చాలామంది. అమ్మాయికి మెరిట్ లో ఎంబీబీఎస్ సీటు రాలేదు అనుకోండి! ప్లాట్
ఉందిగా మేనేజ్మెంట్ కోటాలో చదివిస్తా! అని భావిస్తారు. ఉద్దేశం మంచిదే! ప్లాట్ ధర
కూడా అనుకున్న దానికన్నా రెండింతలు పెరగొచ్చు! కానీ, అది అమ్మితే వచ్చిన భారీ
సొమ్మను ఖాతాలో చూపించే పరిస్థితులు ఉండక పోవచ్చు! అలా చూపించాలంటే సదరు
లావాదేవీ పూర్తిగా అకౌంట్ టు అకౌంట్ జరగాలి. అందుకు మీరు సంసిద్ధంగా ఉన్నా..
వాళ్లు ముందుకు రాకపోవచ్చు. అందుకే, ఆస్తులు అమ్మే విషయంలో అవసరానికన్నా
రెండేండ్ల ముందుగానే పావులు కదపడం మంచిది! మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉంటే...
ఆరు నెలల ముందుగానే సెటిల్ చేసుకోవడం ఉత్తమం.